Bunny Vasu
-
‘ఛావా’ క్లైమాక్స్లో కన్నీళ్లు వచ్చాయి: బన్నీ వాసు
‘‘ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత సులభం కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ‘ఛావా’ వంటి గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్గారికి ధన్యవాదాలు. ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ మహారాజ్లాంటి మహావీరుల త్యాగ ఫలితమే. ‘ఛావా’(Chhaava Movie) మూవీ క్లైమాక్స్లో భావోద్వేగ సన్నివేశాలు చూసి కన్నీళ్లు వచ్చాయి’’ అని నిర్మాత బన్నీ వాసు (bunny vasu)తెలిపారు. విక్కీ కౌశల్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తెలుగులో శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థాంక్స్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఛావా’ కేవలం సినిమా మాత్రమే కాదు... గ్రేట్ ఎమోషన్. నాలుగు రోజుల్లోనే పాటలని పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగులో నాకు వాయిస్ ఇచ్చిన ఫణి వంశీగారికి థ్యాంక్స్’’ అని నటుడు వినీత్ కుమార్ సింగ్ తెలిపారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని మాడ్డాక్ సీఎఫ్ఓ దివ్యాంశ్ గోయల్ అన్నారు. ఈ థ్యాంక్స్ మీట్లో తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్, తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ, లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడారు. -
మంచి సినిమాలివ్వడానికి ముందుంటాం: నిర్మాత ‘బన్నీ’ వాసు
ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్గా రూపొందిన హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie). విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యేసుబాయి భోంస్లే పాత్రను రష్మికా మందన్న పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ నెల 7న తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ‘బన్నీ’ వాసు(Bunny Vasu) మాట్లాడుతూ– ‘‘ఛావా’ హిందీలో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో ఆందరికీ తెలుసు. అంత మంచి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. భాష ఏదైనా మంచి సినిమా అయితే తెలుగులో తీసుకురావడానికి మా గీతా ఆర్ట్స్ ముందుంటుంది. ఇక ‘ఛావా’ చివరి 25 నిమిషాలు ఇండియా మొత్తం కన్నీళ్లు పెట్టించింది. అద్భుతమైన క్యాలిటీతో తెలుగులో డబ్ చేశాం. ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కేరళకు అల్లు అరవింద్.. నిర్మాత బన్నీవాసు క్లారిటీ
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఛావాను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంపై అరవింద్ ఎలా రియాక్ట్ అయ్యారని మీడియా ప్రతినిధులు బన్నీవాసును ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అల్లు అరవింద్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని తెలిపారు. ట్రీట్మెంట్ కోసం ఆయన కేరళ వెళ్లారని వెల్లడించారు.అయితే ఆయన కేవలం వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం వెళ్లారని బన్నీ వాసు అన్నారు. బరువు తగ్గేందుకు ప్రకృతి వైద్య చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. ఛావా నిర్మాతలతో మాట్లాడి తెలుగు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించాలని అరవింద్ చెప్పారని తెలిపారు. ఆయన డైరెక్షన్లోనే ఛావాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా.. బాలీవుడ్ మూవీ ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్, యేసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ సూపర్ హిట్గా నిలవడంతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. -
బిగ్గెస్ట్ మైల్స్టోన్ చేరుకున్న 'తండేల్'.. నాగచైతన్యకు ఫస్ట్ సినిమా
తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే. -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్'.. వివరాలు షేర్ చేసిన నిర్మాత
నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన తండేల్ సినిమాను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఫైర్ అయింది. అయితే, తాజాగా మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించడంతో ఆ వార్త నెట్టింట వైరల్ అయింది. దీనిపై నిర్మాత బన్ని వాసు తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించినట్లు బన్నీ వాసు తెలిపారు. ఆ బస్సుకు సంబంధించిన వివరాలు (AP 39 WB. 5566) షేర్ చేశారు. రెండోసారి ఏపీఎస్ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బన్నీ వాసు కోరారు. 'మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే అవుతుంది.' అని వాసు పేర్కొన్నారు.నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇలాంటి సమయంలో ఇలా పైరసీని ప్రొత్సాహిస్తే చిత్ర పరిశ్రమకు తీరని నష్టాన్ని తెచ్చినట్లు అవుతుందని చాలామందిలో అభిప్రాయం వ్యక్తమౌతుంది. సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వస్తే సినిమా మనగుడ ఉండదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.Once again the pirated version of our #Thandel played on the @apsrtc bus (Vehicle No: AP 39 WB. 5566). Piracy harms the film industry and disrespects creators' hard work. APSRTC Chairman #KonakallaNarayanaRao Garu, kindly ensure a strict circular is issued, prohibiting the… pic.twitter.com/xIrhziUkNP— Bunny Vas (@TheBunnyVas) February 11, 2025 -
అరెస్ట్ చేయిస్తాం... జాగ్రత్త : అల్లు అరవింద్ వార్నింగ్
‘‘పైరసీ చేయడం పెద్ద క్రైమ్. ప్రస్తుతం సైబర్ సెల్స్ బాగా పని చేస్తున్నాయి. మిమ్మల్ని (పైరసీదారులను) పట్టుకోవడం తేలిక. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక... జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) హెచ్చరించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. కాగా, ‘తండేల్’ సినిమాను పైరసీ చేసి, ఆన్లైన్లో పెట్టారు. ఈ విషయంపై సోమవారం ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న ‘దిల్’ రాజుగారి సినిమాను ఇలానే ఆన్లైన్లో విడుదల చేశారు. పైరసీ నియంత్రణకు ఫిల్మ్ ఛాంబర్లోని సెల్ రాత్రీ పగలూ పని చేస్తోంది. కానీ కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ల అడ్మిన్లను గుర్తించి, సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్ను ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్ను మేం ఆస్వాదించే క్రమంలో ఈ పైరసీ సమస్య మాకు ప్రతిబంధకం’’ అన్నారు. ‘‘క్రిమినల్ కేసులు నమోదు అయితే వెనక్కి తీసుకోలేము. పైరసీ చేసినవాళ్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్ ఆపరేటర్స్ని కూడా హెచ్చరిస్తున్నాం’’ అని బన్నీ వాసు అన్నారు. ఇదిలా ఉంటే... ఈ సమావేశం నిర్వహించిన కొంత సమయానికి బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె. నారాయణరావుని ఉద్దేశించి, ‘‘పైరసీని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిజాయితీగా మీరు చేసిన ప్రయత్నాన్ని, ఈ విషయంపై త్వరితగతిన స్పందించినందుకు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు... ‘గేమ్ ఛేంజర్’ని తక్కువ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ‘‘ఆ రోజు ‘దిల్’ రాజుగారిని ఉద్దేశించి, నేను మాట్లాడిన మాటలకు అర్థం... ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు–నష్టాలు–ఇన్కమ్ట్యాక్స్లు.. ఇవన్నీ అనుభవించారని. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు కాదు. మెగా అభిమానులు ఫీలై, నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన ఆ అభిమానులకు చెబుతున్నాను... నాకు చరణ్ (రామ్చరణ్) కొడుకులాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అందుకని ఎమోషనల్గా చెబుతున్నాను. ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్’’ అన్నారు. -
అప్పుడు గేమ్ ఛేంజర్.. ఇప్పుడు తండేల్.. వారికి నిర్మాత వార్నింగ్
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.పైరసీపై స్పందించిన తండేల్ నిర్మాతఅయితే తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్లైన్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందన్నారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాను సైతం లోకల్ ఛానెల్లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.తండేల్కు సక్సెస్ టాక్..ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లో రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన చూస్తే మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటనుంది. ఈ నేపథ్యంలో తండేల్ మూవీ నిర్మాతలు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. -
శ్రీతేజు విదేశాల్లో చికిత్స..! బాలుడ్ని పరామర్శించిన బన్నీ వాసు
-
చైతు, సాయి పల్లవి స్టెప్పులకు పూనకాలు గ్యారెంటీ: బన్నీ వాసు
‘‘తండేల్’ మూవీ యాభై శాతం ఫిక్షన్ అయితే యాభై శాతం నాన్ ఫిక్షన్. రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ని చందు అద్భుతంగా డిజైన్ చేశారు. మా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ లవ్ స్టోరీ ద్వారా వాస్తవ ఘటనలను ప్రేక్షకులకు చూపిస్తున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) చెప్పారు. నాగచైతన్య, సాయి పల్లవి(sai Pallavi) జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బన్నీ వాసు విలేకరులతో మాట్లాడుతూ–‘‘రచయిత కార్తీక్ రాసిన కథ నా క్లాస్ మేట్ భానుకి నచ్చింది. దీంతో కార్తీక్ని నా వద్దకు తీసుకొచ్చాడు.. నాకూ బాగా నచ్చడంతో కథ వినమని చందూగారికి చెప్పాను. ఆయనకి కూడా నచ్చడంతో చాలా పరిశోధన చేసి, పూర్తి కథని డెవలప్ చేశాం. మత్సలేశ్యం అనే ఊరు ఆధారంగా తీసుకున్న కథ ‘తండేల్’. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్కి చేపల వేటకి వెళుతుంటారు. మెయిన్ లీడర్ని తండేల్ అంటారు. అలా మా మూవీకి ‘తండేల్’ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో రాజు పాత్ర కోసం నాగచైతన్య మౌల్డ్ అయిన విధానం అద్భుతం.ఈ చిత్రం కథ నాగార్జున గారికి బాగా నచ్చిందని చైతన్యగారు చెప్పారు. సాయి పల్లవి కూడా చైతన్యకి మ్యాచ్ అయ్యేలా నటించారు. ‘నమో నమశ్శివాయ..’ పాటలో చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ థియేటర్స్లో పూనకం తెప్పిస్తుంది. అరవింద్గారు ‘తండేల్’ చూసి, విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్లో చాలా ఉత్సాహంగా, ఎంజాయ్మెంట్గా కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. శ్యామ్దత్గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అని తెలిపారు. -
ఆ తల్లి ఎక్కడ ఉందో? దేవిశ్రీ పెళ్లిపై బన్నీ వాసు ఫన్నీ కామెంట్స్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్లో దేవిశ్రీ ప్రసాద్ ముందు వరుసలో ఉంటాడు. 40 ఏళ్ల వయసు దాటిన ఆయన ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. కారణం ఏంటనేది తెలియదు కానీ కెరీర్ పరంగా బిజీగా ఉండడంతోనే పెళ్లి చేసుకోవట్లేదని కొంతమంది అంటుంటారు. గతంలో పలుమార్లు దేవిశ్రీ ప్రసాద్కు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. హీరోయిన్, నటి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. కొన్నాళ్ల తర్వాత ఓ యంగ్ హీరోయిన్తో ప్రేమలో పడ్డాడని..త్వరలోనే పెళ్లి అనే వార్తలు వినిపించాయి. అదీ జరగలేదు. ఇక ఆ మధ్య బంధువుల అమ్మాయితో పెళ్లి ఫిక్సయిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ దేవీశ్రీ సింగిల్గానే ఉన్నాడు. అయితే తాజాగా ఈ రాక్స్టార్ పెళ్లిపై నిర్మాత బన్నీవాసు(Bunny Vasu ) ఫన్నీ కామెంట్స్ చేశాడు.తాజాగా జరిగిన తండేల్(Thandel) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కి దేవిశ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) హాజరయ్యాడు. స్టైజ్పై ఒక్కొరు మాట్లాడుతూ.. సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. సినిమా ఇంతగొప్పగా రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమే కారణమని చెప్పాడు. మా చిత్రానికి అదిరిపోయే పాటలు అందించాడాని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేవి పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘దేవిని ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జితల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు.. ఆ తల్లి(దేవికి కాబోయే భార్య) ఎక్కడ ఉందో(నవ్వుతూ..). మా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారు. కానీ దేవి బ్యాచిలర్గానే ఉన్నాడు. త్వరలోనే దేవికి కూడా పెళ్లి జరగాలి. ఆయన పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి(నవ్వుతూ)’అని అన్నాడు. అక్కడే ఉన్న దేవి..‘పెళ్లి మన చేతుల్లో లేదు..రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది’ అన్నట్లుగా సైగలు చేశాడు. ఇక బన్నీవాసు దేవి పెళ్లి గురించి మాట్లాడినప్పుడు.. పక్కనే ఉన్న దిల్రాజు పగలబడి నవ్వుతూ దేవిని గట్టిగా హత్తుకున్నాడు. దేవి కెరీర్ విషయానికొస్తే.. చిన్న వయసులోనే ‘దేవి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ని ఆరంభించాడు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ కంపోజర్గా ఎదిగాడు. చిరంజీవి మొదలుకొని నాని వరకు అందరి హీరోల సినిమాలతకు సంగీతం అందించాడు.లవ్ సాంగ్స్ తో పాటు.. మాస్ , రొమాన్స్, డెవోషినల్, సెంటిమెంట్, పాప్ సాంగ్స్ ఇలా అన్నిరకాల పాటలు అద్భుతంగా కంపోజ్ చేసి.. అదరగొట్టాడు. దేవి సంగీతం అందించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ 'క'. తన్వీరామ్, నయన సారిక హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్ను శనివారం నిరవ్హించారు.మనసుకు నచ్చితేనే..ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాసు మాట్లాడుతూ.. నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప ఇలాంటి వేడుకలకు రాను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ అస్సలు ఊహించలేదు. స్క్రీన్ప్లేలో చిన్న తప్పు కూడా లేదు. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ స్క్రీన్ప్లే ఇది. ఈ సినిమాలో పనిచేసిన అందరికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ విని షాకయ్యా..సినిమా బడ్జెట్ విని షాకయ్యాను. వంశీ నందిపాటి నాకు రేట్ చెప్పకుండా సినిమా హక్కులు కొన్నాడు. ఆ నెంబర్ తెలిసి కంగారు పడ్డాను. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్ అవకాశం క్రియేట్ చేసుకున్నాడు, చాలా కషపడ్డాడు. పోరాటం ఆపలేదుచాలా మంది కిరణ్ పడిపోయాడు.. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను పోరాటం ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేయడమే.. కానీ కిరణ్ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్ గెలిచాడు. కిరణ్ను చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సక్సెస్ పాయింట్ వద్దకు వెళ్లే వరకు ఫైట్ చేయాలి. ఈ టీమ్ మరిన్ని విజయాలు అందుకోవాలి అని బన్నీ వాసు అన్నారు. -
దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాసు రియాక్షన్
-
ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాసు రియాక్షన్
టాలీవుడ్లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా థియేటర్కు ప్రేక్షకులు రాకుండా తామే చెడగొట్టామని తాజాగా ఆయన కామెంట్ చేశారు. సినిమా బాగున్నా వెంటనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ వైపు వెళ్లడం మానేశారు అనేది ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుంది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యల గురించి నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.‘ఆయ్’ మూవీ సెలబ్రేషన్స్లో బన్నీ వాస్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియా వారి నుంచి ఆయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే 'మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాలకే ఓటీటీలో సినిమా విడుదల చేస్తాం.' అని దిల్రాజు వ్యాఖ్యానించారు కదా దీనిపై మేరేమంటారు అని ఒకరు ప్రశ్నించగా.. బన్నీ వాసు ఇలా చెప్పుకొచ్చారు. 'ఇండస్ట్రీలో ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా ఐక్యత లేకుంటే ఏమీ చేయలేం. ఈ అంశంపై ఛాంబర్ నుంచి లేదా ఇంకెవరైనా రూల్స్ పెడితే జరిగే పని కాదు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసికట్టుగా కూర్చొని చర్చించాలి. బాలీవుడ్లో మాదిరి 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే.. థియేటర్లు ఇవ్వమని షరతులు పెట్టారు. అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా తీసుకుంటే సరిపోతుంది.' అని ఆయన అన్నారు.ప్రేక్షకులు థియేటర్కు రావాలంటే తప్పకుండా ఏదైనా సందర్భం ఉండాలని బన్నీ వాసు అన్నారు. రీసెంట్గా మహేశ్ బాబు పుట్టినరోజు కారణం వల్ల 'మురారి'కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అలా ప్రేక్షకుల్లో ఒక మూడ్ క్రియేట్ అయితేనే థియేటర్కు వస్తారు. తమ 'ఆయ్' మూవీకి భారీగా పబ్లిసిటీ చేసినప్పటికీ సాధారణ రోజుల్లో విడుదల చేస్తే ఉపయోగం ఉండేది కాదు. కేవలం 25శాతం లోపే ఓపెనింగ్ వచ్చేది. కానీ, ఆగష్టు 15 నుంచి వరుస సెలవులు ఉండటం వల్ల సినిమాకు అడ్వాంటేజ్ దక్కింది. అందుకే ఆయ్ సినిమాకు 45 శాతం ఓపెనింగ్ జరిగిందని బన్నీ వాసు పేర్కొన్నారు. కలెక్షన్ల పరంగా కూడా తమకు గ్రాస్ మాత్రమే కనపడుతుంది కానీ, షేర్ కనిపించడంలేదని ఆయన అన్నారు. గతంలో మాదిరి థియేటర్లలో పరిస్థితిలు ఇప్పుడు లేవని బన్నీ వాసు అన్నారు. -
నా జీవితంలో అలాంటి వ్యక్తి ఆయనొక్కడే: బన్నీవాసు ఆసక్తికర కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన ఆయన బన్నీపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచే స్నేహితుడు ఆయన ఒక్కడేనన్నారు. ఈ రోజు బన్నీ వాసు ఇక్కడ ఉన్నారంటే కారణం అల్లు అర్జున్ అని ఎమోషనలయ్యారు. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.బన్నీ వాసు మాట్లాడుతూ..' నా లైఫ్లో ఒకడున్నాడు. నేను ఎక్కడ ఉన్నా నాకు అండగా వచ్చి నిలబడతాడు. మా మధ్య గ్యాప్ వచ్చిందని డైలాగ్స్ వినిపిస్తున్నాయి. కానీ నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరే ముందుంటారు. ఒకటి మా అమ్మ.. రెండో వ్యక్తి నా స్నేహితుడు బన్నీ. ఆయ్ సినిమా ప్రచారం సరిగ్గా జరగడం లేదని.. బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీమ్ వాళ్లు కోరారు. కానీ నేను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి అని తెలిసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. 20 ఏళ్ల క్రితం నేను ఒక మిస్టేక్ చేశా. గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఆరోజు నా కోసం వాళ్ల నాన్నను కూడా ఎదిరించారు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకే కాదు.. తన లైఫ్లో ఎవరికి పడిపోతున్నా బన్నీ సపోర్ట్గా నిలుస్తాడు. అంత మంచి వ్యక్తి అల్లు అర్జున్ ఒక్కడే' అంటూ బన్నీ గొప్పతనాన్ని వివరించారు.కాగా... జూనియర్ ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాను గోదావరి నేపథ్యంలో ఫుల్ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్చి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. -
అల్లు అర్జున్, సుకుమార్ గొడవపై బన్నీ వాసు క్లారిటీ
-
మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్తో కలిసి!
గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్ గురించి తెగ వార్తలొచ్చాయి. 'పుష్ప 2' షూటింగ్ విషయమై డైరెక్టర్ సుకుమార్తో గొడవపడ్డాడని, గడ్డం ట్రిమ్ చేయించుకుని ఫారెన్ టూర్కి వెళ్లిపోయాడని తెగ గాసిప్స్ వచ్చాయి. అయితే ఇవేవి నిజం కాదని నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశారు. దీనితోపాటు అల్లు అర్జున్ తర్వాత చేయబోయే మూవీ గురించి లీకులు వదిలారు.(ఇదీ చదవండి: 'అందుకే బన్నీ గడ్డం ట్రిమ్ చేశాడు'.. నిర్మాత బన్నీ వాసు)'పుష్ప 2' తర్వాత బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటనేది క్లారిటీ రాలేదు. తాజాగా 'ఆయ్' మూవీ పాట లాంచ్ ఈవెంట్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి బయటపెట్టారు. త్రివిక్రమ్తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని, ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్తో దీన్ని తీయబోతున్నారని చెప్పారు. ఈ రేంజులో చెబుతున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గతంలో 'రంగస్థలం' తర్వాత సుకుమార్ 'పుష్ప' మూవీ చేశారు. దీంతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవల్లో పరిచయం చేయనున్నాడు. ఒకవేళ ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం ఇప్పటివరకు తెలుగు వరకే పరిమితమైన త్రివిక్రమ్.. పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
రెండు సినిమాల మధ్య మొదలైన క్రికెట్ యుద్ధం
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్లో సరికొత్త ప్లాన్తో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 'ఆయ్' సినిమాతో పాటు కమిటీ కుర్రోళ్ళు చిత్రాలు ఆగష్టులోనే విడుదల కానున్నాయి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు క్రికెట్లో పోటీ పడ్డారు.ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న 'ఆయ్' సినిమాకు బన్నీ వాస్ నిర్మాతగా ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి నిర్మాతగా నిహారిక కొణిదెల ఉన్నారు. అయితే, వీరిద్దరూ రెండు జట్లగా ఏర్పడి క్రికెట్ పోటీకి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్కు సంబంధించి బన్నీ వాస్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన సరదా చాలెంజ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్నీ వాస్ విసిరిన చాలెంజ్ను నిహారిక కొణిదెల స్వీకరించారు. కచ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ కమిటీ కుర్రోళ్ళు టీమ్ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.జూలై 19న సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ రెండు సినిమాలు గోదావరి బ్యాక్ డ్రాప్తోనే తెరకెక్కాయి. క్రికెట్, మూవీ లవర్స్ను ఈ మ్యాచ్ ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.ఆయ్ సినిమా గురించిఫన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకోనుంది ఆయ్ చిత్రం. నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు ఇందులో ప్రధాన తారాగణంగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించినిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగష్టులోనే రిలీజ్ కానుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు, మణికాంత పరుశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట తదితరులు సినిమాలో నటించారు. యదు వంశీ దరక్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు. -
పరశురామ్తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు
తెలుగు ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా గీతా ఆర్ట్స్కు మంచి పేరు ఉంది. ఈ బ్యానర్లో భాగమైన GA2 నుంచి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్లో 'గీత గోవిందం' చిత్రం వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్కు అనుగుణంగా వారి ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు బన్నీ వాస్. GA2 బ్యానర్లో ఆయన చాలా సినిమాలే తీశాడు. గీతగోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్తో జరిగిన వివాదం గురించి బన్నీ వాస్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. 'గీత గోవిందం తర్వాత నాతో పరశురామ్ ఒక కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను విజయ్కు ఫోన్ చేసి చెప్పాను. సినిమా చేసేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈలోపు దిల్ రాజుతో పరశురామ్ ఇదే కథ చెప్పినట్లు తెలిసింది. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. ఇదే విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం బాగానే బాధపడ్డాం. ఆ సమయంలో మేమంతా కొంచెం కోపంగా ఉన్నాం. అందుకు తగినట్లే పరుశురామ్పై రియాక్టయ్యాం. ఆ తర్వాత పరశురామ్ ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. సర్కారు వారి పాట సినిమా సమయంలో ఏదో ఫ్లోలో దిల్ రాజుకు కథ చెప్పాను ఆయన సినిమా ఓకే చేయడం. ఆ తర్వాత విజయ్కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇదే విషయం మీతో పొద్దున చెబుదామని అనుకున్నలోపే ఇలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. ఆ వివాదం తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి.. ఇదే సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు వద్దని చెప్పారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు. త్వరలో విజయ్- పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తాం.' అని బన్నీ వాసు పేర్కొన్నాడు. గతంలో ఏం జరిగింది..? గీతగోవిందం చిత్రం హిట్ కొట్టడంతో డైరెక్టర్ పరుశురామ్ చాలా సినిమాలకు ఒకేసారి కమిట్మెంట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆయన వారి నుంచి కొంతమేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ముందుగా అనుకున్నట్లుగా గీతగోవిందం తర్వాత పరశురామ్ అల్లు అరవింద్కే సినిమా చేయాల్సి ఉంది. కానీ 14 రీల్స్ బ్యానర్లో నాగచైతన్య సినిమా తీసి వస్తానని అల్లు కాంపౌండ్ నుంచి ఆయన బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కూడా మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా ఛాన్స్ దక్కడంతో నాగచైతన్య సినిమాను పక్కనపెట్టి మహేశ్- మైత్రీ మేకర్స్ వైపు మొగ్గుచూపాడు. ఆ సమయంలో 14 రీల్స్తో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో సర్కారు వారి పాటలో 14 రీల్స్ను కూడా భాగం అయింది. సర్కారు వారి పాట చిత్రం తర్వాత కూడా దిల్ రాజు- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ప్యామిలీ స్టార్' చిత్రాన్ని పరుశురామ్ ప్రకటించాడు. దీంతో అల్లు అరవింద్కు కోపం వచ్చిందని ఇండస్ట్రీలో వైరల్ అయింది. గీతగోవిందం తర్వాత తమతో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఉండగానే దిల్ రాజుతో పరశురామ్ సినిమా ఎనౌన్స్ చేయడం అరవింద్కు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని తెలిసింది. -
తెలుగోడి జానపదం దమ్ము చూపించింది
‘‘ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ మేక, వరలక్ష్మీ శరత్కుమార్ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని. -
వైష్ణవి చైతన్య ఇకనుంచి నీ టైం స్టార్ట్ అయ్యింది.. జాగ్రత్త..
-
గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో నాగచైతన్య. రీసెంట్గా కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. దీంతో అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ ఏంటి? ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు? అనే ఆసక్తి మెదలైంది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీవాసు కన్ఫర్మ్ చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏ ఏడాదిలోనే GA2 పిక్చర్స్ బ్యానర్లో నాగచైతన్యతో సినిమా ఉంటుందని తెలిపారు. డైరెక్టర్ ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో గీతా ఆర్ట్స్లో చై నటించిన '100% లవ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సెంటిమెంట్తో నెక్ట్స్ మూవీ కూడా హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. -
గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!
‘‘గీతగోవిందం’ సినిమాను కేరళలో విడుదల చేసి, వసూళ్లను అక్కడ విరాళంగా ఇచ్చాం(కేరళలో 2018 వచ్చిన వరదలను ఉద్దేశిస్తూ). బాహుశా.. అందుకేనేమో మలయాళ హిట్ మూవీ ‘2018’ ని తెలుగులో విడుదల చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ వేణు, ఆంథోనీ, పద్మ కుమార్గార్లకు థ్యాంక్స్. హృదయాన్ని హత్తుకునే సినిమా ‘2018’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. టోవినో థామస్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 3న రిలీజైంది. ఈ మూవీని ఈ నెల 26న తెలుగులో ‘బన్నీ’ వాసు విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ‘2018’ సక్సెస్ సెలబ్రేషన్స్లో టోవినో థామస్ మాట్లాడుతూ–‘‘ఇకపై నేను నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని థియేటర్స్లో చూడండి’’ అన్నారు జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ కార్యక్రమంలో అపర్ణా బాలమురళి, నిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ చేస్తా: టొవినో థామస్
‘2018 ’చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు కేరళలో మాత్రమే కాదు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను’అని మలయాళ హీరో టొవినో థామస్ అన్నారు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న ప్రముఖ నిర్మాత బన్నివాసు రిలీజ్ చేయగా.. మంచి స్పందన లభించింది. తొలి రోజు రూ. కోటికి పైగా వసూళ్లను రాబట్టి దుసూకెళ్తోంది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్. కానీ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను’అన్నారు. ‘నేను 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేశాను.కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. .పబ్లిసిటి కి ఎక్కువ టైం లేకపోయినా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని నమ్మాను. ఇప్పుడు అదే నిజమైంది. అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.చాలా ఆనందంగా ఉంది’అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్ అని అపర్ణ బాలమురళి అన్నారు. -
‘2018’ మూవీ రివ్యూ
టైటిల్: 2018 నటీనటులు: టొవినో థామస్, అసిఫ్ అలీ, లాల్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాల మురళి, కున్చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ తదితరులు నిర్మాతలు : వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ తెలుగులో విడుదల : 'బన్నీ' వాస్ దర్శకత్వం: జూడ్ ఆంథనీ జోసెఫ్ సంగీతం: నోబిన్ పాల్ సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్ విడుదల తేది: మే 26, 2023 ఆ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంటలన్నీ నాశనం అయ్యాయి. రైతుల గోసలు.. ఉద్యోగస్తుల తిప్పలు.. ఇవన్నీ టీవీల్లో చూసి చలించిపోయాం. రెండు, మూడు రోజుల పాటు కురిసి వానకే ఇంత నష్టం వాటిల్లితే.. మరి ఎడతెరపి లేకుండా కొన్ని వారాల పాటు వర్షం పడితే? వరదలు వస్తే? ఆ వరదల్లో కట్టుకున్న ఇళ్లతో పాటు అన్ని కొట్టుకొనిపోతే?.. ఇలాంటి ప్రకృతి విపత్తులు నిత్యం ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉంటాయి. టీవీల్లో వాటికి సంబంధించి వార్తలు చూసి కాసేపటికే చానెల్ మార్చేస్తాం. కానీ అలాంటి ప్రకృతి విపత్తే మన దగ్గర సంభవిస్తే? నిండు గర్భిణీ అయిన మీ భార్య వరదల్లో చిక్కుకొని పోతే? అంగవైకల్యంతో బాధపడుతున్న నీ కొడుకు ఉన్న ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరితే? కష్టపడి డిగ్రీ చదివిన నీ కూతురు సర్టిఫికేట్స్ వరద నీటీలో తడిసిపోతే? ఇష్టపడి కట్టుకున్న ఇల్లు నీ కళ్లముందే కూలిపోతే? తాగడానికి గుప్పెడు మంచి నీళ్లు కూడా లభించపోతే?.. ఇవన్నీ కేరళ ప్రజలు చూశారు. చరిత్రలో ఇంతవరకు చూడని వరదలను 2018లో అక్కడి ప్రజలు చూశారు. ఒకరిఒకరు సహాయం చేసుకొని ప్రకృతి ప్రళయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సంఘటలనే కథగా మలిచి ‘2018’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్. మే 5 కేరళలో విడుదలైన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికే రూ. 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అదే చిత్రాన్ని తెలుగులో 'బన్నీ' వాసు ఈ శుక్రవారం (మే 26) రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ‘2018’ కథేంటంటే.. కేరళలోని అరువిక్కుళం అనే గ్రామానికి చెందిన అనూప్ (టోవినో థామస్) ఎంతో ఇష్టపడి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అయితే అక్కడి కష్టాలు చూసి భయపడి ఉద్యోగం మానేసి ఊరిగి తిరిగొస్తాడు. అతన్ని చూసి జనాలంతా నవ్వుకుంటారు. ఇక మనోడు మాత్రం అవేవి పట్టించుకోకుండా దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన స్కూల్ టీచర్ మంజు(తన్విరామ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు నిక్సన్(అసిఫ్ అలీ) మోడల్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని తండ్రి(లాల్), అన్నయ్య(నరైన్) సముద్రంలో చేపలు పడుతూ జీవిస్తుంటారు. వారిది సముద్ర తర ప్రాంతం కావడంతో వర్షం పడినప్పుడల్లా ఇంటిని వదిలి క్యాంపుల్లోకి వెళ్తుంటారు. ఇక కోషీ(అజు వర్గీస్) ఓ టాక్సీ డ్రైవర్. కేరళ పర్యటనకు వచ్చిన విదేశీయులను తన క్యాబ్లో అన్ని ప్రాంతాలు తిప్పి చూపిస్తుంటాడు. సేతుపతి(కలైయారసన్) లారీ డ్రైవర్. డబ్బు కోసం బాంబులను అక్రమంగా సరఫరా చేయడానికి వెళ్తుంటాడు. ఇలా ఒక్కొక్కరిది అక్కడ ఒక్కో జీవితం. వీరందరి జీవితాలను 2018 వరదలు ఎలా తారుమారు చేసింది? ప్రకృతి కన్నెర్ర చేస్తే.. అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకొని ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? వరదల సమయంలో కేరళ ప్రజలు పడిన కష్టాలు ఏంటి? వేలాది మంది ప్రజలు అనుభవించిన బాధలు ఏంటి? అనేది కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమానే ‘2018’. ఎలా ఉందంటే.. 2018 ఆగస్టులో కేరళలో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. కేరళ చరిత్రలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని ‘జూడ్ ఆంథనీ జోసెఫ్’ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి అక్కడి ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇది అక్కడ జరిగిన సంఘటన కాబట్టి అందరికి కనెక్ట్ అయింది. మరి తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది? తెలుగు ప్రజలే కాదు మనుషులంతా ఈ కథను కనెక్ట్ అవుతారు. అయ్యో పాపం.. ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదే? అక్కడ నేనున్నా వెళ్లి వారిని కాపాడేవాడిని అనిపించేలా కొన్ని వరద సన్నివేషాలను తీర్చిదిద్దారు. సినిమా చూస్తున్నంత సేపు వరదల్లో మనవాళ్లు చిక్కుకున్నట్లుగా.. వారికి సహాయం చేసినప్పుడు హమ్మయ్యా.. వాళ్లు సేవ్ అయ్యారు’ అనే పీలింగ్ కలుగుతుంది. కథ మన ఊహకు అందినట్లుగా సాగితే బోరు కొడుతుంది. కానీ మనం కోరుకునేది తెరపై జరిగితే సంతోషం కలుగుతుంది. ఈ సినిమాలో మనం కోరుకునేవి చాలా జరుగుతాయి. కొన్ని సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా వికలాంగుడైన కొడుకుని కాపాడుకోవడం కోసం ఓ జంట పడే కష్టం.. గర్భవతిని హెలిక్యాప్టర్లో ఎక్కించే సీన్... సర్టిఫికెట్స్ కోసం ఇంట్లోకి నిక్సన్ వెళ్లే సీన్.. అక్కడ పాము కనిపిస్తే.. నిక్సన్ చేసిన పని.. ఇలా చాలా సన్నివేశాలు మన మనసుల్ని హత్తుకుంటాయి. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి. మరికొన్ని సనివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడకోసం మేమున్నామంటూ మత్స్యకారులు ముందుకొస్తే.. ‘ఇది కదా మానవత్వం’ అనిపిస్తుంది. మొత్తంగా 2018 సినిమా ఆడియన్స్ని టెన్షన్ పెడుతుంది. భయపెడుతుంది. బాధపెడుతుంది. చివరకు కులమతాల కంటే మానవత్వం గొప్పదని తెలియజేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. తమ పాత్రల్లో జీవించేశారు.ప్రతి ఒక్కరు తమ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాకొస్తే.. నోబిన్ పాల్ నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సీన్ని చాలా సహజంగా, అద్భుతంగా చిత్రీకరించాడు. చమన్ చాకో ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు అన్ని అద్భుతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘2018’ థియేటర్స్లో టెన్షన్ పెడుతుంది..క్లాప్స్ కొట్టిస్తుంది: బన్నీవాసు
‘‘2018’ సినిమా తెలుగు కాపీ చూశాను.. నచ్చింది. సెకండాఫ్లో మనకు తెలియకుండానే మనం కన్నీళ్ళు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో మనిషి జీవితం తాలూకు విలువ ఏంటో తెలుస్తుంది. 2018లో కేరళలో వరదల సమయంలో అక్కడి ప్రజలు వారి జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇలాంటి రియలిస్టిక్ ఘటనలను కూడా కమర్షియల్ అంశాలతో దర్శకుడు చక్కగా చెప్పారు. ఈ సినిమా ఆడియన్స్ను థియేటర్స్లో టెన్షన్ పెడుతుంది.. క్లాప్స్ కొట్టిస్తుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలై ఇప్పటికే రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించి, ఇంకా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా తెలుగులో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో గీతా డిస్ట్రిబ్యూషన్, వైజాగ్లో ‘దిల్’ రాజు, మిగతా ఏరియాల్లో ‘బన్నీ’ వాసు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2018’ అందర్నీ మెప్పించే విధంగా ఉంటుంది. ఇక అల్లు అర్జున్గారి ‘పుష్ప: ది రూల్’ని డిసెంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. షారుక్ ఖాన్ ‘జవాన్’లో అల్లు అర్జున్గారు నటించారన్నది అవాస్తవం. బాలీవుడ్ మూవీ ‘అశ్వథ్థామ ఇమ్మోర్టల్’ ప్రపోజల్ అల్లు అర్జున్గారికి వచ్చింది కానీ ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు’’ అన్నారు. -
మా టీమ్ సక్సెస్ సీక్రెట్ అదే
‘‘వినరో భాగ్యము విష్ణు కథ’ విషయంలో కొత్తవారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని కొందరు అడుగుతున్నారు. అల్లు అరవింద్గారి క్రమశిక్షణ వల్ల మా ఖర్చు హద్దుల్లో ఉంటుంది. అదే మా టీమ్ సక్సెస్ సీక్రెట్’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రమిది. ఇప్పుడిప్పుడే ‘కేజీఎఫ్, విక్రమ్’ వంటి సినిమాల ఫార్మాట్లకు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘మా చిత్రం కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది’’ అన్నారు మురళీ కిషోర్ అబ్బూరు. నిర్మాత ఎస్కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడారు. -
వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీశా : బన్ని వాసు
‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు. ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.ఇప్పుడే అదే కరెక్ట్ అయింది. కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశాను’అని నిర్మాత బన్ని వాసు అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బన్నీ వాసు మాట్లాడుతూ.. నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు’ అన్నారు. ‘ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. మా హీరోయిన్ కశ్మీర మున్ముందు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం వల్లే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్కు వెళ్లింది’అని నిర్మాత ఎస్.కె.ఎన్ అన్నారు. ‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని హీరోయిన్ కశ్మీర పరదేశీ అన్నారు. 'ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది’ అని దర్శకుడు మురళీ కిషోర్ అన్నారు. -
ఎస్ఆర్ కళ్యాణ మండపం నచ్చడంతో ఈ అవకాశం.. ఇది నా అదృష్టం
‘‘గీతా ఆర్ట్స్లాంటి మంచి, పెద్ద బ్యానర్లో నటించా లని అందరూ అనుకుంటారు. నా కెరీర్ప్రారంభంలోనే ఆ బ్యానర్లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి మంచి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నచ్చడంతో అల్లు అరవింద్, వాసుగార్లు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చేసే అవకాశం ఇచ్చారు. ప్రేమ, వినోదం, థ్రిల్.. ఇలా కుటుంబ సమేతంగా చూడదగ్గ అన్ని అంశాలతో మురళి తెరకెక్కించారు. నా కెరీర్లో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ మంచి కమర్షియల్ హిట్. ఆ సినిమాని మించిన కమర్షియల్ హిట్ని ‘వినరో..’ సాధిస్తుంది. ‘కిరణ్ ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అని ప్రేక్షకులతో అనిపించుకోవా లన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మీటర్’ షూటింగ్ పూర్తయింది. ‘రూల్స్ రంజన్’ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. -
అందువల్లే ఆ హీరోలు క్లిక్ అవుతున్నారు – నిర్మాత బన్నీ వాసు
‘‘ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా కష్టపడాలి. అల్లు అర్జున్, నాని, కిరణ్ అబ్బవరం, నిఖిల్లకు సినిమా అంటే తపన.. అందువల్లే వారు క్లిక్ అవుతున్నారు. సినిమా కోసం నిద్రపోకుండా బాగా కష్టపడతారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘వినరో భాగ్యము విష్ణు కథ’లో వినోదం, ప్రేమ, థ్రిల్లింగ్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఈ చిత్రంలో సిగరెట్, మందు తాగే సీన్లు లేవు.. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా రషెస్ చూశాక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే మా నమ్మకం రెట్టింపు అయ్యింది. నా కెరీర్లో గుర్తు పెట్టుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
బన్నీ వాసు బంపరాఫర్.. పుష్ప 2 షూటింగ్ చూసే ఛాన్స్!
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి "వాసవసుహాస" పాటకు, చిత్ర టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సెకండ్ సింగిల్ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్తో మ్యాచ్ నిర్వహించింది. ఆ మ్యాచ్లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్ సైదులుతో "ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం" సాంగ్ రిలీజ్ చేయించింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు. బన్నీ వాసు మాట్లాడుతూ.. 'ఈ సాంగ్ను రీల్గా చేసి గీతా ఆర్ట్స్ను ట్యాగ్ చేయండి. సెలెక్ట్ అయిన 10 మందికి, వాళ్ళ ఫ్యామిలీకి ఈ సినిమాను చూపించడమే కాకుండా వాళ్ళను పుష్ప షూటింగ్కు కూడా తీసుకెళ్తాం' అని ప్రకటించారు. వినరో భాగ్యము విష్ణు కథ విషయానికి వస్తే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. చదవండి: పెళ్లిపీటలెక్కిన హీరోయిన్, ఫోటోలు వైరల్ -
ఆ సినిమాతో పోల్చడం సంతోషం
‘‘ఫీల్ గుడ్ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్కి ఉన్న ఫీలింగ్ మా ‘18 పేజెస్’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్. ‘‘2022లో టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్లో మా ‘18 పేజెస్’ ఉంటుంది. కెరీర్ వైజ్గా నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్’’ అన్నారు నిఖిల్. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ. ∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్ -
"వినరో భాగ్యము విష్ణు కథ" ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తిరుమల తిరుపతి నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ను రెడీ చేస్తుంది చిత్ర బృందం. "వాసవసుహాస" అనే పాటను డిసంబర్ 24 న సాయంత్రం 6:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. -
నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఓ సినీ నిర్మాత తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ నిరసనకు దిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు గురువారం రాత్రి సునీత బోయ నగ్నంగా బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామానికి పంపించారు. వివరాలివీ... తెలుగులో పలు సూపర్హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, డిస్ట్రిబ్యూటర్గా పేరొందిన బన్నీ వాసు తనను మోసం చేశారని... వాడుకొని వదిలేశాడని ఆమె ఆరోపించింది. బన్నీవాసు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ బైఠాయించడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో తనను బన్నీవాసు బెదిరిస్తున్నాడని మానసికంగా వేధించడమే కాకుండా చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ దుయ్యబట్టింది. రెండు గంటల పాటు ఆమె గీతాఆర్ట్స్ కార్యాలయం ముందు హడావుడి చేశారు. చదవండి: (కాంగ్రెస్కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
కమర్షియల్ హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: మారుతి
‘పక్కా కమర్షియల్’ చిత్రం మేము అనుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. నా సినిమాకు వచ్చే అడియన్స్ ఏం ఆశిస్తారో అవన్ని ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు’అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ పతకాలపై బన్నీ వాస్ నిరించారు. జులై 1న ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. (చదవండి: అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది. అనంతరం మారుతి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ని స్టైలీష్గా చూపించారని, రాశీఖన్నా ట్రాక్ బాగుందని చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ ఇంకా బెటర్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను’ అని అన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. తొలి రోజే రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు ’అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు నటుడు సప్తగిరి. ‘ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం మేము టికెట్స్ రేట్ తగ్గించాం. ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ’అన్నారు సహ నిర్మాత ఎస్కేఎన్. ఈ చిత్రంలో రావు రమేశ్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
పెద్ద బ్యానర్లో శివానీ రాజశేఖర్ సినిమా!
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ సినిమాతో మరో మారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమైంది. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి బన్నీ వాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. Some journeys are worth waiting for… this one is going to be special :)#AlluAravind garu Presents @GA2Official's #ProductionNo8 launched today with a pooja ceremony.✨Produced by #BunnyVas & #VidhyaMadhuri Directed by #TejaMarni @actorsrikanth @varusarath5 #Shivani pic.twitter.com/u76XITcrnY— Rahul Vijay (@ActorRahulVijay) June 30, 2022 చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి -
2002లో ఇండస్ట్రీకి, ఈ పదేళ్లలో ఎన్నో మార్పులొచ్చాయి: బన్నీ వాసు
డిస్టిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టి 100% లవ్ సినిమాతో నిర్మాతగా మారి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు బన్నీ వాసు. ప్రస్తుతం "పక్కా కమర్షియల్" సినిమా నిర్మిస్తున్న ఆయన తన పుట్టినరోజు సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'నేను ఎంత సంపాదించాను అని కాకుండా, ఆడియన్స్ను థియేటర్కు ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే పక్కా కమర్షియల్ సినిమాను కూడా అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ రేట్స్ పెట్టాం. కామన్ పీపుల్, మధ్యతరగతి ప్రజలు సినిమాకి వచ్చే పాజిబిలిటే ఉన్నట్లే ప్లాన్ చేసాము. 2002లో నేను ఇండస్ట్రీకి వచ్చాను, నిర్మాతగా 2011లో నా మొదటి సినిమా చేసాను. ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు, రాముడు బెత్తం పడతాడు అని చెప్తే వినే పరిస్థితి వచ్చింది. సినిమా థియేటర్లో ఆడాలంటే ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ ఉండాలి. నార్మల్, ఆర్డినరీ కంటెంట్తో సినిమా చేయలేము. పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 18 పేజెస్ సినిమా జరుగుతుంది. ఆ తరువాత చందు మొండేటి, పవన్ సాధినేని సినిమాలు ఉండబోతున్నాయి' అని చెప్పుకొచ్చారు. చదవండి: మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు సీక్రెట్గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త -
‘పక్కా కమర్షియల్’ టికెట్ రేట్స్పై బన్నీవాసు క్లారిటీ
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టికెట్ల ధరలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా ‘పక్కా కమర్షియల్’ టికెట్ ధరలు ఉంటాయని చెప్పారు. (చదవండి: స్టేజ్పై మహేశ్బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు) మూవీ ప్రమోషన్స్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ..‘టికెట్ రేట్స్ అందరికి అందుబాటులో ఉండాలని కోరుకునే వారిలో అల్లు అరవింద్, నేను ముందు వరుసలో ఉంటాం. పక్కా కమర్షియల్ మూవీలో టికెట్ల రేట్లను తగ్గించాం. ఈ సినిమాకి నైజాంలో 160(జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్లో రూ.150+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్లో రూ.100+ జీఎస్టీ’గా టికెట్ రేట్లు ఉంటాయి’ అని బన్నీ వాసు స్పష్టం చేశారు. టికెట్ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఆయన చెప్పుకొచ్చారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని, ఎఫ్3కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది’ అని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
బన్నీవాసు మోసం చేశాడు.. గీతా ఆర్ట్స్ ఎదుట సినీ నటి ఆందోళన
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె తనకు న్యాయం కావాలంటూ ఇదే కార్యాలయం ముందు నగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాలంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. రెండు వారాలు గడవకముందే మళ్లీ ఆమె అదే కార్యాలయం ముందు బైఠాయించి గేటుకు వేలాడుతూ నిరసన వ్యక్తం చేసింది. గీతా ఆర్ట్స్ కార్యాలయం ప్రతినిధులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా వినకుండా గేటు ముందే పడుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులను మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటి వరకు ఆమె ఇదే కార్యాలయం ముందు పాతికసార్లు ఆందోళన చేయగా రెండుసార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అయినా ఆమెలో మార్పురాక పోగా తరచూ న్యూసెన్స్కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి: నిర్మాత బన్నీ వాసు
‘‘కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరూ జీరో నుంచి మళ్లీ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఒక సినిమా మొదలు పెట్టడం గొప్ప విషయం’’ అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రానికి ‘యానం’ అనే టైటిల్ ఖరారు చేశారు. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణాకర న్ దర్శకుడు. కేఎస్ఐ సినిమా అన్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ బ్యానర్ లోగోను బన్నీ వాసు, ‘యానం’ టైటిల్ లోగోను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ–‘‘నేను దర్శకత్వం వహించిన నాటకాలు, యాడ్ఫిల్మ్స్కు కరుణాకరన్ వర్క్ చేశాడు. ‘యానం’ తో దర్శకునిగా తను మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్గారు తొలిసారి నిర్మిస్తున్న ‘యానం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అన్నకి థ్యాంక్స్’’ అన్నారు కరుణాకరన్. -
గుడి ముందు బసవన్నతో కిరణ్ అబ్బవరం.. మాస్ లుక్ అదిరింది!
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల సెబాస్టియన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణుకథ’అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తిరుపతిలో జరుగుతుంది. దాదాపు 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో 80శాతం షూటింగ్ పూర్తికానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో గుడి ముందు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్ లో అందరిని అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. Revealing the Massy first look of #VinaroBhagyamuVishnuKatha featuring @Kiran_Abbavaram 🔥💥 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ✨#AlluAravind #BunnyVas @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan #VBVKMovie pic.twitter.com/818DVnhRyR — GA2 Pictures (@GA2Official) April 10, 2022 -
బన్నీ వాసు మోసం చేశాడని ఆందోళన
-
బన్నీ వాసు మోసం చేశాడు.. జనసేన కార్యాలయం ఎదుట..
మంగళగిరి : మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సోమవారం ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బోయ సునీత ఆరోపించింది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే.. తనను మానసిక వికలాంగురాలిగా చిత్రీకరించారని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
ఘనంగా ప్రారంభమైన కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం, టైటిల్ ఇదే..
‘రాజావారు రాణి గారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక అల్లు అన్విత హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కశ్మీరా పర్ధేశీలపై క్లాప్తో చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత బన్నీవాసు కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. ఈ మూవీతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్కు సంబంధించిన పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ను ఖరారు చేశారు. జీఏ2పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా,చావు కబురు చల్లగా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వినూత్నమైన కథతో ఈ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు తెలిపాడు. -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా రివ్యూ
టైటిల్: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెటప్ శ్రీను, మురళీ శర్మ, తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సంగీతం : గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్. వర్మ విడుదల తేది : అక్టోబర్ 15, 2021 మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని సరైన హిట్ కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నాడు. అలాంటిది అతడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేనే మీకు ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు ఎంతో ధైర్యంగా మాటిచ్చాడు. మరి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ద్వారా ఆ మాటను నిలబెట్టుకున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు ఓటీటీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లోనే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మరి దానికి ప్రతిఫలంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ దసరా విన్నర్గా నిలవనుందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ: హర్ష(అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ మంచి ఇల్లు కొంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటాడు. తనకు ఓ జోడీని వెతుక్కునేందుకు హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్లి కూతుళ్లను చూస్తాడు. అందులో ఒకరైన విభ(పూజా హెగ్డే) హీరోకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్షను రిజెక్ట్ చేస్తారు. ఇంతలో విభకు పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదన్న విషయం హర్షకు తెలుస్తుంది. అసలు విభకు పెళ్లంటే ఎందుకు విరక్తి? ఆమెను తనతో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: బొమ్మరిల్లు భాస్కర్ ఎప్పుడూ చిన్న లైన్తోనే సినిమా తీయాలనుకుంటాడు. కథ కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టి మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి మళ్లీ పాత ఫార్మెట్ను ఫాలో కావడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఇక చూపించిందే చూపించి జనాలకు విసుగు పుట్టించాడు డైరెక్టర్. సుమారు పదిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడటం, ప్రశ్న వేయడం, రిజెక్ట్ కావడం.. అంతా ఇదే తంతు.. ఇది చూసినప్పుడు షాదీ ముబారక్ సినిమా గుర్తుకు రాక మానదు. పెళ్లి చూపుల సీన్లు మొదట్లో ఎంటర్టైనింగ్ అనిపించినా రానురాను.. ఇవి ఇంకా అయిపోలేదా? అని ప్రేక్షకుడు తల పట్టుకుంటాడు. ప్రేమ, రొమాన్స్కి తేడా ఏమిటి? అని చర్చించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్ఫ్యూజ్ చేసినట్లు కనిపించింది. ఫస్టాఫ్లోని కొన్ని సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫస్ట్ భాగం అదరహో అనిపించినా సెకండాఫ్ మాత్రం బెదుర్స్ అనిపించక మానదు. సెకండాఫ్లో సినిమా ఫ్లో మిస్ అవుతుంది. ఆరెంజ్ సినిమాలో చేసిన తప్పిదాలే ఇక్కడ కూడా సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రతిదాన్ని సాగదీసి ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా ఊహకందనంత ఎత్తులో ఏమీ లేదు. క్లైమాక్స్ చూశాక ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తారు. ఇంటర్వెల్ సీన్, కోర్టు సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. రెండు, మూడు పాటలు బాగున్నాయి. అయితే సినిమాను మరీ భూతద్దంలో పెట్టి చూస్తే ఆరెంజ్, గీతా గోవిందం, మిస్టర్ మజ్ను, బొమ్మరిల్లు, షాదీ ముబారక్లను మిక్స్ చేస్తే వచ్చిన మిశ్రమ ఫలితంలా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్గా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. టెక్నికల్గా సినిమా బాగుందనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. కొంతమేరకు సంభాషణలు ఆకట్టుకున్నా కొద్ది చోట్ల మాత్రం అవి పెద్ద స్పీచ్లా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికి లేదు. చివరగా.. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా చూసి ఆస్వాదించవచ్చు. అయ్యగారు మొత్తానికి హిట్ కొట్టారనే అంటున్నారు అభిమానులు! -
పారదర్శకత కోసమే ఆన్లైన్ టిక్కెటింగ్
‘‘సినిమా టిక్కెట్ ధరల విషయంలో ప్రభుత్వం (ఆంధ్రప్రదేశ్) వారు మా బాధలు విన్నారు. వాటి పరిష్కార మర్గాల దిశగా ఆలోచిస్తున్నారు’’ అన్నారు నిర్మాత బన్నీ వాసు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానున్న సందర్భంగా బన్నీ వాసు చెప్పిన సంగతలు. ► పెళ్లి చేసుకునేవారు, పెళ్లి చేసుకోవాలనుకునే వారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా చూస్తే జీవితం పై ఓ క్లారిటీ వస్తుంది. పెళ్లికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెబుతారు కానీ పెళ్లి జరిగాక భార్యతో భర్త ఎలా ఉండాలో అబ్బాయికి, భర్తతో భార్య ఎలా ఉండాలో అమ్మాయికి చెప్పే తల్లిదండ్రులు తక్కవ. పెళ్లి ముందే కాదు..పెళ్లి తర్వాత కూడా అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా నడుచుకోవాలో తల్లితండ్రులు నేర్పించాలన్నదే మా సినిమా కాన్సెప్ట్. ► ఆన్లైన్ టిక్కెటింగ్ దాదాపు ప్రతి థియేటర్లో రన్ అవుతోంది. ప్రేక్షకులు ఎన్ని టిక్కెట్స్ తీసుకున్నారన్న సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వంవారు అడుగుతున్నారు. మన ఎగ్జిబిటర్స్లో చాలామంది పన్నులు కట్టడం లేదు. దాదాపు 300 థియేటర్స్ జీఎస్టీ పరిధిలోనే లేవు. ఎంతసేపూ ఇండస్ట్రీ వైపు నుంచే కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచాలన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అప్పుడు ఇండస్ట్రీ వల్ల ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మాకేమైనా చేసిపెట్టండని ప్రభుత్వాన్ని కోరే వీలుంటుంది. చాలామంది ఎగ్జిబిటర్స్ టాక్స్ పరిధిలోకి రావడం లేదు. ఉన్నవారు కూడా సరైన లెక్కలు చూపించడం లేదనేది ప్రభుత్వం వారి భావన. అందుకే ప్రభుత్వంవారు పారదర్శకత కోరుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే డబ్బులన్నీ ముందు ప్రభుత్వంవారు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది కాదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్గారు ఓ రిపోర్ట్ తయారు చేయమ న్నారు. ఆ రిపోర్ట్ వచ్చాక నిర్ణయాలు ఇండస్ట్రీకి సానుకూలంగానే వస్తాయని నమ్ముతున్నాను. -
బన్నీవాసుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీత బోయ
Bunny Vasu And Sunitha Boya: సినీ ప్రొడ్యుసర్ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీవాసు తనను మోసగించిన వైనంపై సోమవారం పోలీసు స్పందన కార్యక్రమంలో అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను కలిసి ఆమె ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు సునీత, ఆమె తల్లి పార్వతమ్మను దిశ పోలీసు స్టేషన్లో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు విచారణ చేశారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. ఫిర్యాదుకు సంబంధించి ఆమె ఆధారాలను అందిస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: (నిర్మాత బన్నీవాసును వేధిస్తున్న యువతి అరెస్టు) -
ఎవరూ మిస్ కారని అనుకుంటున్నా : మారుతి
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా శ్రీని జోస్యుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ చిన్నదా? పెద్దదా? అని కాదు. ఓ క్వాలిటీ ఫిల్మ్ చేశారని చెప్పగలను. టైటిల్ ‘మిస్సింగ్’. కానీ ఈ చిత్రాన్ని ఎవరూ మిస్ కారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మిస్సింగ్’ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘మా కలను నిజం చేసిన మా నాన్న భాస్కర్, హీరో ఫాదర్ శేషగిరి రావులకు రుణపడి ఉంటాను’’ అన్నారు శ్రీని. ‘‘యాక్షన్.. లవ్.. ఎమోషన్ అన్నీ ఉన్న సినిమా ఇది’’ అన్నారు హీరో హర్ష. -
మానసిక క్షోభ అనుభవించా.. గూగుల్ సీఈవోకు బన్నీవాసు లేఖ
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ రాశాడు. సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు లేఖలో వెల్లడించారు. తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో వీడియో పెడితే.. దాన్ని తీయించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందని, చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నేరుగా సుందర్ పిచాయ్ని ప్రశ్నించారు బన్నీవాసు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టతరం అని, అదేంటో స్వయంగా తాను ఫేస్ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బన్నీ వాసు ఈ లేఖ రాశారు. ప్రస్తుతం బన్నీ వాసు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా షూట్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. -
నిర్మాత బన్నీవాసును వేధిస్తున్న యువతి అరెస్టు
Bunny Vasu And Sunitha Boya: ప్రముఖ సినీ నిర్మాతను సోషల్ మీడియా వేదికగా మానసిక వేదనకు గురిచేస్తున్న యువతిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తనకు తాను సినీ నటిగా చెప్పుకునే సునీత బోయ గత కొంత కాలంగా మలక్పేట ప్రాంతంలో పుచ్చకాయలు విక్రయిస్తుంది. గతంలో ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండేవి. దీనిని ఆసరాగా చేసుకొని సినీ నిర్మాత బన్నివాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ చాలా కాలంగా ఆరోపిస్తోంది. పలుమార్లు జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి న్యూసెన్స్ చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమెపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా రెండు కేసుల్లో జైలుకు వెళ్లింది. మరో రెండు కేసుల్లో మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి పంపించి చికిత్స నిర్వహించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక షరా మామూలుగా నిర్మాత బన్నివాసును లక్ష్యంగా చేసుకొని గత జూన్ రెండో వారంలో బన్నివాసు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో తీసి పోస్ట్ చేసింది. దీంతో మరోమారు ఆ కార్యాలయ మేనేజర్ అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె నిర్మాత కార్యాలయానికి వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా మానసిక స్థితి బాగాలేనందున ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా సక్సెస్ క్రెడిట్ ఆ ఇద్దరిదే!
‘‘ఒక కొత్త కథ విన్నప్పుడు మనకో ఊహ ఉంటుంది. కానీ మన ఊహ సరైనదని కాకుండా అవతలివారి విజన్ను అర్థం చేసుకోవాలి. కథలోని పాత్రలను వారి పాయింటాఫ్ వ్యూలో కూడా చూడాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. శుక్రవారం (జూన్11) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు. ► సాధారణంగా కొత్తవారు చెప్పిన స్క్రిప్ట్ మాకు నచ్చితే మేం నిర్మిస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్లో ఆసక్తి ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అంటే మా పర్యవేక్షణలో సాగే సినిమా ప్రొడక్షన్లో వారి భాగస్వామ్యం కూడా ఉంటుంది. ► ‘చావు కబురు చల్లగా’ సినిమా ఫలితం నిరాశపరిచింది. సినిమా అంతా తల్లి పాత్ర మీద ఉంటుంది. ఈ పాత్రను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయాం. ఒక సినిమా థియేటర్స్లో విడుదలై సక్సెస్ అయితే నిర్మాతలకు వచ్చే ఆదాయం ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల రాదు. అందుకే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ థియేటర్స్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలో ఫిఫ్టీ పర్సెంట్ సామర్థ్యంతో థియేటర్స్ రీ ఓపెన్ అవుతాయంటున్నారు. అక్టోబరుకి వందశాతం సీటింగ్ సామర్థ్యానికి అనుమతులు రావొచ్చు. కరోనా థర్డ్ వేవ్ రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే థియేటర్స్ రీ ఓపెన్ అయ్యేది కొత్త ఏడాది జనవరిలోనే. ► ఏదైనా కథ నాకు నచ్చితే ముందు అల్లు అరవింద్గారికి వినిపిస్తాను. ఆయనకు కూడా నచ్చితే సెట్స్పైకి తీసుకుని వెళతాము. అలాగే మా ఇద్దరిలో ఏ ఒక్కరికి కథ నచ్చకపోయినా ప్రాజెక్ట్ను వదిలేస్తాం. ప్రొడ్యూసర్గా నా సక్సెస్ క్రెడిట్ను అల్లు అరవింద్, బన్నీ (అల్లు అర్జున్)గార్లకే ఇస్తాను. వారే నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. ► నేను నిర్మాతగా బన్నీగారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. మంచి ఎంటర్టైనింగ్ కథ దొరికితే 2022 చివర్లో ఈ సినిమా చేయాలనుకుంటున్నాం. దర్శకుడు ప్రశాంత్ నీల్తో అలు ్లఅరవింద్గారు మాట్లాడారు. బన్నీ, ప్రశాంత్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్లో ఓ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ‘పుష్ప’తో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పార్ట్ వన్ తర్వాత ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ఉంటుంది. ► శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఓ కొత్త సినిమా నిర్మించనున్నాను. రాహుల్ రవీంద్రన్ ఓ కథ చెప్పారు. గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమా షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం అవుతుంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల గురించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం. -
టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. జూన్1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ కళ్ళకు గంతలు కట్టేయగా, దానిపై అనుమమ ఏదో రాస్తున్నట్లు ఆసక్తికరంగా పోస్ట్ర్ను డిజైన్ చేశారు. ఇక అనుమమ సైతం పోస్టర్ను షేర్ చేస్తూ.. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. రొమాంటికి ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook pic.twitter.com/JE32WXbrdv — Anupama Parameswaran (@anupamahere) June 1, 2021 చదవండి : సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు! -
సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్..
‘అర్జున్ సురవరం’ హిట్తో జోరు మీదున్న నిఖిల్ చేస్తున్న తర్వాతి చిత్రం 18 పేజెస్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. జూన్1న నిఖిల్ బర్త్డే సందర్భంగా ఫస్ట్లుక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ చేశారు. ఇందులో నిఖిల్ సిగరెట్ తాగుతూ చేతిలో పేపర్ను అంటిస్తున్నట్లుగా ఉంది. దీనిపై ఫస్ట్ లుక్ జూన్1న అని రాసి ఉంది. ఇప్పటికే సినిమాలో టైటిల్ క్యూరియాసిటీని పెంచుతుంది. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి : నిఖిల్కు పోలీసులు షాక్.. అలా చెప్పిన వదల్లేదంటూ ట్వీట్ -
చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్
'చావు కబురు చల్లగా' సినిమా ఓటీటీ బాట పడుతుందనే ఊహాగాలపై సీరియస్ అయ్యాడు నిర్మాత బన్నీ వాసు. సినిమా రిలీజ్ అవకముందే ఓటీటీలోకి వెళ్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నవారి మీద గరమయ్యాడు. "ఇది సందర్భమో కాదో, తెలీదు.. ఏ సినిమా బాగా ఆడినా ఇండస్ట్రీలో అందరం హ్యాపీగా ఫీలవుతాం. ఈమధ్య రెండు సినిమాలు(శ్రీకారం, జాతిరత్నాలు) కూడా చాలా బాగా ఆడుతున్నాయి. నాకు బుక్ అయిన థియేటర్లలో నేను పక్కకు జరిగి మరీ ఆ సినిమాలకు ఇస్తున్నాం. అలాంటి మంచి వాతావరణం ఇండస్ట్రీలో ఉంది. కానీ ఈ రెండ్రోజుల్లో నేను బాగా హర్టైన విషయం ఏంటంటే.. వాళ్లు కొత్తగా వచ్చారో తెలీదు. ఎన్ని సినిమాలు చేశారో తెలీదు.. కానీ, ఈ సినిమా రెండు వారాల్లో ఓటీటీలోకి వెళ్లిపోతుందంటూ పీఆర్వోల ద్వారా తప్పుడు వార్తను జనాల్లోకి పాస్ చేస్తున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. వాళ్ల పేరు చెప్పడం నాకిష్టం లేదు. హెల్దీగా పోటీపడుదాం. మీరు మంచి సినిమాలు తీయండి, మేము మంచి సినిమాలు తీస్తాను. ఎవరి సినిమా బాగుంటే వారిది ఆడుతుంది. ఎలాగో సినిమా బాగుంటే మీడియా వాళ్లు మమ్మల్ని పొగుడుతారు, లేదంటే ఏకుతారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ రాజకీయాల్లో చూశాం. వారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా.. చావు కబురు చల్లగా సినిమా రెండు వారాల్లోనో, మూడు వారాల్లోనో ఓటీటీలో వచ్చేది కాదు. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటే కోవిడ్ టైమ్లోనే ఆహాకు ఇచ్చేవాడిని. కానీ మాకు థియేటర్ అంటేనే ఇష్టం. మీరు చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు.. ఈ సినిమా థియేటర్స్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆలోచిస్తాం" అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. కాగా, చావు కబురు చల్లగా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. చదవండి: 'అక్టోబరు నుంచి డేట్స్ ఉంచమని ఫోన్ చేశాను' -
'చావు కబురు చల్లగా' వైష్ణవ్తో చేద్దామనుకున్నా
‘‘కౌశిక్ ‘చావు కబురు చల్లగా’ పాయింట్ చెప్పినప్పుడు ప్రేక్షకులకు నచ్చుతుందా? అనిపించింది. పూర్తి కథ విన్నాక రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంది.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకెళ్లాం’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు విలేకరులతో చెప్పిన విశేషాలు. ‘చావు కబురు చల్లగా’ని వైష్ణవ్ తేజ్తో చేద్దామనుకున్నాను. అయితే ‘ఉప్పెన’ పూర్తయ్యే వరకు ఏ కమిట్మెంట్ పెట్టుకోలేనని సున్నితంగా చెప్పాడు.. నిజమే కదా అనిపించింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయని తీసుకుంటే బాగుంటుందని కౌశిక్ చెప్పాడు. ‘ఈ సినిమాకి ఎంత సమయం పడుతుందో తెలియదు.. పూర్తయ్యే వరకు వేరే కమిట్మెంట్ పెట్టుకోకూడదు?’ అని కార్తికేయతో చెబితే, సరే అన్నాడు. నా సినిమాలు పూర్తవడానికి ఏడాది, అంతకు మించి సమయం పడుతుంటుంది. సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కాపీ చూసి, ఎక్కడైనా సరిగ్గా రాలేదనిపిస్తే మళ్లీ షూట్ చేస్తాం. ‘చావు కబురు చల్లగా’కి గుమ్మడికాయ కొట్టినా, మళ్లీ మూడు రోజులు షూటింగ్ చేశాం. ‘గీత గోవిందం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలకు కూడా ఏడాదికి పైగానే పట్టింది. అన్ని రోజుల పాటు విజయ్ దేవరకొండ, అఖిల్ వేరే సినిమా చేయలేదు. అందుకే నాతో రెండో సినిమా చేయడానికి హీరోలు ఇష్టపడరేమో (నవ్వుతూ). క్లాస్ స్టోరీని మాస్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యేలా ఎలా తీయాలని ఆలోచిస్తా. పాయింట్ క్లాస్గానే ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ మాత్రం యూనివర్సల్గా ఉంటుంది. అదే నా విజయ రహస్యం. సినిమాలను డైరెక్టుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడం వల్ల నిర్మాతలకు ఒకేసారి డబ్బు వస్తుంది కానీ పెద్దగా లాభం ఉండదు. థియేటర్లో విడుదల చేస్తే.. హిట్ టాక్ వచ్చిందంటే కలెక్షన్లు పెరుగుతాయి. ఆ లాభాలన్నీ నిర్మాతలకే వస్తాయి. కరోనా సమయంలో ఓటీటీలకు కంటెంట్ బాగా అవసరం కావడంతో ఎక్కువ డబ్బు ఇచ్చి సినిమాలు కొన్నారు. కానీ, ఇప్పుడు తక్కువ ధరకే అడుగుతున్నారు. సినిమాని థియేటర్లో విడుదల చేసిన 50రోజుల (చిన్న చిత్రాలు) నుంచి 75 రోజు (పెద్ద చిత్రాలు)లకు కానీ ఓటీటీకి ఇవ్వకూడదు. రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో వస్తే ప్రేక్షకులు థియేటర్లకు రారు. ఓటీటీ వ్యాపారం కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు హీరోల స్టార్డమ్ కూడా పడిపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ వల్ల నిర్మాతలకు, హీరోలకూ నష్టమే తప్ప లాభం ఉండదు. చదవండి: ప్రకాశ్రాజ్తో నటించాలంటే భయం: ఆమని -
భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే..
‘‘ఈ సినిమాలో భర్త చనిపోయిన ఓ యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఈ కథను సెంటిమెంటల్గా దర్శకుడు ఎలా ముందుకు తీసుకువెళ్లాడు? అన్నది సినిమాలో తెలుస్తుంది. బస్తీ బాలరాజుగా కార్తికేయ బాగా చేశాడు. ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటామన్న నమ్మకం ఉంది. అలాగే అక్టోబరు నుంచి డేట్స్ ఉంచమని కార్తికేయకు ఫోన్ చేసి చెప్పాను.. థ్యాంక్స్ సార్ అన్నాడు’’ అని అన్నారు అల్లు అరవింద్. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చావు కబురు చల్లగా...’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా జ్యూక్బాక్స్ విడుదల కార్యక్రమంలో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘హిట్, ఫ్లాప్ గురించి ఆలోచించకుండా బస్తీ బాలరాజు క్యారెక్టర్ చేయాలనుకున్నాను. బన్నీ (అల్లు అర్జున్) కంటే అరవింద్గారే యూత్ఫుల్గా ఉన్నారనిపిస్తుంటుంది నాకు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఓ కొత్త దర్శకుడికి ఇంతకన్నా మంచి లాంచ్ దొరకదని నేను అనుకుంటున్నాను’’ అన్నారు కౌశిక్. ‘‘మాస్ డైరెక్టర్ల మధ్య తిరిగే క్లాస్ కథ ఈ సినిమా. కార్తికేయ యాక్టింగ్ నేచురల్గా అనిపించింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా మాకు తెలి సింది. అరవింద్గారికి సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నప్పటికీ ఈ సినిమా థియేటర్స్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆలోచిస్తాం. డబ్బులు కన్నా సినిమాలు థియేటర్స్లో విడుదలైతేనే బాగుంటుందని నమ్ముతాం మేం. ఇండస్ట్రీ బాగుండాలి. అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఆహ్లాదకరమైన పోటీ మంచిదే. కానీ అనవసర రాజకీయాలు చేయొద్దు’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ఈ కార్యక్రమంలో ఆమని, లావణ్యా త్రిపాఠీ పాల్గొన్నారు. సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటామనే నమ్మకం ఉంది – నిర్మాత అల్లు అరవింద్ -
ప్రయోగాలు చేయాలంటే ధైర్యం కావాలి
‘‘ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ‘చావు కబురు చల్లగా’ చేస్తున్నప్పుడు అది ఎక్స్పీరియ¯Œ ్స చేశాను. ‘క్షణక్షణం’తో అలాంటి ధైర్యం చేసిన వర్లుగారిని, మౌళిగారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగుండటంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూష¯Œ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, జియా శర్మ జంటగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షణ క్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ని ‘బన్నీ’ వాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి సినిమా వరకే అడ్వాంటేజ్.. ఆ తర్వాత వాళ్లు నిరూపించుకోవాల్సిందే’’ అన్నారు. ‘‘క్షణక్షణం’ ట్రైలర్ ఎంత బాగుందో, సినిమా కూడా అంతే బాగుంటుంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘క్షణక్షణం’లో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు కార్తీక్ మేడి కొండ. ‘‘హాలీవుడ్ నిర్మాత వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. అదే ప్యాష¯Œ ను ఉదయ్లో చూశా’’ అన్నారు డాక్టర్ వర్లు. జియా శర్మ, సంగీత దర్శకులు రోష¯Œ సాలూరి, రఘు కుంచె మాట్లాడారు. -
గోపీచంద్- మారుతి సినిమా టైటిల్ ఇదే
మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫిబ్రవరి 14) ఈ సినిమా టైటిల్ని ప్రకటించింది చిత్ర యూనిట్. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. Bless us my next with Macho star @YoursGopichand garu#PakkaCommercial It is..👌#AlluAravind #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/SsAM9brNJ3 — Director Maruthi (@DirectorMaruthi) February 14, 2021 -
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠిలు జంటగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రంలో కౌశిక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్కు ప్రేక్షకుల నుంచి అనుకొని రీతిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజా టీజర్ విడుదల చేసింది. ‘మీ ఆస్పత్రి సిస్టర్’ అంటగా అని సాగే డైలాగ్తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెంట పడుతూ తనని ఏడుపిస్తున్న కొన్ని సీన్లతో ఉన్న ఈ టీజర్తో దర్శకుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మూవీ వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
మారుతి కొత్త సినిమా ప్రకటన.. హ్యూమరస్ వీడియో
‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్లీ మారుతి దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్–బన్నీ వాసు నిర్మించనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్ హీరో. ‘‘సూపర్ డూపర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కించడానికి మారుతి రంగం సిద్ధం చేశారు. గోపీచంద్–మారుతి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే ప్రకటన కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేశాం. ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మారుతి చేయబోయే సినిమాపై వచ్చిన పుకార్లకు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్లో ఓ హ్యూమరస్ వీడియోను విడుదల చేశాం. ఈ వీడియోకి రావు రమేశ్గారి వాయిస్ ఓవర్ బాగా కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బన్నీ వాసు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
సాక్షి, పశ్చిమ గోదావరి: హీరో అల్లు అర్జున్ నిర్మాత బన్నీ వాసును పరామర్శించారు. ఇటీవల వాసు సోదరుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిహారిక వివాహం కావడంతో జోధ్పూర్లో ఉన్న అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో బన్నీ, ఆయన సోదరుడు అల్లు శీరిష్, డైరెక్టర్ సుకుమార్లు సోమవారం బన్నీ వాసు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లులోని ఆయన ఇంటికి వెళ్లారు. నిర్మాత బన్ని వాసును, ఆయన కటుంబసభ్యులను పరామర్శించారు. వాసు సోదరుని మృతి పట్ల సంతాపం తెలిపారు. (చదవండి: నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం) కొంతకాలంగా కిడ్ని సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడ్డ బన్నీ వాసు సోదరుడు సురేష్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శుక్రవారం కన్నుమూశారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం బన్నీ వాసు నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట గీతా ఆర్ట్స్ బ్యానర్లో పని చేసిన బన్నీ వాసు ఆ తర్వాత సహ నిర్మాతగా, అనంతరం నిర్మాతగా మారారు. ఈ క్రమంలో పలు చిత్రాలను నిర్మించిన ఆయన అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’లో నటిస్తున్నారు. (చదవండి: నిహారిక పెళ్లిలో వీళ్లదే స్పెషల్ అట్రాక్షన్..) -
నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం
సాక్షి, పశ్చిమ గోదావరి : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్ అకాల మరణం చెందారు. కిడ్నీలు ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో చేరగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అస్పత్రిలోనే మృతి చెందారు. సురేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా పాలకొల్లుకు చెందిన గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులలో ఒకరు నిర్మాతగా(బన్నీ వాసు) వెలుగొందుచుండగా, పెద్దకుమారుడు సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబందించిన ఇంజనీర్లలో టాప్ 4లో ఒకరుగా ఉన్నారు. డీజిల్, పెట్రోలు 4 వీలర్ వెహికల్ లను సీఎన్జీ(కంప్రెసర్,నేచురల్ గ్యాస్)లోకి కన్వెర్షన్ చేసే కిట్స్ తయారీ కంపెనీ స్థాపించి అగ్రగణ్యునిగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. చదవండి : ప్రముఖ కొరియోగ్రాఫర్కు గుండెపోటు -
‘చావుకబురు చల్లగా’ మొదలైంది
-
'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ
‘ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవలే చేసే ప్రయోగాలు ప్రేక్షకులను మెపించలేకపోతున్నాయి. ఆర్ ఎక్స్ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వెరైటీ టైటిల్, కొత్త గెటప్లో తెరముందుకు రాబోతున్నాడు కార్తికేయ. ఆ వెరైటీ టైటిలే 'చావుకబురు చల్లగా'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలైంది. కౌశిక్ అనే యువదర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా గురువారం విడుదల చేశారు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో ఆయన వున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
ప్రతిరోజూ పండగే అందరి విజయం
‘‘మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కథని నాకు చెప్పినప్పుడు యూత్ఫుల్ ఎలిమెంట్స్ లేవు కదా? అన్నాను. కానీ మారుతి నమ్మకంగా ఉన్నాడు. షూటింగ్ పూర్తయ్యాక సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ ఉన్నాం. థియేటర్స్లో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను పెద్ద హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ఏడాది చివర్లో సాయితేజ్ సక్సెస్ కొట్టాడు. ఈ విజయం అందరిదీ’’ అని అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో నిర్వహించిన ‘ప్రతిరోజూ పండగ సంబరాలు’ కార్యక్రమంలో పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే విజ యాన్ని ఉహించాను. విదేశాలకు వెళ్లిన తర్వాత మనుషుల మధ్య ప్రేమ, అభిమానాలు తగ్గాయి. ఈ పాయింట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాలనుకున్నా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు మారుతి. ‘‘ప్రతిరోజూ పండగే’ సినిమాని సపోర్ట్ చేసున్న వారికి ధన్యవాదాలు. ఈ సక్సెస్ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితమిస్తున్నా’’ అన్నారు సాయితేజ్. ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అరవింద్, వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు తమన్. -
గౌరవంగా ఉంది
‘అర్జున్ సురవరం’తో మంచి హిట్ అందుకున్నారు నిఖిల్. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్, ‘బన్నీ’ వాసు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్–ప్లే సుకుమార్ అందిస్తున్నారు. ‘‘గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. సుకుమార్, ‘బన్నీ’ వాసు, సూర్య ప్రతాప్లతో పని చేయడం ఎగ్జయిటింగ్గా ఉంది’’ అని పేర్కొన్నారు నిఖిల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’
ప్రొడ్యూసర్ బన్నీ వాసు తనను ఎప్పుడు శారీరకంగా హింసించలేదని, తప్పుడు ప్రచారం చెయ్యవద్దని జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత స్పష్టం చేశారు. బన్నీ వాసు తనను శారీరకంగా హింసించాడని వస్తున్న వార్తలను సునీత ఖండిస్తూ... ఓ వీడియోను షేర్ చేశారు. బన్నీ వాసుపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని తన ఫేసుబుక్ ఖాతాలో వీడియో పోస్ట్ ద్వారా తెలియజేశారు. జనసేన పార్టీలో ఉన్న సమయంలో తాను నిర్మాత బన్నీ వాసును ఒకటి రెండు సార్లు స్వయంగా కలిశానని తెలిపారు. తర్వాత ఆయనను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా.. అపాయింట్మెంట్ దొరకలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన్ని కలవడానికే నిరసన చేస్తున్నట్లు తెలిపారు. అంతేగానీ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరారు. కాగా బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్ అక్కినేని నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. -
జనసేన కోసం కష్టపడితే మోసం చేశారు..
బంజారాహిల్స్: సినిమా అవకాశాల పేరుతో ప్రముఖ దర్శకుడు బన్ని వాసు తనను మోసం చేశారని, జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పిన ఆ పార్టీ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ బుధవారం తెల్లవారుజామున ఫిలించాంబర్ గేటుకు తనను తాను గొలుసులతో బంధించుకొని నిరసన తెలిపింది. దీనిని గుర్తించిన సెక్యురిటీ గార్డు పోలీసులకు సమాచారం అందిచడంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపిచేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించింది. తనకు జరిగిన మోసంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించి అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో తాను శ్రీరెడ్డికి సోషల్ మీడియా వేదికగా జనసేన తరపున కౌంటర్ ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. బన్నీవాసు సినిమా అవకాశాల పేరుతో తనను ఎన్నోసార్లు కార్యాలయానికి పిలిపించారని ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా ఫేస్బుక్ లైవ్ద్వారా తనకు జరిగిన అన్యాయాలను వివరించింది. తనపై తప్పుడు ప్రచారం చేసి పోలీస్ స్టేషన్కు పంపించిన వారు ఫిలిం ఇండస్త్రీ నుంచి బ్యాన్ చేయిస్తామని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ బ్యానర్ ఏర్పాటు చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పవన్కళ్యాణ్ దృష్టికి వెళ్లాలనే ఇలా చేసినట్లు తెలిపింది. మూడు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సునీతను ఎట్టకేలకు గొలుసులు తొలగించి స్టేషన్కు తరలించారు. ఆమెపై మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఆరు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కొందరిపై కేసులు పెట్టి సెటిల్మెంట్లు చేసుకున్న వ్యవహారాలు తమ దృష్టికి వచ్చాయని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. చేతినిండా పవన్ కల్యాణ్ పేరు తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానమనీ అందుకే చేతుల నిండా పవన్ కల్యాణ్, జనసేన పేర్లు పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు సునీత తెలిపింది. -
అఖిల్ సరసన?
ముందు జోడీ లేకుండానే అఖిల్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తనతో పాటు ‘గ్యాంగ్లీడర్’ భామ కూడా జాయిన్ కానున్నారని తెలిసింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. నాని ‘గ్యాంగ్లీడర్’లో హీరోయిన్గా నటించిన ప్రియా మోహన్ను అఖిల్ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ప్రయాణం మొదలు
అఖిల్ తన కొత్త ప్రయాణాన్ని ఈ నెల 26 నుంచి మొదలుపెట్టనున్నారని తెలిసింది. మరి ఈ ప్రయాణం ఎందాకా? ఎలా సాగుతుంది? అనేది తెలియాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. జీఎ2 బ్యానర్పై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అఖిల్తో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారో ఇంకా నిశ్చయించలేదు. ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 26న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్లో జర గనుంది. కొంత పోర్షన్ను రెండు దేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. అవేంటో ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. -
సహనం కోల్పోనివ్వకండి
‘థియేటర్స్ దొరకనివ్వకుండా ఓ మాఫియా జరుగుతోంది. సినిమాను సాఫీగా రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. థియేటర్స్ అన్నీ నలుగురైదుగురు చేతుల్లోనే ఉండిపోయాయి’ అంటూ ‘పేటా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సమాధానంగా నిర్మాత ‘బన్నీ’ వాసు, తన సోషల్ మీడియాలో ‘‘ప్రసన్నగారు, తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం హద్దుని దాటడం మాత్రమే మిగిలింది’’ అని రాసుకొచ్చారు. -
స్పీడ్ పెరిగింది
సినిమాల ఎంపిక విషయంలో హీరో నితిన్ స్పీడ్ పెంచినట్లు ఉన్నారు. ఆల్రెడీ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన ‘భీష్మ’ అనే చిత్రానికి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రం ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని సమాచారం. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తారు. దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలు స్వీకరించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తారు. ‘100 పర్సెంట్ లవ్’ సినిమా తర్వాత ‘బన్నీ’ వాసు, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాలో కథానాయికగా ప్రముఖ హీరోయిన్ల పేర్లతో పాటుగా, కొత్త హీరోయిన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు చిత్రబృందం. -
నా లైఫ్లో అది బెస్ట్ కాఫీ
‘‘సినిమా జెన్యూన్ హిట్ సాధించినప్పుడు పెద్ద హీరోలు ఆ సినిమా సక్సెస్ గురించి సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. ఎప్పటికైనా నేను తీసిన సినిమాకు కూడా అలా జరగాలి అనే ఆకాంక్ష ఉండేది. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాను ఎడిట్ రూమ్లో చూసిన బన్నీ (అల్లు అర్జున్)గారు ఆత్మీయంగా హత్తుకున్నారు. అలాగే మూవీ రిలీజ్ తర్వాత మహేశ్బాబు, రామ్చరణ్ స్పందించడం మర్చిపోలేను’’ అన్నారు ‘బన్నీ’ వాసు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. ఈ చిత్రం హిట్ టాక్తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘బన్నీ’ వాసు పంచుకున్న విశేషాలు... ► సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాం. కానీ ఈ రేంజ్ సక్సెస్ను ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీలో మూవీ రిలీజైన రెండో రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీ ‘గీత గోవిందం’. తమిళనాడులో కూడా ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ రోజే దాదాపు 1.18 కోట్ల గ్రాస్ వచ్చింది. షాకయ్యాం. కేరళలో అంత వర్షం కురుస్తున్నప్పటికీ ఫస్ట్ రోజే దాదాపు 14లక్షల గ్రాస్ వచ్చింది. నెక్ట్స్ డే 6 లక్షల గ్రాస్ వచ్చింది. అందుకే కొంత కలెక్షన్ను విరాళంగా ఇద్దాం అనుకున్నాం. ► నిర్మాతగా నాకు ప్రత్యేకమైన సక్సెస్ ఫార్ములా ఏమీ లేదు. సెట్లో నేనొక బ్రదర్లా డైరెక్టర్తో కలిసిపోతా. డైరెక్టర్ని బాగా అర్థం చేసుకుని ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. ప్రాజెక్ట్స్ విషయంలో నాది జడ్డిమెంట్ కాదు.. నమ్మకం. ఈ సినిమాలో పరశురామ్ కూడా ఒక పార్ట్నర్. హీరో విజయ్ దేవరకొండకి పరశురామ్ కథ చెప్పాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా. ఈ కథ వర్కౌట్ అవుతుందా? అని విజయ్ ఆలోచించాడు. అప్పుడు ఏ క్లాస్.. బీ క్లాస్ అని కాదు ఈ సినిమా యూనివర్శల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని చెప్పాను. నా సలహాను విజయ్ బాగా రీసివ్ చేసుకున్నాడు. విజయ్ నిజాయితీ, నిరాడంబరత చాలా బాగుంటాయి. ► ‘అర్జున్రెడ్డి’ రిలీజ్ తర్వాత మా సినిమా గురించి రెండు నెలలు టెన్షన్ పడ్డా. కానీ పరశురామ్ కథను మార్చలేదు. ‘అర్జున్రెడ్డి’ సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేసిన విజయ్ ‘గీత గోవిందం’లో మేడమ్ మేడమ్ అంటూ హీరోయిన్ వెంటపడటం వర్కౌట్ అవుతుందా? అనిపించింది. అసలు సినిమాలో ఇదే కొత్తగా ఉంటుందని విజయ్, పరశురామ్ అన్నారు. వాళ్ల నమ్మకం నిజం అయ్యింది. ఈ సినిమా టైటిల్ క్రెడిట్ పరశురామ్దే. తనతో చేయబోయే మరో సినిమాలో హీరో గాడ్తో ట్రావెల్ అవుతుంటాడు. ► ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారు కరెక్ట్ స్క్రిప్ట్ను ఎంచుకోకపోతే కష్టం. అది స్టార్స్ వారసులైనా సరే. విజయ్ కరెక్ట్గా స్క్రిప్ట్ను ఎంచుకుంటాడు. ఇటీవల రిలీజైన ‘గూఢచారి’ స్క్రిప్ట్ ను అడివి శేష్ బాగా రాసుకున్నారు. ► ‘గీత గోవిందం’ సినిమా లీకేజ్ విషయం బాగా బాధించింది. హర్డ్డిస్క్లో డిలిటైన ఫైల్ను రిట్రీవ్ చేశారనిపిస్తోంది. హైప్ కోసం మేమే ఫుటేజ్ని లీక్ చేశామనే వార్తల్లో నిజం లేదు. కోట్లు పెట్టి సినిమా తీసి అలా ఏ నిర్మాతా చేయడు. ఒకవేళ పోలీస్ పరిశోధనలో మా వైపు తప్పు ఉంటే పోలీస్ వ్యవస్థ ఊరుకోదు కదా. మేమే లీక్ చేశామనే థాట్ ఉన్నవాళ్ల సినిమా రిలీజ్ ముందే ఆన్లైన్లో వస్తే అప్పుడు మా బాధ అర్థం అవుతుందేమో. ► ఇంతవరకు చిరంజీవిగారితో 5 నిమిషాలు గడిపింది లేదు. కానీ ఈ సినిమా డిస్కషన్లో భాగంగా ఆయనతో దాదాపు గంటసేపు మాట్లాడే అవకాశం దక్కింది. అప్పుడు ఆయనతో నేను తాగిన కాఫీ నా లైఫ్లో బెస్ట్ కాఫీ. ► బన్నీ మూవీ గురించి త్వరలో అనౌన్స్ చేస్తాం. -
తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే
‘‘ఓ మంచి సినిమా తీసినప్పుడు ఉండే ఆనందం అనుకోని సంఘటనలు జరిగితే బాధగా మారుతుంది. గుంటూరులో ఉన్న తన మరదలి మెప్పు కోసం ఒక కుర్రాడు సినిమాని బయటపెట్టేశాడు. ఇది కావాలని చేసిన నేరమని అనడంలేదు. తెలిసి చేíసినా తెలియక చేసినా పెద్ద నేరమే’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రం కొంత భాగం ఆన్లైన్లో లీక్ అయిందని చిత్రబృందం ఆవేదన వ్యక్తం చేసింది. పైరసీ గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో పైరసీ ఎవరు చేసినా 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. రిలీజ్ కాని మా సొత్తును మీరు (పైరసీదారులు) తీసుకోవడం దొంగతనం. సినిమా తీసేవాళ్లందరం సినిమాను దాచుకోవడానికి డీఐటి అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ పని చేసే ఒక కుర్రాడు చేసిన తప్పు ఇది. అలా మా సినిమా వైరల్ అయింది. పోలీస్ విచారణ జరుగుతోంది’’ అన్నారు. ‘‘రాత్రి (ఆదివారం జరిగిన ప్రీ–రిలీజ్ వేడుక) నేను అరవింద్గారి స్పీచ్ విన్నాను. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండాలా? లేదా అని అనడం బాధగా అనిపించింది. ఎవరో కొంతమంది సరదాగా చేసిన పనికి ఇంత పెద్ద మనిషి బాధపడటం ఏంటి? హెచ్చరిక అనుకోండి.. రిక్వెస్ట్ అనుకోండి. ఇటువంటి తప్పులు జరిగితే క్షమించం. సినిమా అనేది మా ప్రాణం’’ అన్నారు ‘దిల్’ రాజు. పి. కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఉద్యోగం కోసం ఇండస్ట్రీకి వస్తుంటారు. నమ్మి ఉద్యోగం ఇస్తే, ఇలాంటి మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? దయ చేసి స్టూడెంట్స్ ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. పైరసీ అనేది ఒక మేజర్ క్రైమ్. చిన్నప్పటి నుంచి పిల్లలకు దొంగతనం చేయకూడదని చెప్పినట్టు పైరసీ కూడా చేయకూడదని ప్రతి ఒక్కరికీ చెప్పాలి’’ అన్నారు. ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ – ‘‘నాకు ఆరున్నర సంవత్సరాల కొడుకు, మూడున్నర సంవత్సరాల పాప ఉన్నారు. వాళ్లను చూసి 12 రోజులు అయింది. ఎడిటింగ్ రూమ్లో మేం పని చేసుకుంటుంటే మా సినిమా లీక్ అయిందని ఎవరో చెప్పారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. ఈ విషయంలో సహాయం చేసిన గుంటూరు ఎస్పీకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫిర్యాదు చేసిన గంట లోపలే ఏ సిస్టమ్ నుంచి ఈ వీడియోను అప్లోడ్ చేశారో మాకు సమాచారం ఇచ్చారు. 12 గంటల లోపే 40 మంది టీమ్తో ఈ పైరసీ జరుగుతున్న రెండు హాస్టల్స్ మీద దాడి చేశారు. దాదాపు 27 మందిని అరెస్ట్ చేశారు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీశాం. ఇంకో కోటి రూపాయిలు పెట్టి ఆ దొంగలందర్నీ పట్టుకుంటాం. ఇది పైరసీ కేసు కాదు. దొంగతనానికి సంబంధించిన కేసు. దీనిలో భాగస్వాములైన స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది బాధపడాల్సిన విషయం అయినప్పటికీ వాళ్లు శిక్షార్హులని నా అభిప్రాయం’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా కథను ఓకే చేయించుకోవడానికి ప్రతి డైరెక్టర్కి దాదాపు రెండున్నరేళ్లు పడుతుంది. ఈ ప్రయాణంలో దాదాపు 100సార్లు ఆ కథ చెప్పాలి. నిర్మాతలకు, ఆర్టిస్టులకు అనుగుణంగా మార్చుకొని తల బద్దలు కొట్టుకొని ఒక సినిమా తీస్తాం. ఇన్ని కష్టాలు పడి సినిమా తీస్తే దాన్ని జనం దాకా తీసుకువెళ్లడానికి ఎన్ని కష్టాలు పడాలి? గర్భంలో బిడ్డను 9 నెలలు మోసి ఆ కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి దానితో సెల్ఫీలు దిగి ఆనందపడే పరిస్థితుల్లో ఉన్నట్లుగా మా సినిమా రిలీజ్కి రెడీ అయిన సమయంలో ఊహించని షాక్. మా జీవితాలతో ఆడుకోవద్దు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘మేం సినిమా చేసేదే థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూద్దాం అని. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థకి జరిగింది కాబట్టి ‘మేం ఉన్నాం. నువ్వేం బాధపడొద్దు’ అని అరవింద్గారు ధైర్యం చెప్పారు. అదే ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి చిన్న సినిమాలకు ఇలా జరిగితే మేం ఉండేవాళ్లం కాదు. స్టూడెంట్స్ అంతా మనవాళ్లే అని ముద్దుగా వాళ్లను రౌడీస్ అని పిలుచుకుంటాను. స్టూడెంట్సే నన్ను అర్థం చేసుకోకుండా నా సినిమాను బయటకు తీసుకువస్తే నేనెవరికి చెప్పుకోవాలి? ఎడిటింగ్, సౌండ్ సరిగ్గా లేని కంటెంట్ని చూస్తే ఏం మజా వస్తుంది? ఇప్పుడు సినిమా చేయడంకంటే ఆ సినిమా పైరసీ కాకుండా చూడటమే ముఖ్యం అనిపిస్తోంది’’ అన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ పాల్గొన్నారు. -
పోసాని వ్యాఖ్యలకు బన్నీవాసు మద్దతు
నంది అవార్డుల వివాదాన్ని తెరమీదకు వచ్చింది బన్నీ వాసు ఫేస్ బుక్ పోస్ట్ తోనే.. ఇటీవల ప్రకటించిన అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిదంటూ బన్నీ వాసు స్పందించిన తరువాతే ఇంత వివాదం రాజుకుంది. నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించటంపై పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. తాజాగా బన్నీవాసు మరోసారి ఈ వివాదం పై స్పందించారు. పోసాని వ్యాఖ్యలు మద్దతు పలుకుతూ 'మనం ఏపీలో పుట్టాం.. ఏపీలో పెరిగాం.. ఏపీలోనే చదువుకున్నాం.. అమెరికాలో కాదు. మనం ఏపీ వాళ్లమని రుజువు చేసువాల్సిన అవసరం లేదు' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. -
నంది అవార్డులు... విమర్శలు–వివాదాలు!
వడ్డించేవాడు మనవాడయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని తెలుగులో ఓ సామెత! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంలో కొందరు ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు. ‘అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో!’ అంటున్నారు కొందరు నెటిజన్లు. సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు బాహాటంగానే విమర్శించారు. ‘రుద్రమదేవి’ తీసినందుకు క్షమించండి: గుణశేఖర్ ‘మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా?’ అనడుగుతున్నారు ‘రుద్రమదేవి’ దర్శక–నిర్మాత గుణశేఖర్. ‘‘మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’ మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎందుకు ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయింది. మరచి పోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి, సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులు ఇచ్చి గుర్తు చేయడం ఎందుకు అనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారా? అదే అయితే... ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి’’ అని గుణశేఖర్ పేర్కొన్నారు. మెగా హీరోలందరూ నటన నేర్చుకోవాలి: ‘బన్నీ’ వాసు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్లో పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించిన ‘బన్నీ’ వాసు నంది అవార్డులు ప్రకటన వచ్చిన తర్వాత ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించడానికి, మెగా హీరోలందరూ టీడీపీ ప్రభుత్వం దగ్గర నటనలో మెళకువలు నేర్చుకోవాలి’ అని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అనంతరం ‘‘ఏదో సినిమాకు అవార్డు వచ్చిందనో? మాకు రాలేదనో? కామెంట్ చేయలేదు. 2014లో ‘రేసుగుర్రం’ ఎంత ప్రజాదరణ పొందిందో... అందరికీ తెలిసిందే. ఉత్తమ చిత్రంతో పాటు చాలా కేటగిరీలు ఉన్నాయి. ‘రేసుగుర్రం’ను దేనికీ కన్సిడర్ చేయకపోవడంతో అప్సెట్ అయ్యా. 2012లో ‘గబ్బర్సింగ్’ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే చేశారు. ఒకవేళ... ఈ రెండూ కమర్షియల్ సినిమాలని పక్కన పెడితే, ఇప్పుడు అవార్డులకు ఎంపిక చేసినవాటిలో 75 శాతం కమర్షియల్ సినిమాలే ఉన్నాయి కదా? వాటికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మా రెండు సినిమాలను ఎందుకు పక్కన పెట్టారు? తెలియడం లేదు’’ అని ‘బన్నీ’ వాసు పేర్కొన్నారు. మారుతి కామెడీ దర్శకుడు మారుతి మంగళవారం ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో నటుడు ఉత్తేజ్ ‘ఉత్తమ అత్త, మేనత్త, అమ్మ, అక్క, చెల్లి, అత్యుత్తమ చెల్లి’ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఉత్తమ సవతుల్లో అయితే వన్, టు, త్రీ అవార్డులు ఉంటాయి. ఇదంతా చూస్తున్న వ్యక్తి (నటుడు– రచయిత హర్షవర్ధన్) ‘ఒరేయ్! ఈ అవార్డ్స్ మన కోసం ఎరేంజ్ చేసినవేనా!’ అనడిగితే? పక్కన ఉన్న వ్యక్తి (నటుడు గుండు హనుమంతురావు) ‘ఇండస్ట్రీలో బాలాజీకి ఉన్న పరిచయస్తులకు ఏర్పాటు చేసినవి’ అంటాడు. ఈ వీడియో ఓ సీరియల్కి సంబంధించినది. నంది అవార్డులను ఉద్దేశించే సెటైరికల్గా మారుతి పోస్ట్ చేశారని పలువురి నెటిజన్ల ఫీలింగ్! లెజెండ్కు ఎక్కువ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది : బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం అమరావతి అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు అవార్డులు గెలుచుకున్నవారికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి అవార్డుల ఎంపికకు మంచి స్పందన వచ్చిందన్నారు. -
'టీడీపీ ప్రభుత్వాన్ని చూసి నటన నేర్చుకోవాలి'
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను అవార్డులు ప్రకటించగా కేవలం ఒక్క అల్లు అర్జున్ కు అది కూడా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరిలో అవార్డు ప్రకటించటంపై విమర్శలు వస్తున్నాయి. చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించినా.. ఇతర హీరోలను పరిగణలోకి తీసుకోకపోవటం విమర్శలకు కారణమవుతోంది. మెగాఫ్యామిలీకి సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సహ నిర్మాతగా వ్యవహరించే బన్నీవాసు, అవార్డుల ఎపింకపై సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే తక్షణం చంద్రబాబు సర్కార్ వద్ద శిక్షణ తీసుకోవాలి అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. అవార్డు ప్రకటించిన మూడేళ్ల సమయంలో మెగా హీరోలు నటించిన పదిహేనుకుపైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి వీటిలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు, ధృవ, గోవిందుడు అందరివాడేలే.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు కమర్షియల్ గాను ఘనవిజయాలు సాధించాయి. కానీ ఈ సినిమాలకు గాను ఆ హీరోలకు ఏ అవార్డులు దక్కలేదు. గతంలోనూ నంది అవార్డుల ఎంపిక వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికార పార్టీ వ్యక్తులకు, జ్యూరీ సభ్యుల అనుయాయులకు మాత్రం అవార్డులు దక్కుతాయన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ విమర్శలపై నంది అవార్డుల జ్యూరీ, టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
సింగిల్ సిట్టింగ్లో ఓకే!
2016లో వరుసగా ‘సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ’ లాంటి హ్యట్రిక్ సూపర్హిట్స్తో దూసుకుపోతున్న గీతా ఆర్ట్స్కి అనుభంద సంస్థ జీఏ 2 బ్యానర్లో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్ని వాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతా ఆర్ట్స్లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయాన్ని సాధించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరుశురాం (బుజ్జి) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై ట్రెండింగ్ సక్సెస్ సొంతం చేసుకున్న ‘పెళ్ళి చూపులు’తో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ దేవరకొండ ఇందులో హీరో. నాగచైతన్యతో ‘100% లవ్’, సాయిధరమ్తేజ్తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, నానితో ‘భలే భలే మగాడివోయ్’ వంటి విజయాల తర్వాత ఇప్పడు విజయ దేవరకొండతో బన్ని వాసు ఈ చిత్రం నిర్మించనున్నారు. 2016లో సౌత్లో నాలుగు విజయాలు సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్ గీతా ఆర్ట్స్కి విజయాలు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవుతూ నిర్మాత అల్లు అరవింద్ తన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా చూసుకుంటారు. అంతే కాదు ఎంతోమంది నిర్మాతలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అత్యంత భారీగా ఆయన నిర్మించిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరైనోడు’. ఈ చిత్రం సమ్మర్లో విడుదలై, భారీ కలెక్షన్లతో బన్ని కెరీర్లోనే బెస్ట్ రెవిన్యూ ఫిల్మ్గా నిలిచింది. అలాగే అల్లు శిరీష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాన్ని పక్కా ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇది కూడా అల్లు శిరీష్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. 2016 చివరిలో విడుదలైన స్టైలిష్ ఎంటర్టైనర్గా అందిరి హృదయాలు దోచుకుని మెగా పవర్స్టార్ రామ్చరణ్ 2016 బెస్ట్ రెవిన్యూ ఫిల్మ్గా ‘ధృవ’తో తెలుగులో హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే తెలుగులో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని కన్నడ భాషలో నిర్మించారు. డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పడు పరుశురాం దర్శకత్వంలో విజయ్దేవరకొండ హీరోగా బన్ని వాసు నిర్మాతగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకుడి ఆనందమే ముఖ్యం చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ప్రతి ప్రేక్షకుడు ఆనందం పొందాలనే సంకల్పంతోనే చిత్రాలు రూపొందిస్తున్నాం. 2016లో మాస్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, స్టైలిష్ ఎంటర్టైనర్... ఇలా మూడు వైవిధ్యమైన జానర్లో చిత్రాలు చేశాం. అవి సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా ఆదరణ పొందాయి. ఇక నుండి వచ్చేవి కూడా ఇలానే మంచి చిత్రాలుగా ఆదరణ పొందే విధంగా చేస్తాం. పరుశురాం చెప్పిన కథ చాలా బాగుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు. సింగిల్ సిట్టింగ్లో ఓకే నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ – ‘‘అల్లు అరవింద్గారు నిర్మాతగా 2016లో నిర్మించిన మూడు చిత్రాలు సూపర్హిట్స్ కావడం హ్యపీగా వుంది. పరుశురాంగారు చెప్పిన కథ అరవింద్గారికి చాలా నచ్చింది. వెంటనే నాకు వినిపించారు. సింగిల్ సిట్టింగ్లోనే నాకు నచ్చింది. పరుశురాంగారి విజన్ సూపర్గా వుంటుంది. చాలా చిత్రాలు ప్రూవ్ అయ్యాయి కూడా. ‘భలే భలే మగాడివోయ్’లాంటి సూపర్ డూపర్ హిట్ తరువాత జీఏ2 బ్యానర్లో గ్యాప్ తీసుకున్నాం. చేస్తే ఆ రేంజి విజయాన్ని సాధించే చిత్రాలు చేయాలనే సంకల్పంతో గ్యాప్ తీసుకున్నాం. ఇప్పడీ కథ ఆ రేంజిలో వుందనే నమ్మకంతో ఓకే చేశాం. అల్లు అరవింద్ గారు సమర్పణలో ఈ చిత్రం అతి త్వరలో సూపర్ టెక్నిషియన్స్తో భారీ తారాగణంతో సెట్స్ మీదకి వెళ్ళనుంది’’ అన్నారు. డబుల్ లక్! దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ – ‘‘గీతా ఆర్ట్స్లో ఒక్క చిత్రం చేయటం లక్ అంటారు. నేను వరుసగా రెండవ చిత్రం కూడా చేసే డబుల్ లక్ని అరవింద్గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది’’ అన్నారు. -
ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది
- బన్నీ వాసు ‘‘ఏ సినిమాకైనా దర్శకుడు హార్స్లాంటివాడు. ఆ హార్స్ సరిగ్గా వెళుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతది అని ఓ సందర్భంలో అల్లు అరవింద్గారు అన్నారు. ఆ మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఓ నిర్మాతగా సినిమాకి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను’’ అని బన్నీ వాసు అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్స్ వంశీ , జీఏ2 బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలతో పాటు ఇతర విశేషాలను బన్నీ వాసు చెప్పుకొచ్చారు. * విభిన్న ఇతివృత్తాలతో యూత్ఫుల్ చిత్రాలు చేయాలన్నదే మా జీఏ2, యూవీ క్రియేషన్స్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మా ముందు పెట్టింది అల్లు అరవింద్గారే. జీఏ2కి నేను, శిరీష్, యూవీకి వంశీ నిర్మాతలం. కాన్సెప్ట్ విషయంలో, సినిమాలు తయారు చేసే విధానంలో అరవింద్గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ‘‘కథను నమ్ముకుని బడ్జెట్ పెట్టాలి. హీరోను బట్టి బడ్జెట్ పెట్టొద్దు’’ అని అరవింద్గారు చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. * రెండేళ్ల క్రితం మారుతి ‘భలే భలే మగాడివోయ్’ కథ చెప్పాడు. కథ వింటున్నప్పుడు లెక్కలేనన్ని సార్లు నవ్వుకున్నాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. నేను విన్నదానికన్నా విజువల్గా ఇంకా బాగుంది. మారుతి కథ చెప్పినప్పుడు వంద శాతం నవ్వొస్తే, నాని ఆ కథను తన నటన ద్వారా ఆవిష్కరించిన తీరుకి రెండు వందల శాతం నవ్వొచ్చింది. * మారుతి ఈ కథ చెప్పినప్పుడే నాని అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే, ఈ సినిమా మొత్తం హీరో ఎంటర్టైన్మెంట్ మీద సాగుతుంది. నాని హండ్రడ్ పర్సంట్ మంచి టైమింగ్ ఉన్న హీరో. ఈ సినిమాలో తనకు మతిమరుపు ఉంటుంది. అది ప్రేయసికి తెలియనివ్వకుండా భలే మ్యానేజ్ చేస్తుంటాడు. అందుకే ‘భలే భలే మగాడివోయ్’ అని టైటిల్ పెట్టాం. నాని బ్రహ్మాండంగా చేశాడు. అరవింద్గారు ఎడిటింగ్ టైమ్లో చూసి, ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు నానీకి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చెయ్యి. తనతో ఇంకో సినిమా చేద్దాం’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’లో సీరియస్గా కనిపిస్తుంది. ఇందులో కామెడీ కూడా చేసి, బాగా నటించింది. * హీరోకి మతిమరుపు అంటే ‘గజిని’ సినిమా గుర్తుకు రావడం సహజం. కానీ, ఆ సినిమాకీ ఈ సినిమాకీ పోలికే లేదు. అది యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం కామెడీ వేలో సాగుతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ ఉండవు. కథలో భాగంగానే కామెడీ సాగుతుంది. * ఈ చిత్రాన్ని ప్రభాస్ చూసి, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఎడిటింగ్ టైమ్లో బన్నీ (అల్లు అర్జున్) చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. సీన్స్లో కానీ డైలాగ్స్లో కానీ వెతికినా కూడా ద్వంద్వార్థాలు కనిపించవు. ఈ చిత్రం చూడ్డానికి థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకు వెళతారు. * మారుతి, నేను రూమ్మేట్స్. వంశీ, నేను లాస్ట్ టెన్ ఇయర్స్గా డిస్ట్రిబ్యూషన్లో పార్టనర్స్. నాని, వంశీ ఫ్రెండ్స్. సో.. నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసిన చిత్రం ఇది అనొచ్చు. వంశీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి ముందుంటాడు. సంగీత దర్శకుడిగా గోపీసుందర్ని తీసుకుందామని వంశీ, మారుతీయే అన్నారు. పాటలు సక్సెస్ అయ్యాయి. రీ-రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది, * ‘ప్రేమకథా చిత్రమ్’లో ఓ రెండు రీళ్లు పడీ పడీ నవ్వుకుంటాం. ఈ సినిమాలో అలా నవ్వుకోవడానికి నాలుగు రీళ్లు ఉంటాయి. సినిమా మీద నమ్మకంతో ఓన్గా రిలీజ్ చేస్తున్నాం. * వంశీ, నేను వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. మున్నా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం, ప్రభాకర్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నాం. ఓ రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. -
కెమిస్ట్రీ అదిరింది!
‘‘నా కెరీర్కి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేశాను. నా పాత్ర మాత్రమే కాదు.. లావణ్య పాత్ర కూడా చాలా బాగుంటుంది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది’’ అని నాని చెప్పారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 క్రియేషన్స్, యూవీ క్రియేషన్స్ పతాకంపై నాని, లావణ్య త్రిపాఠి జంటగా బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మారుతి మాట్లాడుతూ -‘‘రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నాని, లావణ్య త్రిపాఠి మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వెన్నెల కిషోర్, నాని కాంబినేషన్లో వ చ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. పాటలు ఓ హైలైట్గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘గోపీ సుందర్ చాలా మంచి పాటలు అందించారు. కుటుంబ సమేతంగా అందరూ హాయిగా ఆస్వాదించే సినిమా అవుతుంది. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నిజార్ షఫీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్. -
‘కొంత్త జంట’ మూవీ న్యూ స్టిల్స్
-
కొత్తగా ఉండే జంట
‘‘ఈ ప్రచార చిత్రం బావుంది. దర్శకుడు మారుతి కొత్త జంటను కొత్తగా ఆవిష్కరించాడు’’ అని అల్లు అరవింద్ చెప్పారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ‘కొత్త జంట’ ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్లో జగపతిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లా డుతూ -‘‘ఈ టీమ్ ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. బన్నీ వాసు దగ్గరుండి ఈ సినిమా రూపొందించాడు’’ అన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేయాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని మారుతి చెప్పారు. ఈ నెల 12న పాటలను, మే 1న చిత్రాన్ని విడుదల చేస్తామని బన్నీ వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్, జెబి, డీఎమ్కె, బాబు నాయక్, రావిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.