bhagat singh
-
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్ను బ్రిటిష్వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు
లాహోర్: పాకిస్తాన్లోని లాహోర్లో ఒక కూడలికి భారత స్వాతంత్ర్య పోరాట వీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడంలో జరుగుతున్న జాప్యంపై లాహోర్ హైకోర్టు అక్కడి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దీనిపై నోటీసులు జారీ చేస్తూ, సమాధానం చెప్పేందుకు చివరి అవకాశం ఇచ్చింది.లాహోర్లోని షాద్మాన్ చౌక్కు భగత్ సింగ్ పేరు పెట్టడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు పంజాబ్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును పంజాబ్ ప్రభుత్వం కోరింది. పాకిస్తాన్లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమ్స్ మహమూద్ మీర్జా విచారణ చేపట్టారు. ఈ అంశంపై స్పందించడానికి పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది సాద్ బిన్ ఘాజీ కోర్టుకు హాజరై, దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరారు.పంజాబ్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు, ఈ అంశంపై స్పందించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఖలీద్ జమాన్ ఖాన్ కాకర్ కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు నవంబర్ 8కి వాయిదా వేసింది.షాద్మాన్ చౌక్కు భగత్ సింగ్ పేరు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. 1931లో భగత్సింగ్ను ఉరితీసిన షాద్మాన్ చౌక్కు ఆయన పేరు పెట్టాలని లాహోర్ హైకోర్టు 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఖురేషీ తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. ఆయనను సిక్కులు, హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతగానో గౌరవిస్తారు.ఇది కూడా చదవండి: ఎమర్జెన్సీకన్నా దారుణం -
Durgawati Devi: మూడేళ్ల కొడుకును పణంగా పెట్టి... భగత్సింగ్ను కాపాడిన భాభీ
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్వీర్... వీరంతా ఆమెను ‘దుర్గా భాభీ’ అని పిలిచేవారు. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టగలం అని భావించిన దళంలో పిస్తోల్ పట్టిన తొలి విప్లవ వనిత దుర్గావతి దేవి. బ్రిటిష్ అధికారి సాండర్స్ను హత్య చేసిన భగత్సింగ్ను లాహోర్ నుంచి తప్పించేందుకు అతడి భార్య అవతారం ఎత్తిందామె. చరిత్ర పుటలలో కనుమరుగై పోయిన ఆ త్యాగమయి గురించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...‘సైమన్ గోబ్యాక్’ నిరసన కార్యక్రమం చేస్తున్న లాలా లజపతిరాయ్ మీద బ్రిటిష్ పోలీసుల లాఠీచార్జీ జరిగి ఆయన ప్రాణం పోయింది. పంజాబ్లో యువతకు మార్గదర్శిగా ఉన్న ఆ మహా నాయకుణ్ణి కోల్పోయినందుకు ‘హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ (హెచ్ఎస్ఆర్ఏ) సభ్యులకు ఆగ్రహం వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరయోధుడు భగవతి చరణ్ ఓహ్రా నడుపుతున్న గ్రూప్. చంద్రశేఖర ఆజాద్, భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ తదితరులంతా ఇందులో సభ్యులు. వీరంతా కలిసి లాఠీచార్జిని ఆర్డర్ వేసిన బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్ను చంపాలనుకున్నారు. నిర్ణయం అమలు పరచడమే తరువాయి.స్కాట్ బదులు సాండర్స్భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురు 17 డిసెంబర్ 1928న లాహోర్లో పోలీస్ ఆఫీసర్ స్కాట్ను హతమార్చడానికి సిద్ధమయ్యారు. అయితే బైక్ మీద రావాల్సిన స్కాట్ కారులో, కారులోనూ రావాల్సిన మరో అధికారి సాండర్స్ బైక్ మీద రావడంతో అయోమయం నెలకొంది. అయినా సరే ఎదురుపడిన సాండర్స్పై మొదట రాజ్గురు, ఆ తర్వాత భగత్ సింగ్ తుపాకీ పేల్చి అతణ్ణి హతమార్చారు. లాహోర్ అంతా గగ్గోలు రేగింది. వందలాది మంది పోలీసులు అన్ని దారులు... బస్టాండ్లు... రైల్వేస్టేషన్లు కమ్ముకున్నారు. లాహోర్లో ఉండటం భగత్సింగ్కు ఏ మాత్రం మంచిది కాదు. అతణ్ణి తప్పించేవారు ఎవరు?ఆమె వచ్చిందిభగవతి చరణ్ ఓహ్రా సతీమణి దుర్గావతిని అందరూ దుర్గాభాభీ అని పిలిచేవారు. సాండర్స్ని హత్య చేశాక భగత్సింగ్, రాజ్గురు నేరుగా దుర్గావతి దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆమె భర్త వేరే పని మీద కలకత్తా వెళ్లి ఉన్నాడు. జరిగింది తెలుసుకున్న దుర్గావతి వెంటనే భగత్సింగ్ను లాహోర్ దాటించడానికి సిద్ధమైంది. జుట్టు కత్తిరించుకుని హ్యాట్ పెట్టి రూపం మార్చిన భగత్సింగ్కు ఆమె భార్యగా నటిస్తూ తన మూడేళ్ల కొడుకుతో మరుసటి రోజు సాయంత్రం లాహోర్ నుంచి డెహ్రాడూన్ వెళుతున్న ఎక్స్ప్రెస్లో మొదటి తరగతి ప్రయాణికురాలిగా బయల్దేరదీసింది. వందలాది నిఘా కళ్ల మీద ఈ పని చేయడం చాలా ప్రమాదం... మూడేళ్ల కొడుక్కు కూడా ఏదైనా కావచ్చు అని భగత్సింగ్ ఆమెతో అన్నాడు. ‘నా కొడుక్కు మరణం సంభవిస్తే ఒక దేశభక్తునిగా తన ప్రాణం అర్పించే అవకాశం వాడికి దక్కుతుంది’ అని చెప్పి ఆమె ముందుకు కదిలింది. భగత్సింగ్ ఆధునికవేషంలో ఉన్న అధికారిగా, దుర్గావతి అతని భార్యగా, రాజ్గురు నౌకరుగా ఆ ప్రయాణం చేశారు. బ్రిటిష్ వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాలేదు. భగత్సింగ్ను అలా క్షేమంగా కలకత్తా చేర్చి వెనక్కు వచ్చింది దుర్గావతి.గొప్ప దేశభక్తురాలుస్వతంత్ర పోరాటం చేస్తున్న భగవతి చరణ్ ఓహ్రాను వివాహం చేసుకునేనాటికి దుర్గావతికి 13 ఏళ్లు. పెళ్లి తర్వాతనే చదువుకుంది. ఇంట్లో ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. సాయుధ పోరాటం చేయాలన్న భర్త ఆశయానికి మద్దతుగా నిలిచిందామె. భగత్సింగ్ను తన కన్నబిడ్డలా భావించింది. భగత్సింగ్ పార్లమెంట్లో బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాక ఆ తర్వాతగాని అతడే సాండర్స్ హత్యలో ఉన్నాడన్న సంగతి పోలీసులకు తెలియలేదు. ఆ కేసు వాదనలను బ్రిటిష్ ప్రభుత్వం హడావిడిగా ముగించి అక్టోబర్ 7, 1930న తీర్పు వెలువరించి భగత్సింగ్కు మరణశిక్ష విధించింది. అయితే లాహోర్లో ఈ విచారణ జరుగుతున్నప్పుడు భగత్సింగ్ను తీసుకెళ్లే వ్యానుపై బాంబుదాడి చేసి అతణ్ణి కాపాడాలని ప్లాన్ చేసింది దుర్గావతి. వీలు కాలేదు.భర్తను కోల్పోయిభగత్సింగ్ను జైలు నుంచి రక్షించడానికి స్వదేశీ జ్ఞానంతో బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు భగవతి చరణ్ ఓహ్రా మరణించాడు. అంత కష్టాన్ని తట్టుకుని దేశం కోసం పోరాడాలనుకుంది దుర్గావతి. భగత్సింగ్ మరణశిక్ష విధించాక ఆగ్రహంతో బొంబాయి వెళ్లి బ్రిటిష్ గవర్నర్ను చంపాలనుకుంది. అయితే గవర్నర్ దొరకలేదు. మరో బ్రిటిష్ అధికారి మీద స్వయంగా గుళ్ల వర్షం కురిపించి పగ చల్లార్చుకుంది. భగత్ సింగ్ ఉరి (1931 మార్చి 23) తర్వాత తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడం, పోలీసుల వెతుకులాట ఎక్కువ కావడంతో తనే వెళ్లి లొంగిపోయింది. మూడేళ్ల జైలు శిక్ష అనంతరం మొదట లక్నో ఆ తర్వాత ఘజియాబాద్లో పెద్దగా పబ్లిక్లో ఉండటానికి ఇష్టపడక స్కూల్ నడుపుతూ 1999లో తన 92వ ఏట మరణించిందా గొప్ప దేశభక్తురాలు, భారత తొలి సాయుధ పోరాట సమరయోధురాలు దుర్గాభాభీ. -
సినిమాకు అవార్డులు.. కానీ ఏం లాభం? రూ.22 కోట్ల నష్టం!
'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్'.. 2002లో వచ్చిన ఈ మూవీ జాతీయ అవార్డులు గెలుచుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్ జాబితాలో నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో నటించాడు. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహించాడు.భగత్ సింగ్పై ఏకంగా ఐదు సినిమాలుతాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి నిర్మాత రమేశ్ తరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మా సినిమా సరిగా ఆడలేదు. ఎందుకంటే అప్పుడు భగత్ సింగ్ మీదే ఐదు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఒకటి మా సినిమా కంటే వారం ముందు రిలీజైంది. సరిగ్గా అప్పుడే '23 మార్చి 1931: షాహీద్' సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలతో మాకు పోటీ ఏర్పడింది. భగత్ సింగ్పై తెరకెక్కిన మరో చిత్రం ఎందుకనో ఆగిపోయింది. రామానంద్ సాగర్ తెరకెక్కించిన మరో మూవీ ఏడాది తర్వాత నేరుగా దూరదర్శన్లో విడుదల చేశారు.రూ.27 కోట్లు ఖర్చు పెట్టాంభగత్ సింగ్ సినిమా రిజల్ట్తో మా కంపెనీ మొత్తం వణికిపోయింది. ఎందుకంటే రూ.27 కోట్లు పెడితే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. రూ.22 కోట్లు నష్టపోయాం. సినిమాకు మంచి గౌరవం దక్కినా నష్టం మాత్రం తీవ్ర స్థాయిలో వాటిల్లింది. రిస్క్ చేసింది మేము కాబట్టి ఆ నష్టాన్ని మేమే భరించాం. ఈ మూవీకోసం పని చేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాం' అని పేర్కొన్నాడు. కాగా ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీలో రెండు జాతీయ పురస్కారాలు అందుకుంది.చదవండి: భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్ -
వివాదంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మధ్యలో ఆమె భర్త, మద్యం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఫోటో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఫోటోపై భగత్ సింగ్ మునిమనవడు యాదవేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘నేటి రాజకీయాలు వ్యక్తిగతంగా మారుతున్నాయి. ప్రజలకన్న వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ నాయకుడిని ఆయనతో (భగత్సింగ్) పోల్చకూడదు. ఆయన దేశం, సమాజం కోసం కృషి చేశారు. సొంత ప్రయోజనాలు చూసుకోలేదు’ అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాటున ఇలా చేసి ఉంటే, దానిని సరిదిద్దాలని, అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాల మధ్య ఉంచిన కేజ్రీవాల్ ఫోటోను తొలగించాలని యాదవేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. అంతకుముందు, ఈ చిత్రంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్ నిందితుడని, భగత్ సింగ్ డాక్టర్ అంబేద్కర్ లాంటి దేశభక్తుల మధ్య అతని ఫోటోను ఉంచడం ఆప్ వారి గౌరవాన్ని కించపరిచిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు చీఫ్ వీరేంద్ర సచ్దేవా అన్నారు. -
భగత్సింగ్ను గుర్తుచేసుకుంటూ మారథాన్.. విజేతకు రూ. 4 లక్షల బహుమానం!
అమర వీరుడు భగత్ సింగ్ను గుర్తు చేసుకుంటూ మార్చి 24న మధ్యప్రదేశ్లోని భోపాల్లో మారథాన్ నిర్వహించనున్నారు. తాత్యా తోపే నగర్ స్టేడియంలో ‘షహీద్-ఏ-అజం’ పేరిట మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్లో పాల్గొనేవారి కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అన్ని వయసుల వారు ఈ మారథాన్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్లో పాల్గొనేవారికి టీ-షర్ట్, అల్పాహారం, సర్టిఫికేట్ అందించనున్నారు. మారధాన్ విజేతకు రూ.4 లక్షల నగదు బహుమానం అందించనున్నారు. 24న ఉదయం 6 గంటలకు మారథాన్ ప్రారంభం కానుంది. ఈ ఈ మారథాన్ను సిక్స్త్ సెన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆరోజు భగత్ సింగ్కు నివాళులు అర్పించనున్నారు. -
పవన్ కు హిందీ మూవీ ఎఫెక్ట్.. గుక్కపట్టి ఏడుస్తున్న ఫ్యాన్స్
-
భగత్ సింగ్ అపూర్వమైన దేశభక్తుడు- కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే
న్యూఢిల్లీ: షహీద్ భగత్ సింగ్ ఒక అపూర్వమైన దేశ భక్తుడని, ఆయన అందరివాడని, రాబోయే తరాలవారికి ఒక స్ఫూర్తి జ్యోతి అని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే భగత్ సింగ్ సేవలను కొనియాడారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠీ, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన " క్రాంతీ కి దరోహర్" (హిందీ) గ్రంధాన్ని ముఖ్య అతిధి కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే అంబేద్కర్ ఆడిటోరియం, ఆంధ్ర భవన్ , ఢిల్లీలో 28 సెప్టెంబర్ 2023 న సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. సభకు ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చెసిన శాంభవి మఠాధిపతి స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ మాట్లాడుతూ పటిష్ట భారత దేశం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళ్ పాండే, భగత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాల వారు పాల్గొన్నారు. -
షాకింగ్ ఘటన: ఉరి సీన్ రిహార్సల్లో విషాదం
సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఒక నాటకాన్ని రిహర్సల్ చేస్తూ బాలుడు మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కోలార్లోని ఎస్ఎల్వీ స్కూల్లో 12 ఏళ్ల సంజయ్ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి వచ్చేవారం స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భగత్ సింగ్ బయోగ్రఫీకి సంబంధించిన నాటకాన్ని వేయనున్నాడు. అందులో భాగంగానే ఇంట్లో రిహార్సల్ చేస్తున్నాడు సంజయ్. ఈ మేరకు సంజయ్ భగత్ సింగ్ని ఆంగ్లేయులు ఉరితీసే ఘట్టాన్ని రిహర్స్ల్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఉరి పడిపోయింది. దీంతో సంజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. దురదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అతడి కుటుంబికులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా సంజయ్ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగానే ఈ నాటకాన్ని ప్రతిరోజు సంజయ్ రిహార్సల్ చేస్తున్నాడని కుటుంబికులు చెబుతున్నారు. అందులో భాగంగానే శనివారం రాత్రి కూడా రిహార్సల్ చేసి ఇలా విగత జీవిగా మారాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సదరు సాంస్కృతిక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడమే గాక సంజయ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. (చదవండి: ఇంట్లోకి మొసలి ఎంట్రీ... బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఆ కుటుంబం....) -
ఆ ఎయిర్పోర్ట్కు భగత్ సింగ్ పేరు.. మోదీ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: చండీగఢ్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో వెల్లడించారు. ‘గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా.. చండీగఢ్ ఎయిర్పోర్ట్కు షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.’ అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సెప్టెంబర్ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మన్ కీ బాత్లో భాగంగా వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడారు మోదీ. వాతావరణ మార్పు అనేది జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్కు నివాళులర్పించారు మోదీ. ఆయన దేశ మహోన్నతమైన కుమారుడిగా పేర్కొన్నారు. ఇటీవలే భారత్కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమన్నారు. టాస్క్ఫోర్స్ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. మరోవైపు.. అమరవీరుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న చూపు చూస్తోందని చెప్పేందుకే బీజేపీ పేరు మార్పునకు పూనకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం భగత్ సింగ్ గ్రామం ఖట్కార్ కలాన్లోనే నిర్వహించారు. భగత్సింగ్ ఉపయోగించిన పసుపు టర్బన్స్ను సూచిస్తూ ప్రాంగణం మొత్తం పసువు రంగులతో నింపేశారు. అలాగే.. మార్చి 23న భగత్ సింగ్ వీరమరణం పొందిన రోజును సెలవుదినంగా ప్రకటించారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్ ఓకే -
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్రలోని గుజరాత్, రాజస్థాన్ ప్రజలను ఉద్ధేశిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గవర్నర్పై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ మాటలు మరాఠీలను అవమానపరచేలా, హిందువులను విభజించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. కోశ్యారీ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆయన మాటలతో ఏకీభవించమని షిండే స్పష్టం చేశారు. ‘కోశ్యారీ వ్యాఖ్యలతో ఏకీభవించం. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అతను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ముంబైవాసులను మేము ఎప్పుడూ మర్చిపోము. ముంబై అభివృద్ధి కోసం మరాఠీ ప్రజలు ఎంతో కృషి చేశారు. ముంబై ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన నగరం. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ముంబైని సొంత ఇంటిగా భావిస్తున్నప్పటికీ మరాఠీ ప్రజలు తమ గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకున్నారు. వారిని అవమానించకూడదు’ అని అన్నారు. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే ఇదిలా ఉండగా శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముఖ్యంగా పుణె, ముంబై వంటి ప్రాంతాల్లో డబ్బే ఉండదనిని వ్యాఖ్యానించారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధానిగా కొనసాగలేదని అన్నారు. ఇక గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సైతం స్పందిస్తూ.. మరాఠీ బిడ్డలను అవమానించేలా భగత్ సింగ్ కోశ్యారి మాట్లాడారని మండిపడ్డారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. -
Maharashtra Governor: ‘గుజరాతీలతోనే ముంబైకి ఆర్థిక రాజధాని పేరు’
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే రాష్ట్రంలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. ముంబైలోని అంధేరీలో ఓ చౌక్కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గవర్నర్. రాజీనామాకు శివసేన డిమాండ్.. గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరారు. ‘బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే మరాఠీలకు అవమానం ఎదురైంది. గవర్నర్ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించాలి. ఇది కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలకు అవమానం. సీఎం షిండే మీరు వింటున్నారా? నీపై నీకు ఆత్మగౌరవం ఉంటే.. గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలి.’ అంటూ ట్వీట్ చేశారు రౌత్. మరోవైపు.. కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించటం చాలా బాధాకరం. ఆయన పదవీ కాలంలో గవర్నర్ అధికారాలు, మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయాలు దెబ్బతినటమే కాదు.. రాష్ట్రాన్ని తరుచుగా అగౌరవపరుస్తున్నారు.’ అని పేర్కొన్నారు సచిన్ సావంత్. గవర్నర్ వెంటనే మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది. లేదంటే ఆయనను తొలగించాలని కేంద్రాన్ని కోరతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు ఇది సరైనదేనా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హో.. వారి కెబినెట్ మంత్రులకు ఆమోదం లభించనందుకేమో.. అంటూ ఎద్దేవ చేశారు ప్రియాంక. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
భగత్ సింగ్పై వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీగఢ్: భగత్ సింగ్పై వివాదాస్పద కామెంట్ చేశాడు పంజాబ్ ఎంపీ ఒకరు. సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీ స్థానానికి ఈమధ్యే ఎన్నికైన సిమ్రన్జిత్ సింగ్ మాన్(77) భగత్ సింగ్ను ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. సిమ్రన్జిత్ సింగ్ మాన్.. శిరోమణి అకాళీ దళ్(అమృత్సర్) చీఫ్ కూడా. ‘‘భగత్ సింగ్ యువకుడైన ఓ ఇంగ్లీష్ అధికారిని చంపాడు.సిక్కు కానిస్టేబుల్ ఛన్నన్ సింగ్నూ హతమార్చాడు. జాతీయ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఇప్పుడు చెప్పండి.. భగత్ సింగ్ ఉగ్రవాదా? కాదా?’’ అంటూ కామెంట్లు చేశాడు. ఖలిస్థానీ అనుకూల వ్యాఖ్యలు చేసే క్రమంలో.. ఇలా కామెంట్లు చేశాడు ఆయన. అయితే భగత్ సింగ్పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేం కాదు. స్వాతంత్ర్య సమరయోధుడు, వీరుడైన భగత్సింగ్ను ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని ఆప్ ప్రభుత్వం తప్పుబట్టింది. ఎంపీ వ్యాఖ్యలను హేయనీయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. మనోభావాలు దెబ్బతీసేలా, ఒక వీరుడ్ని అగౌరవపరిచేలా మాట్లాడినందుకు సిమ్రన్జిత్ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. పంజాబ్ రాజకీయాల్లో ఈయన వివాదాలకు కేరాఫ్. తాజాగా ఎంపీగా గెలిచిన వెంటనే ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. Shameful that some call him a terrorist. Shaheed-e-Azam Bhagat Singh is a hero, a patriot, a revolutionary and a true son of the soil. INQUILAB ZINDABAD! pic.twitter.com/7mpTalt3g1 — Raghav Chadha (@raghav_chadha) July 15, 2022 -
మహోజ్వల భారతి: భగత్సింగ్కి నచ్చిన కవి
రామ్ ప్రసాద్ బిస్మిల్ విప్లవకారుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర కేసులలో నిందితుడు. స్వాతంత్య్ర సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాశారు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. అలాగే ఆర్య సమాజ్ సంస్థతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. ఆర్య సమాజ్ బోధకులు స్వామి సోమ్ దేవ్ ఆయన గురువు. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ కూడా ఒకరు. భగత్ సింగ్ ఆయనను ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా ఆయన ఆంగ్లం నుంచి కేథరీన్, బెంగాలీ నుంచి బోల్షెవికోం కీ కర్తూత్ పుస్తకాలను హిందీలోకి అనువదించారు. ‘సర్ఫరోషీ కీ తమన్నా’తో సహా అనేక స్ఫూర్తిదాయ కమైన దేశభక్తి గీతాలు రచించారు. రాం ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11లో బ్రిటిష్ ఇండియాలో వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని షాజహాన్ పూర్లో జన్మించారు. ఇంట్లో తండ్రి నుండి హిందీ నేర్చుకొని ఒక మౌల్వీ నుండి ఉర్దూ అభ్యసించారు. రామ్ ప్రసాద్ తండ్రికి ఇంగ్లిష్ అంటే ఇష్టం లేకున్నా తన కుమారుడిని ఆంగ్ల భాష పాఠశాలలో చేర్పించారు. విప్లవ యోధుడిగా మారాక, ముప్పై ఏళ్ల వయసులో ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబర్ 19న ఉరి తీసింది. -
చైతన్య భారతి: భగత్సింగ్ / 1907–1931
‘ది లెజెండ్ ఆఫ్ భగత్సింగ్’ సినిమాకు స్క్రిప్టు రాయడానికి నేను పరిశోధన చేపట్టినప్పుడు నన్ను నిరంతరం తొలిచిన ప్రశ్న– అసలు ఆయన ఎందుకు ప్రాణాలను బలిపెట్టాలను కున్నారు? రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న కుటుంబంలో జన్మించిన భగత్సింగ్కు బాలుడిగా ఉన్నప్పుడే భారతదేశం పరాయి దేశ పాలనలో ఉందనే సంగతి తెలుసు. అయితే, జలియన్వాలా బాగ్ ఊచకోత తరువాతనే విదేశీ పాలన ఘోరమైన పరిణామాలను ఆయన ఆర్థం చేసుకోగలిగారు. అక్కడి దృశ్యాలు ఆయనను ఎంతగా కదలించాయంటే, అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలోకి నింపి, ఆనాటి ఘోరకలికి గుర్తుగా భద్రపరచుకున్నారు. పరాయి పాలనలో మగ్గుతున్నప్పుడు ఇలాంటి దారుణాలు అనివార్యమనే సంగతిని తనకు ఆ సీసా జీవితాంతం గుర్తు చేయాలని భగత్ భావించారు. బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడి లాలా లజపతి రాయ్ మరణించినప్పుడు భగత్ ఆగ్రహంతో రగిలిపోయారు. అణచివేతదారుల హింసను విప్లవాత్మక ప్రతి హింసతో ఎదుర్కోవాలని ఆయన భావించారు. లాలాపై లాఠీ ప్రయోగించిన అధికారి మీద తన స్నేహితులతో కలిసి నాలుగు తూటాలు పేల్చారు. అది భగత్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన. చదవండి: స్వతంత్ర భారతి: డియర్ గెస్ట్.. నేను మీ కెప్టెన్ బ్రిటిష్ అధికారిని చంపినందుకు ప్రభుత్వం తనను ఉరి తీస్తుంది. దాని గురించి భగత్సింగ్కు భయం లేదు. ఆయనకు ముఖ్యమైనది భారతదేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న ఆశయమే. ఆ లక్ష్య సాధనకు తన జీవితం లేక మరణమనేవి సాధనాలు మాత్రమే. అలా 23 ఏళ్లకే భగత్ సింగ్ పరిపూర్ణ ఆదర్శవాదిగా మారిపోయారు. ఆయన లక్ష్యం ఆయన ప్రాణాలకంటే మించినది. ప్రేమించిన వారి కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం ఆనందంగా ప్రాణాలను బలిపెట్టాలనుకునే మనఃస్థితి ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే అదెలా ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదు. నేడు ప్రతి ఒక్కరూ భగత్సింగ్ను తమవాడంటున్నారు. చివరకు సంఘ్ పరివార్ కూడా. సంఘ్ రాజకీయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుంచుకోవాలి. ఆయన విశిష్టతను నిజంగా తెలుసుకోవడమంటే, శౌర్య సారాన్ని అవగాహన చేసుకోవడమే. భగత్సింగ్ శౌర్యం తుపాకీ పేల్చడంలో లేదు. ఆయన ఆదర్శాలు, ఆచరణల మేళవింపులోనే ఉంది. – అంజుం రాజాబాలి (రాజాబలి మాటలు రాసిన బాలీవుడ్ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ భగత్సింగ్’ విడుదలై నేటికి ఇరవైఏళ్లు) -
అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: అమరవీరుల దినోత్సవం(మార్చి 23న) సందర్భంగా బుధవారం శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్సింగ్ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం–గవర్నర్ మధ్య పెరిగిన దూరం?
సాక్షి, ముంబై: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్కు, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు అంత సహృద్భావంగా లేవని, వారిద్దరి మధ్య దూరం పెరిగిందని గతంలో జరిగిన పలు సంఘటనల వల్ల తెలుస్తోంది. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి.. అంటే గత రెండు సంవత్సరాల నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య కేవలం రెండంటే రెండుసార్లు మాత్రమే పరస్పర మర్యాదపూర్వకమైన భేటీ జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శాసన మండలికి ఎంపిక కావడం, 12 మంది శాసన మండలి సభ్యులను నియమించడం, ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడం, శాసన సభ అధ్యక్షుడి ఎన్నిక లాంటి కొన్ని అంశాల పట్ల గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ వ్యవహరించిన తీరుపట్ల ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోందని తెలుస్తోంది. పలు సందర్భాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నాయకుడు సంజయ్ రావుత్తో పాటు, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ కూడా గవర్నర్ వ్యవహార శైలిని అక్షేపించా రు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా, గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు, చర్చలు, సత్సం బంధాలు ఉంటాయి. పరస్పరం మర్యాదçపూర్వకం గా కలుసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. కానీ, గత రెండు సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లుగా కనిపిస్తోంది. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ 2019 నవంబర్ 28వ తేదీన ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారిద్దరి మధ్య అదే మొదటి కలయిక. చదవండి: ముఖ్యమంత్రి బావమరిదిపై ఈడీ కేసు.. రూ. 6.45 కోట్ల ఆస్తులు సీజ్ ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మహాపరినిర్వాణ రోజైన 2019 డిసెంబర్ ఆరవ తేదీన దాదర్లోని చైత్యభూమిలో రెండవసారి కలుసుకున్నారు. ఆ తరువాత 1 జనవరి, 2020న శాసన సభ మొదటి సమావేశాల్లో శాసన సభ ప్రాంగణంలో మూడవసారి కలుసుకున్నారు. 3 జనవరి 2020న ఠాక్రేల నివాసస్థానమైన మాతోశ్రీ భవనంలో జరిగిన ఒక విందుభోజనంలో గవర్నర్ కోశ్యారీ పాల్గొన్నారు. అది ఠాక్రేతో నాలుగవ కలయిక. 20 జనవరి, 2020న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజ్భవన్ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది ఆ ఇద్దరి మధ్య జరిగిన మొదటి మర్యాదపూర్వకమైన సమావేశం. దాని తర్వాత 9 ఫిబ్రవరి రోజు మరోసారి ముఖ్యమంత్రి రాజ్భవన్లోనే రెండవసారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ సమావేశం తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగి ఇంతవరకు మూడవ మర్యాదపూర్వకమైన భేటీ, సమావేశం ఇంతవరకు జరగలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే సంకేతాలు రాజకీయవర్గంలో చర్చనీయాంశమయ్యా యి. గత రెండుంపావు సంవత్సరాల కాలంలో రెండుసార్లు తప్ప ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య నేరుగా మర్యాదపూర్వకమైన భేటీ జరగలేదు. అనధికారికంగా 30సార్లు భేటీ.. వీరిద్దరు ప్రజావేదికలపైన, ప్రభుత్వ కార్యక్రమాల్లో దాదాపు 30 సార్లు కలుసుకున్నారు. ఇందులో ప్రముఖంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు, మహారాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాలు, శాసన మండలి సమావేశాల ప్రారంభంలో, మంత్రివర్గ ప్రమాణస్వీకారం సమయంలో, లోకాయుక్త ప్రమాణ సందర్భంలో, ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్వాగత సమయంలో, ఇలాంటి పలు సందర్భాల్లో కలుసుకున్నప్పటికీ మర్యాదపూర్వకంగా మాత్రం రెండుసార్లు మాత్రమే కలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే తండ్రి మాధవరావ్ పాటన్కర్ చనిపోయినప్పుడు గవర్నర్ కోశ్యారీ మర్యాదపూర్వకంగా మాతోశ్రీ భవనానికి వెళ్ళి రశ్మి ఠాక్రేను ఓదార్చి వచ్చారు. 17 జూన్ 2021 నాడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజ్భవన్ వెళ్ళి గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఇలాంటి కొన్ని సందర్భాలు తప్ప అధికారికంగా సహద్భావ వాతావరణంలో వారిద్దరి మధ్య ఎలాంటి సమావేశాలు జరగడం లేదు. -
భగత్సింగ్ సదా స్ఫూర్తి ప్రదాత
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సంగ్రామంలో భగత్సింగ్ చేసిన త్యాగం మహోన్నతమైనదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఆయన నిరుపమాన పోరాటం, త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. విప్లవ వీరుడు భగత్సింగ్ దేశ ప్రజలకు సదా స్ఫూర్తి ప్రదాత అని గవర్నర్ అన్నారు. భగత్సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గవర్నర్ నివాళులు అర్పించారని రాజ్భవన్ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
భగత్ సింగ్ ఉరి సన్నివేశం రిహార్సల్ విషాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బుడౌన్లోని బాబాత్ గ్రామంలో భగత్ సింగ్ ఉరి వేసే సన్నివేశాన్ని రిహార్సల్ చేస్తుండగా.. 9 ఏళ్ల బాలుడు మరణించాడు. వివరాల్లోకి వేళితే.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్వాతంత్ర్య సమరయోధుల జీవితం ఆధారంగా ఒక నాటకం కోసం యూపీలోని పాఠశాల విద్యార్థులు రిహార్సల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శివమ్(9) అనే బాలుడు భగత్ సింగ్ పాత్రను పోషించాలనుకున్నాడు. బాలుడు స్నేహితులతో కలిసి అతని ఇంటి ప్రాంగణంలో రిహార్సల్ చేయడం మొదలు పెట్టారు. నాటకం చివరి సన్నివేశం కోసం శివమ్ ఒక తాడును తీసుకొని ఓ ఉచ్చును రూపొందించాడు. దాన్ని అతని మెడ చుట్టూ తగిలించుకున్నాడు. కానీ ప్రమాదావశాత్తు అతని పాదాలు స్టూల్ నుంచి జారిపోవడంతో ఉరి బిగుసుకుంది. ఆ సమయంలో అతడు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతడి స్నేహితులు ఇదంతా యాక్టింగ్ అనుకున్నారు. ఇంతలో శరీరంలో కదలికలు లేకపోయే సరికి పిల్లలు భయపడి అరిచారు. దీంతో స్థానికులు వచ్చి శివమ్ను కిందికి దించారు. కానీ అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కాగా గత సంవత్సరం కూడా మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో భగత్ సింగ్ ఉరిశిక్ష రిహార్సల్ చేస్తూ ఓ బాలుడు మరణించాడు. -
ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కాంగ్రెస్ నేత, ఆనంద్పుర్ సాహెబ్ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మనీశ్ తివారీ కోరారు. అంతకన్నా ముందు వారిని ‘షహీద్ ఎ ఆజమ్’బిరుదుతో సత్కరించాలని, మొహాలిలోని చండీగఢ్ విమానాశ్రయానికి భగత్సింగ్ పేరు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా ఈ ముగ్గురు వారి కాలంలో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించారని, ఆ క్రమంలోనే 1931 మార్చి 23వ తేదీన దేశంకోసం ప్రాణాలు అర్పించారని మనీశ్ తివారీ తెలిపారు. -
ఘనంగా జాషువా జయంతి
-
ఏపీ సీఎంవోలో గుర్రం జాషువా జయంతి వేడుకలు
సాక్షి, విజయవాడ : గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరై గుర్రం జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. జాషువా రచనలను వారు ప్రస్తుతించారు. ఆయన సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆదర్శప్రాయంగా నిలిచారని వక్తలు ప్రశంసించారు. దళిత సాహిత్యం, చైతన్య వంతమైన సాహిత్యానికి జాషువా పెట్టింది పేరని వారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. భగత్సింగ్కు నివాళుర్పించిన జగన్.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు.. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదని నిరుపించిన వ్యక్తి భగత్ సింగ్ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘షహీద్’ అనాలా, ‘మార్టైర్’ అనాలా!?
సాక్షివెబ్ ప్రత్యేకం: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికులకు షహీద్ లేదా మార్టైర్ హోదాను కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విశయం తెల్సిందే. సైన్యంలో అలాంటి హోదా లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ పుల్వామా దాడిలో మరణించిన సైనికుల గురించి మోదీ ప్రస్తావించినప్పుడల్లా వారిని ‘షహీద్’ అని అంటున్నారు. గతంతో భారత సైనికులు మరణించినప్పుడు ‘మార్టైర్’ అని వ్యవహరించారుగానీ ‘షహీద్’ అని వ్యవహరించలేదు. అయితే బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారిని ‘షహీద్’గా వ్యవరించారు. అందుకు ఉదాహరణ భారత స్వాతంత్య్ర సమర యోధుడు ‘షహీద్ భగత్ సింగ్’. ఆయన గురించి 1965లో ‘షహీద్’ పేరిట మనోజ్ కుమార్ నటించిన, 2002లో బాబీ డియోల్ నటించిన ‘షహీద్’ సినిమాలు వచ్చాయి. షహీద్ అనే పదం హిందీ పదంగా, మార్టైర్ పదం ఇంగ్లీషు పదంగా నేడు చెలామణి అవుతోంది. తెలుగులో ఈ పదాలకు ‘అమర వీరుడు’గా వ్యవహరిస్తున్నారు. తెలుగు వ్యవహారంలో ఇది మంచి పదమేగానీ సమానార్థం కాదు. ‘షహీద్’ పదం అరబిక్ నుంచి రాగా, ‘మార్టైర్ అనే పదం గ్రీకు మూలం నుంచి వచ్చింది. ఈ రెండు పదాలకు సమానార్థం సాక్షి. ఆది నుంచి ఇస్లాం మతంతో షాహిద్, క్రైస్తవ మతంతో మార్టైర్ అనే పదాలు అల్లుకు పోయాయి. ‘మార్టైర్’ పరిణామ క్రమం ‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చి’ ప్రకారం మార్టైర్ అంటే ‘సాక్షి’ అని అర్థం. క్రైస్తవంలో ప్రధాన మత బోధకుడిని, ఏసు క్రీస్తు ప్రధాన అనుచరులను మార్టైర్ గా పేర్కొనే వారు. అంటే మత బోధనల్లో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన ప్రత్యక్ష సాక్షి అనే అర్థంలోనే అలా పిలిచేవారు. మత ప్రచారం కోసం ఎవరైనా మరణిస్తే లేదా ప్రాణాలర్పిస్తే వారి మార్టైర్ గా వ్యవహరించడం కాలక్రమంలో వచ్చింది. క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే నాటి రోమన్లు క్రైస్తవ ప్రచారకులపైకి సింహాలను వదిలేవారు. వాటి చేతుల్లో మరణించిన వారిని మారై్టర్స్గా పిలిచేవారు. ‘బైబిల్’ రెండో భాగమైన ‘న్యూ టెస్టామెంట్’లో మార్టైర్ గురించి ఎక్కువగా ఉంది. మార్టైర్ అంటే మరణించిన వారికన్నా, ప్రధాన మత బోధకులనే అలా ఎక్కువగా వ్యవహించడం అందులో కనిపిస్తుంది. షహీద్ పరిణామ క్రమం అరబిక్ మూలం నుంచి వచ్చిన ‘షహీద్’ సమానార్థం ‘సాక్షి’యే అయినప్పటికీ మత ప్రచారంలో భాగంగా ప్రాణాలను కోల్పోయిన వారినే ‘షహీద్’లుగా ఎక్కువగా పేర్కొంటున్నారు. ‘ఖురాన్’లో సాక్షి అనే అర్థంలోనే షహీద్ పదాలను వాడారు. ముస్లింలలో ముఖ్యంగా షియా తెగవారు మరణించిన వారిని ‘షహీద్’లుగా పేర్కొంటున్నారు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం మరణించే వారంతా వారి దృష్టిలో షహీద్లే. ‘హుతాత్మా’ అంటే ఏమిటీ ? షాహిద్, మార్టైర్ అనే రెండు పదాలు కూడా రెండు మతాలకు సంబంధించినవి కావడం వల్ల దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికులను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పదాలతో పిలవరాదని ‘హిందూత్వ’ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర వీరుడు అనే అర్థంలో మరాఠీ మూలం నుంచి ‘హుతాత్మ’ అనే సంస్కృత పదాన్ని కాయిన్ చేశారు. దక్షిణ ముంబైలో అమర వీరుల స్మారక స్థూపానికి ‘హుతాత్మ చౌక్’ అని పేరు పెట్టారు. ప్రపంచ చరిత్రలో కోకొల్లలు భారత దేశం సెక్యులర్ దేశమని, సెక్కులర్ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు మరణిస్తే ‘మార్టైర్’ పదాన్ని ఉపయోగించరాదని 2017లో సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ వాదించారు. కానీ ప్రపంచ చరిత్రలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారిని మార్టైర్స్గా పేర్కొనడం ఉంది. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియా రాజ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన హంగేరియన్లను, 20వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన ఐరిష్ అమర వీరులను మార్టైర్స్గా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అభ్రహాం లింకన్ హత్య తర్వాత పది రోజులకు ఆయన నిజమైన దేశభక్తుడైనందున ఆయనకు మార్టైర్ హోదా కల్పించాలంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ డిమాండ్ చేసింది. మార్టిన్ లూథర్ కింగ్ను ‘అహింసా మార్టైర్’గా వాషింఘ్టన్ పోస్ట్ వ్యవహరించింది. మన సైన్యం ఏమంటుంది ? మన భారత దేశ సైనిక పరిభాషలో దేశం కోసం మరణించిన సైనికులను ‘బాటిల్ క్యాజువాలిటీ లేదా ఆపరేషన్స్ క్యాజువాలిటీ’ అని వ్యవహరిస్తున్నారు. అంతకుమించి ఎలాంటి విశేషణాలు వాడడం లేదు. (గమనిక: అమర వీరులను సావర్కర్ సూచించినట్లు ‘హుతాత్మలు’గా వ్యవహరించాలంటూ హిందూత్వ వాదులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరింత స్పష్టత కోసం ఈ వ్యాసం) -
పవన్ కల్యాణ్.. భగత్సింగ్ ఆత్మహత్య చేసుకున్నారా?
సాక్షి, హైదరాబాద్ : భగత్ సింగ్.. మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే... దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి... ఉరికొయ్యను ముద్దాడిన ఈ స్వాతంత్ర్య సమరయోధుడు ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. డల్లాస్ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధులను ఉదహరిస్తూ భగత్ సింగ్ పేరును ప్రస్తావించారు. భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని సూచించారు. అయితే భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి.. వారి చేతిలో ఉరితీయబడ్డారని అందరికీ తెలిసిందే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పొరపాటుగా భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ అజాద్ పేరు బదులు భగత్ సింగ్ పేరును పొరపాటుగా ప్రస్తావించారని ఆయన అభిమానులు సమర్ధించుకుంటున్నారు. బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టడంతో ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్నప్పుడు చేసిన శపథం నిజం చేస్తూ ఆజాద్ తన తుపాకీతో కాల్చుకుని వీరమరణం పొందిన విషయం తెలిసిందే. -
అమరుల త్యాగానికి గుర్తింపేది?
సర్దార్ భగత్ సింగ్, భారత్ గర్వించదగిన సమరయోధుడు. జాతిపిత గాంధీజీ శాంతి ఉద్యమం ఎంత సమున్నతమైనదో, భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి యువకుల ప్రాణ త్యాగం కూడా అంతే కీలకమైంది. నేతాజీ నడిపిన ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. వారిని గుర్తిస్తున్నామా? అధికారికంగా మన దేశం వారికి ఏ స్థాయి కల్పిస్తున్నది? భగత్సింగ్ను షహీద్ అని ప్రభుత్వం గుర్తించిందా లేదా, గుర్తించడానికి చట్టపరంగా ఏవైనా ఇబ్బందులు, పరిమితులు, ఆంక్షలు ఉన్నాయా, కనీసం ఆయనను స్వతంత్ర సేనానిగా ప్రభుత్వం అంగీకరిస్తుందా అని సమాచారం అడిగారు అమిత్. ఆయన అడిగింది రాష్ట్రపతి భవన్ అధికారులను. వారు ఆయన ఆర్టీఐ దరఖాస్తును హోం శాఖకు పంపించారు. హోం శాఖ దాన్ని అదే వేగంతో పురావస్తుశాఖకు తరలించింది. భగత్సింగ్ జీవితానికి, పోరాటానికి సంబంధించిన పత్రాలను ఎవరైనా వచ్చి చదువు కోవచ్చునని, భగత్ సింగ్ గుర్తింపుపై సమాచారం తమదగ్గర ఉన్న దస్తావేజులలో లేదని పురావస్తు శాఖ తెలిపింది. సంతృప్తి చెందని అమిత్ కుమార్ సమాచార కమిషన్ తలుపు తట్టారు. ఈ సమాచార అభ్యర్థన నిజానికి ప్రభుత్వం భగత్ సింగ్ వంటి వీర పుత్రుల గురించి ఏదైనా విధాన నిర్ణయం తీసుకుందా, తీసుకుంటే ఆ విధానం గురించి సమాచారం ఇస్తుందా అనేవి అసలు ప్రశ్నలు. ఈ వీరులు తమ యవ్వనాన్ని లెక్క చేయకుండా దేశానికి అర్పించారని ప్రధాని నివాళులర్పించారు. ఆ ముగ్గురు వీరులు ఉరికంబానికి వేలాడిన మార్చి 23న దేశ భక్తులంతా నివాళులర్పిస్తారు. వారు అమరులై 81 ఏళ్లు దాటింది. ఈ సంవత్సరం మార్చి 25న ఆరోరా అనే న్యాయవాది, భగత్ సింగ్ విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటని అడిగారు. దానికి హోం మంత్రిత్వ శాఖ ‘జీవించి ఉన్న వారినైనా మరణించిన వారినైనా అమర వీరులుగా అధికారికంగా గుర్తించలేదు’ అంటూ ఈ దరఖాస్తును జాతీయ పురావస్తు విభాగానికి బదిలీ చేశారు. ఇలా అయితే రాబోయే తరాలు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఉద్ధంసింగ్, కర్తార్సింగ్ వంటి అమరుల త్యాగాలను మరిచిపోతాయని ఆరోరా అన్నారు. భారత ప్రభుత్వం లేదా పంజాబ్, హరియాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమరవీరులకు షహీద్ గౌరవాన్ని ఇవ్వాలి. అధికారికంగా ప్రకటన జారీచేయాలని ఆరోరా కోరారు. అమర వీరులు, స్వాతంత్య్ర పోరాట వీరుల జాబితాలను ముందు తరాలవారి కోసం అధికారికంగా విడుదల చేయాలని కోరారు. ప్రతి ఏడాదీ ఇటువంటి డిమాండ్ వస్తూనే ఉంది. హోం శాఖ మాదగ్గర ఏ అధికారిక పత్రం లేదు. కనుక మేం చెప్పేది ఏమీ లేదని జవాబు ఇస్తూనే ఉంది. పంజాబ్ ప్రభుత్వం సరబ్జిత్ సింగ్ను జాతీయ అమర వీరుడుగా ప్రకటించింది. మరి భగత్సింగ్ను ఎందుకు వదిలేశారు అని వీరు అడుగుతు న్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టు మార్చి 20 (2018) నాటి తీర్పులో ఈ ముగ్గురు వీరులను షహీద్ అని ప్రకటించాలని ఆదేశించడానికి ఏ చట్టమూ లేదని వివరించింది. ఆర్టికల్ 18 ప్రకారం బిరుదులు ఇవ్వడానికి వీల్లేదని పంజాబ్ ప్రభుత్వం వాదించింది. బీరేంద్ర సంగ్వాన్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి న్యాయమూర్తులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, సి.హరిశంకర్ డిసెంబర్ 12, 2017న ఈ విధమైన తీర్పు ఇచ్చిందని పంజాబ్ హరియాణా కోర్టు ఉటంకించింది. 2015లో ఆర్టీఐ దరఖాస్తుకు కూడా హోం శాఖ ఇదే సమాచారం ఇచ్చింది. ఆనాటి ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ‘భగత్సింగ్ గురించి అధికారిక పత్రాలు ఉన్నా, లేకపోయినా, వారు ఈ దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అవిభాజ్యమైన భాగస్వాములుగా ఉంటారు. వారి వారసత్వాన్ని జాతి గర్వంగా స్వీకరిస్తుంద’ని అన్నారు. భగత్ సింగ్ మనవడు అధికారికంగా వారికి షహీద్ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విభిన్న రంగాలలో పేరెన్నిక గన్న వారికి భారతరత్న, పద్మ అవార్డులు ఇవ్వడానికి, సైన్యంలోని వారికి వీరచక్ర బిరుదులు ఇవ్వడానికి, క్రీడాకారులకు ఖేల్ రత్న బిరుదులు ఇవ్వడానికి అడ్డురాని ఆర్టి కల్ 18 భగత్ సింగ్ను అమరవీరుడని అధికారికంగా పిలవడానికి అడ్డొస్తుందా? భగత్ సింగ్ వంటి వీరులను, ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను అధికారికంగా గుర్తించడానికి ఏమైనా ఆలో చిస్తున్నారో లేదా అనే విషయమై ఇప్పటి ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు వీలుగా హోంమంత్రి ముందు ఈ దరఖాస్తును ఉంచాలని సీఐసీ ఆదేశించింది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
‘భగత్సింగ్ భారత్-పాక్ల హీరో’
లాహోర్, పాకిస్తాన్ : భారత జాతి బానిస సంకెళ్లు తెంచేందుకు బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగి పిన్నవయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్. ఆయనను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ మహా వీరుడ్ని స్మరించుకుంటూ.. పాక్ ప్రభుత్వం అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచింది. సోమవారం లాహోర్లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్ద ఉన్న పంజాబ్ రాష్ట్ర ఆర్కైవ్స్ విభాగంలో డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో భగత్ సింగ్కు ఉరి శిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ, ఆయన చదివిన పుస్తకాలు, జైల్లో ఉన్నప్పుడు వార్తపత్రికల కోసం భగత్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తులు, కుమారుడి ఉరిశిక్షను రద్దు చేయాలంటూ భగత్ సింగ్ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటీషన్, ఉరి శిక్షను అమలు చేసినట్లు లాహోర్ జైలు సూపరింటెండెంట్ సంతకంతో ఉన్న పత్రం(భగత్ సింగ్ను మార్చి 23, 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది). జైలు నుంచి భగత్సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు, కళాశాలలో భగత్ సింగ్ అడ్మిషన్ పొందిన రికార్డులు మొదలైనవి ప్రదర్శనకు ఉంచారు. అయితే, ఈ ప్రదర్శనను నిర్వహించాలని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్ సయీద్ అధ్యక్షతన జరిగింది. భగత్ సింగ్ భారత్-పాక్ రెండు దేశాలకు చెందిన హీరో అని, బ్రిటీష్ ప్రభుత్వంపై ఆ వీరుడు సాగించిన పోరాటాలు ఇరు దేశాల ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచినట్టు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. -
అవిశ్వాసం; శాంతి తర్వాత అశాంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావాల్సిఉండగా సభ వాయిదాపడింది. శుక్రవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే షహీద్ దివస్కు సంబంధించి స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్యసమరయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను జాతి గుర్తుచేసుకుంటున్నదని, వారి త్యాగాలు మరువలేనివని స్పీకర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమరులకు నివాళులు అర్పించిన పార్లమెంట్.. నిమిషంపాటు మౌనం పాటించింది. శాంతి తర్వాత అశాంతి: అమరులను తలుచుకుంటూ మౌనం పాటించడం పూర్తైన వెంటనే సభలో ఎప్పటిలాగే నినాదాలు మిన్నంటాయి. మౌనం ముగిసిందనడానికి సూచనగా స్పీకర్ ‘ఓం శాంతి..’ అని అన్నారు. అప్పటికే వెల్లో ఉన్న టీఆర్ఎస్, ఏఐడీఏంకే సభ్యులు మౌనం ముగియగానే నినాదాలు చేశారు. దీంతో స్పీకర్.. ‘శాంతి తర్వాత అశాంతి..’ అని చమత్కరించారు. శాంతించాలని ఎంత చెప్పినా సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. రాజ్యసభలో: షహీద్ దివస్ సందర్భంగా అటు రాజ్యసభలో అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కొద్దినిమిషాలు మాత్రమే సజావుగా సాగిన సభ.. విపక్షాల ఆందోళనలతో మళ్లీ గందరగోళంగా మారింది. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదావేశారు. -
సైన్యానికే సైనికుడు
సైన్యంలో ఎంతోమంది సైనికులు ఉంటారు.ప్రతి సైనికుడూ గొప్పవాడే. కానీ.. ఒక్కోసారి.. ‘ఈ సైనికుడు లేకపోతే..సైన్యమే లేదు’ అనిపించేలా ఒకడుంటాడు! సైన్యానికే సైనికుడతడు. అలాంటి సైనికుడే కెప్టెన్ హర్భజన్. అది సిక్కిం రాష్ట్రంలోని నాథులా కనుమ. ఇండో– చైనా సరిహద్దులో ఉన్న నాలుగు మీటింగ్ పాయింట్లలో ఒకటి. రెండు దేశాల సైనికులు జాతీయ జెండాలను గౌరవించే ఫ్లాగ్మీట్లో రెండు దేశాల సైనికులు, అధికారులు ఉన్నారు. భారత్ వైపు ఒక ఖాళీ కుర్చీ కూడా ఉంది. ఆ కుర్చీలో అధికారి ఉన్నట్లే, సైనిక వందనం చేస్తున్నారు. అది గౌరవ కెప్టెన్ హర్భజన్ సింగ్ది. హర్భజన్ జనం మధ్య లేడు, కానీ జనం మనసులో ఉన్నాడు. సైనికులు రోజూ హర్భజన్ బూట్లు పాలిష్ చేస్తారు, బెడ్ షీట్ మారుస్తారు. కెప్టెన్ గది బయట సెంట్రీగా ఒక సిపాయి డ్యూటీ చేస్తాడు. జానపద కథలా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ క్రమం 1968 నుంచి అతడి నార్మల్ రిటైర్మెంట్ వయసు వరకు జరిగింది. ఇంతకీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఎవరు? యువరక్తం ఉరుకులు హర్భజన్ సింగ్ది పంజాబ్, కపుర్తలా జిల్లాలోని బ్రౌన్దాల్ గ్రామం. సైన్యంలో ఉద్యోగం అంటే ఉత్తేజం, దేశం కోసం పనిచేయడా న్ని హీరోయిజం గా భావించేవాడు. 1956లో పంజాబ్ రెజిమెంట్ 23వ బెటాలియన్లో చేరాడు. సిక్కుల ధైర్యంతోపాటు హర్భజన్కి దేశభక్తీ ఎక్కువే. చైనా సరిహద్దు అప్పట్లో సెన్సిటివ్ జోన్ కావడం కూడా అతడి అంకిత భావానికి ఒక కారణం కావచ్చు. ‘దేశం కోసమే బతుకుతాను, దేశం కోసమే చస్తాను. వీర మరణమే సైనికుడికి గౌరవం’ అనేవాడు. క్లిష్టమైన బాధ్యతలను ఇష్టంగా తలకెత్తుకునేవాడు. అప్పటికి అతడికి 27 ఏళ్లు. ఇరుదేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యేలా ఉంది! చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. యుద్ధానికి పరుగులు పర్వత సానువుల్లో ఇరుకైన రాళ్లబాటలో యుద్ధ సామగ్రి, ఆహారాన్ని తరలించడం అంటే మాటలు కాదు. యుద్ధం చేయడం కంటే కష్టం. సైనికులు వార్మూడ్లోకి వచ్చేశారు. బృందాలుగా విడిపోయి ఒక్కొక్క పాయింట్లో మాటు వేశారు. కెప్టెన్ అన్ని స్థావరాలనూ పర్యవేక్షిస్తున్నాడు. ఎక్కడో సందేహం. ఈ సామగ్రితో యుద్ధానికి దిగగలమా? వాకీటాకీలో బేస్ క్యాంపుకు లైన్ కలిపాడు. అక్కడ సామగ్రి ఉంది, అది చేరడానికి అనువైన వాతావరణం లేదు. రాళ్లలో వాహనం ఎక్కడ ఆగిపోతుందో ఊహించలేం. టుకు కనుమ నుంచి డోంగ్చుయి కనుమకు చేర్చాలి సామగ్రిని. ‘‘నేను చేరుస్తాను’’ ముందుకొచ్చాడు హర్భజన్. అంతుచిక్కని జాడలు మిలటరీ వెహికల్ పది కిలోమీటర్ల దూరం వెళ్లేటప్పటికి వాకీటాకీలో ‘వాహనం నడిచే చప్పుడు వినిపిస్తోంది. శత్రువుకి సంకేతాలందే ప్రమాదం ఉంది’ అని అలర్ట్ వచ్చింది. అంతే... వాహనం నుంచి వస్తువులను దించాడు. మ్యూల్స్ (హిమాలయాల సానువుల్లో ఉండే పొట్టి గుర్రాలు)ను తోలుకొచ్చి వాటి మీద పేర్చాడు. దాదాపుగా ఏడాదంతా మంచుతో కప్పేసి ఉండే ఆ నేల, కాలు పెడితే జారడానికి సిద్ధంగా ఉంటుంది. అది అక్టోబర్ నెల. వర్షం కురిసిన నేల చిత్తడిగా ఉంది. హిమాలయాలలో కురిసిన వర్షంతో నదిపాయలు నిండుగా హోరెత్తుతూ ప్రవహిస్తున్నాయి. హర్భజన్ కాలు పట్టుతప్పి జారిందో, లేక అతడే నీళ్లను అంచనా వేయలేకపోయాడో.. చెప్పడానికి అతడి పక్కన అప్పుడు ఎవరూ లేరు. హర్భజన్ మాత్రం గమ్యం చేరలేదు. అతడి కోసం మూడు రోజులు గాలించిన తరవాత దేహం దొరికింది. ‘దేశం కోసం మరణించడమే సైనికుడికి గౌరవం’ అతడి మాటలు అందరికీ చెవుల్లో వినిపిస్తున్నాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు తోటి సైనికులు. డ్యూటీలో హర్భజన్ ఆత్మ! హర్భజన్ జ్ఞాపకాలతోనే నిద్రపోవడంతోనో ఏమో అతడే కనిపిస్తున్నాడు తోటి సైనికులకు! మొదట్లో సింగ్ మీదున్న అభిమానం అనుకున్నారు. ‘రాత్రి కలలో కనిపించి తనకు ఇష్టమైన ప్రదేశం నాథులా పాస్ నుంచి ఎక్కడికీ పోను, ఇక్కడే సమాధి కట్టమన్నాడ’ని ఓ రోజు ఒక మిత్రుడు చెప్పాడు. మరో రోజు.. హటాత్తుగా మెలకువ వచ్చి లేచారు బెటాలియన్ టీమ్. సింగ్ నిద్రలేపాడని, చైనా సరిహద్దు వెంట పెట్రోలింగ్ చేయమంటున్నా డని చెప్పారు. నిద్రలో చెప్పిన మాట పట్టుకుని పెట్రోలింగ్ చేయడం హాస్యాస్పదం అని తెలుసు. అయినా సరే, ఓ సారి వెళ్లొచ్చేద్దాం అనుకున్నారు. కాకతాళీయమే కావచ్చు అది నిజంగా పెట్రోలింగ్ అవసరమైన సందర్భమే. సరిగ్గా అప్పుడే చైనా ఆర్మీ రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు దొరికాయి. సింగ్ ఇంకా డ్యూటీ చేస్తూనే ఉన్నాడనే అభిప్రాయం బలపడుతోంది అందరిలో. అవును, సింగ్ ఇంకా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు... అని నమ్మింది ఇండియన్ ఆర్మీ. అతడు కోరినట్లే సింగ్ జ్ఞాపకార్థం సమాధిని, ఆ తర్వాత ఓ స్మారక మందిరాన్ని కూడా కట్టారు. అతడి జీతంగా చిన్న మొత్తాన్ని అతడి తల్లికి నెలా నెలా పంపించేవారు. యూనిఫామ్కు బెర్త్ బుకింగ్! సైనికులకు ఏటా రెండు నెలలు సెలవు ఉంటుంది. అలా అతడి సెలవుకు సొంతూరికి వెళ్లడానికి ఏటా సెప్టెంబర్ 11వ తేదీ దిబ్రూఘర్ ఎక్స్ప్రెస్లో సింగ్ పేరుతో బెర్త్ బుక్కయ్యేది, 13వ తేదీకి సొంతూరు చేరేవి అతడి యూనిఫామ్, ఇతర వస్తువులు. వాటిని ఇద్దరు సైనికులు తీసుకెళ్లేవారు. సింగ్ వచ్చే రోజు (అతడి జ్ఞాపకాలు, వస్తువులు) ఆ ఊరిలో ఘనస్వాగతం పలికేవారు గ్రామస్థులు. రెండు నెలల తర్వాత సైనికులు వచ్చి సింగ్ ఫొటో, వస్తువులను తీసుకుని తిరిగి నాథులా పాస్కు వెళ్లేవారు. ప్రభుత్వం అతడికి ఇంతటి ప్రేమను పంచడంతోపాటు గౌరవపూర్వకంగా కెప్టెన్ హోదాను కూడా ఇచ్చింది. సిపాయిగా ఉన్నప్పుడు మరణించిన హర్భజన్ సింగ్ కెప్టెన్గా రిటైరయ్యాడు. గర్వించే జ్ఞాపకాలు కెప్టెన్ హర్భజన్ సింగ్ స్మారక భవనాన్ని సైనికులు దేవాలయంగా భావిస్తారు. నాథులా పాస్లో పోస్టింగ్ వచ్చిన వాళ్లు, అక్కడికి వెళ్లిన వెంటనే పై అధికారులకు రిపోర్ట్ చేయడానికంటే ముందు హర్భజన్ స్మారక మందిరానికి వెళ్లి సెల్యూట్ చేస్తారు. హర్భజన్తో కలిసి పని చేసిన వాళ్లకు అవి గర్వించే జ్ఞాపకాలు. వాళ్లు తమ తర్వాతి తరానికి ఆ జ్ఞాపకాలను అందిస్తూ వచ్చారు. సింగ్ భౌతికంగా లేకపోయినా తమ మధ్యే ఉన్నాడనే విశ్వాసం సైనికులకు ఉత్సాహాన్నిస్తోంది. అది నిజమా అబద్ధమా, తమ భ్రాంతి మాత్రమేనా అనే తర్కాన్ని పక్కన పెట్టి, దేశభక్తిని పెంపొందించే శక్తిగా హర్భజన్ సింగ్ స్మారకాన్ని గౌరవిస్తున్నారిప్పటికీ. – మంజీర -
పాకిస్తాన్లో ‘భగత్ సింగ్’ మంటలు
లాహోర్: స్వతంత్రం కోసం పోరాడిన సర్దార్ భగత్ సింగ్కు పాకిస్తాన్లోని అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన ‘నిషాన్ ఏ హైదర్’తో సత్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆయనను 86 ఏళ్ల కింద ఉరి తీసిన లాహోర్లోని షాదమన్ చౌక్లో భగత్సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఒక యూత్ ఐకాన్ అని, నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. స్వతంత్రం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని, ఆత్మత్యాగాన్ని అందరం గుర్తించాలని ఖురేషి తాజాగా మరోసారి పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా సైతం భగత్ సింగ్ త్యాగానికి నివాళి అర్పించాలన్న వ్యాఖ్యలను లేఖలో పొందుపరిచారు. సర్దార్ భగత్ సింగ్.. నిజమైన స్వతంత్ర యోధుడు. అతనికి పాకిస్తాన్ అత్యుతన్న గాలంటరీ మెడల్తో సత్కరించాలని ఖురేషీ స్పష్టం చేశారు. స్వతంత్రం కోసం చిన్నతనంలోనే బ్రిటీష్తో భగత్ చేసిన పోరాటం అసామాన్యం అని కొనియాడారు. నాటి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భగత్ సింగ్ను, ఆన మిత్రులు అయిన సుఖ్దేవ్, రాజ్ గురులను 1931 మార్చి 23న లాహోర్ ఉరితీశారు. నిషాన్ ఏ హైదర్ అంటే: పాకిస్తాన్ సైన్యంలో అత్యంత ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే నిషాన్ ఏ హైదర్. ఈ పదానికి సింహబలుడు అని అర్థం. హఫీజ్ సయీద్ వ్యతిరేకత: సర్దార్ భగత్ సింగ్కు అత్యున్న సైనిక పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్పై ముంబై దాడుల సూత్రధారి, జమాతే ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక షాదమన్ చౌక్ పేరు మార్పుపైనా వ్యతిరేకత ప్రకటించారు. ఇటువంటి చర్యలు పాకిస్తాన్ పైర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని హఫీజ్ సయీద్ పేర్కొన్నారు. -
కొత్త వ్యవస్థకు పురుటినొప్పులు?
విశ్లేషణ ఈ నిరసనలకు ఇన్ని కోణాలు ఉన్నా, ఒక సారూప్యత కూడా కనిపిస్తుంది. అది, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల మీద అమలు చేయాలనుకుంటున్న కొత్త విధానాల పట్ల వ్యతిరేకత. ఆ కొత్త విధానాన్ని కేవలం కాషాయీకరణగా పేర్కొనలేం. నిజానికి అంతకు మించినదే. భగత్సింగ్ జయంతి పేరుతో అర్థంపర్థంలేని కార్యక్రమాలు చాలా జరిగిపోతున్నాయి. ఉత్సవాలు, నివాళి ఘటించడం, దండలు, ఉపన్యాసాలు.. ఒకటేమిటి! ఆ గొప్ప విప్లవకారుడు నవ్వుకుని ఉండేవాడు. కొన్నేళ్లుగా భగత్సింగ్ దేనికీ చెందని చిహ్నంగా మారిపోయాడు. ప్రత్యేకమైన సిద్ధాంతానికి చెందినవాడని అన డం లేదు. భగత్సింగ్ పట్ల మనం ఏర్పరుచుకున్న కల్పనకు ఇది పూర్తిగా విరుద్ధం. కానీ వాస్తవంగా భగత్సింగ్ అంటే ఏమిటి? దీనిని గుర్తు చేసుకోవడానికి ఆయన 110వ జయంతి ఉపకరిస్తుంది. ఆయన భారతదేశం పట్ల, ప్రపంచం పట్ల ప్రత్యేక దృక్పథం కలిగినవాడు. ఆయనను గుర్తుంచుకోవడానికి మంచి మార్గం ఏమిటంటే, ఆ గతం దగ్గరకు గాని, ఆయన జీవితం గురించి గాని చెప్పుకోవడం కాదు. ఒక గొప్ప విప్లవకారుడిని గుర్తుంచుకోవాలంటే ఉన్న మార్గం ఒక్కటే– వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ప్రశ్నిం^è డమే. ఆ ప్రశ్న: భావి భారతాన్ని యువతరం ఎలా పునర్నిర్మించగలదు? అలాంటి ప్రశ్న వేయడానికి ఇది మంచి సమయం కూడా. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మున్నెన్నడూ జరగని రీతిలో విద్యార్థినుల నాయకత్వంలో జరిగిన నిరసన యువజన రాజకీయాల మీద మరోసారి దృష్టి సారించేటట్టు చేసింది. నిజానికి గడచిన రెండేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా– పుణేలోని ఎఫ్టిఐఐ, అలహాబాద్ విశ్వవిద్యాలయం, కోల్కతాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, జేఎన్యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇప్పుడు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వరకు ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడం చూశాం. ఈ నిరసనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ఘటనలేనా? కాకపోతే వాటి మధ్య ఒక అంతస్సూత్రం ఏదైనా ఉందా? ఇది నిజమైతే ఇవి భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలవా? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టం కూడా కాదు. ఇవాళ్టి యువతరంలో సాధారణంగా కనిపించేవి– అన్నింటిని తేలికగా తీసుకోవడం, కెరీర్ పట్ల ధ్యాస, సరదా సరదా మాటలు, సామాజిక మార్పు కంటే సోషల్ మీడియా అంటేనే ఎక్కువ శ్రద్ధ చూపడం. సమస్య ఏమిటంటే తల నెరిసిన వారంతా తమ కంటే చిన్నవారిని గురించి ఇలాంటి అభిప్రాయాలే కలిగి ఉంటారు. తమకు ఉన్న పరిధిలోనే విజయాన్ని, గౌరవ ప్రతిష్టలను సాధించాలనుకునే వారు ప్రతి తరంలోను విరివిగానే ఉంటారు. అయితే వ్యవస్థను ధిక్కరించేవారు, కొత్తగా వ్యాఖ్యానించేవారు ఏ తరంలో అయినా స్వల్ప సంఖ్యలోనే ఉంటారు. ఈ తరం కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రజా జీవితంతో నాకున్న అనుభవాన్ని బట్టి నేను ఒకటి చెప్పగలను. ఈ తరంలో కూడా సిద్ధాంతపరంగా ఆలోచించే యువతకు కొదవ లేదు. వారు తమ వ్యక్తిగత అభివృద్ధికి మించి ఆలోచించగలరని సాక్ష్యం ఇవ్వగలను. తాము నమ్మిన విలువలను కాపాడుకునేందుకు గట్టిగా నిలబడగలరని కూడా చెప్పగలను. అయితే వివిధ విశ్వవిద్యాలయాలలో జరిగిన ఘటనలన్నీ ఒకే విధమైనవి కావు. అవి వేర్వేరే. ఎఫ్టిఐఐ సంగతి చూస్తే, ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థకు తగినస్థాయి వ్యక్తిని చైర్మన్ పదవిలో నియమించలేదన్న ఆక్రోశంతో నిరసన చెలరేగింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో నిరసన జ్వాలలు రేగాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులు, స్త్రీ పురుష వివక్ష కారణంగా గొడవ మొదలైంది. జేఎన్యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో ‘జాతి వ్యతిరేకత’ ఉదంతాలతో నిరసనలు మొదలైనాయి. మిగిలిన చోట్ల అలజడులన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. ఈ నిరసనల వెనుక ఉన్న రాజకీయాలు కూడా భిన్నమైనవే. జేఎన్యూ నిరసనల వెనుక వామపక్ష భావాలు కలిగిన విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ ఉదంతంలో అంబేడ్కర్వాదులు ఉన్నారు. ఈమధ్యే విశ్వవిద్యాలయాలలో జరిగిన గొడవలకు ఇలాంటి ముద్రలు వేయలేం. అయితే ఈ నిరసనలకు ఇన్ని కోణాలు ఉన్నా, ఒక సారూప్యత కూడా కనిపిస్తుంది. అది, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల మీద అమలు చేయాలనుకుంటున్న కొత్త విధానాల పట్ల వ్యతిరేకత. ఆ కొత్త విధానాన్ని కేవలం కాషాయీకరణగా పేర్కొనలేం. నిజానికి అంతకు మించినదే. ప్రస్తుత పాలనా వ్యవస్థ ఉన్నత విద్యా వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నది. నియంత్రణకు పాల్పడుతున్నది. ఈ నియంత్రణ అనేక రూపాలలో ఉంటుంది. విధేయులను తెచ్చి ఈ ఉన్నత విద్యాలయాల అత్యున్నత పీఠాలను అప్పగించడం అందులో ఒకటి. ఇది ఇంతకు ముందు కూడా లేకపోలేదు కాని, ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇంతకు ముందు కాంగ్రెస్, వామపక్షాల హయాంలో కూడా ఇది జరిగింది. బీజేపీ హయాంలో తారస్థాయికి చేరుకుంది. విద్యార్థులకు సంబంధించినంత వరకు నియంత్రణ అంటే పరాధీనులను చేయడమే. దీని వెంటే రాజకీయాలకు దూరం చేయడమనే తంతు ఉంటుంది. బహిరంగ చర్చలకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఇంకా విద్యార్థి నిరసనలకు అవకాశాలు లేకుండా చేయడం ద్వారా అది జరుగుతుంది. దీని మీదే విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ విధానానికి, ఉన్నత స్థాయి విద్యలో అలాంటి కొత్త విధానానికి నిరసనగాను వారు తిరగబడుతున్నారు. ఈ నిరసనలు, అలజడులు చివరికి దేనికి దారి తీస్తాయి? వీటికి కచ్చితమైన ముగింపులు త్వరలోనే వస్తాయి. ఒకటి మాత్రం నిజం, ప్రస్తుత పాలక వ్యవస్థ యువతను తమ కనుసన్నలలోకి తెచ్చుకోవడంలో ఎలాంటి ముందడుగు వేయలేకపోయింది. జేఎన్యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హెచ్సీయూ, గౌహతి, పంజాబ్ విశ్వవిద్యాలయాలలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికలే ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. ఒక విశ్వ విద్యాలయానికి మరొక విశ్వవిద్యాలయానికి విజేతలు మారారు కానీ, అన్నిచోట్లా పరాజితులు మాత్రం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), మద్దతుదారులే. ఈ ప్రతిఘటన భావి భారత రాజకీయాలకు ఆకృతినిస్తుందా? ఈ ప్రతిఘటనను క్రమబద్ధీకరించడం మీదే ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంది. వ్యవస్థాపరంగా– ఈ ఆందోళనల మధ్య సమన్వయం కుదురుతుందా? రాజకీయంగా– సమాన విద్యావకాశాలు, స్తంభించిపోయిన ఉద్యోగావకాశాలు వంటి అంశాలతో విద్యా ప్రాంగాణాలకు బయట ఉన్న యువతలో రేగిన ఆగ్రహావేశాలను విద్యార్థుల నిరసనలతో జోడించడం సాధ్యమా? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలను సంధించడం ఎలాగో భగత్సింగ్ మనకు బోధించాడు. భగత్సింగ్ ఈనాడు మన మధ్య ఉండి ఉంటే, బీహెచ్యూ విద్యార్థినుల ఆందోళనకు గర్విస్తూ, అవే ప్రశ్నలను అడిగి ఉండేవాడే. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 ‘ ‘ Twitter: @_YogendraYadav -
భగత్ సింగ్ కోసం.. పాక్ లాయర్ పోరాటం
లాహోర్: భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే స్వాతంత్ర్య సమరయోధుల్లో భగత్ సింగ్ ఒకరు. పోలీస్ అధికారి శాండర్స్ను కాల్చి చంపాడనే ఆరోపణలతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను 23 ఏళ్ల ప్రాయంలో ఉరి తీసింది. ఈ శిక్ష అమలైన 86 ఏళ్ల తర్వాత.. భగత్ సింగ్ నిర్దోషి అంటూ ఓ పాకిస్థానీ లాయర్ లాహోర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ను నడుపుతున్న ఇంతియాజ్ రషీద్ ఖురేషీ అనే న్యాయవాది సెప్టెంబర్ 11న లాహోర్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు లాఠీలతో కొట్టడంతో భగత్ సింగ్ కళ్ల ముందే లజపతిరాయ్ ప్రాణాలు వదిలారు. దీంతో లాలా లజపతిరాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ భావించారు. సుఖ్దేవ్, రాజ్గురులతో కలిసి పోలీస్ అధికారి శాండర్స్ను కాల్చి చంపారు. ప్రభుత్వ వ్యతిరేక కుట్ర ఆరోపణలతో సింగ్పై కేసు నమోదు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఆయన్ను ఉరి తీసింది. 1928లో శాండర్స్ హత్యకు గురి కాగా.. అదే ఏడాది డిసెంబర్ 17న ఎఫ్ఐఆర్ నమోదైంది. అనార్కలీ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను లాహోర్ పోలీసులు 2014లో గుర్తించారు. ఉర్దూలో రాసిన ఆ ఎఫ్ఐఆర్ కాపీలను ఖురేషీ సంపాదించారు. సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తి శాండర్స్ను హత్య చేసినట్లు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భగత్ సింగ్ పేరును అందులో ప్రస్తావించలేదు. 450 మంది సాక్షులను విచారించకుండానే, ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పటికీ.. నాటి ధర్మాసనం భగత్ సింగ్కు ఉరి శిక్ష విధించిందని ఖురేషీ తెలిపారు. ఈ కేసులో భగత్ సింగ్ తరఫు న్యాయవాదుల వాదనలు వినలేదని ఆయన ఆరోపించారు. -
రూమ్ నంబర్ 69 కథేంటి..?
- భగత్సింగ్కు ఆ గదికీ ఉన్న సంబంధం ఏమిటి..? - ఇప్పుడు ఆ రూమ్ నంబర్ 69 ఎక్కడ ఉంది..? భారత స్వాతంత్య్ర సంగ్రామంలో.. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా 1928లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతిరాయ్.. బ్రిటిష్ పోలీసుల దాడిలో మరణించారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్సింగ్ నిర్ణయించుకున్నాడు. ఆయన హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) అనే విప్లవ సంస్థ నాయకుడు. విప్లవ కార్యకలాపాలకు అవసరమైన బాంబులు, ఆయుధాలు తయారు చేయడానికి లాహోర్లో, సహరాన్పూర్లో రెండు బాంబు తయారీ కేంద్రాలను హెచ్ఎస్ఆర్ఏ ఏర్పాటు చేసింది. లాహోర్లోని ఆ స్థావరం 69వ నంబర్ గది. దానిని యువ విప్లవకారులు సురక్షితమైన రహస్య స్థావరంగా ఉపయోగించుకునేవారు. లాలా మృతికి కారణమైన జేమ్స్ స్కాట్ను హతమార్చాలని ప్రణాళిక పన్నిన ఆ విప్లవకారుడు 1928 డిసెంబర్లో లాహోర్ పోలీస్ సూపరింటెండెంట్ జాన్ సాండర్స్ను కాల్చడంతో అతడు చనిపోయాడు. అనంతరం ఆ విప్లవకారుడు అతడి సహచరులు లాహోర్లోని 69వ నంబర్ గదిలో కలుసుకుని లాహోర్ నుంచి తప్పించుకుని కలకత్తా వెళ్లిపోయారు. భగత్సింగ్ను, ఆయన సహచరులను పట్టుకోవడానికి బ్రిటిష్ పాలకులు ఎంతగా ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీలో బాంబు పేల్చి స్వయంగా పోలీసులకు అరెస్టయితే కానీ వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. అనంతరం జరిగిన కథ అందరికీ తెలిసిందే. కానీ.. లాహోర్లో భగత్సింగ్ ఉపయోగించిన 69వ నంబర్ గది ఇప్పుడు ఎక్కడ ఉంది? భగత్సింగ్ పట్టుబడ్డ తర్వాత ఏమైంది? ఆ గదిని హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ క్రియాశీల కార్యకర్త దుర్గాదేవి పేరు మీద అద్దెకు తీసుకున్నారు. ఆమె తన భర్త భగవతి చరణ్ వోహ్రా, కుమారుడు సచీంద్ర వోహ్రాతో కలసి అక్కడ నివసించేవారు. భగవతి చరణ్ వోహ్రా కూడా విప్లవ సంస్థ నాయకుడే. భగత్సింగ్తో కలసి వారిద్దరూ కలకత్తా వచ్చారు. కొంత కాలం తర్వాత దుర్గాదేవి లాహోర్లోని 69వ నంబర్ గదికి తిరిగివెళ్లారు. ఆమె భర్త వోహ్రా కూడా కలకత్తాలో ఉన్నపుడు బాంబు తయారు చేసే మెళకువలు నేర్చుకుని వచ్చారు. ఆ గదిలో యువ విప్లవకారుల విప్లవ కార్యక్రమాలు కొనసాగాయి. బాంబుల తయారీ కొనసాగింది. ప్రఖ్యాత సంగీతకారుడు ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ కూడా ఈ బృందంలో సభ్యుడు. ఆయన తన కాలేజీ లాబొరేటరీ నుంచి రసాయనాలు తస్కరించి తెస్తే.. వాటిని బాంబుల తయారీకి ఉపయోగించేవారు. కానీ కొంత కాలానికి లాహోర్లోని బాంబు తయారీ కేంద్రాన్ని కూడా బ్రిటిష్ పాలకులు కనుగొన్నారు. సుఖ్దేవ్ సహా అతడి అనుచరులు చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే.. భగవతి చరణ్ వోహ్రా బాంబులు తయారు చేయడం కొనసాగించాడు. 1929 డిసెంబర్ 23న ఢిల్లీ – ఆగ్రా రైల్వే లైన్లో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలు లక్ష్యంగా బాంబు పేల్చాడు. అయితే లార్డ్ ఇర్విన్తో పాటు అదే రైలులో ప్రయాణిస్తున్న మహాత్మా గాంధీ కూడా ఆ పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం 1930 మే 28న రావీ నది ఒడ్డున అటవీ ప్రాంతంలో భగత్సింగ్ ఆయన సహచరులను పోలీసుల చెర నుంచి తప్పించేందుకు బాంబు దాడి చేయాలని వోహ్రా ప్రణాళిక రచించారు. కానీ ఆ క్రమంలో బాంబు ప్రమాదవశాత్తూ ముందే పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఇక ఆ 69వ నంబర్ గది.. అది లాహోర్ లోని మెక్లియాడ్ రోడ్లో గల కశ్మీర్ బిల్డింగ్ ఆవరణలో ఉండేది. దేశ విభజన అనంతరం లాహోర్ సహా పాకిస్తాన్ వేరే దేశమైంది. కశ్మీర్ బిల్డింగ్ని 1952లో ఒక హోటల్గా మార్చారు. 1988లో ఆ బిల్డింగ్ని కూల్చేసి ఆ ప్రదేశంలో షాపింగ్ ప్లాజా, హోటల్ కట్టారు. ఇది ప్రముఖ లక్ష్మీ చౌక్ సమీపంలో ఉంది. ఈ హోటల్ పేరు ఇప్పుడు చాలా ప్రఖ్యాతి గాంచింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిస్తేజం మీద ఒక విస్ఫోటనం
భారత స్వాతంత్య్రోద్యమ సాధనలో జాతీయ కాంగ్రెస్ తన వంతు కృషి చేసింది. కానీ, దాస్య శృంఖలాలు తెగడానికి ఆ సంస్థ ఒక్కటే కారణం కాదు. మైదాన ప్రాంతాలలో జరిగిన రహస్యోద్యమాలు, తీవ్ర జాతీయ వాదుల త్యాగాలు, విదేశాలలో ఉండి తీవ్ర జాతీయ వాద పంథాను అనుసరించినవారి కృషి, రైతాంగ పోరాటాలు, గిరిజనోద్యమాలు స్వేచ్ఛకు దోహదపడి నవే. దేశ స్వాతంత్య్ర సాధనకు ఉన్న ఈ నేపథ్యాన్ని సమగ్రంగా దర్శించే అవకాశం ఇక్కడ నేటి వరకు కల్పించలేదు. అందుకే వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే, 1857 ప్రథమ స్వాతంత్య్ర వీరుల చరిత్ర, బిర్సా ముండా, అల్లూరి శ్రీరామరాజు, భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు త్రయం, చంద్రశేఖర్ ఆజాద్, గదర్ వీరులు, ఖుదీరామ్ బోస్, సుభాశ్ చంద్రబోస్, చిట్టగాంగ్ వీరులు ఇలా ఎందరివో చరిత్రలు చీకటిలోనే ఉండి పోయాయి. ఇది భారతదేశ చరిత్ర రచనకు సంబంధించి జరిగిన గొప్ప ద్రోహం. ఈ మహా తప్పిదాన్ని సవరించి, చరిత్ర రచనలో త్యాగధన్యతకు సరైన స్థానం కల్పించ డానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ పత్రికా రచయిత ఎంవీఆర్ శాస్త్రి రాసిన ‘భగత్ సింగ్’ అలాంటి ప్రయత్నమే. 289 పేజీల ఈ పుస్తకంలో 47 చిన్న చిన్న అధ్యాయాలు ఉన్నాయి. చారిత్రకాధారా లను ఉటంకిస్తూనే ఉద్వేగంగా రచనను సాగించడం శాస్త్రి ప్రత్యేకత. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశ సజీవ శరీరంలో బ్రిటిష్ సామ్రాజ్యపు గోళ్లు మరింత లోతుగా దిగడం మొదలయింది. ఆ క్రమంలో జరిగిన తొలి అకృత్యమే జలి యన్వాలాబాగ్ దురంతం. భగత్సింగ్ ప్రాపంచిక దృష్టికి అక్కడే బీజం పడింది. కుటుంబ నేపథ్యం, పంజాబ్ సామాజిక దృశ్యం, గాంధీజీ అహింసా సిద్ధాంతం ఆయనను విప్లవ పంథాలోకి నడిపించాయి. ఈ అంశాలనే రచయిత తనదైన శైలిలో వివరించారు. ఈ పుస్తకంలో భగత్సింగ్ పట్ల గాంధీ వైఖరి ఏమిటి? అనే అంశం మీద గట్టి చర్చకు ఆస్కారం కల్పించే ప్రయత్నం జరిగింది. భగత్సింగ్కు పడిన మరణదండనను తప్పించాలని యావత్ భారతజాతి ముక్తకంఠంతో నినదిస్తే, ఆ జనాభిప్రాయాన్ని గాంధీజీ దగా చేశారన్న అభిప్రాయాన్ని రచయిత పూర్తిగా సమ ర్థించారు. అందుకు బలమైన ఆధారాలను కూడా ఉటం కించారు. ముందుగా నిర్ణయించినట్టుగా కాక, పద కొండు గంటలకు ముందే, 1931, మార్చి 23 రాత్రి ఏడు గంటలకు ఆ యువత్రయాన్ని ఉరితీశారు. ఇందుకు కారణం– ఆ యువ కిశోరాల ఉరితీతతో చెలరేగే అలజడి జాతీయ కాంగ్రెస్ సభలకు అడ్డుకాకూడదని గాంధీజీ కోరుకున్నారని కూడా ఆధారాలు లభ్యమవుతున్నాయి. అవి కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఆనాడు తీవ్రవాదం కూడా ఒక ఉద్యమ స్రవంతే. అయినా అది ఆత్మ లేనిది కాదు. శత్రువును బట్టి దాని పంథా ఉంటుంది. ఇదే భగత్సింగ్ జీవితం, ఆ కాలం చెబుతాయి. దీని నుంచి వర్తమాన ప్రపంచం నేర్చు కోవాలి. పార్లమెంట్లో బాంబు విసిరిన తరువాత ఇచ్చిన వివరణలో భగత్సింగ్, ‘చెవిటివారికి వినపడా లంటే గట్టిగా మాట్లాడాలి’ అని. అంటే ఎవరినీ చంప డం భగత్సింగ్, ఆయన వెంట ఉన్న బటుకేశ్వర్దత్ల ఉద్దేశం కాదని సుస్పష్టం. కానీ లాలా లాజపతిరాయ్ అనే మహనీయుడి చావుకు కారణమైన వారిలో ఒకడు సాండర్స్ను (స్కాట్ అనే మరో తెల్ల దురహంకారిని చంపబోయి) భగత్సింగ్ సుఖదేవ్తో కలసి చంపాడు. భగత్సింగ్ జీవితంలో ఈ ముఖ్య ఘట్టాలతో పాటు, ఆయన బాల్యం, అప్పటికి ఐదారు దశాబ్దాలుగా ఆ కుటుంబం దేశం పట్ల నెరవేర్చిన బాధ్య తలను గురించి, జలియన్వాలా బాగ్ రక్తపాతం, సైమన్ కమిషన్ వ్యతి రేకోద్యమం వంటివి రచయిత ఉద్వేగ భరితంగా చిత్రిం చారు. ఎంవీఆర్ శాస్త్రి రచించిన ఈ తాజా పుస్తకం ఆ మహనీయుడి జీవిత గాథ పట్ల ఈ తరం మరింత అవగాహన పెంచుకోవడానికి నిస్సందేహంగా ఉపక స్తుంది. ఇదే క్రమంలో, ఇదే స్ఫూర్తితో ఇలాంటి పుస్త కాలు శాస్త్రిగారి కలం నుంచి, ఇతర చరిత్రకారుల రచ నల నుంచి వెలువడాలని ఆశిద్దాం. ప్రతులకు: దుర్గా పబ్లికేషన్స్, జి–1, సాయికృష్ణ మేన్షన్, 1–1– 230/9, వివేక్ నగర్, చిక్కడ పల్లి, హైదరాబాద్–20 ‘ మొబైల్: 94412 57961/62 – సింహంభట్ల సుబ్బారావు -
భగత్సింగ్ బాంబులు చేసిన గది ఎక్కడుంది?
-
భగత్సింగ్ బాంబులు చేసిన గది ఎక్కడుంది?
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో.. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా 1928లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతి రాయ్.. బ్రిటిష్ పోలీసుల దాడిలో మరణించారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) అనే విప్లవ సంస్థ నాయకుడు. విప్లవ కార్యకలాపాలకు అవసరమైన బాంబులు, ఆయుధాలు తయారు చేయడానికి లాహోర్లో, సహరాన్పూర్లో రెండు బాంబు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. లాహోర్లోని ఆ స్థావరం 69వ నంబర్ గది. దానిని యువ విప్లవకారులు సురక్షితమైన రహస్య స్థావరంగా ఉపయోగించుకునేవారు. లాలా మృతికి కారణమైన జేమ్స్ స్కాట్ను హతమార్చాలని ప్రణాళిక పన్నిన ఆ విప్లవకారుడు 1928 డిసెంబర్లో లాహోర్ పోలీస్ సూపరింటెండెంట్ జాన్ సాండర్స్ ను కాల్చడంతో అతడు చనిపోయాడు. అనంతరం ఆ విప్లవకారుడు అతడి సహచరులు లాహోర్లోని 69వ నంబర్ గదిలో కలుసుకుని లాహోర్ నుంచి తప్పించుకుని కలకత్తా వెళ్లిపోయారు. భగత్సింగ్ను, ఆయన సహచరులను పట్టుకోవడానికి బ్రిటిష్ పాలకులు ఎంతగా ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీలో బాంబు పేల్చి స్వయంగా పోలీసులకు అరెస్టయితే కానీ వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఆ యువకుడు భగత్సింగ్. అనంతరం జరిగిన కథ అందరికీ తెలిసిందే. కానీ.. లాహోర్లో భగత్సింగ్ ఉపయోగించిన 69వ నంబర్ గది ఇప్పుడు ఎక్కడ ఉంది? భగత్సింగ్ పట్టుబడ్డ తర్వాత ఏమైంది? ఆ గదిని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ క్రియాశీల కార్యకర్త దుర్గాదేవి పేరు మీద అద్దెకు తీసుకున్నారు. ఆమె తన భర్త భగవతి చరణ్ వోహ్రా, కుమారుడు సచీంద్ర వోహ్రాతో కలిసి అక్కడ నివసించేవారు. భగవతి చరణ్ వోహ్రా కూడా విప్లవ సంస్థ నాయకుడే. భగత్సింగ్తో కలిసి వారిద్దరూ కూడా కలకత్తా వచ్చారు. కొంత కాలం తర్వాత దుర్గాదేవి లాహోర్లోని 69వ నంబర్ గదికి తిరిగివెళ్లారు. ఆమె భర్త వోహ్రా కూడా కలకత్తాలో ఉన్నపుడు బాంబు తయారు చేసే మెళకువలు నేర్చుకుని వచ్చారు. ఆ గదిలో యువ విప్లవకారుల విప్లవ కార్యక్రమాలు కొనసాగాయి. బాంబుల తయారీ కొనసాగింది. ప్రఖ్యాత సంగీతకారుడు ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ కూడా ఈ బృందంలో సభ్యుడు. ఆయన తన కాలేజీ లాబొరేటరీ నుంచి రసాయనాలు తస్కరించి తెస్తే.. వాటిని బాంబుల తయారీకి ఉపయోగించేవారు. కానీ కొంత కాలానికి లాహోర్లోని బాంబు తయారీ కేంద్రాన్ని కూడా బ్రిటిష్ పాలకులు కనుగొన్నారు. సుఖ్దేవ్ సహా అతడి అనుచరులు చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే.. భగవతి చరణ్ వోహ్రా బాంబులు తయారు చేయడం కొనసాగించాడు. 1929 డిసెంబర్ 23న ఢిల్లీ – ఆగ్రా రైల్వే లైన్లో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలు లక్ష్యంగా బాంబు పేల్చాడు. అయితే లార్డ్ ఇర్విన్తో పాటు అదే రైలులో ప్రయాణిస్తున్న మహాత్మా గాంధీ కూడా ఆ పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం 1930 మే 28వ తేదీన రావీ నది ఒడ్డున అటవీ ప్రాంతంలో భగత్సింగ్ ఆయన సహచరులను పోలీసుల చెర నుంచి తప్పించేందుకు బాంబు దాడి చేయాలని వోహ్రా ప్రణాళిక రచించారు. కానీ ఆ క్రమంలో బాంబు ప్రమాదవశాత్తూ ముందే పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఇక ఆ 69వ నంబర్ గది! అది లాహోర్ లోని మెక్లియాడ్ రోడ్లో గల కశ్మీర్ బిల్డింగ్ ఆవరణలో ఉండేది. దేశ విభజన అనంతరం లాహోర్ సహా పాకిస్తాన్ వేరే దేశమైంది. కశ్మీర్ బిల్డింగ్ని 1952లో ఒక హోటల్గా మార్చారు. 1988లో ఆ బిల్డింగ్ని కూల్చేసి ఆ ప్రదేశంలో షాపింగ్ ప్లాజా, హోటల్ కట్టారు. ఇది ప్రముఖ లక్ష్మీ చౌక్ సమీపంలో ఉంది. ఈ హోటల్ పేరు ఇప్పుడు చాలా ప్రఖ్యాతి గాంచింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చరిత్ర గమనానికి దిక్సూచి
తన ఆత్మ బలిదానంతో భారత స్వాతంత్య్ర చరిత్ర గమనానికి ఒక దిక్సూచిలా వెలిగిన అమరజీవి షహీద్ భగత్సింగ్. 1907, సెప్టెంబర్ 27న పంజాబ్లోని బాంగ్లు గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుం బంలో జన్మించాడు. తల్లి విద్యావతి, తండ్రి కిసాన్సింగ్. 1919లో ఏప్రిల్ 13న అమృత్సర్లో జలియన్వాలా బాగ్ పార్క్లో సమావేశమైన 400 మంది పౌరులను జనరల్ డయ్యర్ 16 వందల రౌండ్లు కాల్పులు జరిపి చంపాడు. ఆనాటికి 12 ఏళ్ల వయస్సులో వున్న భగత్ సింగ్కు రక్తం ఉడికింది. 1920లో పాఠశాల చదువును పూర్తి చేసుకొని, నేషనల్ కాలేజీలో చేరాడు. ఈ కళాశా లలో భగవత్ చరణ్ సుఖ్దేవ్, యశ్పాల్లు భగత్ సింగ్కు స్నేహితులు. వారితో కలిసి దేశ చరిత్ర, విప్లవా లపై అధ్యయనం చేసేవాడు. 1924లో తన తండ్రి, నాయనమ్మ పెండ్లికి బలవంతం చేయగా.. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. 1923లో ఎస్ఎన్ సన్వాల్, చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన హిందు స్థాన్ రిపబ్లిక్ ఆర్మీలో చేరాడు. త్వరలోనే ఆజాద్, భగత్ సింగ్లు సన్నిహిత మిత్రులయ్యారు. తరువాత తన పాత కళాశాల విద్యార్థు లను కలుపుకుని నవజవాన్ భారతసభను స్థాపిం చాడు. ఆపై నవజవాన్ భారత సభను.. చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని కలు పుతూ హిందుస్థాన్ సోషలిస్ట్ రివల్యూషన్ ఆర్మీని నెలకొ ల్పారు. 1928లో భారత్కు వచ్చిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమించిన లాలా లజ్పత్రాయ్పై స్కౌట్ అనే బ్రిటిష్ పోలీస్ చేసిన లాఠీచార్జీతో నవంబర్ 17న ఆయన చనిపోయాడు. 1928 డిసెంబర్ 17న భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్లు శాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపి పోస్టర్లు వేస్తారు. రైతాంగ పోరాటాల అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ సేఫ్టీ బిల్లుపై ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో చర్చకు పెట్టింది. దీనికి నిరసనగా 1929 ఏప్రిల్ 8న భగత్సింగ్, బటు కేశ్వర్దత్తులు ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో పొగ బాంబులు విసురుతూ కరప త్రాలు వెదజల్లారు. వీరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరోవైపున శాండర్స్ హత్య కేసులో భాగంగా సుఖదేవ్, రాజ్గురులనూ అరెస్ట్ చేసి రెండేళ్ల వరకు జైల్లో ఉంచింది. 1931 మార్చి 24న భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీయాలని ప్రకటించిన ప్రభుత్వం, దేశవ్యాప్త ఆందోళనకు భయపడి ఒక్కరోజు ముందుగానే అంటే 1931 మార్చి 23న సాయంత్రం 7 గంటలకు ఉరితీసింది. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్ దేవ్లు 23 ఏళ్ల ప్రాయంలో ఉరితాళ్ళను ముద్దాడుతూ, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రాణాలు వదిలారు. భగత్ సింగ్ భారత చరిత్ర గమనానికి ఒక దిక్సూచి (నేడు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్థంతి సందర్భంగా) - తోట రాజేశ్ బాబు పీడీఎస్యూ నాయకులు మొబైల్: 99493 43931 -
బ్రిటీషువాడి గుండెను చీల్చిన ఆ తుపాకీ దొరికింది
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు బ్రిటీషువాడి గుండెల్లోకి బుల్లెట్ దించి ఉరికొయ్యను ముద్దాడిన భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ ఉపయోగించిన తుపాకీ దొరికింది. దీనితోనే బ్రిటన్ అధికారి జాన్ శాండర్స్ను ఆయన చంపేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరిగే రోజుల్లో నూనూగు మీసాల వయసులోనే భగత్సింగ్ తెల్లవాళ్లకు ఎదురు తిరిగారు. 1928 డిసెంబర్ 17న బ్రిటీష్ అధికారి జాన్ శాండర్స్ను సీరియల్ నెంబర్ 168896 కలిగిన 32ఎంఎం కోల్ట్ ఆటోమేటిక్ పిస్టల్తోకాల్చి చంపేశాడు. ఈ సంఘటన బ్రిటీష్ వారిని ఉలిక్కిపడేలా చేసింది. దీని అనంతరం భగత్ సింగ్ను పట్టుకొని బంధించి 1931 మార్చి 23న ఉరి తీశారు. వాస్తవానికి ఈ తుపాకీని బీఎస్ఎఫ్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ విపన్స్, టాక్టిక్స్(సీడబ్ల్యూఎస్టీ) ప్రదర్శనకు ఉంచారు. అయితే, భగత్ సింగ్దే ఆ తుపాకీ అని ఎవరికీ తెలియదు. ఇది తొలిసారి బీఎస్ఎఫ్కు చెందిన ఇండోర్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అయితే, అంతకుముందు దీనిపై ఉన్న నలుపురంగును తొలగించి శుభ్రం చేసే క్రమంలో దానిపై ఉన్న సీరియల్ నెంబర్ ఆధారంగా ఈ తుపాకీ భగత్సింగ్దే అనే విషయం తెలిసింది. -
‘నెహ్రూ, పటేల్లను ఉరితీశారు’
న్యూఢిల్లీ : ‘సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూ, భగత్ సింగ్, రాజ్గురు.. సబీ ఫాంసీ పర్ చఢె(అందర్నీ ఉరి తీశారు)’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా బహిర్గతమవడంతో వివాదమైంది. వివాదం రేగడంతో వివరణ ఇచ్చారు. ‘ఈ వార్త విని నవ్వుకున్నాను. స్వాతంత్య్రోద్యమంలో ప్రాణాలర్పించిన వారిని గౌరవిస్తూ మాట్లాడాను. గాంధీ, నెహ్రూ, నేతాజీలాంటి నేతలపేర్లను ప్రస్తావించాను. అక్కడితో ఆ వాక్యం పూర్తి చేసి, తర్వాత బ్రిటిష్ వారు ఉరితీసిన వీరుల పేర్లు చెప్పాను. కానీ ఈ రెంటినీ కలిపి చెప్పాననుకుంటున్నారు’ అని అన్నారు. -
విషాదం.. భగత్ సింగ్ మునిమనవడు మృతి
సిమ్లా: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ముని మనవడు అభితేజ్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. హిమాచల్ ప్రదేశ్ లో రామ్ పూర్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అభితేజ్ సింగ్(27) ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మిత్రుడు సనావార్ తో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు. వీరి వెనకాలే గురుపాల్ సింగ్, అభితేష్ కారులో ప్రయాణమయ్యారు. రామ్ పూర్ సమీపంలో మ్యాంగ్లాడ్ వద్ద బైక్ అదుపు తప్పింది. బైక్ పై వెళ్తోన్న అభితేజ్, సనావార్ కింద పడ్డారు. అయితే అభితేజ్ కు మాత్రం తల, పక్కటెముకల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రామ్ పూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొన్ని నిమిషాల్లోనే అతడు చనిపోయాడు. రోడ్డు తడిగా ఉండటంతో బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అభితేజ్ స్నేహితులు చెప్పారు. పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. మోహాలీలో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని పోలీసులు తెలిపారు. -
చరితకు వక్రభాష్యాల వాత
రెండో మాట భగత్సింగ్ ప్రభృతుల జాతీయవాదపు మొదటి లక్ష్యం జాతీయ విమోచనం. అంటే సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టడంద్వారా, స్వాతంత్య్రం పొందడం. దానితోనే జాతీయ విమోచనం పరిపూర్తి కాదనీ, ఆ దశను అధిగమించి సామాజిక, ఆర్థిక రంగాలలో ‘సోషలిస్టు సమాజ వ్యవస్థ’ను స్థాపించుకోవటమనీ, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థను కాస్తా అంతమొందించడమే తమ లక్ష్యమనీ భగత్సింగ్ ప్రకటించాడు. ‘అసెంబ్లీ బాంబు కేసు’ విచారణలోనూ ఇదే చెప్పాడు. కాని నేటి పాలకులు, వారి పార్టీలూ ఎక్కడున్నారు? ‘వారు పుస్తకాలు రాయరు, కానీ పుస్తకాల అమ్మకాలనూ వాటి పంపిణీనీ అడ్డుకుంటారు. వారు చలనచిత్రాలను గానీ డాక్యుమెంటరీలను గానీ నిర్మించరు. వాటిని సెన్సార్ చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) లాంటి సంస్థలను నెలకొల్పలేరు కానీ, ధ్వంసం చేస్తారు. వారు జాతీయవాదానికి నవీన భావాన్ని అందించలేరు గానీ, అదే పదాన్ని వాడుతూ దానికి పూర్తి భిన్నమైన అర్థాన్ని తొడుగుతారు.’ - ప్రొ. జోయా హసన్ (ఎమిరటస్ ప్రొఫెసర్, జేఎన్యూ) భారత స్వాతంత్య్రోద్యమంతో ఎలాంటి క్రియాశీలక సంబంధం లేక పోయినా బీజేపీ-ఆరెస్సెస్ పరివార్ జాతీయత/జాతీయవాదం అనే రెండు మంచి పదాల చాటున విద్యారంగం పైనా, పాఠ్య ప్రణాళికలపైనా సరికొత్త దాడులకు పాల్పడడం విచారకరం. భారత సెక్యులర్ వ్యవస్థకు, రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా చిత్రమైన కొత్త పోకడలు అనుసరిస్తున్నది. సెక్యులర్ భావాలకు విరుద్ధంగా జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించే కార్య క్రమంలో ఉన్నట్టు పలు దఫాలుగా బీజేపీ పరివార్ పాలకులు చేసిన ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. ‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’ (పెంగ్విన్ ప్రచురణ) పుస్తకం మీద లేవదీసిన వివాదం ఇందులో భాగమే. సుప్రసిద్ధ చరిత్రకారులు బిపన్చంద్ర ఆధ్వర్యంలో మృదులా ముఖర్జీ, కేఎన్ పణిక్కర్, ఆదిత్య ముఖర్జీ, సుచేతా మహాజన్ ప్రభృతులు 1857-1947 మధ్య సాగిన భారత స్వాతంత్య్రోద్యమం గురించి సాధికారికంగా రాసిన చరిత్రే ఈ పుస్తకం. ఇందులో బీజేపీ-ఆరెస్సెస్లకు నచ్చని అంశం ఏమిటి? భగత్సింగ్, సూర్యసేన్ (చిట్టగాంగ్ విప్లవకారుడు) వంటి వారిని గ్రంథ కర్తలు ‘విప్లవకర ఉగ్రవాదులు’ (రివల్యూషనరీ టైస్ట్స్) అని ఒక అధ్యా యంలో పేర్కొనడమే! ఎవరు టైస్టులో తేలితే మంచిది రివల్యూషనరీ టైస్టులు అన్న పదం వాడడానికి కారణం ఉంది. నిజానికి ఆ పేరుతో ఉన్న అధ్యాయంలో ఈ అంశాన్ని చర్చించారు. టైస్ట్ అన్న పదం వాడడానికి కారణం- భగత్సింగ్ వంటివారు పూర్తి విప్లవకారులుగా మారక ముందుటి దశలకు సంబంధించిన ప్రస్తావన ఉండడమే. కేవల వ్యక్తిగత హింసావాదాన్ని నమ్మి, లక్ష్య సాధన కోసం ఆ పథంలో ప్రయా ణించిన దశకు సంబంధించిన అధ్యాయం అది. స్వాతంత్య్రోద్యమం అనేక పాయలుగా సాగింది. అయితే అందరి లక్ష్యం ఒక్కటే- స్వాతంత్య్ర సాధన. ఆ ఉధృతిలో కొందరు కేవల జాతీయవాదులుగానూ, కొందరు టైస్టులు గానూ, తిరుగుబాటుదారులుగానూ పాత్ర వహించారు. మరికొందరు తాత్వి కజీవులుగా, సాత్విక వాదులుగా కర్తవ్యం నిర్వర్తించారు. కానీ భగత్సింగ్ తదితరులపైన టైస్ట్ అన్న ముద్ర వేసిన బ్రిటిష్ పాలకులకు జోహుకుం అన్న హిందుత్వవాదులూ ఉన్నారు. భావస్వేచ్ఛనూ, భిన్నాభిప్రాయాన్నీ సహించలేకపోతూ ‘దేశ ద్రోహం’ ఆరోపణ చేస్తున్న పరివారం టైజాన్ని సమర్థిస్తున్నట్టా? వ్యతిరేకిస్తున్నట్టా? సమర్థించని పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా పాటుపడుతున్న చింతనాపరులు, హేతు వాదులు దభోల్కర్, పన్సారే (మహారాష్ట్ర), కల్బుర్గి (కర్ణాటక)లను హత్య చేయడానికి కారకులు ఎవరై ఉంటారు? ఇస్లామిక్ టైస్టులకు హేతువాదులూ వ్యతిరేకమే. కాబట్టి దేశీయ టైస్టులు విదేశాలలో దొరకరు. మరి ఆ హంతకులు దేశవాళీ సరుకే అయి ఉండాలి. ఈనాటికీ జాతిపిత గాంధీజీ హత్యకు కారకుడైన నాథూరాం గాడ్సే ఏ కోవకు చెందిన టైస్టో నామకరణం చేయగలరా? ఇతడి ప్రకటన ‘నేనెందుకు గాంధీని హత్య చేశాను?’ బీజేపీ వచ్చాకనే ఎందుకు వెలుగు చూసినట్టు? గాంధీ నేలకొరిగిన క్షణమే దేశంలో పలుచోట్ల మిఠాయిలు పంచుకున్న వాళ్లు ఎవరు? ఈ దుర్మార్గం దరిమిలా పటేల్, నెహ్రూ కేవలం పరివార్ పార్టీనే ఎందుకు నిషేధించవ లసి వచ్చింది? ఇంతకూ బిపన్చంద్ర బృందం ఉపయోగించిన పదం ఉద్దేశం ఏమిటి? టైస్టు పదం నుంచి రివల్యూషనరీ టైస్టులు అని పిలవడానికి కారణం- ఒక పరిణామాన్ని తెలియచేయడానికే. టైస్టులుగా ఉన్నవారు సైద్ధాంతికంగా పరివర్తనా దశలో క్రమంగా సుశిక్షితులై విప్లవకారులుగా ఆవిర్భవించినందువల్లనే ఆ దశకు చరిత్రకారులు ఒక అధ్యాయం కేటా యించారు. మిగతా రచన అంతా వారు వ్యక్తిగత హింస గురించి, ధర్మా గ్రహంలో స్వేచ్ఛాభారతావని ఆవిర్భావం కోసం అసంఘటిత శక్తులుగా అధికార గణం మీద వారు జరిపిన దాడులను, ఆపై ఆంతరంగిక మథనం తరువాత వెన్ను చూపని విప్లవకారులుగా మారిన వైనాన్ని వివరించారు. ఆమాటకొస్తే, బ్రిటిష్ వాళ్లకి లొంగిపోతూ తనను విడుదల చేయవలసిందిగా కోరుతూ మూడు లేఖలు రాసిన హిందుత్వ సిద్ధాంతవాది సావర్కర్ కూడా ఒకనాటి విప్లవకారుడే. కానీ టైస్టులుగానూ, తీవ్ర మథనం తరువాత విప్లవ కారులుగానూ - అంటే ఏ దశ లోనూ, ఉరితీత వరకు శత్రువుకు లొంగిపోని వారు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్లే. మదన్లాల్ థింగ్రా వంటివారు కూడా త్యాగాలకు మారుపేరుగా నిలిచారు. స్వరాజ్య ఉద్యమంలో ముందు ఉన్న సంస్థ భారత జాతీయ కాంగ్రెస్. ఇది ‘దేశ ద్రోహుల ఉత్పత్తి కేంద్రం’ అంటూ వ్యాఖ్యానించి గవర్నర్ జనరల్ డఫ్రిన్ (1888) నోటి దురుసు తీర్చుకున్నాడు. పేరు సరే, భావాల మాటేమిటి? భగత్సింగ్ ప్రభృతులను బ్రిటిష్ పాలకులతో పాటు, కొంతమంది జాతీయ నాయకులు కూడా టైస్టులని అన్నారు. ‘అవును, వారు విప్లవకర ఉగ్రవా దుల’ని కొందరు (రివల్యూషనరీ టైస్టులని) సమర్థించవలసి వచ్చింది! అంటే విప్లవకారులుగా మారిన టైస్టులు. దీనినే తరవాతి అధ్యాయాలలో చరిత్రకారులు హేతుబద్ధంగా వివరించాల్సి వచ్చింది. భగత్సింగ్ టైరిస్టుగా ‘ఈశ్వరవాది’, రివల్యూషనరీ సోషలిస్టుగా నిరీశ్వరవాది, హేతువాది. ఈ పరిణామాలని బిపన్చంద్ర ప్రభృతులు ఈ గ్రంథంలో వివరించడమే గాకుండా, వారు మరో గ్రంథంలో (‘ది మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా’ 2012. పేజి 455-56) కూడా స్పష్టంగా వివరించగలిగారు. ‘నేనెందుకు నిరీశ్వరవాది/హేతువాదినయ్యాను?’ అన్న భగత్సింగ్ రచన బిపన్ రెండవ గ్రంథానికి మరింత ఆధారమైంది. గ్రంథ పరామర్శలో బిపన్చంద్ర ఇలా వివరించాడు: ‘‘భగత్సింగ్ భారత మరో స్వాతంత్య్ర సంగ్రామ యోధులలో విప్లవకర సోషలిస్టులలో ఒకరు కావడమేగాదు, తొలితరం భారత మార్క్సిస్టు మేధా వుల్లో, సిద్ధాంతకర్తలలో ఒకరు. దురదృష్టవశాత్తు ఈ యువ కిశోరం ఎదుగు దలలో ఈ చివరిదశ అజ్ఞాత విశేషంగా మిగిలిపోయింది (యువకుడి గానే ఆయనను ఉరితీశారు). అందుకనే అమాంబాపతు మితవాద/ప్రగతి నిరోధ కులు, ఛాందసులూ, మతవాద శక్తులూ భగత్సింగ్, ఆయన సహచరులు చంద్రశేఖర్ ఆజాద్ ప్రభృతుల పేరు ప్రతిష్టలను నిస్సిగ్గుగా వాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు. భగత్సింగ్ రాజకీయ సిద్ధాంత ఆచరణ ఆయన జీవితం కౌమారదశ నుంచే మొగ్గ తొడిగింది. ఆ దశ ఏది? గాంధేయ జాతీయవాదం నుంచి విప్లవకర అరాచక వాదం దిశగా మారుతున్న దశ. కాని 1927-28 నాటికల్లా వ్యక్తిగత సాహసిక చర్యల నుంచి మార్క్సిజం వైపు మళ్లింది. 1925-1928 సంవత్సరాల మధ్య రష్యన్ విప్లవం సోవియెట్ యూనియన్పై పుస్తకాలు చదివాడు. తనపై లాహోర్ కుట్ర కేసు విచారణ సందర్భంగా లాహోర్ హైకోర్టులో వాదిస్తూ ఇలా స్పష్టంగా ప్రకటించాడు. ‘‘భావధార అనే ఒరిపిడి రాయిపై సానబెట్టిన కత్తి విప్లవం’’ (ది స్వోర్డ్ ఆఫ్ రివల్యూషన్ ఈజ్ షార్పెన్ ఎట్ ది వెట్స్టోన్ ఆఫ్ థాట్) అని నిర్వచించాడు! ఆ పిమ్మట 1928 నాటికి ఆయన, ఆయన అనుచరులూ సోషలిజాన్ని ఆమోదయోగ్యమైన సిద్ధాంతంగా ఆమోదించి ప్రకటించారు. దీని పర్యవసానంగా అవతరించిన ‘హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ కాస్తా ‘‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’గా పరివర్తన చెందింది. ఇంతటి యువ కిశోరం మహా మేధస్సును కర్కశ వలస పాలకులు పెందలాడే తుంచివేయటమే మన దేశ ప్రజలకు వాటిల్లిన విషాదకర పరిణామాలకల్లా అత్యంత విషాదకర ఘటన!’’ ఆరాధన కాదు, ఆశయాలను ఆచరించాలి అంతేగాదు - నిరంతర హేతువాదం మన బాధ్యత, కర్తవ్యం అన్నాడు. కుల, మత తత్వాలు తరచుగా సామ్రాజ్యవాదానికే ఊడిగం చేస్తాయనీ, ఆచరణలో ఇది భారత ప్రజల మధ్య చీలికలు పెట్టడానికేగానీ, వాటి శత్రుత్వం సొంత భారత ప్రజలతోనేగాని, సామ్రాజ్యవాదంపైన కాదనీ, స్వాతంత్య్రానంతరం విదేశీ, స్వదేశీ గుత్త పెట్టుబడి శక్తులే ఉమ్మడిగా ప్రజా బాహుళ్యాన్ని దోచుకునే అవకాశం ఉందనీ - 1928లలోనే జోస్యం చెప్పాడు భగత్సింగ్! మరి అలాంటి భగత్సింగ్ విప్లవ భావాలూ, గాంధీజీ సాత్విక ఉద్యమ ధోరణీ నచ్చినందువల్లనే తాజాగా పరివార్ వర్గం వారికి మొదటిసారిగా ఇప్పుడు నివాళులు అర్పిస్తోందా? లేక నేటి అధికార పీఠాల ఉనికి కోసం భగత్సింగ్, గాంధీల ఫొటోల చుట్టూ కొత్తగా ప్రదక్షిణ చేయవలసి వస్తోందా?! భగత్ సింగ్ ప్రభృతుల జాతీయవాదపు మొదటి లక్ష్యం జాతీయ విమోచనం. అంటే సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టడం ద్వారా, స్వాతంత్య్రం పొందడం. దాని తోనే జాతీయ విమోచనం పరిపూర్తి కాదనీ, ఆ దశను అధిగమించి సామాజిక ఆర్థిక రంగాలలో ‘సోషలిస్టు సమాజ వ్యవస్థ’ను స్థాపించుకోవటమనీ, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థను కాస్తా అంతమొందించడమే తమ లక్ష్యమనీ భగత్సింగ్ ప్రకటించాడు. ‘అసెంబ్లీ బాంబు కేసు’ విచారణలోనూ ఇదే చెప్పాడు. కాని నేటి పాలకులు, వారి పార్టీలూ ఎక్కడున్నారు? ఎక్కడు న్నాయి?! ఈ భావనా స్రవంతికి ‘పరివార్ వర్గం’ చేదోడు వాదోడు అవు తుందా, లేదా అన్నదే నేటి అసలు ప్రశ్న! ముసుగులో గుద్దులాట ఇక అనవ సరం! అవునా, కాదా?! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘భగత్ సింగ్ ఉగ్రవాది కాదు’
న్యూఢిల్లీ: భగత్సింగ్ వంటి దేశభక్తులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావించిన రచయితలపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎంపీ నరేష్ అగర్వాల్ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇందుకు డిప్యూటీ చైర్ పర్సన్ పీజే కురియన్ స్పందిస్తూ ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. సమస్యను పరిష్కరించే విధంగా తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకున్నా భగత్సింగ్తో పాటు సుఖ్దేవ్, రాజ్గురులను ఉగ్రవాదులనే నెపంతో బ్రిటిష్ అధికారులు 1931లో లాహోర్లో విచారించి ఉరితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పాఠ్యపుస్తకంలో భగత్సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సూర్య సేన్లు విప్లవాత్మక ఉగ్రవాదులంటూ ప్రచురితం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
చరిత్ర-చర్చ
దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుల్లో భగత్సింగ్, ఆయన అనుచరుల స్థానం విశిష్టమైనది. భగత్సింగ్ అనగానే అందరికీ ఆయన సాహసోపేత చర్యలు గుర్తొస్తాయి. ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఉరికంబమెక్కిన ఆయన త్యాగనిరతి స్ఫురణకొస్తుంది. అన్నిటికీ మించి ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటి పరిష్కార మార్గాలపైనా 23 ఏళ్ల చిరుప్రాయంలోనే భగత్సింగ్కున్న అవగాహన అబ్బురపరుస్తుంది. అందువల్లే అంతటి మహోన్నతుణ్ణి ఎవరైనా ‘విప్లవ ఉగ్రవాది’(క్రాంతికారి ఆటంక్వాద్) అని ముద్రేస్తే ఆగ్రహం కలగడంలో, వివాదం సాగడంలో వింతేమీ లేదు. ఢిల్లీ యూనివర్సిటీ తన చరిత్ర విద్యార్థుల కోసం నిర్దేశించిన పాఠ్య ప్రణాళికలో చదవదగిన గ్రంథమంటూ సూచించిన ‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’, దాని హిందీ అనువాదం‘భారత్ కా స్వతంత్ర సంఘర్ష్’ పుస్తకాలపై ప్రస్తుత వివాదం నడుస్తోంది. ఇందులో కొన్నిచోట్ల భగత్సింగ్నూ, ఆయన అనుచరులనూ విప్లవ ఉగ్రవాదులుగా అభివర్ణించారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో ఆరోపించారు. వారినలా అభివర్ణించడమంటే ఆ వ్యక్తుల త్యాగనిరతిని ‘అకడమిక్గా’ హత్య చేయడమేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. భగత్సింగ్ కుటుంబీకులనుంచి సైతం తమకు ఫిర్యాదులందాయని ఆమె చెప్పారు. రాజ్యసభలో ఉపాధ్యక్షుడు పీజే కురియన్ స్పందిస్తూ ఆ గ్రంథాల్లోని అభ్యంతరకర ప్రస్తావనలను తొలగించేలా చూడాలని కోరారు. ఢిల్లీ యూనివర్సిటీ వెనువెంటనే రంగంలోకి దిగి ఆ గ్రంథాల పంపిణీ, అమ్మకం నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి ఒక్క ఢిల్లీ యూనివర్సిటీ మాత్రమే కాదు...దేశంలోని అనేక యూనివర్సిటీలు వాటిని చదవదగిన పుస్తకాలుగా సూచిస్తున్నాయి. భగత్సింగ్ పట్ల ఈ దేశ ప్రజల్లో ఉండే ఆదరాభిమానాలు సామాన్యమైనవి కాదు. అవి మన నేతల ఆగ్రహావేశాల్లో వ్యక్తం కావడంలో వింతేమీ లేదు. అయితే ఇప్పుడు చెలరేగిన వివాదం కేవలం అందుకు మాత్రమే పరిమితమైనది కాదని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తే అర్ధమవుతుంది. విఖ్యాత చరిత్రకారుడు బిపన్చంద్ర మరికొందరితో కలిసి ఈ గ్రంథాన్ని రచించారు. వీరంతా చరిత్ర రచనలో లబ్ధప్రతిష్టులైనవారు. జాతీయోద్యమంపై వీరు సాగించిన పరిశోధన, అధ్యయనం...ఎన్నో కొత్త కోణాలను ఆవిష్కరించాయి. ఆ ఉద్యమంలో భిన్న వర్గాల ప్రజలు పాల్గొన్న తీరుపైనా, అది వలస పాలకులను వణికించిన తీరుపైనా ఈ చరిత్రకారులు చేసిన నిర్ధారణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. ముఖ్యంగా బిపన్ చంద్ర వలసవాదం, సమకాలీన చరిత్ర, మతతత్వ వ్యతిరేక ఉద్యమాలువంటి అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు. ఆధునిక భారత చరిత్రను సాధారణ ప్రజానీకానికి సుబోధకం చేశారు. అలాంటివారు త్యాగాల, సాహసాల కలబోత అయిన భగత్సింగ్ ప్రభృతులను అంత బాధ్యతారహితంగా ఉగ్రవాదులతో ఎలా పోల్చారన్న సంశయం మన నేతలకు రావలసింది. పుస్తక రచయితల్లో ఒకరైన బిపన్చంద్ర 2014లో కన్నుమూశారు. ఇప్పుడు వివాదం తలెత్తింది గనుక ఆ గ్రంథ రచనలో పాలుపంచుకున్న ఇతర రచయితలను సంప్రదించడం, వారి వివరణ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉగ్రవాది అనే పదం పఠితల్లో కలగజేసే భావనను వారు గ్రహించలేకపోయారా లేక దాన్ని ఉపయోగించడానికి ప్రత్యేకమైన కారణమేమైనా ఉన్నదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సింది. ఆ పని జరగలేదు. పార్లమెంటు చర్చలో మాట్లాడినవారు కూడా పరస్పరం విమర్శించుకోవడానికే ఈ వివాదాన్ని ఉపయోగించుకున్నారు. పాతికేళ్లకు పైబడి వివిధ యూనివర్సిటీల్లోని చరిత్ర విద్యార్థులు ఉపయోగిస్తున్న పుస్తకంలోని వివాదాస్పద అంశం ఇంతకాలం ఎందుకు మరుగున పడిపోయిందో ఎవరూ చెప్పలేకపోయారు. జాతీయోద్యమంలో భిన్న స్రవంతులున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం రావడానికి అనుసరించాల్సిన పద్ధతులపై నాయకుల్లో వేర్వేరు అభిప్రాయా లున్నాయి. వలసపాలకులను ఒప్పించి, నిష్ర్కమించక తప్పని పరిస్థితులు కల్పించి అహింసా విధానంలో స్వాతంత్య్రం సాధించడం సాధ్యమేనని కాంగ్రెస్, మహాత్మాగాంధీ విశ్వసిస్తే...ఖుదీరాం బోస్, మదన్లాల్ ధింగ్రా వంటివారు తుపాకులు, బాంబులతో దాడులు చేస్తేనే వారి పాలన విరగడవుతుందని భావించారు. 1908-1918 మధ్య అలాంటి హింసాత్మక విధానాలకు పాల్పడిన అనేకమందిని పాలకులు ఉరితీశారు. ఖైదు చేశారు. ఆ తర్వాత అలాంటి ఘటనల తీవ్రత తగ్గిపోయింది. మహాత్ముడి నేతృత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమం చౌరీచౌరాలో హింసకు దారితీయడం పర్యవసానంగా నిలిపేసినప్పుడు 1922లో భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు రంగంలోకొచ్చారు. వారి చర్యలను విప్లవకర ఉగ్రవాదమని వ్యవహరించేవారు. ప్రజలను నిలువుదోపిడీ చేస్తూ, వారిపై అణచివేత చర్యలకు పాల్పడే వలస పాలకులపై హింసను ప్రయోగించి, భీతావహుల్ని చేసి దేశంనుంచి తరిమికొట్టడమే వీరి ధ్యేయం. బిపన్చంద్ర విప్లవకర ఉగ్రవాదం పదాన్ని పుస్తకంలో తొలిసారిగా వినియోగించినప్పుడే అందుకు సంబంధించిన వివరణనిచ్చారు. దాన్ని అవమానకర అర్ధంలో వినియోగించడంలేదని చెప్పారు. అయినప్పటికీ నిస్సహా యులైన పౌరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చడంవంటి ఉన్మాద చర్యలు అంతర్జాతీ యంగా పెచ్చుమీరాక దాని అర్ధమే పూర్తిగా మారిపోయింది. కనుక ఆ పదాన్ని తొలగిస్తున్నట్టు రచయితలు ప్రకటించి ఉంటే వేరుగా ఉండేది. వారు ఆ పని చేయలేదు. అయితే 2006లో భగత్సింగ్ రచనల సంపుటిని వెలువరించినప్పుడు ఆయనను బిపన్చంద్ర విప్లవ సామ్యవాదిగా అభివర్ణించారు. అనంతర రచనల్లో సైతం దాన్నే కొనసాగించారు. ఇలాంటి నేపథ్యంలో బిపన్చంద్ర వంటి విఖ్యాత చరిత్రకారుడిలో అవగాహనా లోపం ఏమైనా ఉంటే విమర్శించడంలోగానీ, దానితో విభేదించడంలోగానీ తప్పు లేదు. కానీ ప్రపంచం మెచ్చే మేధావులకు ఉద్దేశాలు ఆపాదించడం సబబనిపించుకోదు. ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు ఆదరణ పెరిగి తరగతి గదులనుంచి నిష్ర్కమిస్తున్న ‘చరిత్ర’ పార్లమెంటుకెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్సింగ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాలపై సాగాలని... అది మెరుగైన విధానాల రూపకల్పనకు దోహదపడాలని ఆశిద్దాం. -
‘భగత్సింగ్’ కేసు తిరిగి తెరవాలి
నవన్షహర్: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భగత్సింగ్ను లాహోర్లో ఉరి తీసిన కేసును తిరిగి తెరిపించాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ ప్రేమ్సింగ్ చందుమజ్రా శనివారం కేంద్రాన్ని కోరారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్సింగ్ లాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకున్నా భగత్సింగ్తో పాటు సుఖ్దేవ్, రాజ్గురులను ఉగ్రవాదులనే నెపంతో బ్రిటిష్ అధికారులు 1931లో లాహోర్లో విచారించి ఉరితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పాఠ్యపుస్తకంలో భగత్సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సూర్య సేన్లు విప్లవాత్మక ఉగ్రవాదులంటూ ప్రచురితం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
భగత్సింగ్ ఉగ్రవాదట!
ఢిల్లీ వర్సిటీ చరిత్ర పుస్తకంలో ప్రచురితం న్యూఢిల్లీ: భగత్సింగ్తోపాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఢిల్లీవర్సిటీ పుస్తకం విప్లవాత్మక ఉగ్రవాదులుగా పేర్కొంది. డీయూలోని బీఏ (చరిత్ర) కోర్సులో భాగంగా ఉన్న ‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’ పుస్తకంలోని 20వ అధ్యాయంలో భగత్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్యసేన్తో పాటు పలువురు విప్లవాత్మక ఉగ్రవాదులని ప్రచురితమైంది. చరిత్రకారులు బిపిన్ చంద్ర, మృదుల ముఖర్జీ రాసిన ఈ పుస్తకంలో చిట్టాగాంగ్ ఉద్యమాన్ని, బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్యను ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. తాజాగా ఈ విషయం బయటపడటంతో దుమారం రేగింది. దీనికి అప్పటి కాంగ్రెస్ మంత్రులు, అధికారులు బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. భగత్ సింగ్ బంధువులూ వర్సిటీ పుస్తకాలపై మండిపడ్డారు. కాగా, హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై రాజ్యసభలో మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం వేసిన సభాహక్కుల తీర్మానాన్ని రాజ్యసభ స్వీకరించింది. -
భారత్ మాతాకీ జై అని ఎందుకనాలి..?
'భారత్ మాతాకి జై అని ఎందుకనాలి..?'అంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇష్టం ఉన్నవాళ్లు అంటారు లేదంటే లేదు.. అని స్పష్టం చేశారు. దేశభక్తికి కొలబద్ద పెట్టడానికి బీజేపీ నేతలు ఎవరని ప్రశ్నించారు. కార్పోరేట్ శక్తులకు అంటకాగి.. గాంధీని చంపిన హంతకులను పొగిడే వారు దేశభక్తులా అంటూ ఎద్దేవా చేశారు. భగత్ సింగ్ చివరి నినాధం 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని తెలిపారు. ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలను ప్రధాని ఎందుకు ఖండింటం లేదని ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్ననల్ల ధనాన్ని తీసుకు వస్తాం అంటూ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాంబ్ చేశారు. -
'క్వీన్ ఎలిజెబెత్ సారీ చెప్పాలి'
లాహోర్: బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్ 2 క్షమాపణలు చెప్పి తీరాలని పాకిస్థాన్లో ఓ హక్కుల కార్యకర్త డిమాండ్ చేశాడు. 1931లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ను పట్టుకొని ఉరితీసినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని అన్నారు. మార్చి 23న భగత్ సింగ్ 85 వర్దంతి సందర్భంగా అతను రెండు ప్రాంతాల్లో భగత్ సింగ్ కు ఘననివాళి అర్పించాడు. ఒకటి భగత్ సింగ్ జన్మ స్థానం అయిన ఫైసలాబాద్లోని జరన్ వాలాకు సమీపంలోని బంగా చౌక్ లో నిర్వహించగా మరొక కార్యక్రమాన్ని భగత్ సింగ్ను తన అనుచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్తో కలిపి ఉరితీసిన షాద్ మాన్ చౌక్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భగత్ సింగ్ అభిమానులు తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 'గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ను ఉరితీసినందుకు క్వీన్ ఎలిజెబెత్ -2 తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి' అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి అంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
విద్యార్థులపై దేశద్రోహం కేసులు సిగ్గుచేటు
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తెనాలిక్రైమ్: భగత్సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైతన్య యాత్రలు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. రివల్యూషనరీ యూత్ అసోసియేషన్(ఆర్వైఏ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ యూనియన్(ఏఐసీసీటీయూ), ఏఐఎస్ఏ స్టూడెంట్స్ అసోసియేషన్లతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ మోపిదేవి ఫణిరాందేవ్ మాట్లాడుతూ విశ్యవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం తగ్గాలన్నారు. విద్యార్థులపై దేశద్రోహం కేసులు బనాయించటం సిగ్గుచేటన్నారు. సెక్షన్ 120 చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆర్.నాగలక్ష్మి మాట్లాడుతూ చైతన్యయాత్రలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకూ కొనసాగుతాయన్నారు. -
తెరుచుకున్న భగత్ గది
న్యూఢిల్లీ: బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన విప్లవయోధుడు భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీ వర్సిటీలో అప్పట్లో ఆయన్ను నిర్బంధించిన గదిలోకి బుధవారం విద్యార్థులను అనుమతించారు. వైస్ రీగల్ లాడ్జ్ ఎస్టేట్గా పిలిచే ఆ భవంతిలోని ఓ గదిలో 1931లో భగత్సింగ్ను ఒకరోజుపాటు బ్రిటిష్ప్రభుత్వం నిర్బంధించింది. అనంతరం ఇప్పటి పాక్లో ఉన్న లాహోర్ జైలులో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను మార్చి 23న ఉరితీశారు. 1933లో ఎస్టేట్ను ఢిల్లీవర్సిటీకి అప్పగించగా అనంతరకాలంలో దీనిని వైస్చాన్స్లర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఐదు స్కూళ్లకు చెందిన మొత్తం 100 మంది విద్యార్థులను గదిలోకి అనుమతించారు. భగత్సింగ్ స్వయంగా రాసిన ఉత్తరాలను గదిలో ప్రదర్శనకు ఉంచారు. ఆ గదిని ప్రజల సందర్శనార్ధం తెరిచే ఉద్దేశంలేదని వర్సిటీ వీసీ యోగేశ్ త్యాగి స్పష్టంచేశారు. పోరాటంచేసే ప్రతి ఒక్కరూ భగత్సింగ్ నుంచి స్పూర్తిపొందుతారన్నారు. -
'ఆయనకు భారతరత్న ఇవ్వాలి'
చండీఘడ్: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్కు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడిగా ఉన్న బాదల్.. భగత్ సింగ్కు భారత రత్న ఇవ్వాలనీ కోరుతూ త్వరలో తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు భగత్సింగ్ను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కాగా భగత్ సింగ్ పూర్వికుల గ్రామమైన కట్కార్కలన్ జలంధార్ - చండీఘడ్ హైవే సమీపంలో ఉంది. అమరవీరుడు భగత్ సింగ్ నడియాడిన ఈ గ్రామంలో ఆయన తాత నివాసం భగత్సింగ్ స్మారక చిహ్నం, మ్యూజియంగా మారింది. -
భగత్సింగ్కు మోదీ నివాళి
భారత స్వాతంత్ర్య సమరంలో అసువులుబాసిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబ్ లోని హుస్సేనీవాలా స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా అమృత్ సర్కు చేరుకున్న ఆయన హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకచిహ్నం వద్ద నివాళులు అర్పించిన అనంతరం విప్లవ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్ బాదల్, విజయ్ సంపల్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కమల్ శర్మ తదితరులు హాజరయ్యారు. -
భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుకు ప్రధాని నివాళి
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య పోరాట యోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. సోమవారం వారి వర్థంతి సందర్భంగా ప్రధాని తొలిసారి పంజాబ్లోని హుస్సేనీవాలకు వచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లకు ప్రతి ఒక్కరు చెయ్యెత్తి నమస్కరించాలంటూ నివాళులర్పించిన అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలతో సహా సర్వస్వాన్ని అర్పించిన గొప్పవారని కొనియాడారు. వారు గొప్ప ఆత్మీయాభిమానం గలవారని చెప్పారు. 1907లో జన్మించిన భగత్ సింగ్ బ్రతికున్నంత కాలం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి 1931 మార్చి 23న ఉరితీయబడ్డారు. -
ఆ జ్ఞాపకాలు... రక్తం పొంగే దివ్య స్మృతులు
నేడు భగత్సింగ్ 84వ వర్థంతి విప్లవం ఒక చట్టం. విప్లవం ఒక ఆదేశం. విప్లవం ఒక సత్యం అన్న హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ విధానమే షహీద్ భగత్ సింగ్ నినాదమైంది. ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అన్న నినాదాలు నాటికీ, నేటికీ నిత్య నూతనంగా మార్మోగు తూనే ఉన్నాయి. అందరికంటే ముందు దేశా నికి స్వాతంత్య్రం, సోషలిజం అంటూ చాటుతూ భగత్సింగ్ ఆయన ప్రియతమ సహచరులు రాజ్గురు, సుఖ్దేవ్లు చిరునవ్వుతో ఉరికంబ మెక్కి నేటికి 84 ఏళ్లు గడిచిపోయాయి. కార్మికవర్గం, రైతాంగం ప్రధాన శక్తిగా భారతదేశం సంపూర్ణ విముక్తి దిశగా ముందుకు సాగాలన్న భగత్ సింగ్ తదితర అమరుల ఆశలను భారత పాలకులు వమ్ము చేశారు. భగత్సింగ్ కుటుంబ నేపథ్యం స్వాతంత్య్ర సమరంతో సంపూ ర్ణంగా ముడిపడి ఉండేది. 1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్లోని లమాన్పూర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్సింగ్, పద్మావతి దంప తులకు భగత్ సింగ్ జన్మించేనాటికి అతడి తండ్రి, మామ స్వరణ్ సిం గ్లు జైల్లోనే ఉన్నారు. భారత్లో తిరుగుబాటు లక్ష్యంగా స్వదేశానికి వస్తూ విద్రోహానికి గురై పట్టుబడి ఉరికంబమెక్కిన వందమంది గదర్ వీరుల్లో 20 ఏళ్ల కర్తార్సింగ్ శరభ్ త్యాగం భగత్సింగ్ను ఎంతో ప్రభావితం చేసింది. జలియన్వాలాబాగ్ హత్యాకాండ కోపోద్రిక్తున్ని చేస్తుంది. చర్యకు ప్రతి చర్యలతో ప్రారంభమైన భగత్ సింగ్ జీవితం, లాలాలజపతిరాయ్కు చెందిన ద్వారకా నాథ్ గ్రంథాలయంలో మార్క్సిజాన్ని చదివి కార్మికవర్గ దృక్పథం అలవర్చుకునేలా పరిణితి చెందింది. 1922లో చౌరీచౌరా ఘటనతో గాంధీ ఏకపక్షంగా సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించారు. దీని తర్వాతే సంపూర్ణ స్వాతంత్య్రం లక్ష్యంగా నౌజవాన్ భారత్ సభ, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ వంటి తిరు గుబాటు సంస్థలు ఏర్పడి, కాంగ్రెస్ ఉద్యమ పిలుపుల్లోనూ చురుకుగా పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే సైమన్ కమిషన్ను తిప్పికొట్టే కార్య క్రమంలో బ్రిటిష్ ముష్కరుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ లాలాల జపతిరాయ్, తర్వాత ఆసుపత్రిలో మరణించారు. భారతీయులు బల హీనులు కాదన్న సంకేతాల్ని ప్రజల్లోకి పంపి, వారి మనోబలం పెంచ డానికి ప్రతిఘటన చర్యల వైపు విప్లవ బృందం నిర్ణయాలు తీసుకుంది. ప్రజావ్యతిరేక చట్టాలను వరుసగా తీసుకువస్తున్న బ్రిటిష్ సామ్రాజ్య వాదుల బధిరత్వాన్ని బద్దలు చేసే లక్ష్యంతో 1928 ఏప్రిల్ 28న భగత్సింగ్, బటుకేశ్వర్ దత్తులు ఢిల్లీ అసెంబ్లీలో పొగబాంబు విసిరి స్వచ్ఛందంగా అరెస్టయినారు. ఎక్కడ విధ్వంసాలకు సమాజం బెదర దో, ఎక్కడ కార్మికవర్గ సార్వభౌమత్వం గుర్తింపునకు నోచుకుం టుం దో... అలాంటి అత్యున్నత సమాజాన్ని ఏర్పాటు చేయడమే విప్లవం, అదే మా ఆకాంక్ష, ఈ స్ఫూర్తితోనే ఈ పేలుడు ద్వారా స్పష్టమైన హెచ్చరిక చేశామంటూ వారు కరపత్రాలు వెదజల్లారు. ఈ కేసులో భగత్సింగ్, దత్తులకు జీవిత ఖైదు విధిస్తూ వారిని అండమాన్ జైలుకు పంపాలనే కోర్టు తీర్పు ఇచ్చినా, తర్వాత శాండర్స్ హత్య కేసును కుట్రకేసుగా మార్చి, 1930 అక్టోబర్ 7న లాహోర్ స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ఉరిశిక్ష విధించిం ది. శాండర్స్ హత్య కేసులో తన కొడుకుపై సరైన విచారణకు మళ్లీ అవకాశం కల్పించాలన్న తండ్రి కిషన్సింగ్ విన్నపాన్ని తోసిపు చ్చిన భగత్సింగ్... తన జీవితం సూత్రాలను ఫణంగా పెట్టి, కొను గోలు చేయవలసినంత విలువైనదేమీ కాదని ప్రకటించాడు. ఉరికంబమెక్కిన భగత్సింగ్ తదితరుల త్యాగం దేశ ప్రజలను రగిలించింది. ఉరిశిక్ష ఖరారైన ఈ పోరాటం తమతో ఆరంభం కాలేదని, తమతోనే అంతం కాదని భగత్సింగ్ చాటాడు. భారతీయ కార్మికవర్గాన్ని గుప్పెడుమంది పరాన్నజీవులు (బ్రిటిష్- భారత పెట్టుబడిదారులు) దోపిడీ చేస్తున్నంత కాలం.. ఈ యుద్ధం కొన సాగుతూనే ఉంటుందని భగత్ సింగ్ ఆనాడే క్రాంతదర్శనం చేశారు. భగత్సింగ్ సజీవ వారసత్వం ఎత్తిపట్టడమే ఆయనకు నిజమైన నివాళి. అమర్ , జనశక్తి నేత మొబైల్ : 9989803784 -
భగత్సింగ్ సోదరి కన్నుమూత
చండీగఢ్: స్వాతంత్య్ర సమర యోధుడు భగత్సింగ్ సోదరి ప్రకాష్కౌర్ ఆదివారం కన్నుమూశారు. కెనడాలోని టొరంటోలో నివస్తున్న 95 ఏళ్ల కౌర్... కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూమరణించారు. భగత్సింగ్ను బ్రిటిష్ పాలకులు ఉరితీసినప్పుడు.. కౌర్కు పన్నెండేళ్లు. 28వ తేదీన భగత్సింగ్ 107వ జయంతి జరుపుకొన్న మరుసటి రోజునే ఆమె మృతిచెందారు. కౌర్ మృతిపట్ల పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్సింగ్ బాదల్ సంతాపం వ్యక్తం చేశారు. -
సీక్రెట్ - భగత్ సింగ్ సింగ్ జీవిత కథ
-
భగత్సింగ్ నిర్దోషే?
లాహోర్: బ్రిటిష్ అధికారి హత్య కేసులో భారత స్వాతం త్య్ర సమరయోధుడు భగత్సింగ్ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఓ ఆధారం బయటకొచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో భగత్సింగ్ పేరు లేదని వెల్లడైంది. 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి సాండర్స్ హత్యకు గురికాగా, ఈ కేసులో భగత్సింగ్ను 1931లో లాహోర్లోని షాద్మాన్ చౌక్లో ఉరితీశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీని భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ఖురేషీ కోర్టు ద్వారా సంపాదించారు. సాండర్స్ హత్యపై లాహోర్లోని అనార్కలి పోలీస్ స్టేషన్లో 1928 డిసెంబర్ 17న గుర్తు తెలియని ఇద్దరు సాయుధులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తేలింది. ఈ కేసును తిరిగి తెరవాలని కోరుతూ ఖురేషీ ఇప్పటికే లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రాణం తీసిన క్షణికావేశం
పరస్పరం ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి ఉండాలని కలలు కన్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. చిన్న విషయంలో ఏర్పడిన మనస్పర్ధలు గొడవకు దారితీశాయి. క్షణికావేశానికి లోనయ్యారు. చస్తానంటూ ఒకరినొకరు బెదిరించుకున్నారు. చివరకు అన్నంతపనీ చేశారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. కడప అర్బన్, న్యూస్లైన్ : కడప నగరం భగత్సింగ్ కాలనీలో మంగళవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహమైన ఆరు నెలలకే వీరు తనువు చాలించడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఎస్ఐ బాలమద్దిలేటి కథనం మేరకు.. భగత్సింగ్ నగర్లో పెంచలయ్య,ఆదిలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇజ్రాయెల్, విజయకుమార్ అనే కుమారులు, శాంతి అనే కుమార్తె ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్కు సుశీల అనే యువతితో వివాహం జరిగింది. వీరిరువురు భగత్సింగ్ నగర్లోనే వేరు కాపురం ఉంటున్నారు. సుశీల చెల్లెలు నాగజ్యోతి(19) ఇజ్రాయిల్ తమ్ముడు విజయకుమార్(21) పరస్పరం ప్రేమించుకున్నారు. కొంతకాలంగా విజయ్కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ నెలలో విజయకుమార్, నాగజ్యోతిలు ఐటిఐ సర్కిల్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రుల వద్దే వీరు ఉంటున్నారు. ఈనెల 21వ తేదీన సోమవారం విజయకుమార్ తల్లి ఆదిలక్ష్మి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ శుభకార్యానికి తన కుమార్తెతో కలిసి వెళ్లింది. మంగళవారం విజయకుమార్ తండ్రి పెంచలయ్య తాను పనిచేసే పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి రాగా ఆ సమయంలో విజయకుమార్ మద్యం సేవించి ఇంటికి రావడాన్ని తండ్రి పెంచలయ్య గమనించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పెంచలయ్య డ్యూటీకి వెళ్లిపోయాడు. దీనికి తోడు విజయకుమార్ తన భార్య నాగజ్యోతిని అక్క సుశీల ఇంటికి వెళ్లవద్దని కూడా గొడవ పడేవాడు. ఈ గొడవ పెరిగి ఉరి వేసుకొని చనిపోతామని పరస్పరం బెదిరించుకున్నారు. ఓ గదిలో విజయకుమార్ ఫ్యాన్కు ఉరి వేసుకోవడాన్ని గమనించిన నాగజ్యోతి భయపడి తన అక్క సుశీలకు ఫోన్చేసి చెప్పింది. ఆమె వచ్చేలోపు నాగజ్యోతి కూడా మరో గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. స్థానికులు, సుశీల వచ్చి చూసేలోపు భారాభర్తలిద్దరు ఫ్యాన్లకు వేలాడుతున్నారు. కొన ఊపిరితో ఉన్న నాగజ్యోతిని కిందికి దించేలోపు ఆమె కూడా మృతిచెందింది. విజయకుమార్ అన్న ఇజ్రాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అవానాకు పోలీస్ పంచ్!
క్రికెటర్ను కొట్టిన కానిస్టేబుల్ న్యూఢిల్లీ: సాధారణంగా క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎక్కడో ఒక చోట నిబంధనలు అతిక్రమించడం...ఈ క్రమంలో అవసరమైతే సదరు అధికారులతో గొడవకు దిగడమో, చేయి చేసుకోవడమో చూస్తుంటాం. కానీ గురువారం ఇక్కడి నోయిడాలో దీనికి పూర్తిగా రివర్స్లో ఓ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్కు సంబంధించి జరిగిన ఒక గొడవలో క్రికెటర్ పర్వీందర్ అవానాపై స్థానిక పోలీస్ ఒకరు తన బలాన్ని ప్రదర్శించాడు. తనకో ఫోన్ రావడంతో మాట్లాడేందుకు అవానా కారును రోడ్డు పక్కన ఆపాడు. దీనిపై హెడ్ కానిస్టేబుల్ భగత్ సింగ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చలానా విధించాల్సి ఉంటుందంటూ హెచ్చరించాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత తాను వెళ్లిపోతానని అవానా చెప్పబోయాడు. దీనిపై మాటా మాటా పెరిగింది. పట్టలేని కోపంతో ఆ పోలీస్, అవానా మెడపై రెండు బలమైన పంచ్లు కొట్టాడు. ఆ వెంటనే ఈ ఢిల్లీ క్రికెటర్ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడటంతో భగత్ సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది! -
పాకిస్తాన్ లోని భగత్ సింగ్ ఇంటికి భారీ నిధులు
లాహోర్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఇంటికి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు పాకిస్తాన్ శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ లో ఉన్న భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి భారీ నిధులను విడుదల చేసింది. దీంతో పాటుగా ఆయన పేరు మీద ఉన్న స్కూల్ పనులను కూడా చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 80 మిలియన్లు(రూ.8 కోట్లు)ను విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బంగే గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో ఆ నిధుల్లోని కొంత మొత్తాన్ని వాటికి కేటాయించనున్నారు. ప్రస్తుతం ఫైసలాబాద్ మ్యూజియంలో ఉన్న భగత్ సింగ్ కు చెందిన వస్తువులను నిర్మాణ పనులు పూర్తి చేసుకోబోతున్నఇంటికి చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. లాహోర్ కు 150 కి.మీ దూరంలో ఉన్న బంగే గ్రామంలో భగత్ సింగ్ 1907, సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. -
లగడపాటికి భగత్ సింగ్కు పోలికా ?
విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్తో పోల్చడం హాస్యాస్పందంగా ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లొండలో విలేకర్లతో మాట్లాడారు. ఆంగ్లేయుల బానితస్వంలో మగ్గుతున్న భారత దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పరితపించి భగత్ సింగ్ అశువులుబాసారని గుత్తా ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటి మహానియుడితో లగడపాటిని పోలుస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకునే పార్టీలకు పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇటీవల ప్రకటించారు. ఆ క్రమంలో గురువారం లోక్సభకు బిల్లు వచ్చింది. ఈ నేపథ్యంలో సభ వెల్ లోకి సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీ దూసుకొచ్చారు దాంతో ఆయనను అడ్డుకొనేందుకు కొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీని రక్షించేందుకు అక్కడకు చేరుకున్న లగడపాటిని కూడా అడ్డుకునేందుకు ఆ సదరు ఎంపీలు ప్రయత్నించారు. దాంతో లగడపాటి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే ను స్ప్రే చేశారు. దాంతో లోక్సభలో తీవ్ర భయానక పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో సభలో లగడపాటి వ్యవహరించిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజలు హర్షం ప్రకటించారు. దాంతో లగడపాటి ఆంధ్రప్రదేశ్ భగత్ సింగ్ అంటూ మీడియాలో ప్రచార హోరు మిన్నంటింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా స్పందించారు. -
భగత్సింగ్ అమరవీరుడు కాదా?
రాజ్యసభలో ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం న్యూఢిల్లీ: జాతీయ అమరవీరుల జాబితాలో భగత్సింగ్ పేరు లేకపోవడంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే ఆయన పేరు ను చేర్చాలని డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా.. ప్రభుత్వం భగత్ను అమరవీరుడిగా పరిగణిస్తోందని, త్వరలోనే అమరుల జాబితాలో చేరుస్తామన్నారు. అమరవీరుల జాబితాలో భగత్సింగ్ పేరు లేదన్న విషయాన్ని ఒక ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని జీరో అవర్లో జేడీయూ సభ్యుడు కేసీ త్యాగి లేవనెత్తారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, జేడీయూ నేత శివానంద తివారీ డిమాండ్ చేశారు. దీంతో రాజీవ్ శుక్లా సమాధానమిస్తూ.. ‘భగత్ జ్ఞాపకార్థం ప్రభుత్వం ప్రత్యేక నాణాలను విడుదల చేసింది. ఆయన జన్మించిన నవాన్షహర్కు ‘షహీద్ భగత్సింగ్ నగర్’గా నామకరణంచేశాం.అమరవీరుల జాబితాలోనూ చేరుస్తాం’అని చెప్పారు. -
భగత్సింగ్ అమరత్వానికి అపచారం!
న్యూఢిల్లీ: దేశమాత దాస్యశృంఖలాలను బద్ధలు కొట్టడానికి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, చిరునవ్వుతో ఉరికొయ్యకు వేలాడిన స్వాతంత్య్ర యువకిశోరం భగత్సింగ్ బలిదానానికి ఘోర అపచారం! ఆ ధీరుడి అమరత్వానికి చరిత్రపుటల్లో శాశ్వత స్థానం దక్కినా అధికార పత్రాల్లో మాత్రం చోటు దక్కలేదు..! ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఆ అపురూపమైన ఆత్మత్యాగం ప్రభుత్వ రికార్డుల్లో కాసింత చోటుకు నోచుకోలేదు. భగత్సింగ్ను అమరవీరుడిగా ప్రకటించారో లేదో చెప్పే రికార్డులేవీ తమ వద్ద లేవని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేతులెత్తేసింది. భగత్ను, ఆయన సహచరులైన రాజ్గురు, సుఖ్దేవ్లను ఎప్పుడు అమరులుగా ప్రకటించారో వెల్లడించాలని భగత్ సమీప బంధువు యాదవేంద్ర సింగ్ ఏప్రిల్లో హోం శాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులో కోరారు. ఆ ముగ్గురిని అమరులుగా ప్రకటించకపోయినట్లయితే, ఎందుకు ప్రకటించలేదో బయటపెట్టాలని, ఆ గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని అడిగారు. దీనికి హోం శాఖ ప్రజా సంబంధాల అధికారి శ్యామలాల్ మోహన్ మే నెలలో దిగ్భ్రాంతికరమైన సమాధానమిచ్చారు . ‘భగత్, రాజ్గురు, సుఖ్దేవ్లను అమరవీరులుగా ప్రకటించినట్లు చెప్పే రికార్డులేవీ మా శాఖ వద్ద లేవు. వారికి ఆ గౌరవం కల్పించే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో కూడా తెలియదు’ అని సెలవిచ్చారు. దీంతో యాదవేంద్ర తదుపరి కార్యాచరణ కోసం హోం శాఖ కార్యదర్శిని సంప్రదించేందుకు అపాయింట్మెంట్ కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘భగత్కు అమరుడి గౌరవం కల్పించే విషయంలో రాష్ట్రపతి కూడా సానుకూలంగా స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తా’ అని యాదవేంద్ర చెప్పారు. స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన వారిని అమరులుగా ప్రకటించే విధానమేదీ లేదని హోం శాఖ వర్గాలు చెప్పాయి. రక్షణ శాఖ సైనికులకు మాత్రమే ఆ హోదా ఇస్తుందన్నాయి. వివాదం వద్దు... ప్రధాని: భగత్ అమరత్వానికి రికార్డులు ఆధారం కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈ అంశంపై వివాదాన్ని రేపకూడదని కోరారు. ‘భగత్ స్వాతంత్య్రమనే మహత్తర లక్ష్యం కోసం అమరుడయ్యారు. ఆయన అమరత్వానికి అధికార రికార్డులు ఆధారం కాదు. భగత్ జాతికి గర్వకారణం. ఆయనకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది.’ అని ఓ ప్రకటనలో తెలిపారు.