BC leaders
-
బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
-
ప్రజాభవన్లో బీసీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీసీ సంఘాలు, ఇతర ముఖ్య నేతలతో ప్రజా భవన్లో సీఎం రేవంత్రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ సీనియర్ బీసీ నాయకులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సెక్రటరీలు హాజరయ్యారు.ఈ సమావేశం సందర్భంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, తీర్మానం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, బీసీల సంక్షేమానికి అమలుచేస్తున్న కార్యక్రమాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. -
నేడు బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల(BC Leaders)తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్తో కలసి ఆయన బీసీ నాయకులతో సమావేశం కానున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన జరగడం, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ బీసీ నేతలకు కర్తవ్యబోధ చేసేందుకు గాను ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. -
వెనుకబడిన వర్గాలకు టీడీపీ వెన్నుపోటు
-
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
బీసీలకు పదవులు ఇచ్చి పట్టాభిషేకం చేసింది సీఎం జగన్ ఒక్కడే
-
సీఎం జగన్ పాలనపై బీసీ లీడర్లు, కార్యకర్తల కామెంట్స్
-
Telangana: పాతిక సీట్లతో సర్దుకోండి!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బలహీన వర్గాల నేతలకు టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గళం మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు ఇస్తామని ఆ పార్టీ పెద్దలు చెప్పినా ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వగలమని.. మిగతా వారికి ఇవ్వలేమని హైకమాండ్ స్పష్టం చేసిందని అంటున్నాయి. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన బీసీ నేతలు అధిష్టానం పెద్దలను కలసినప్పుడు ఈ సంకేతాలు ఇచ్చిందని పేర్కొంటున్నాయి. ఈ సారికి 25 అసెంబ్లీ స్థానాలతో సర్దుకోవాలని.. అధికారంలోకి వచ్చాక బీసీ నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే అధికారికంగా ప్రకటిస్తామని పెద్దలు చెప్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఇతర పదవులు ఇస్తామంటూ... ఉదయ్పూర్ డిక్లరేషన్తోపాటు తెలంగాణలోని సామాజిక ముఖచిత్రం నేపథ్యంలో ఈసారి తమకు 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోటీచేసే అర్హత ఉన్న 50మందికిపైగా నేతల పేర్లతో అధిష్టానానికి జాబితా కూడా అందజేశారు. కనీసం పీసీసీ అధ్యక్షుడు చెప్పిన విధంగా, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు 34 అసెంబ్లీ స్థానాలైనా ఇవ్వాలని వారు కోరుతున్నారు. కానీ 25కి మించి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. రేవంత్ మాట ప్రకారం 34 సీట్లు ఇచ్చే పరిస్థితి లేకుంటే.. ఎన్ని తక్కువ ఇస్తే అన్ని నామినేటెడ్ పదవులు (ఎమ్మెల్సీ) ఇస్తామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 9 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామని టికెట్ల కేటాయింపు సమయంలోనే పార్టీ పక్షాన అధికారికంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. దీంతోపాటు బీఆర్ఎస్ నుంచి నలుగురు బీసీలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురు బీసీ నేతలకు రాజ్యసభ అవకాశం కల్పిస్తుందన్న హామీపై చర్చ జరుగుతోంది. ప్రతి లోక్సభ సీటు పరిధిలో రెండు సాధ్యం కాదంటూ..! రాష్ట్రంలోని ప్రతి లోక్సభ స్థానం పరిధిలో రెండు చొప్పున మొత్తం 34 అసెంబ్లీ టికెట్లను బీసీలకు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో మాటిచ్చారు. కానీ తాజా పరిణా మాలతో ఈ హామీ అమలు సాధ్యమవడం లేద నే చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నేతృత్వంలో నిర్వహించిన సర్వేల్లో బీసీ సీనియర్ నేతలకు కూడా సాను కూలత రాలేదని.. ఈ క్రమంలో కచ్చితంగా గెలుపు వరకు రాగల బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని అధిష్టానం పేర్కొన్నట్టు తెలిసింది. బీసీ నేతలు ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి నప్పుడు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశార ని సమాచారం. పార్టీ అధికారంలోకి రావాలంటే సర్దుకుపోవాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ 22 చోట్ల బీసీలకు అవకాశం ఇచ్చిందని.. ఆ పార్టీ కంటే ఒకట్రెండు స్థానాలు ఎక్కువే ఇస్తామని, ఇదే విషయాన్ని బీసీ వర్గాలకు వెల్లడించాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. సర్వేల ప్రాతిపదికన ఇది తప్పడం లేదని, సర్వేల విషయంలో ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే తనకు తెలపాలని బీసీ నేతలకు కేసీ వేణు గోపాల్ సూచించినట్టు తెలిసింది. -
కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లోని బీసీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఇటీవల గాంధీభవన్లో జరిగిన టీం బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు మంగళవారం హస్తిన పయనమయ్యారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారమే ఢిల్లీ వెళ్లగా, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్కుమార్ యాదవ్, గాలి అనిల్కుమార్, సురేశ్ షెట్కార్ తదితరులు బుధవారం బయలుదేరనున్నారు. వీరంతా బుధ లేదా గురువారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఖరారు చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు కనీసం 34 స్థానాలు కేటాయించడమే ఎజెండాగా తెలంగాణ బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ప్రదేశ్ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి లోక్సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలని కోరుతూ టీం బీసీ నేతలు మంగళవారం హైదరాబాద్లో ఉన్న ముఖ్య నేతలను కలిశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్షెట్కార్, గాలి అనిల్కుమార్, ఎర్రశేఖర్, సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం అందుబాటులో ఉన్న నేతలు నల్లగొండ ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్కుమార్రెడ్డిని కూడా కలవనున్నారు. -
ఢిల్లీలోనే తేల్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాల నేతలకు తగినన్ని టికెట్లు కేటాయించాల్సిందేనని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎందాకైనా కొట్లాడాలని, ఢిల్లీ వెళ్లి సోనియాగాం«దీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా కూడా రాహుల్ ఓబీసీల పక్షాన మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అధ్యక్షతన ఆదివారం గాం«దీభవన్లో బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, సురేశ్ షెట్కార్, మహేశ్కుమార్గౌడ్, పొన్నం ప్రభాకర్, చెరుకు సుధాకర్, గాలి అనిల్కుమార్, సంగిశెట్టి జగదీశ్వర్రావు, మెట్టు సాయికుమార్, ముత్తినేని వీరయ్య వర్మలతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు టికెట్ల కేటాయింపే ఎజెండాగా చర్చించారు. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ.. ♦ పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు సోమ లేదా మంగళవారాల్లో ఢిల్లీ వెళ్లాలి. అక్కడ సోనియా, రాహుల్, ఖర్గేను కలిసి తమ డిమాండ్లను వారి ముందుంచాలి. ♦ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 సీట్లు కేటాయించాలని కోరుతూ అందరి సంతకాలతో అధిష్టానానికి లేఖ రాయాలి. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతకు కూడా ఈ లేఖను అందజేయాలి. ♦ టికెట్ల కేటాయింపులో అన్ని కులాలకు ప్రాధాన్యమివ్వాలి. అభ్యర్థుల ప్రకటన కోసం విడుదల చేసే తొలిజాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా కుట్ర జరుగుతోంది. తొలి జాబితాలోనే బీసీ నేతల పేర్లను కూడా ప్రకటించాలి. ♦ బీసీలకు ఇచ్చే స్థానాలను ముందుగా గుర్తించి అక్కడ బీసీ నేతల పేర్లతోనే సర్వేలు జరపాలి. ♦ బీసీ నేతల్లో ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి గెలిపించుకోవాలి. ♦ పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో బీసీల వాటాను అమలు చేయాలి. పెరిక, పద్మశాలీలకు అన్యాయం బీసీ కులాల్లో పెద్ద సంఖ్యలో జనాభా ఉండే పద్మశాలీలతోపాటు పెరిక వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. పద్మశాలీల పక్షాన మునుగోడు నుంచి పున్నా కైలాశ్ నేత, ముషీరాబాద్ నుంచి సంగిశెట్టి జగదీశ్వర్రావు, బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ లాంటి నాయకులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరిగింది. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి లాంటి లోక్సభ స్థానాల్లో రెండు స్థానాలను బీసీలకిచ్చే పరిస్థితి లేదని అంటున్నారని, సికింద్రాబాద్, భువనగిరి, నిజామాబాద్ లాంటి లోక్సభ స్థానాల పరిధిలో అవసరమైతే మూడు సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యేగా పెరిక కులానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడని, ఆయన సీటును కూడా కేసీఆర్ గుంజుకున్న నేపథ్యంలో తమ కులానికి కాంగ్రెస్లో అయినా న్యాయం చేయాలని వికలాంగ విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ కోరారు. -
ఎలక్షన్స్ వచ్చినపుడే టికెట్ అనేది పాత ముచ్చట.. మా ముచ్చట ఇనుకోండ్రి!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఏకమవుతున్నారా? తమకూ ఒక అవకాశం ఇవ్వాలని తమ పార్టీలను కోరుతున్నారా? పోటీ చేయడానికి తగిన గ్రౌండ్ చేసుకుంటున్నారా? ఇంతకీ టిక్కెట్లు ఆశిస్తున్న బీసీ నేతలు ఎవరు? ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు? పార్టీలు బీసీ నేతల్ని ప్రోత్సహించడానికి సిద్దంగా ఉన్నాయా? వివరాలేంటో చూద్దాం.. ఉమ్మడి నల్గొండ రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా. అయితే ఇక్కడ పార్టీ ఏదైనా రెడ్డి సామాజికవర్గానిదే పై చేయిగా ఉంటుంది. అయితే జిల్లాలోని కొందరు బీసీ నేతలు తమకూ ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోరితే లాభం ఉండదనే ఉద్దేశంతో రెండు మూడేళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ పడుతున్న బీసీ నేతల సంఖ్య పెరిగిపోయిందట. అధికార బీఆర్ఎస్లోనే బీసీ నేతల పోటీ ఎక్కువగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. బీర్లకు చేయి అందిస్తే.. యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య కోరుతున్నారు. గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గ కాంగ్రెస్కు అన్నీ తానై వ్యవహరిస్తున్నానని ఆయన అంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పనిచేస్తున్నారు. తన పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు కులవృత్తులవారికి పనిముట్లను పంపిణీ చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించే స్థానం ఆలేరు ఒక్కటే అన్న ప్రచారం సాగుతోంది. మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ఉండటంతో వారిని కాదని అక్కడ బీసీలకు సీటు ఇచ్చే అవకాశం లేదు. ఇది అయిలయ్యకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. (మణిపూర్ ఘటనే కనిపిస్తోందా?.. పార్లమెంట్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలు) మునుగోడుపై రవి ఆశలు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నారబోయిన రవి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రవి ఉప ఎన్నికల సందర్భంలో కూడా టిక్కెట్ ఆశించారు. ఆశావహుల లిస్ట్లో కూడా ఆయన పేరు ప్రముఖంగానే వినిపించింది. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి 38 వేల వరకు ఓట్లు ఉన్నాయని తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా మంత్రితో పాటు అధిష్టాన పెద్దలను కూడా నారబోయిన రవి కోరుతున్నారట. ఇప్పటికే ఆయన నియోజకవర్గం అంతా వాల్ రైటింగ్ విస్తృతంగా రాయించడంతో పాటు పోస్టర్లు కూడా ఖాళీ లేకుండా అతికిస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ కాదంటే నాకే! కోదాడ నియోజకవర్గంలో మొదటి నుంచి గులాబీ టికెట్ ఆశిస్తున్నవారిలో వనపర్తి లక్ష్మీనారాయణ ఒకరు. ఈయన పెరిక సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. లక్ష్మీనారాయణ భార్య శిరీష కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్గా కొనసాగుతున్నారు. గత నాలుగేళ్లుగా కోదాడ టికెట్ ఆశిస్తూ లక్ష్మీనారాయణ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గపు ఓట్లు కూడా నిర్ణయాత్మకంగా ఉండటంతో తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని లక్ష్మీనారాయణ నమ్మకం. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయన్ను మార్చి మరో వ్యక్తికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ మల్లయ్యను మారిస్తే మాత్రం తనను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దల వద్ద లక్ష్మీనారాయణ ప్రస్తావిస్తున్నారట. టికెట్ ఇవ్వకపోతే.. సెపరేట్ రూట్ హుజూర్ నగర్లో పిల్లుట్ల రఘు అనే సామాజిక కార్యకర్త కూడా ఎప్పటి నుంచో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరు టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు ప్రణాళిక తయారు చేసుకుంటున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలను కలిసి తన కోరిక వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్కుమార్ను కాదని రఘుకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదనేది బహిరంగ విషయమే. (చదవండి: ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు) ఒకవేళ కుటుంబంలో ఒకరికే టికెట్ అనే కాంగ్రెస్ సూత్రంలో భాగంగా ఉత్తమ్ ఫ్యామిలీలో ఒకరికే టికెట్ ఆయన హుజూర్ నగర్లో కాకుండా కోదాడలో పోటీ చేయొచ్చని.. అలా జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని రఘు కోరుతున్నారట. కాంగ్రెస్ నాయకత్వం ఆయన అభ్యర్థనను ఏవిధంగా తీసుకుంటుదనేది కీలకంగా మారనుంది. మరోవైపు మిగిలిన పార్టీల నేతలను కూడా కలిసి తాను చేసిన సామాజిక కార్యక్రమాలను చెప్తూ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఏ పార్టీ నుంచి అవకాశం రాకపోతే ఇండిపెండెంట్గా అయినా బరిలో దిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు టికెట్ రేసులోకి దూసుకువస్తున్నారు. పార్టీలు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు రంజుగా మారనున్నాయి. -సాక్షి, పొలిటికల్ డెస్క్. -
Telangana:బీసీ దారిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్పై మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల బీఆర్ఎస్లోని బీసీ మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసిన విమర్శలు.. బీసీల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిదాడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ బీసీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. భేటీపై కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం అందడంతో పరిమిత సంఖ్యలోనే బీసీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25న విస్తృత స్థాయిలో బీసీ నేతల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ను ప్రజాక్షేత్రంలో ఎండగడదాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల బీసీ మంత్రులు, ఇతర నేతల పట్ల చేసిన వ్యాఖ్యలు, బీసీ నేత దాసోజు శ్రవణ్కు వచ్చిన బెదిరింపులు తదితర అంశాలు తలసాని ఆధ్వర్యంలోని భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. బీసీ సభల పేరిట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, సూర్యాపేటలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు చేస్తున్న సన్నాహాలపైనా నేతలు చర్చించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన పథకాలు, చేకూరిన లబ్ధి తదితరాలను విశ్లేషించారు. ఆత్మ గౌరవ భవనాలు మొదలుకుని అన్ని బీసీ కులాల కోసం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ను ఎండగట్టాలని.. లేకుంటే కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కార్యాచరణపై ఈ నెల 25న విస్తృత భేటీ బీసీల ఆత్మగౌరవాన్ని చాటడంతోపాటు బీసీల కోసం బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు, పథకాలను వివరించేందుకు ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బీసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం మొదలుకుని పార్లమెంట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో పరేడ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న హైదరాబాద్లో మరోమారు విస్తృత స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, 93బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించనున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే.. – మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్, గంగుల హెచ్చరిక – త్వరలో బీసీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా కించపర్చే ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరు సరికాదని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తలసాని కార్యాలయంలో బీసీ నేతల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో బీసీల్లో కొట్లాట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలు ఆత్మగౌరవాన్ని వదులుకోబోరన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందంటున్న కాంగ్రెస్ ఎంత మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలను కదిలించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
చాకిరీ మాది... పదవులు మీకా?
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 51కి తగ్గకుండా తమకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని టీపీసీసీ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ‘అగ్రవర్ణాల నేతలకు టికెట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వారంతా వారివారి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. మరి, బీసీ నేతలకు టికెట్లు ఎప్పు డు ప్రకటిస్తారు? చాకిరీ మాది..సీట్లు, పదవులు మీకా? సమీకరణల పేరుతో ప్రతీసారి ఆఖరి నిమిషంలో టికెట్లు ఇస్తున్నారు. అలాకాకుండా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి. అప్పుడే నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పనిచేసుకునే అవకాశం లభిస్తుంది’అని సమావేశంలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. పార్టీలోని ఏ ఒక్క సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని, కానీ జనా భా ప్రాతిపదికన తమ కోటా సీట్లు, పార్టీ పదవులు తమ కు ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీ సీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల నేతృత్వంలో మంగళ వారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. ఇందులో 100 మందికిపైగా బీసీ నేతలు పాల్గొన్నారు. 1% జనాభా లేని వారితో సమానంగా టికెట్లా? సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పార్టీలో తమ వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీలను కోరారు. ప్రతి పార్లమెంటు స్థానంలో కనీసం 3 అసెంబ్లీ స్థానాల చొప్పున 51కి తగ్గకుండా మెజార్టీ కులాలకు టికెట్లు కేటా యించాలని ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 30–32 సీట్లకే బీసీలను సరిపెడుతున్నారని, ఒక్క శాతం జనాభా లేని వారితో సమానంగా టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల గురించి మాట్లాడితే తొక్కేస్తారనే భయం ఇప్పటికీ పార్టీలో ఉందని, పార్టీ పదవుల కేటాయింపులో మార్పు రావాలని చెప్పారు. జిల్లాల వారీగా సమావేశాలు దేశవ్యాప్తంగా బీసీ కులాలకు ప్రాధాన్యమివ్వాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓబీసీల జనగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని, పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని వెల్లడించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీకి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ను దెబ్బతీయాలన్న ఆలోచనతో రాహుల్ ఓబీసీలను కించపర్చారంటూ బీజేపీ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభనిర్వహణపై మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల జనాభా, ఓట్ల వివరాలతో కూడిన నివేదికను సోనియా, రాహుల్గాం«దీ, మల్లికార్జున ఖర్గేలకు అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు శ్యాంమోహన్ పాల్గొన్నారు. -
బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎం జగన్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశ చరిత్రలో బీసీలను గుర్తించడమే కాకుండా, వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పలువురు బీసీ సంఘాల నేతలు ప్రశంసించారు. మున్నెన్నడూ లేని విధంగా బీసీలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీసీలందరూ మూకుమ్మడిగా సీఎం జగన్కు మరోమారు పట్టం కట్టనున్నారని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్లో ‘బీసీలు–జగనన్న ప్రభుత్వం ప్రాధాన్యత’ అంశంపై శనివారం జరిగిన చర్చా వేదిక నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజిక సాధికారత సాధనలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా శాసన మండలిలో ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఏనాడూ ప్రాతినిథ్యం కల్పించిన దాఖలాల్లేవన్నారు. నాడు చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడగా.. సీఎం జగన్ ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్ధతతో అడుగులేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ఫోన్లో తన సందేశాన్ని వినిపించారు. ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు, బీసీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎన్వీ రావు, రాష్ట్ర రజక సంఘాల గౌరవాధ్యక్షుడు డాక్టర్ రాచకొండ జాన్బాబు, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. -
టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే..
నాడు: గత టీడీపీ ప్రభుత్వం బీసీలను రాజకీయాలకే వాడుకుంది. కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకుంది. చట్టసభల్లోగానీ, రాజకీయ పదవుల్లోగానీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కింది. నామమాత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా నిధులు విదిల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కూరలో కరివేపాకులా వాడుకుని పక్కనబెట్టింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అన్యాయం బీసీలకు బాగా అర్థమైంది. ఏళ్ల తరబడి మోస్తున్నా.. అడుగడుగునా అవమానాలే ఎదురవుతుండడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ బాబుకు బైబై చెప్పే పరిస్థితి వచ్చింది. నేడు: ‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. వారు సమాజానికి బ్యాక్ బోన్లాంటి వారు’ అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఉచ్ఛరిస్తూ వారికి అండదండగా నిలుస్తున్నారు. చట్టసభల్లో సైతం వారికి సముచిత స్థానం కల్పించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన రాజకీయ పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సమకూర్చారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు అనేక పథకాలు తీసుకొచ్చారు. బీసీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీలు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ తమను ఇంతలా ఆదరించలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలోని బీసీ నాయకులు టీడీపీకి గుడ్బై చెబుతున్నారు. పార్టీలో సముచిత స్థానంలేక కొందరు.. బాబు సామాజికవర్గం దాడులకు భయపడి మరికొందరు.. చులకన చేసి మాట్లాడడంతో ఇంకొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింలేక ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి పేరున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం టీడీపీకి, పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తాజాగా చిత్తూరుకు చెందిన బీసీ నాయకుడు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం శుక్రవారం ఉదయం టీడీపీకి, తన పదవికి గుడ్బై చెప్పారు. ఇదివరకే చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాపాక్షి మోహన్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీలే అధికం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గం వారే అధికం. మొత్తంగా 15 లక్షలకుపైగా ఓటర్లుండగా వీరిలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే సుమారు 40 శాతం ఉన్నారు. కుప్పం, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓట్లే కీలకం. అందుకే వారిలో ముఖ్యమైన కొందరిని ఎంపిక చేసుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్నికల వరకే వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాడులు చేస్తూ.. చులకనగా చూస్తూ బాబు సామాజికవర్గం నేతలు బీసీలను చులకన చేయడం, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. మరో వైపు దాడులకు తెగబడుతున్నట్లు బాధితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన పీ షణ్ముగంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు దాడిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే షణ్ముగం ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఏకమవుతున్న బీసీలు టీడీపీలో బీసీలకు జరుగుతున్న అవమానాలను జీర్ణించుకోలేక ఆ సామాజికవర్గ నేతలంతా ఏకమవుతున్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వన్నెకుల క్షత్రియులతో పాటు మిగిలిన బీసీ సామాజికవర్గం నాయకులు, కార్యకర్త లు రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స మావేశాల్లో టీడీపీ చేసిన అన్యాయాలు, ఆగడాలను ఎండగడుతున్నారు. శివరాత్రితర్వాత ఉమ్మడి చిత్తూ రు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు సమావేశం ఏర్పా టు చేసి కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం. బీసీల సాధికారత ఎక్కడ? బీసీల సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. చంద్రబాబు పార్టీని లాక్కున్న తర్వాత ఆ లక్ష్యాన్ని నీరుగార్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని ప్రకటనలు చేసేవారే తప్ప క్షేత్రస్థాయిలో వారికి చేసింది శూన్యం. చంద్రబాబు హయాంలో బీసీలు దగాపడ్డారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ అభ్యర్థి వరకు వారి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలను ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు. టీడీపీలో ఎంత కష్టపడినా బీసీలకు న్యాయం, తగిన గౌరవం, గుర్తింపు లభించదు. 15 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నన్ను నమ్మిన బీసీల కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. –డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి బీసీలను అణగదొక్కేందుకు కుట్ర టీడీపీ కోసం కష్టపడ్డాను. 32 ఏళ్లుగా పార్టీని నమ్మాను. చంద్రబాబు, లోకేష్, ముఖ్యనాయకులు వస్తే వారి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించాను. అయితే పారీ్టలో నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. మొన్న లోకేష్ పర్యటనలో పులివర్తి నాని నాపై దాడిచేసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని లోకేష్కు ఫిర్యాదు చేశాను. నానిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. చిత్తూరులో బీసీలను అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారు. బీసీల దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీ వారికి రుచిచూపిస్తాం. – పీ షణ్ముగం, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, చిత్తూరు మొదలైన బుజ్జగింపుల పర్వం బీసీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడితుండడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. పలువురు మాజీ మంత్రులను బీసీ నాయకుల నివాసాలకు పంపుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుతామని చెబుతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే టీడీపీకి ఇప్పటి వరకు చేసిన సేవలు చాలని, తమకు ఏ పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందో వారి వెంట నడుస్తామని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు పార్టీకి రాజీనామా చేసిన వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నుంచి లేఖలు విడుదల చేయడం గమనార్హం. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
85వేల గళాల నినాదం...‘జయహో బీసీ’
సాక్షి, అమరావతి: రకరకాల పదవులు చేపట్టి రాజకీయ సాధికారతతో బీసీ ప్రతినిధులు భారీ ఎత్తున ‘జయహో బీసీ’ సభకు తరలి రావటం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మహాసభ జరుగుతున్నంత సేపూ వారంతా ‘‘జయహో బీసీ... జయహో జగన్’’ అంటూ ఉరిమే ఉత్సాహంతో నినదించటంతో అంచనాలకు మించి మహాసభ సక్సెస్ అయినట్లు పార్టీ భావిస్తోంది. రాష్ట్ర మంత్రులు మొదలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో పాటు వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్లు, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, వాటి డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వాటి డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు వాటి మెంబర్లు, ఆలయ బోర్డు చైర్మన్లు... ఇలా దాదాపు 85 వేలకు పైగా బీసీ ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుంచీ కదలిరావటమనేది గతంలో ఎన్నడూ జరగలేదని, ఒక్క వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే ఇది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశిస్తున్నట్లు 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించడానికి ఈ సభను ఓ కొత్త ఆరంభంగా చూడాలనేది వారి భావన. గత ఎన్నికలకు ముందు... అంటే 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో తాము అధికారంలోకి వస్తే.. బీసీలకు చేసే మేలుపై బీసీ డిక్లరేషన్ను వైఎస్ జగన్ అప్పట్లో ప్రకటించారు. ఆ డిక్లరేషన్ను ఇపుడు తుచ తప్పకుండా అమలు చేస్తున్నారు. తొలి మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు స్థానం కల్పించి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశమిచ్చారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అన్నింటా బీసీలకే సింహభాగం పదవులిచ్చారు. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపకపోతే.. మూడున్నరేళ్లుగా రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే... అందులో వాటిలో నాలుగింటిని బీసీలకే ఇచ్చి... నలుగురిని రాజ్యసభకు పంపారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.63 లక్షల కోట్లను బీసీలకు అందిస్తే.. అందులో కేవలం డీబీటీ రూపంలోనే రూ.86 వేల కోట్లను ఆ వర్గాల ఖాతాల్లో జమ చేశారు. వీటన్నిటి ఫలితం ఈ జయహో బీసీ సభలో కనిపించిందనేది పార్టీ వర్గాల మాట. వైఎస్సార్సీపీకి వెన్నెముకలా నిలిచిన బీసీలు.. తమను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తా, అంతుచూస్తానంటూ బెదిరించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన హయాంనూ... రాజ్యాధికారంలో, బడ్జెట్లో తమకు సింహభాగం వాటా ఇచ్చి సమున్నత గౌరవం ఇస్తున్న సీఎం జగన్ పాలనను బీసీలు పోల్చి చూసుకుంటున్నారు. బుధవారంనాటి బీసీ నేతల ప్రసంగాలన్నిటా ఇది స్పష్టంగా కనిపించింది కూడా. దేశ చరిత్రలో బీసీ సీఎం కూడా ఇవ్వని రీతిలో.. తమకు సమున్నత గౌరవం ఇస్తూ, కాలరెగరేసుకుని సగర్వంగా తిరిగేలా పాలిస్తున్న సీఎం వైఎస్ జగన్కు వెన్నెముకలా నిలబడాలని వారంతా సభాముఖంగా నినదించారంటే ఈ పాలన ఫలితమేనని వేరే చెప్పాల్సినపనిలేదు కూడా. మళ్లీ వైఎస్ జగన్ను సీఎంగా చేసుకుంటేనే.. తాము మరింత పురోభివృద్ధి సాధించగలుగుతామని బీసీలు భావిస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కదంతొక్కుతున్న శ్రేణులు అధికారంలోకి వచ్చాక తొలిసారి జులైలో నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్సక్సెస్ అయ్యింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్తోన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్చార్జ్లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్కు జేజేలు పలుకుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈక్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ కావడమనేది తదుపరి ఎన్నికలకు కావాల్సిన కదనోత్సాహాన్ని శ్రేణుల్లో నింపిందనే చెప్పాలి. -
Jaiho BC: కదనోత్సాహం.. జయహో బీసీ.. జయహో జగన్
‘మేమంతా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మన సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కానేకాదు.. బ్యాక్ బోన్ అని చేతల్లో నిరూపించారు. అందువల్లే మేమంతా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం.. అందువల్లే పార్టీ ఇచ్చిన ఒక్క పిలుపునకు ఇంత స్పందన.. సీఎం జగన్ మాట్లాడిన ప్రతి మాటకూ ప్రతిస్పందన.. ఈ జన సునామీని చూసిన చంద్రబాబుకు, దుష్టచతుష్టయానికి ఇక నిద్ర కరువే’ అని వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో బల్లగుద్ది చెబుతున్నాయి. జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వెనుకబడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ మహాసభ’కు తరలిరావాలని వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపే ప్రభంజనమైంది.. దూరాభారాన్ని లెక్క చేయక ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం, తమిళనాడు సరిహద్దులోని కుప్పం, కర్ణాటక సరిహద్దులోని హిందూపురం, తెలంగాణ సరిహద్దులోని మంత్రాలయం.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పోటాపోటీగా బీసీ ప్రజాప్రతినిధులు మంగళవారం రాత్రి నుంచే విజయవాడకు తరలివచ్చారు. బుధవారం ఉదయం 5 గంటలకే ఎముకలు కొరుకుతున్న చలిని ఖాతరు చేయకుండా.. మంచు తెరలను చీల్చుకుంటూ.. సూర్యోదయానికి ముందే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి కడలి తరంగంలా పోటెత్తారు. ఉదయం 9 గంటలకు మహాసభ ప్రాంగణం జన సంద్రంగా మారింది. ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో బందరు రోడ్డుతోపాటు ఇందిరాగాంధీ స్టేడియంకు నలువైపులా వేలాది మంది ప్రతినిధులు రహదారులపైనే ఉండిపోయారు. దాంతో మహాసభ ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ సమయం ఉదయం 10 గంటల కన్నా 45 నిముషాల ముందే.. 9.15 గంటలకే ఆరంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసి.. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించి.. సభను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహాసభ ప్రాంగణానికి 12 గంటలకు చేరుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. 1.35 గంటల వరకు కొనసాగించారు. అప్పటి వరకు మహాసభ ప్రాంగణం నుంచి ఏ ఒక్కరూ కట్టు కదలలేదు. నేతలందరి ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. రహదారులపై గంటల తరబడి నిలబడిన వారూ అడుగు కదపకుండా ఎల్ఈడీ తెరలపై మహాసభను వీక్షిస్తూ ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. తలెత్తుకు తిరిగేలా సమున్నత గౌరవం ఏలూరులో 2019 ఫిబ్రవరి 17న బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్లో చెప్పిన దానికంటే మిన్నగా సీఎం వైఎస్ జగన్ చేస్తుండటం.. కాలరెగరేసుకుని సగర్వంగా తలెత్తుకునే రీతిలో సమున్నత గౌరవం ఇస్తూ పరిపాలిస్తుండటం వల్లే బీసీ ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు కదనోత్సాహంతో మహాసభకు కదలి వచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తరిస్తా అంటూ చంద్రబాబు బెదిరించడం.. హామీలను నిలబెట్టుకోవాలని అడిగిన మత్స్యకారులను అంతుచూస్తానని భయపెట్టడం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితుల పుట్టుకనే అవహేళన చేయడాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసినపుడు ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభించింది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు సీఎం వైఎస్ జగన్ పంపి తమకు సమున్నత గౌరవం ఇచ్చారని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వీరన్న ‘సాక్షి’కి చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా, విద్యా సాధికారత సాధించేలా చేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తాము నడుస్తామని స్పష్టం చేశారు. శ్రేణుల్లో మరింత రగిలిన సమరోత్సాహం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ కావడంతో నూతనోత్సాహంతో శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం మేరకు గడప గడపకూ వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించి చెబుతూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభకూ బీసీ ప్రతినిధులు పోటెత్తారు. ఏడాదికి బీసీ సబ్ ప్లాన్ కింద రూ.పది వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేస్తే.. సీఎం వైఎస్ జగన్ ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున రూ.75 వేల కోట్లు ఇస్తానని మాట ఇచ్చి మూడున్నరేళ్లలోనే అంతకంటే అధికంగా రూ.1.63 లక్షల కోట్ల ప్రయోజనాన్ని తమకు చేకూర్చారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తిరుమాను ధనుంజయ్ చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాన్ని.. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న న్యాయాన్ని ఇంటింటికీ వెళ్లి వివరించి.. 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. జయహో బీసీ మహాసభ అంచనాలకు మించి గ్రాండ్ సక్సెస్ కావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. లక్ష మందితో సభ.. ఎక్కడా స్తంభించని ట్రాఫిక్ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మందికి పైగా ప్రతినిధులు హాజరైనప్పటికీ నగరంలో ఎక్కడా ట్రాఫిక్ స్తంభించడం అంటూ జరగలేదు. పోలీసు, ఇతర శాఖల పక్కా ప్రణాళిక, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.. ప్రజల సహకారంతో ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు. వందల సంఖ్యలో వాహనాలకు పార్కింగ్ స్థలాలు వేర్వేరుగా కేటాయించడం.. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ఒక వైపున, బీఆర్టీఎస్ రోడ్డునకు ఇరువైపులా, ఏఎస్.రామారావు రోడ్డు, ఐదో నెంబరు బస్సు రూట్లలో వాహనాలను అనుమతించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. -
మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల ప్రజలను (బీసీలను) సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దుతానంటూ 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్లుగా చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నారు. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇదే అంశాన్ని వివరించి.. రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం కల్పిస్తామని బీసీలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘జయహో బీసీ’ మహాసభను వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పాల్గొని.. గత మూడున్నరేళ్లుగా బీసీలకు చేస్తున్న మేలును, రానున్న రోజుల్లో కలిగించబోయే ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ.. వారికి పేరుపేరునా ఆహ్వానపత్రికలను పంపారు. వెనుకబడిన వర్గాలే వెన్నెముక నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతోపాటు విజయవాడ నగరాన్ని వైఎస్సార్సీపీ జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విజయవాడ వారధిపై రెపరెపలాడుతున్న వైఎస్సార్సీపీ జెండాలు బీసీ డిక్లరేషన్లో చెప్పినదానికంటే అధికంగా.. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాల ప్రజలకు మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ అధిక ప్రయోజనం చేకూర్చారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తూ పేదరికం నుంచి గట్టెక్కించడం, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం, పరిపాలనలో సింహభాగం భాగస్వామ్యం కల్పించడం ద్వారా సమాజానికి వెన్నెముకలా బీసీలను తీర్చిదిద్దుతున్న అంశాన్ని సీఎం వైఎస్ జగన్ వివరించనున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదేరీతిలో ప్రయోజనం చేకూరుస్తామని భరోసా ఇవ్వనున్నారు. స్థానికసంస్థల్లో బీసీలకు 34 శాతం.. ఎస్సీ, ఎస్టీలతో కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న తమ ప్రభుత్వం జీవో జారీచేస్తే.. దీనిపై టీడీపీ నేతలను పురిగొల్పి సుప్రీం, హైకోర్టుల్లో కేసులు వేయించి.. రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించేలా చంద్రబాబు కుట్ర చేసిన తీరును వివరించనున్నారు. రిజర్వేషన్లు తగ్గించేలా చేసి బీసీ వర్గాలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచినా.. స్థానికసంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34 శాతం కంటే అధికంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తీరును గుర్తుచేయనున్నారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సీఎం వైఎస్ జగన్ల కటౌట్లు సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలన టీడీపీకి బీసీలే వెన్నెముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదు.. అంటూ మాయమాటలు చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఉదంతాలను సీఎం వైఎస్ జగన్ మరోసారి గుర్తుచేయనున్నారు. తమ హక్కులు పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించడాన్ని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగిన మత్స్యకారులను తాటతీస్తానంటూ చంద్రబాబు భయపెట్టిన తీరును గుర్తుచేయనున్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ సుప్రీంకోర్టు కొలీజియంకు చంద్రబాబు లేఖ రాయడాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపనున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. ఈ ముడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. అందులో నలుగురు బీసీలను తాము రాజ్యసభకు పంపడాన్ని గుర్తుచేయనున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీస్తే.. తాము అన్నింటా సమున్నత గౌరవం వచ్చి బీసీలు సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలిస్తున్న తీరును ముఖ్యమంత్రి వివరించనున్నారు. -
వచ్చే నెల 8న విజయవాడ లో బీసీల ఆత్మీయ సమ్మేళనం
-
YSR Congress Party: డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాలనాయుడు, వేణుగోపాలకృష్ణ, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఎమ్మెల్యేలు అనిల్కుమార్ యాదవ్, పార్థసారథి, ఎంపీ మోపిదేవి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ.. డిసెంబర్ 8న విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 10వేల మందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి సీఎం జగన్ను ఆహ్వానిస్తామని తెలిపారు. మాది బీసీల ప్రభుత్వమన్నారు. మూడున్నరేళ్లలో బీసీలకు ఎన్నో పథకాలు అందించామన్నారు. డిక్లరేషన్లోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని బీసీ నాయకులు పేర్కొన్నారు. చదవండి: (కుమారుడి వివాహానికి సీఎం జగన్ను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే) -
ఓటమి భరించలేక బీసీ నేతలపై కుట్రలు...
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఓటమి భరించలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగహ్రం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, ఈడీ, ఐటీ పేరిట బీసీ నేతలపై దాడులకు దిగిందని దుయ్యబట్టారు. గురువారం లండన్ నుంచి ఆయన ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి చేతనైతే బ్యాంకుల్లో రుణాల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా వంటి ఘరానా మోసగాళ్లను దేశానికి పట్టుకు రావాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రానైట్ వ్యాపారంలో ఉన్న మంత్రి గంగుల కుటుంబంపై కక్ష కట్టి ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల మంత్రి కాబట్టే ఆయన్ను టార్గెట్ చేశారని, గంగులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఈడీ, ఐటీలకు బెదరబోమని స్పష్టం చేశారు. అకమ్ర దాడులతో తెలంగాణ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమనేది ఈ ఘటనతో సహా ఇప్పటికే ఎన్నో మార్లు రుజువైందని మంత్రి పేర్కొన్నారు. -
అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధమని వారు సూటిగా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం చాలా హేయమని వారు వ్యాఖ్యానించారు. ఫోర్జరీ ఆరోపణలతో అయ్యన్నను సీఐడీ అరెస్టుచేసిన నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరుపై మంత్రులు బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే.. అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్న ‘అయ్యన్నపాత్రుడు నేరాలకు బీసీలకు ఏం సంబంధం ఉంది? దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్నను పోలీసులు అరెస్టుచేస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు వక్రీకరించడం అన్యాయం. అయ్యన్న చేసిన తప్పులకు అయ్యన్నే బాధ్యుడు. వాటితో బీసీలకు ఏం సంబంధం? చట్టం ఎవరికీ చుట్టంకాదు. పంట కాలువను ఆక్రమించి ఇంటి గోడను నిర్మించిన ఆయనపై సీఐడీ చట్టప్రకారమే కేసు నమోదు చేసింది. ఆక్రమించిన ఇరిగేషన్ భూమిలో ప్రహరీ నిర్మాణానికి తాను ఎన్వోసీ ఇవ్వలేదని, అయ్యన్న హైకోర్టుకు నకిలీపత్రాలు సమర్పించారని జలవనరుల శాఖ ఈఈ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యాకే అరెస్టుచేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే తప్పుచేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అయ్యన్నపాత్రునికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదు. బీసీలపై దాడి, అర్ధరాత్రి అరెస్టు అంటూ చంద్రబాబు వెకిలివాగుడు వాగుతున్నాడు. ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగల నేతలను పోలీసులు రాత్రివేళల్లోనే అదుపులోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్ని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అనడం హాస్యాస్పదం. కుట్రచేస్తే అది చంద్రబాబే చెయ్యాలి. – కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే తప్పుడు పనులకు టీడీపీ లైసెన్స్ ఇచ్చిందా? అయ్యన్నకు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆ పార్టీ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా? అరెస్టుచేసిన సమయంలో వీడియోలను పరిశీలిస్తే అయ్యన్న పోలీసులను తీవ్రస్థాయిలో బెదిరించారన్నది స్పష్టమవుతోంది. అయ్యన్న అరెస్టును బీసీలకు ముడిపెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే బీసీలు వాటిని తిప్పికొడతారు. ఇక విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా? టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ.. వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా? వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు. నారా లోకేశ్ సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని సీఎం జగన్ను, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సీఐడీ పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – తాడేపల్లిలో మీడియాతో మంత్రి బూడి ముత్యాలనాయుడు తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాద్ధాంతం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చట్టప్రకారం ఆయన్ను అరెస్టుచేస్తే బీసీలపై దాడిగా టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం హేయం. అయ్యన్న తప్పులను కాపాడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న గగ్గోలును కట్టిపెట్టాలి. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయ్యన్న అతిపెద్ద భూకబ్జాదారుడు రాష్ట్రంలో అత్యధికంగా భూకబ్జాలు చేసిన వ్యక్తి, గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడే. న్యాయస్థానాలకు తప్పుడు పత్రాలు సమర్పించి రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ చేశారు. అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోకూడదా? ఆక్రమించిన భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆయన కొడుకు రాజేష్ ఐటీడీపీ ద్వారా సీఎంను, మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫోర్జరీ చేయడం నేరం కాదా? ఒకవైపు అయ్యన్న తప్పు చేశాడంటూనే చంద్రబాబు మరోవైపు మమ్మల్ని తప్పుపట్టడం, దూషించటం ఏమిటి? ఫోర్జరీ డాక్యుమెంట్తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పుకాదా? అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పుచేస్తే అరెస్టు చేయరా? అయినా అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధం? ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. అంటే అయ్యన్న చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం చంద్రబాబుకు తప్పుకాదు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు.. కానీ కేసు పెడితే మాత్రం ఓర్చుకోలేరు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే టైమ్ కూడా మాకులేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే చంద్రబాబుకే నష్టం. – మంత్రి జోగి రమేష్ అయ్యన్న పెద్ద కబ్జా కోరు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్ద కబ్జా కోరు, గంజాయి మాఫియా నడిపే 420. ఫోర్జరీ పత్రాలతో జలవనరుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా. అవినీతికి పరాకాష్ట అయిన అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్ వెనకేసుకురావడం, గందరగోళం సృష్టించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే బీసీలను ఇబ్బంది పెడుతోందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎస్సీ, బీసీలను హేళన చేసినందుకు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు టీడీపీ తాట తీశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. – మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు -
TS: బీజేపీ క్లియర్కట్ మెసేజ్.. పట్టు దొరికిందా?
తెలంగాణాలో హిందుత్వ కార్డు ద్వారా విస్తరించాలనేది బీజేపీ గేమ్ప్లాన్. హిందుత్వ విషయంలో దూకుడుగా ఉండే బండి సంజయ్కు పార్టీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా బీజేపీ ఇప్పటికే క్లియర్కట్ మెసేజ్ ఇచ్చేసింది. హైదరాబాద్పేరును భాగ్యనగర్గా మారుస్తామంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. చార్మినార్-భాగ్యలక్ష్మి అమ్మవారి మందిరం అంశాన్ని కూడా రాబోయే ఎన్నికల్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీని ముందు నుంచీ బీజేపీ టార్గెట్ చేస్తోంది. రజాకార్ల పార్టీతో కేసీఆర్ సంబంధాలంటూ కేసీఆర్ను యాంటీ హిందూగా బీజేపీ ప్రచారం చేస్తోంది. చదవండి: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది.. రేవంత్కు ఊహించని ఫోన్ కాల్! ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సైతం కేసీఆర్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని పదే పదే విమర్శిస్తున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి యాంటీ ఎంఐఎం సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడంలో ఇప్పటికే బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. తమకంటూ బలమైన హిందుత్వ ఓటు బ్యాంక్ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు... ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కలుపుకోవాలనే ద్విముఖ వ్యూహంతో బీజేపీ ముందుకు పోతోంది. హైదరాబాద్లో నివసించే నార్త్ ఇండియన్స్ బీజేపీకి అండగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వీరి ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు తెలంగాణాలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల్లో బీజేపీకి మంచిపట్టుంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. బండి సంజయ్ లాంటి బీసికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా తమది బీసీల పార్టీ అని బీజేపీ మేసేజ్ ఇచ్చింది. ఇప్పటికే ఓబీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానిగా ఉండటంతో.. సహజంగానే ఆ పార్టీకి తెలంగాణా బీసీల్లో పట్టుదొరికే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణా రాజకీయ చరిత్ర చూస్తే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలందరూ ఏకపక్షంగా ఒకే పార్టీకి ఓటువేసిన ఉదాహరణలు చాలా తక్కువ. స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్ధులను బట్టి బీసీ కులాల ఓటింగ్ మారుతూ ఉంటుంది. దీనికోసం బీజేపీ వివిధ సామాజిక వర్గాలకు చెందిన బలమైన బీసీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర తెలంగాణాలో బలమైన బీసీ సామాజికవర్గం అయిన మున్నూరు కాపులకు కమలం పార్టీలో కీలక పదవులున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లాంటి మున్నూరు కాపునేతలకు పార్టీలో మంచి గౌరవం దక్కింది. ఇక ఈటలను చేర్చుకోవడం ద్వారా ముదిరాజ్ ఓటుబ్యాంకు తమవైపే ఉందని బీజేపీ అంటోంది. -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన బీసీ సంఘాల ప్రతినిధులు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీ సంఘాల ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ జనగణనపై శాసనసభలో తీర్మానం చేసిన సందర్భంగా సీఎం జగన్కు వారు ధన్యవాదాలు తెలిపి, సత్కరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి కన్నా మాష్టారు, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి హనుమంతరావు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె క్రాంతి కుమార్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వారితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, ఆర్ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన్రావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ‘కట్ట’లు తెగిన అసహనం.. పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయం -
సీఎం జగన్కు బీసీ నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీ నేతలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్ను బుధవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, వెనుకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు. -
బీసీ కులాల జనగణన తక్షణమే చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీ కులాల గణన కూడా చేపట్టాలని పలు బీసీ సంఘాలు కోరాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో పలువురు బీసీ సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో దిల్కుషా అతిథిగృహంలో భేటీ అయ్యారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా 1931లో జనగణన చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆ లెక్కలు తీయలేదని బీసీ సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2011లో యూపీఏ హయాంలో కులాలవారీగా తీసిన లెక్కలను కూడా నేటి వరకు ప్రకటించలేదని చెప్పారు. కులగణన చేపట్టాలని బిహార్, ఒడిశా, తమిళనాడు అసెంబ్లీలు తీర్మానం చేశాయని, దేశంలోని 18 రాజకీయ పార్టీలు కూడా కులగణనకు మద్దతు ప్రకటిస్తూ ప్రధానికి లేఖలు రాశాయని వివరించారు. అనంతరం బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి కిషన్రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేబినెట్ మంత్రి హోదాలో ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కిషన్రెడ్డి కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు కనకాల శ్యామ్ కురుమ, తాటికొండ విక్రంగౌడ్, రావుల్కోల్ నరేశ్, మణిమంజరి, వరికుప్పల మధు, శివారాణి, బండిగారి రాజు, వెంకట్ తదితరులున్నారు. -
'ఏపీ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం'
సాక్షి, అమరావతి : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం సాక్షి టీవీతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ఎవరు కూడా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోలేదు.ఇతర రాష్ట్రాల్లో బీసీ లు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరూ కూడా ఇలా కార్పొరేషన్ లకు బీసీలను నియమించలేదు. బీసీలకు నాయకత్వం ఇవ్వడం శుభపరిణామం. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తారు. సమగ్రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇంత చిన్న వయస్సులో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా ఎవరు ఎదగకూడదు అనే మాత్రమే చూశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు..బీసీ కార్పొరేషన్ లలో మహిళలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధి, బీసీల సమగ్రాభివృద్ధి పట్ల సీఎం జగన్ ఉన్న కృషిని గర్వించదగ్గ విశేషం. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ... చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోవడం హర్షనీయం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి అడుగు వేస్తున్నారు.కర్నూలు జిల్లా ను బిసి జిల్లా గా మార్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది.అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు.33 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు ఉపయోగించారు.10 వేల కోట్ల రూపాయలను బిసిలకు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు బిసిలను మోసం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్య కానుకలను అందిస్తున్నారు.108,104 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేసి, కరోనా వైరస్ సమయంలో కూడా ఉచితంగా సేవలందిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలకు 670 డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బీసీ కార్పొరేషన్ లలో 50 శాతం మహిళలకు కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం విశేషం. (చదవండి : ‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’) పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీ గర్జనలో ఇచ్చిన మాటను వైఎస్ జగన్ ఈ రోజు అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చేయూత క్రితం సహాయం అందిస్తున్నారు. చెప్పిన మాట అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన అప్పటి నుంచి ఇలాంటి నిర్ణయాలు నేను చూడలేదు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ జగన్.56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బీసీల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, పూలే కళలు కన్న కలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు.బాబు వస్తే జాబు వస్తుంది చెప్పి మోసం చేశాడు చంద్రబాబు, యువభేరి లో చంద్రబాబు ను ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు, బెదిరింపు చేశారు. ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్య ఇచ్చారు.బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, డైరెక్టర్లను కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. -
‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’
సాక్షి, విశాఖపట్నం : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్, పార్టీనేతలు లేళ్ల అప్పిరెడ్డి, చల్లపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..) సీఎం జగన్కు ధన్యవాదాలు బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా నుంచి నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంతో బీసీలందరూ పండగ చేసుకుంటున్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు సీఎం జగన్ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది అని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీల గుండెల్లో చిరస్థాయిగా సీఎం జగన్ నిలిచిపోతారని పేర్కొన్నారు. -
జెండాను మోస్తున్నాం... అజెండా నిర్ణయిస్తాం
సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్రంలో 52 శాతం జనాభా మాదే. మా వర్గాలకు చెందిన కార్యకర్తలే పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. పార్టీ జెండాను తరాల నుంచి మో స్తున్న మాకు తగిన ప్రాధాన్యం కల్పించాలి.పీసీసీ అధ్యక్షులుగా బీసీ నేతలున్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తించాలి. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఏఐసీసీ కమిటీల్లో తెలంగాణకు చెందిన బీసీ నేతలకు అవకాశమివ్వాలి. అన్ని పార్టీ కమిటీల్లోనూ మాకు జనాభా ప్రాతిపదికన పదవు లు కేటాయించాలి. తద్వారా బీసీల పక్షాన కాంగ్రెస్ నిలబడుతుందని రాష్ట్రంలోని ఆ వర్గం ప్రజలకు భరోసా ఇవ్వాలి.’అని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లోని ఓ హోటల్లో 100 మందికి పైగా బీసీ నేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్. పులిజాల వినయ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్. దాసోజు శ్రావణ్కుమార్, కాసాని జ్ఞానేశ్వర్లతో పాటు పీసీసీ కార్యవర్గ స భ్యులు, పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పూలేకు నివాళులర్పించిన అనంతరం రాష్ట్ర కాంగ్రెస్లో బీసీలకు సాధి కారత అనే అంశంపైనే ఎక్కువగా చర్చిం చారు. అధికార టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోందని, కొందరికి మంత్రి పదవులు, ఎంపీలుగా అవకాశాలిస్తోందని, బీజేపీ కూడా బీసీ నేతను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంతో పాటు జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి బీసీ వర్గాలను ఆకర్షితులను చేసుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇలాంటి సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ కూడా బీసీలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. వారి సమస్యలపై పార్టీ పక్షాన ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని, పార్టీ కార్యక్రమాల్లో బీసీలను విస్తృతంగా భాగస్వాములు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. అనంతరం పార్టీని అధికారంలోకి తీ సుకురావాలంటే బీసీ లకు సాధికారత ఇవ్వాలని, టీపీసీసీ అధ్యక్ష పదవితో పాటు అన్ని పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యం కల్పించాలని, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని, బీసీ క్రీమీలేయర్ ఎత్తివేయాలని, సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సమావేశం తీర్మానించింది. -
రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీసీ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపించేందుకు బీసీ నేతలు సిద్ధ్దమవుతున్నారు. అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. బీసీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ ఉద్యమాలు రాష్ట్ర స్థాయికే పరిమితం కావటం వల్ల ఉపయోగం ఉండటం లేదని, వాటిని ఢిల్లీ స్థాయికి విస్తరిస్తేనే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్లోని సరూర్నగర్లో ఈ నెల 7న ‘జాతీయ ఓబీసీ మహాసభ’నిర్వహించనున్నారు. ఈ సభకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. 7న ఉదయం 11 నుంచి జరగనున్న ఈ సభకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. 29 రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ సమన్వయపరుస్తుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను జాజుల ఆదివారం ఆవిష్కరించారు. కాగా, జాతీయ ఓబీసీ మహాసభ అనంతరం దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ సభలో చేసిన తీర్మానాలపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీలకు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నాయి. హైదరాబాద్లో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ నాలుగోది. మొదటి సభను నాగ్పూర్లో నిర్వహించగా, రెండోది ఢిల్లీలో, మూడోది ముంబైలో నిర్వహించినట్లు జాజుల తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఆయన మాటల్లోనే.. - 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు మినహా అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో బీసీలు మినహా మిగతా అన్ని కులాలకు చెందిన వారు చట్టసభల్లో కాలుపెట్టారు. బీసీల్లోని వందల కులాలు ఇప్పటికీ చట్టసభల ముఖం చూడలేదు. ఈ నేపథ్యంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్. - దేశ జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి బీసీని మంత్రిగా నియమించాలి. - ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ బీసీలకు మాత్రం పరిమితులు, 50 శాతం సీలింగ్ను చూపి దాటవేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. దాన్ని చట్టసభల్లో, ఉద్యోగుల పదోన్నతుల్లో అమలు చేయాలి. - బీసీ జనాభాను కులాల వారీగా వర్గీకరించాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా కేంద్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలు విభజించి ఆయా కేటగిరీల్లోకి కులాలను నిర్దేశించి సమప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీలపై ఉన్న క్రిమీలేయర్ను ఎత్తివేయాలి. -
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచుతాం..
సాక్షి, అమరావతి: బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి అన్ని అవకాశాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని బీసీ ప్రతినిధుల బృందం పేర్కొంది. శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్ను జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, జాతీయ ఓబీసీ మహా సభ నిర్వహణ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీసీల క్రీమిలేయర్ రద్దు, బీసీ జనగణన నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతం అమలు చేయాలని, చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని, అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్లను ప్రారంభించాలని సీఎంను కోరినట్లు వారు తెలిపారు. మొత్తం 15 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బీసీ మేధావులు, బీసీ సంఘాలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం కోరారన్నారు. ఆగస్టు 7న హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని సీఎంను ఆహ్వానించినట్లు బీసీ నేతలు చెప్పారు. జాతీయ ఓబీసీ మహాసభ అధ్యక్షుడు కేసన శంకరరావు, కె.ఆల్మేన్ రాజులు, కన్నా మాష్టారు, వెంకటేశ్వర్లు, కిషోర్, రంగనాథ్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, పరమశివం, గుండాల నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలను మించి లబ్ధి
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నవ శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారని బీసీ సంఘాల నేతలు, ప్రముఖులు కొనియాడుతున్నారు. రాజ్యాధికారంలో బీసీలకు సింహభాగం కల్పించడమే కాకుండా.. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిచ్చారని ప్రశంసిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికకు మేనిఫెస్టోలో చెప్పినదానికంటే అధికంగా నిధుల కేటాయింపుతో చరిత్ర తిరగరాశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ (రిటైర్డ్), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వంటి ప్రముఖులతోపాటు బీసీ కులాల ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాధికారం అంటే ఇదీ.. బీసీలకు నిజమైన రాజ్యాధికారం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపించారని బీసీ సామాజికవర్గ ప్రముఖులు కొనియాడుతున్నారు. అందుకు ఆయన మంత్రివర్గ కూర్పే నిదర్శనమని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం కేటాయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆ వర్గాలకు తన మంత్రివర్గంలో ఏకంగా 60 శాతం పదవులు కేటాయించారు. అంతేకాకుండా బీసీవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన మంత్రులకు కీలకమైన శాఖలను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, ఆర్ అండ్ బి, కార్మిక శాఖలను ఆ వర్గాలకు ఇచ్చారు. అతి ముఖ్యమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు ఇవ్వడం విశేషం. ఇక మీదట నియమించనున్న అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తామని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా స్పష్టమవడంతో ఆ వర్గాలకు ఆనందం కలిగిస్తోంది. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని వైఎస్సార్సీపీ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని ఆర్.కృష్ణయ్య ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో బీసీ పార్టీలని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఇంత వరకు ఆ దిశగా ప్రయత్నించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక న్యాయ సాధన కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు తమ పార్టీ ద్వారా బిల్లును ప్రవేశపెట్టడం మంచి పరిణామమన్నారు. ఆయన ప్రయత్నం దేశంలో చర్చకు దారి తీసిందని, సామాజిక న్యాయ సాధనకు ముందడుగు వేశారని ప్రశంసించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే అధికం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ బడ్జెట్లో నిధులు కేటాయించారని బీసీ వర్గాలు కొనియాడుతున్నాయి. బీసీ ఉప ప్రణాళికకు ఏటా రూ.15 వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అంతకంటే కొంచెం ఎక్కువగానే 2019–20 బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి చెప్పారు. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం కేటాయించిన దానికంటే 23.46 శాతం అధికంగా కేటాయించడం విశేషం. బీసీల సంక్షేమానికి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షించారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) అన్నారు. కార్పొరేషన్లతో 139 కులాలకు నేరుగా లబ్ధి బీసీ కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన కార్యాచరణ చేపట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. ప్రస్తుతం ఏపీలో 29 బీసీ కులాలకే ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. దాంతో ఆయా ఉప కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతూ వచ్చింది. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అన్నట్లుగానే బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తొలి బడ్జెట్లోనే ప్రకటించింది. అంటే కొత్తగా మరో 110 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఆయా బీసీ ఉప కులాల్లోని లబ్ధిదారులకు అందించడం సాధ్యపడుతుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళలకు నాలుగు విడతలుగా ఇచ్చే రూ.75 వేలను ఈ కొత్త కార్పొరేషన్ల ద్వారానే అందిస్తారు. దళారుల బెడద లేకుండా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధిదారులకు సకాలంలో అందుతాయి. ఇది బీసీలందరికీ ప్రయోజనం కలిగిస్తుందని బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో సగం బీసీలకే ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా బీసీలకే అత్యధికంగా లబ్ధి కలిగేలా ప్రభుత్వ పథకాలను సీఎం వైఎస్ జగన్ రూపొందించారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల్లోను దాదాపు 50 శాతం మంది లబ్ధిదారులు బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నందున ఈ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించిందనడానికి నిదర్శనమన్నారు. అందులో అత్యధికంగా విద్య, ఉపాధి కల్పనకు సంబంధించిన పథకాలు ఉండటం బీసీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, సామాజిక పింఛన్లు, కౌలు రైతుల సంక్షేమం.. ఇలా అన్ని పథకాల్లోనూ సగం మంది లబ్ధిదారులు బీసీలేనన్నది సుస్పష్టం. ఈ దృష్ట్యా ప్రధానంగా బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి సీఎం వైఎస్ జగన్ బాసటగా నిలిచారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) ప్రశంసించారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి, కాలేజీలకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు. తద్వారా రాష్ట్రంలో 4.50 లక్షల మంది తల్లులకు ప్రయోజనం కలగనుంది. వారిలో దాదాపు 50 శాతం అంటే 2 లక్షల మందికిపైగా బీసీలు ఉన్నారు. వారి కోసమే రూ.1,294.73 కోట్లు కేటాయించడం విశేషం. ఇక వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.20 వేలు చొప్పున చెల్లిస్తారు. తద్వారా రాష్ట్రంలో 15,35,911 మంది విద్యార్థుల తల్లులకు ఊరట కలుగుతుంది. వారిలో దాదాపు 7.82 లక్షల మంది బీసీ వర్గాలకు చెందినవారే ఉంటారని అధికారుల అంచనా. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. అందుకోసం ఏకంగా రూ.3,151.74 కోట్లు కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బీసీ రైతులకు బాసట బీసీ రైతుల కష్టాలు తీర్చడం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. చరిత్రలో తొలిసారి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 ఆర్థిక సహాయం చేస్తారు. దాంతో రాష్ట్రంలో 64.07లక్షల మంది రైతులు, 15.37 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కలగనుంది. రైతుల్లో దాదాపు 40 శాతం మంది, కౌలు రైతుల్లో 50 శాతం మంది బీసీలే ఉన్నారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దాంతో రైతు భరోసా పథకం ద్వారా దాదాపు 26 లక్షల మంది బీసీ రైతులు, దాదాపు 8 లక్షల మంది బీసీ కౌలు రైతులకు లబ్ధి చేకూరనుంది. పింఛన్ల ద్వారా భారీగా లబ్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పెంపు ద్వారా బీసీల సామాజిక భద్రతకు అండగా నిలిచిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కొనియాడారు. సామాజిక పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మొదటి దశగా ఈ ఏడాది రూ.2,250కు పెంచింది. అంతే కాకుండా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. తలసేమియా, పక్షవాతం, కుష్టు రోగులు, డయాలసిస్ పేషంట్లకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న 53.32 లక్షల మందికి అదనంగా మరో 11.20 లక్షల మంది అర్హులవుతారు. అంటే సామాజిక పింఛన్ల లబ్ధిదారులు 64.52 లక్షల మందిలో దాదాపు 30 లక్షల మంది బీసీలే ఉంటారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతేకాకుండా బీసీ కమిషన్ను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు సామాజిక న్యాయం త్వరితగతిన సాధ్యమవుతుందని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. మనసున్న ప్రభుత్వం.. బీసీల సంక్షేమం అంటే చంద్రబాబులా కేవలం నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదు.. వారికి ఆర్థిక స్వావలంబన కలిగిస్తానని సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రలో తరచూ చెప్పేవారు. అన్నట్లుగానే సీఎం కాగానే తొలి బడ్జెట్లో బీసీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి పెద్దపీట వేశారు. బీసీల్లోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్ను ప్రవేశ పెట్టి కుల వృత్తులకు అండగా నిలిచారు. మత్య్సకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు.. ఇలా అన్ని బీసీ కులాల సంక్షేమానికి ఉపక్రమించారు. దర్జీలు, ఆటో డ్రైవర్లు.. ఇలా బీసీలే అత్యధికంగా ఉండే వివిధ కార్మిక వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. ఇక జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, సామాజిక పింఛన్లు.. ఇలా అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ 50 శాతం వరకు బీసీలకే లబ్ధి చేకూరునుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మత్స్యకారులకు వరాలు పొడవైన తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న మత్స్యకారులపై సీఎం వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారని విశాఖ కోస్టల్ మెక్నైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బర్రి కొండ బాబు సంతోషం వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 లక్షల మంది జీవితాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న భృతి రూ.4 వేలను ఏకంగా రూ.10 వేలకు పెంచారు. అందుకోసం రూ.100 కోట్లు కేటాయించారు. దాంతో మత్స్యకార కుటుంబాల్లో ధైర్యాన్ని కల్పించారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్ల డీజిల్పై రాయితీని రూ.6.03 నుంచి రూ.12.93కు పెంచారు. దాంతో బోటు యజమానులైన మత్స్యకారులకు భరోసా కలిగిందని రాజు అనే మత్స్యకారుడు ఆనందంతో చెప్పారు. చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు అందిస్తామని ప్రకటించారు. తద్వారా దాదాపు లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. కుల వృత్తులపై ఆధారపడిన నాయిబ్రాహ్మణ, రజక కుటుంబాలకు ఏటా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 1.92 లక్షల మంది రజకులు, 23 వేల మంది నాయిబ్రాహ్మణులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ బీమా పథకంతో బీసీ కుటుంబాలకు భరోసా కలిగించారు. బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వైఎస్సార్ కల్యాణ కానుక పథకం ద్వారా బీసీ యువతుల వివాహానికి ప్రభుత్వం చేయూతనివ్వనుంది. ఒక్కో వధువుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఒక్క 2019–20లో 75 వేల మంది వధువులకు ప్రయోజనం కలుగుతుంది. -
చీరాల్లో వలస నేతలు.!
సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రస్తుతం చీరాల టీడీపీ నేతలు వలస నేతలతో నిండిపోయింది. పదుల సంఖ్యలో వాహనాల్లో వలస నేతలు హల్చల్ చేస్తున్నారు. ఎక్కడి వారో, ఊరివారో తెలియదు కాని చీరాల నియోజకవర్గాన్ని వలస నేతలు తిప్పేస్తున్నారు. ఒంగోలు, అద్దంకితో పాటు కొందరు హైదరాబాద్ నుంచి కూడా దిగుమతి అయ్యారు. పట్టణంలోని 33 మున్సిపల్ వార్డులతో పాటు నియోజకవర్గంలోని 24 గ్రామ పంచాయతీలకు వలస నాయకులనే ఇన్చార్జులుగా నియమించారు. కార్యకర్తలకు అవసరమైన రోజువారీ ఖర్చులు, ఓటర్ల జాబితాలు పట్టుకుని వార్డు, గ్రామం ఇన్చార్జులమని స్థానిక టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీన్ని ఎప్పటి నుంచే టీడీపీని అంటిపట్టుకున్న టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిసారీ అన్నీతామై చూసుకునే మేము ఈ ఎన్నికల్లో మాత్రం వలస నేతలు చెప్పిందే చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. టీడీపీ చీరాల అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరణం బలరాంను చీరాల అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన వెంటనే అద్దంకి నుంచి రాజకీయాలు నిర్వహిస్తున్న బలరాంను ఆగమేఘాల మీద చీరాలకు పంపించారు. అప్పటి వరకు చీరాల టీడీపీలో బీసీ నినాదం నడుస్తోంది. పలువురు బీసీ నేతలు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బీసీ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన బలరాంనే చీరాలకు కేటాయించారు. దీంతో వలస నేతల ప్రభావం పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు చీరల్లో నాయకులుగా చలామణి అవుతున్నారు. బలరాం కూడా స్థానిక నేతలతో కాని, గ్రామస్థాయి క్రియాశీలక నేతలతో పరిచయాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణపై స్థానిక నేతలను నమ్ముకోకుండా కేవలం బలరాం తనకున్న ముఖ్యమైన వ్యక్తులందరిని చీరాలకు తీసుకువచ్చి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. వారినే గ్రామాలకు, వార్డులకు ఇన్చార్జులుగా నియమించుకుని పార్టీ కార్యకలాపాలను చేయిస్తున్నారు. ఎన్నికల్లో కార్యకర్తలతో మాట్లాడంతో, డబ్బుల పంపకాలు, ప్రచార వ్యవహారాలను వారే నిర్వహిస్తుండటంతో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్థానిక నేతలు నొచ్చుకుంటున్నారు. ఇన్నేళ్లుగా టీడీపీ కోసం పనిచేసిన తమను కాదని బయటి ఊర్ల నుంచి వచ్చిన వలస నేతలను తమపై పెత్తనం చెలాయించేలా చేయడం ఏటని బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. -
‘బీసీ రిజర్వేషన్ల తగ్గింపు దుర్మార్గం’
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి అమలు చేయడం దుర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్థాయిలలో బీసీల నాయకత్వం ఎదగకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్లలో ఆరు చైర్మన్లు, 550 మండల పరిషత్ చైర్మన్లలో 94 చైర్మన్లు ఏ లెక్కన ఇస్తారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల తగ్గింపునకు వ్యతిరేకంగా అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీ’ల నారాజ్..!
సాక్షి, జనగామ: జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లలో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు దక్కాయి. జిల్లావ్యాప్తంగా 12 జెడ్పీటీసీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్ర మే బీసీ మహిళకు కేటాయిం చారు. 12 ఎంపీపీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్రమే బీసీలకు కేటాయించారు. రెండు మండలాల్లో నిల్.. జిల్లా వ్యాప్తంగా 140 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 18 మాత్రమే దక్కాయి. నర్మెట, కొడకండ్ల మండలాల్లో బీసీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. నర్మెటలో ఏడు, కొడకండ్లలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక్కటి కూడా బీసీలకు దక్కలేదు. దీంతో ఈ రెండు మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుం డాపోయింది. చిల్పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, తరిగొప్పుల మండలాల్లో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు రిజర్వయ్యాయి. బచ్చన్నపేట మండలంలో మాత్రం బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. బచ్చన్నపేటలో జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు బీసీలకే దక్కాయి. అత్యధికంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కడం విశేషం. బీసీలకు కేటాయించిన స్థానాలు బచ్చన్నపేట జెడ్పీటీసీ బీసీ మహిళ బచ్చన్నపేట ఎంపీపీ బీసీ మహిళ బీసీలకు కేటాయించిన ఎంపీటీసీ స్థానాలు.. చిల్పూర్ (బీసీ మహిళ) బచ్చన్నపేట–1(చిల్పూర్) (బీసీ జనరల్) కేశిరెడ్డిపల్లి(చిల్పూర్) (బీసీ జనరల్) కొన్నె(చిల్పూర్) (బీసీ మహిళ) లింగంపల్లి (చిల్పూర్) (బీసీ మహిళ) కోలుకొండ(దేవరుప్పుల) (బీసీ మహిళ) స్టేషన్ ఘన్పూర్–1(దేవరుప్పుల) (బీసీ జనరల్), ఇప్పగూడెం(దేవరుప్పుల) (బీసీ మహిళ) గానుపహాడ్(జనగామ) (బీసీ మహిళ) పెంబర్తి(జనగామ) (బీసీ జనరల్) నవాబుపేట(జనగామ) (బీసీ జనరల్) మాణిక్యపురం(జనగామ) (బీసీ మహిళ) జఫర్గఢ్–1(జనగామ) (బీసీ మహిళ) తమ్మడపల్లి (జి)(జనగామ) (బీసీ జనరల్) అబ్ధుల్నాగారం(తరిగొప్పుల) (బీసీ మహిళ) గబ్బెట(రఘునాథపల్లి) (బీసీ మహిళ) పాలకుర్తి–1(రఘునాథపల్లి) (బీసీ మహిళ) లక్ష్మీనారాయణపురం(రఘునాథపల్లి) (బీసీ జనరల్) నిరాశలో బీసీ నేతలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లలో తక్కువ స్థానాలు రిజర్వు కావడంతో బీసీ నాయకులను నిరాశ పర్చింది. ప్రధాన పార్టీల్లో బీసీలు ద్వితీయ శ్రేణి నాయకులుగా రాణిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికై ప్రజలకు సేవ చేద్దామని ఆలోచించిన బీసీ నాయకులకు రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఆశ నిరాశగా మారింది. దీంతో మెజార్టీ బీసీ నాయకులు పోటీకి దూరం కావాల్సి రావడంతో నారాజ్ అవుతున్నారు. -
పదవులన్నీ ఆ వర్గానికేనా
సాక్షి, అమరావతి: పేదరికమే తన కులమంటూ తరచూ సినీ డైలాగులు వల్లించే ముఖ్యమంత్రి చంద్రబాబు నిజానికి అధికారం చేపట్టిన నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో పార్టీ, ప్రభుత్వంలో తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని టీడీపీకే చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. రాజ్యసభ సభ్యత్వం నుంచి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు చివరికి పార్టీ పదవుల్లోనూ సీఎం తన సొంత సామాజిక వర్గానికే అగ్రతాంబూలం కల్పించారు. తనవర్గం వారికివ్వగా మిగిలిన పదవులనే ఇతరులకు బిస్కెట్ల మాదిరిగా వేశారనే అభిప్రాయం పార్టీలోనే బలంగా వ్యక్తమవుతోంది. టీడీపీలో సీఎం సామాజికవర్గం మినహా మిగతావారు కీలక పదవి దక్కించుకోవాలంటే మోకాళ్లు అరిగిపోయేలా తిరగాల్సిందేనని విజయవాడకు చెందిన ఒక బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఒకవేళ అంత తిరిగినా గ్యారంటీ ఉండదని, సీఎం సామాజిక వర్గం అండదండలు ఉంటేనే పదవి వరిస్తుందనే అభిప్రాయం టీడీపీలో దిగువ స్థాయి నుంచి పైస్థాయి వరకూ వ్యక్తమవుతోంది. శాసనమండలిలోనూ 40 శాతం తనవారికే శాసనమండలిలో టీడీపీకి 30 మంది ఎమ్మెల్సీలు ఉండగా సీఎం సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్, వైవీబీ రాజేంద్రపసాద్, నారా లోకేష్, గాలి సరస్వతమ్మ, వీవీవీ చౌదరి, కరణం బలరామకృష్ణమూర్తి, దొరబాబు (బీఎన్ రాజసింహులు), టీడీ జనార్థన్లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన కేశవ్ను ఎమ్మెల్సీగా చేయడమే కాకుండామండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. లోకేష్కు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎమ్మెల్సీ పదవితోపాటు మంత్రిని చేసి కీలక శాఖలిచ్చారు. వీవీవీ చౌదరి, టీడీ జనార్థన్లు చంద్రబాబు కోటరీలో అత్యంత ముఖ్యులు. పార్టీ పదవులు, ఇతర వ్యవహారాలన్నీ వీరే చక్కబెడతారు. అందువల్లే వారికి ప్రజలతో సంబంధం లేకపోయినా ఎమ్మెల్సీలను చేశారు. కొద్ది నెలల క్రితం మృతి చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చంద్రబాబుకు బంధువు, ఆప్తుడు. ఇలా శాసన మండలిలో 40 శాతం మంది తన మనుషులకే చంద్రబాబు అవకాశం కల్పించారు. ఐదుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు తనవారే ప్రస్తుతం టీడీపీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులుంటే అందులో ఇద్దరు చంద్రబాబు సామాజికవర్గం వారే ఉన్నారు. సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్లు చంద్రబాబు కోటగిరీలో కీలక వ్యక్తులు. కనకమేడల కోసం దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్యను చంద్రబాబు పక్కనబెట్టారు. దళితుల నుంచి వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే రామయ్యకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారే తప్ప ఆ వర్గంపై బాబుకు ఏమాత్రం అభిమానం లేదని చెబుతారు. నిజంగానే అభిమానం ఉంటే రామయ్యను రాజ్యసభకు పంపి ఉండేవారని పార్టీలోనే చాలా రోజులు చర్చ జరిగింది. ఇక ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావు సైతం సీఎం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. తెలుగు యువత, కార్పొరేషన్లూ వారికే.. పార్టీ పదవుల్లో చంద్రబాబు తన సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ఇటీవలే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి స్థానంలో తన వర్గానికే చెందిన దేవినేని అవినాష్ను కూర్చోబెట్టారు. టీఎన్ఎస్ఎఫ్ బ్రహ్మం చౌదరి, ఐటీ వింగ్ బ్రహ్మం చౌదరి, లీగల్ సెల్ గొట్టిపాటి శివరామకృష్ణప్రసాద్, స్వచ్ఛాంద్ర మిషన్ ఛైర్మన్ సీఎల్ వెంకట్రావు, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దివి శివరాం, గిడ్డంగుల సంస్థ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, 20 సూత్రాల పథకం ఛైర్మన్ శేషసాయిబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, శ్యాప్ ఛైర్మన్ అంకమ్మ చౌదరి, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్గా తన సామాజిక వర్గానికి చెందిన కోటేశ్వరరావును నియమించారు. సిఫారసు లేఖలు ఉంటేనే.. పదవుల పంపిణీలో చంద్రబాబు తనవారికే ప్రాధాన్యమిస్తుండడంపై పార్టీలో మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పైస్థాయిలో ముఖ్య నాయకులకు అరకొరగా పదవులిచ్చి మిగిలిన వాళ్ల నోళ్లు మూయించారు. పార్టీని భుజానెత్తుకుని మోస్తున్న తమను గుర్తించడంలేదని, ఐదేళ్లుగా ఎదురు చూపులతోనే కాలం గడిచిపోయిందని పలువురు వాపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం కిందిస్థాయి నాయకులకు సూచించడంతో వేల సంఖ్యలో వచ్చాయి. అయితే వీటిని పక్కనపడేసి స్థానిక ఎమ్మెల్యే / పార్టీ ఇన్ఛార్జి సిఫారసు చేసిన వారి పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంతేకాదు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల సిఫారసు లేఖలు కూడా అడుగుతున్నారు. ఈ పదవులన్నీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ సూచనల ప్రకారమే పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో 16 మార్కెట్ కమిటీలకుగానూ 13 పదవులను సీఎం సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం గమనార్హం. తప్పనిసరి అయితేనే... టీడీపీలో కులానికే ప్రథమ ప్రాధాన్యమనే విషయం జగమెరిగిన సత్యమని పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు వల్లించినా పాటించేది మాత్రం కుల సూత్రాన్నే అని స్పష్టం చేస్తున్నారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారైతే సీఎంవోలో అయినా, పార్టీ కార్యాలయమైనా, చంద్రబాబు ఇంటి వద్దైనా ఆత్మీయత కనపడుతుంది. మిగిలిన వారి పట్ల అవసరం, పరిస్థితులను బట్టి కపట ప్రేమను ఒలకబోస్తుంటారని పార్టీకి చెందిన ఇతర నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ఖాకీవనంలో ‘కుల’కలం! సీఎం ‘సొంత’ లాభం! -
బీసీ డిక్లరేషన్.. వైఎస్ జగన్కు కృతఙ్ఞతలు
-
‘చట్టసభల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : అన్ని రంగాల్లో జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం శనివారం జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... ‘అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి.చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే బీసీలకు ప్రాతినిథ్యం ఉంది. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా బీసీలకు తమ వాటా దక్కలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. -
చంద్రబాబు వైఎస్సార్ సీపీ నవరత్నాలు కాపీ కొడుతున్నారు
-
ఫిబ్రవరి 19న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్లో బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పలు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల స్థితిగతులను, జీవన ప్రమాణాలను తెలుసుకునే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర క్రితం బీసీ అధ్యయన కమిటీ నియమించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని, అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్ జగన్కు అందజేశామని పేర్కొన్నారు. వాటి గురించి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో సమీక్షించారని తెలిపారు. (పార్టీ బీసీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ) నవరత్నాలు కాపీ కొడుతున్నారు.. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు.. వాటినే మళ్లీ కొత్తగా చెబుతున్నారని కృష్ణమూర్తి మండిపడ్డారు. 2014 మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను టీడీపీ ఏమేరకు అమలు చేసిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బీసీలను అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రలోభ పెట్టి, వారి ఓట్లు వేయించుకుని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని.. ఈ విషయాన్ని స్వయంగా జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారని పేర్కొన్నారు. బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేసిన చంద్రబాబుకు జయహో బీసీ అనే అర్హత లేదని విమర్శించారు. తమ అధ్యయనంలో భాగంగా సంచార జాతులను కూడా కలిశామని.. కొంత మంది బీసీలకు తమ కులం ఏమిటో కూడా స్పష్టంగా తెలియదనడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు.. ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప బీసీల పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి విమర్శించారు. మెడికల్ సీట్ల విషయంలో బీసీలు నష్టపోతున్నా టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఫీజు రియంబర్స్మెంట్పై ఒక్కమాట కూడా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రతి కాబినెట్ మీటింగ్లో భూములు, ఇసుక గురించి చర్చించారు.. ఒక్క బీసీకైనా ఎకరా భూమి కేటాయించారా అని ప్రశ్నించారు. బీసీల జీవితాలు మార్చడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై కేటీఆర్.. జగన్ని కలిస్తే నిస్సిగ్గుగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పథకాలనే కాపీ కొడుతున్న చంద్రబాబుకు అసలు సిగ్గుందా అంటూ ధ్వజమెత్తారు. -
పార్టీ పదవుల్లో సముచిత స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టికెట్లు దక్కని నేతలకు పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో సముచితస్థానం కల్పించి న్యాయం చేస్తా మని ఆశావహులకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్.సి.కుంతియా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. టికెట్ల కేటాయింపులో బీసీ లకు అన్యాయం జరుగుతోందని పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం నిరాహార దీక్షకు దిగారు. కొల్లాపూర్ బరిలో నిలవాలనుకుంటున్న మాజీమంత్రి చిత్తరంజన్దాస్ భవన్లోని వసతి గృహంలోనే దీక్షకు దిగారు. షాద్నగర్ పై ఆశలు పెట్టుకున్న కడియం పల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవరకద్ర సీటు ఆశిస్తున్న ప్రదీప్ గౌడ్లు భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగా రు. కుంతియా అక్కడికి చేరుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ బీసీలకు 19 సీట్లు ఇస్తే కాంగ్రెస్ 94 స్థానాలకుగాను 22 సీట్లు ఇవ్వనుందన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బీసీ సంఘాల నేతలు
-
వైఎస్సార్సీపీలో చేరిన బీసీ సంఘాల నేతలు
సాక్షి, సాలూరు: ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాజమండ్రికి చెందిన బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకుడు, శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీసైన, యాత కులాల రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, ఆయన తనయుడు మార్గాని భరత్లు పార్టీలో చేరారు. వీరికి కండువా వేసి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జననేత మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికీ వైఎస్సార్సీపీ కృషి చేస్తుందన్నారు. రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇస్తామని ఇదివరకే ప్రకటించామని, ఈ ప్రకటనతో బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. అందులో భాగంగానే బీసీ నేతలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మార్గాని నాగేశ్వరరావు, భరత్లతో పాటు పార్టీలో చేరిన బీసీ నేతలను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు.. అందుకు తగిన కృషి చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాత్కలిక విరామం అనంతరం జననేత ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. జననేతతో అడుగులో అడుగేసెందుకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబుపై భూమన ఫైర్ చంద్రబాబు ప్రభుత్వం రాక్షస రాజకీయానికి పాల్పడుతూ, వికృత క్రీడలు ఆడుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. అప్రతిహసంగా కొనసాగుతున్న పాదయాత్రను చూసి ఓర్వలేక... హత్యాయత్నం చేయించారని భూమన ఆరోపించారు. కుట్ర రాజకీయాలను ఛేదించి తిరిగి తమ వద్దకు వచ్చిన వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. -
బీసీ వ్యక్తిని కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలి
-
ఢిల్లీలో కాంగ్రెస్ ఆశావహుల ఆందోళన
ఢిల్లీ: తెలంగాణ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ఆందోళనకు దిగారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు కనీసం 40 సీట్లు కేటాయించి, సీఎం అభ్యర్థిగా బీసీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ నేతలు ఆందోళనకు దిగారు. నాలుగు శాతం ఉన్న సామాజికవర్గానికి 40కి పైగా సీట్లు ఇచ్చారని, 60 శాతం ఉన్న బీసీలకు తగిన సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఆందోళనలో నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ సెల్ కన్వీనర్ అశోక్ గౌడ్, పీసీసీ మాజీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు. -
45 సీట్లు కావాలి..!
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం ప్రాతిపదికన తమకు 45 స్థానాల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్లోని బీసీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు పార్టీలోని బీసీ నేతలు ఏఐసీసీ పెద్దలను కలసి విన్నవించినట్లు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ నియమించిన భక్తచరణ్దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీని కలసి వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలు పోటీ చేయాలనుకుంటున్న, విజయావకాశాలున్న స్థానాల జాబితాను కూడా అందజేశారు. కానీ, 45 స్థానాల కేటాయింపు సాధ్యం కాదనే అంచనాల నేపథ్యంలో కనీసం పార్లమెంట్ స్థానానికి 2 సీట్లయినా బీసీలకు కేటాయించాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 34 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం బీసీ నేతలకు వస్తుందని అంటున్నారు. అయితే, రాష్ట్ర పార్టీలోని బీసీ నేతల ప్రతిపాదనలను ఏఐసీసీ వర్గాలు సీరియస్గానే తీసుకున్నాయని, సామాజిక న్యాయం కోణంలో కనీసం 30 స్థానాలకు తగ్గకుండా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొన్ని క్లియర్.. మరికొన్ని డౌటే... బీసీ నేతలు కోరుతున్న విధంగా సీట్ల కేటాయింపులకు సంబంధించి టీపీసీసీలో కూడా కొంత స్పష్టత ఉంది. కనీసం 25 స్థానాల్లో బీసీ నేతలకు కచ్చితంగా గెలిచే అవకాశాలున్నందున వారికి అవకాశమివ్వాలని టీపీసీసీ ముఖ్యులు యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశాల్లోనూ ఆ 25 స్థానాలకు బీసీ నేతల పేర్లే మొదటి పేరుగా సూచించినట్లు సమాచారం. మిగిలిన చోట్ల కూడా కొన్ని స్థానాల్లో బీసీ నేతలను ప్రతిపాదించారని, వాటిలో కూడా బీసీ అభ్యర్థులకు అవకాశం వస్తుందని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలేరు, జనగామ, పరకాల, ముషీరాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, బాల్కొండ, మునుగోడు, అంబర్పేట, కరీంనగర్, నిజామాబాద్ (టౌన్), ఆర్మూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పటాన్చెరు, సిద్దిపేట, మహబూబ్నగర్, జడ్చర్ల, హుస్నాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డి, కొత్తగూడెం, రామగుండం, భువనగిరి, వరంగల్ (ఈస్ట్), ఖమ్మం లాంటి నియోజకవర్గాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని టీపీసీసీ బీసీ నేతలు పార్టీ అ«ధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన.. రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన చోట్ల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఎస్సీల్లోని ప్రధాన కులాలయిన మాదిగ, మాలలతో పాటు ఇతర ఉపకులాలకు చెందిన నేతలు బరిలో దిగే అవకాశమున్న నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు సీట్లు కేటాయించాలనే డిమాండ్ వస్తోంది. ఇదే విషయమై మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నేతలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా ఇదే సూత్రాన్ని పాటించారని, తాము కూడా అదే కోవలో ముందుకు వెళ్లాల్సి వస్తుందని టీపీసీసీ చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
మునుగోడు బీసీ నేతల ‘తిరుగుబాటు’
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం బీసీ నేతలంతా రాజకీయ పార్టీలపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం ఇవ్వడం లేదంటూ నిరసన గళం విప్పారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గానికి చెందిన దాదాపు 100 మంది బీసీ నేతలు జూబ్లీహిల్స్లో బుధవారం రహస్యంగా సమావేశమయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా రెండు సామాజిక వర్గాలకే టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల పక్షాన ఏ ప్రధాన పార్టీ అభ్యర్థిని ప్రకటించినా మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లేదంటే బీసీలందరి తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 25న 5 వేల బైక్లతో ర్యాలీ మునుగోడు నియోజకవర్గంలోని పలు పార్టీల నేతలతో 21న రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 25న అందోల్ మైసమ్మ దేవాలయం నుంచి 5 వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టాలని, ఈ నెల 30 లేదా అక్టోబర్ 1న చండూరు లేదా మునుగోడులో ‘బీసీల ఆత్మగౌరవ సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. భేటీలో తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేత పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన బీసీ సంఘం నాయకులు
-
ఓటుతో బుద్ధి చెబుతాం
కల్వకుర్తి మహబూబ్నగర్ : ఓటు అనే వజ్రాయుధంతో బీసీలు రానున్న 2019ఎన్నికలలో అగ్రవర్ణ కులాలకు తగిన బుద్ధి చెబుతామని, రాజకీయ గులాంగిరీ కోసం బీసీలను వాడుకుంటున్నారని.. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా శ్రీనివాస్గౌడ్ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా కల్వకుర్తి రఘుపతిపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏ ఉద్యమం చేసినా బీసీలే ప్రాణత్యాగాలు చేశారని, అన్ని ఉద్యమాలు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. గంపెడు శాతం ఉన్న బీసీలకు రాజకీయంలో పిడికెడు ఫలాలు మాత్రమే అందుతున్నాయని, అదే పిడికెడు శాతం ఉన్న అగ్రవర్ణ కులాల వారికి గంపెడు ఫలాలు దక్కుతున్నాయని అన్నారు. తనను ఎంతో ఆప్యాయంగా పలకరించి, బస్సుయాత్రకు స్వాగతం పలికిన ఉమ్మడి పామూరు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు నేను ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో బీసీని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని, అందుకొరకు నియోజకవర్గంలోని బీసీలందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అగ్రకులాల వారు ఎన్ని ప్రయత్నాలు చేసి, వారి కింద పనిచేసే వారిగానే బీసీలను గుర్తించారని వారందరికీ తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని, అప్పటి ముఖ్యమంత్రిని కాదని బీసీ నాయకుడైన చిత్తరంజన్ దాస్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన ఘనత కల్వకుర్తి ప్రజలకు దక్కుతుందని అన్నారు. ఇలాంటి చైతన్యవంతమైన కల్వకుర్తి ప్రాంతంలో 2019 ఎన్నికలలో బీసీ నాయకుడిని చట్ట సభలకు పంపించాల్సిన అవసరం నా కుల బాంధవులైన బీసీలపై ఉందని పిలుపునిచ్చారు.అనంతరం బీసీల ఐక్యతను చాటాలని బీసీ నాయకులందరితో కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఆచారి, బాలాజీ సింగ్, పురపాలిక చైర్మన్ రాచోటి శ్రీశైలం, బాలస్వామి గౌడ్, సదానందం, కానుగుల జంగయ్య, రాజేందర్, నాగేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, కాశన్న యాదవ్, శ్రీను, బుగ్గయ్య గౌడ్, పెద్దయ్య యాదవ్, యుగంధర్, శేఖర్, బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు వెళ్లాలి తెలకపల్లి : బీసీలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో అడుగు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీసీల చైతన్య యాత్ర శుక్రవారం తెలకపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బీసీలు వారికి స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ చౌరస్తాలో మాట్లాడుతూ పిడికెడు జనాభా ఉన్న వారు రాజ్యమేలుతుంటే గుప్పెడు జనాభా ఉన్న వారు పాలితులుగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలను ఆయా స్థానాలలో నిలబెట్టి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓట్ల ద్వారా వచ్చే ఎన్నికల్లో దొరలు, పటేళ్లకు బుద్ధి చెప్పాలని సూచించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, బీసీలంతా కలిసికట్టుగా రావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కాశన్న యాదవ్, రాముయాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
చిచ్చు రగిలింది!
అధికార టీడీపీలో ‘పదవి’ చిచ్చు రేగింది. నగర అధ్యక్ష పదవి తమ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని బీసీ నేతలు బలంగా తెరపైకి తెచ్చారు. అది కూడా పార్టీ అధిష్టానం ఆనం జయకుమార్రెడ్డికి నగర అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసిన క్రమంలో అసమ్మతి జ్వాల రగలింది. శనివారం జరిగిన పార్టీ నగర కమిటీ సమావేశానికి అసమ్మతి గళాల సెగ తగిలింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర టీడీపీలో ఒకవైపు టికెట్ ఫైట్ సాగుతోన్న ప్రస్తుత తరుణంలో నగర అధ్యక్ష పదవి చిచ్చు రేగింది. అధ్యక్ష పదవికి నేతను ఎంపిక చేసి రేపోమాపో అధికారిక ప్రకటన చేయనున్న తరుణంలో కొందరు బీసీ నేతలు అసమ్మతి గళం విప్పటం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఆదాల గ్రూపు నేతకు పదవి రానున్న క్రమంలో అదే గ్రూపు నేత వ్యతిరేకించడం విశేషం. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి నగర అధ్యక్షుడిగా కొనేళ్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కోటంరెడ్డికి జోడు పదవులు అనే కారణాన్ని తెరపైకి తెచ్చి నగర అధ్యక్ష పగ్గాలు ఆనం కుటంబానికి చెందిన ఆనం జయకుమార్రెడ్డికి కట్టబెట్టాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి ప్లాన్ వేశారు. దీనికి అనుగుణంగా కొన్ని నెలలుగా కసరత్తు చేసి అధినేత వద్ద ప్రతిపాదన కూడా పెట్టి ఆమోద ముద్ర వరకు తెచ్చారు. గత నెలరోజులుగా ఈ వ్యవహారం పార్టీలో హాట్టాపిక్గా సాగుతోంది. తాజాగా విజయవాడలో జరిగిన పార్టీ వర్క్షాప్నకు కూడా ఆనం జయకుమార్రెడ్డికి ఆహ్వానం లేనప్పటికీ ఆదాల తన వెంట తీసుకెళ్లి ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. అయితే ఆనం జయకుమార్రెడ్డికి నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించటానికి ఇటు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగర సీనియర్ నేత కిలారి వెంకటస్వామినాయుడు, మరికొందరు నేతలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పార్టీ నగర కమిటీ సమావేశం నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి నగర మేయర్ అబ్ధుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధతో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ కార్పొరేటర్ నూనె మల్లికార్జురావు సమావేశంలో నగర అధ్యక్ష పదవిపై పేచీ పెడుతూ అసమ్మతికి తెర తీశారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా నగర అధ్యక్ష పగ్గాలు బీసీలకు కేటాయించలేదని, ప్రతి సమావేశంలో టీడీపీ బీసీ పార్టీ అని చెప్పుకోవటం తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించటం లేదన్నారు. గతంలో కూడా అనేక సార్లు సీనియర్ అయిన తనకు పదవి కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని ఈ సారైనా ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బీసీలకు ఇవ్వాలని లేదంటే మైనార్టీలు. ఎస్సీల్లో ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదంటూ అసమ్మతి రాగాన్ని ఆలపించారు. దీంతో శ్రీధరకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని మంత్రి నారాయణ ఉన్నప్పుడు మాట్లాడాలని సూచించారు. పార్టీలోని మరో సీనియర్ నేత ధర్మవరపు సుబ్బారావు సైతం బీసీ నినాదం వినిపించడంతో శ్రీధరకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1983 నుంచి పార్టీలో పనిచేస్తున్న సుబ్బారావు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సమావేశంలో మాట్లాడటానికి ప్రయత్నించగా వెంటనే శ్రీధరకృష్ణారెడ్డి అడ్డుకుని మైక్ లాగేసుకున్నారు. దీంతో ఆయన నొచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా నగర అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీలో వర్గపోరు చిచ్చు రగిల్చింది. -
ఆగస్టులో నూతన రాజకీయ పార్టీ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) : బీసీ ఉద్యమనేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బీసీలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నౌడు వెంకటరమణ తెలిపారు. త్వరలో ఆర్. కృష్ణయ్య పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారన్నారు. పార్టీ పతాకం, విధివిధానాలు ప్రకటిస్తారన్నారు. ప్రెస్క్లబ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినపుడే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారిని చైతన్య పరిచేందుకు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 13జిల్లాలకు జేఏసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో బీసీల రాజకీయపార్టీ ఆవిర్భావంపై మేధోమథన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, ప్రముఖుల సూచనలు , సలహాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలేటి రామారావు, సంఘం ఉపాధ్యక్షుడు అరవ వెంకటసత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మారేష్, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, ఉపాధ్యక్షురాలు సీతారత్నం, పరిటాల రాము, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాధికారంలోనూ వాటా
హైదరాబాద్: బీసీలకు బర్రెలు, గొర్రెలే కాదు, రాజ్యాధికారంలోనూ వాటా ఇచ్చామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీ కులాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిత్యం పాటుపడుతోందని అన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీసీ నేతలు బండ ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్కు ఆదివారం ఇక్కడ జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఈటల మాట్లాడారు. కుల వృత్తులను, వాటిని నమ్ముకున్న వారికి బ్రతుకునిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాడిగేదెలు, గొర్రెలు, చేపలు ఇస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారని, కానీ రాజ్యాధికారంలోనూ వాటా కల్పించాలని మూడు రాజ్యసభ సీట్లలో రెండింటిని బీసీలకు ఇచ్చామని అన్నారు. బీసీల్లోని అన్ని కులాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బీసీలను పెద్దలసభకు పంపాం.. అన్ని పార్టీలు బీసీలతో జెండాలను మోయించుకుంటూ వాడుకుంటుండగా టీఆర్ఎస్ మాత్రం పెద్దలసభకు పంపిందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుతామని, కేసీఆర్ ఢిల్లీలో ఒకరోజు ధర్నా చేయనున్నారని చెప్పారు. బీసీలుగా ఉండటం వల్లే పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశం తమకు వచ్చిందని బండ ప్రకాశ్, లింగయ్య యాదవ్ అన్నారు. బీసీల హక్కుల కోసం పార్లమెంటులో గళం వినిపిస్తామని పేర్కొన్నారు. బీసీలకు మేలు చేసినవారిని గుండెల్లో పదిలపరుచుకుంటామని, అన్యాయం చేస్తే తిరగబడుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు. -
ఎంబీసీలపై వివక్ష ఎందుకు?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ‘బీసీలపై టీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోంది. ప్రతి విష యంలో టీఆర్ఎస్ ఆర్భాటం పెరిగింది. దీనికి తగినట్టే సీఎం కేసీఆర్ చుట్టూ చేరిన బీసీ నేతలు ఆయనకు భజన చేస్తున్నారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎంబీ భవన్లో పార్టీ నేతలు వెంకట్, జ్యోతి, చెరుపల్లి సీతారాములు, ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మూడున్నరేళ్లుగా ఏం చేశారు? బడ్జెట్లో కేటా యించిన రూ. 5 వేల కోట్లలో ఎంత ఖర్చు చేశారు? బీసీ సబ్–ప్లాన్ చట్టం ఏమైంది?’ అని ప్రభుత్వాన్ని తమ్మినేని ప్రశ్నించారు. సంచార జాతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇంత వరకు ఎంబీసీ కులాల నిర్ధారణ జరగలేదని విమర్శించారు. కౌలుదారులకూ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయవేదికను జనవరిలో ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్లో జరగనున్న పార్టీ జాతీయ మహాసభల లోగోను తమ్మినేని ఆవిష్కరించారు. -
వీరగట్టుపల్లిలో వైఎస్ జగన్
-
వచ్చే ఏడాది నుంచే ఎకరాకు రూ.8వేలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో అఖిల భారత కురుమల సంఘం ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారికున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ కురుమల సంక్షేమానికి రూ. 10 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా సంక్షేమ భవనానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వచ్చే శాసన మండలి ఎన్నికల్లో కురుమలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 23.80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని గొర్రెల కాపరులందరికి మొత్తం 84లక్షల గొర్రెలను పంపిణీ చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని రైతు సమస్యలపై సీఎం స్పందించారు. తెలంగాణలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రైతులకు వ్యవసాయంపై భరోసా కల్పించేందుకు వచ్చేఏడాది నుంచి ఎకరాకు రూ.8వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం మీడియాకు తెలిపారు. -
లక్ష్యం ఏమిటి..? వెనుక ఎవరున్నారు?
- బీసీల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా - కూపీ లాగుతున్న సీనియర్ నేతలు - ఇప్పుడీ సమావేశం ఎందుకని అసహనం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశం పెట్టుకోవడం పై ఆ పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. రాష్ట్రం లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై పోరాట కార్యాచరణ పెరుగుతున్నదనుకుంటున్న ఈ సమయంలోనే కాంగ్రెస్లో ప్రత్యేకంగా బీసీ ఫోరం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటని పలువురు నేతలను ప్రశ్ని స్తున్నారు. ఈ సమావేశం పెట్టడానికి సూత్రధా రులు, పాత్రధారులు ఎవరన్నదానిపై ఏఐసీసీ వర్గాలు కూపీ లాగుతున్నట్టుగా తెలిసింది. బీసీ వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షునిగా ప్రకటించి, బీసీ నేత నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లామని, ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో పార్టీకి ప్రత్యామ్నా యంగా మరో ఫోరం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అంశా లపై సమాచారాన్ని సేకరిస్తోంది. బయటకు చెప్పిన కారణాల్లో వాస్తవమున్నా, లేకున్నా నేపథ్యాన్ని, ఈ ఫోరం ఏర్పాటు లక్ష్యాలను పూర్తిగా తెలుసుకుంటున్నది. బీసీ సెల్లోనే చర్చించుకోవచ్చుగా...? టీపీసీసీకి అనుబంధంగా ఓబీసీ సెల్ ఉందని, ఆ సమావేశంలోనే అన్ని అంశాలను చర్చించు కుంటే సమస్య ఉండేది కాదని టీపీసీసీ నాయ కులు అంటున్నారు. పార్టీలో అంతర్గత సమస్య లుంటే, అంతర్గత వేదికల్లోనే ప్రస్తావించి, పరి ష్కరించుకోవాలని, బహిరంగంగా మాట్లాడు కుంటే ఎలా పరిష్కారం అవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ‘కాంగ్రెస్పార్టీకి బీసీ సెల్ లేదా? పార్టీకి, పార్టీకి అనుబంధ సంఘమైన బీసీ సెల్కు ప్రత్యామ్నాయంగా, సమాంతరం గా వేదిక ఏర్పాటుచేయడం ద్వారా ఈ ఫోరం పార్టీకి వ్యతిరేకం అనే సంకేతాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో కాంగ్రెస్లోని మరో వర్గం లేదా మరో సెల్కూడా సమావేశం పెట్టుకుంటే ఏమ వుతుంది? చివరకు తెలంగాణ కాంగ్రెస్ ఫోరం కూడా పెట్టుకుంటారు. దీనివల్ల పార్టీకి నష్టం కలగదా? ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవ హరించాలని అధిష్టానాన్ని కోరుతాం’ అని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు చెప్పారు. పార్టీ ఏం తక్కువ చేసింది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం తక్కువ చేసిందని పార్టీలోని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్సహా మరే ఇతర పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీయే బీసీలకు ఎక్కువగా అవకాశాలను ఇచ్చిందని వి.హనుమంతరావు, చిత్తరంజన్దాస్ వంటి బీసీ నేతలు వాదిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా బీసీ నేతకే టీపీసీసీ బాధ్యతలను అప్పగించిందని, 35 మంది బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కాయని మరి కొందరు బీసీ నేతలు గుర్తుచేస్తున్నారు. బీసీలకు అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత జరిగిన నిర్ణయాలు ఏమున్నాయని, ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం చేసినట్టు అవుతుందని బీసీ వర్గానికి చెందిన కొందరు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
బీసీల ప్రాబల్యాన్ని ఎలా కాపాడుకుందాం?
14న హైదరాబాద్లో కాంగ్రెస్ ముఖ్యుల భేటీ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ప్రాబ ల్యాన్ని కాపాడుకోవడానికి నిర్దిష్ట కార్యాచరణ కు దిగాలని బీసీ ముఖ్య నేతలు నిర్ణయించుకు న్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ముఖ్య నేతలంతా పార్టీలో బీసీల ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి అనుస రించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఈ నెల 14న హైదరాబాద్లో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు దక్కిన వాటాను కాపా డుకుంటూనే పార్టీలో ముఖ్యమైన స్థానంలోకి చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాలని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీసీలకు పార్టీ సరైన ప్రాధాన్యత ఇచ్చిందని, ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలకు కలిపి 35 మంది బీసీలకు టెకెట్లు ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. అయితే వాటిలో ఎవరూ గెలవకపోవడం ఇబ్బందికర అంశమేనని అంటున్నారు. బీసీల కు గత ఎన్నికల్లో వచ్చినన్ని టికెట్లను సాధిం చుకోవడానికి, వాటిని గెలుచుకోవడానికి తగిన కార్యాచరణ, వ్యూహం ఉండాల్సిందేని పార్టీలోని సీనియర్లు భావిస్తున్నారు. అలాగే అధికార టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఉద్య మకార్యాచరణను ప్రకటించాలని సూత్రప్రా యంగా నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ ఆకర్షణలను తిప్పికొడదాం.. బీసీలను ఆకర్షించేందుకు అధికార టీఆర్ఎస్ అమలు చేస్తున్న గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పథకాల్లో లోపాలపై పార్టీపరంగా పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశాలున్నాయని బీసీ ముఖ్య నాయకుడొకరు పేర్కొన్నారు. ముఖ్యంగా అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీ యడం ద్వారా యాదవ, బెస్త, ముదిరాజ్ కులాలపై టీఆర్ఎస్ ఆకర్షణలను తిప్పికొ ట్టొచ్చన్నారు. ఇటువంటి అంశాలపై ఇప్పటి దాకా ఉద్యమించడంలో పార్టీ నేతలంతా సమష్టిగా విఫలమైనా 14న జరిగే బీసీల వ్యూహ సమావేశంలో విశ్లేషించుకోవాల్సి ఉం దన్నారు. బీసీల్లో పార్టీ ప్రాబల్యం పెంచడానికి భారీ బహిరంగసభను ఏర్పాటుచేసే యోచన ఉందని ఆ నాయకుడు వెల్లడించారు. 14న జరిగే భేటీకి టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్కుమార్యాదవ్, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్గౌడ్, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరలు హాజరవుతారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. -
హైదరాబాద్లో బీసీల సమర శంఖారావం
-
మంజునాథ కమిషన్ సమావేశం రసాభాస
కాకినాడ: నగరంలో బుధవారం మంజునాథ కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కాపులను బీసీలను చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మంజునాథ్ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్ చేపట్టిన కార్యక్రమాన్ని కొందరు బీసీ నేతలు బహిష్కరించారు. కాపులతో రిజర్వేషన్లపై జరిగిన చర్చల్లో వివక్ష చూపించినట్లు ఆరోపించారు. ఇరువర్గాలు వాదనలు వినిపించే విషయంలో కాపులతో ఒక విధంగా.. మిగిలిన వారితో మరోలా కమిషన్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నెల్లూరులో మంజునాథ కమిషన్ ఎదుట నిరసన
నెల్లూరు : నెల్లూరులో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ పర్యటనలో సోమవారం గందరగోళం చోటుచేసుకుంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బీసీలు కమిషన్ ఎదుట నిరసనకు దిగారు. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కమిషన్ పర్యటన రసాభాసగా మారింది. బీసీ కులాలను విడదీయడానికే కమిషన్ వేశారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమిషన్ పర్యటనపై ఎలాంటి సమాచారం, స్పష్టత లేదని వారు మండిపడ్డారు. -
బీసీ నేతలతో ముద్రగడ భేటీ
బీసీల నోటి వద్ద ముద్దను కాజేసే ఉద్దేశం లేదని వెల్లడి సాక్షి ప్రతినిధి, ఏలూరు/కొత్తపేట: కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమానికి బీసీలు, ఆ సంఘాల నేతలు సహకరించాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేవారు. శనివారం పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించిన ముద్రగడ భీమవరంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ నివాసంలో వెనుకబడిన తరగతులకు చెందిన వివిధ కుల సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల డిమాండ్ విషయంలో బీసీ నాయకులు వారి అభ్యంతరాలు, అపోహలను వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ముద్రగడ స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా.. ఆపైన ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తేనే తీసుకుంటామని వెల్లడించారు. బీసీల నోటికాడ ముద్దను కాజేసే ఆలోచన తమకు లేదన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ మేకా శేషుబాబును కలిసి కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబుకు ఉత్తరం రాయాలని కోరారు. సాయంత్రం కొత్తపేటలో ముద్రగడ మాట్లాడుతూ.. బీసీలు వారి డిమాండ్ల కోసం రోడ్డెక్కితే మద్దతు ఇస్తానన్నారు. -
‘నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలి’
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. నయీమ్తో సత్సంబంధాలు నెరిపిన ప్రభుత్వ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని సూచించాయి. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐదుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 24 మంది ఐపీఎస్ అధికారులు నయీమ్తో సన్నిహితంగా మెలిగి లబ్ధి పొందారని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే రుజువులతో సహా ఆ జాబితా బయటపడుతుందని బీసీ అనుబంధ సంఘాల ప్రతినిధులు అరుణ్, గుజ్జ కృష్ణ, నరసింహగౌడ్, నీల వెంకటేశ్ తదితరులు పేర్కొన్నారు. -
బీసీల సమస్యలను పరిష్కరించాలి..
ఏలూరు(సెంట్రల్): బీసీల సమస్యలను పరిష్కరించాలని కొరుతూ బీసీ సబ్ప్లాన్– ప్రై వేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట వేదిక జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపతికన రాయితీ రుణాలు ఇవ్వాలని, బీసీ సబ్ప్లాన్కు చట్ట బద్దత కల్పించాలన్నారు. ప్రైవేట్ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు సామాజిక రక్షణ చట్టం చేసి, వత్తిదారుల సంక్షేమానికి బ్యాంకు ఏర్పాటుచేయాలని, బీసీ జనాభా లెక్కలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.అప్పారావు, చోడవరపు రామారావు, కేల్ల వెంకటరమణ, కె.కన్నబాబు,ఎస్.నందేశ్వరరావు, రంభా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరంలో మంత్రివర్గ కోటా కోట్లాట
-
బీసీ నాయకుల వితరణ
ఓదూరు (రామచంద్రపురం రూరల్): గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో ఇటీవల మరణించిన ఒకరికి, అదే సంఘటనలో ఇద్దరిని కాపాడిన ఓ బాలుడికి బీసీ నాయకులు వితరణ చేశారు. అనపర్తిలో ములగపాక శివరాం సంతోష్ ఇటీవల గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో మరణించగా అతని తల్లికి శుక్రవారం ఓదూరులోని బీసీ నాయకులు బుల్లెట్ రాము మీడియా గ్రూపు తోడ్పాటుతో గల్ఫ్ బీసీ యూత్ అందించిన రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే సంఘటనలో తన ప్రాణాలకు తెగించి ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడిన బాలుడు దుర్గా రమేష్ను అభినందించి అతనికి రూ. 7 వేల నగదు బహుమతి, జ్ఞాపికను అందజేశారు. సీనియర్ బీసీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ యువజన సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దీక్షలు భగ్నం..బీసీ నేతల అరెస్ట్
కర్నూలు(అర్బన్): ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సోమవారం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలు చేపట్టిన శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్ మీదుగా సీఎం చంద్రబాబు కాన్వాయ్ కలెక్టరేట్కు వెళ్తున్న నేపథ్యంలో దీక్షలను ప్రారంభంలోనే పోలీసులు అడ్డుకొన్నారు. బీసీ నేతలను రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పలువురు సీఐ, ఎస్ఐ, పోలీసులు అక్కడికి చేరుకొని శిబిరాన్ని తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులకు బీసీ నేతలకు కొంతసేపు వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు పీజీ నరసింహులుయాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, రాయలసీమ జోన్ కన్వీనర్ టి శేషఫణి, యాదవ సంఘం సీనియర్ నాయకులు రాంపుల్లయ్యయాదవ్, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ.. బీసీలపై కపటప్రేమను చూపిస్తూ వారినిఅణగదొక్కేందుకు చూస్తోందన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి బీసీ కులానికి ఫెడరేషన్లు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూతను అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి మద్దిలేటియాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గంగిరెద్దుల సంఘం జాతీయ అధ్యక్షుడు సీతయ్య, సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సోమన్న, ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంది వరుణ్కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి గెహ్లాట్ తో బీసీ నేతల భేటీ
బీసీల సమస్యలు పరిష్కరించాలని వినతి సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం గురువారం ఇక్కడ కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్తో భేటీ అయింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి 15 డిమాండ్లను ఆయన మంత్రి ముందుంచారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ను తొలగించాలని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని, కర్ణాటకలో కూడా ఇదే విధంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈమేరకు గురువారం ఒక వినతి పత్రాన్ని సిద్దరామయ్యకు అందజేసింది. ప్రతినిధి బృందంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఇతర నేతలు గుజ్జ కృష్ణ, రుషి అరుణ్, పి.శ్రీనివాసరావు, పి.హనుమంతరావు, పి.వి.మహేశ్, దుర్గయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. -
బీసీ సంక్షేమ సంఘం నేతల హౌస్ అరెస్ట్
విజయవాడ: విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం నేతలను గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్కు వ్యతిరేకంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనితో ముందస్తుగా గురువారం తెల్లవారు జాము నుంచే బీసీ సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులను అరెస్ట్లు చేస్తుండటంతో బీసీ నేతలు మండిపడుతున్నారు. -
సారథ్యానికి మేం తగమా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు నియామకం తెలుగుతమ్ముళ్లలో అసంతృప్తి రాజేస్తోంది. అయితే పార్టీ అధికారంలో ఉన్నందున ఎందుకైనా మంచిదని ఎవరూ పెదవి విప్పడం లేదు. లేదంటే ఇప్పటికే రచ్చరచ్చ అయ్యేదే. అధిష్టానం నిర్ణయమైనా లేక జిల్లాలో ఒకరిద్దరు ముఖ్య నేతలు కలిసికట్టుగా చేసిన తంత్రం ఫలితమైనా పార్టీ పగ్గాలు పర్వతకు అప్పగించడంపై బీసీల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పదవుల పందేరాన్ని పరిశీలిస్తే ఆ వర్గంలో అసంతృప్తి రగులుకోవడంలో ఎంత మాత్రం అనుచితం కాదని పార్టీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. వరుసగా ఒకే వర్గానికి పదవులు కట్టబెడుతూ చివరకు జిల్లా పగ్గాలు కూడా అదే వర్గానికి అప్పగించి బీసీలకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్వత నియామకం అధిష్టానం తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదంటున్నారు. జిల్లాలో పార్టీని తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని ఒకరిద్దరు పెద్ద తలకాయలు ఇందుకు కారణమంటున్నారు. నిరీక్షణకు ఫలితం నిరాశే.. పార్టీ అధికారంలోకి వచ్చాక వరుసగా చేసిన నియామకాలన్నింటిలో ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేశారని ఇతర వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఒకటి కాకపోతే మరొకటి, అదీ కూడా కాకపోతే ఇంకో పదవి ఇస్తారని ఎదురుచూసి, చూసి.. చివరకు జిల్లా పగ్గాలు కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపించారని పార్టీనే నమ్ముకుని పయనిస్తున్న బీసీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా పగా్గాలు ఏ వర్గానికి ఇవ్వాలనే చర్చ పార్టీలో మొదలైనప్పటి నుంచి రెండు బలమైన సామాజికవర్గాల పేర్లు వినిపించాయి. నిమ్మకాయల చినరాజప్పకు పెద్దాపురం సీటు ఇచ్చినా, గెలిచాక ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇచ్చినా పార్టీ వర్గాలు స్వాగతించాయి. రికార్డు స్థాయిలో జిల్లా పగ్గాలు చేపట్టడం, మృదుస్వభావి కావడమే ఇందుకు కారణం. రాజప్పకు జోడుపదవులు ఇచ్చిన అధిష్టానం అదే బాటలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, రాజమండ్రి మేయర్, పార్టీ పొలిట్ బ్యూరో..ఇలా పదవులన్నీ ఒకే వర్గానికి కట్టబెడుతూ చివరకు జిల్లా పార్టీ పగ్గాలు కూడా అదే వర్గానికి ఎలా అప్పగించేశారని బీసీలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నికలప్పుడు కనీసం వైస్ చైర్మన్ అయినా వస్తుందని బీసీలు ఆశించారు. దానిని మరో బలమైన ఉన్నత వర్గానికి కట్టబెట్టడంలో చూపిన చొరవ తమ విషయంలో ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని పార్టీలో బీసీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఆయనకిస్తే మాకు ఇచ్చినట్టేనా? తునిలో వరుసగా తిరస్కారానికి గురైన సోదరులిద్దరిలో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి కట్టబెడితే బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టేనా అని బీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గం ప్రశ్నిస్తోంది. పార్టీ జిల్లాపగ్గాల కోసం ఆ వర్గం నుంచి బలమైన నాయకుడిగా, మంచి వాగ్ధాటి కలిగిన పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్), పార్టీ కార్యదర్శి పిల్లి సత్తిబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఆర్ఎస్కు పార్టీ అధికారంలోకి రాకమునుపే చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారు. అది ఇంకా దక్కలేదు. ఈలోగా పదవులన్నీ ఒకే వర్గానికి కట్టబెట్టడంతో బీసీలలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఆ వర్గానికే జిల్లా పగ్గాలు అప్పగించాలని పార్టీ ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు గరికిపాటి మోహనరావు, పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ కిమిడి కళా వెంకట్రావు రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఎస్కు కేటాయించే విషయమై జిల్లా నేతలంతా దాదాపు ఏకాభిప్రాయానికి కూడా వచ్చారని సమాచారం. ఇక ప్రకటించడం ఒకటే మిగిలి ఉందని పార్టీలో ఆ వర్గ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు చివరి నిమిషంలో అడ్డుచక్రం వేయడంతో బీసీలకు అధిష్టానం మొండిచేయి చూపించిందని పార్టీలో ఆ వర్గం రగిలిపోతోంది. చిట్టిబాబు అయితే తమ కనుసన్నల్లో నడుస్తారన్న ఏకైక కారణంతో బీసీలకు జిల్లా సారథ్యం దక్కకుండా చేసిన పెద్దల తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సమర్థత, సొంత వ్యక్తిత్వం కలిగిన బీసీ నేతలను పార్టీలో ఎదగనివ్వకుండా పార్టీ పదవులకు దూరం చేసే కుట్రలో భాగమే తాజా ఎంపికని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. -
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన బీసీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. వీరిలో బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎంపీలు ఉన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానిని కోరారు. అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విన్నవించారు. టీడీపీ ఎంపీలు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. -
బాబును నమ్మేదెలా...
సాక్షి, గుంటూరు :జిల్లాలో సీట్ల కేటాయింపులో బీసీలకు బాబు మొండి చెయ్యి చూపనున్నారా? బీసీలకు సీట్లు అని ప్రచారం చేసిన టీడీపీ అధినేత చివరకు తన సామాజికవర్గానికి చెందిన వారికే టిక్కెట్లు కట్టబెట్టనున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీసీ సీట్లపై కొనసాగుతున్న సందిగ్ధాన్ని చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి.. గనుక బీసీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. పైగా ఇటీవలే జడ్పీ చైర్మన్ అభ్యర్ధిత్వం విషయంలో బాబు అమలు చేసిన గేమ్ ప్లాన్, తమ వేళ్లతో తమ కళ్లే పొడిపించిన తీరుకు జిల్లాలోని బీసీ నాయకులు మనస్తాపం చెందుతున్నారు. జడ్పీ పీఠం బీసీలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చైర్మన్ అభ్యర్థిత్వం విషయంలో దోబూచులాడటంపై బీసీ నేతలు కినుక వహిస్తున్నారు. అదే జనరల్ స్థానంగా ఉంటే ఇలా చేసేవారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీలకు వంద సీట్లిస్తాం.. బీసీలకు ఎంతగానో మేలు చేసింది తమ పార్టీయేనని మొదట్నుంచీ ఊదరగొట్టిన బాబు చివరి నిమిషంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. ఇందుకు కారణం బీజేపీతో పొత్తు కారణంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ముఖ్యనేత కోడెల శివప్రసాద్రావు నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వైపు చూస్తుండటమే. సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా బీసీ వర్గానికి చెందిన నిమ్మకాయల రాజనారాయణ వ్యవహరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డిపై 7,147 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత నిమ్మకాయల నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. 2007లో స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం బాబు కల్పిస్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింహభాగం సొంత సామాజికవర్గానికే.. నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో రెండు రోజుల్నుంచీ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి పోటీ చేయనున్నారని టీడీపీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిమ్మకాయలకు సీటు దక్కుతుందో లేదోనని జిల్లాలోని పలువురు బీసీలు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో మూడు సీట్లు ఎస్సీ రిజర్వ్ కావడంతో మిగిలిన సీట్లలో అత్యధిక భాగం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే పోటీ పడుతున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అనగాని సత్యప్రసాద్ ఈ దఫా సీటును ఆశిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకటరమణపై 5,945 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇటీవలే రేపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు టీడీపీలో చేరారు. దీంతో ఇక్కడ సీటు కేటాయింపు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు మినహా మిగిలిన నియోజకవర్గాల్లోని సీట్ల విషయంలో స్పష్టత ఉంది. కానీ బీసీలకు ఎక్కడ కేటాయిస్తారనేది ఇంత వరకు తేల్చకపోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. సత్తెనపల్లి సీటు ఎట్టి పరిస్థితుల్లో తనదేనని, తనకు అధినేత చంద్రబాబు మాటిచ్చారని నిమ్మకాయల రాజనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. కోడెలకు సత్తెనపల్లిలో అసలు ఛాన్స్ లేదని ఉద్ఘాటిస్తున్నారు. టీడీపీ టికెట్ల కేటాయింపులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా బాబు రాజకీయానికి ఎవరు బలి పశువు కానున్నారో.. మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. రాజధానిలో కాపు కాసిన నేతలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై కాపు సామాజికవర్గం నేతల ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఆ వర్గానికి చెందిన నేతలు రాజధానిలో మకాం వేసి తమ సంగతి తేల్చాలంటున్నారు. 2009, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం నేతలకు బాబు మొండి చేయి చూపారు. ఆ చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీటు ఇస్తారని నియోజకవర్గాల్లో ఉంటే మొత్తానికి మోసం జరుగుతుందనే భావనతో రాజధానిలోనే మకాం వేశారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సుజన చౌదరిలో ఈ వర్గం నేతలు భేటీ అయ్యారు. డీసీఎమ్మెస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చందు సాంబశివరావు, సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు కలిశారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాపు సామాజికవర్గం నేతలకే సీట్లు ఇవ్వాలని, కొత్తవారికి సీట్లు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. ఏదో ఇచ్చాం అనే రీతిలో కాకుండా తమ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేయాలని కోరారు. బుధవారం ఉదయం వీరంతా రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు, చంద్రబాబుతో సమావేశం కానున్నారు. -
మాటలు కాదు.. చేతలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం :మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల(బీసీ) వారికి వైఎస్సార్సీపీ పెద్దపీట వేసింది. ఏ వర్గాలకూ రిజర్వు చేయని స్థానాల నుంచి బీసీ నేతలను వైఎస్సార్సీపీ బరిలోకి దించింది. బీసీలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకునే టీడీపీ.. సీట్ల విషయానికి వచ్చే సరికి ఆ వర్గాల ప్రజలకు మొండిచేయి చూపుతోంది. కేవలం ఓట్ల కోసమే తమను టీడీపీ ఉపయోగించుకుంటోందని ఆ పార్టీకి చెందిన బీసీ నేతలే విమర్శస్తుండటం గమనార్హం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు పెద్దపీట వేయడంతో ఆ వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వెంట బీసీలు నడుస్తోండటం టీడీపీ నేతలకు కంటి మీద కునుకు మాటలు కాదు..లేకుండా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటు 11 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం విదితమే. మున్సిపల్ ఎన్నికలకు సమాంతరంగా ప్రాదేశిక (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ పదవిని జనరల్ మహిళకు, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం పురపాలక సంఘాల చైర్పర్సన్ పదవులను జనరల్ మహిళకు కేటాయించారు. ధర్మవరం మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్కు కేటాయించారు. ఇందులో ధర్మవరం మున్సిపల్ చైర్మన్ పదవిని చేనేత వర్గాలకు కేటాయిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కూడా మైనార్టీ వర్గాలకు కేటాయిస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఒక నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లు.. 11 పురపాలక, నగర పంచాయతీల్లోని 323 వార్డుల్లో సింహభాగం సీట్లలో బీసీ వర్గానికి చెందిన వారికే వైఎస్సార్సీపీ టికెట్లు కేటాయించి, బరిలోకి దింపింది. చేతల్లో చూపిన వైఎస్సార్సీపీ.. ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని బీసీ(జనరల్)కు రిజర్వు చేశారు. జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో ఏ వర్గానికి రిజర్వు చేయని స్థానాల్లోనూ బీసీ వర్గాలకు చెందిన నేతలకు వైఎస్సార్సీపీ టికెట్లు ఇచ్చి.. పోటీకి దించింది. పెనుకొండ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్కు కేటాయించారు. ఈ స్థానం నుంచి వైఎస్సార్సీపీ బోయ సామాజిక వర్గానికి చెందిన సానిపల్లి మహీధర్ను బరిలోకి దించింది. టీడీపీ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ కేటాయించింది. కనగానిపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్కు కేటాయించారు. ఆ స్థానం నుంచి వైఎస్సార్సీపీ కురుబ సామాజిక వర్గానికి చెందిన నెమలివరం ఈశ్వరయ్యకు వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చి, బరిలోకి దించింది. కానీ.. టీడీపీ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చింది. యల్లనూరు జడ్పీటీసీ స్థానాన్ని జనరల్కు కేటాయించారు. ఆ స్థానం నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన కొత్తమిద్ది వెంకటరమణను వైఎస్సార్సీపీ బరిలోకి దించింది. ఇక్కడ నుంచి కమ్మ వర్గానికి చెందిన నేతను టీడీపీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. నల్లమాడ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్కు కేటాయించారు. ఇక్కడ నుంచి ఈడిగ సామాజిక వర్గానికి చెందిన జక్కల ఆదిశేషును వైఎస్సార్సీపీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. కానీ.. టీడీపీ మాత్రం ఆ స్థానం నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను పోటీకి దింపింది. ఓట్ల కోసం టీడీపీ తాపత్రయం.. బీసీల ఓట్లను దండుకోవడం కోసమే ఆ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీలు గుప్పిస్తారనే విమర్శలకు జిల్లాలో నెలకొన్న పరిస్థితి బలం చేకూర్చుతోంది. ఏ వర్గాలకూ రిజర్వు చేయని స్థానాల్లో బీసీ వర్గాలకు టికెట్లు ఇవ్వకుండా టీడీపీ మొండిచేయి చూపడమే అందుకు తార్కాణం. ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి రావడం కోసమే చంద్రబాబు బీసీ డిక్లరేషన్ చేశారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చిన దాఖలాలు లేవని ఆ వర్గాలకు చెందిన నేతలే విమర్శిస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో సీట్ల కేటాయింపును పరిశీలిస్తే టీడీపీ కేవలం ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటుందనే విమర్శలకు బలం చేకూర్చుతోందని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు. టీడీపీ వైఖరిని పసిగట్టిన బీసీ వర్గాల ప్రజలు ఆపార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ వెంట ఆ వర్గాల ప్రజలు నడుస్తున్నారు. ఇది టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమవతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కుట్రలు చేస్తే ఖబడ్దార్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మెదక్ జిల్లాలో 66 ఏళ్లుగా అగ్రకులాలే పెత్తనం చేస్తున్నాయి, బీసీ నేతలను ఎదగనీయకుండా రెడ్డి, వెలమ నేతలు అణగదొక్కే కుట్రలు చేస్తున్నారు. ఇకపై వారి ఆటలను సాగనివ్వం’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ కులాలను అణిచి వేసేందుకు కుట్రలు చేస్తున్న అగ్రకుల పెత్తందార్లూ..! ఖబడ్దార్ అని ఘాటుగా హెచ్చరించారు. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ సోమవారం సంగారెడ్డిలో జరిగిన సోనియా ‘అభినందన సభ’లో ఆవేదన వ్యక్తం చేయడంపై ఆర్. కృష్ణయ్య స్పందించారు. పత్రికల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆయన మంగళవారం ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకంగా పని చేస్తోందని, దీన్ని ఎంత మాత్రం సహించబోమన్నారు. జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేక ఉన్న ఒక్క సీటు కూడా లాక్కునే ప్రయత్నం చేయడం అగ్రకులాల ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్తో పాటుగా మరో నలుగురు బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని బీసీ కులాలు, ఉప కులాలను కలుపుకుని జాయింట్ యాక్షన్ కమిటీ వేసి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. ఆరు దశాబ్ధాలుగా అగ్రకులాలే పెత్తనం చేసినా సహించామనీ, ఇకనుంచి వారి ఆటలు సాగనివ్వమన్నారు. జిల్లా జనాభాలో 80 శాతం ఉన్న బీసీలకు వాస్తవంగా ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం చూసినా మెదక్ జిల్లాలో ప్రస్తుతం అగ్రకులాల వారు ఉన్న స్థానాల్లో బీసీలుండాలనీ, బీసీ ఉన్న ఒకే ఒక స్థానం అగ్రకులాలకు దక్కాలన్నారు. బీసీల ఓట్లతో గెలిచి బీసీల సీట్లలో కూర్చుని రాజ్యాధికారంతో పాటు వ్యాపారాలు కూడా గుప్పిట్లో పెట్టుకుని బీసీలనే అణచివేస్తున్నారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని బీసీ కులాలు ఐక్యం కావాల్సిన సమయం వచ్చిందని, రాజ్యాధికారంలో హక్కులను సాధించుకోవడం కోసం బీసీలంతా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఐకమత్యంతోనే బీసీల అభివృద్ధి
జక్రాన్పల్లి, న్యూస్లైన్: ఐకమత్యంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, భావి తరాల భవిష్యత్తు కోసం సంఘటితం కావాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రీయ కళ్యాణ మండపంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బీసీల సమర భేరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్ట సభల్లో బీసీల వాణి వినిపించే వారు లేకే ఈ దుస్థితి నెలకొందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. వడ్డించే వాడు మన వాడు లేకపోవడం వల్లే బీసీలు సామాజికంగా వెనుకబడ్డారని అన్నారు. బీసీల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అగ్ర వర్ణాలకు వణుకు పుడుతోంది.. - ఎంపీ మధుయాష్కీగౌడ్ బీసీల్లో చైతన్యం చూసి అగ్ర వర్ణాల్లో వణుకు పుడుతోందని ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఈ చైతన్యం రాజ్యాధికారం సాధించే వరకు కొనసాగించాలని సూచించారు. బీసీ నాయకులు చట్ట సభలకు వెళ్లి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతున్నారని, స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. బానిసలుగా బతుకుతున్న కారణంగానే ఈ దుస్థితి నెలకొందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కృష్ణయ్యకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని, ఇందుకు సభలో తీర్మానం చేయాలని సూచించారు. ఇందుకు కేంద్ర స్థాయిలో తన ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు ఫిబ్రవరి సమావేశాల్లో తప్పకుండా ఆమోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంకిత భావం లేకపోవడమే కారణం - ఎమ్మెల్సీ వీజీ గౌడ్ చట్ట సభలకు ఎన్నికైన బీసీ నాయకుల్లో అంకిత భావం లేకపోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. దేశంలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. బీసీలకు డిక్లెరేషన్ ప్రకటించిన పార్టీలనే గెలిపించాలని, ఇందుకు అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బడుగులే సమిధలు - టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజారాం యాదవ్ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే ఆత్మ బలిదానాలు చేసి ఉద్యమానికి సమిధలయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజారాం యాదవ్ అన్నారు. కేసీఆర్ ఉద్యమానికి ముందే ఓయూలో తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టామని చెప్పారు. రాబోయే తెలంగాణలో బీసీల వాటా దక్కాలని, ఇందుకు పోరాటం చేయాలని అన్నారు. బీసీల అనైక్యతే బలహీనత అని, సంఘటితం కావాలని కోరారు. ఎన్నాళ్లైనా బానిస బతుకులే... - బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ రాజ్యాధికారం అగ్ర వర్ణాల చేతిలో ఉంటే ఇంకా ఎన్నాళ్లయినా బానిస బతుకులేనని బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. స్వాభిమానంతో ఓటు వేసి బీసీలనే గెలిపించాలని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ప్రకటించిందని, గెలిపించాలని కోరారు. పార్టీలు పట్టించుకోవడంలేదు - బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అగ్ర వర్గాలకు చెందిన నాయకులు పార్టీలను పట్టించుకోవడం లేదని, ఏ పార్టీకి చెందిన వారైనా తమ వర్గం వారికి అండగా నిలుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాజాలు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ బీసీలు మాత్రమే పార్టీలు అంటూ అంటున్నారని అన్నారు. బీసీలు 65 ఏళ్లుగా పార్టీల పేరుతో మోసపోతున్నారని, ఇక మీదటైనా సంఘటితం కావాలని సూచించారు. లేనిపక్షంలో మరో శతాబ్దమైనా బీసీల బతుకుల్లో మార్పు రాదన్నారు. సభలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర కన్వీనర్ ఎ భాస్కర్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్లు కంచెట్టి గంగాధర్, త్రివేణి గంగాధర్, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా కృష్ణ పండిత్ గౌడ్, చిల్క కిష్టయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రావు, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర నాయకుడు భూమన్న యాదవ్, జిల్లా సర్పంచ్ గోర్త రాజేందర్, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఖాందేశ్ శ్రీనివాస్, తదితరులు ప్రసంగించారు. ఆదిలాబాద్, మెదక్ అధ్యక్షుడు కిష్ణు, కల్లారి హరికృష్ణ, ఎంసీ లింగన్న, బీసీ సంఘాల నాయకులు చక్రవర్తి, వీర్ కుమార్, పుల్గం మోహన్, పద్మలత, వినోద్ కుమార్, జగదీశ్వర్, అశోక్, విద్యార్థి నాయకుడు యెండల ప్రదీప్ కుమార్, తదితరులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, జిల్లా నలుమూలల నుంచి బీసీ నాయకులు, సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీసీలు పాల్గొన్నారు. కృష్ణయ్యను సన్మానించిన సంతోష్ రెడ్డి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యను మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. సమర భేరి సభకు విచ్చేసి సంతోష్ రెడ్డి అందరినీ ఆశ్చర్య పరిచారు. నేరుగా సభపైకి వెళ్లి కృష్ణయ్యను ఆలింగనం చేసుకుని సత్కరించారు. -
రాజ్యాధికారమే లక్ష్యం
‘బీసీ సమ్మేళనం’లో కుల సంఘాల ప్రతినిధుల పిలుపు అధికారంతోనే బీసీల సర్వతోముఖాభివృద్ధి బడుగులను అణగదొక్కుతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి డిసెంబర్ 17న నిజాం కళాశాలలో బీసీ సభ రాజ్యాధికారం ద్వారానే బడుగు, బలహీన వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించగలరని వెనుకబడిన తరగతుల సంఘాల నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బడుగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘రాజ్యాధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ‘బీసీ కులాల సమ్మేళనం’ సదస్సును శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించారు. అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలను రాజకీయ పార్టీలన్నీ ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయే తప్ప.. వారి సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా కిరణ్ సర్కారు పట్టించుకోవడం లేదని, 16 బీసీ ఫెడరేషన్లకు పాలకవర్గాలను నియమించలేదని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలూ 150 సీట్లు కేటాయించాలని, పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 50 శాతం నిధులు కేటాయించాలని, ఎస్సీల తరహాలోనే బీసీలకు కూడా 50 శాతం సబ్సిడీతో రూ. 5 నుంచి 15 లక్షల వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ కులాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 17న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కృష్ణయ్య ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా బీసీలకు సామాజిక న్యాయం అందలేదని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించిన ప్రభుత్వం.. బీసీ కమిషన్పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. న్యాయవ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా రాష్ట్ర హైకోర్టులో అది అమలుకావడం లేదని ఈశ్వరయ్య ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించాలని టీడీపీ నేత దేవేందర్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలు ఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించగలరని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కులాల వారికీ అసెంబ్లీలో చోటుదక్కాలని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆకాక్షించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే ఎల్.రమణ, బీసీ నేతలు శ్రీనివాసగౌడ్, బొజ్జ కృష్ణయ్య, పలువురు బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. డిసెంబర్ 17న రాజకీయ పార్టీ ప్రకటన?: బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలని బీసీ కుల సంఘాల నేతలు భావిస్తున్నారు. వచ్చే నెల 17న నిజాం కళాశాల మైదానంలో జరిగే బీసీ సభలో కొత్త పార్టీని ప్రకటించాలని వారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణయ్య అధ్యక్షతలో రూపుదాల్చనున్న ఈ పార్టీలో అన్ని బీసీ కులాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని నేతలు చెప్తున్నారు. ఇతర పార్టీల్లోని బీసీ నేతలను తమ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
చెక్ పవర్ ఇవ్వకుంటే హైదరాబాద్ దిగ్బంధం : ఆర్.కృష్ణయ్య
నిజామాబాద్, న్యూస్లైన్: గ్రామ సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వకుంటే పదివేల మంది సర్పంచులతో హైదరాబాద్ను దిగ్బంధనం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజామాబాద్లో జరిగిన బీసీగర్జన సభలో కొత్తగా ఎన్నికైన 400 మంది బీసీ సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సర్పంచులకు 29 అధికారాలు కల్పించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని, ఇందుకు బీసీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీలకు 150 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి తూప్రాన్: బీసీలకు వచ్చే ఎన్నికల్లో 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ, టీడీపీ బీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించాయని, మిగిలిన పార్టీలు అదేబాటన నడవాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని, వారికి నిరాశ తప్పదన్నారు. -
బీసీ సబ్ప్లాన్కు బీజేపీ మహాదీక్ష ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారతంలోనూ బలహీనవర్గాలకు తీరని అన్యాయమే జరుగుతోందని, బీసీ సబ్ ప్లానే దీనికి పరిష్కారమంటూ బీజేపీ సోమవారమిక్కడ 48 గంటల మహాదీక్ష చేపట్టింది. ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకూ రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్ చేసింది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోవడం వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొంది. తొలిరోజు దీక్షలో పార్టీ రాష్ట్ర నేతలతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాయకత్వంలో చేపట్టిన ఈ మహాదీక్ష మంగళవారం కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ నాగం జనార్దన్రెడ్డి, అరుణ జ్యోతి, టి.ఆచారీ, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సహా వివిధ కుల సంఘాల నాయకులు ప్రసంగించారు.