Brahmastra Movie
-
నేషనల్ అవార్డ్స్ లో బాలీవుడ్ కి బిగ్ షాక్
-
ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)
-
9 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్
మౌనీ రాయ్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నాగిని సీరియల్. ఆ సీరియల్తోనే ఎక్కువ ఫేమ్ను తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్లో ఆమె నటించిన బ్రహ్మస్త్ర చిత్రం మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమాలో విలన్గా నటించి అందరినీ ఆకట్టుకుంది బాలీవుడ్ భామ మౌనీ రాయ్. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నానని పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. (ఇది చదవండి: 'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే ) మౌనీ తన ఇన్స్టాలో రాస్తూ..' 9 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నా. నాకు తెలిసిన దానికంటే లోతైన ఆలోచనలతో మునిగిపోయా. ప్రస్తుతం నేను ఇంటికి తిరిగి వచ్చా. నెమ్మదిగా కోలుకుంటున్నా. కానీ బాగానే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మేలు కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి నా స్నేహితులకు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు. మీలాగా నన్ను చూసుకునే వారు ఎవరూ లేరు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.' అంటూ తన భర్త నంబియార్పై ప్రశంసలు కురిపించింది. అయితే తన అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. (ఇది చదవండి: నిజంగానే అతీంద్రియ శక్తులున్నాయా?.. అయితే ఈ సినిమా చూడాల్సిందే!) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
మూడేళ్ల తర్వాతే బ్రహ్మాస్త్రం పార్ట్ 2
‘బ్రహ్మాస్త్రం’ చిత్రంలోని తర్వాతి భాగాలను చూడాలనుకుంటున్న ప్రేక్షకులు మరింత సమయం వేచి ఉండక తప్పదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న హిందీ ట్రయాలజీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాల ‘బ్రహ్మాస్త్రం’లోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ వన్ శివ’ గత ఏడాది సెప్టెంబరు 9న విడుదలై, ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పా త్రల్లో ఈ చిత్రం రూ΄పొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించారు. కాగా ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని రెండో భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్టు 2 దేవ్’, ‘బ్రహ్మాస్త్ర’ థర్డ్ పా ర్టులను వరుసగా 2026 డిసెంబరు, 2027 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ 1 శివ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సెకండ్ పా ర్ట్, థర్డ్ పా ర్ట్ స్క్రిప్ట్స్పై మరింత ఫోకస్ పెట్టాను. అలాగే ఈ రెండు సినిమాలను ఏడాది గ్యాప్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అలాగే తాను మరో సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఉందని, సరైన టైమ్లో ఆ విషయాన్ని వెల్లడిస్తానని కూడా అయాన్ పేర్కొన్నారు. దాంతో ఇది ‘వార్ 2’ సినిమా గురించే అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
ఆ అవార్డు అందుకునే అర్హత లేదనిపిస్తోంది: రణ్బీర్
బాలీవుడ్ దంపతులు, స్టార్ హీరోహీరోయిన్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు గానూ రణ్బీర్ ఉత్తమ నటుడిగా, గంగూబాయి కఠియావాడికిగానూ ఆలియా ఉత్తమనటిగా ఈ అవార్డులు పొందారు. తాజాగా తనకు ఈ పురస్కారం రావడంపై రణ్బీర్ స్పందించాడు. 'తు జూఠీ మై మక్కార్' సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఛండీఘడ్లో పర్యటిస్తున్న రణ్బీర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. 'దాదాసాహెబ్ ఫాల్కే రావడం సంతోషంగా ఉంది. కానీ బ్రహ్మాస్త్రలో నేను మరీ అత్యద్భుతంగా ఏమీ నటించలేదని నా అభిప్రాయం. ఈ పురస్కారానికి నేను పూర్తి అర్హుడిని కాదనిపిస్తోంది. ఆలియాకు అయితే తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఏదైనా అవార్డు వచ్చిందంటే హమ్మయ్య మా సినిమాకు మంచి రిజల్స్ వచ్చింది అని హ్యాపీగా ఫీలవుతాం. మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవరకు ఏ టెన్షన్ లేకుండా ఉంటాం' అని చెప్పుకొచ్చాడు. ఇటీవలి కాలంలో తనకు బాగా నచ్చిన పర్ఫామెన్స్ల గురించి చెప్తూ పుష్పలో అల్లు అర్జున్, గంగూబాయి కఠియావాడిలో ఆలియా అలాగే ఆర్ఆర్ఆర్లో రాజమౌళి పనితనం తనను బాగా ఆకట్టుకున్నాయన్నాడు. కాగా బ్రహ్మాస్త్ర గతేడాది సెప్టెంబర్ 9న రిలీజై సూపర్ హిట్ సాధించింది. Icon star @alluarjun performance in #Pushpa impacted me a lot as an audience & an actor - #RanbirKapoorpic.twitter.com/xX96TwiQc3 — Bunny - Youth Icon Of India (@BunnyYouthIcon) February 22, 2023 చదవండి: వేరొకరితో ఎంగేజ్మెంట్.. మాజీ ప్రియుడిచ్చిన నగలు మాత్రం.. -
DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్బీర్, నటి అలియా.. ఆర్ఆర్ఆర్కు అవార్డు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. View this post on Instagram A post shared by Dadasaheb Phalke -DPIFF Awards (@dpiff_official) ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్సీరీస్గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార) ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా) క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్) -
ఓ పెద్ద కథ ..రెండు సినిమాలు
అన్ని సినిమాలకూ కథ ఉంటుంది. కొన్ని సినిమాలకు పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ పెద్ద కథని రెండున్నర గంటల్లో చూపించలేరు. అందుకే రెండు మూడు భాగాలుగా చూపిస్తారు. అలా ఈ ఏడాది ఇటు సౌత్ అటు నార్త్లో ‘పార్ట్ 2’ సినిమాలు చాలానే రానున్నాయి. తొలి భాగం విడుదలై, ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కొన్ని చిత్రాలైతే తొలి, మలి భాగం రెండూ ఆన్సెట్స్లో ఉన్నాయి. ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరులో రిలీజై సూపర్హిట్ అయింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రైజ్’పై మరింత ఫోకస్ పెట్టింది ఈ టీమ్. ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. ‘పుష్ప: ది రూల్’ను ఈ ఏడాదే రిలీజ్ చేయా లనుకుంటున్నారు. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న రెండో భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. అలాగే తమిళంలో ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి సూపర్ హిట్స్ను అందించిన దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం ‘విడుదలై’ అనే సినిమాను తీస్తున్నారు. విజయ్ సేతుపతి, సూరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. రెండు భాగాలకు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది వేసవిలో, రెండో బాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మరో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ (తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలైంది. మలి భాగం రిలీజ్పై త్వరలో ఓ స్పష్టత రానుంది. అదే విధంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అటు మలయాళంలో ‘రామ్’ రెండు భాగాలుగా రూపొందుతోంది. మోహన్లాల్కు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి హిట్స్ను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్లోనే కాదు నార్త్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ట్రయాలజీగా ఈ సినిమాను తీస్తున్నారు. తొలి భాగం విడుదలైన విషయం తెలిసిందే. మలి భాగం త్వరలోనే సెట్స్కి వెళ్లనుంది. అలాగే జాన్ అబ్రహాం హీరోగా రూపొందిన ‘ఎటాక్’ తొలి భాగం గత ఏడాది ఏప్రిల్లో రిలీజైంది. మలి భాగం రెడీ అవుతోంది. ఇవే కాదు.. రెండు భాగాల చిత్రాలు కొన్ని సెట్స్లో, ఇంకొన్ని చర్చల దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రాలు రెండు భాగాలుగా విడుదల కానున్నాయని టాక్. అలాగే హీరో ఎన్టీఆర్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ సినిమా ఉందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని, తొలి భాగంలో ఎన్టీఆర్ హీరోగా, రెండో భాగంలో ధనుష్ హీరోగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక సూర్య హీరోగా శివ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. ఇంకా బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, రామాయణం ఆధారంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలు రానుందని టాక్. -
బ్రహ్మాస్త్ర 2 లో యశ్.. కరణ్ జోహార్ క్లారిటీ
-
గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఇవే..!
-
గూగుల్ సెర్చ్లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
బ్రహ్మాస్త్ర- 2లో విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ క్లారిటీ ఇదే..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ బ్రహ్మస్త్ర. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధించింది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ చిత్రం సందడి చేస్తోంది. (చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్) అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించడమే కాకుండా. రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు అయాన్ ముఖర్జీ గతంలోనే ప్రకటించారు. త్వరలోనే బ్రహ్మస్త్ర పార్ట్-2 షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ -2పై సోషల్ మీడియాలో పలు రకాల రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దేవ్ పాత్రలో పలువురు హీరోలు నటించబోతున్నారని వార్తలు హల్చల్ చేశాయి. దేవ్ పాత్రలో రణవీర్, యశ్, హృతిక్ రోషన్ వంటి హీరోలు నటిస్తున్నారని ఇప్పటికే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ పేరును సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లైగర్ హీరో విజయ్ దేవరకొండను బ్రహ్మాస్త్ర-2లో తీసుకోవడానికి నిర్మాత ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందించారు. బ్రహ్మాస్త్ర సినిమాలో దేవ్ పాత్రపై వస్తున్న హైప్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇటీవల హృతిక్, రణవీర్, యశ్ నటిస్తున్నారని వార్లలొచ్చాయి. అందుకే ఈ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని చెప్పిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ అయాన్ వ్యంగ్యంగా మాట్లాడారు. దేవ్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే విషయంలో కూడా ఏమాత్రం వాస్తవం లేదన్నారు. డైరెక్టర్ కామెంట్స్తో దేవ్ పాత్రపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. -
ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పించాడు. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, మౌనీ రాయ్లు కీలకలు పాత్రలు పోషించిన బ్రహ్మస్త్ర ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ఇప్పటికే ఈమూవీ ఓటీటీ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ భారీ ఢీల్కు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జాతిరత్నాలు’ డైరెక్టర్కు అరుదైన వ్యాధి, అప్పుడు మెదడు పని చేయదట! నవంబర్ 4న ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్లు హాట్స్టార్ ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఈ మూవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లజ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు గతంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెలిపాడు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్గా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. చదవండి: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా? -
బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!
కేజీఎఫ్ హీరో యశ్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది. రాఖీభాయ్గా యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్కు ప్రముఖ నిర్మాతలు యశ్ను సంప్రదించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని టాక్. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర- పార్ట్2 కోసం యశ్ను సంప్రదించారని నెట్టింట్లో వైరలైంది. అయితే ఈ విషయంపై బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు' అని కొట్టిపారేశారు. బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్ను సంప్రదించారని మరో టాక్. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
ఇంటింటికీ వెళ్లి చెప్పాలా? నాకు వేరే లైఫే లేదా?: హీరో
స్టార్ జంట రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 9న విడుదలైంది. విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.425 కోట్లు రాబట్టింది. థియేటర్లలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర నవంబర్ 4 నుంచి హాట్స్టార్లోకి రాబోతోంది. సినిమా రిలీజ్కు ముందే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసింది చిత్రయూనిట్. ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు కూడా ప్రమోషన్స్ చేయడం నావల్ల కాదంటున్నాడు రణ్బీర్. ఈ మేరకు ఓ వీడియోను ఆలియా భట్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో హీరో ఓ ఫోన్కాల్ మాట్లాడుతూ.. 'ఇక నా వల్ల కాదు బ్రదర్. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ చేసేశాం కదా! అయాన్ ముఖర్జీతో కూడా పనైపోయింది. ఇప్పుడేమంటావ్.. బ్రహ్మాస్త్ర హాట్స్టార్లో వస్తుందా? అంటే మళ్లీ ప్రమోషన్లు చేయాలా? సినిమాలో కూడా ఆలియా అన్నిసార్లు శివ శివ అని స్మరించలేదేమో.. ప్రతి ఈవెంట్లో కేసరియా(కుంకుమలా నువ్వు..) పాట పాడి ఆమె గొంతు పోయింది. పదేపదే స్టేజీ మీద డ్యాన్స్ చేసీ చేసీ నేనూ ఓ దెయ్యంలా మారిపోతున్నా.. బ్రహ్మాస్త్ర లోగో లాంచ్ చేసినప్పుడు 150 డ్రోన్లతో స్వీట్లు పంచాం. ఇంకా ఏం చేయాలి? ఇంటింటికీ వెళ్లి సోదరసోదరీమణులారా.. హాట్స్టార్లో బ్రహ్మాస్త్ర రాబోతోంది, దయచేసి చూడండి అని అడగాలా? అసలు అయాన్ ఏమనుకుంటున్నాడు? నాకు బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కాకుండా వేరే జీవితమే లేదనుకుంటున్నాడా? నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను, అది నా జీవితంలోనే గొప్ప విషయం' అని చెప్పుకొచ్చాడు. ఇలా మాట్లాడుతున్న సమయంలో డైరెక్టర్ అయాన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన రణ్బీర్.. 'హేయ్ అయాన్.. తప్పకుండా చేద్దాం. ప్రమోషన్స్ చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ బ్రహ్మాస్త్ర చూడాలి' అంటూ ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
అఫీషియల్: ఓటీటీలోకి బ్రహ్మాస్త్ర, ఎప్పటినుంచంటే?
స్టార్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజైంది. ఇందులో నాగిని నటి మౌనీరాయ్, కింగ్ నాగార్జున, బిగ్బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం హాట్స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ సినిమా నవంబర్ 4 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరింకే, థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే నెల 4వ తారీఖు నుంచి హాట్స్టార్లో ఎప్పుడైనా చూసేయండి! The World of Ancient Indian Astras is coming to Disney+ Hotstar on November 4. #BrahmastraOnHotstar pic.twitter.com/chmZBI6grk — Disney+ Hotstar (@DisneyPlusHS) October 23, 2022 చదవండి: ఉదయ్ కిరణ్తో ఐదు సినిమాలకు సంతకం చేశా: పింకీ పవిత్ర నరేశ్ బ్రేకప్ -
‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళి సందర్భంగా బ్రహ్మస్త్ర మూవీ వచ్చేవారంలో ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 23 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై హాట్స్టార్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. -
ప్రస్తుతం బాలీవుడ్ కన్ను ఈ ట్రయాలజీపైనేనా?
ఫ్రాంచైజీ, రీమేక్స్, బయోపిక్స్ ట్రెండ్ల తర్వాత బాలీవుడ్ ప్రస్తుతం ట్రయాలజీ (ఒకే కథను మూడు భాగాలుగా) ట్రై చేస్తోంది. అరడజను ట్రయాలజీ ఫిలింస్ వెండితెరపైకి రానున్నాయి. ఆ ‘ట్రైయాలజీ’ చిత్రాల వివరాల్లోకి వెళితే... బ్రహ్మాస్త్రం ఐదేళ్లుగా సినీ లవర్స్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీ గురించి వింటూనే ఉన్నారు. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ రూపొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా దక్షిణాది వెర్షన్కు రాజమౌళి సమర్పకులుగా ఉండటం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. రెండో భాగంలోని ప్రధాన పాత్రల కోసం హృతిక్రోషన్ , రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనె పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇతిహాసాల ఆధారంగా...! ట్రయాలజీ ఫిలింస్ తీసేంత స్కోప్ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ ప్రముఖ దర్శకులు నితీష్ తివారి, రవి ఉడయార్లు కలిసి రామాయణం ఆధారంగా ఓ ట్రయాలజీని ప్లాన్ చేశారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా వంటి అగ్ర నిర్మాతలు ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్లో ప్రధాన పాత్రధారులుగా మహేశ్బాబు, రామ్చరణ్, హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ వంటి స్టార్ల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా హిందీలో ఓ ట్రయాలజీ రూపుదిద్దుకోనుంది. ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే టైటిల్ను కూడా ప్రకటించారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ చిత్రానికి అదిత్య థార్ దర్శకత్వం వహిస్తారు. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా సింగపూర్కు చెందిన కృష్ణ ఉదయశంకర్ రాసిన ‘ది ఆర్యావతార క్రానికల్స్’ (గోవింద, కౌరవ, కురుక్షేత్ర) పుస్తకం హక్కులను సోనమ్ కపూర్ దక్కించు కున్నారు. ‘ది ఆర్యావతార క్రానికల్స్’ను ట్రయాలజీగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోనమ్ పేర్కొన్నారు. ఇంకా ‘మహాభారతం’ ఆధారంగా ఓ సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా ట్రయాలజీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త నాగిని వెండితెరపై నాగిని అనగానే హిందీలో శ్రీదేవి, రీనా రాయ్, రేఖ గుర్తుకు వస్తారు. ఈ జాబితాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు చేరనుంది. ‘నాగిని’ ట్రయాలజీలో నటించేందుకు శ్రద్ధా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాల్ ఫురియా దర్శకత్వంలో ఈ ట్రయాలజీని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఛత్రపతి మహావీరుడు ఛత్రపతి శివాజీ జీవితంతో ఓ ట్రయాలజీని నిర్మించనున్నట్లు నటుడు, నిర్మాత రితేష్ దేశ్ముఖ్ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ ట్రయాలజీని తెరకెక్కించేందుకు మరాఠీ దర్శకులు ‘సైరట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే, రవీంద్ర జాదవ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. శక్తిమాన్ ఇక బుల్లితెర, వెండితెర సూపర్ హీరోస్లలో శక్తిమాన్కు ఆడియన్స్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్ హీరో క్రేజ్ను క్యాష్ చేసుకునే దిశలో ఇప్పటికే పలువురు నిర్మాతలు సినిమాలు తీశారు. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ‘శక్తిమాన్’ టైటిల్తో ఓ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ట్రయాలజీగా రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, టైటిల్ రోల్లో రణ్వీర్ సింగ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవే కాదు.. మూడు భాగాల చిత్రాలు మరికొన్ని తెరపైకి వచ్చే చాన్స్ ఉంది. -
బ్రహ్మస్త్ర సాంగ్.. ఆ డిలీటెడ్ సీన్ మీరు చూశారా?
ఆలియాభట్, రణ్బీర్ కపూర్ జంటగా బాలీవుడ్లో విజువల్ వండర్గా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ వీడియో సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో డిలీటెడ్ సీన్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అలియా భట్ ఇన్స్టా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సాంగ్లో అలియా భట్, రణబీర్ కపూర్ మధ్య 'తొలగించబడిన సీన్' చూసి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, తుషార్ జోషి ఆలపించారు. ఆ సీన్లో ఆలియా చెవిపోగులతో నారింజ రంగు దుస్తులను ధరించి కనిపించింది. ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడంచారు. ఈ సినిమాలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. For when love cannot be explained in words, you’ll have #RasiyaReprise. Video out now. ❤️https://t.co/4PyPh95zbl#Brahmastra — BRAHMĀSTRA (@BrahmastraFilm) October 7, 2022 View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
బ్రహ్మస్త్ర కలెక్షన్లపై దర్శకుడు క్లారిటీ.. 25 రోజుల్లోనే..!
ఆలియాభట్, రణ్బీర్ కపూర్ జంటగా బాలీవుడ్లో విజువల్ వండర్గా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. ( చదవండి: ఓటీటీకి 'బ్రహ్మస్త్ర' .. అప్పుడేనా?) అయితే ఈ సినిమా కలెక్షన్లపై కాస్త గందరగోళం ఏర్పడింది. తాజాగా ఈ మూవీ సాధించిన కలెక్షన్లపై దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఇన్స్టాలో రాస్తూ ' 2022లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్గా నిలిచిన హిందీ మూవీ. ఇందుకు మీ అందరికి ధన్యవాదాలు. హ్యాపీ నవమి' అంటూ క్యాప్షన్తో కలెక్షన్ల వివరాలతో ఓ కొత్త పోస్టర్ను పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో బ్రహ్మాస్త్ర రూ.425 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని పోస్టర్లో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూల్ భులయ్యా 2, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాల కలెక్షన్ల కంటే ఎక్కువ మొత్తం బ్రహ్మాస్త్రకు వచ్చినట్లు అయాన్ వెల్లడించాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బడ్జెట్ అనూహ్యంగా పెరిగినట్లు చెప్పారు అయాన్ ముఖర్జీ. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
ఓటీటీకి 'బ్రహ్మస్త్ర' .. అప్పుడేనా?
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్, రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైంది. బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. (చదవండి: దసరా సెలవుల్లో బ్రహ్మస్త్ర బంపర్ ఆఫర్.. థియేటర్లలో రూ.100 కే చూడొచ్చు) తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్పై టాక్ నడుస్తోంది. ఈ సినిమా అక్టోబర్లోనే స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం. అక్టోబర్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే బ్రహ్మస్త్రను చూడాలనుకుంటున్న అభిమానులకు పండగే. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
దసరా సెలవుల్లో బ్రహ్మస్త్ర బంపర్ ఆఫర్.. థియేటర్లలో రూ.100 కే చూడొచ్చు
బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రం 'బ్రహ్మస్త్ర'. బాలీవుడ్ ప్రేమజంట రణ్బీర్ కపూర్, ఆలియాభట్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇటీవలే వరల్ట్ వైడ్ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల క్లబ్లో చేరింది. ఈ సినిమాను మిస్సవుతున్న వారి కోసం చిత్ర యూనిట్ సరికొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. ఇప్పటికే ఈనెల 23న మల్టీప్లెక్స్ల్లో కేవలం రూ.75 కే సినిమా చూడవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ప్రేక్షకుల నుంచి ఒక్కసారిగా ఊహించని రీతిలో స్పందన వచ్చింది. తాజాగా దసరా సెలవుల్లోనూ మరో బంపర్ ఆఫర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈనెల 29 వరకు కేవలం రూ.100 కే మల్టీప్లెక్స్ల్లో సినిమా చూడవచ్చని చిత్ర యూనిట్ ప్రకటించింది. దసరా సెలవులను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే వారికి ఈ ఆఫర్ మంచి సువర్ణావకాశం. ఇంకేముంది కుటుంబ సమేతంగా బ్రహ్మస్త్రను చూసేయండి. (చదవండి: ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మస్త్ర రికార్డ్.. తొలివారం ఎన్ని కోట్లంటే..!) బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. Celebrate Navratri with #Brahmastra! Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September. Book your tickets now! BMS - https://t.co/qjPVPFdZfT Paytm - https://t.co/eVmK21uC8n T&C Apply* pic.twitter.com/vz7Du38dUG — BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022 -
బ్రహ్మాస్త్రకు వారిద్దరు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. అందులో నిజమెంత?
బాలీవుడ్ రొమాంటిక్ జోడీ ఆలియాభట్, రణ్బీర్ కపూర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో పోషించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ విషయంలో పలు రకాల వదంతులు వ్యాపించాయి. ఈ సినిమా బడ్జెట్ పెరిగడంతో.. అలియాభట్, రణ్బీర్ కపూర్ రెమ్యునరేషన్ తీసుకోలేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘చాలా మంది త్యాగాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్బీర్ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలియాభట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయినైంది. ఆమెకు ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేం సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ చిత్రంలో భాగమైంది’ అని అన్నారు. (చదవండి: బిగ్బాస్ షో.. ఆ స్టార్ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!) రెమ్యునరేషన్పై వస్తున్న వార్తలపై రణ్బీర్ కపూర్ కూడా స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ నిజానికి నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ చిత్రానికి నిర్మాతను కూడా. కానీ నేను అంతకు మించి పొందాను. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయగలమనే నమ్మకం ఉంది. ఒక నటుడిగా నేను ఇంతకంటే పొందగలిగేది ఏముంటుంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. " -
మూవీ లవర్స్కి బంపర్ ఆఫర్.. 75 రూపాయలకే సినిమా చూడొచ్చు
మూవీ లవర్స్కి గుడ్న్యూస్. మల్టీప్లెక్సుల్లో కేవతం 75 రూపాయలకే సినిమా చూసే ఛాన్స్ రాబోతుంది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో 250 నుంచి 400వరకు( పెద్ద సినిమాలకు) టికెట్ రేటు ఉంటుంది. సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ఈ అవకాశం కల్పిస్తోంది. దీంతో ఆ ఒక్కరోజు అన్ని మల్టీప్లెక్స్లలో రూ.75కే అన్ని సినిమాలు చూడొచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోని PVR, INOX, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటుకే టికెట్లు లభించనున్నాయి. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రీనింగ్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఉంది. ఆలియాభట్, రణ్బీర్ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3డీలో వీక్షించొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ ధర రూ. 330గా ఉంది. సో నేషనల్ మూవీ డే రోజున కేవలం 75 రూపాయలకే ఈ భారీ బడ్జెట్ మూవీని చూసే ఛాన్స్ కొట్టేయండి. -
బ్రహ్మస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్.. ఇదొక పెద్ద..!
బాలీవుడ్ సినీ క్రిటిక్గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) బ్రహ్మాస్త్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన రణ్బీర్ కపూర్, ఆలియా భట్ మూవీని తనదైన శైలిలో విమర్శించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు. బ్రహ్మస్త్ర ఒక పెద్ద డిజాస్టర్ అని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తనను నిందించవద్దని నిర్మాత కరణ్ జోహార్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాలీవుడ్ను షేక్ చేశారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. బాలీవుడ్లో ఇతర సినిమాల్లాగే ఇది కూడా పెద్ద వైఫల్యమని చిత్రబృందానికి దిమ్మతిరిగే షాకిచ్చారు. కేఆర్కే సోషల్ మీడియాలో స్పందిస్తూ ' అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నేను సమీక్ష చేయలేదు, అయినప్పటికీ ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లలేదు. అందుకే ఇదొక పెద్ద డిజాస్టర్. ఇతర బాలీవుడ్ నిర్మాతల్లాగే కరణ్ జోహార్ తన వైఫల్యానికి నన్ను నిందించరని ఆశిస్తున్నా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. I didn’t review film #Brahmastra still people didn’t go to theatres to watch it. So it has become a disaster. Hope @karanjohar won’t blame me for the failure like many other Bollywood people. — KRK (@kamaalrkhan) September 16, 2022 కాగా కేఆర్కే హిందీ బిగ్బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ నటులైన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
బ్రహ్మస్త్ర జంటపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్
బ్రహ్మస్త్ర సక్సెస్ తర్వాత రణ్బీర్ కపూర్, ఆలియా భట్ మరోసారి తెరను పంచుకోనున్నారా? ఇద్దరు కలిసి మరో రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించనున్నారా? అన్న అభిమానుల సందేహాలకు తెరదించింది ఈ బాలీవుడ్ జంట. తామిద్దరం ప్రస్తుతానికి మరే చిత్రంలో నటించడం తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు తెరదించారు. (చదవండి: ఎయిర్పోర్ట్లో బ్రహ్మస్త్ర జంట సర్ప్రైజ్.. ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) రూమర్లపై రణ్బీర్ కపూర్ స్పందిస్తూ 'మా ఇద్దరి నిజ జీవితంలో సరదాగా ఉన్నాం. ప్రస్తుతానికి మేమిద్దరం మరే చిత్రంలోనూ నటించడం లేదని' అన్నారు. అయితే ఆలియాభట్ మాట్లాడుతూ నేను రూమర్ల గురించి విన్నాను. కానీ మా తరువాత చిత్రం బ్రహ్మస్త్ర పార్ట్ -2 మాత్రమేనని తేల్చేసింది. బ్రహ్మస్త్ర కాకుండా అయాన్ ముఖర్జీ ఇతర సినిమాల్లో నటించడానికి అనుమతి ఇస్తారో లేదో తెలియదని (నవ్వుతూ) చెప్పింది. పెళ్లయ్యాక రణ్బీర్ కపూర్, అలియా భట్ మొదటిసారిగా ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రలో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సక్సెస్తో మరోసారి ఈ రొమాంటిక్ బాలీవుడ్ జంట స్క్రీన్ను పంచుకోనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. -
Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్ వదులుకున్నా
హీరో సుధీర్ బాబు తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా ఓ చానల్తో ముచ్చటించిన సుధీర్ బాబు ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నటించే అవకాశం వచ్చిందని, అయితే ఆ ఆఫర్ వదులుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాల గురించి చెబుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆ వెంటనే బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్ వదులుకోవడానికి కారణమేంటి? అని యాంకర్ ప్రశ్నించగా సుధీర్ బాబు ఇలా స్పందించాడు. ‘అవును నాకు బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్ వచ్చింది. అయితే అప్పటికే నేను తెలుగులో పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాను. అందుకే బ్రహ్మాస్త్రలో చేయలేని చెప్పాను. అదే కారణం అంతకు మించి ఏం లేదు’ అని అన్నాడు. చదవండి: గొప్ప మనసు చాటుకున్న రావు రమేశ్.. అతడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం కాగా సుధీర్ బాబు గతంలో టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ చిత్రంలో విలన్గా నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వలో ఆలియా భట్-రణ్బీర్ కపూర్ తొలిసారిగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన మూవీ గత సెప్టెంబర్ 9న విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మస్త్ర రికార్డ్.. తొలివారం ఎన్ని కోట్లంటే..!
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించింన మూవీ బ్రహ్మస్త్ర-1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దుమ్ము రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలోనే 300 కోట్ల మార్కును దాటింది. ఇండియాలో ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకన్న సందర్భంగా నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. (చదవండి: Alia Bhatt: ఆలియా వేసుకున్న పల్చని డ్రెస్ అన్ని లక్షలా?) ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన నిర్మాత కరణ్ జోహార్ 'ప్రేమ, వెలుగు కలిసి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను శాసిస్తున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో రెండోవారంలోకి ప్రవేశిస్తున్నాం' అని వెల్లడించారు. 9/11 వార్షికోత్సవం సందర్భంగా హాలీవుడ్లో పెద్దగా సినిమాలు విడుదల కాకపోవడంతో బ్రహ్మస్త్ర ఊహించిన దానికంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. Love and light ruling the global box office at #1! Entering the second week with a heart full of gratitude and excitement!!✨🔥 #Brahmastra pic.twitter.com/fyJQuVhehL — Karan Johar (@karanjohar) September 16, 2022 -
ఎయిర్పోర్ట్లో ‘బ్రహ్మస్త్ర’ జంట సర్ప్రైజ్.. ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్
బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ ఆలియా భట్, రణ్వీర్ కపూర్ ముంబైలోని కలీనా ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. ప్రత్యేక దుస్తుల్లో వచ్చిన ఈ జంట విమానాశ్రయం బయట ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్రహ్మస్త్ర సినిమా విడుదల తర్వాత తొలిసారిగా విమానాశ్రయంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలియా భట్ పింక్ అనార్కలీ డ్రెస్లో ఉండగా.. రణబీర్ కపూర్ తెల్లటి కుర్తా, పైజామాతో పాటు నెహ్రూ జాకెట్ను ధరించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫోటోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (చదవండి: Alia Bhatt: ఆలియా వేసుకున్న పల్చని డ్రెస్ అన్ని లక్షలా?) అలియా, రణబీర్ల ఫోటోలపై సోషల్ మీడియాలో ఓ అభిమాని స్పందిస్తూ ‘ఆమె చాలా అందంగా ఉంది’అంటూ కామెంట్ చేశాడు. మరో అభిమాని ఏకంగా "రణబీర్ కపూర్ శక్తి కపూర్లా ఎందుకు కనిపిస్తున్నాడు?"అని చమత్కరించాడు. 'రణ్వీర్ కపూర్ బన్గయా కబీర్ సింగ్' అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు. సెప్టెంబరు 9న విడుదలైన బ్రహ్మస్త్ర బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. -
బ్రహ్మస్త్రపై బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. గొప్ప ప్రయత్నమే.. కానీ..!
బాలీవుడ్ నటి, మోడల్ ఎరికా ఫెర్నాండెజ్ బ్రహ్మస్త్ర సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రయత్నం గొప్పదే.. కానీ సినిమా విజయవంతం కాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తప్పుల నుంచి నేర్చుకుంటారని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. (చదవండి: Brahmastra Twitter Review: 'బ్రహ్మస్త్ర' 'టాక్ ఏలా ఉందంటే?) ఎరికా ఫెర్నాండెజ్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఓ సెషన్ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ అభిమాని మీరు బ్రహ్మాస్త్ర సినిమాను చూశారా అన్న ప్రశ్నకు నటి స్పందిస్తూ .. 'అవును, నేను సినిమా చూసాను. ఇది గొప్ప ప్రయత్నం కానీ.. విజయవంతం కాలేదని' రిప్లై ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చింది. అలాగే దర్శకుడు నటీనటులు, కథనంపై మరింత ఫోకస్ పెట్టాల్సిందని సలహా ఇచ్చింది. ఇలాంటి వాటితో ప్రతి ఒక్కరు తమ తప్పుల నుంచి మరింత నేర్చుకుంటారని పేర్కొంది. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
వారివల్లే మెంటల్లీ బరువు తగ్గిపోయింది.. నాగార్జున
‘‘చాలామంది సినిమా చచ్చిపోతోందని అంటున్నారు. కానీ సినిమా పెరుగుతోందనేది నా అభిప్రాయం. అలాగే క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, పోటీ కూడా పెరిగిపోతోంది. ట్రెండ్కి తగ్గట్టు యాక్టర్స్, డైరెక్టర్స్ అప్డేట్ అవుతుండాలి. దర్శక–నిర్మాతల మధ్య కథ గురించి లోతైన చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు డిఫరెంట్ కథలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రీగా చూపిస్తామన్నా సినిమాలను చూసేందుకు కొంతమంది ప్రేక్షకులు ఇష్టపడరేమో!’ అన్నారు నాగార్జున. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాలజీ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ’ ఈ నెల 9న రిలీజ్ అయ్యింది. దక్షిణాదిలో ‘బ్రహ్మాస్త్రం’గా దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలు నాగార్జున మీడియాతో పంచుకున్నారు.. ‘బ్రహ్మాస్త్రం’లో నా క్యారెక్టర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. అయాన్ ముఖర్జీ నాతో ఏం చెప్పాడో అదే తీశాడు. నా క్యారెక్టర్కు మంచి అప్లాజ్ వచ్చింది. నాకీ సినిమా కథ చెప్పినప్పుడే మూడు భాగాలని చెప్పారు. సెకండ్, థర్డ్ పార్ట్స్లో నా పాత్ర ఉంటుందా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. మంచి క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయనే అనుకుంటున్నాను. (చదవండి: కెమెరా ముందు మెరీనా, రోహిత్ ముద్దులు... ‘అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి’) ఇంట్రవెల్ సీక్వెన్స్ తర్వాత సినిమా కాస్త నెమ్మదించిందేమో! అయితే మిగతా రెండు భాగాలకు లింక్ అయినట్లు కనిపించే ఈ సీన్స్ వల్లే పార్ట్ 2 చూడాలనే కుతూహలం ఆడియన్స్లో కలిగింది. నంబర్స్ గురించి ఆలోచించడం మానేశానని ఎన్నోసార్లు చెప్పాను. కానీ అప్డేట్ అవుతూ ఉండాలని మాత్రం తెలుసు. నేను ఆల్మోస్ట్ 38 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇప్పటికీ నా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే అది చాలు నాకు. నాకు మెంటల్లీ బరువు తగ్గిపోయింది. నా నెక్ట్స్ మూవీ ‘ది ఘోస్ట్’ అక్టోబరు 5న విడుదలవుతుంది. ‘గరుడ వేగ’ చూసి, ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయాలనుకున్నాను. అది ‘ఘోస్ట్’తో కుదిరింది. ఈ సినిమా కోసం నేను వెపన్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్లో కొంత శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు బ్రదర్స్, సిస్టర్స్ అండ్ సిస్టర్స్ డాటర్ సెంటిమెంట్ కూడా ఉంది. నా వందో సినిమా కోసం దర్శకుల దగ్గర కథలు వింటున్నాను. కొంచెం ప్రతిష్టాత్మకంగా చేయాలనుకుంటున్నాం. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తర్వాత మళ్లీ ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో అమల యాక్ట్ చేసింది. అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీ, బ్లూ క్రాస్లతో అమల బిజీగా ఉండటంతో నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తోంది. ‘ఒకే ఒక జీవితం’ చూసినప్పుడు మా అమ్మగారు గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యాను. సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ అనేది ఇండస్ట్రీపై అంతగా ప్రభావం చూపిస్తోందని నేను అనుకోవడం లేదు. ‘లాల్సింగ్ చడ్డా’ ఆడలేదు. కానీ ‘బ్రహ్మాస్త్రం’ ఆడింది. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’, ‘భూల్ భులయ్యా 2’, ‘జుగ్ జుగ్ జీయో’ చిత్రాలతో పాటు మన సౌత్ చిత్రాలు రీసెంట్గా ‘కార్తికేయ 2’, గతంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప’ వంటివి హిందీలో బాగానే ఆడాయి.సినిమా బాగుంటే ఆడుతుంది. అలాగే ఏ ఇండస్ట్రీ వారు మరో ఇండస్ట్రీ వారిని సర్ప్రైజ్ చేయడం అనేది సాధ్యపడదని నా ఫీలింగ్. ఒకప్పుడు మనల్ని మద్రాసి అనేవారు. ఇప్పుడది పోయింది. -
కిక్కు అంటే అదీ! ఆ షేర్లు ‘బ్రహ్మాండం’
సాక్షి,ముంబై: బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్లుమార్కెట్లోకి మల్టీప్లెక్స్ దిగ్గజ కంపెనీలకు జాక్పాట్ తగిలింది. ఈ మూవీ బాలీవుడ్ వసూళ్లు రూ.100 కోట్లు దాటడంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు ఒక రేంజ్లో పుంజుకున్నాయి. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వసూళ్లతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అందులోనూ ఇటీవలి నష్టాలతో షేర్ ధర తక్కువకు అందుబాటులో ఉండటంతో మరింత ఉత్సాహం నెలకొంది. ఫలితంగా పీవీఆర్ షేర్ 4.06 శాతం లేదా రూ.74.45 మేర ఎగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్లో, ఈ షేర్లు గరిష్టంగా రూ.1,926.20ని తాకాయి. ఐనాక్స్ లీజర్ షేర్లు 4.5 శాతం లేదా రూ. 22.55 పైగా ఎగిసి రూ.516.95 వద్ద ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనాల ప్రకారం శుక్రవారం రూ. 31.5 కోట్లు, శనివారం రూ. 37.5 కోట్లు, ఆదివారం రూ. 39.5 కోట్లు వసూలు చేసింది. ఫైనల్గా ఈ లెక్కే ఇంకా ఎక్కువే ఉండవచ్చని కూడా ఆయన అంచనావేశారు. జాతీయ స్థాయిలో మంచి వసూళ్లు సాధిస్తోందని ఆదర్శ్ అన్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు డీలాపడటంతో శుక్రవారం, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ దాదాపు 5 శాతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా రణబీర్ కపూర్, అలియా నటించిన బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ సినిమాలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, మౌని రాయ్తోపాటు, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. అలాగే షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో అలరిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ , మలయాళ భాషలలో విడుదలైంది. 18 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు చేసింది. అంతేకాదు 'బ్రహ్మాస్త్రా పార్ట్ 2: దేవ్' అనే టైటిల్ను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. -
రూ.600 కోట్లు తగలబెట్టాడు.. వారందర్నీ జైల్లో పెట్టాలి: కంగనా ఫైర్
‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించారు. అతని సినీ కెరీర్లో ఒక్క మంచి చిత్రం కూడా లేదని, అతన్ని మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సినీ క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. చిత్ర బృందంపై, ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. (చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్డే కలెక్షన్స్.. టాలీవుడ్లో సరికొత్త రికార్డు) ‘అయాన్ ముఖర్జీని మేధావి అని మెచ్చుకున్న వారందర్నీ జైలుకు పంపించాలి. ‘బ్రహ్మాస్త్ర’చిత్రానికి తెరకెక్కించడానికి అతనికి 12 ఏళ్లు పట్టింది. ఈ సినిమాను 400 రోజులకుపైగా షూట్ చేసి, 14 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చాడు. ప్రొడక్షన్స్ ఖర్చుల రూపంలో మొత్తంగా రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. బాహుబలి సినిమా సక్సెస్ కావడంతో.. బ్రహ్మాస్త్ర సినిమా పేరును జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా చివరి నిమిషంలో మార్చి మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అవకాశవాదులు, సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తులను మేధావి అని పిలవ కూడదు’అంటూ కంగనా రాసుకొచ్చారు. అలాగే కరణ్ జోహార్పై కూడా కంగనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అతను సినిమా స్క్రిప్ట్లపై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్ వివరాలు.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి తన సినిమాలకు ఇప్పించుకుంటాడు. ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం, టాలెంట్ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులను కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్ ఉన్న వాళ్లతో సినిమా తీస్తే సరిపోతుంది కదా’అని కంగనా రనౌత్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమా విషయానికొస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు.స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. -
‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్డే కలెక్షన్స్.. టాలీవుడ్లో సరికొత్త రికార్డు
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్ ఖాన్ మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోలు నటించడంతో తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాత కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హాలీడే కాకపోయినప్పటికీ ఇండియా వైడ్గా రూ. 35-38 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్లో కూడా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 6.7 కోట్లు గ్రాస్(రూ.3.7 కోట్ల షేర్) వసూళ్లను సాధించింది. తెలుగులోకి అనువాదమైన బాలీవుడ్ చిత్రాల్లో ఇది సరికొత్త రికార్డు. అంతకు ముందు ఆమిర్ ధూమ్ 3 చిత్రం రూ.4.7 కోట్లు సాధించింది. ఆ రికార్డుని బ్రహ్మాస్త్ర బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్(హిందీ, తెలుగు వెర్షన్లతో కలిపి) జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. Humbled…grateful…yet can’t control my excitement! Thank you♥️ #Brahmastra pic.twitter.com/00pl9PGO5K — Karan Johar (@karanjohar) September 10, 2022 -
Brahmastra Review: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ
టైటిల్: బ్రహ్మాస్త్రం నటీనటులు: రణ్బీర్ కపూర్, అలియాభట్, అమితాబచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్, షారుఖ్ఖాన్ తదితరులు నిర్మాణ సంస్థలు : స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ దర్శకత్వం : అయాన్ ముఖర్జీ సంగీతం : ప్రీతమ్ సినిమాటోగ్రఫీ:సుదీప్ చటర్జీ, పంకజ్ కుమార్, మణికందన్, వికాష్ నౌలాఖ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 9) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటంతో ‘బ్రహ్మాస్త్రం’పై టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచాయి. మరి బ్రహ్మాస్త్రలోని మొదటి భాగం ‘శివ’ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అన్ని అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం. మూడు ముక్కలైన ఈ శక్తివంతమైన అస్త్రాన్ని తరతరాలుగా బ్రహ్మాన్ష్ సభ్యులు కాపాడుతుంటారు. ఈ మూడు ముక్కల్లో ఒక భాగం సైంటిస్ట్ మోహన్ భార్గవ్(షారుఖ్ ఖాన్), రెండో భాగం ఆర్టిస్ట్ అనీష్(నాగార్జున)దగ్గరు ఉంటాయి. మూడో భాగం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అయితే ఈ బ్రహ్మాస్త్రం స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని శాసించాలని చూస్తుంది జునూన్(మౌనీరాయ్). తన టీమ్తో కలిసి మూడు ముక్కలను వెతికి పట్టుకొని వాటిని అతించేందుకు ప్రయత్నిస్తుంది. జునూన్ బృందం ప్రయత్నానికి అడ్డుతగులుతాడు శివ(రణ్బీర్ కపూర్). డీజే నడుతూ జీవనం సాగించే శివకి, బ్రహ్మాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి? అతను ఎందుకు జునూన్ టీమ్ చేసే ప్రయత్నానికి అడ్డుతగులుతున్నాడు? శివ నేపథ్యం ఏంటి? అగ్నికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? బ్రహ్మాస్త్రంలోని మూడో ముక్క ఎవరి దగ్గరు ఉంది? హిమాలయాల్లో ఉన్న గురు(అమితామ్ బచ్చన్) దగ్గరికి వెళ్లిన తర్వాత శివకు తెలిసి నిజాలు ఏంటి? ప్రియురాలు ఈషా(అలియా భట్)తో కలిసి బ్రహ్మాస్త్రాన్ని శివ ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హిందూ పురాణాలను ఆధారంగా చేసుకొని రాసుకున్న కథే ‘బ్రహ్మాస్త్ర’. పురాణాల ప్రకారం అన్ని అస్త్రాల్లోకెల్లా అంత్యంత శక్తివంతమైనది బ్రహ్మాస్త్రం. దీనిని ఆధారంగా చేసుకొని దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర కథను రాసుకున్నాడు. ప్రపంచానికి మంచి చేసే ఓ శక్తివంతమైన అస్త్రం అది. దానికి అద్భుతమైన శక్తులు ఉంటాయి. దానిని రక్షించడానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. అదేసమయంలో ఆ శక్తిని దక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలనుకునే ఓ దుష్టశక్తి ఉంటుంది. ఆ దుష్టశక్తి భారీ నుంచి ఆ అస్త్రాన్ని ఎలా కాపాడారు అనేదే ఈ చిత్ర కథ. ఈ తరహా నేపథ్యం ఉన్న చిత్రాలు హాలీవుడ్లో చాలానే వచ్చాయి. ఇలాంటి చిత్రాలకు అద్భుతమైన గ్రాఫిక్స్తో పాటు తలతిప్పుకోకుండా చేసే స్క్రీన్ప్లే కూడా అత్యవసరం. ఈ విషయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ పూర్తిగా తేలిపోయాడు. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోదు. బ్రహ్మాస్త్రం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ చిరంజీవి ఇచ్చే వాయిస్ ఓవర్తో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. వానారాస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్ మోహన్(షారుఖ్)తో జునూన్ టీమఠ్ చేసే పోరాట ఘట్టంతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. డీజే శివగా రణ్బీర్ ఎంట్రీ ఇవ్వడం.. ఈషాతో ప్రేమలో పడడం.. తనకు వచ్చే కలల్ని ఆమెతో పంచుకోవడం.. అనీష్ని రక్షించేందుకు వారణాసి వెళ్లడం..అక్కడ నంది అస్త్రాన్ని అనీష్ ప్రయోగించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తెరపై వచ్చే సీన్స్ మనకు ఎమోషనల్ గా టచ్ అవ్వకుండా అలా వెళ్లిపోతూ ఉంటాయి. శివ, ఈషాల మధ్య ప్రేమ చిగురించడం కూడా పూర్తి సినిమాటిక్గా ఉంటుంది. ఇక సెకండాఫ్లో గురుగా అమితాబ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. శివ గతం..అతనిలో ఉన్న అగ్ని అస్త్రాన్ని బయటకు తీసుకురావడానికి గురు చేసే ప్రయత్నం కొంతమేర ఆకట్టుకుంటుంది. సెకండాఫ్లో ఈషాతో శివ నడిపించే ప్రేమాయణం కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే సన్నీవేశాలు మాత్రం సినిమాకే హైలెట్గా నిలుస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్పై పెట్టిన శ్రద్ధ.. కథ, కథనంపై పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. శివ పాత్రలో రణ్బీర్ చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడు. ఈషా పాత్రకు న్యాయం చేసింది అలియా భట్. రణ్బీర్, అలియా మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. అయితే వారిద్దరు ప్రేమలో పడిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోదు. వానర అస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్ మోహన్గా షారుఖ్, నంది అస్త్రాన్ని కలిగిన ఉన్న ఆర్టిస్ట్ అనీష్గా నాగార్జున ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గురుగా అమితాబ్ బచ్చన్ తెరపై మరోసార తన అనుభవాన్ని చూపించాడు. జునూన్గా మౌనీరాయ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీతమ్ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ వర్క్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘బ్రహ్మాస్త్ర’ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు.స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 9) ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘బ్రహ్మాస్త్ర’పై హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. సినిమాలో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ అంటున్నారు. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేదనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. రణ్బీర్, అలియా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు. అయితే లవ్ స్టోరీకి తగ్గ డైలాగ్స్ లేకపోవడం ఈ సినిమాను మైనస్ అంటున్నారు. Interval 👌 Apart from love track I loved frst half Pre interval to Interval Rampppp🔥 Special credits for BGM's #Brahmastra https://t.co/mjBNbdEzw9 — . (@ravi_ssmbfan) September 9, 2022 What an amazing film. My jaw dropped so many times. Ayan Mukerji’s labour of love is the type of passion project where you feel the passion in each frame. The biggest technical achievement in the history of Bollywood. #Brahmastra is one of my all time favourite Bollywood films. pic.twitter.com/nQsZJvaDL4 — THE DISSENTER (@IamSamSanyal) September 9, 2022 But I feel #AyanMukerji for the most part has succeeded in what he set out to do ! It’ll depend on part 2 & 3 !! For this one, full marks to Ayan for the effort ! His hard work really shows!👏🏻 Can’t wait for part 2 !!🤩🤩 PS - Some amazing cameos !😋 #Brahmastra — N (@namitha995) September 9, 2022 Brahmashtra One word review:: "Naagin serial with extra budget"#Brahmashtra#Brahmastra#BrahmashtraReview — you idiot (@in_seconds2) September 9, 2022 Brahmastra Part One: Shiva absolutely blew me away. My first experience with a Bollywood movie and this has me all in. It feels very Avengers/Marvel and the 2 hour and 40 minute runtime actually flew by. Packed with action and gorgeous visuals, it's a must watch!#Brahmastra pic.twitter.com/hYPF579te8 — Tessa Smith - Mama's Geeky (@MamasGeeky) September 8, 2022 Contd.....#BrahmastraReview ⭐⭐⭐⭐1/2 4.5/5 Xclusive- Do not foget to see the teaser of #Brahmastra #Brahmashtra part 2 after the end credit rolls.#RanbirKapoor #AliaBhatt — Nitesh Naveen (@NiteshNaveenAus) September 9, 2022 Interval variyum super ah irukku bro Vfx perfect Konjam love story irukkum Otherwise mathathellam super Sharukhkhan and nagarjuna cameo works well#Brahmastra — Mohamed Abdulla (@Maideenhussain1) September 9, 2022 -
రణ్బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత
బాలీవుడ్ జంట రణ్బీర్ కపూర్, ఆలియా భట్కు చేదు అనుభవం ఎదురైంది. వీరిద్దరి తొలిసారి జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా కొద్ది రోజులుగా ఈ జంట నార్త్ నుంచి సౌత్ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు గుడిలోకి వెళ్లిన ఈజంటను కొందరు అడ్డుకున్నారు. బీఫ్ (గొడ్డు మాంసం) తినే విషయంలో ఆలియా-రణ్బీర్లు గతంలో చేసిన కామెంట్లపై నిరసన వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఐశ్వర్య రాయ్పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే.. అంతేకాదు వారిని వారిని ఆలయంలోకి అనుమతించేది లేదని నిరసన చేపట్టారు. తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని అలియా చాలా ఏళ్ల కిందట చెప్పిన ఓ క్లిప్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల కిందట రణ్బీర్ తాను మటన్, చికెన్తో పాటు బీఫ్ కూడా తింటానని చెప్పాడు. దాంతో, అలియా, రణ్బీర్లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్కాట్ సేగ అట్టుకున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చడ్డా సినిమాతో పాటు బ్రహ్మాస్త్రను బాయ్కాట్ చేయాలంటూ నెజిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. చదవండి: నాకు ఫోన్ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్బాస్ నేహా చౌదరి ‘బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర’ పేరుతో హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. ఇక దీనిపై ఇటీవల స్పందించిన ఆలియా ‘సినిమాను చూడాలనుకుంటే చూడండి, ఆసక్తి లేకపోతే మానేయండి’ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్స్పై కూడా ఆలియాను పలువురు టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్ 9న) హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు బ్రహ్మాస్త్రం పేరుతో రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. -
'బ్రహ్మాస్త్ర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, ఎలా ఉందంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతోంది. నాగార్జున, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించగా నాగిని బ్యూటీ మౌనీరాయ్ నెగెటివ్ రోల్ చేసింది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న బ్రహ్మాస్త్ర సినిమా ఎలా ఉందనే విషయం అప్పుడే బయటకు వచ్చేసింది. సెన్సార్ బోర్డ్ సభ్యుడినని తనకు తానే ప్రకటించుకున్న ఉమైర్ సంధు రణ్బీర్ సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు. ‘ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్తో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కనుల విందు చేస్తుంది. కథ, స్క్రీన్ప్లే యావరేజ్. ఆలియా భట్, మౌనీరాయ్ నటన అద్భుతం. అమితాబ్ బచ్చన్ కనిపించే సీన్ మామూలుగా ఉండదు, కానీ అతడి పాత్ర నిడివి చాలా తక్కువ. బాలీవుడ్లో ఫాంటసీ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటిది ఆ లైన్లో సినిమా తీసిన అయాన్ ముఖర్జీ ధైర్యాన్ని అభినందించాల్సిందే’అని ట్వీట్ చేశాడు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. గతవారం కోబ్రా మినహా అన్ని చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. వాటిలో ఒకటి రెండు చిత్రాలు మంచి టాక్ని సంపాదించుకోగా..మరికొన్ని బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న చిత్రాలు అటు థియేటర్స్లో ఇటు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. బ్రహ్మాస్త్రం రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది. ఒకే ఒక జీవితం శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. శ్రీరంగాపురం వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగాపురం’.ఎమ్ఎస్. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మించిన ఈ సినిమా సెస్టెంబర్ 9న విడుదల కానుంది. కొత్తకొత్తగా అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బిజి గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్9) విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు డిస్నీ+హాట్స్టార్ థోర్ లవ్ అండ్ థండ్(తెలుగు), సెప్టెంబర్ 8 గ్రోయింగ్ అప్(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 8 హైడోస్.. సెప్టెంబర్ 8 పినాచో.. సెప్టెంబర్ 8 కార్స్ ఆన్ ది రోడ్(హాలీవుడ్).. సెప్టెబర్ 8 వెడ్డింగ్ సీజన్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 నెట్ఫ్లిక్స్ వన్స్ అపాన్ ఏ స్మాల్ టౌన్(సిరీస్), సెప్టెంబర్ 5 రిక్ అండ్ మార్టీ:సీజన్-6: ఎపిసోడ్-1(వెబ్ సిరీస్).. సెప్టెంబర్ 5 అన్టోల్డ్: ది రేస్ ఆఫ్ సెంచరీ(హాలీవుడ్) సెప్టెంబర్6 ఇండియన్ ప్రేడేటర్: ది డైరీ ఆఫ్ ఏ సీరియల్ కిల్లర్(డాక్యమెంటరీ) సెప్టెంబర్ 7 చెప్స్ టేబుల్: పిజ్జా ఏ క్వైట్ ప్లేస్(డాక్యుమెంటరీ) సెప్టెంబర్ 7 ది అంత్రాక్స్ అటాక్స్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 ఏక్ విలన్ రిటర్న్స్ (బాలీవుడ్) సెప్టెంబర్ 9 కోబ్రా కాయ్: సీజన్-5(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 9 మోర్టల్ కాంబ్యాట్(హాలీవుడ్) సెప్టెంబర్ 11 అమెజాన్ ప్రైమ్ స్టూడియో 666.. సెప్టెంబర్ 5 హీ ఈజ్ సైకోమెట్రిక్- సెప్టెంబర్ 7 రిప్లై 1994- సెప్టెంబర్ 7 ప్రిజన్ ప్లే బుక్- సెప్టెంబర్ 7 ఎలీన్(Aline)-సెప్టెంబర్ 9 (వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్, టాక్ షోలు ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్నాయి) ఆహా డ్యాన్స్ ఐకాన్(రియాల్టీ షో) సెప్టెంబర్ 11 జీ5 పాపన్(మూవీ) సెప్టెంబర్ 7 ఎంఎక్స్ ప్లేయర్ యునికి యారీ(బాలీవుడ్), సెప్టెంబర్ 9 -
‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్కు ఇంకా 6 రోజులే.. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్బీర్ కపూర్-ఆలియా భట్లు తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న అన్ని భాషల్లో(హందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్ రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ ఓ క్రేజీ వీడియోను వదిలాడు రాజమౌళి. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి బ్రహాస్త్రం ప్రీరిలీజ్ ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ట్రైలర్లో చూపించని, సినిమాకు హైలెట్గా నిలిచే పలు కీలక సన్నివేశాలతో చూపించారు. దీంతో ఈ వీడియో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక రాజమౌళి ఈ వీడియోను షేర్ చేస్తూ ‘బ్రహ్మాస్త్రం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది’ అని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ‘నాగిని’ బ్యూటీ మౌని రాయ్ నెగిటివ్ రోల్లో కనిపించనుంది. Here’s #Brahmastra PRE-RELEASE PROMO... Advance Bookings Open Now! Experience Brahmāstra in cinemas on September 9th. pic.twitter.com/9GFZWLwhrf — rajamouli ss (@ssrajamouli) September 3, 2022 -
‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా నష్టపోయిన మేకర్స్
టాలీవుడ్ స్టార్ హీరో ‘కింగ్’ నాగార్జున్ కీ రోల్ పోషించిన బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్రం. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్కు గ్రాండ్గా ఏర్పాట్లు చేయగా చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్ధయిన సంగతి తెలిసిందే. భారీ ఖర్చుతో ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడంతో మేకర్స్ భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. దీని కోసం మేకర్స్ దాదాపు రూ. 2.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే.. ఈ కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మేకర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఖర్చంతా వృథా అయిపోయిందని మేకర్స్ ఆవేవదన వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక చేసేదేం లేక అప్పటికప్పుడు రూ. 10 లక్షల ఖర్చుతో పార్క్ హయత్లో ప్రెస్మీట్కు ఏర్పాట్లు చేశారట. అయితే గణపతి నవరాత్రి ఉత్సవాల కారణంగా సెక్యూరిటీ ఇవ్వమలేమని చెప్పి నగర పోలీసులు చెప్పడంతో ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది. కాగా బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్లు హీరోహీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, నాగిని బ్యూటీ మౌని రాయ్లు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు -
లైవ్లో తెలుగు పాట పాడి అలరించిన ఆలియా
ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది బాలీవుడ్ భామ ఆలియా భట్. ఆ చిత్రంలో ‘సీత’ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది ఇప్పుడు ‘బ్రహ్మాస్త్రం’తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది. (చదవండి: ఆ సవాల్ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్) ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రేస్మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఆలియా తన చక్కటి గాత్రంతో తెలుగు పాటను ఆలపించి అందరిని అశ్చర్యానికి గురి చేసింది. తన స్పీచ్ ను తెలుగు పాటతో క్లోజ్ చేస్తానని చెబుతూ.. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘కేసరియా’ సాంగ్ని తెలుగులో అద్భుతంగా ఆలపించింది. ఆలియా స్టేజ్ మీద పాట పాడుతుంటుంటే.. వెనకాల కూర్చున్న రణ్బీర్ కల్లలో ఆనందం, ముఖంలో చిరునవ్వులు కనిపించాయి. కరణ్, రాజమౌళితో పాటు అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆలియాను ప్రోత్సహించారు. తెలుగులో మాట్లాడమే కాకుండా..చక్కగా పాటను ఆలపించిన ఆలియాను అందరూ అభినందించారు. -
తెలుగు పాట పాడి అలరించిన ఆలియా
-
‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
ఆ సవాల్ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎందుకంటే ప్రేక్షకులకు ఇంకా ఏదో కొత్తగా కావాలి. ఆ ఒత్తిడి ఉన్నప్పుడే మనం బాగా చేయగలం. ఆ సవాల్ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి. మన ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు, గొప్ప చిత్రాలు తీయాలి.. తీస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది. కాగా శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది నటులున్నారు. కానీ, కొందరు మాత్రమే నాపై ప్రభావం చూపారు. అమితాబ్ బచ్చన్గారు, రణ్బీర్ కపూర్ ఇంటెన్సిటీ అంటే నాకు చాలా ఇష్టం. వీరి నుంచి ఓ యాక్టర్గా నేను స్ఫూర్తి పొందాను. రాజమౌళి, కరణ్ జోహార్గార్లు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక్కటిగా మార్చారని నమ్ముతున్నాను. మా నాగార్జున బాబాయ్ నటించిన హిందీ చిత్రం ‘ఖుదాగవా’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓ తెలుగు హీరో హిందీలో డైలాగులు చెబితే ఎలా ఉంటుందో తొలిసారి ఆ సినిమా చూసి తెలుసుకున్నాను’అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ–‘‘రాజమౌళిగారు ‘బ్రహ్మాస్త్రం’ని సమర్పిస్తున్నారంటే సినిమా అలా ఇలా ఉండదు. ఆయాన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో భాగమయ్యారు. రాజమౌళిగారు ఓ సినిమాని మూడేళ్లు చెక్కుతారు.. అలా ఆయాన్ కూడా ‘బ్రహ్మాస్త్రం’ ని మూడేళ్లు చెక్కారు’’ అన్నారు. (చదవండి: తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు) రాజమౌళి మాట్లాడుతూ – ‘‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా చేయాలనుకుని ఏర్పాట్లు చేశాం. ఐదు రోజుల కిందట పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నాం. అయితే శుక్రవారం ఎక్కువగా వినాయక నిమజ్జనాలు ఉండటం వల్ల ప్రీ రిలీజ్ వేడుకకి బందోబస్తు ఇవ్వడం కష్టమని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు.. దీంతో ప్రీ రిలీజ్ వేడుకని క్యాన్సిల్ చేసి, ప్రెస్మీట్ నిర్వహిస్తున్నాం. ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో భాగం కావాలని ఐదేళ్ల కిందట కరణ్గారు చెప్పడంతో ఓకే అన్నాను. ఆయాన్ ముఖర్జీ ఈ కథ చెప్పినప్పుడు నా బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి’’ అన్నారు. ‘‘తారక్ అమేజింగ్ యాక్టర్. ఆయాన్ ముఖర్జీ పదేళ్ల ఆలోచనల రూపం ‘బ్రహ్మాస్త్రం’’ అన్నారు కరణ్ జోహార్ ‘‘నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్రం’. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రణ్బీర్ కపూర్. ‘‘ఈ సినిమా మాకో ఎమోషన్’’ అన్నారు ఆలియా భట్. నటి మౌనీరాయ్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా, ప్రైమ్ ఫోకస్ ఫౌండర్ నమిత్ మల్హోత్రా, డీస్నీ స్టార్ ప్రెసిడెంట్ మాధవన్, స్టార్ స్టూడియోస్ హెడ్ విక్రమ్ దుగ్గల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాన్స్కు సారీ చెప్పిన తారక్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కాంబినేషన్లో ‘బ్రహ్మస్త్రం’ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందించారు. తెలుగులో ఈ మూవీని దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్లో భాగంగా శుక్రవారం రామోజీ ఫిలింసిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో పార్క్ హయాత్ హోటల్కి మార్చారు. ఈ కార్యక్రమానికి ‘బ్రహ్మాస్త్రం’ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అక్కినేని నాగార్జున, రాజమౌళి, ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడకు రావాలనుకున్న అభిమానులు రాలేకపోయినందుకు వారికి క్షమాపణలు చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎంతో ఆర్భాటంగా చేద్దామని అనుకున్నారని, అయితే గణేష్ బందోబస్తు ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేకపోయారన్నారు. అందుకే అభిమానుల మధ్య కోలాహలంగా ఈవెంట్ జరపడం కుదరలేదని వివరించారు. రాక్స్టార్ సినిమా నుంచి రణ్బీర్ నటనంటే తనకంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఒత్తిడి ఎదుర్కుంటోందని.. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని, వారికి గుడ్ అండ్ గ్రేట్ మూవీస్ను ఇవ్వాలన్నారు. బ్రహ్మాస్త్రం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కి అల్ ది బెస్ట్ చెప్తూ, ఈ చిత్రం పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలు పోషించారు. చదవండి: Brahmastra Movie Pre Release Event: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్కు పోలీసుల షాక్, చివరి నిమిషంలో మార్పులు -
బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు
రణ్బీర్ కపూర్ బ్రహ్మాస్త్రం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు పోలీసులు షాకిచ్చారు. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దయ్యింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్లు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ నెల ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నేడు(సెప్టెంబర్ 2న) రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్ ఈవెంట్కు గ్రాండ్గా ఏర్పాట్లు జరిగాయి. చదవండి: లైగర్ ఫ్లాప్.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! అయితే చివరి నిమిషంలో ఈవెంట్కు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తాశారట. గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా ఈ ఈవెంట్కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో ప్లాన్ను మార్చేశారు మూవీ యూనిట్. ఈ రోజు రాత్రి 8 గంటలకు బంజారాహిల్స్లోని పార్క్ హాయత్ హోటల్లో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో దర్శకు ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. సెప్టంబర్ 9న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. చదవండి: ‘పరిశ్రమలో ఎంతమంది బంధువులున్నా నటిగా కష్టపడుతూనే ఉన్నా’ -
బ్రహ్మస్త్ర ప్రమోషన్లో ఆలియా ధరించిన డ్రెస్ ధరెంతో తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇటీవల విడుదలైన గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్ సినిమాల విజయంతో హుషారు మీద ఉన్న ఈ భామ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా చేస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్కు దగ్గర పడుతున్నవేళ ఆలియా తన భర్తతో కలిసి ప్రమోషన్లో పాల్గొంది. ఇప్పుడు ఆలియా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయినా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషన్లో పాల్గొంటుంది. తాజాగా.. ఈ నటి బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్లో భాగంగా తన బేబీ బంప్తో దర్శనమిచ్చింది. గూచీ బ్రాండ్కు చెందిన పింక్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్ కోట్తో స్టైలిష్గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చదవండి: Samantha: సమంత ఎక్కడ? ఎందుకు సైలెంట్గా ఉంది? కారణం ఇదేనా! అయితే ఆలియా ధరించిన ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా? దీని గురించి ఏకంగా నెట్టింట్లో చర్చే జరుగుతోంది. పింక్ కలర్ చిఫాన్ రఫుల్ టాప్ ధర గూచీ అధికారిక వెబ్సైట్లో 4,100 డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3,27,883 రూపాయలన్న మాట. ఒక్క డ్రెస్కు ఆలియా అంత ఖర్చు పెట్టడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. -
బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్
రణ్బీర్ కపూర్ నటించిన షంషేరా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో తన తర్వాతి సినిమా బ్రహ్మాస్త్ర మీదే బోలెడాశలు పెట్టుకున్నాడీ హీరో. రణ్బీర్తో పాటు ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం 'బ్రహాస్త్ర: మొదటి భాగం శివ' పేరిట సెప్టెంబర్ 9న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్కు రెడీ అవుతోంది చిత్రయూనిట్. అందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ను ఖరారు చేశారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్ వేడుక జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రహాస్త్ర చిత్రయూనిట్ ఓ స్పెషల్ మీడియాను రిలీజ్ చేసింది. Gear up for a MASS-Traverse!🔥🔥🔥 MAN OF MASSES of Indian Cinema, @tarak9999 will be gracing the Biggest Pre-Release Event of Brahmāstra as the Chief Guest on September 2nd in Hyderabad💥 #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/grV1DgX2qY — BRAHMĀSTRA (@BrahmastraFilm) August 27, 2022 చదవండి: ఆంటీ లొల్లి.. అనసూయకు సపోర్ట్ చేసిన హీరోయిన్పై ట్రోలింగ్ బిగ్బాస్ పింకీ పెళ్లి? యాంకర్ రవి ఏమన్నాడంటే? -
రజనీతో రాజమౌళి సినిమా.. ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా?
దర్శకధీరుడు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. సూపర్స్టార్ రజనీకాంత్తో ఒక్క చిత్రమైన తీయాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. మరి...రజనీకాంత్, రాజమౌళి కలిసి ఒక సినిమాకి సై అంటే ఎలా ఉంటుంది ? ఇప్పుడు ఈ టాపిక్ అటు కోలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ దాకా తెగ హల్చల్ చేస్తోంది. రాజమౌళి ఇచ్చిన ఓ స్టేట్మెంట్ వల్లే ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది. బ్రహ్మస్త్ర ప్రమోషన్స్లో భాగంగా చెన్నై వెళ్లిన రాజమౌళి…రజనీకాంత్ని ఒక్క రోజైనా డైరెక్ట్ చేయాలని ఉందన్నాడు. తమిళ హీరోలతో ఎవరితో కలిసి పనిచేయాలని ఉందన్న ప్రశ్నకి రాజమౌళి చెప్పిన సమాధానం ఇది. మామూలుగా అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ…గతంలోనూ ఒక సందర్భంలో రాజమౌళి రజనీకాంత్తో చేయాలని ఉందని చెప్పారు. దీంతో…ఈ కాంబినేషన్ సెట్ అవడానికి అసలు ఏమన్నా చాన్స్ ఉందా అన్న చర్చతో రజనీకాంత్, రాజమౌళి ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు. (చదవండి: బాలీవుడ్లో దూసుకెళ్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్.. స్టార్ హీరోలతో సినిమాలు!) అయితే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం మహేశ్తో సినిమా తీసే పనిలో ఉన్నాడు రాజమౌళి. త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుంది. ఈ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ఎంత లేదన్నా మూడేళ్లకి తక్కువ టైమ్ అయితే పట్టదు. అంటే మహేష్ బాబుతో సినిమా అయిపోయి మరో సినిమాకి రాజమౌళి సై అనాలంటే కనీసం మూడేళ్లు అయినా పడుతుంది. ఈ లోపు రజనీకాంత్ డేట్స్ ఖాళీ లేకపోయినా…ఇటు రాజమౌళి మరొక ప్రాజెక్ట్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చినా…మళ్లీ కథ మొదటి కే వస్తుంది. దీంతో…జస్ట్ స్టేట్మెంట్ వరకే రాజమౌళి పరిమితం అవుతారా? లేక రజనీకాంత్ దాకా విషయాన్ని తీసుకెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కు తోన్న ఈ మూవీ 2023లో రిలీజ్ కానుంది. అదే సమయంలో ఇటు రాజమౌళి మహేష్ బాబు మూవీ షూటింగ్లో బిజీ అయిపోతాడు. సో…ఇప్పటికిప్పుడు అయితే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యే చాన్స్లు తక్కువే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్లతో రాజమౌళికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక రజనీకాంత్కి ఇండియాలో మాత్రమే కాదు. జపాన్ నుం చి మొదలుపెడితే ఆసియా అంతా ఫ్యాన్స్ ఉన్నారు. వీరి కాంబినేషన్ కనుక సెట్ అయితే ఆర్ఆర్(రజనీకాంత్, రాజమౌళి) కచ్చితంగా పాన్ ఆసియా మూవీ అవుతుంది. -
విజువల్ వండర్గా బ్రహ్మాస్త్ర.. 'ల్యాండ్ మార్క్గా నిలుస్తుంది'
బ్రహ్మాస్త్ర చిత్రంపై క్రేజ్ మామూలుగా లేదు. రణ్వీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన భారీ చిత్రం ఇది. దీనికి అయన్ ముఖర్జీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. 3డీ ఫార్మెట్లో మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ కథా చిత్రం తొలి భాగం సెప్టెంబర్ 9వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా బుధవారం మధ్యాహ్నం రణ్బీర్ కపూర్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా కాకుండా, చిత్ర సమర్పకుడిగా పాల్గొన్నానని తెలిపారు. బ్రహ్మాస్త్రం ఈ ఏడాది ఇండియన్ సినీ చరిత్రలో ముఖ్యమైన చిత్రంగా ఉంటుందన్నారు. మన పురాణ ఇతిహాసాల నుంచి తయారు చేసుకున్న కల్పిత కథా చిత్రం ఇదని చెప్పారు. ఇది చిత్ర యూనిట్ 8 ఏళ్ల శ్రమగా పేర్కొన్నారు. అస్త్రాల వివరాలను అందరికీ నచ్చే విధంగా చెప్పిన ఈ చిత్రంలో తానూ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. దర్శకుడు అయన్ ముఖర్జీ ఒక కామిక్ పుస్తకంతో తనను కలిశారని తెలిపారు. తన పాత్ర నంది అస్త్రం నేపథ్యంగా ఉంటుందన్నారు. తనకు చిన్న తనం నుంచి ఇతిహాసాలంటే ఆసక్తి అని, ఈ నేపథ్యంలోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిత్రంలో విజువల్స్ అబ్బుర పరుస్తాయన్నారు. దర్శకుడు అయన్ ముఖర్జీ 10 ఏళ్ల శ్రమ ఈ చిత్రం అన్నారు. రణ్బీర్ కపూర్, అలియాభట్లు చాలా శ్రమజీవులని ప్రశంసించారు. సినిమాను ప్రేమించేవారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంతో పాటు ల్యాండ్ మార్క్గా నిలిచిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తాను నటించిన తొలి 3డీ చిత్రం అని ఆయన పేర్కొన్నారు. నటుడు రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతిని గౌరవించే సమాజంలో తాను ఈ చిత్రాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర మూల కథను దర్శకుడు తనకు 10 ఏళ్ల క్రితం చెప్పారన్నారు. ఆయన ఆలోచన తనను విస్మయ పరిచిందన్నారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి గొప్ప నటులతో కలిసి నటించడం ఆనందకరం అన్నారు. చిత్ర షూటింగ్ సమయంలోనే తానూ అలియాభట్ కలుసుకున్నామని, ఇప్పుడు తమ పెళ్లి కూడా జరిగిందని, ఈ చిత్రం తనకు చాలా ముఖ్యం అని చెప్పారు. బ్రహ్మాస్త్రం కొత్త అనుభూతిని కలిగిస్తుందని రణ్బీర్ కపూర్ తెలిపారు. -
ప్రెగ్నెంట్ లేడీపై అలాంటి జోకులా?.. రణ్బీర్పై నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరో, ఆలియా భట్ భర్త రణ్బీర్ కపూర్పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆలియా భట్పై అలాంటి కామెంట్ ఎలా చేస్తావని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రణ్బీర్ వరుసగా సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. (చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్పై ఘాటు స్పందన) తాజాగా రణ్బీర్, ఆలియా భట్, ఆయన్ ముఖర్జీ ఇన్స్టా లైవ్లో నెటిజన్స్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’సినిమాకు ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదేంటి?’అని ప్రశ్నించాడు. దీనిపై ఆలియా సమాధానం ఇస్తుండగా.. రణ్బీర్ మధ్యలో కలగజేసుకొని ‘మా చిత్రాన్ని ఎందుకు భారీగా ప్రమోట్ చేయడం లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’అంటూ ఆలియా బేబీ బంప్వైపు చూశాడు. రణ్బీర్ మాటలతో ఆలియా ఒక్కసారిగా షాక్కు గురవ్వగా... ‘జస్ట్ జోక్ చేశా’అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు రణ్బీర్. అయితే ఈ విషయాన్ని ఆలియా లైట్ తీసుకుంటే.. నెటిజన్స్ మాత్రం రణ్బీర్పై మండి పడుతున్నారు. ‘రణ్బీర్ నీకు బుద్దుందా..? ఒక ప్రెగ్నెంట్ మహిళని బాడీ షేమింగ్ చేస్తావా?; ఆలియా కంటే పదేళ్లు పెద్ద..అయినా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. పబ్లిక్లో ఇలాంటి జోకులు వేయడం ఏంటి? ఈ టైమ్లో ఆలియా నీకు బార్బీ బొమ్మలా కనిపించాలా? గతంలో కూడా కత్రినా గురించి హేళన చేస్తూ మాట్లాడావు.. ఇప్పుడు ఆలియాని బాడీ షేమింగ్ చేస్తున్నావు.. కొంచైమనా బుద్ది ఉండాలి’అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Ranbir Kapoor✨ (@ranbirkapoor143_) -
ఆధ్యాత్మికం ఉట్టిపడేలా 'దేవ దేవ' పాట విడుదల
Deva Deva Song Out From Brahmastra Movie: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్గా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'కుంకుమల' వీడియో సాంగ్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా 'దేవ దేవ' అనే మరో పాటను విడుదల చేశారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ సాంగ్కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాట ఆధ్యాత్మికతతో ఉల్లాసభరితంగా సాగింది. ఈ పాట గురించి 'నేను ఈ సాంగ్ను పూర్తిగా ఆస్వాదించాను. ఈ పాటతో ఆధ్యాత్మికంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతి పొందుతారని నేను ఆశిస్తున్నాను' అని రణ్బీర్ కపూర్ తెలిపాడు. 'ఈ పాటను విడుదల చేసేందుకు శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను' అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
తొలిసారిగా బేబీ బంప్ను చూపించిన ఆలియా భట్
బాలీవుడ్ లవ్బర్డ్స్ ఆలియా భట్- రణ్బీర్ కపూర్ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గానే ఆలియా తన ప్రెగ్నెన్సీ న్యూస్ను షేర్ చేసుకుంది. అయితే గర్బం దాల్చినా షూటింగ్స్కి ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు, ప్రమోషన్స్లో పాల్గొంటుందీ బ్యూటీ. తాజాగా రణ్బీర్-ఆలియా జంటగా బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఓ సాంగ్ ప్రివ్యూ లాంచ్ కోసం ఈ ఇద్దరూ సందడి చేశారు. అయితే భర్తతో కనిపించిన ఆలియా భట్ తొలిసారిగా తన బేబీ బంప్ కనిపించేలా డ్రెస్ చేసుకుంది. ఇంతకుముందు డార్లింగ్ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆలియా బేబీ బంప్ కనపడకుండా ఉండేందుకు వదులుగా ఉండే దుస్తులు వేసుకునేది. కానీ ఈసారి మాత్రం బేబీ బంప్ను హైలైట్ చేస్తూ దుస్తులు ధరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పేరెంట్స్గా ప్రమోట్ అవుతున్న ఈ జంటకి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
దోస్త్ మేరా దోస్త్: ఆమిర్ ఖాన్ కోసం చిరు.. కరణ్ కోసం జక్కన్న
ఒక ఇండస్ట్రీలోని హీరోలు పక్క ఇండస్ట్రీ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో, అతిథి పాత్రల్లో నటిస్తున్న ట్రెండ్ను చూస్తున్నాం. అయితే ఇప్పుడు ‘దోస్త్ మేరా దోస్త్’ అంటూ సౌత్, నార్త్ హీరోలు సినిమాల రిలీజ్ విషయంలో ఒకరికొకరు సహాయపడుతున్నారు. సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ విశేషాలు చదవండి. దాదాపు 45 ఏళ్ల సినీ కెరీర్లో అగ్రహీరో చిరంజీవి ఓ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించింది లేదు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ‘లాల్సింగ్ చడ్డా’ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కోసం ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు చిరంజీవి. అంతేనా.. ప్రమోషన్స్లోనూ ఆమిర్తో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్సింగ్ చడ్డా’. కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఆమిర్ ఖాన్ ఓ నిర్మాత. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్గా రూపొందిన ఈ ‘లాల్సింగ్ చడ్డా’ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా సమర్పకుడి బాధ్యతను తీసుకున్నారు. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ అడిగిన మీదట ‘బ్రహ్మాస్త్ర’కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు రాజమౌళి. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ‘బ్రహ్మాస్త: శివ పార్ట్ 1’ ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ సినిమాకు దక్షిణాది భాషల్లో సమర్పకులుగా రాజమౌళి ఉన్నారు. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం: శివ పార్ట్ 1’గా రిలీజ్ కానుంది. ఈ స్టార్సే కాదు.. ఇంతకుముందు కూడా కొందరు ప్రముఖులు వేరే భాషల చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరించారు. ఆ జాబితాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ‘1983’ ఒకటి. భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలుచుకున్న సంఘటనల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు రణ్వీర్ సింగ్ భార్య, ప్రముఖ నటి దీపికా పదుకోన్ ఓ నిర్మాత. ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 24న విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ను నాగార్జున సమర్పించారు. ఇదే సినిమా తమిళ వెర్షన్కు సమర్పకుడిగా వ్యవహరించారు కమల్హాసన్. పై విషయాలను బట్టి ఉత్తరాది సినిమాల రిలీజ్లకు దక్షిణాది సినీ ప్రముఖులు సమర్పకులుగా హెల్ప్ చేస్తున్నారన్న విషయం అర్థం అవుతుంది. అయితే ఇదే సీన్ బాలీవుడ్లోనూ కనిపిస్తోంది. దక్షిణాది చిత్రాలకు రిలీజ్ సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖులు సమర్పకులుగా ఉంటున్నారు. ‘బాహుబలి’ సినిమాను హిందీ ఆడియన్స్కు కరణ్ జోహార్ సమర్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 28న విడుదలైన సుదీప్ ‘విక్రాంత్ రోణ’ సినిమాకు సల్మాన్ ఖాన్ ప్రెజెంటర్. బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ హిందీ వెర్షన్ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు. కేవలం సమర్పకులుగానే కాదు... నిర్మాణ రంగంలోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. సూర్య నటించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘సూరరై పోట్రు’ హిందీలో రీమేక్ అవుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ హీరో. ఈ సినిమాకు సహనిర్మాతగా ఉన్నారు సూర్య. ఇక విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘మట్టి కుస్తీ’కి రవితేజ ఓ నిర్మాత కావడం విశేషం. తమిళంలో కమల్హాసన్ రీసెంట్గా నటించిన ‘విక్రమ్’ తెలుగు వెర్షన్ను హీరో నితిన్ సమర్పించారు. కన్నడంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ‘777 చార్లీ’ తెలుగు వెర్షన్ రిలీజ్కు హీరో రానా సమర్పకులుగా ఉన్నారు. ఇక తమిళంలో విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్ఐఆర్’ తెలుగు వెర్షన్ రిలీజ్కు రవితేజ సమర్పకులుగా ఉన్నారు. -
"బ్రహ్మాస్త్రం" నుంచి అందమైన మెలోడీ సాంగ్..
Brahmastra: Kumkumala Video Song Released: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్గా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా "బ్రహ్మాస్త్రం" చిత్ర యూనిట్ "కుంకుమల" వీడియో పాటను విడుదల చేసింది. ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని "సిద్ శ్రీరామ్" ఆలపించారు. తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ -
ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోన్న ‘బ్రహ్మాస్త్ర’!
ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతున్న సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రా రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాకి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. అయితే మొన్న బ్రహ్మాస్త్ర ట్రైలర్ చూశాక..బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల వీఎఫ్ ఎక్స్ వర్క్ లపై సినిమా అభిమానులకు నమ్మకం సన్నగిల్లింది.అందులో వీఎఫ్ఎక్స్( VFX) చాలా చీప్ గా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. ఆదిపురుష్ ప్రత్యేకంగా వీఎఫ్ ఎక్స్పై ఆధారపడి చేస్తున్న చిత్రం. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రభాస్ ఇమేజ్ ని దెబ్బకొడుతుంది. చాలా ట్రోలింగ్ ఎదురౌతుంది. మొన్నే రాధేశ్యామ్ లో క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ వర్క్ చాలా దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడుతున్నారు. (చదవండి: నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి) ఇక రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ షూట్ చేశారట. ఈ ఎపిసోడ్ లో సీత చిన్నప్పటి జీవితాన్ని, రాముడితో పెళ్లి వరకూ సీత జీవితంలో జరిగిన విషయాలని చూపించబోతున్నారట. సీత జీవితం గురించి చెప్పాలంటే ఆమె కుటుంబం గురించి కూడా చూపించాలి కాబట్టి... తండ్రి జనకమహారాజుతో సీతకి ఉండే అనుబంధాన్ని తెరపై చూపించడానికి ఓం రౌత్ రెడీ అయ్యాడు. ఇక జనకమహారాజు పాత్ర ప్లే చేయాల్సిన ఆర్టిస్ట్ కోసం ఓం రౌత్ చాలా సెర్చ్ చేయగా అందరికన్నా కృష్ణంరాజు అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాడని ఫిక్స్ అయ్యాడట. మిథిలాధిపతి జనకుడిగా రెబల్ స్టార్ కనిపించబోతున్నాడు.అయితే గతంలో ప్రభాస్,కృష్ణంరాజు కలిసి నటంచిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ సెంటిమెంట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి ఈ రెండు సెంటిమెంట్స్ ని బ్రేక్ చేసి అదుపురుష్ ఆశించిన విజయం సాధిస్తుందా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. -
షూలు వేసుకుని గంట మోగించిన హీరో, దర్శకుడు ఏమన్నాడంటే?
రియల్ లైఫ్ జోడీ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజవగా దీనిపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అంతేకాదు ఏకంగా బ్రహ్మాస్త్ర మూవీని నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇందుకు వాళ్లు చెప్పిన ప్రధాన కారణం.. రణ్బీర్ కపూర్ కాళ్లకు షూలు వేసుకని ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా షూలతోనే గుడిగంట మోగించాడు. దీంతో ఈ సీన్పై ఓ వర్గం ఒంటికాలిపై లేచింది. ఆలయంలోకి చెప్పులు వేసుకుని ఎలా వెళ్తారంటూ మండిపడింది. తాజాగా ఈ వివాదంపై బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందించాడు. 'రణ్బీర్ కాళ్లకు షూలు వేసుకుని గుడిగంట మోగించడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక భక్తుడిగా, సినిమా దర్శకుడిగా అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రణ్బీర్ కాళ్లకు షూలు వేసుకుని ఆలయంలో అడుగుపెట్టలేదు. దుర్గాదేవి పూజామండపంలోకి వెళ్లాడు. 75 ఏళ్లుగా మా కుటుంబం దుర్గా పూజను నిర్వహిస్తోంది. నాకున్న అనుభవం కొద్దీ చెప్తున్నా.. మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకునే వెళ్తాం. కానీ అమ్మవారి ముందుకు వెళ్లేటప్పుడు మాత్రం వాటిని పక్కన విడిచేసి దర్శనం చేసుకుంటాం. అక్కడ జరిగిందిదే. భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకే ఈ సినిమా తీశాం. అంతే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు' అని దర్శకుడు స్పష్టం చేశాడు. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) చదవండి: పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ? లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. -
చిరు వాయిస్తో ‘బ్రహ్మాస్త్ర` ట్రైలర్.. విజువల్స్ అదుర్స్
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల చేయబోతున్నారు. రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని నామకరణం చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలవుతుంది. (చదవండి: కోలీవుడ్కు నయన్ బిగ్ షాక్.. పెళ్లి తర్వాత కొత్త కండీషన్!) ‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకొని ఉందన్న విషయం ఆ యువకునికే తెలియదు. అతనే శివా’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ గంభీరంగా ఉంది. బ్రహ్మాస్త్రం కోసం పోరాటం, దుష్టశక్తుల యుద్దం.. అద్భుతమైన లవ్స్టోరీ..ఇలా అన్నింటిని కలిపి ట్రైలర్లో చూపించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. -
బ్రహ్మాస్త్ర సినిమాకు చిరంజీవి సాయం
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ కానుంది. యే జవానీ హై దీవానీ తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ మూవీని రూపొందించాడు. ఇటీవలే టీజర్తో పాటు నటీనటుల లుక్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ స్పెషల్ వీడియో వదిలింది. ఇందులో చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్కు వాయిస్ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు. మరి ట్రైలర్ చూడాలంటే మాత్రం జూన్ 15 వరకు ఆగాల్సిందే! ఈ చిత్రంలో ప్రొఫెసర్ అరవింద్ చతుర్వేది పాత్రను అమితాబ్ బచ్చన్ పోషిస్తుండగా.. అనీష్ శెట్టి పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. మౌనీ రాయ్ దమయంతి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి, రణ్బీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇటీవల వైజాగ్లో సందడి చేసిన విషయం తెలిసిందే! Happy to announce that @KChiruTweets garu has lent his voice to Brahmāstra Trailer. Telugu Trailer of Brahmāstra will release on June 15th!https://t.co/Rl70nZkaMR — rajamouli ss (@ssrajamouli) June 13, 2022 చదవండి: ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు, కమెడియన్: రాశీ ఖన్నా -
బ్రహ్మాస్త్రం: నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసింది
బాలీవుడ్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్- అలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున "నంది అస్త్ర" అనే శక్తి ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు. సహస్ర నదీమ్ సమరత్యం హే నంది అస్త్రం ఖండ్ ఖండ్ కురు మమ్ సహక్యం మమ్ సహక్యం.. అంటే ఒక అస్త్రంలో వేయి నందిలా బలం ఉంటుందట. ఇదిలా ఉంటే రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ఎస్ఎస్ రాజమౌళితో కలిసి "బ్రహ్మాస్త్రం" సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో సందర్శించిన సంగతి తెలిసిందే. జూన్ 15న బ్రహ్మస్త్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మరమైన సినిమాను సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. सहस्र नंदी हैं भुजबल जाके अंधकार भी थर थर कांपे हाथों में जिसके है हज़ारों नंदियों का बल Meet Artist Anish and his NANDI ASTRA With the strength of a 1000 Nandis In the Trailer of Brahmāstra on JUNE 15 ॐ शिववाहनाय विद्महे तुण्डाय धीमहि, तन्नो नन्दी: प्रचोदयात#Brahmastra pic.twitter.com/2WM0ipev7T — BRAHMĀSTRA (@BrahmastraFilm) June 11, 2022 Meet Artist Anish Shetty and his NANDI ASTRA An Astra with the Strength of a 1000 Nandi’s within it! సహస్ర నందిమ్ సామర్ధ్యం హే నంది అస్త్రం ఖండ ఖండ ఖురు మామ్ సహాయకం, మామ్ సహాయకం#Brahmāstra Trailer out on June 15#Nagarjuna #RanbirKapoor #AliaBhatt pic.twitter.com/hFM4uPPDC8 — Brahmastra Telugu (@Brahmastratel) June 11, 2022 చదవండి: మేజర్.. పాన్ ఇండియా చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు.. కానీ! యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్ -
ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్, నాగార్జున లుక్ రిలీజ్
బాలీవుడ్ కపుల్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ తొలిసారి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లో విడుదల కానుంది. ఈ మూవీకి విడుదలకు ఇంకా 100 రోజుల మిగిలి ఉండటంతో ప్రమోషన్లో భాగంగా మంగళవారం హీరో రణ్బీర్, దర్శకుడు ఆయాన్ ముఖర్జీ, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విశాకపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త టీజర్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు మేకర్స్. చదవండి: ఆ హీరో ‘మై డార్లింగ్’.. తన ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరో చెప్పిన రణ్బీర్ అంతేకాదు ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను జూన్ 15వ తేదీన రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ ప్రత్యేకమైన రోజు. 15 రోజుల్లో ట్రైలర్, 100 రోజుల్లో సినిమా రిలీజ్. అందుకే ఈ రోజు(మంగళవారం మే 31) టీజర్ను రిలీజ్ చేస్తున్నాం’ అని డైరెక్టర్ అయాన్ తెలిపాడు. ఇక టీజర్ విషయానికి వస్తే.. పూర్తి విజువల్ ఫీస్ట్గా రూపొందించిన ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులోని సన్నివేశాలు నటీనటుల లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. చదవండి: జనవరిలో పెళ్లి ప్రకటన, తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఈ టీజర్లో హీరోహీరోయిన్ల పలు సీన్స్తో పాటు టాలీవుడ్ హీరో నాగార్జున, బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్లకు సంబంధించిన సీన్స్ను కూడా చూపించారు. కాగా ఈ చిత్రంలో ప్రొఫెసర్ అరవింద్ చతుర్వేది పాత్రను అమితాబ్ బచ్చన్ పోషిస్తుండగా.. పురావాస్తూశాఖ నిపుణుడు అజయ్ విశిష్ఠ్ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. ఇక మౌనీ రాయ్ దమయంతీ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
విశాఖలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్ (ఫొటోలు)
-
ఆ హీరో ‘మై డార్లింగ్’.. తన ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరో చెప్పిన రణ్బీర్
‘బ్రహ్మాస్త్ర’ మూవీ రిలీజ్కు ఇంకా 100 రోజులే మిగిలుంది. బాలీవుడ్ కపుల్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ తొలిసారి జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లోకి రానుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన బ్రహ్మాస్త్ర హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ రణ్బీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ నేడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ మూవీ ప్రచారం కోసం బ్రహ్మాస్త్ర టీంతో జతకట్టాడు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. మంగళవారం వైజాగ్లో జరిగిన ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో రణ్బీర్కు తెలుగులో ఆయన ఫేవరెట్ యాక్టర్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. చదవండి: సల్మాన్ ఖాన్ను చంపేస్తా: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బహింరంగ సవాలు దీనికి వెంటనే రణ్బీర్ ప్రభాస్ అని సమాధానం ఇచ్చాడు. ‘తెలుగు యాక్టర్స్ అందరూ గొప్పవారే. కానీ అందులో ఒకరి పేరు చెప్పమంటే మాత్ం మై డార్లింగ్ ప్రభాస్ పేరు చెబుతాను. ఎందుకంటే అతను నా బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు ప్రభాస్ అంటే అభిమానం కూడా’ అని చెప్పకొచ్చాడు రణ్బీర్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దక్షిణాది భాషల్లో(తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) విజన్ను అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మస్త్ర మూవీ టీంతో కలిసి జక్కన్న వైజాగ్లో సందడి చేశాడు. View this post on Instagram A post shared by Ranbir kapoor fanpage 🔵 (@ranbir_kapoooor) -
ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడు: రాజమౌళి
‘నాలుగేళ్ల క్రితం కరణ్ జోహార్ ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను. మా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒకసారి మీకు కథ వినిపిస్తాడు. నచ్చితే మిమ్మల్ని సౌత్ ఇండియాలో ఈ మూవీ సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ తరువాత మొదటి సారి అయాన్ ను కలిసాను. ఆయన కథ చెప్పిన విధానం కంటే ఆయన బ్రహ్మాస్త్ర సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్నా ఎక్సయిట్మెంట్ కి నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తరువాత తను తయారుచేసుకున్న విజువల్స్, అప్పటివరకు షూట్ చేసిన మెటీరియల్ అంత చూపిస్తుంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను’అని అన్నారు దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రాజమౌళి, రణ్బీర్,దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం వైజాగ్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘బ్రహ్మాస్త్ర సినిమా పెద్ద స్క్రీన్ మీదే చూడాలని తీశారు. డైరెక్టర్ అయాన్ ఈ మూవీని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్న(రచయిత విజయేంద్రప్రసాద్)కు మొత్తం చూపించాడు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి పెట్టుకున్నాడు అని నాన్నగారు చెప్పారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నేను రెండుసార్లు ముంబైకి వెళ్లాను అయినా నాకు సినిమా మొత్తం చూపించలేదు. అయినా అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది’అని అన్నారు. ఇక అలియా భట్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఈ సినిమాలో ఉండటం దర్శకుడి అదృష్టం, రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం అని చెప్పుకొచ్చారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది, దీనికి రెండు కారణాలు ఉన్నాయ్, నా రెండో సినిమా "యే జవానీ హై దీవానీ" తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం నేను పదేళ్లు తీసుకున్నాను. నేను చాలా పెద్దగా ఊహించాను. మునుపెన్నడూ తీయని ఒక గొప్ప సినిమాను తీయాలనే ఆలోచన నాకు ఉండేది. అప్పటికీ రాజమౌళి ఇంకా బాహుబలి కూడా చెయ్యలేదు. ఇంత గొప్ప సినిమాను ఊహించేది నేను మాత్రమే అని ఫీల్ అయ్యేవాన్నీ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఆలోచన నుంచి వచ్చిన చిత్రమే ఈ బ్రహ్మస్త్రం. చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి వాటి మూలాలు ఈ సినిమా బ్రహ్మస్త్రం సినిమాకి ఆధారం అని చెప్పుకొచ్చారు. -
విశాఖలో రణ్బీర్, జక్కన్న సందడి, వీడియో వైరల్
బాలీవుడ్ కపుల్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రణ్బీర్ మంగళవారం వైజాగ్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా రణ్బీర్కు గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. క్రేన్ సాయంతో ఆయనకు భారీ పూలమాల వేసి అభిమానులు సత్కరించారు. ఇక రణ్బీర్ కూడా ఫ్యాన్స్కు అభివాదం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: బర్త్డే రోజునే సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన గౌరవం ఫ్యాన్స్ అభిమానానికి రణ్బీర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ వైజాగ్ పర్యటనలో రణ్బీర్తో పాటు డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ కూడా ఉన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమైళి అతిథిగా వచ్చారు. బ్రహ్మస్త్ర మూవీ టీంతో కలిసి ఆయన కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. కాగా ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో నాగార్జున అక్కీనేని ప్రధాన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బ్రహ్మాస్త్ర లవ్ పోస్టర్.. అలియా-రణ్బీర్ల పెళ్లికి హింట్ !
Ranbir Kapoor Alia Bhatt Wedding Hint By Brahmastra Love Poster: బాలీవుడ్ లవ్లీ లవ్బర్డ్స్ రణ్బీర్ కపూర్-అలియా భట్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీలో పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వెంటనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్ర బృందం తాజాగా రణ్బీర్, అలియా ప్రేమగా, అతి సన్నిహితంగా ఉన్న పోస్టర్ను రిలీజ్ చేసింది. చదవండి: ఏప్రిల్లోనే అలియా-రణ్బీర్ వివాహం !.. ఆ కారణం వల్లే ముహుర్తం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ పోస్టర్ను షేర్ చేశారు. 'ప్రేమ అంటే కాంతి. బ్రహ్మాస్త్రలోని మొదటి అధ్యాయాన్ని పార్ట్ 1: శివ అని చాలా కాలంగా మనం పిలుస్తున్నాం. కానీ పార్ట్ 1 అంటే ప్రేమ. ఎందుకంటే బ్రహ్మాస్త్ర ప్రధానంశం ప్రేమకు ఉన్న శక్తికి సంబంధించినది. ఈ ప్రేమ అగ్నిలా అన్నివైపులా వ్యాపించి సినిమాను దాటి నిజ జీవితంలోకి అడుగుపెట్టింది. ఇదిగో మా లవ్ పోస్టర్. దీనికి ఇది సరైన సమయం అనిపిస్తుంది.' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు అయాన్ ముఖర్జీ. అయితే రణ్బీర్-అలియా వివాహం ఈ నెల 14న జరగనుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు నిజమని చెప్పేలా అయాన్ లవ్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ పూర్తి.. వీడియో వైరల్
Ranbir Kapoor Alia Bhatt Brahmastra Wrap Up Shooting At Varanasi: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, బీటౌన్ క్యూట్ బ్యూటీ అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ భారతదేశ ఆధ్యాత్మిక క్షేత్రమైన వారణాసిలో పూర్తయింది. 'బ్రహ్మాస్త్ర' చివరి షెడ్యూల్ను వారణాసిలో పూర్తి చేసినట్లు ఓ వీడియో ద్వారా దర్శకనిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 'బ్రహ్మాస్త్ర' విజన్ను దర్శకధీరుడు రాజమౌలి అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ సౌత్లో అద్భుతంగా మొదలైంది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈవెంట్లో పెళ్లిపై స్పందించిన రణ్బీర్-అలియా భట్ భారతీయ పురాణాలు అలాగే ఆధునిక ప్రపంచం నుంచి ప్రేరణ పొందిన పురాణ సమ్మేళనం 'బ్రహ్మాస్త్ర' సినిమా. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ మధ్యే విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ కూడా తీసుకొచ్చారు. సెప్టెంబర్ 09, 2022న 'బ్రహ్మాస్త్ర' సినిమా విడుదల కానుంది. ఆ రోజు కచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర మొదలవుతుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మూడు భాగాలుగా వస్తున్న 'బ్రహ్మాస్త' సినిమా ప్రమోషన్లోకి రాజమౌళి చేరడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. We started shooting in 2018. And now ... finally .. The filming of Brahmastra ( Part One ) comes to an end !! I've been wanting to say this for such a long time .. ITS A WRAP !!!!!!!! 🔥🔥🔥🔥 See you at the cinemas . 09.09.2022 pic.twitter.com/E1NvRIK4XX — Alia Bhatt (@aliaa08) March 29, 2022 చదవండి: విశ్వంలో అత్యంత పురాతన శక్తి.. ‘బ్రహ్మాస్త్ర’ -
సినిమా సైంటిస్ట్ లు
-
అలియా బర్త్డే సర్ప్రైజ్, బ్రహ్మస్త్ర నుంచి ఫస్ట్లుక్ వచ్చేసింది
Alia Bhatt First Look Released From Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఆమె ప్రియుడు రణ్బీర్ కపూర్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే నేడు అలియా బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 15న అలియా 29వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అయాన్ తన ఇన్స్టాగ్రామ్లో అలియా ఫస్ట్లుక్ రిలీజ్ చేస్తూ సర్ప్రైజింగ్ వీడియో షేర్ చేశాడు. కాగా ఇందులో అలియా పాత్ర పేరు ఇషా. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్డే మై లిటిల్ వన్. ఈ ప్రత్యేకమైన రోజున మా బ్రహ్మస్త్ర శక్తి.. ఇషా స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రంలో రణ్బీర్ సూపర్ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల చిత్ర బృందం మోషన్ పోస్టర్ ద్వారా తెలిపింది. ఇందులో బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున్ అక్కినేని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ లాంచ్ ఫోటోలు
-
‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈవెంట్లో పెళ్లిపై స్పందించిన రణ్బీర్-అలియా భట్
Alia Bhatt And Ranbir Kapoor Respond On Their Wedding: బాలీవుడ్ లవ్బర్డ్స్ వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారాని ఎదురు చూస్తున్న ఓ స్టార్ సెలబ్రెటీ జంట మాత్రం ఇదిగో అదిగో అంటూ దాటేస్తున్నారు. వారే అలియా భట్-రణ్బీర్ కపూర్. వీరిద్దరూ పెళ్లి అంటూ గతేడాది నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ వారి వివాహ ముహుర్తం మాత్రం ఫిక్స్ అవ్వడం లేదు. డిసెంబర్లో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారుగానే మిగిపోయింది. బ్రహ్మాస్త్ర షూటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటామని రణ్బీర్-అలియాలే చెప్పుకొచ్చారు. చదవండి: ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి ఈ మూవీ షూటింగ్ అయిపోయింది, ఫస్ట్పార్ట్ రిలీజ్కు రెడీ అవుతోంది. కానీ వారు ఒక్కటయ్యేది ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు. దీంతో రణ్బీర్-అలియాల పెళ్లి సస్పెన్స్లో పడిపింది. ఈ క్రమంలో వారి తాజా చిత్రం బ్రహ్మాస్త్ర మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్లో ఈ జంట ఫ్యాన్స్తో ఇంటారాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా పలువురు రణ్బీర్-అలియాలను అడగాలకున్న ప్రశ్నలను ఓ పేపర్లో రాసి ఇచ్చారు. ఈవెంట్లో ఆ చిట్టిలు ఓపెస్ చేసి ప్రశ్నలు చదివి వాటికి సమాధాం ఇచ్చారు ఈ లవ్బర్డ్స్. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి ‘మీ పెళ్లి ఎప్పుడు’ ప్రశ్న ఎదురైంది. దీనికి రణ్బీర్ ఆసక్తిగా స్పందించాడు. ‘ఒకే గతేడాది నుంచి పలువురు సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. చదవండి: సమంత స్పెషల్ సాంగ్ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత నాకు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఉంది. సరే మనది ఎప్పుడు(మన పెళ్లి ఎప్పుడు అవుతుంది)’అంటూ అలియా వైపు చూస్తు అన్నాడు. దీనికి అలియా నన్ను అడుగుతావేంటి? అని సమాధానం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఇక వీరు తీరు చూసి నెటిజన్లు ఇప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే బ్రహ్మాస్త్ర మూవీ విడుదల తర్వాతే అలియా-రణ్బీర్లు పెళ్లి పీటలు ఎక్కాలని అనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఎందుకంటే వీరిద్దరూ కలిసి జంటగా నటించిన తొలి సినిమా బ్రహ్మస్త్ర. అందుకే ఈ మూవీ విడుదల అనంతరం ఒక్కటవ్వాలని వారిద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by ALIAA BHATT☀🕊 (@aliaabhatt_19) -
విశ్వంలో అత్యంత పురాతన శక్తి.. ‘బ్రహ్మాస్త్ర’
మన విశ్వంలో ఏదో జరుగుతోంది.. అది సామాన్యుల ఊహకు కూడా అందనిది.. అత్యంత పురాతన మహా శక్తి.. అదో అస్త్రం.. అదేంటి? అంటూ ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం కూడా ఒకటి. 2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా ఇతరత్రా సమస్యల కారణంగా చాలా రోజులుగా సెట్స్పైనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ డిసెంబర్తో చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందని సమాచారం. రణ్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, అక్కినేని నాగార్జున తదితర అగ్ర తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తాజాగా రణ్బీర్ కపూర్ పోషించిన శివ పాత్రకి సంబంధించిన మోషన్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో విశ్వం నుంచి భగభగమండే అగ్ని నుంచి రణ్బీర్ కపూర్లోకి ఓ శక్తి రావడం, అది త్రిశూలంగా మారడం, శివుడిలా రణ్బీర్ త్రిశూలం పట్టుకుని పవర్ ఫుల్ లుక్ ఇవ్వగా, వెనకాల ఏకంగా మహా శివుడి రూపం ప్రత్యక్షం కావడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక మోషన్ పోస్టర్లో ‘బ్రహ్మాస్త్ర’ ‘సారే అస్త్రే కే దేవతా’ అని ఉంది. బ్రహ్మాస్త్రం అనేది తిరుగులేని అస్త్రం అని దాని అర్ధం. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్బీర్ సూపర్ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని మోషన్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలిపింది. -
చాలా ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న బ్రహ్మాస్త్ర మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్!!
సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు దర్శకుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర మూవీ ట్రైలర్ మ్యాజిక్తో ప్రేక్షకులను అలరించడానికి వారి ముందుకు రానుంది. అయితే రణబీర్ కపూర్, అమితా బచ్చన్, అలియా భట్, నాగార్జున, మౌని రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రం దాదాపు 4 సంవత్సరాల నుండి నిర్మాణంలోనే ఉంది. బాలీవుడ్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన కాన్సెప్ట్తో అయాన్ ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. అందుకే ఇది పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ ప్రస్తుతం ఈ చిత్రం ప్రేక్షకులను అలంకరించడానికి సిద్ధంగా ఉంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) అయితే బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ రేపు విడుదల కానుండగా, మొదటి టీజర్ ఈరోజు వెబ్లోకి వచ్చింది. అమితాబ్ బచ్చన్ గాత్రం అందించిన ఈ చిత్రంలో రణబీర్ను శివగా పరిచయం కానున్నాడు. అయితే షర్ట్ లేకుండా ఆర్కే మండుతున్న మంటల మధ్యలో కనిపిస్తాడు. అయితే ఈ సినిమా పోస్టర్ విడుదలతోపాటు అధికారికంగా విడుదల తేదీని కూడా త్వరలో ఈ చిత్ర బృందం ప్రకటించనుంది. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) -
కరోనా బారిన బాలీవుడ్ స్టార్ హీరో
సాక్షి,ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్-19కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. దీనిపై ఆర్కే తల్లి, నటి నీతూ కపూర్ తన ఇన్స్టాలో రణబీర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె ప్రస్తుతం రణబీర్ కోలుకుంటున్నాడనీ, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. దీంతో కార్యక్రమాలకు బ్రేక్ చెప్పి రణబీర్ స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. మరోవైపు ముంబైలో, గత నెలతో పోల్చితే కోవిడ్-19 రోగుల సంఖ్య దాదాపు 89 శాతం పెరిగింది. అంధేరి (వెస్ట్), చెంబూర్, గోవాండితో సహా ఎనిమిది వార్డుల్లో కేసుల నమోదు భారీగా పెరిగింది. దీంతో మహారాష్ట్రలోని థానేలో మార్చి 13 నుంచి - 31 వరకు 11 హాట్స్పాట్లలో లాక్డౌన్ ప్రకటించారు. కాగా రణబీర్, అలియా భట్ జంటగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర చిత్రం ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. జగ్ జగ్ జీయో షూటింగ్ సందర్భంగా నీతూకపూర్, నటుడు వరుణ్ధావన్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) -
బాలీవుడ్ నయా ఖబర్
షారుక్ ఖాన్ తో చేతులు కలిపారు ఆలియా భట్. ‘యానిమల్’ని ఎప్పుడు వదులుతారో చెప్పారు సందీప్. ప్రేమికులు రణ్బీర్, ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సంగతేంటి? విలన్ మళ్లీ వస్తున్నాడు అంటున్నారు జాన్ అబ్రహామ్. లాక్డౌన్ తర్వాత హిందీ పరిశ్రమలో కూడా షూటింగులు జోరుగా జరుగుతున్నాయి. విడుదల తేదీలు ఫిక్స్ అవుతున్నాయి. బాలీవుడ్ ‘నయా ఖబర్’లు ఏమిటో తెలుసుకుందాం. రణ్బీర్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘యానిమల్’. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా వెల్లడించారు సందీప్ రెడ్డి. ఇందులో పరిణీతీ చోప్రా హీరోయిన్ . బాబీ డియోల్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రణ్బీర్ కపూర్, సంజయ్దత్ కలిసి నటించిన ‘షంషేరా’ చిత్రం ఈ ఏడాది జూన్ 2021న విడుదల కానుంది. అలాగే రియల్ లైఫ్ ప్రేమికులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం విడుదలకు రెడీ అవుతోంది. మరో వైపు హిందీ హిట్ మూవీ ‘పీకే’ సినిమా సీక్వెల్లో రణ్బీర్ కపూర్ నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక ‘డార్లింగ్స్’గా మారిపోయారు బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్ – ఆలియా భట్. కానీ, ‘డార్లింగ్స్’ చిత్రంలో షారుక్, ఆలియా కలిసి నటించడం లేదు. ఈ సినిమాను కలిసి నిర్మిస్తున్నారు. షారుక్ ఖాన్ నిర్మాణసంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, ఆలియా భట్ కొత్త నిర్మాణ సంస్థ ఎటర్నల్ షన్షైన్ ప్రొడక్షన్స్ ‘డార్లింగ్స్’ సినిమాను నిర్మించనున్నాయి. నిర్మాతగా ఆలియా భట్కు ఇదే తొలి సినిమా కావడం విశేషం. జస్మీత్ కెరీర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఆలియాభట్, షెఫాలలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. రెండు దిగువ మధ్యతరగతి కుటుంబాల మధ్య జరిగే కల్పిత కథనాల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందట. హీరో జాన్ అబ్రహామ్ మంచి ఫామ్లో ఉన్నారు. ‘ఎటాక్’, ‘సత్యమేవ జయతే 2’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి రెండు సినిమాల షూటింగ్స్ను షురూ చేసిన జాన్ తాజాగా ముంబైలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమా షూట్ను స్టార్ట్ చేశారు. 2014లో వచ్చిన హిట్ మూవీ ‘ఏక్ విలన్ ’ సినిమాను డైరెక్ట్ చేసిన మోహిత్ సూరియే ఈ సీక్వెల్ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో జాన్ అబ్రహామ్తో పాటు అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఇక జాన్ అబ్రహామ్ నటించిన ‘ముంబయ్ సాగా’ చిత్రం మార్చి 19న థియేటర్స్లోకి రానుంది. స్వరా భాస్కర్, శిఖా తల్సానియా, మెహర్, పూజా చోప్రా ప్రధాన పాత్రధారులుగా హిందీలో ‘జహార్ చార్ యార్’ అనే సినిమా రూపొందనుంది. రచయిత కమల్ పాండే ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 5న ప్రారంభం కానుంది. ఇలా బోలెడన్ని కొత్త కబుర్లతో బాలీవుడ్లో సందడి మొదలైంది. -
‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్: అలియా,రణ్బిర్లతో నాగార్జున
బాలీవుడ్ కపుల్ రణ్బిర్ కపూర్, అలియా భట్లు మొదటిసారిగా జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. గతేడాది డిసెంబర్లో విడుదల కావలసిన ఈ మూవీ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇక షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంలో ఇటీవల ఈ చిత్రం సెట్స్పైకి వచ్చింది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్లో టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున అక్కినేని కూడా పాల్గొన్నాడు. ఇందులో ఆయన ఓ కిలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆయన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంలో మంగళవారం ట్వీట్ చేశాడు. షూటింగ్ సెట్స్లో రణ్బిర్, అలియా, డైరెక్టర్తో కలిసి తీసుకున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘బ్రహ్మాస్త్ర’లో నా షూటింగ్ అయిపోయింది. రణ్బిర్, అలియాల వంటి నటులతో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం. ఇక ఆయాన్ ముఖర్జీ సృష్టించిన అత్యుత్తమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు వేచి ఉండలేకపోతున్న’ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. అలాగే అలియా భట్ కూడా ట్వీట్ చేస్తూ.. ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున సార్. ఆయనతో కలిసి నటించడం నిజంగా అరుదైన గౌరవంగా ఫీల్ అవుతన్న. షూటింగ్ సెట్స్లో మంచి జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్’ అంటూ రాసుకొచ్చింది. దర్శకుడు ఆయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రం మూడు భాగాల ఫాంటసీ అడ్వెంచర్ ఫ్రాంచైజీగా తెరకెక్కనుంది. ఇందులో రణ్బిర్ శివ పాత్రలో, అలియా ఇషాగా లీడ్ రోల్లు పోషిస్తుండగా.. బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్, డింపుల్ కాపాడియాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరి షూటింగ్ షెడ్యూల్ను జరపుకుంటోంది. ఇక త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. And it's a wrap for me on #Brahmāstra . Such an amazing experience it has been with our stellar performers #Ranbir and @Aliaa08. Can't wait for you guys to witness the outstanding world #AyanMukerji has created.#TheBigIndianMovie #Brahmastra pic.twitter.com/CvKBAVphnt — Nagarjuna Akkineni (@iamnagarjuna) February 16, 2021 (చదవండి: ఆ సీన్లో ఆడ ఏనుగులనే ఎందుకు వాడారో తెలుసా?) (మరోసారి నాగ్- పూరీ కాంబో.. డిఫరెంట్ స్టోరీ రెడీ!) -
సైంటిస్ట్ షారుక్
‘బ్రహ్మాస్త్ర’ కోసం సైంటిస్ట్గా మారారు షారుక్ ఖాన్ . రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో అమితాబ్ బచ్చన్ , నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సైంటిస్ట్గా ఓ గెస్ట్ రోల్ చేశారని బాలీవుడ్ సమాచారం. షారుక్ సన్నివేశాలతోనే ఈ చిత్రం మొదలవుతుందట. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వాయిదా పడింది. మరోవైపు ‘జీరో’ (2018) చిత్రం తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించే చిత్రంపై ఇప్పటివరకు సరైన స్పష్టత రాలేదు. తమిళ దర్శకుడు అట్లీతో ఓ హిందీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
ఆ హీరోను మరోసారి పొగిడిన అమితాబ్
ముంబై : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు. ఏడు పదుల మయసులోనూ నిర్విరామంగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మస్త్ర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, మౌని రాయ్, డింపుల్ కపాడియా, అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే రణ్బీర్, అమితాబ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రణ్బీర్తో కలిసి ఉన్న ఫోటోలను అమితాబ్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. (డిసెంబర్ 4న ‘బ్రహ్మస్త్ర’) ‘‘నేను ఇష్టపడే వారిలో ఒకరైనా రణ్బీర్తో కలిసి పని చేస్తున్నాను. అతని టాలెంట్తో సమానం కావడానికి నాకు నాలుగు కుర్చీలు అవసరమయ్యాయి’’. అనే క్యాప్షన్తో ట్వీట్ చేశారు. అయితే బిగ్బీ రణ్బీర్ను ప్రశంసించడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకముందు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రణ్బీర్ చాలా సునాయసంగా హావాభావాలను వ్యక్తపరచగలడు. అది అతనికి దేవుడిచ్చిన వరం. కానీ నేనైతే భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఎల్లప్పుడూ కష్టపడుతుంటాను. అలాగే ఈ విషయంలో డైరెక్టర్ సలహాను తీసుకుంటాను’. అంటూ పొగడ్తలతో ముంచేశాడు. ఇక బిగ్బీ ట్వీట్పై రణ్బీర్ స్పందించారు. ఇంతకంటే గొప్ప ప్రశంసను నేను ఎప్పటికీ పొందలేనని,. అమితాబ్ నాకు కుటుంబంలోని వ్యక్తి వంటి వారని.. ఎందుకంటే నన్ను కూడా ఆయన తన కుటుంబంలోని వ్యక్తిలా ట్రీట్ చేస్తారని తెలిపారు. కాగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.(అమితాబ్పై అమర్సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు) చదవండి: ప్రధాని మోదీ తరువాత బిగ్బీనే T 3452 - .. work starts early .. like 6 am .. rehearsing, blocking and then shooting it .. with one of my favourites ❤️👍.. I need 4 of those🪑s to keep up with his enormous talent .. !! pic.twitter.com/7m3Noaa7pT — Amitabh Bachchan (@SrBachchan) February 25, 2020 -
ఈ ఏడాదే ఆ హీరో హీరోయిన్ పెళ్లి!?
బాలీవుడ్ హాట్ కపుల్గా వార్తల్లో నిలుస్తున్న రణ్బీర్ కపూర్, అలియా భట్లు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు బీ-టౌన్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో అలియా, రణ్వీర్లు జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 4న విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ జంట కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ భాగంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. ఈ క్రమంలో ‘బ్రహ్మస్త్ర’ విడుదల తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ లవ్బర్డ్స్ పెళ్లికి ఇరుకుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని... పెళ్లి తేదిని ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా అలియా.. రణ్బీర్ కుటుంబంతో కలిసి వివిధ కార్యక్రమాలకు హజరవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్మాన్ జైన్, అనిషా మల్హోత్రాల పెళ్లికి రణ్బీర్, ఆయన తల్లి నీతూతో కలిసి అలియా హాజరయ్యారు. లండన్లో ఇల్లు కొనుక్కున్నా: హీరోయిన్ అదే విధంగా ఓ ఇంటర్వ్యూలో అలియా తండ్రి మహేష్ భట్ రణ్బీర్ అంటే తనకు ఇష్టం అని చెప్పిన సంగతి తెలిసిందే. ‘అవును వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అందులో దాచాల్సిన విషయం లేదు. నాకు రణ్వీర్ అంటే చాలా ఇష్టం. అతను చాలా మంచి వ్యక్తి. ఇక వారి బంధాన్ని ఎలా గుర్తించాలనుకుంటున్నారో వాళ్లే తెల్చుకోవాల్సిన విషయం. ఒకవేళ అది పెళ్లి వరకు వెళ్లుతుందా లేదా అనేది వారే గుర్తించాలి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇది వరకే రణ్వీర్, అలియాలు పెళ్లి చేసుకుంటున్నారనే వచ్చిన వార్తలను ఈ జంట కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి కూడా ఈ వార్తలను వీరు కొట్టిపారేస్తారో లేక నిజం చేస్తారో డిసెంబర్ వరకు వేచిచూడాల్సిందే. కాగా రణ్బీర్ కపూర్ గతంలో దీపికా పదుకొనె, కత్రినా కైఫ్తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. -
పరిశోధకుడు
వారణాసిలో పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితాలు వచ్చే ఏడాది వెండితెరపై విడుదలవుతాయి. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారు. శివ పాత్రకు గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది జూన్లో నాగార్జునపై వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మనాలిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియాభట్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మూడు విభాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి విభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.