Bangladesh premier league
-
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 విజేత ఫార్చూన్ బారిషల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్.. చిట్టగాంగ్ కింగ్స్పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చిట్టగాంగ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (78 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్ (44) కూడా రాణించడంతో కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బారిషల్ బౌలర్లలో మొహమ్మద్ అలీ, ఎబాదత్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (54), తౌహిద్ హృదోయ్ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్ మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బారిషల్ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (18 నాటౌట్) రెండు సిక్సర్లు బాది బారిషల్కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్ విజయతీరాలకు చేరింది. కింగ్స్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్ను భయపెట్టాడు. నయీమ్ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఫార్చూన్ బారిషల్ టైటిల్ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం. -
'ఐరెన్ లెగ్' ఆండ్రీ రసెల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..!
విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) ఫ్రాంచైజీ క్రికెట్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాత్రి ఓ లీగ్ ఆడితే, ఉదయం మరో లీగ్లో పాల్గొంటున్నాడు. మొన్న రసెల్ గంటల వ్యవధిలో (15 గంటలు) దేశాలు దాటి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొన్న వైనం సోషల్మీడియాలో వైరలయ్యింది. ఇదే సమయంలో రసెల్ ఓ అపవాదును కూడా మూటగట్టుకున్నాడు. నిద్ర లేకుండా జర్నీ చేసి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొంటే రెండు చోట్ల రసెల్ జట్లు లీగ్ల నుంచి నిష్క్రమించాయి. దీంతో నెటిజన్లు రసెల్ను ఐరెన్ లెగ్ అని అంటున్నారు. రసెల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ జట్టు భస్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు రసెల్పై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి అతని పేలవ ఫామ్ కూడా ఓ కారణం. రసెల్ ఇటీవలికాలంలో ఏ లీగ్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్లా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో మెరుపులు లేవు, బౌలింగ్లో వికెట్లు లేవు. దీంతో అభిమానులు చిరెత్తిపోయి రసెల్పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. వయసు మీద పడింది, ఇక తప్పుకో అని కొందరంటుంటే.. మరికొందరేమో, పోయి జాతీయ జట్టుకు ఆడుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరేమో డబ్బు కోసం రెస్ట్ లేకుండా ఇన్ని ఊర్లు తిరగాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించకుండా ప్రైవేట్ లీగ్ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.రసెల్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20) అబుదాబీ నైట్రైడర్స్ తరఫున ఆడి తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ మ్యాచ్లో ఓటమితో ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబీ నైట్రైడర్స్ కథ ముగిసింది (నిష్క్రమించింది). ILT20లో తన జట్టు ఓడిన వెంటనే రసెల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగ్లాదేశ్కు పయనమయ్యాడు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నాడు. ఈ లీగ్లో ఖుల్నా టైగర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన రసెల్ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ ఓవర్ బౌలింగ్ కూడా చేసిన రసెల్ వికెట్ లేకుండా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ ఓటమికి రసెల్ ప్రధాన కారణం కానప్పటికీ.. అతని జట్టు మాత్రం లీగ్ నుంచి నిష్క్రమించింది.ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లు చివరి దశకు చేరాయి. బీపీఎల్లో ఫార్చూన్ బారిషల్ ఫైనల్కు చేరగా.. రేపు రెండో క్వాలిఫయర్ జరుగనుంది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ తదుపరి దశకు క్వాలిఫై అయ్యాయి. -
డేవిడ్ మలాన్ ఊచకోత.. 39 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో ఇవాళ (జనవరి 29) ఓ వన్ సైడెడ్ మ్యాచ్ జరిగింది. ఢాకా క్యాపిటల్స్పై ఫార్చూన్ బారిషల్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 22 ఓవర్లలో ముగిసిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. బారిషల్ బౌలర్లు మొహమ్మద్ నబీ (4-0-9-3), తన్వీర్ ఇస్లామ్ (2-1-2-3), ఫహీమ్ అష్రాఫ్ (2.3-0-15-3) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీపడి వికెట్లు తీశారు. ముగ్గురూ తలో మూడు వికెట్లు తీశారు. జేమ్స్ ఫుల్లర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. లిటన్ దాస్, రోన్స్ఫర్డ్ బీటన్ తలో 10 పరుగులు చేయగా.. కెప్టెన్ తిసార పెరీరా అత్యధికంగా 15 పరుగులు సాధించాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో రెండో అత్యధిక పరుగులు ఎక్స్ట్రాల రూపంలో (11) వచ్చాయి. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో 7 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి.మలాన్ ఊచకోత74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. డేవిడ్ మలాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడటంతో 6.3 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది (వికెట్ కోల్పోయి). మలాన్కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా తోడవ్వడంతో మ్యాచ్ తొందరగా ముగిసింది. తమీమ్ 14 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బారిషల్ ఇన్నింగ్స్లో తౌహిద్ హృదోయ్ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. తౌహిద్ వికెట్ ముస్తాఫిజుర్ రెహ్మాన్కు దక్కింది. ఈ గెలుపుతో బారిషల్ రంగ్పైర్ రైడర్స్ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. క్యాపిటల్స్ 11 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.కాగా, ఈ మ్యాచ్కు ముందు డేవిడ్ మలాన్ బీపీఎల్ ఫ్రాంచైజీలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. మీ దగ్గర డబ్బుంటేనే ఫ్రాంచైజీలను తీసుకోండి. లేదంటే ఊరకనే ఉండండంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లకు రెమ్యూనరేషన్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలాన్ ఈ కామెంట్స్ చేశాడు. కొద్ది రోజుల కిందట దర్బార్ రాజ్షాహీ ఫ్రాంచైజీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు చెల్లించని కారణంగా ఓ మ్యాచ్ను బాయ్కాట్ చేశాయి. ఆ మ్యాచ్లో రాజ్షాహీ ఫ్రాంచైజీ స్వదేశీ ఆటగాళ్లను మాత్రమే బరిలోకి దించింది. -
పాక్ బ్యాటర్ మహోగ్రరూపం.. వరుసగా 4 సిక్సర్లు బాది మ్యాచ్ను గెలిపించిన వైనం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో (Bangladesh Premier League) పాకిస్తాన్ బ్యాటర్ హైదర్ అలీ (Haider Ali) మహోగ్రరూపం దాల్చాడు. ఈ లీగ్లో చట్టోగ్రామ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదర్.. రంగ్పూర్ రైడర్స్తో ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన జట్టును గెలిపించాడు. గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్లో హైదర్ నమ్మశక్యంకాని రీతిలో విరుచుకుపడ్డాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్పూర్ రైడర్స్.. ఇఫ్తికార్ అహ్మద్ (47 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. రైడర్స్ ఇన్నింగ్స్లో ఇఫ్తికార్ మినహా ఎవరూ రాణించలేదు. తొలుత సౌమ్య సర్కార్ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో మెహిది హసన్ (20 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టీవెన్ టేలర్ డకౌట్ కాగా.. సైఫ్ హసన్ 8, కెప్టెన్ నురుల్ హసన్ 9, ఇర్ఫాన్ సుకూర్ ఒక్క పరుగు చేశారు. చట్టోగ్రామ్ కింగ్స్ బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. షొరిఫుల్ అస్లాం, షమీమ్ హొసేన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్టసాధ్యమైన పిచ్పై 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చట్టోగ్రామ్ కింగ్స్ తొలి 10 ఓవర్లలోనే 3 కీలక వికెట్లు (63 పరుగులకే) కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. లహీరు మిలంత 6, గ్రహం క్లార్క్ 15, కెప్టెన్ మొహమ్మద్ మిథున్ 20 పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో పర్వేజ్ హొసేన్ ఎమోన్తో జతకట్టిన హైదర్ అలీ తొలుత నిదానంగా ఆడాడు. 106 పరుగుల వద్ద ఎమోన్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాక హైదర్ గేర్ మార్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కింగ్స్ గెలుపుకు 18 బంతుల్లో 20 పరుగులు అవసరం కాగా.. హైదర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అకీఫ్ జావిద్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన హైదర్.. ఆతర్వాతి మూడు బంతులను కూడా భారీ సిక్సర్లుగా మలిచాడు. హైదర్ అకీఫ్పై ఒక్కసారిగా రెచ్చిపోవడంతో కళ్లు మూసుకుని తెరిచే లోగా మ్యాచ్ అయిపోయింది. కింగ్స్ మరో 14 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. హైదర్ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో 18 బంతులు ఎదుర్కొన్న హైదర్.. 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హైదర్కు రహాతుల్ ఫిర్దౌస్ (6 నాటౌట్) సహకరించాడు. ఈ గెలుపుతో చట్టోగ్రామ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. కింగ్స్ చేతిలో ఓడినా రంగ్పూర్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. -
పాకిస్తాన్ ప్లేయర్ల సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొంటున్న పాకిస్తాన్ ప్లేయర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్బార్ రాజ్షాహీ అనే ఫ్రాంచైజీ మ్యాచ్ ఫీజ్ బకాయిలు చెల్లించని కారణంగా బీపీఎల్లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే కారణంగా పలువురు విదేశీ ప్లేయర్లు కూడా బీపీఎల్కు దూరంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు ర్యాన్ బర్ల్, మెక్కాలీ కమిన్స్, లహీరు కుమార, మార్క్ డోయల్తో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు మొహమ్మద్ హరీస్, అఫ్తాబ్ ఆలమ్ దర్బార్ రాజ్షాహీ ఆడిన గత మ్యాచ్ను బాయ్కాట్ చేశారు. విదేశీ ఆటగాళ్లు హ్యాండ్ ఇవ్వడంతో రాజ్షాహీ గత మ్యాచ్లో లోకల్ ప్లేయర్లను బరిలోకి దించింది. రాజ్షాహీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజ్ బకాయిలను డిమాండ్ చేస్తూ తమ ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇది తొలిసారి కాదు. ఈ సీజన్ ఆరంభంలో రాజ్షాహీ విదేశీ ఆటగాళ్లు ట్రయినింగ్ సెషన్స్ను బాయ్కాట్ చేశారు. తమ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని బీపీఎల్ గవర్నింగ్ బాడీని డిమాండ్ చేశారు. రాజ్షాహీ దర్బార్ ఫ్రాంచైజీ అవళంభిస్తున్న విధానాలు అంతర్జాతీయ క్రికెట్ వేదికపై బంగ్లాదేశ్ పరువును మసకబారేలా చేస్తున్నాయి.ఇదిలా ఉంటే, విదేశీ స్టార్లు లేనప్పటికీ గత మ్యాచ్లో రాజ్షాహీ రంగ్పూర్ రైడర్స్పై విజయం సాధించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్గా నడిచిన ఈ మ్యాచ్లో రాజ్షాహీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ్షాహీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రాజ్షాహీ ఇన్నింగ్స్లో సంజముల్ ఇస్లాం (28 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. రంగ్పూర్ రైడర్స్ బౌలర్లలో ఖుష్దిల్ 3 వికెట్లు పడగొట్టగా.. రకీబుల్ హసన్, సైఫుద్దీన్ తలో రెండు, అకీఫ్ జావెద్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్పూర్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొహమ్మద్ సైఫుద్దీన్ (52 నాటౌట్), రకీబుల్ హసన్ (20) రైడర్స్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించారు. రాజ్షాహీ బౌలర్లు మృత్యుంజయ్ చౌధురీ (4-1-18-4), మొహర్ షేక్ (4-1-15-2), కెప్టెన్ తస్కిన్ అహ్మద్ (4-0-2-25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి రైడర్స్ను దెబ్బకొట్టారు. ఈ గెలుపు అనంతరం రాజ్షాహీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో రాజ్షాహీ 11 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్పై కన్నేసింది. -
టీ20ల్లో అరుదైన ప్రదర్శన.. రికార్డుల వెల్లువ
టీ20ల్లో అరుదైన ప్రదర్శన నమోదైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్లో ఇద్దరు ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు (తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్) సెంచరీలు చేశారు. టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది తొమ్మిదో సారి.టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు సెంచరీలు చేసిన సందర్భాలు..కెవిన్ ఓ'బ్రియన్ & హమీష్ మార్షల్ vs మిడిల్సెక్స్, ఉక్స్బ్రిడ్జ్, 2011విరాట్ కోహ్లీ & ఎబి డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016అలెక్స్ హేల్స్ & రిలీ రోసౌ vs చిట్టగాంగ్ వైకింగ్స్, చట్టోగ్రామ్, 2019డేవిడ్ వార్నర్ & జానీ బెయిర్స్టో vs ఆర్సిబి, హైదరాబాద్, 2019సబావూన్ డేవిజి & డిలాన్ స్టెయిన్ vs బల్గేరియా, మార్సా, 2022లాచ్లాన్ యమమోటో-లేక్ & కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ vs చైనా, మోంగ్ కోక్, 2024శుభ్మన్ గిల్ & బి సాయి సుదర్శన్ vs CSK, అహ్మదాబాద్, 2024సంజు సామ్సన్ & తిలక్ వర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్బర్గ్, 2024తాంజిద్ హసన్ తమీమ్ & లిట్టన్ దాస్ vs దర్బార్ రాజ్షాహి, సిల్హెట్, 2025మ్యాచ్ విషయానికొస్తే.. దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్లో ఢాకా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ చేసింది. తంజిద్ హసన్ (64 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), లిటన్ దాస్ (55 బంతుల్లో 125 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఢాకా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 254 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.ఈ మ్యాచ్లో లిటన్ దాస్ 44 బంతుల్లో శతక్కొట్టాడు. బీపీఎల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టులో లిటన్ దాస్కు చోటు దక్కలేదు. తనను జట్టు నుంచి తప్పించిన రోజే దాస్ సెంచరీతో కదంతొక్కడం విశేషం.ఈ మ్యాచ్లో లిటన్ దాస్, తంజిద్ హసన్ తొలి వికెట్కు 241 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్కు అయినా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు జపాన్ ఆటగాళ్లు యమమోటో, కడోవాకీ పేరిట ఉంది. ఈ జోడీ 2024లో చైనాతో జరిగిన మ్యాచ్లో అజేయమైన 258 పరుగులు జోడించింది. ఢాకా క్యాపిటల్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దర్బార్ రాజ్షాహీ చేతులెత్తేసింది. ఆ జట్టు 15.2 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఢాకా క్యాపిటల్స్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఇదే భారీ విజయం. ఈ సీజన్లో ఢాకా క్యాపిటల్స్కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్కు ముందు ఢాకా క్యాపిటల్స్ ఆరు మ్యాచ్లు ఆడగా.. ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. -
తమీమ్ ఇక్బాల్, అలెక్స్ హేల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం.. కొట్టుకున్నంత పని చేశారు..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో హైడ్రామా చోటు చేసుకుంది. రంగ్పూర్ రైడర్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య నిన్నటి రసవత్తర మ్యాచ్ అనంతరం తమీమ్ ఇక్బాల్ (ఫార్చూన్ బారిషల్ కెప్టెన్), అలెక్స్ హేల్స్ (రంగ్పూర్ రైడర్స్) కొట్టుకున్నంత పని చేశారు. మ్యాచ్ అనంతరం జరిగే హ్యాండ్ షేక్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా మీడియా కథనాల మేరకు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు ఎదురెదురుపడ్డాడు.ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్, హేల్స్ మధ్య మాటామాటా పెరిగింది. తొలుత హేల్స్ తమీమ్ను రెచ్చగొట్టాడు. తమీమ్కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హేల్స్ అగౌరవంగా ప్రవర్తించాడు. హేల్స్ ప్రవర్తనను అవమానంగా భావించిన తమీమ్ తొలుత నిదానంగా సమాధానం చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని తమీమ్ హేల్స్ను అడిగాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పు. ఇలా ప్రవర్తించడం సరికాదు. మగాడిలా ప్రవర్తించు అని తమీమ్ హేల్స్తో అన్నాడు.తమీమ్ తన అసంతృప్తిని వెలిబుచ్చుతుండగానే హేల్స్ ఏదో అన్నాడు. ఇందుకు చిర్రెతిపోయిన తమీమ్ సహనాన్ని కోల్పోయి హేల్స్ మీదకు వచ్చాడు. హేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరికి సర్ది చెప్పేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నించారు. గొడవ వద్దని వారు ఎంత వారిస్తున్నా తమీమ్, హేల్స్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.అయితే ఈ గొడవపై హేల్స్ మరోలా స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని అన్నాడు. గొడవను తొలుత తమీమే స్టార్ట్ చేశాడని చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంగా తమీమ్ తనను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. డ్రగ్స్ కారణంగా నిషేధించబడినందుకు (ఇంగ్లండ్) సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఇలా మాట్లాడుతూనే చాలా దరుసుగా ప్రవర్తించాడని హేల్స్ చెప్పుకొచ్చాడు.కాగా, ఫార్చూన్ బారిషల్తో నిన్న జరిగిన రసవత్తర సమరంలో రంగ్పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్పూర్ రైడర్స్కు సంచలన విజయాన్నందించాడు. మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు. -
నరాలు తెగే ఉత్కంఠ.. బంగ్లా ప్లేయర్ ఊచకోత.. చివరి ఓవర్లో 30 పరుగులు
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఇవాళ (జనవరి 9) అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఫార్చూన్ బారిషల్తో జరిగిన సమరంలో రంగ్పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్పూర్ రైడర్స్కు సంచలన విజయాన్నందించాడు. 𝘼𝙗𝙨𝙤𝙡𝙪𝙩𝙚 𝙘𝙞𝙣𝙚𝙢𝙖! 🍿Rangpur Riders were all but out of the contest until Skipper Nurul Hasan smashed 30 off the final over to pull off an incredible heist! 😵💫#BPLonFanCode pic.twitter.com/9A7R96fmhU— FanCode (@FanCode) January 9, 2025మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బారిషల్.. కైల్ మేయర్స్ (29 బంతుల్లో 61 నాటౌట్; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ (40), షాంటో (41) రాణించారు. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బారిషల్ ఇన్నింగ్స్లో తౌహిద్ హృదోయ్ (23) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మహ్మదుల్లా (2) విఫలమయ్యాడు. రంగ్పూర్ బౌలర్లలో కమ్రుల్ ఇస్లాం 2, సైఫుద్దీన్, అకిఫ్ జావెద్ తలో వికెట్ పడగొట్టారు.198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్పూర్ రైడర్స్ చివరి బంతికి విజయం సాధించింది. కెప్టెన్ నురుల్ హసన్ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో రంగ్పూర్ గెలుపుకు 26 పరుగులు అవసరం కాగా.. నురుల్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 30 పరుగులు పిండుకున్నాడు. నురుల్ ఊచకోత ధాటికి బౌలర్ కైల్ మేయర్స్కు ఫ్యూజులు ఔటయ్యాయి. గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్లో నురుల్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. రంగ్పూర్ గెలుపుకు తౌఫిక్ ఖాన్ (38), సైఫ్ హస్సన్ (22), ఇఫ్తికార్ అహ్మద్ (48), ఖుష్దిల్ షా (48) పునాది వేశారు. ప్రస్తుత బీపీఎల్ ఎడిషన్లో రంగ్పూర్ రైడర్స్కు ఇది వరుసగా ఆరో విజయం. ఈ ఎడిషన్లో ఆ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. -
అలెక్స్ హేల్స్ ఊచకోత
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఇంగ్లండ్ ఆటగాడు, రంగ్పూర్ రైడర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిల్హెట్ స్ట్రయికర్స్తో ఇవాళ (జనవరి 6) జరిగిన మ్యాచ్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హేల్స్ శతక్కొట్టడంతో సిల్హెట్ స్ట్రయికర్స్పై రంగ్పూర్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోనీ తాలుక్దార్ (32 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జకీర్ హసన్ (38 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. జార్జ్ మున్సే 18, పాల్ స్టిర్లింగ్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో ఆరోన్ జోన్స్ (19 బంతుల్లో 38 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), జాకెర్ అలీ (5 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రంగ్పూర్ రైడర్స్ బౌలర్లలో సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్, ఆకిఫ్ జావెద్ తలో వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్య ఛేదనకు దిగిన రంగ్పూర్ రైడర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలెక్స్ హేల్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. సైఫ్ హసన్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. రంగ్పూర్ రైడర్స్ బ్యాటర్లలో హకీమ్ తమీమ్ డకౌట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ 8 పరుగులు (నాటౌట్) చేశాడు. సిల్హెట్ స్ట్రయికర్స్ పేసర్ తంజిమ్ హసన్ సకీబ్కు రెండు వికెట్లు దక్కాయి.ఈ గెలుపుతో రంగ్పూర్ రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచినట్లైంది. పాయింట్ల పట్టికలో రంగ్పూర్ రైడర్స్ అగ్రస్థానంలో నిలిచింది. రెండింట రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఖుల్నా టైగర్స్ రెండో స్థానంలో ఉంది. చిట్టగాంగ్ కింగ్స్ (2 మ్యాచ్ల్లో ఓ విజయం), ఫార్చూన్ బారిషల్ (2 మ్యాచ్ల్లో ఓ విజయం), దర్బార్ రాజ్షాహి (3 మ్యాచ్ల్లో ఓ విజయం), సిల్హెట్ స్ట్రయికర్స్ (2 మ్యాచ్ల్లో 2 పరాజయాలు), ఢాకా క్యాపిటల్స్ (3 మ్యాచ్ల్లో 3 పరాజయాలు) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. -
విండీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఒక్క బంతికి ఇన్ని పరుగులా..?
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024-25లో వెస్టిండీస్ బౌలర్ ఒషేన్ థామస్ చెత్త ప్రదర్శన చేశాడు. ఈ లీగ్లో ఖుల్నా టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న థామస్.. చిట్టగాంగ్ కింగ్స్తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో ఒక్క బంతికి ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. 15 runs off 1 ball! 😵💫Talk about an eventful way to start the innings! #BPLonFanCode pic.twitter.com/lTZcyVEBpd— FanCode (@FanCode) December 31, 2024ఛేదనలో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన థామస్ వరుసగా N 0 N6 Wd Wd N4 0 0 N 2 W 0 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇదో చెత్త ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్లో ఒకే ఓవర్ వేసిన థామస్ 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. థామస్ ఓవర్లో 4 నో బాల్స్, 2 వైడ్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరగుల భారీ స్కోర్ చేసింది. బొసిస్టో (50 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), మహిదుల్ ఇస్లాం అంకోన్ (22 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఖుల్నా టైగర్స్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నయీమ్ 26, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ 18, ఇబ్రహీం జద్రాన్ 6, అఫీఫ్ హొసేన్ 8 పరుగులు చేశారు. చిట్టగాంగ్ బౌలర్లలో అలిస్ అల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చిట్టగాంగ్ 18.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అబూ హైదర్ (3.5-0-44-4), మొహమ్మద్ నవాజ్ (3-0-13-2) చిట్టగాంగ్ టైగర్స్ను దెబ్బకొట్టారు. ఒషేన్ థామస్, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. చిట్టగాంగ్ ఇన్నింగ్స్లో షమీమ్ హొసేన్ (38 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. షమీమ్ ఒంటరిగా పోరాడి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. షమీమ్ మినహా చిట్టగాంగ్ ఇన్నింగ్స్లో నయీమ్ ఇస్లాం (12), పర్వేజ్ హొసేన్ ఎమోన్ (13), ఉస్మాన్ ఖాన్ (18), ఖలీద్ అహ్మద్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
మూడు మ్యాచ్లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్లో బీజీగా ఉండటంతో బీపీఎల్ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్లు ఆడితే డేవిడ్ మిల్లర్కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ విజేతగా తమీమ్ జట్టు..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)– 2024 సీజన్ ఛాంపియన్గా ఫార్ట్యూన్ బరిషల్ నిలిచింది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో కొమిలియా విక్టోరియన్స్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బరిషల్ జట్టు.. తొలిసారి బీపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బరిషల్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (30 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ (26 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మెహిది హసన్ మిరాజ్ (26 బంతుల్లో 29, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కొమిలియా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొమిలియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ బ్యాటర్ మహిదుల్ ఇస్లామ్ (38) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆండ్రూ రసెల్ (14 బంతుల్లో 27, 4 సిక్సర్లు) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరిషల్ బౌలర్లలో జేమ్స్ ఫుల్లర్ 2 వికెట్లు పడగొట్టగా.. మైర్స్,సైఫుద్దీన్, మెకాయ్ తలా వికెట్ సాధించారు. 2012 నుంచి జరుగుతున్న బీపీఎల్లో కొమిలియా విక్టోరియన్స్ నాలుగు సార్లు (2015, 2019, 2022, 2023)టైటిల్ విజేతగా నిలవగా.. ఢాకా గ్లాడియేటర్స్ మూడు సార్లు( 2012, 2013, 2016) ఛాంపియన్స్గా నిలిచింది. అదే విధంగా రంగాపూర్ రైడర్స్ (2017), రాజ్షాహి రాయల్స్ (2020)లు తలా ఒకసారి టైటిల్ను ముద్దాడాయి. ఇప్పుడు పదో సీజన్లో తమీమ్ ఇక్భాల్ సారథ్యంలోని ఫార్ట్యున్ బరిషల్ సరి కొత్త ఛాంపియన్స్గా అవతరిచింది. -
కైల్ మేయర్స్ ఆల్రౌండ్ షో.. మెరుపు అర్దశతకం సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఫార్చూన్ బారిషల్ ఆటగాడు కైల్ మేయర్స్ (వెస్టిండీస్) ఆల్రౌండ్ షోతో ఇరగదీశాడు. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో మెరుపు అర్దశతకం (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సహా రెండు వికెట్లు (4-0-28-2) తీసి తన జట్టును గెలిపించాడు. తొలుత బౌలింగ్లో రాణించిన మేయర్స్ ఆతర్వాత బ్యాటింగ్లో మెరిశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కైల్ మేయర్స్, సైఫుద్దీన్, మెక్కాయ్ తలో 2 వికెట్లు తీసి ఛాలెంజర్స్ పతనాన్ని శాశించారు. తైజుల్ ఇస్లాం, జేమ్స్ ఫుల్లర్ చెరో వికెట్ పడగొట్టారు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో జోష్ బ్రౌన్ చేసిన 34 పరుగులే అత్యధికం. కెప్టెన్ షువగట (24), ట్రామ్ బ్రూస్ (17), సైకత్ అలీ (11), రొమారియో షెపర్డ్ (11), నిహాదుజ్జమాన్ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లు కనీసం ఈపాటి పరుగులు కూడా సాధించలేకపోయారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. కైల్ మేయర్స్, తమీమ్ ఇక్బాల్ (52 నాటౌట్) చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఫలితంగా బారిషల్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. బారిషల్ ఇన్నింగ్స్లో సౌమ్య సర్కార్ (0) విఫలం కాగా.. డేవిడ్ మిల్లర్ (17) వేగంగా పరుగులు సాధించాడు. ముష్ఫికర్ రహాం (6 నాటౌట్) విన్నింగ్ రన్స్ కొట్టాడు. ఛాలెంజర్స్ బౌలర్లలో షువగట, బిలాల్ ఖాన్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. రంగ్పూర్ రైడర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య ఇవాళ రాత్రి క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు.. ఫిబ్రవరి 28న జరిగే క్వాలిఫయర్-2లో ఫార్చూన్ బారిషల్తో తలపడుతుంది. -
ఆండ్రీ రసెల్ ఊచకోత.. 12 బంతుల్లోనే.. 358.33 స్ట్రయిక్రేట్తో..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. రంగ్పూర్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రసెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 358.33 స్ట్రయిక్రేట్తో అజేయమైన 43 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకుముందు రసెల్ బౌలింగ్లో చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రైడర్స్.. రసెల్, ముస్ఫిక్ హసన్ (3/18), మథ్యూ ఫోర్డ్ (2/32), తన్వీర్ ఇస్లాం (1/12) ధాటికి 19.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రైడర్స్ ఇన్నింగ్స్లో నీషమ్ ఒక్కడే అజేయమైన అర్దసెంచరీతో (69 నాటౌట్) రాణించాడు. నీషమ్తో పాటు రోనీ తాలుక్దార్ (14), షకీబ్ అల్ హసన్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన విక్టోరియన్స్.. రసెల్ శివాలెత్తడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (4 వికెట్లు కోల్పోయి). విక్టోరియన్స్ ఇన్నింగ్స్లో రసెల్తో పాటు లిటన్ దాస్ (43), మహిదుల్ ఇస్లాం (39) కూడా రాణించారు. ఓపెనర్గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. మొయిన్ అలీ (6 నాటౌట్) రసెల్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైడర్స్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హైదర్ రోని ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
కళ్లు చెదిరే క్యాచ్.. రొమారియో షెపర్డ్ అద్భుత విన్యాసం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ ఆటగాడు, విండీస్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఖుల్నా టైగర్స్తో జరిగిన మ్యాచ్లో అనాముల్ హక్ కొట్టిన షాట్ను షెపర్డ్ అద్భుత క్యాచ్గా మలిచాడు. షొహిదుల్ ఇస్లాం బౌలింగ్లో షెపర్డ్ రివర్స్లో పరిగెడుతూ బౌండరీ లైన్ సమీపంలో అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. What an unbelievable catch by Romario Shepherd. 🔥pic.twitter.com/YG8MtmP4Qy — Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (116) మెరుపు సెంచరీ చేసి ఛాలెంజర్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. 58 బంతుల్లో శతక్కొట్టిన తంజిద్.. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 65 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్...షువగటా హోమ్ (3/25), బిలాల్ ఖాన్ (2/13), సలావుద్దీన్ (1/15), షొహిదుల్ ఇస్లాం (1/18), రొమారియో షెపర్డ్ (1/25), నిహాదుజ్జమాన్ (1/29) ధాటికి 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టైగర్స్ ఇన్నింగ్స్లో అనాముల్ హక్ (35), షాయ్ హోప్ (31), జేసన్ హోల్డర్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
బంగ్లాదేశ్ ఓపెనర్ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ బ్యాటర్, బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ తంజిద్ హసన్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఖుల్నా టైగర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 20) జరుగుతున్న మ్యాచ్లో తంజిద్ 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న తంజిద్ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో తంజిద్ చేసిన సెంచరీ మూడవది. తంజిద్కు ముందు తౌహిద్ హ్రిదోయ్, విల్ జాక్స్ సెంచరీలు చేశారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు తొలి ఓవర్ ముగిసే సరికి కేవలం రెండు పరుగులు (వికెట్ నష్టపోకుండా) మాత్రమే చేయగలిగింది. -
బెన్నీ హోవెల్ వీర బాదుడు.. లిటన్ దాస్ పోరాటం వృధా
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో సిల్హెట్ స్ట్రయికర్స్ ఆటగాడు బెన్నీ హోవెల్ (ఇంగ్లండ్) వీర బాదడు బాదాడు. కొమిల్లా విక్టోరియన్స్తో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్లో 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. హోవెల్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్లో హోవెల్ మినహా మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. కెన్నార్ లెవిస్ 33, జాకిర్ హసన్ 18, షాంటో 12, యాసిర్ అలీ 2, కెప్టెన్ మిథున్ 28 పరుగులు చేశారు. విక్టోరియన్స్ బౌలర్లలో సునీల్ నరైన్ పొదుపుగా (4-1-16-2) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టగా.. రషీద్ హొసేన్ 2, ముస్ఫిక్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో విక్టోరియన్స్ చివరివరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లిటన్ దాస్ (85) విక్టోరియన్స్ను గెలిపించేందుకు సకల ప్రయత్నాలు చేశాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (23) కూడా తనవంతు ప్రయత్నించినప్పటికీ విక్టోరియన్స్ గెలవలేకపోయింది. లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (165/6) నిలిచిపోయి, ఓటమిపాలైంది. విక్టోరియన్స్ కీలక ఆటగాళ్లు జాన్సన్ చార్లెస్ (17), మొయిన్ అలీ (0) విఫలమయ్యారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3, సమిత్ పటేల్, షఫీకుల్ ఇస్లాం, బెన్నీ హోవెల్ తలో వికెట్ పడగొట్టారు. -
చెన్నై స్టార్ బౌలర్ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలకు గాయమైంది. ముస్తాఫిజుర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో కొమిల్లా విక్టోరియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్లో భాగంగా సోమవారం(ఫిబ్రవరి 19)న సిల్హెట్ స్ట్రైకర్స్తో కొమిల్లా తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం చటోగ్రామ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సెషన్లో కొమిల్లా జట్టు పాల్గోంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్లో కొమిల్లా కెప్టెన్ లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతి.. బౌలింగ్ ఎండ్వైపు వెళ్తున్న ముస్తాఫిజుర్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. వెంటనే నుంచి అతడి తల నుంచి రక్తం కారింది. అక్కడే ఉన్న ఫిజియోలు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ముస్తాఫిజుర్ను స్థానికంగా ఉన్న ఇంపీరియల్ హాస్పిటల్కి తరలించారు. అయితే ముస్తాఫిజుర్ గాయంపై కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఫిజియో జహిదుల్ ఇస్లాం అప్డేట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సమయంలో ఓ బంతి నేరుగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తల ఎడమ బాగంలో బలంగా తాకింది. మేము వెంటనే స్పందించి కంప్రెషన్ బ్యాండేజ్తో రక్తస్రావం కాకుండా చూశాము. ఆ తర్వాత ఇంపీరియల్ ఆసుపత్రికి తరిలించి ‘సిటీ స్కాన్ చేయంచాము. అయితే అదృష్టవశాత్తూ తల పై భాగంలో మాత్రమే గాయమైంది. ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ లేదు. అతడికి తలపై కొన్ని కుట్లు పడ్డాయి. ముస్తఫిజుర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు’ అని ప్రకటనలో జహిదుల్ ఇస్లాం పేర్కొన్నాడు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్ శ్రీలంక పర్యటనకు వెళ్ల నుంది. ఈ పర్యటనకు ముందే స్టార్ బౌలర్ గాయపడటం బంగ్లా జట్టును కలవరపెడుతోంది. అదే విధంగా ఐపీఎల్-2024 వేలంలో రూ. 2 కోట్లకు ముస్తాఫిజుర్ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ⚠️ MUSTAFIZUR RAHMAN GOT HIT BALL ON HIS HEAD During practice session of Comillael Victorians a shot from Matthew Ford, the ball hit on Mustafizur's head then start bleeding . Instantly he has taken into the hospital.#BPL2024 pic.twitter.com/sY3HaLtEc8 — bdcrictime.com (@BDCricTime) February 18, 2024 -
ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన కైల్ మేయర్స్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా సిల్హెట్ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో ఫార్చూన్ బారిషల్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బారిషల్.. కైల్ మేయర్స్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహాం (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బారిషల్ ఇన్నింగ్స్లో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 19, అహ్మద్ షెహజాద్ 17, సౌమ్య సర్కార్ 8, మహ్మదుల్లా 12 నాటౌట్, మెహిది హసన్ మీరజ్ 15 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. షఫీకుల్ ఇస్లాం, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. బెన్నీ హోవెల్ (53), ఆరీఫుల్ హక్ (57) అర్దసెంచరీలతో రాణించినప్పటికీ లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్లో హ్యారీ టెక్టార్ (0), జకీర్ హసన్ (5), నజ్ముల్ షాంటో (0), ర్యాన్ బర్ల్ (3) దారుణంగా విఫలం కాగా.. ఏంజెలో పెరీరా (17), మొహమ్మద్ మిథున్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బారిషల్ బౌలర్లలో కైల్ మేయర్స్ (4-1-12-3) అద్భుత గణాంకాలతో అదరగొట్టగా.. సైఫుద్దీన్, మెక్కాయ్, కేశవ్ మహారాజ్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్లో దురంతో ఢాకాపై చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఢాకా టీమ్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తంజిత్ హసన్ (70), షువగటా హోమ్ (3-0-12-2) ఛాలెంజర్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించారు. -
టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో తాహిర్కు ముందు డ్వేన్ బ్రావో (624 వికెట్లు), రషీద ఖాన్ (556), సునీల్ నరైన్ (532) 500 వికెట్ల మార్కును తాకారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రంగ్పూర్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. ఖుల్నా టైగర్స్తో నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తాహిర్ ఐదు వికెట్ల ఘనత సాధించి, తన జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్పూర్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (69), మెహిది హసన్ (60) అర్దసెంచరీలతో రాణించగా.. నురుల్ హసన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్నా టైగర్స్ బౌలర్లలో లూక్ వుడ్ 3, నహిద్ రాణా, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్.. ఇమ్రాన్ తాహిర్ (4-0-26-5), షకీబ్ అల్ హసన్ (3.2-0-30-2), మెహిది హసన్ (1/13), హసన్ మహమూద్ (1/29), జేమ్స్ నీషమ్ (1/5) ధాటికి 18.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. టైగర్స్ బౌలర్లలో అలెక్స్ హేల్స్ (60) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు కనీసం 20 పరుగులకు మించి చేయలేకపోయారు. -
ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన మొయిన్ అలీ.. హ్యాట్రిక్ సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో (బీపీఎల్) కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఆల్రౌండ్ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్తో పాటు సహచర ఆటగాడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్ లీగ్లో మొయిన్ సాధించిన హ్యాట్రిక్ ఎనిమిదవది. మొయిన్ హ్యాట్రిక్ వికెట్లతో మ్యాచ్కు ముగించాడు. Moeen Ali scored a fifty and took a hat-trick in the BPL match. 🤯pic.twitter.com/yIGVsgU9Lh — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024 శతక్కొట్టిన విల్ జాక్స్.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్ అలీ తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ జాక్స్, మొయిన్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. విక్టోరియన్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ లిటన్ దాస్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. తిప్పేసిన మొయిన్, రిషద్ హొసేన్. 240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్.. మొయిన్ అలీ, రిషద్ హొసేన్ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ (41), సైకత్ అలీ (36), జోష్ బ్రౌన్ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఓ పక్క రసెల్ ఊచకోత.. మరో పక్క విల్ జాక్స్ శతక్కొట్టుడు
పొట్టి ఫార్మాట్లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్లు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో కొమిల్లా విక్టోరియన్స్కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు. వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్ల్లో సెకెండ్ ఇన్నింగ్స్లె కొనసాగుతున్నాయి. -
సంచలన ఆరోపణలు: షోయబ్ స్పందన.. ముందుగా అనుకున్నట్లే చేశాం
తనపై వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పందించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఫార్చ్యూన్ బరిషల్తో తన బంధం ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే తాను బంగ్లాదేశ్ వీడి దుబాయ్కు వెళ్లినట్లు తెలిపాడు. ఏకంగా మూడు నోబాల్స్ కాగా బీపీఎల్-2024 సీజన్లో బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఖుల్నా టైగర్స్తో మ్యాచ్ సందర్భంగా ఒకే ఓవర్లో ఈ స్పిన్ ఆల్రౌండర్ ఏకంగా మూడు నోబాల్స్ వేయడం ఇందుకు కారణం. షోయబ్ మాలిక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బరిషల్ యాజమాన్యం షోయబ్ మాలిక్ కాంట్రాక్టును రద్దు చేసిందని వార్తలు వినిపించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన షోయబ్ మాలిక్.. ‘‘ఫార్చ్యూన్ బరిషల్తో నా బంధం గురించి ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నా. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేను దుబాయ్లో ఓ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్తో చర్చించిన తర్వాతే బంగ్లాదేశ్ను వీడాను. ఫార్చ్యూన్ బరిషల్ రానున్న మ్యాచ్లలో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా సేవలు అవసరమైతే తప్పకుండా మళ్లీ వాళ్లకు మద్దతుగా బరిలోకి దిగుతాను. క్రికెట్ ఆడటం అంటే నాకు ఇష్టం. ఆటను కొనసాగిస్తూనే ఉంటా’’ అని షోయబ్ మాలిక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. అతడు మాకోసం ఎంతో చేశాడు అదే విధంగా.. ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానుర్ రహ్మాన్ సైతం ఈ విషయంపై స్పందించాడు. షోయబ్ మాలిక్పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలను అతడు కొట్టిపడేశాడు. ‘‘షోయబ్ మాలిక్ గొప్ప క్రికెటర్. అతడి గురించి వస్తున్న వదంతుల పట్ల నేను చింతిస్తున్నాను. మాకోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అలాంటిది అతడి గురించి మేము ఇలాంటి చెత్త ప్రచారాలు ఎలా చేస్తామనుకున్నారు’’ అని మిజానుర్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. చదవండి: Shoaib Malik: ‘ఆమెతో మూడేళ్లుగా రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా..’ Official statement ; I would like to address and dismiss the recent rumors circulating about my playing position with Fortune Barishal. I had a thorough discussion with our captain, Tamim Iqbal, and we mutually planned the way forward. I had to leave Bangladesh for a… pic.twitter.com/kmPqPt1nxv — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 26, 2024 -
షోయబ్ మాలిక్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. జట్టు నుంచి ఔట్!?
పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమీయర్ లీగ్ ఫ్రాంచైజీ ఫార్చూన్ బరిషల్ "ఫిక్సింగ్" అనుమానంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. కాగా ఇప్పటికే మాలిక్ వ్యక్తిగత కారణాలతో బీపీఎల్-2024 నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అంతలోనే మాలిక్కు ఫార్చూన్ బరిషల్ ఈ షాకిచ్చింది. ఈ లీగ్లో కేవలం 3 మ్యాచ్ల మాత్రమే ఆడాడు. అసలేం జరిగిందంటే? జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్,ఖుల్నా రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసిన మాలిక్ ఓకే ఓవర్లో ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. సాధరణంగా స్నిన్నర్లు నో బాల్స్ చాలా అరుదుగా వేస్తుంటారు. అటువంటిది మాలిక్ ఏకంగా మూడు నో బాల్స్ వేయడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్పై వేటు వేసింది. కాగా ఇటీవలే మాలిక్ మూడో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చి పాక్ నటి సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు. చదవండి: IND vs ENG: ఆట మర్చిపోయావా గిల్.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి? -
39/6.. ఓటమి కొరల్లో చిక్కుకున్న జట్టును గెలిపించిన బాబర్ ఆజమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కొరల్లో చిక్కుకున్న తన జట్టును టెయిలెండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సాయంతో విజయతీరాలకు చేర్చాడు. 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న రంగ్పూర్ రైడర్స్ను బాబర్-ఒమర్జాయ్ జోడీ అజేయమైన 86 పరుగులు జోడించి 4 వికెట్ల తేడాతో గెలిపించింది. Flies into the BPL ✈️ Scores an unbeaten 50 🏏 Wins it for his team 💪 Boss it like Babar 👑 . .#BPL2024 #BPLonFanCode #BabarAzam pic.twitter.com/5kChUkZhHY — FanCode (@FanCode) January 23, 2024 బీపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్లో సిల్హెట్ స్ట్రయికర్స్, రంగ్పూర్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. రిపన్ మొండల్ (2/19), మెహిది హసన్ (2/18), మొహమ్మద్ నబీ (1/17), హసన్ మురద్ (1/29) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్లో హోవెల్ (43), కట్టింగ్ (31), షాంటో (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఛేదనలో బాబర్ ఆజమ్ జట్టు రంగ్పైర్ రైడర్స్ కూడా తడబడింది. దుషన్ హేమంత ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో (39/6) పడింది. అయితే బాబర్.. ఒమర్జాయ్ సహకారంతో రైడర్స్కు అపురూప విజయాన్ని అందించాడు. మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడి 18.2 ఓవర్లలో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. రైడర్స్ జట్టులో ముగ్గురు డకౌట్లు కాగా.. రోనీ తాలుక్దార్ 6, నురుల్ హసన్ 8, షమీమ్ హొసేన్ 2 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో హేమంత 3, నగరవ, తంజిమ్ సకీబ్, నజ్ముల్ ఇస్లాం తలో వికెట పడగొట్టారు. చదవండి: ఫలితాలు పట్టించుకోం.. బాబర్ గెలిపించలేకపోయాడు: షాహిన్ ఆఫ్రిది -
పాకిస్తాన్ బ్యాటర్కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!?
పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హరీస్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఊహించని షాకిచ్చింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గోనేందుకు ఢాకాకు వెళ్లిన హరీస్కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసి) ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో అతడు ఢాకా విమానాశ్రయం నుంచే స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. లగేజీ ఫోటోలను షేర్ చేస్తూ బ్యాక్ టూ హోమ్ అని రాసుకొచ్చాడు. అయితే పీసీబీ రూల్స్ ప్రకారం.. ఆ దేశ క్రికెటర్లు రెండు విదేశీ లీగ్లు ఆడేందుకు మాత్రమే అర్హులు. కానీ హ్యారీస్ ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ లీగ్లు ఆడాడు. ఈ క్రమంలోనే మూడో లీగ్లో ఆడేందుకు అతడికి పీసీబీ ఎన్ఓసి జారీ చేయలేదు. కాగా బీబీఎల్లో చట్టోగ్రమ్ ఛాలెంజర్స్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుబడుతున్నారు. ఎన్ఓసి విషయం అతడికి ముందే చెప్పి ఉంటే ఢాకా వరకు వెళ్లే వాడు కాదు కదా అంటూ మండిపడుతున్నారు. కాగా పాక్ తరపున ఇప్పటివరకు 9 టీ20లు ఆడిన మహ్మద్ హరీస్.. 126 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! Mohammad Haris had asked the Pakistan Cricket Board for a NOC and was told to go to Bangladesh for the BPL. He arranged for a flight on 17th January and was told by PCB that they will give him the NOC on 18th January. After arriving in Bangladesh, the PCB refused to give him a… pic.twitter.com/YuT70wZv7J — Saj Sadiq (@SajSadiqCricket) January 21, 2024 -
డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగిన కోచ్..ఇది నిజంగా సిగ్గు చేటు! వీడియో వైరల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 ఆది నుంచే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. అసలేం జరిగిందంటే? ఈ టోర్నీ లీగ్ మ్యాచ్లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి10) ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ ఢాకా వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ జరగుతుండగా ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇదింతా కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బాధ్యయుత కోచ్ స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించిన ఖలీద్పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "యూరప్లో ఆటగాళ్లు ఇలా చేసినందుకు ఆటగాళ్లను సస్పెండ్ చేసారు. అటువంటిది కోచ్ స్థానంలో ఉన్న ఖలీద్ మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ ఎలా తాగాడో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్ సీరియస్ @BCBtigers In Europe players are getting suspended for vaping. I don’t understand how Khaled Mahmud Sujon smoked in the dressing room. It was absolutely disgusting to watch. — Azharul (@Azharulislam07) February 11, 2023 -
పాక్ క్రికెటర్ ఓవరాక్షన్.. లావుగా ఉన్న సహచర సభ్యుడిని ఎగతాళి చేస్తూ..!
Naseem Shah-Azam Khan: పాకస్తాన్ క్రికెటర్, ఆ జట్టు యువ పేసర్ నసీం షా తమ దేశ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. నసీం.. లాపుగా ఉన్న సహచర సభ్యుడు, పాక్ దిగ్గజ వికెట్కీపర్ మొయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా, అతన్ని ఢీకొట్టాడు. తమ దేశ క్రికెటర్తో పరాయి గడ్డపై అభ్యంతరకరంగా ప్రవర్తించి, తనతో పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు. Naseem Shah teasing Azam Khan at the Bangladesh Premier League #BPL2023 #Cricket pic.twitter.com/IsJgBLcE0i — Saj Sadiq (@SajSadiqCricket) January 31, 2023 ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో చోటు చేసుకుంది. ఈ లీగ్లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలో ఎదురెదురు పడిన సందర్భంలో ఆజం శరీరాన్ని నసీం అవహేళన చేశాడు. ఆజం బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా నసీం ఎదురెళ్లి అతని శరీర తత్వాన్ని వెక్కిరిస్తూ, అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆజంను ఢీకొట్టి, అతని శరీరంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవేవి పట్టించుకోని ఆజం ఖాన్, నసీంను నెట్టేసి క్రీజ్వైపు వెళ్లాడు. వెళ్తున్నప్పుడు కూడా నసీం ఓవరాక్షన్ అలాగే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవగా, నెటిజన్లు ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా నసీం షాను వాయించేస్తున్నారు. తమ వాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది, పరాయి దేశస్తుడితో ఇలా ప్రవర్తించి ఉంటే నీకు కచ్చితంగా దేహశుద్ధి అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశస్తుడైనా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నసీంకు చురకలంటిస్తున్నారు. ఇంకొందరైతే.. షేమ్, షేమ్ నసీం షా.. షేమ్, షేమ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన మ్యాచ్లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆజం ఖాన్, కొమిల్లా విక్టోరియన్స్ తరఫున నసీం షా బరిలోకి దిగారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో కొమిల్లా విక్టోరియన్స్ ఘన విజయం సాధించింది. విండీస్ వీరుడు జాన్సన్ చార్లెస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి కొమిల్లా విక్టోరియన్స్ చారిత్రక విజయాన్ని అందించాడు. -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
బంగ్లా ప్రీమియర్ లీగ్లో మెరుపులు.. విధ్వంసం సృష్టించిన హోప్, తమీమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్లో భారత్ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్తో జరిగిన మ్యాచ్లో ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (29 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ స్కోర్ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
నోబాల్ విషయంలో పాక్ క్రికెటర్ నానా యాగీ
పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ నోబాల్ విషయమై అంపైర్తో నానా యాగీ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా ఇది చోటుచేసుకుంది. లీగ్లో భాగంగా రంగ్పూర్ రైడర్స్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ రోబుల్ హక్ వేశాడు. వరుసగా రెండు బంతులు బౌన్సర్లు వేయడంతో.. ఫీల్డ్ అంపైర్ రెండో బంతిని నోబాల్గా ప్రకటించాడు. అయితే అంపైర్ నో బాల్ ఇవ్వడంపై రంగ్పూర్ రైడర్స్ కెప్టెన్ నురుల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్తో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన హారిస్ రవూఫ్ జోక్యం చేసుకొని అసలెలా నోబాల్ ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బౌన్సర్లు వేస్తే వార్నింగ్తో సరిపెట్టాలని రూల్ ఉన్నా.. పట్టించుకోకుండా నోబాల్ ఇవ్వడమేంటన్నాడు. అయితే అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నురుల్ హసన్, హారిస్ రవూఫ్లు కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రంగ్పూర్ రైడర్స్ సిల్హెట్ స్ట్రైకర్స్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రైకర్స్.. రంగ్పూర్ రైడర్స్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తంజిమ్ హసన్ సకీబ్(41 పరుగులు), కెప్టెన్ మొర్తజా(21 పరుగులు).. ఎనిమిదో వికెట్కు 50 పరుగులు జోడించారు. రంగ్పూర్ రైడర్స్ బౌలర్లలో హసన్ మహ్మూద్, అజ్మతుల్లాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రంగ్పూర్ రైడర్స్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోనీ తాలుక్దార్ 41 పరుగులు నాటౌట్గా నిలిచాడు. Haris Rauf In fight With Umpire over a no Ball. #BPL #Bpl2023 pic.twitter.com/oLLme81d7f — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 27, 2023 చదవండి: 'స్లమ్డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్లో గోల్డ్ మెడల్ బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత
Bangladesh Premier League 2023: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. రంగ్పూర్ రైడర్స్తో ఇవాళ (జనవరి 19) జరుగుతున్న మ్యాచ్లో ఫార్చూన్ బారిషల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతని జతగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో ఫార్చూన్ బారిషల్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక టీమ్ టోటల్గా రికార్డుల్లోకెక్కింది. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జత కట్టిన ఇఫ్తికార్-షకీబ్ ఐదో వికెట్కు రికార్డు స్థాయిలో అజేయమైన 192 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇఫ్తికార్-షకీబ్ జోడీ ఇన్నింగ్స్ ఆఖరి 3 ఓవర్లలో (18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 24, 20వ ఓవర్లో 27) నమ్మశక్యం కాని రీతిలో 73 పరుగులు జోడించి బీపీఎల్లో చరిత్ర సృష్టించింది. ఇఫ్తికార్-షకీబ్ జోడీ.. ప్రత్యర్ధి స్పిన్నర్లను ఊచకోత కోసింది. కాగా, బీపీఎల్ ప్రస్తుత సీజన్లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారిషల్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. టాప్ ప్లేస్లో సిల్హెట్ స్ట్రయికర్స్ (6 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) టీమ్ ఉంది. కొమిల్లా విక్టోరియన్స్, రంగ్పూర్ రైడర్స్, చట్టోగ్రామ్ ఛాలెంజర్స్, ఖుల్నా టైగర్స్, ఢాకా డామినేటర్స్ వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఈ లీగ్లో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కొందరు భారత ఆటగాళ్లు (బీసీసీఐతో సంబంధం లేని వాళ్లు) కూడా పాల్గొంటున్నారు. -
వైడ్ ఇవ్వలేదని అంపైర్ మీదకు వెళ్లిన షకీబ్.. ఇదేమి బుద్దిరా బాబు!
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో షకీబ్ దురుసు ప్రవర్తను ప్రదర్శించాడు. వైడ్బాల్ విషయంలో అంపైర్తో వాగ్వాదానికి షకీబ్ దిగాడు. బీపీఎల్-2023లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? బీపీఎల్లో ఫార్చ్యూన్ బరిషల్కు షకీబ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఫార్చ్యూన్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో రెహమాన్ రాజా వేసిన ఒక షార్ట్ బాల్ షకీబ్ పై నుంచి వెళ్లింది. అయితే అంపైర్ దాన్ని తొలి బౌన్సర్గా సిగ్నిల్ ఇచ్చాడు. షకీబ్ మాత్రం అది ఎలా బౌన్సర్ అవుతుందని లెగ్ అంపైర్పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడు లెగ్ అంపైర్పై గట్టిగా అరుస్తూ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సరైన వివరణ ఇవ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇంతకు ముందు 2021లో ఢాకా ప్రీమియర్లో కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. అప్పటిల్లో అది తీవ్ర వివాదాస్పదకావడంతో షకీబ్ క్షమాపణలు కూడా తెలిపాడు. Shakib Al Hasan - the man the myth the umpire’s nightmare pic.twitter.com/wKQnb3wNUH — adi ✨🇧🇩 (@notanotheradi) January 7, 2023 చదవండి: Rishabh Pant: బీసీసీఐ మంచి మనసు.. పంత్ క్రికెట్ ఆడకపోయినా ఫుల్ సాలరీ! -
బంగ్లా ప్రీమియర్ లీగ్లో ఉన్ముక్త్ చంద్.. తొలి భారత క్రికెటర్గా!
2012 అండర్ 19 ప్రపంచకప్ను ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని యువ భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం ఉన్ముక్త్ చంద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత క్రికెట్లో మరో విరాట్ కోహ్లి అవుతాడని అంతా భావించారు. అయితే ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు రాకపోవడంతో 2021లో భారత్ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఇక భారత్ను వీడి వెళ్లిన చంద్ విదేశీ లీగ్ల్లో సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే బిగ్బాష్ లీగ్లో ఆడిన తొలి భారత పురుష క్రికెటర్గా రికార్డు సాధించిన చంద్.. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్లో చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఉన్ముక్త్ చంద్ ఆడనున్నాడు. తద్వారా బీపీఎల్లో డ్రాఫ్ట్ అయిన మొట్టమొదటి భారత ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో కూడా చంద్ తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఏ ప్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ -
IPL 2022: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్
Sunil Narine: వెస్టిండీస్ ఆటగాడు, కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో కొమిల్లా విక్టోరియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ ఆల్రౌండర్ ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. లీగ్లో భాగంగా బుధవారం చటోగ్రామ్ ఛాలెంజర్స్తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్లో కేవలం 16 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ (57 పరుగులు) ఆడిన నరైన్.. శుక్రవారం ఫార్చూన్ బారిషల్తో జరిగిన ఫైనల్లోనూ అదే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కొమిల్లా విక్టోరియన్స్ జట్టు బీపీఎల్ 2022 ఛాంపియన్గా అవతరించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన నరైన్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు స్కోర్ చేశాడు. దొరికిన బంతిని దొరికనట్లు బాధడమే పనిగా పెట్టుకున్న అతను.. లీగ్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ తక్కువ బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. చదవండి: 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్ మిస్! ఫలితంగా తొలుత బ్యాటింగ్కు దిగిన కొమిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఫార్చూన్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు నరైన్ భీకరమైన ఫామ్ ఉండటంతో కేకేఆర్ ఫ్రాంచైజీ సంబురాల్లో మునిగి తేలుతుంది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 5️⃣ 1️⃣ runs in just 2️⃣ 1️⃣ balls! We love to see it! 😍 The ball has been bouncing off #SunilNarine’s bat and landing in the stands. 📺 Watch the action LIVE from the final of #BBPL2022 on #Fancode 👉 https://t.co/kIiCjX0tXl#BPLonFanCode pic.twitter.com/oBCCUU4aWS — FanCode (@FanCode) February 18, 2022 చదవండి: IPL 2022: రూ.100 కోట్లతో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు -
13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్ మిస్!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో బుధవారం జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్లో చటోగ్రామ్ ఛాలెంజర్స్తో కొమిల్లా విక్టోరియన్స్ తలపడింది. ఈ మ్యాచ్లో కొమిల్లా బ్యాటర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లను నరైన్ ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. కాగా సునీల్ నరైన్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నరైన్ రికార్డుల కెక్కాడు. ఇక నరైన్ కన్నా ముందు ఇంగ్లండ్ బ్యాటర్ మార్కస్ ట్రెస్కోతిక్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే నరైన్.. యువరాజ్ సింగ్ రికార్డును తృటిలో కోల్పోయాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. యవీతో పాటు క్రిస్ గేల్, హజ్రతుల్లా జాజాయ్ 12 బంతుల్లోనే అర్ధ శతకాలు సాధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్ను ఛేదించింది. చదవండి: 13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు.. సీఎస్కే ఫ్యాన్స్కు ఇక..! OMGHBFUEBFIOEBV... Brb, collecting our jaws from the floor! 🤯 📺 WATCH THE FASTEST-EVER 50 IN THE HISTORY OF #BPL ON #FANCODE 👉 https://t.co/zQb7mURAnc#BPLonFanCode #BBPL2022 @SunilPNarine74 pic.twitter.com/SJcxCojRg1 — FanCode (@FanCode) February 16, 2022 -
13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చటోగ్రామ్ ఛాలెంజర్స్తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్లో కొమిల్లా విక్టోరియన్స్ బ్యాటర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో అలీ బ్యాట్తోను, బాల్తోను అద్భుతంగా రాణించాడు. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్లో 2 సిక్స్లు, 3ఫోర్లు ఉన్నాయి. అదే విధంగా బౌలింగ్లో కూడా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు అలీ చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వేసిన అలీ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 16 బంతుల్లోనే 57 పరుగులు చేసి కొమిల్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2022లో రూ. 8 కోట్లతో మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
రెచ్చిపోయిన మొయిన్ అలీ.. 8 సిక్సర్లతో అర్థ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో(బీపీఎల్ 2022) ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. కొమిల్లా విక్టోరియన్స్, కుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అయితే 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 35 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్న మొయిన్ అలీ.. 8 సిక్సర్లతో ఫిఫ్టీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత ఒక సిక్స్, ఒక ఫోర్ బాది మొత్తం 75 పరుగులు రాబట్టాడు. అతనికి జతగా డుప్లెసిస్ 38 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కుల్నా టైగర్స్ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. తిసార పెరీరా 26 పరుగులతో టాప స్కోరర్గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో గత సీజన్లో సీఎస్కే తరపున దుమ్మురేపిన మొయిన్ అలీని ఆ జట్టు రిటైన్ చేసుకుంది. Moeen Ali madness in BPL scored 50 from just 23 balls with 8 sixes 🔥🤯#BPL2022 #Cricketpic.twitter.com/LDyUrAPstd — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 11, 2022 -
గ్రౌండ్లోనే సిగరెట్ కాల్చిన అఫ్గన్ క్రికెటర్.. ఫ్యాన్స్ ఆగ్రహం
అఫ్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ గ్రౌండ్లో సిగరెట్ కాలుస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అతని ప్రవర్తనపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో భాగంగా ఫిబ్రవరి 4న మినిస్టర్ గ్రూఫ్ ఢాకా, కొమిల్లా విక్టోరియన్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇది చోటుచేసుకుంది. మ్యాచ్ కొద్దినిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా.. మైదానంలోకి వచ్చిన మహ్మద్ షెహజాద్ సిగరెట్ కాల్చాడు. అతని నోటి నుంచి సిగరెట్ పొగను వదలడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇది చూసిన షెహజాద్ జట్టు కోయ్ మిజానుర్ రెహ్మన్, తమీమ్ ఇక్బాల్లు వెంటనే గ్రౌండ్కు వచ్చి షెహజాద్ను డ్రెస్సింగ్రూమ్కు తరలించారు. చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం కాగా షెహజాద్ చర్యపై బీసీబీ చీఫ్ మ్యాచ్ రిఫరీ తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల ప్రకారం గ్రౌండ్లో స్మోక్ చేయడం నిషేధం. ఆ రూల్ మరిచి షెహజాద్ గ్రౌండ్లోనే సిగరెట్ కాల్చడం తప్పు. ఒకవేళ షెహజాద్కు ఈ విషయం తెలియకపోతే.. మ్యాచ్ అఫీషియల్స్ అతనికి సమాచారం అందించాల్సింది. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.20 కింద నిబంధనలు ఉల్లఘించిన కారణంగా షెహజాద్కు పెనాల్టీతో పాటు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారు. దీనిపై స్పందించిన మహ్మద్ షెహజాద్ తన ప్రవర్తనపై క్షమాపణ కోరాడు. తాను చేసింది తప్పేనని.. ఫైన్ కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఫ్యాన్స్ నాపై కోపం వ్యక్తం చేయడంలో అర్థం ఉందని పేర్కొన్నాడు. If Shah Rukh Khan could be banned for 5 years due to smoking in the gallery, Or Lankan players could be banned for smoking, not even in the stadium. Then surely this rubbish cricketer from Afghanistan (Mohammad Shahzad) should be banned for a lifetime in the BPL! @BCBtigers @ICC pic.twitter.com/R5jGtCutlY — Foysal Sawon (@foysal_sawon) February 4, 2022 -
ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022) ఏ ముహూర్తానా మొదలైందో కానీ.. చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం రసెల్ను విధి ఆడుకున్న తీరు అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయిన ఆండ్రీ రసెల్ మరోసారి బుక్కయ్యాడు. ఈసారి రనౌట్ మాత్రం కాదులెండి..హెలికాప్టర్ రూపంలో రసెల్ను భయపెట్టింది.బీపీఎల్లో భాగంగా చిట్టోగ్రామ్లోని ఎంఏ ఆజీజ్ స్టేడియంలో రసెల్ సహా తమీమ్ ఇక్బాల్, మోర్తజా, మహ్మద్ షెహజాద్లు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చదవండి: Andre Rusell: రసెల్తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం ఇదే సమయంలో స్డేడియంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో రసెల్ సహా మిగిలిన ఆటగాళ్లు ఏం జరిగిందోనని భయపడిపోయారు. విషయం ఏంటని ఆరా తీయగా.. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందు ఎయిర్వేస్ అధికారులు జిల్లా కమిషనర్తో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్తో మాట్లాడారు. వీరి చొరవతో..చట్టోగ్రామ్ స్టేడియం అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయం ఆటగాళ్లకు తెలియక కాస్త కంగారుపడ్డారు. అయితే ఈ విషయాన్ని బీపీఎల్ తన ట్విటర్లో షేర్ చేయగా..''పాపం రసెల్ను నిజంగా ఏదో వెంటాడుతుంది.. మళ్లీ బుక్కైన రసెల్.. బీపీఎల్లో ఈ ఏడాది ఏది కలిసిరావడం లేదు..'' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: BBL 2021-22: రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో ఊచకోత..! Helicopter lands suddenly in Chattogram when Andre Russell, Tamim Iqbal were practicing 😲#BPL2022 #AndreRussell #TamimIqbal #Cricket pic.twitter.com/9TpwavCTQ5 — SportsTiger (@sportstigerapp) February 1, 2022 -
జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2022 మధ్యలో ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ కెప్టెన్గా మెహిదీ హసన్ మిరాజ్ను తొలిగించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు పూర్తిగా ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ జట్టు నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ వివాదంపై మెహిదీ హసన్ స్పందించాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో కలిసి ఉండటానికి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు మెహిదీ హసన్ వెల్లడించాడు. తనను కెప్టెన్గా తొలిగించడానికి ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ సీఈవో యాసిర్ ఆలం కారణమని మెహిదీ హసన్ తెలిపాడు. కాగా ప్రధాన కోచ్ పాల్ నిక్సన్ సలహా మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యాసిర్ ఆలం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే యాసిర్ చేసిన ప్రకటను మెహిదీ వ్యతిరేకించాడు. "నేను ఇకపై జట్టుకు ఆడాలి అని అనుకోవడంలేదు. చివరి రోజు ఏమి జరిగిందో ఇప్పటికీ నాకు తెలియడం లేదు. మా మ్యాచ్కు మూడు గంటల ముందు, నేను ఇకపై కెప్టెన్ని కాదని వారు నాకు చెప్పారు. వారు నాకు ముందే ఆ విషయం చెప్పుంటే బాగుండేది. ఇది ఒక ఆటగాడికి చాలా అవమానకరం. నన్ను కెప్టెన్గా తొలగిస్తున్నట్లు కోచ్పై యాసిర్ చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధం. నేను కోచ్తో అరగంట మాట్లాడాను. యాసిర్ ప్రకటన పూర్తిగా అబద్ధం. యాసిర్ అతిపెద్ద అపరాధి. కాగా మా జట్టు ఓనర్ చాలా మంచివాడు. జట్టు విషయాల్లో అతడు జోక్యం చేసుకోడు.బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాలని అనుకోవడం వల్లే గొడవంతా మొదలైంది. అతడు జట్టులో ఉంటే నేను ఆడను. యాసిర్ భాయ్ ఫ్రాంచైజీలో లేకుంటే నేను ఆడతాను. లేకపోతే, నేను ఆడను" అని మెహిదీ హసన్ మిరాజ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ నిర్వహణ..! -
'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్.. డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రావో, సురేశ్ రైనాల సరసన చేరాడు. అయితే క్రికెట్ రికార్డులు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే షకీబ్ జాయిన్ అయింది.. పుష్ప సినిమా క్లబ్లో. ఏ ముహుర్తానా పుష్ప సినిమా మొదలైందో గాని..థియేటర్ల నుంచి సినిమా వెళ్లిపోయినప్పటికి.. దాని ప్రభావం మాత్రం జనాలను విడవడం లేదు. పాటలు, డైలాగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాలా విశేషాలున్నాయి. ఇప్పటికే డేవిడ్ వార్నర్ నుంచి డ్వేన్ బ్రావో దాకా.. రవీంద్ర జడేజా నుంచి సురేశ్ రైనా వరకు పుష్ప సినిమాలో నుంచి ఏదో ఒక దానిపై వీడియోలు చేసి జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో మరోసారి పుష్ప స్టెప్పులతో మెరిశాడు. అయితే చివర్లో షకీబ్ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరింది. చదవండి: Dwayne Bravo: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు లీగ్లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య మ్యాచ్ జరిగింది. కొమిల్లా విక్టోరియన్స్ ఇన్నింగ్స్ సమయంలో డుప్లెసిస్ను ఔట్ చేసిన తర్వాత.. షకీబ్ అల్లు అర్జున్ ''తగ్గేదే లే'' మేనరిజమ్కు శ్రీవల్లీ పాటను జత చేసి డ్యాన్స్ చేశాడు. శ్రీవల్లీ పాటలో లెగ్ మూమెంట్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే షకీబ్ మాత్రం లెగ్ మూమెంట్ కాకుండా.. తన చేతులతోనే.. ఒకవైపు తగ్గేదే లే అంటూనే.. మరోవైపు శ్రీవల్లీ పాట డ్యాన్స్ చూపించాడు. షకీబ్ చేసిన కొత్త స్టెప్ను ట్విటర్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. ఇక మ్యాచ్లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారీషల్ 63 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బారిషల్ 95 పరుగులకే కుప్పకూలింది. చదవండి: తలకు బలమైన గాయం.. అనుకున్నది సాధించాడు After Nazmul Islam, then @DJBravo47, and now the Bangladeshi 🐐 @Sah75official displaying the #Pushpa move! 🥳 The @alluarjun movie has really taken over the #BBPL2022. 🔥 📺 Catch these antics for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/lr5xUr0sLW#BPLonFanCode #alluarjun pic.twitter.com/9TAn8xqksr — FanCode (@FanCode) January 26, 2022 -
వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. పుష్ప.. సినీ ప్రపంచాన్నే కాకుండా క్రికెట్ ప్రపంచాన్ని కూడాఓ ఊపు ఊపేస్తోంది. సాధారణంగా బౌలర్ వికెట్ తీసినప్పుడు తనదైన శైలిలో సెలబ్రేషన్ జరపుకుంటారు. కానీ ప్రస్తుతం బౌలర్లు పుష్ప డైలాగ్లు, పాటలకు స్టెప్పలేసి సంబరాలు జరపుకుంటాన్నారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో కూడా శ్రీవల్లీ పాటకు స్టెప్పులేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ ,ఫార్చ్యూన్ బారిషల్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్లో మహిదుల్ ఇస్లాం అంకాన్ భారీ షాట్కు ప్రయత్నించగా.. అది మిస్టైమ్ అయ్యి ఫీల్డర్ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ తీసిన సంతోషంలో బ్రావో శ్రీవల్లి పాటకు స్టెప్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The Champion, @DJBravo47 channels his inner 𝑷𝒖𝒔𝒉𝒑𝒂 🕺🏼 after sending Mahidul Islam Ankon back to the pavilion! 😍 Catch the West Indian legend in relentless #BBPL2022 action for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/OLCsbLuBGA#BPLonFanCode @alluarjun pic.twitter.com/kVlAlvI2x3 — FanCode (@FanCode) January 25, 2022 -
Andre Fletcher: దూసుకొచ్చిన బంతి.. కుప్పకూలిన వెస్టిండీస్ బ్యాటర్.. అయితే..
BPL 2022: వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రీ ఫ్లెచర్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఖుల్నా టైగర్స్, చట్టోగ్రామ్ చాలెంజర్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఖుల్నాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్లెచర్కు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయమైంది. ప్రత్యర్థి జట్టు బౌలర్ రహమాన్ రజా సంధించిన బంతి మెడకు బలంగా తాకడంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఫ్లెచర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఖుల్నా టైగర్స్ మేనేజర్ తెలిపారు. ‘‘తనకు ఎటువంటి ప్రమాదం లేదు. ముందు జాగ్రత్త చర్యగానే ఆస్పత్రికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం బాగానే ఉన్నాడు’’ అని పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్లో టైగర్స్కు ఓటమే ఎదురైంది. 25 పరుగుల తేడాతో చిట్టోగ్రామ్ చాలెంజర్స్.. టైగర్స్పై విజయం సాధించింది. ఒక వికెట్ తీయడంతో పాటుగా.... 34 పరుగులతో అజేయంగా నిలిచిన బెన్నీ హావెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. స్కోర్లు: చిటోగ్రామ్- 190/7 (20) టైగర్స్- 165/9 (20) -
ఔట్ చేసిన ఆనందం 'నీ యవ్వ తగ్గేదే లే'
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ మాములుగా లేదు. దేశాలు దాటి విదేశాలను చుట్టేస్తున్న పుష్ప మేనియా ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)కు కూడా పాకింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన..'' యవ్వ తగ్గేదే లే..'' అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు సహా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమదైన శైలిలో పుష్ప సినిమా డైలాగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా బీబీఎల్ 2022 లీగ్ మ్యాచ్లో అమితే హసన్ అనే బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్మన్ను ఎల్బీగా వెనక్కి పంపాడు. వికెట్ తీసిన ఆనందంలో.. అల్లు అర్జున్ను గుర్తు చేస్తూ తన గడ్డంపై చేయి పెట్టి ''నీ యవ్వ..తగ్గేదే లే'' అన్నట్లుగా మేనరిజం చేసి చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ను షేక్ చేస్తుంది. కాగా పుష్పలోని ''శ్రీవల్లీ'' పాటకు ఇటీవలే వార్నర్ స్టెప్పులు వేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. -
రసెల్తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం
క్రికెట్లో రనౌట్లు జరగడం సహజం. అందులో కొన్ని విచిత్ర రనౌట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రనౌట్ మాత్రం అంతకుమించినది. అసలు ఎవరు ఊహించని రీతిలో ఆండ్రీ రసెల్ రనౌటవ్వడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇది చోటుచేసుకుంది. ఢాకా ప్లాటూన్, కుల్నా టైగర్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. చదవండి: BBL 2021-22: స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది ఆండ్రీ రసెల్, మహ్మదుల్లా నిలకడైన బ్యాటింగ్తో ఢాకా ప్లాటూన్ ఇన్నింగ్స్ సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం కూడా ఏర్పడింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఐదో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఉంచుకోవాలని భావించి థర్డ్మన్ దిశగా ఆడాడు. మెహదీ హసన్ బంతిని అందుకొని స్ట్రైకింగ్ వైపు విసిరాడు. బంతి వికెట్లకు తాకినప్పటికి.. అప్పటికే మహ్మదుల్లా క్రీజులోకి చేరుకున్నాడు. అవతలి వైపు రసెల్ కూడా ఇక భయం లేదనుకొని కాస్త స్లో అయ్యాడు. ఇక్కడే రసెల్ను దురదృష్టం వెంటాడింది. మెహదీ హసన్ వేసిన త్రో స్ట్రైకింగ్ ఎండ్ వద్ద ఉన్న వికెట్లను తాకి.. మళ్లీ అక్కడినుంచి నాన్స్ట్రైకింగ్ ఎండ్వైపు వెళ్లింది. రసెల్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. బిగ్స్క్రీన్పై రసెల్ క్లియర్ రనౌట్ అని తేలింది. పాపం తాను ఇలా ఔటవుతానని రసెల్ అసలు ఊహించి ఉండడు. తాను ఔటైన తీరుపై నవ్వాలో.. ఏడ్వాలో తెలియక ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.'' విధి అతన్ని ఈ రకంగా వక్రీకరించింది... ఎంత ఘోరం జరిగిపోయింది..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రసెల్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND Vs SA: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది Rajinikant fielding? 😲😲😲pic.twitter.com/aWGwKMJYyG — Rohit Sankar (@imRohit_SN) January 21, 2022 -
పాకిస్తాన్ ఇప్పుడు సురక్షితమైన ప్రదేశం : గేల్
ఢాకా : ప్రపంచంలోనే ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో పాకిస్తాన్ ఒకటని విండీస్ స్టార్ బ్యాట్సమెన్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రసుత్తం పాకిస్తాన్లో సిరీస్ ఆడేందుకు వచ్చే జట్టులోని ఆటగాళ్లకు ఆ దేశ ప్రభుత్వం ఒక అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్లో జరుగుతున్న బంగ్లా ప్రీమియర్ లీగ్లో గేల్ ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఆడేందుకు వచ్చాడు. ప్రాక్టీస్ సందర్భంగా 'పాకిస్తాన్ క్రికెట్ ఆడేందుకు అనువైన ప్రదేశం అవునా కాదా ' అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు గేల్ స్పందిస్తూ... ' ఇప్పుడు ప్రపంచంలోనే పాకిస్తాన్ దేశం అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు వస్తున్న ఆటగాళ్లకు అధ్యక్షస్థాయి భద్రతను కల్పిస్తున్నారు. ఒక ఆటగాడిగా ఇంతకన్నా కావలిసిందేముంటుంది' అంటూ పేర్కొన్నాడు. కాగా దశాబ్దం తర్వాత శ్రీలంక జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లకు పాక్ ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. కాగా రెండు టెస్టుల సిరీస్ను పాకిస్తాన్ 1-0 తేడాతో గెలుచుకుంది. అయితే గేల్ ఈ మధ్యనే 40లోకి ఎంటరవ్వడంతో అతని రిటైర్మంట్పై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వాటన్నింటికి తెరదించుతూ ఇంకో ఐదేళ్ల పాటు తనకు క్రికెట్ ఆడే శక్తి ఉన్నట్లు గేల్ ఇప్పటికే ప్రకటించాడు. Chris Gayle "Pakistan is one of the safest places right now in the world" #Cricket pic.twitter.com/CNZaBNCSuu — Saj Sadiq (@Saj_PakPassion) January 9, 2020 -
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ బౌలింగా?
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) బుధవారం ఆరంభం కాగా ఓ బౌలింగ్ వేసిన తీరు నవ్వులు తెప్పించడమే కాదు.. అనేక అనుమానాలకు తావిచ్చింది. వెస్టిండీస్కు చెందిన 34 ఏళ్ల ఎడమ చేతి మీడియం పేసర్ క్రిష్మర్ సంతోకి బీపీఎల్లో సిలెట్ థండర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టాగ్రామ్ చాలెంజర్స్తో జరిగిన ప్రారంభపు మ్యాచ్లో సంతోకి వేసిన బంతులు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. కుడిచేతి వాటం బ్యాట్స్మన్కు అతడు ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ.. లెగ్సైడ్కు అత్యంత దూరంగా ఫుల్టాస్ వేయడం గమనార్హం. ఆ బంతి వికెట్కు ఎంత దూరంగా వెళ్లిదంటే టెస్ట్ల్లోనూ ఆ బంతిని నిస్సందేహంగా వైడ్గా ప్రకటించేంతగా. ఆ బంతిని అందుకొనేందుకు కీపర్ ఎడమవైపుకు బాగా డైవ్ కొట్టి మరీ ఆపాడు. ఇక.. క్రిష్మర్ వేసిన నోబ్ను చూసి‘ ‘క్రికెట్లో ఇలాంటి నోబాల్ కూడా వేస్తారా?’ అనిపించింది. అతడి కుడికాలు క్రీజ్కు చాలా దూరంగా పడింది. దాంతో సంతోకి బౌలింగ్పై నెటిజన్లు అనుమానాలు వ్యక్తంజేశారు. సంతోకి అనుమానాస్పద బౌలింగ్పై విచారణ చేయాలని బంగ్లా క్రికెట్ బోర్డును కోరామని సిలెట్ థండర్ డైరెక్టర్ తంజిల్ చౌధురి పేర్కొన్నారు. ‘ నో బాల్-వైడ్పై విచారణకు ఆదేశించాం. ఓవరాల్గా మాకు బరిలోకి దిగే ఎలెవన్ జట్టుపై మా జోక్యం ఉండదు. అది మేనేజ్మెంట్, కోచ్ పని. దీనిపై స్పాన్సర్ల ప్రమేయం ఏమైనా ఉందని అడిగా. కానీ వారు చెప్పలేదు. ఇక ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. సంతోకి ఇలా బౌలింగ్ చేసి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డడా అనే అనుమానం కూడా ఉంది. సంతోకి ఇలా చేయడానికి ఎవరి ప్రమేయం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తాం’ అని తంజిల్ తెలిపారు. ఈ మ్యాచ్లో సంతోకి 4 ఓవర్లు బౌలింగ్ వేసి 34 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్లో సిలెట్ థండర్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిలెట్ థండర్ నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్ను చట్టాగ్రామ్ చాలెంజర్స్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టీ20 మ్యాచ్లో సంతోకి ఒక నోబాల్తో పాటు 4 వైడ్లు వేశాడు. దాంతోనే అతని బౌలింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. A no-ball bowled by Krishmar Santokie in the opening match of the Bangladesh Premier league #BPL2019 today. pic.twitter.com/Lvzut5d0Gz — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 -
సరికొత్తగా టీ20 లీగ్.. ఇవేం రూల్స్రా నాయనా..!
ఢాకా : బంగ్లాదేశ్ టీ20 ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలతో విభేదాల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీపీఎల్లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అన్ని దేశాలు పాటించిన రూల్స్నే అనుసరించిన బంగ్లా క్రికెట్ బోర్డు బీపీఎల్ను తన అధీనంలోకి తీసుకుని తాజా నిర్ణయాలను ప్రకటించింది. మేటి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తమ దేశ క్రికెటర్లు టీ20 ఫార్మాట్లో మెరుగ్గా రాణించేందుకు తాజా నిబంధనలు దోహదపడతాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మహబూబల్ అనమ్ చెప్పారు. వచ్చే సీజన్ నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని వెల్లడించారు. కాగా, ఏడు ప్రాంచైజీలు ఉన్న బీపీఎల్లో ఆరు జట్ల యజమానులతో బంగ్లా క్రికెట్ బోర్డుకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో బంగ్లా ప్రీమియర్ లీగ్ను బంగ్లా బోర్డు అధీనంలోకి తీసుకుంది. అయితే, బీసీబీ కొత్త నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. మోకాలుకు బోడి గుండుకు ముడిపెట్టుగా రూల్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సరుకంతా విదేశాలదైతే బంగ్లా ప్రీమియర్ లీగ్ అనే పేరెందుకుని క్రికెట్ అభిమానులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బంగ్లా టీ20 ప్రీమియర్ లీగ్ తాజా రూల్స్.. ఏడు టీమ్లలో ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్ తప్పనిసరి. అతను 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలగాలి టీమ్లో ఒక లెగ్ స్పిన్నర్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి జట్టులో ఉన్న మణికట్టు స్పిన్నర్ తప్పనిసరిగా పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేయాలి విదేశీ ప్రధాన కోచ్, ఫిజియోథెరపిస్టు, ట్రెయినర్లే ఉండాలి. స్వదేశానికి చెందిన కోచ్లు ఈ ప్రధాన కోచ్కు సహాయకుడిగా మాత్రమే ఉంటారు. టీమ్లకు డైరెక్టర్ను ఎంపిక చేసే అధికారం బీసీబీ డైరెక్టర్కు ఉంటుంది. -
అచ్చం ధోనిలానే..!
-
అచ్చం ధోనిలానే..!
చట్టోగ్రామ్: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఎంత చురగ్గా ఉంటాడో అందరికీ విదితమే. ప్రపంచ క్రికెట్లో ధోనిలా ఫీల్డింగ్ చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ధోనికి పెద్ద అభిమాని అయిన అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ షెహజాద్ వికెట్ల వెనుక మెరుపులు మెరిపిస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా చిట్టగాంగ్ వికింగ్స్తో తరఫున ఆడుతున్న షెహజాద్ కనీసం వికెట్లవైపు చూడకుండా ఢాకా డైనమెట్స్ ఓపెనర్ రెహ్మాన్ను ఔట్ చేసి తీరు ధోనిని గుర్తు చేసింది. ఈ మ్యాచ్ బుధవార జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నయీమ్ హసన్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి క్రీజ్ బయటకకు వచ్చి షాట్ ఆడబోయిన రెహ్మాన్ బంతిని హిట్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తాకిన బంతి క్రీజుకి సమీపంలో నిలిచిన క్రమంలో రెహ్మన్ పరుగు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో వికెట్ల వెనుక నుంచి దూసుకొచ్చిన షెహజాద్.. బంతిని అందుకున్న మరుక్షణమే వికెట్లను గిరటేశాడు. బ్యాట్ గాల్లో ఉండగానే స్టంప్స్ పడిపోవడంతో రెహ్మాన్ రనౌట్గా నిష్క్రమించక తప్పలేదు. దాంతో వికెట్ల వైపు చూడకుండానే బంతిని నేరుగా స్టంప్స్పైకి వేయడంలో దిట్ట అయిన ధోనిని గుర్తు చేసుకోవడం అభిమానుల వంతైంది. -
ఐపీఎల్కు స్మిత్ దూరం!
ముంబై : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో గత సీజన్ ఐపీఎల్కు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్.. ఈ సీజన్కు సైతం దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న ఈ ఆసీస్ క్రికెటర్.. గాయంతో అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ లీగ్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన స్మిత్కు కుడిమోచేతికి తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీంతో స్మిత్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. మంగళవారం వైద్యులు అతనికి సర్జరీ చేయనున్నారు. అయితే సర్జరీ అనంతరం స్మిత్ ఎంత లేదన్నా.. ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే స్మిత్ ఎప్రిల్ 15 వరకు బెడ్రెస్ట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఐపీఎల్-12 సీజన్ ప్రారంభ మ్యాచ్లకు స్మిత్ దూరం కావాల్సి ఉంటుంది. మళ్లీ టోర్నీ చివర్లో ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ఆయాదేశాలు తమ ఆటగాళ్లను వెనక్కి పిలిచే అవకాశం ఉంది. దీంతో ఈ సీజన్లో స్మిత్ సేవలను చాలా మ్యాచ్లకు రాజస్తాన్ రాయల్స్ కోల్పోనుంది. ఇందులో భాగంగానే జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయం మార్గాలను అన్వేశిస్తుందని, స్మిత్ స్థానంలో మరో క్రికెటర్ తీసుకోవాలనే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ గాయం స్మిత్ పునరాగమనంపై కూడా ప్రభావం చూపనుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మార్చి 28తో స్మిత్ నిషేధకాలం పూర్తి కానుందని, అనంతరం అతను దేశవాళీ క్రికెట్ ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ స్మిత్ గాయంతో బెడ్ రెస్ట్లో ఉంటే అతను ఆసీస్ ఆడబోయే ప్రతిష్టాత్మక ప్రపంచకప్, యాషెస్ సిరీస్లకు దూరమయ్యే అవకాశం ఉంటుందన్నారు. -
18 సిక్సర్లతో గేల్ విధ్వంసం.!
ఢాకా : టీ20 క్రికెట్లో విధ్వంస బ్యాటింగ్తో చెలరేగే ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో తన రికార్డు తనే అధిగమించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో రాయల్ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున పుణే వారియర్స్పై గేల్ బాదిన 17 సిక్సర్లే అత్యధిక సిక్సర్ల రికార్డుగా ఉంది. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ ఫైనల్లో రంగపూర్ రైడర్స్ జట్టు తరుపున ఢాకా డైనమైట్స్పై 18 సిక్సులు బాది పాత రికార్డును అధిగమించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో గేల్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రంగపూర్ రైడర్స్ ఐదు పరుగలకే తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్గా ఉన్న గేల్ కీవీస్ బ్యాట్స్మన్ మెకల్లమ్తో కలిపి మైదానంలో పరుగుల తుఫాన్ను సృష్టించాడు. ఇక రెండో వికెట్కు ఈ జోడి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే తొలి అత్యధిక భాగస్వామ్యం. 69 బంతులు ఆడిన గేల్ 18 సిక్సర్లు, 5 ఫోర్లతో 146 పరుగుల చేసి బీపీఎల్ చరిత్రలో రికార్డు సెంచరీ నమోదు చేశాడు. మెకల్లమ్ 43 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు. దీంతో ఢాకా డైనమెట్స్కు రంగపూర్ రైడర్స్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి క్రికెట్లో ఓవరాల్గా గేల్కు ఇది 20వ సెంచరీ కాగా.. బీపీఎల్లో రెండోది. ఇక ఈ సెంచరీతో ఓవరాల్ టీ20ల్లో గేల్ 11 వేల పరుగుల మార్క్ను అందుకున్న తొలి క్రికెటర్గా గుర్తింపు పొందాడు. -
51 బంతుల్లో 126 నాటౌట్
ఢాకా: ఐపీఎల్ సహా చాలా కాలంగా టి20ల్లో విఫలమవుతూ స్తబ్దుగా ఉన్న ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. స్థాయికి తగినట్లుగా విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడిన వెస్టిండీస్ స్టార్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో మెరుపు సెంచరీ చేశాడు. గేల్ (51 బంతుల్లో 126 నాటౌట్; 6 ఫోర్లు, 14 సిక్సర్లు) జోరుతో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ జట్టు 8 వికెట్లతో ఖుల్నా టైటాన్స్ను ఓడించింది. ముందుగా ఖుల్నా 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేయగా... రైడర్స్ 15.2 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మూడో బంతినే సిక్సర్గా మలచిన గేల్ ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. 23 బంతుల్లో అర్ధ సెంచరీ, 45వ బంతికి సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 19 టి20 ఫార్మాట్లో గేల్కు ఇది 19వ సెంచరీ. మెకల్లమ్, ల్యూక్ రైట్, క్లింగర్(7 శతకాలు) తర్వాతి స్థానంలో ఉన్నారు.14 ఒక టి20 ఇన్నింగ్స్లో గేల్ 10కి పైగా సిక్సర్లు బాదడం ఇది 14వసారి. మిగతావారెవరూ 2 సార్లకు మించి నమోదు చేయలేదు. 800 ఈ మ్యాచ్తో గేల్ టి20ల్లో 800 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. పొలార్డ్ (506) రెండో స్థానంలో ఉన్నాడు. -
క్రికెటర్ హోటల్ రూమ్కు 'మహిళా అతిథి'!
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు తన హోటల్ గదికి మహిళా అతిథిని పిలిపించుకొని దొరికిపోయాడు. దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు స్పోర్ట్స్కీడ వెబ్సైట్ వెల్లడించింది. అయితే ఆల్రౌండర్ అయిన సదరు క్రికెటర్ పేరును అధికారులు వెల్లడించలేదు. ఆయన గారు హోటల్ గదికి పిలిపించుకున్న విదేశీ మహిళ అవినీతి నిరోధక శాఖ అధికారుల జాబితాలో ఉందని, దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఒప్పందంలో ఉండటం వల్ల ఈ చర్యకుగాను అతనిపై అధికారులు చర్య తీసుకోలేదని, కానీ మహిళా అతిథులను హోటల్ గదులకు పిలించుకోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా అతనిపై ప్రవర్తనపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్లు షబ్బీర్ రహ్మాన్, ఆల్ అమిన్ హుస్సేన్ కూడా ఇలాగే తమ హోటల్ గదులకు అమ్మాయిలను పిలిపించుకొని అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని తీవ్రంగా మందలించిన అధికారులు భారీగా జరిమానాలు విధించారు. ఐపీఎల్ తరహాలో జరుగుతున్న బీపీఎల్ టీ-20 టోర్నమెంటులో దాదాపు 18మంది పాక్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. -
క్రిస్గేల్ రికార్డు బద్దలైంది!
మిర్పూర్: వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. బంగ్లాదేశ్ ప్లేయర్ షబ్బీర్ రహమాన్ అద్భుత శతకంతో పాటు గేల్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అదిగమించాడు. బంగ్లా ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బరిసాల్ బుల్స్ ప్రత్యర్థి జట్టు రాజ్షాహి కింగ్స్కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యఛేదనకు దిగిన రాజ్షాహి కింగ్స్ ఆటగాడు, షబ్బీర్ రహమాన్ 9 సిక్సర్లు, 4 ఫోర్లతో కేవలం 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. గతంలో బీపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్ (112 పరుగులు) పేరిట ఉండేది. ఈ మ్యాచ్ ద్వారా గేల్ రికార్డును అధిగమించిన షబ్బీర్ మాట్లాడుతూ.. తనశైలికి టీ20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుందన్నాడు. త్వరలోనే తన రికార్డును మరో క్రికెటర్ బ్రేక్ చేస్తాడని షబ్బీర్ అభిప్రాయపడ్డాడు. -
బీపీఎల్ విజేత విక్టోరియన్స్
మిర్పూర్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టైటిల్ను కొమిల్లా విక్టోరియన్స్ జట్టు సొంతం చేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో విక్టోరియన్స్ 3 వికెట్ల తేడాతో బారిసల్ బుల్స్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బారిసల్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్ముదుల్లా (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), షహ్రియార్ నఫీస్ (31 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రసన్న (19 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం విక్టోరియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం ఇవ్వగా, అహ్మద్ షహజాద్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అయితే 10 ఓవర్లలో 80 పరుగులు చేయాల్సిన దశలో బరిలోకి దిగిన అలోక్ కపాలి (28 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు) చివర్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా బౌండరీలు బాదిన అతను ఆఖరి బంతికి తమ జట్టును గెలిపించాడు. సమీ వేసిన ఆఖరి ఓవర్లో కొమిల్లా జట్టు 13 పరుగులు రాబట్టి టోర్నీ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో 2012, 2013లలో ఢాకా గ్లాడియేటర్స్ టైటిల్ సాధించగా, గత ఏడాది ఈ టోర్నీ జరగలేదు. మూడు సార్లూ టైటిల్ గెలిచిన జట్టుకు సీనియర్ బౌలర్ మొర్తజానే కెప్టెన్ కావడం విశేషం. -
బుకీల గెంటివేత
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను ఈసారి ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్లకు ఆస్కారం లేకుండా జరిపేందుకు నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా నలుగురు బుకీలను స్టేడియం నుంచి బయటకు పంపేశారు. ‘అనుమానాస్పదంగా కనిపిస్తున్న నలుగురు బుకీలను అవినీతి వ్యతిరేక యూనిట్ అధికారులు గుర్తించారు. చట్ట ప్రకారం వారిని జైలుకు తరలించే అధికారం మాకు లేదు. కాబట్టి బయటకు పంపాం’ అని బీపీఎల్ కార్యదర్శి ఇస్మాయిల్ హైదర్ మాలిక్ తెలిపారు. -
ఐసీసీయే ఫిక్సింగ్కు అవకాశమిచ్చింది
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆరోపణ ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో గత ఏడాది చోటుచేసుకున్న ఫిక్సింగ్కు ఐసీసీ అధికారులనే బాధ్యుల్ని చేస్తోంది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఫిక్సింగ్ జరగబోతోందని ఐసీసీ అవి నీతి నిరోధక, భద్రత యూనిట్ (ఏసీఎస్యూ)కు ముందుగానే సమాచారం అందినా.. మ్యాచ్ నిర్వహణకు అనుమతించారని బీసీబీ ఆరోపిస్తోంది. బీపీఎల్లో భాగంగా 2013 ఫిబ్రవరి 2న ఢాకా గ్లాడియేటర్స్-చిట్టగాంగ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సయినట్లు ఐసీసీ నిర్ధారించడం తెలిసిందే. దీనికి సంబంధించి పలువురు ఆటగాళ్లు నిషేధానికి కూడా గురయ్యారు. అయితే ఈ విషయంపై బీసీబీ ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి విచారణ జరిపిం చింది. ఐసీసీ ఏసీఎస్యూ అధికారులు ఫిక్సింగ్ను నిరోధించే అవకాశమున్నా పట్టించుకోకుండా సాక్ష్యాలు సేకరించేందుకే పరిమితమైనట్లుగా తేలిందని ట్రిబ్యునల్ నివేదికలో పేర్కొంది. చిట్టగాంగ్ కింగ్స్తో మ్యాచ్ను ఫిక్స్ చేయాల్సిందిగా జట్టు యజమానుల్లో ఒకరు తనను సంప్రదించినట్లు ఢాకా గ్లాడియేటర్ కోచ్ స్వయంగా ఏసీఎస్యూ అధికారులకు సమాచారమిచ్చాడని ట్రిబ్యునల్ వివరించింది. అయినా ఆయా జట్ల యాజమాన్యాలను ఏసీఎస్యూ అధికారులు అప్రమత్తం చేయకుండా మ్యాచ్కు అనుమతినిచ్చారని తెలిపింది. అయితే బీసీబీ ట్రిబ్యునల్ నివేదికపై ఈ దశలో ఏమీ స్పందించలేమని ఐసీసీ చెబుతుండగా, ఏసీఎస్యూ చైర్మన్ రొనాల్డ్ ఫ్లానగన్ మాత్రం తమ వైఫల్యం పట్ల వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. -
బుకీలు నన్ను సంప్రదించారు
ఈ విషయాన్ని అధికారులకు చెప్పలేదు అంగీకరించిన కివీస్ ఆటగాడు వెల్లింగ్టన్: గతేడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) సందర్భంగా కొంత మంది బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని అధికారులకు వెల్లడించలేకపోయానని న్యూజిలాండ్ ఆటగాడు లూ విన్సెంట్ అంగీకరించాడు. అయితే ఫిక్సింగ్కు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. ఏదేమైనా ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను తాను ఉల్లంఘించానని ఒప్పుకున్నాడు. ‘బుకీలు నన్ను సంప్రదించినా నేను మాత్రం ఫిక్సింగ్కు అంగీకరించలేదు. వాళ్లు సంప్రదించడం వెనుక ఉన్న ఆంతర్యం నాకు అర్థం కాలేదు. అందుకే దాని గురించి ఎలాంటి ఆరోపణలు చేయదల్చుకోలేదు. అక్కడ జరిగిన మ్యాచ్ల్లోగానీ, ఇటీవల జరిగిన విచారణలోగానీ నేను భాగం పంచుకోలేదు’ అని విన్సెంట్ వెల్లడించాడు. మరోవైపు విన్సెంట్కు ఎలాంటి శిక్ష పడుతుందన్న విషయాన్ని వెల్లడించేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీ) ఎగ్జిక్యూటివ్ చీఫ్ డేవిడ్ వైట్ నిరాకరించారు.