Causes
-
Breast Abscess బాధాకరమైన రొమ్ము గడ్డలకు కారణాలు, చికిత్స
రొమ్ము ఇన్ఫెక్షన్ అనేది స్త్రీ స్తనములలో చీముతో కూడిన బాధాకరమైన నొప్పిని రొమ్ము అబ్సెస్(Breast Abscesses) అంటారు. రొమ్ము గడ్డలు మాస్టిటిస్ యొక్క సాధారణ పరిణామం. మాస్టిటిస్ అనేది రొమ్ములలో వాపు మరియు నొప్పిని కలిగించే ఇన్ఫెక్షన్. పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఈ పరిస్థితికి గురౌతారు.రొమ్ము గడ్డలకు కారణంరొమ్ము గడ్డలు ఈ క్రింది కారణాల వల్ల సంభవిస్తాయి:మాస్టిటిస్ అని పిలువబడే రొమ్ము ఇన్ఫెక్షన్లు రొమ్ము చీముకు అత్యంత సాధారణ కారణం. మాస్టిటిస్ అనేది రొమ్ము కణజాలాన్ని, ముఖ్యంగా పాల నాళాలు మరియు గ్రంథులను ప్రభావితం చేసే ఒక తాపజనక పరిస్థితి. ఈ పరిస్థితి సాధారణంగా తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో సంభవిస్తుంది.చనుమొన నొప్పి లేదా పగిలిన చనుమొన ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఎక్కువగా తల్లిపాలు ఇవ్వని మహిళల్లో రొమ్ము గడ్డలుఏర్పడతాయి. ఏదైనా మచ్చల కారణంగా కూడా చనుమొన నాళాలు మూసుకుపోయినప్పుడు రొమ్ము గడ్డలు ఏర్పడవచ్చు.రొమ్ము అబ్సెసెస్ లక్షణాలుస్తనముల వాపు, బాధాకరమైన నొప్పి,వేడిగా ఉన్న రొమ్ము, చనుమొన నుండి చీము లేదా స్రావం కారడం,తలక్రిందులుగా ఉన్న చనుమొనలు, చలి,వికారం మరియు వాంతులు,అధిక శరీర ఉష్ణోగ్రత లేదా జ్వరం మొదలగునవి వుంటాయి.రొమ్ము అబ్సెసెస్ నిర్ధారణరోగి చరిత్రవైద్యులను సందర్శించి నపుడు సాధారణంగా లక్షణాలను రొమ్ము నొప్పి, వేడి, ఎరిథెమా (చర్మం ఎర్రగా మారడం) మరియు రొమ్ములలో వాపును కూడా డాక్టరుకు తెలియచేయాలి తల్లిపాలు ఇచ్చే సమాచారాన్ని తెలియచేయాలి.వైద్యుడు గతంలో ఏవైనా రొమ్ము ఇన్ఫెక్షన్లు మరియు వాటి చికిత్స గురించి కూడా విచారిస్తారు.మధుమేహం వంటి వైద్య చరిత్రను వైద్యుడికి తెలియజేయాలి.క్లినికల్ పరీక్షవైద్యుడు రోగ నిర్ధారణ చేయడానికి శారీరక పరీక్షను చేస్తారు. వైద్యుడు రొమ్ములో చీము ఉందని అనుమానించినట్లయితే, రోగ నిర్ధారణను నిర్ధారించడానికి గడ్డ యొక్క ఆస్పిరేషన్ నిర్వహించబడుతుంది. అటువంటి సందర్భంలో, రొమ్ము గడ్డలు చీముతో నిండి ఉందో లేదో చూడటానికి వాపు ఉన్న ప్రదేశంలోకి ఒక సూదిని చొప్పించబడుతుంది.అసౌకర్యం మరియు వాపు చీము వల్ల సంభవిస్తాయో లేదో నిర్ధారించడానికి వైద్యుడు రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్ను కూడా సిఫారసు చేయవచ్చు.రొమ్ము అబ్సెసెస్ చికిత్సఇంటి నివారణలు: ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము కణజాలానికి వెచ్చని మరియు తేమతో కూడిన కంప్రెస్లను ఇవ్వవచ్చు.ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము నుండి చీము కారుతున్నట్లయితే, స్త్రీలు బ్రాను ధరించే ముందు చనుమొనను సున్నితంగా కడిగి, గాలికి ఆరనివ్వాలివాపు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రొమ్ములపై 10-15 నిమిషాలు ఐస్ లేదా కోల్డ్ ప్యాక్ను ఉంచవచ్చు. తల్లి పాలిస్తున్నటువంటి స్త్రీలైతే పాలు ఇచ్చే సమయం లో మధ్య విరామాలలో ఇలా చేయండి : పాలు తాగేటప్పుడు బయటి అంచు నుండి చనుమొన వరకు రొమ్మును మసాజ్ చేయండి, ఇది పాల ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి మరియు అడ్డుపడే పాల నాళాలను తొలగించడానికి సహాయపడుతుంది.మందులుపారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులతో నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించవచ్చు. ఈ మందులు పాలిచ్చే తల్లులు తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. రొమ్ము గడ్డలు నివారించడానికి ముందు లేదా తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడవచ్చు.చికిత్సరొమ్ము చీముకు ప్రాథమిక చికిత్స ఏమిటంటే, రొమ్మును నుండి చీమును తొలగించడం.వైద్యుడు చీమును తొలగించడానికి ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు:సూది ద్వారా చిమును బయటకు తీయడం. ఈ పద్ధతిలో, లక్ష్య ప్రాంతంలోకి ఒక సూదిని చొప్పించి, చీమును బయటకు పీలుస్తారు.కోత ద్వారా చీమును బయటకు పంపడం: ఇందులో ద్రవంతో నిండిన గడ్డపై చిన్న కోత చేసి దానిని పూర్తిగా బయటకు వచ్చేలా చేయడం జరుగుతుంది.- L. ఉమాపతి MA PGDHE(Dr. MGR MU) Chennaiవిశ్రాంత డెమో వైద్య ఆరోగ్య శాఖ అనంతపురం జిల్లా -
SLBC Tunnel: భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ కాలువ (ఎస్ఎల్బీసీ) నిర్మాణం పూర్తయితే... దేవరకొండ, నకిరేకల్, నల్లగొండ, నార్కెట్పల్లి మండలా ల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరొ స్తుంది. 500కు పైగా ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు తాగునీరు వస్తుంది.అందుకే ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టాయి. అయితే గత నాలుగేళ్లకు పైగా ఎస్ఎల్బీసీ సొరంగంలో రూఫ్ (పై స్లాబ్) నుండి భారీ నీటి జలలు (ఊటలు) వస్తున్నాయి. ఈ జల ప్రవా హాన్ని శాస్త్రీయంగా అరికట్టడంలో జరిగిన తీవ్రమైన వైఫ ల్యమే ఈ ఘోర విపత్తుకు కారణం. ప్రమాదాన్ని అంచనా వేయడంలో రాబిన్సన్, జేపీకంపెనీలు; తెలంగాణ నీటిపారుదల శాఖ విఫల మయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ గత పదేళ్ల పాలనలో 11 కిలోమీటర్లు దాటి సొరంగం తవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొరంగ నిర్మాణం కోసం భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. కానీ పొంచి ఉన్న భారీ విపత్తును గుర్తించడంలో విఫలమైంది. సొరంగం పైకప్పు నిమిషానికి 5 నుండి 8 వేల లీటర్ల నీటినీ, బురదనూ కుమ్మరిస్తోంది. ప్రభుత్వానికి నీటి ఊటను శాశ్వతంగా పరిష్కరించే ఆలోచనే లేదు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోని, ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్మించని నిర్మాణాలు ఎంత గొప్పవైనా... ప్రకృతి వాటిని ధ్వంసం చేస్తుంది. ఇందుకు ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినందునే, అన్నారం– సుందిళ్ళ బ్యారేజీలలో భారీ లీకేజీ, సీపేజీలు కొనసాగుతున్నాయి. ప్రకృతి నియ మాలను అర్థం చేసుకొని నిర్మించిన నిర్మాణాలనే ప్రకృతి పరిరక్షిస్తుంది. తద్విరుద్ధమైన ఎంతటి అధునాతన నిర్మాణా న్నైనా ప్రకృతి ధ్వంసం చేస్తుంది. కాళేశ్వరం (మేడిగడ్డ) నిర్మించిన నాలుగేళ్లకే అది ఐదు అడుగుల మేర భూగర్భంలోకి ఎందుకు కుంగిపోయింది? ఎందుకు నిట్ట నిలువునా మూడున్నర అడుగుల వెడల్పుతో చెక్కలై, పునాది నుండి చీలిపోయింది? ఏడో బ్లాక్లోని 11 గేట్లు కూల్చి మళ్లీ నిర్మించాలని, ఇటీవలే విడుదలైన ఎన్డీఎస్ఏ తుది నివేదికఎందుకు పేర్కొంది? బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునాదుల్లోంచి సిమెంట్, కెమికల్ గ్రౌటింగ్ చేసినా... భారీనీటి లీకేజీ, సీపేజీ ఎందుకు ఆగకుండా జరుగుతోంది? 14 పంపుల్లో సగం పంపులుఎందుకు బద్దలైపోయాయి? డైమండ్ డ్రిల్లింగ్తో, నియ మానుసారం భూగర్భ మట్టి పరీక్షలు ఎందుకు జరుపలేదు? బలహీన ఇసుక పునాదుల పైన బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? డిజైన్, ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలకు చెందిన ఏ ప్రకృతి నియమాన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదు. ‘కేసీఆర్ మమ్మల్ని డమ్మీలు చేశార’ని ఇంజనీర్లు ముక్తకంఠంతో పీసీ ఘోష్ కమిషన్ ముందు సాక్ష్యమి చ్చారు. కాళేశ్వరం బ్యారేజీల విపత్తు తలెత్తిందే అందువల్ల. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 లోపు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఇంజినీర్లకు డెడ్ లైన్ విధించింది. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం (మేడిగడ్డ) విపత్తులతో పోలవరం ప్రాజెక్టుకూ సారూప్యముంది. పోలవరంలో డెడ్ లైన్ల పేరుతో బడా రాజకీయ పెద్దల జోక్యం ఎక్కువైంది. నేటి విపత్తులకు కారణమైన కాళేశ్వరం, ఎస్ఎల్ బీసీలో ఏ తప్పులైతే చేశారో, పోలవరం స్పిల్వే (గేట్ల అడుగు భాగం) పునాది నిర్మాణంలో అవే తప్పులు Výæత చంద్ర బాబు ప్రభుత్వ హయాంలో జరిగాయి. అప్పట్లో ప్రతి సోమవారం పోలవరం అంటూ మీడియా ఎదుటహంగామా చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికీ, స్థిరత్వానికీ తగిన సమయం ఇవ్వడం కన్నా ఈ హడావిడే ఎక్కువ. ఫలితంగా భారీ వరద తాకిడికి, భూగర్భంలో 460 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఎస్ఎల్బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగంగా ఎందుకు మారింది? దేశంలో నిర్మించిన ఇతర రైల్వే, రోడ్డు తదితర సొరంగాలకు దీనికి మధ్య ఎలాంటి సారూప్యతలూఎందుకు లేవు? సొరంగంపై నుండి నాలుగేళ్లకు పైగా నీరు, బురద రావడం అతి సంక్లిష్టమైన వ్యవహారం. టీబీఎం తవ్వడం ప్రారంభించగానే, అప్పటికే నాలుగేళ్లుగా నిట్ట నిలువుగా కుమ్మరిస్తున్న భారీ నీటి ఊటతో షియర్ జోన్ భూ భౌగోళిక స్థితి... భారీ విపత్తుగా మారింది. అక్కడి మట్టి అంతా పూర్తిగా నీటిని నింపుకొని తేమగా మారి పెను విపత్తుకు దారితీసింది. ఏ చిన్న ఒత్తిడితో కూడిన కదలిక జరిగినా కుప్ప కూలడానికి సిద్ధమైంది. టీబీఎం మిషన్ పని ప్రారంభించడంతో, నీటి తాకిడికి గురవుతున్న ప్రాంతం భారీ కదలికలకు గురైంది. ఇది సొరంగం పైకప్పు కుప్పకూలడానికి తక్షణ ప్రేరకంగా పని చేసింది. ‘టన్నెల్ íసీస్మిక్ ప్రొడ క్షన్ సిస్టమ్’తో రాబోయే భారీ విపత్తులను గుర్తించడంలో విఫలమవ్వడం విపత్తుకు మరొక కారణం.నీటి ప్రవాహ తాకిడికి, నాలుగు వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. విపత్తు జరిగి పది రోజులైనా నీటి నిల్వను, ఊటను, బురదను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. సొరంగం పైనుంచి కుమ్మరిస్తున్న ఊట నీరు, మరిన్ని భారీ విపత్తు లకు నెలవుగా మారింది. ఇది రెస్క్యూ బృందాల సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కుప్పకూలిన పైకప్పు భూభౌతిక స్థితి... షియర్ జోన్ స్వభావానికి చెందినది. ఈ ప్రాంతంలోని భూమి భారీ నీటిని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. నీటి జలల ప్రవాహానికి ఇక్కడి మట్టి అత్యంత అనువుగా ఉంటుంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి ఎగువన ఉన్న భూమి ఉపరితలానికి, ఒక నిర్దిష్ట చదరపు ప్రాంతపు రిడ్జిని కలిగి ఉంటుంది. ఆ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపు తీవ్రత బట్టి షియర్ జోన్లోకి చేరుకునే నీటి పరిమాణంలో హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాంతంలోని మట్టి... వదులుగా, ఖాళీలు, సందులను కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడి మట్టి తన గుండా వర్షపు తీవ్రతను బట్టి నీరు ప్రవహించడానికి అనువుగా ఉంటుంది. ఫిబ్రవరి చివర – మార్చి మొదటి వారం మధ్య... కుప్పకూలిన సొరంగ మార్గంపై నుండి నిమిషానికి 5 వేల నుండి 8 వేల లీటర్ల నీరు సొరంగంలోకి ప్రవహిస్తూ ఉంది. ఆ నీరే సొరంగంలో వివిధ ప్రాంతాల్లో 1.5 అడుగుల నుండి 2.5 అడుగుల లోతు వరకూ ఉంది. జూలై నుంచి అక్టోబర్ వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. అప్పుడు నిమిషానికి సొరంగంలోకి 20 వేల నుండి లక్ష 50 వేల లీటర్ల వరకూ నీరు చేరవచ్చు. ఆ పైన భారీ నీరు నిట్ట నిలువునా సొరంగంలోకి జలపాతంలో దూకవచ్చు. ఇంత భారీ జల ప్రవాహాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ ఎలా అరికడు తుంది? వందల మీటర్ల ఎత్తు నుండి భూగర్భం గుండా మహాశక్తితో సొరంగం పైకప్పుపై విరుచుకుపడే జలపాత మది. ఇక, ఎస్ఎల్బీసీలో ఉత్తర భారతానికి చెందిన చౌక వలస కూలీలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందికీ తెలంగాణ ప్రభుత్వం 2–3 కోట్ల రూపాయల వరకూ పరిహారం ఇవ్వాలి. టీబీఎంతో సొరంగం తవ్వే ఉత్తర భారత కార్మి కులను... కాంట్రాక్టరు,్ల కంపెనీలు కడు హీనంగా చూస్తున్నా యని అక్కడ పనిచేస్తున్న వారి ఆవేదన వెల్లడించింది. ప్రాణ హాని ఉన్న ఈ పనికి రోజుకు 800 రూపాయల కూలీ మాత్రమే ఇస్తున్నారు. వారికి ఎలాంటి ప్రమాద బీమాలు లేవు. రక్షణలూ, చట్టబద్ధమైన పరిహారాలూ లేవు. అనేక మంది కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇది అడ్డూ అదుపూ లేని దోపిడీ. అతి దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధమైన హక్కులన్నీ వారికి కల్పించాలి.-నైనాల గోవర్ధన్వ్యాసకర్త నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులుమొబైల్ : 97013 81799 -
బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?
ఇంగ్లిష్లో బీపీ అని సంక్షిప్తంగా చెప్పే ఓ ఆరోగ్య సమస్య అసలు రూపం బ్లడ్ ప్రెషర్. కానీ నిజానికి దీన్ని హైబీపీగా చె΄్పాలి. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడమని అర్థం. తెలుగులో దీన్నే రక్తపోటు అంటారు. దీని నార్మల్ విలువ 140/90. ఉండాల్సిన విలువకంటే ఎక్కువ ఒత్తిడితోరక్తం ప్రవహిస్తే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు తావిస్తుంది. ఒకప్పుడు కాస్త పెద్ద వయసు వచ్చాకే బీపీ, డయాబెటిస్ కనిపించేవి. కానీ ఇప్పుడు మన దేశంలో అప్పుడే తమ కౌమార దశ దాటి అప్పుడప్పుడే యువకులు/యువతులుగా మారుతున్న వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. ఎన్నో అనర్థాలకు కారణమయ్యే ఈ హైబీపీ సమస్య గురించి విపులంగా తెలుసుకోవడం కోసమే ఈ కథనం. బీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం లాంటి అనర్థాలతోనూ, అలాగే కిడ్నీల వంటి ఎండ్ ఆర్గాన్స్ వైఫల్యంతో ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు. ఇది ఉన్న విషయమే బయటకు తెలియకపోవడం, అది దెబ్బతీసే అవయవాలైన కిడ్నీ వంటివి పూర్తిగా చెడిపోయేవరకు వాటి లక్షణాలేమీ బయటకు కనిపించకపోవడంతో ఇది నిశ్శబ్దంగా అనర్థాలను తెచ్చిపెట్టి, కొన్నిసార్లు మరణాలకు కారణమవుతుంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హైబీపీ తెచ్చిపెట్టే సమస్యలేమిటి, ఎలా ఉంటాయి, వాటిని అధిగమించడం ఎలా వంటి అనేక విషయాలను తెలుసుకుందాం. హై–బీపీ అంటే ఏమిటి?కొంతమంది తాము అతిగా ఉద్రేకపడ్డా లేదా బాగా కోపం ఫీలయినప్పుడు తమకు బీపీ పెరిగిందంటుంటారు. అలాగే మరికొందరు తమకు బాగా తలనొప్పిగా ఉండటం, చెమటలు పడుతుండటం, నర్వస్గా ఉండటం, నిద్రపట్టకపోవడం, బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఫీలయినప్పుడు ఆ టైమ్లో బీపీ పెరిగిందని చెబుతుంటారు. అయితే అలా జరిగినప్పడు బీపీ పెరిగి ఉండవచ్చు. కానీ కొందరిలో బీపీ పెరిగాక అది అలాగే కంటిన్యూవస్గా ఉండటాన్నే హైబీపీగా చెప్పవచ్చు. ఇక కొంతమందిలో తాము హాస్పిటల్కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. ఇంటిదగ్గర రీడింగ్ తీసినప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరగడం, అలాగే తమలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు రక్తపోటు కొంతమేరకు పెరగడం జరగవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరిగినప్పటికీ దాన్ని హైబీపీగా పరిగణించడం జరగదు. అయితే ఓ వ్యక్తిలో అనేక పర్యాయాలు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు (సిస్టోల్ / డయాస్టోల్) విలువలు 140/90 అనే కొలతకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. హైబీపీ ఎన్ని రకాలు... హైబీపీని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ఎసెన్షియల్ హైపర్టెన్షన్. అంటే ఇది మామూలుగా వచ్చే బీపీ అనుకోవచ్చు. ఇతరత్రా ఎలాంటి కారణం లేకుండా వచ్చే బీపీ ఇది. ఇది చాలా సాధారణంగా కనిపించే హైపర్టెన్షన్. ఇక రెండోదాన్ని సెకండరీ హైపర్టెన్షన్గా చెప్పవచ్చు. ఇది శరీరంలో ఏదో ఇతరత్రా కారణాల వల్ల వస్తుంది. అంటే బాధితులకు ఒంట్లో థైరాయిడ్ సమస్య ఉండటం వల్లనో, లేదా మూత్రపిండాల వ్యాధి వంటి ఇతర సమస్యల కారణంగా రక్త΄ోటు పెరిగిపోవడం జరుగుతుంది. అందుకే ఒంట్లో బీపీ ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు థైరాయిడ్, కిడ్నీ వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయా అంటూ చెక్ చేయించుకుని, వాటికి మందులు వాడాలి. ఈ సెకండరీ కారణాలు చక్కబడితే అప్పుడు బీపీ తగ్గుతుంది. కానీ మొదటిదైన ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అలా కాదు. ఆ సమస్యకు డాక్టర్ల సూచన మేరకు బీపీని నియంత్రణలో ఉంచే మాత్రలు వాడటం అవసరం. చిన్నపిల్లల్లోనూ హైబీపీ ఉండవచ్చా?చిన్నపిల్లల్లో లేదా అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న యువకుల్లో హైబీపీ ఉండక΄ోవచ్చని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు వాళ్లలోనూ, కౌమారం (టీనేజ్)లో ఉన్న పిల్లలు... అంటే 13 నుంచి 19 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణకు దాన్ని చాలా జాగ్రత్త (మెటిక్యులస్)గా కొలవాలి. పిల్లల్లో బీపీని తెలిపే చార్ట్ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల తాలూకు నార్మల్ విలువలు... వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. పెద్దవాళ్లలో నార్మల్స్ వాళ్లలో నార్మల్ విలువకు సమానం కాదు. ఉదాహరణకు వారిలో డయాస్టోల్ బీపీ కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు.లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? లక్షణాలేమీ బయటకు కనిపించక΄ోయినప్పటికీ చాలామందికి హైబీపీ ఉండే అవకాశముంది. నిజానికి చాలామందిలోనూ తమకు హైబీపీ ఉన్న విషయమే తెలియకుండా చాలాకాలంగా వాళ్లలో హైబీపీ ఉండే అవకాశం ఉంది. ఇలా చాలాకాలంగా హైబీపీ ఉండటం వల్ల మానవ దేహంలో ఎండ్ ఆర్గాన్స్గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అవి పూర్తిగా పాడైపోయాకగానీ ఆ అవయవాలు దెబ్బతిన్నప్పుడు కనిపించే లక్షణాలు బయటపడవు. ఈలోపు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగి΄ోవచ్చు. అందుకే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. కేవలం లక్షణాలు కనిపించనంత మాత్రాన హై–బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్ను కలిసి, చెకప్ చేయించుకుని హైబీపీ లేదన్న నిర్ధారణ జరిగాకే నిశ్చింతగా ఉండాలి. హైబీపీ మందులు చాలాకాలంపాటు వాడుతుంటే, వాటికే అలవాటు పడి... ఇక మున్ముందు బీపీ తగ్గదేమో?ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తుంటారు. వారిలోని బీపీ తీవ్రతను బట్టి కొందరికి రెండు, మరికొంతమందికి మూడు, ఇంకొందరిలో నాలుగు... ఇలా మందులను వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. బీపీ కొలతలను తరచూ చూస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందుల సంఖ్యా, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... మందులకు అలవాటు పడి... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం అనే అంశాలకు ఆస్కారం లేదు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చాక మందులు మానేయవచ్చా?ఒకసారి హైబీపీ నిర్ధారణ జరిగి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ అదుపులోనే ఉంది కదా అని చాలామంది మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియనే తెలియదు. అందుకే ఒకవేళ హై–బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మళ్లీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ పెరిగినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం డాక్టర్ను సంప్రదించి, ఉన్న హై–బీపీ విలువకు తగినట్లుగా తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు కోసం మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. అందుకే బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. అలాగే తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం కూడా తప్పనిసరి. బీపీ పెరుగుతూ, తగ్గుతూ ఉండటం తరచూ జరగవచ్చంటారు కదా... కాబట్టి హైబీపీ లేకపోయినా, ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడవచ్చు కదా?హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. హై–బీపీ తాలూకు లక్షణాలు అని పేర్కొనే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలను బట్టే బీపీ ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశమే ఉండదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గనూవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హై΄ోటెన్షన్’ అంటారు. అప్పుడు తల తిరగడం గానీ లేదా కొందరిలో ముందుకు తూలిపడిపోతామనే భావన కలగవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలే కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక సందర్భాల్లో అనేక మార్లు అలాగే రకరకాల వేళల్లో కొలిచి చూశాకే... హైబీపీని నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి ఐదు రోజుల పాటు రోజుకు మూడు సార్ల చొప్పున కొలతలు తీశాకే నిర్ధారణ చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు కొలతలతో హైబీపీ నిర్ధారణ చేయరు కాబట్టి డాక్టర్లు పొరబడే అవకాశమే ఉండదు.హైబీపీకి బార్డర్లైన్లో ఉన్నవారికి మందులు అవసరం లేదు కదా?హైబీపీ వస్తున్న సూచనలు కనిపిస్తున్నవారు... అంటే హైబీపీ విలువలు మరీ ఎక్కువగా కాకుండా బార్డర్లైన్లో ఉన్నవాళ్లు మందులు వాడనక్కర్లేదనీ, వాళ్లు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ ఉంటే చాలని చెబుతుంటారు. అంటే... క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారన్నది కొందరి వాదన. ఇక చాలామంది తాము మందులు వాడబోమనీ, మంచి క్రమశిక్షణతో వ్యాయామం, ఆహారనియమాలు పాటించడం వంటి జీవనశైలిని అనుసరిస్తూ, హైబీపీని అదుపు చేయగలమని మొదట్లో ప్రతిఒక్కరూ అనుకుంటుంటారు. అయితే ఒకటి రెండు రోజులు పాటించినప్పటికీ... చాలామంది ఈ జీవనశైలి నియమాలను సరిగా పాటించ(లే)రు. ఇలాంటి వాళ్లలో తమ కీలకమైన అవయవాలపైన హై–బీపీ తన దుష్ప్రభావం చూపినప్పుడు జరిగే నష్టం... అప్పుడు అవసరమైన వైద్యపరీక్షలకూ, చికిత్సకూ అవసరమైన ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి డిసీజ్ బర్డెన్ను విపరీతంగా పెంచుతాయి. అంతేకాదు... కుటుంబ సభ్యులపైనా ఆర్థిక, భావోద్వేగపరమైన ఒత్తిడీ చాలా ఎక్కువగా పడుతుంది. ఆ భారంతో పోలిస్తే... అసలు మనపై ఎలాంటి బరువూ పడకుండా చాలా చవగ్గా దొరికే మందుల్ని రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం వల్ల చాలాకాలం పాటు కీలకమైన అవయవాలను సంరక్షించుకుంటూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ఎన్నో వేదనాభరితమైన జబ్బులను తప్పించుకోవచ్చు. పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు హైబీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.హై–బీపీ ఉన్నవారు ఉప్పు పూర్తిగా మానేయాలా?హై–బీపీ ఉన్నవాళ్లలో ఉప్పు వల్ల రక్త΄ోటు మరింత పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ముందుజాగ్రత్తగా ఉప్పు మానేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే మానవ దేహంలోని కీలకమైన జీవక్రియలకు ఉప్పు / లవణాలు అవసరం. ఉదాహరణకు మెదడు నుంచి నాడుల (నర్వ్స్) ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలన్నీ ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేస్తే హైపోనేట్రీమియా అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి అది ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం సరికాదు. దానికి బదులుగా ఇంతకుముందు వాడుతున్న మోతాదులో సగం లేదా సగానికంటే తక్కువగా వాడటం మంచిదని గుర్తుంచుకోవాలి. మనం వాడే రోజువారీ ఆహారాల్లో మనకు తెలియకుండానే ఉప్పు ఉంటుంది. మనం తీసుకునే చిప్స్ వంటివీ లేదా బేకరీ పదార్థాల్లో, ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉప్పు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఉప్పుకూ బీపీ పెరుగుదలకు నేరుగా సంబంధముంటుంది. అంతేకాదు... ఆకుకూరల్లోనూ లవణాల రూపంలో ఉప్పు ఉంటుంది. ఉప్పును చాలాపరిమితంగా తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే హైబీపీ ఉన్నవాళ్లలో ఒక వ్యక్తికి కేవలం రోజుకు రెండు గ్రాముల ఉప్పు అనే మోతాదు సరిపోతుంది.మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలోకి రాలేదంటే... ఆ పేషెంట్ మందులకు రెసిస్టెన్స్ పెంచుకోవడం వల్లనేనా? కొంతమంది బీపీ నిర్ధారణ సమయంలో ... మొదటిసారి మాత్రమే డాక్టర్ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరి΄ోతోందా, లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. అలాగే మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా సరికాదు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి హై–బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాల సమయం పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే వాస్తవం, అదే నిజమనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది కూడా సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్కు వెళ్తుండాలి. తరచూ పరీక్ష చేయిస్తూ తమలో రక్త΄ోటు అదుపులో ఉందా లేదా అన్నది తెలుసుకుంటూ, ఒకవేళ బీపీ ఇంకా పెరిగితే దాన్ని బట్టి మందులు మార్చడం లేదా మోతాదు మార్చడం జరుగుతుంది. బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతే...బీపీ అకస్మాత్తుగా పెరగడం చాలా ప్రమాదమని గుర్తించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ... బీపీ విలువ నార్మల్ కంటే ఎక్కువగానే ఉంటుంది కదా! ఈ అపోహ చాలామందిలో ఉంది. ఇది చాలాకాలం పాటు రాజ్యమేలింది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకూ హైబీపీ వస్తుందా?తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చేలాంటి జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడావచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. (చదవండి: -
చెప్పుకోలేని బాధ, సిగ్గుపడితే ముప్పే..!
కొందరికి మల విసర్జన ద్వారం వద్ద సన్నటి పగులు ఏర్పడుతుంది. ఈ పగులునే ‘యానల్ ఫిషర్ లేదా ఫిషర్ ఇన్ ఏనో’ అంటారు. ప్రతి 350 మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధిసాధారణంగా 15 నుంచి 40 ఏళ్ల స్త్రీ, పురుషుల్లో కనిపిస్తుంది. ఇది చెప్పలేనంత నొప్పితో తీవ్రంగా బాధిస్తుంది. తమ బాధను ఎవరితోనైనా చెప్పుకోడానికీ, ఆ పగులును ఎవరికైనా చూపించడానికీ, బిడియం అడ్డువస్తుంది. తొలిదశలో చికిత్స తీసుకోకపోతే మరింత లోపలికి చీరుకు΄ోయి వేధిస్తూ ఉండే ‘యానల్ ఫిషర్’ గురించి తెలుసుకుందాం...నిజానికి మలద్వారమిలా చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి కారణాలేమిటన్నది ఇంకా పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే మలవిసర్జన సమయంలో ఈ చీలిక మరింతగా ఒరుసుకు΄ోయేలా మలం బయటికి వస్తుండటం వల్ల తీవ్రమైన నొప్పి కలగడం వల్ల దీని ఉనికి తెలుస్తుంది. తాము తీసుకునే ఆహారంలో ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, తాజాపండ్ల వంటి పీచు (ఫైబర్)ను పుష్కలంగా కలిగి ఉంటే ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.మలద్వారం వద్ద ఉండే కండరాలు కొన్ని సందర్భాల్లో మందంగా, గట్టిగా మారడం వల్ల మలవిసర్జన సాఫీగా జరగదు. ఈ క్రమంలో మలం మందంగా, గట్టిగా మారిన కండరాలను బలంగా ఒరుసుకుంటూ బయటకు వస్తుంది. అలా ఒత్తిడితో బలంగా బయటకు వచ్చే క్రమంలో మొదట చిన్న చిరుగు, ఆ తర్వాత చీలిక ఏర్పడటం, ఆ తర్వాత అది మరింత విస్తరించడం వల్ల యానల్ ఫిషర్ రావచ్చు. మలబద్దకం కారణంగా కొందరు ముక్కుతూ ముక్కుతూ మల విసర్జన చేస్తుంటారు. మలబద్ధకం కారణంగా మలాశయం దగ్గర మలం చాలా గట్టిగా (ఫీకోలిథ్గా) మారడం వల్ల ఇలా ముక్కాల్సి వస్తుంటుంది. ఇలా మలం గట్టిగా రాయిలా మారడం వల్ల కూడా మల విసర్జన సమయంలో ఆప్రాంతం చీరుకుపోవచ్చు. మరికొందరిలో దీర్ఘకాలం పాటు నీళ్లవిరేచనాలు అవుతుండటం వల్ల... చాలాకాలం పాటు ఆ ప్రాంతం తడిగానూ, తేమగానూ ఉండటంతో ఆ ప్రాంతానికి రక్తసరఫరా తగ్గడం వల్ల కూడా ఫిషర్ ఏర్పడవచ్చు. మల విసర్జన జరిగిన తర్వాత... ఇక అక్కడి నుంచి మలం మళ్లీ లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకు΄ోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు మలద్వారం చుట్టూతా ఉంటాయి. ఈ స్ఫింక్టర్ కండరాల వల్లనే... మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకోసారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల కొందరిలో మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగిన తర్వాత స్ఫింక్టర్కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడి పోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలా జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్కు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక టీబీ, ల్యూకేమియా, క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి జబ్బుల కారణంగా దీర్ఘకాలంలో మలవిసర్జన ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడటం, అది క్రమంగా ఫిషర్కు దారితీయడం కూడా జరగవచ్చు. సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి కొంతకాలం తర్వాత ఫిషర్కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడంతో ఫిషర్ ఏర్పడవచ్చు. గర్భవతులైన మహిళల్లో ప్రసవం సమయంలో మలద్వారం చీరుకుపోయి ఫిషర్ రావచ్చు. కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడంతో (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్ ఏర్పడవచ్చు.లక్షణాలు మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి మల విసర్జన తర్వాత కూడా కొద్ది గంటల సేపు బాధిస్తూనే ఉంటుంది. ఈ నొప్పి మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే బాధితులు తీవ్రమైన ఆందోళనకు గురై, మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతారు. దాంతో మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన ప్రక్రియ మరింత బాధాకరంగా మారుతుంది.చాలా మంది బాధితుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో చేతికి లేదా టాయిలెట్ పేపర్కు రక్తం అంటుకుంటుంది. అయితే ఫిషర్ విషయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడా స్రావాలూ కనిపించవచ్చు.కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. కొందరిలోనైతే ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమే కష్టంగా అనిపించవచ్చు. యానల్ ఫిషర్ అంటే... మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే యానల్ ఫిషర్...తన తొలి దశలో మలద్వారం అంచున చిన్న చిరుగులా కనిపిస్తుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం తాలూకు పై పొరకు (ఎపిథీలియమ్కు) మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అది అక్కడి మృదువైన లోపలి పొరల్లోకి (మ్యూకస్ మెంబ్రేన్లలోకి) పగుళ్లు ఏర్పడేలా చీరుకు΄ోయే ప్రమాదం ఉంది. ఫిషర్లలో రకాలు... ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించే క్రానిక్ ఫిషర్.ఆక్యూట్ ఫిషర్ ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకు΄ోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూ పొందవచ్చు.క్రానిక్ ఫిషర్ ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే ఫిషర్. ఇలా చాలాకాలంపాటు కొనసాగే క్రానిక్ ఫిషర్లో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తుంటాయి.ఉదాహరణకు మలద్వారాన్నిగట్టిగా, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. నిర్ధారణ: క్లినికల్గా తెలుసుకునే ప్రక్రియలో... బాధితుల వ్యాధి చరిత్రను (డిసీజ్ హిస్టరీని) అడిగి తెలుసుకోవడం, విసర్జన ద్వారం ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఫిషర్ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి ఆ ప్రాంతంలో నిశితంగా చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని మత్తుమందును (లోకల్గా ఇచ్చే టాపికల్ అనస్థీషియా) అక్కడ పూసి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో... ఆప్రాంతంలో సిగ్మాయిడోస్కోపీతో పరీక్షించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. సాధారణంగా బాధితులు 50 ఏళ్లలోపు వారైతే ఈ పరీక్ష అవసరమవుతుంది. యాభై ఏళ్లు దాటిన కొందరిలో ఒకవేళ వాళ్ల కుటుంబాల్లో మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారి పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ అనే పరీక్షను చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ వెంటనే కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించడాన్ని బట్టి అవసరమైతే పైన పేర్కొన్న పరీక్షలను చేయాల్సి రావచ్చు. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకు΄ోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు ‘యానోరెక్టల్ మ్యానోమెట్రీ’ అనే పరీక్షనూ చేయాల్సి రావచ్చు. ఫిషర్నునివారించడంఇలా... ఫిషర్ కేవలం నొప్పిని కలిగించేదే కాదు... అది సామాజికంగానూ చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. ఎవరికైనా చూపించుకోవాలన్నా, నలుగురితో బాధ పంచుకోవాలన్నా చాలా కష్టం. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం చాలా మంచిది. ఫిషర్ను నివారించుకోవడం చాలా సులువు కూడా.నివారణ మార్గాలివి...ఆహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే పీచు (సొల్యుబుల్ ఫైబర్) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండటం.మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్లను బాగా తగ్గించుకోవడం.మాటిమాటికీ నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్ను సంప్రదించి తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవడం.మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించడం.మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటినే ఉపయోగించడం.ఒకవేళ అప్పటికే చిన్న పాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్మెంట్స్ వాడటం... లాంటి నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. చికిత్స అక్యూట్ ఫిషర్ను కనుగొన్నప్పుడు... నేరుగా ఫిషర్కే చికిత్స అందించడం కాకుండా... దాదాపు 80 శాతం సందర్భాల్లో... అసలు ఫిషర్ ఏర్పడటానికి కారణమైన అంశాలను నివారించడానికే చికిత్స చేస్తుంటారు. ఇందుకోసం తొలుత మలబద్దకాన్ని నివారించే మందుల్ని సూచించడం, మలాన్ని మృదువుగా మార్చే మందులు వాడటం, మలవిసర్జన సమయంలో కలిగే నొప్పిని తగ్గించే మందులు ఇవ్వడం లాంటి చికిత్సలు అందిస్తారు. అలాగే మలవిసర్జన సాఫీగా జరిగేలా పేగు కదలికలు (బవెల్ మూవ్మెంట్స్) క్రమబద్ధంగా జరిగేలా చూసే మందులిస్తారు.శస్త్ర చికిత్స ప్రక్రియలు అక్యూట్ ఫిషర్కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా పెద్దగా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా మారినప్పుడు శస్త్రచికిత్స (సర్జరీ) అవసరం పడవచ్చు. ఆ సర్జరీ విధానాలివి... ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్సను కూడా దేహమంతటికీ పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా... లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా చేస్తారు. ఇందులో స్ఫింక్టర్లో గట్టిబారిన కండర ప్రాంతాన్ని (హైపర్ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్ను) జాగ్రత్తగా ఒలిచినట్లుగా తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. ఇక రెండోదశ చికిత్సగా (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) మలద్వారం లోపలికి 0.4% నైట్రోగ్లిజరిన్ వంటి మందులతో పాటు గ్లిజెరాల్ ట్రైనైట్రేట్ ఆయింట్మెంట్ వంటివి స్ఫింక్టర్ లోపల పూతమందుగా వాడాల్సి ఉంటుంది. నిఫైడిపైన్ ఆయింట్మెంట్, డిల్షియాజెమ్ ఆయింట్మెంట్ వంటి పూతమందులు కూడా బాగానే పనిచేస్తాయి. స్ఫింక్టర్ డయలేషన్ : ఈ సమస్యకు చేసే శస్త్రచికిత్సలో దేహానికంతటికీ మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి సర్జరీ నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకు΄ోయేలా చేసే స్ఫింక్టర్ను వెడల్పు చేస్తారు. నిజానికి ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్కు చాలా మంచి నైపుణ్యం ఉండాలి.ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్సను కూడా దేహమంతటికీ పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా... లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా చేస్తారు. ఇందులో స్ఫింక్టర్లో గట్టిబారిన కండర్ర ప్రాతాన్ని (హైపర్ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్ను) జాగ్రత్తగా ఒలిచినట్లుగా తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) :ఫిషర్కు శస్త్రచికిత్స వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా తెలుసుకోవడం మంచిది. సాధారణంగా ఫిషర్కు శస్త్రచికిత్స చేశాక, ఆ ప్రాంతమంతా గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువ. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావమూ కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకుతూ... ‘ఫిస్టులా అనే కండిషన్కూ దారితీయవచ్చు. ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి... అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఫీకల్ ఇన్కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం. కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్ల ఆధ్వర్యంలోనే ఈ శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిషర్ సర్జరీ విషయంలో మరో ముప్పు... ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే ఎలాంటి ఇబ్బందీ ఉండదుగానీ... ఆరు శాతం కేసుల్లో మాత్రం శస్త్రచికిత్స తర్వాత కూడా ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. ఈ ముప్పును గుర్తుంచుకోవడం మంచిది. ఫిషర్ అనేది ఇటు వ్యక్తిగతంగానూ, అటు సామాజికంగా నలుగురితో కలుస్తుండాన్ని నిరోధిస్తూ... ఇలా అన్ని విధాలా ఇబ్బంది కలిగించే సమస్య. శస్త్రచికిత్స తో నయం చేసుకోవాలనుకున్నా అప్రయత్నంగా, శస్త్రచికిత్సకుల ప్రమేయం లేకుండా కూడా మళ్లీ మళ్లీ తిరగబెట్టేందుకు ఎక్కువ అవకాశమున్న ఇబ్బంది ఇది. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూక్తి అన్నిటికంటే ఈ సమస్యకే ఎక్కువగా వర్తిస్తుంది. పైగా చికిత్స కంటే నివారణ చాలా సులువు కూడా. కాబట్టి తేలిగ్గా నివారించే మార్గాలైన... వేళకు భోజనం చేయడం, పీచు (ఫైబర్) పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటి మంచి ఆహారపు అలవాట్లతోనూ, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)పాటించడం వంటి మంచి టాయిలెట్ అలవాట్లతోనే ఈ సమస్య నివారణ చాలా తేలిగ్గా జరుగుతుంది. కాబట్టి ఈ మార్గాలను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలితో (ఆహారపు అలవాట్లూ, కొద్దిగా తేలికపాటి వ్యాయామాలతో) అసలు ఫిషర్ అనే సమస్యే దరిచేరకుండా నివారించవచ్చని తెలుసుకోవడం మేలు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కేవలం ఫిషర్నే కాదు... అనేక ఇతర ఆరోగ్యసమస్యలనూ నివారిస్తుందని గుర్తుంచుకోవడం మరీ మంచిది. -
చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలు
China HMPV : కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం తాలూకు గుర్తులు ఇంకా సమసి పోనేలేదు. ఇంతోనే చైనాలో మరో వైరస్ విజృంభణ ఆందోళన రేపుతోంది. కరోనా బీభత్సం జరిగిన ఐదేళ్ల తరువాత చైనాలో HMPV వేగంగా విస్తరిస్తోంది. ఈవైరస్ సోకిన రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయని, శ్మశాన వాటికల్లో స్థలంకూడా లేదంటూ , సోషల్ మీడియా వస్తున్న వీడియోలు, నివేదికలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోనే ప్రభావం అధికంగా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు ఇన్ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 లాంటివి వైరస్లు చైనాలో వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలుహెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం. -
రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?!
రిటైర్మెంట్, పదవీ విరమణ తరువాతి జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడపొచ్చని దాదాపు అందరూ భావిస్తారు. నిజానికి ఇది అవసరం కూడా. కానీ ఇండియాలో పదవీ విరమణ తరువాత చాలా మందిని డిప్రెషన్ బాధిస్తోందట. శూన్యత, ఒంటరితనం, నేను ఎందుకూ పనికి రానా? అనే ఆందోళన క్లినికల్ డిప్రెషన్కు దారితీస్తోందని సమాచారం. దీన్నే రిటైర్మెంట్ డిప్రెషన్ అంటున్నారు. ఒకప్పుడు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవారు కూడా రిటైర్మెంట్ తరువాత చాలా స్వల్ప భావోద్వేగాలను కూడా తట్టుకోలేక పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?రిటైర్మెంట్ డిప్రెషన్కి అనేక సమస్యలు, సవాళ్ల వల్ల ఏర్పడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, మనవలు, మనవరాళ్లతో కాలం గడుపుతూ, ఉన్న చిన్నకొద్దిపాటి, వ్యవసాయాన్ని, గొడ్డూ, గోదా సంరక్షణ, లేదా వ్యాపారం నిర్వహణతోపాటు సమాజంలో అందరూ సామూహికంగా కలిసి ఉండటం లాంటి వల్ల పదవీ విరమణ ద్వారా వచ్చిన ఆకస్మిక మార్పులను సర్దుబాటు చేసుకునేలా ఉండేవి. అయితే ఉద్యోగ విరమణ తరువాత వయసుతో వచ్చే సమస్యలతోపాటు, ఉద్యోగ రీత్యా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉండటంతో విచారం, ఆందోళన, నిస్సహాయత వారిని చుట్టుముడుతోంది. అయితే సరైన ప్రణాళిక, నిపుణుల సలహాతో వీటన్నింటినుంచి బయటపడవచ్చు అంటున్నారు మానసిక వైద్యులు. రిటైర్మెంట్ డిప్రెషన్ను ఎలా గుర్తించాలిఅలసట, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం, నిస్సత్తువగా, విచారంగా అనిపించడం, ఒంటరివాళ్లమనే ఆందోళన లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ నిష్థా జైన్. అలాగే ఆ ఉద్యోగం తప్ప మరే హాబీలు లేకపోవటం కూడా రిటైర్మెంట్ డిప్రెషన్కు ప్రధాన కారణమంటారు.ఉద్యోగ విరమణ తరువాత ప్రతీ నెలా వచ్చే జీతం రాదు కేవలం పెన్షన్మీదే ఆధారపడాలి. దీంతో ఆర్థికంగా ఎలా అందోళన మొదలవుతుంది.(పెన్షన్ సరిపడా వచ్చేవారి పరిస్థితి వేరు) ఆరోగ్య సమస్యలు , ఒంటరితనం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. వీటికి తోడు రక్తపోటు, మధుమేహం, మతిమరుపులాంటివి కూడా మరింత ఆజ్యం పోస్తాయి. దీంతో స్వేచ్ఛగా, రిలాక్స్గా ఉండాల్సిన వారిలోనిరాశ ఏర్పడుతుంది. పాత జీవితాన్ని కోల్పోయా మనే బాధ, ఒత్తిడి పెరుగుతాయి. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళన చెందుతారని చెబుతున్నారు మానసిక వైద్యులుమరి ఏం చేయాలి? పదవీ విరమణ చేయడానికి ముందే ఆలోచనాత్మక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, దినచర్యలు, అభిరుచులు , రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి? ఆర్థిక అవసరాల నిమిత్తం ఏం చేయాలి లాంటి యాక్షన్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. పలు సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పర్చుకోవాలి. అంతకుముందే ఏదైనా వ్యాధి ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్య పరీక్షలపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, నడక లాంటి వ్యాయామాలు చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. చక్కటి పుస్తకాలను చదవాలి. అనుభవాలను పంచుకోవడానికి, ఒంటరితనాన్నిబయటపడటానికి సపోర్ట్ గ్రూపుల్లో చేరాలి. అందరితనూ కలిసిపోయేందుకు ప్రయత్నించాలి.వీలైనన్ని సార్లు ఆధ్యాత్మిక , లేదా పర్యాటకు ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో మరింత దగ్గరగా వ్యవహరించాలి. కుమార్తెలు, కోడళ్లు, కొడుకులపట్ల విశాల దృక్పథంతో వ్యవహరించాలి. పరస్పరం మనసు విప్పి, మాట్లాడుకోవాలి. చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. మనకువచ్చిన విద్యను వారికి నేర్పించవచ్చు. అపార్టమెంట్లలోని పిల్లలకు చెస్, పెయింటింగ్, ఇలా ఏదో ఒకటి నేర్పిస్తూ వాళ్లతో సమయం గడపాలి.అన్నింటికంటే ముఖ్యంగా పరిస్థితులను అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని పదవీ విరమణ అనేది ఒక ముఖ్యమైన జీవిత మార్పు అని గమనించి ముందుకు సాగిపోవాలి. -
మోచేతి నొప్పులా..ఇవిగో టిప్పులు!
దాదాపుగా అందరికీ జీవితంలోనూ ఏదో ఒక సమయంలో మోచేయి నొప్పి రావచ్చు. మరీ ముఖ్యంగా ఇంటి పనులు చేస్తుండే గృహిణుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఇలా మోచేతికి సమస్య రావడం ఎందుకంటే... ఇతర దేశాల్లోని మహిళలతో పోలిస్తే మన దేశంలోని మహిళలూ, గృహిణులూ నిత్యం ఏదో ఒక ఇంటిపని చేస్తూనే ఉంటారు. ఈ కారణంతో ఏదో ఓ సమయంలో మోచేతికి వచ్చే సమస్యలు వాళ్లలోనే ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇక మరో కారణమేమిటంటే... నిర్మాణపరమైన తేడాలున్నప్పుడు కూడా కొందరిలో మోచేతి సమస్యలు బయటపడుతుంటాయి. మోచేతి సమస్యలపై అవగాహన, నివారణ కోసం ఈ కింది అంశాలు తెలుసుకుందాం. సాధారణంగా మోచేతికి ఈ కింద పేర్కొన్న సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మోచేతి విషయంలో కనిపించే కొన్ని సమస్యలు... ఆటల్లో గాయాల వల్ల : క్రికెట్ లేదా టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి రాకెట్తో ఆడే ఆటల్లోనూ, ప్రధానంగా పురుషుల్లో మరింత ఎక్కువ బరువు వేసి వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేసినప్పుడు మోచేయి గాయపడి నొప్పి రావచ్చు. చేతిని వాడాల్సిన పద్ధతిలో ఉపయోగించకుండా అకస్మాత్తుగా కదిలించడం, ఆటలకు ముందు తగినంత వార్మప్ చేయకపోవడం వంటి కారణాలతో ఇలా జరగవచ్చు. హైపర్ ఎక్స్టెండెడ్ ఎల్బోస్ : చేతిని పూర్తిగా చాచినప్పుడు... మోచేతి దగ్గర అది 180 డిగ్రీలు ఉంటుంది. కానీ కొందరిలో అంటే... దాదాపు 30 శాతం మందిలో (అందునా ప్రధానంగా మహిళల్లో) అది 180 డిగ్రీల కంటే ఎక్కువే ఒంపు తిరుగుతుంది. ఇలా 180 డిగ్రీల కంటే కాస్తంత ఎక్కువగా మోచేయి బయటివైపునకు ఒంపు తిరగడాన్ని ‘హైపర్ ఎక్స్టెండెడ్ ఎల్బో’గా చెబుతారు. ఇలా ఎక్కువగా ఒంగుతున్నట్లు కనిపించడమన్న అంశమే మహిళలు ఎక్కువగా బరువులు మోసినప్పుడు అది మోచేతి బెణుకుకు కారణమవుతుంటుంది.ఎపీకాండలైటిస్ : చేతి భాగంలోని ఎముక (ఎపికాండైల్)కు ఒకసారి గాయమయ్యాక, మళ్లీ అదే చోట పదే పదే దెబ్బతగులుతుండటం వల్ల ఆ గాయం తిరిగి రేగుతుండవచ్చు. భుజం కండరాలు కూడా ఈ చోటే ఎముకకు అతికి ఉంటాయి. దాంతో ఏ కొద్దిపాటి శ్రమ చేసినా మళ్లీ గాయం రేగిపోయి నొప్పి వస్తుండవచ్చు. ఒక్కోసారి ఆ నొప్పి ఒకే చోట ఉండవచ్చు లేదా చేయి అంతటికి పాకవచ్చు. ఇలా జరగడాన్నే ల్యాటరల్ ఎపికాండైలైటిస్ అంటారు. చాలా ఎక్కువగా శ్రమించేవారిలో, ఈ శ్రమలో భాగంగా మోచేతిని ఎక్కువగా వాడేవారిలో కొన్ని సందర్భాల్లో మోచేతి దగ్గర కండరాన్ని ఎముకకు అంటించే ‘టెండన్’ విపరీతంగా అరిగి΄ోవచ్చు. ఇలాంటి కండిషన్నే ‘టెన్నిస్ ఎల్బో’గా పేర్కొంటారు. చాలా సందర్భాల్లో ‘ల్యాటరల్ ఎపీకాండైటిస్’నూ ‘టెన్నిస్ ఎల్బో’నూ దాదాపుగా ఒకే అర్థంలో వాడుతుంటారు.మోచేతి నొప్పి తగ్గాలంటే... మోచేయి విషయంలో ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడానికి ఎవరికి వారే ఇలా చెక్ చేసుకోవచ్చు. మొదట చేతిని చాచాలి. అది 180 డిగ్రీలు చాచగలిగితే పరవాలేదు. లేదంటే ఏదైనా సమస్య ఉందని అర్థం. మోచేతి ప్రాంతంలో వేలితో నొక్కాలి. లేదంటే ఏదైనా పనిచేస్తున్నప్పుడైనా మోచేతి పరిసరాల్లో నొప్పి వస్తోందంటే ఏదో సమస్య ఉన్నట్లు భావించాలి.కొన్ని పరిష్కారాలు... సాధారణంగా మోచేతికి ఏదైనా సమస్య వచ్చినా లేదా నొప్పి మరీ ఎక్కువగా లేక΄ోయినా... ప్రతివాళ్లూ తాము రోజూ చేసినట్లే ఇంట్లోని బరువులు ఎత్తడం / ఆటలాడటం వంటివి చేయవచ్చు. మరీ నొప్పిగా ఉంటే మాత్రం చేతికి తగినంత విశ్రాంతినివ్వాలి. ఏదైనా ఆటలాడటం వల్ల నొప్పి వస్తుంటే... ఒకవేళ ఆ గాయం తాజాదైతే (1 – 3 రోజులది) దానికి ఐస్ప్యాక్ పెట్టవచ్చు. వేణ్ణీళ్లతోనూ కాపడం పెట్టవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రోథెరపీ వంటివి చేయించుకోవడం ఒక్కటే సరి΄ోదు. ఇలాంటి గాయాలైన సమయంలో మోచేతికి విశ్రాంతినివ్వడంతోపాటు ఎల్బో, రిస్ట్ స్ట్రెచ్చింగ్ వ్యాయాలు చేయాలి. ఆ సమయంలో మోచేతికి శ్రమ కలిగించడం గానీ లేదా తగిలిన చోటే మళ్లీ మళ్లీ గాయం రేగేలా దెబ్బతగలనివ్వడం గానీ చేకూడదు. అలాంటి సందర్భాల్లో గాయం రేగితే ‘టెండన్’ దెబ్బతినవచ్చు. అందుకే మోచేతి నొప్పి రెండు వారాలకుపైగా అదేపనిగా కొనసాగితే తప్పక డాక్టర్కు చూపించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మోచేతి నొప్పి అదే పనిగా వస్తుంటే ఒకసారి డాక్టర్కు చూపించి అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కారణంగా వస్తుందేమోనని చూసుకొని, అక్కడ సమస్య ఏమీ లేదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండవచ్చు. (చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..! -
గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..
పుట్టబోయే ఆ చిన్నారి ఒకింత బొద్దుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాస్తంత బొద్దుగా ఉంటే పర్వాలేదు గానీ మరీ ఎక్కువ బరువుండటం తల్లీ, బిడ్డా ఇద్దరికీ చేటు చేసే అంశం. అదెలాగంటే... మహిళలు గర్భం దాల్చినప్పుడు వారిలో కొంతమందికి తాత్కాలికంగా చక్కెరవ్యాధి వస్తుంది. ఇలా కేవలం వారు గర్భవతులుగా ఉన్నప్పుడు వచ్చే చక్కెరవ్యాధిని ‘జెస్టెషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ కండిషన్ ఉన్న మహిళలకు పుట్టే చిన్నారులు కాస్తంత ఎక్కువ బరువుతో పుట్టవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో కాస్తంత ఎక్కువ బరువుగా పిల్లలు పుడితే అది బిడ్డలకు ముప్పుగానూ పరిణమించవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్ ఉన్నవారికి పుట్టే పిల్లలు కాస్తంత ఎరుపు రంగులో ఉండటంతో వారిని ‘టొమాటో బేబీస్’ అంటారు. దీనికి కారణం... పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి ఆహారం అందించే క్రమంలోనూ, ఇతరత్రా రక్తప్రవాహం తోపాటు తల్లిలోని చక్కెర చిన్నారుల శరీరాల్లోకీ ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి చిన్నారిలోనూ ఇన్సులిన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీని మరో పరిణామం ఏమిటంటే... గర్భంలోని బిడ్డ... తన తల్లి నుంచి చాలా ఎక్కువ మోతాదులో పోషకాలను స్వీకరిస్తుంది. అందుకే గర్భసంచిలో ఉన్న బిడ్డ సాధారణం కంటే చాలా ఎక్కువ బరువు పెరుగుతుంది. వీళ్లలో హిమోగ్లోబిన్ మోతాదు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా పిల్లలు మరీ ఎక్కువ బొద్దుగా, బరువు ఎక్కువగా ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘మాక్రోసోమియా’ అంటారు. సరిగ్గా ఈ అంశమే... ఇటు పుట్టబోయే బిడ్డకూ, అటు జన్మనిస్తున్న తల్లికీ... ఇద్దరికీ ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటి సందర్భాల్లో ... ప్రసవం చేసే డాక్టర్ అయిన అబ్స్ట్రెట్రీషియన్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా బిడ్డ ఏ మేరకు బొద్దుగా ఉన్నారనే అంశాన్ని అంచనా వేస్తారు. ఒక్కోసారి సాధారణ ప్రసవం అవుతుందని అనుకున్నా, తల మాత్రమే బయటకు వచ్చి (శీర్షోదయమై) భుజాలు ప్రసవమార్గంలో ఇరుక్కుపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ సమస్య. ఇలాంటి అన్ని అంశాలూ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బిడ్డ మరీ బొద్దుగా ఉంటే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. పైగా బొద్దుగా ఉండటం అన్న అంశం ఆరోగ్యానికి ఏమాత్రం సూచిక కాదు. అది ఛైల్డ్హుడ్ ఒబేసిటీకి దారితీయవచ్చు. దీనికి బదులుగా బిడ్డ సన్నగా ఉన్నా... ఆరోగ్యంగా ఉండటమనేది అందరూ కోరుకునే అంశం. అందుకే చిన్నారి బొద్దుగా పుట్టడం / ఉండటం కంటే ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవడం మంచిది. (చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
ఎముక కేన్సర్ అంటే..?
ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ కేన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్హమ్లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎముక కేన్సర్లో రకాలివి...ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ కేన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు. ఇక ఎముక కేన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ ఈ కేన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన కేన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ కేన్సర్’ అని డాక్టర్లు చెబుతారు. ప్రైమరీ బోన్ కేన్సర్లలో... మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే కేన్సర్) ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన కేన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది) ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ రూన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది). సెకండరీ బోన్ కేన్సర్లలో దేహంలోని... రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రోస్టేట్ వంటి ఇతర ప్రాంతాల్లో వచ్చి కేన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక కేన్సర్కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అమాయకరం కాని ‘నాన్ కేన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు. లక్షణాలు..ఎముక కేన్సర్ లక్షణాలు తొలి దశల్లోనే గుర్తించడం అంతగా సాధ్యం కాదు. లక్షణాలిలా ఉంటాయి. నొప్పి : కేన్సర్ గడ్డ వచ్చిన ఎముక ప్రాంతంలో నిరంతరం నొప్పి వస్తూ సమయం గడుస్తున్నకొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది. వాపు : ఎముక క్యాన్సర్ వచ్చిన చోట స్పష్టంగా వాచినట్లుగా వాపు కనిపిస్తుంది. ఫ్రాక్చర్లు: క్యాన్సర్ వచ్చిన ఎముక బలహీనంగా మారడంతో తేలిగ్గా విరగడానికి అవకాశాలెక్కువ. తీవ్రమైన అలసట, బరువు తగ్గడం : బాధితుల్లో బాగా నీరసం, నిస్సత్తువ, అలసట కనిపిస్తాయి. అలాగే బాధితులు ఎక్కువగా బరువు తగ్గుతారు. చికిత్స... ఒకసారి ఎముక కేన్సర్ నిర్ధారణ చేశాక... ఆ కేన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక కేన్సర్కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. కీమోథెరపీ : కొన్ని మందులతో కేన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి కేన్సర్ల కోసం వాడతారు. రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో కేన్సర్ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు. అన్ని కేన్సర్లలో లాగే ఎముక కేన్సర్నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతోపాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి. బాధితుల్లో కనిపించే మెరుగుదల (ప్రోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన కేన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతోపాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. ఎముక కేన్సర్తో జీవించాల్సి వస్తే... ఎముక క్యాన్సర్తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక కేన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని కేన్సర్లలో లాగానే బాధితులు షాక్కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతోపాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తమకు వచ్చిన కేన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతోపాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙నిర్ధారణ...సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతోపాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక కేన్సర్ నిర్ధారణ చేస్తారు. డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్ మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!) -
నోట్లో పొక్కులు వస్తున్నాయా..?
కొందరికి నోట్లో, నాలుక మీద పగుళ్ళు రావడం, దాంతో ఏవైనా వేడిపదార్థాలూ లేదా కారపు పదార్థాలు తిన్నప్పుడు మంట, బాధ కలుగుతుండటం చాలా సాధారణం. ఇలా నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావడం తోపాటు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగ్జైటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా కనిపించవచ్చు. ఇవి వచ్చినప్పుడు ముందుగా విటమిన్–బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారం పాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్ను సంప్రదించాలి. అరుదుగా కొన్ని సిస్టమిక్ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశమున్నందున డాక్టర్లు తగిన పరీక్షలు చేయించి, కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడంతో అది సైజ్లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
చిక్కే....‘సిస్ట్’ర్స్... జాగ్రత్త!
మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం. ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది. కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్లు వాటంతట అవే కనుమరుగవుతాయి.ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కనపడుతుంది. ఈ సిస్ట్లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది. సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్లో సాధారణంగా కనిపించే సిస్ట్లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే... ఇన్ని రకాల సిస్ట్లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్లో ఉన్న సీరస్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.శస్త్రచికిత్స అవసరమయ్యేవి... కొన్ని సిస్ట్లు మెలిక తిరిగి అంటే టార్షన్కు గురై పేషెంట్కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి. చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్వికన్సల్టెంట్, అబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..
ప్రపంచవ్యాప్తంగా... ఆమాటకొస్తే భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ విస్తృతియే చాలా ఎక్కువ. మొత్తం అన్ని రకాల క్యాన్సర్లను పరిగణనలోకి తీసుకుంటే రొమ్ముక్యాన్సర్కు గురయ్యేవారు 28 శాతం ఉంటారని అంచనా. తాజా ‘గ్లోబకాన్’ లెక్కల ప్రకారం మన దేశంలో రొమ్ముక్యాన్సర్ల కేసుల సంఖ్య 1,78,361 కాగా దురదృష్టవశాత్తు దాని వల్ల 90,408 మరణాలు సంభవించాయి. అయితే కేవలం రొమ్ముక్యాన్సర్పై సరైన అవగాహన లేని కారణం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. సాధారణంగా మహిళల్లో 40 – 50 ఏళ్ల వయసప్పుడు వచ్చే ఈ రొమ్ముక్యాన్సర్ను తొలి దశల్లోనే గుర్తిస్తే దీని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని భరోసా ఇస్తున్నారు. అక్టోబరు నెల రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ముక్యాన్సర్పై అవగాహన పెంపొందించడం కోసమే ఈ కథనం. మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్)తో ΄ాటు మరికొన్ని అంశాలూ కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... రిస్క్ఫ్యాక్టరు...సాధారణంగా రొమ్ముక్యాన్సర్కు కారణమయ్యే రిస్క్లో పెరిగే వయసు, దాంతోపాటు కుటుంబంలో రొమ్ముక్యాన్సర్లు ఉండటం, మొదటి నెలసరి చాలా త్వరగా రావడం, మెనోపాజ్ చాలా ఆలస్యం కావడం, జీవితకాలంలో పిల్లలు లేకపోవడం వంటివి. ∙చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్కు గురి అయ్యే మహిళల్లో రొమ్ము క్యాన్సర్కు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. ఐదు నుంచి పది శాతం కేసుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారిలోనే వస్తుండటం గమనార్హం. బీఆర్సీఏ1, బీఆర్సీఏ 2 వంటి జెనెటిక్ మ్యూటేషన్లు ఉంటే ఆ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. ఇందులో బీఆర్సీఏ 1 జెనెటివ్ మ్యూటేషన్ వల్ల ముప్పు శాతం 72 % కాగా బీఆర్సీఏ 2 వల్ల 69% ముప్పు ఉన్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇక నివారించగలిగే రిస్క్ఫ్యాక్టర్లలో స్థూలకాయం ∙ఆధునిక జీవౖనశెలిలో భాగంగా కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు ∙ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం ∙తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైన బిడ్డకు రొమ్ము పాలు పట్టించడం మేలు. లక్షణాలు...మహిళలు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి లేదా స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అవి హానికలిగించని (బినైన్) గడ్డలా, లేక హానికరమైనవా (మేలిగ్నెంట్) అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం ∙రొమ్ము చర్మం మందంగా మారడం ∙రొమ్ములో సొట్ట పడినట్లుగా ఉండటం రొమ్ము ఆకృతిలో మార్పులు ∙సమస్య ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్. నిపుల్కు సంబంధించినవి: రొమ్ముపై దద్దుర్ల వంటివి రావడం నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటివి స్రవించడం రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం, వాటిలో గమనించగలిగే తేడా రావడం బాహుమూలాల్లో :గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం చేతివాపు (లింఫ్ ఎడిమా)ఇమ్యూనో థెరపీ, టార్గెట్ థెరపీ : శస్త్రచికిత్సతోపాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాధితులకు సరిపడే చికిత్సను డాక్టర్లు అందిస్తారు. వ్యాధి తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడం తోపాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ విషయంలో గతంలోలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ ఎక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ‘నియో అడ్జువెంట్ థెరపీ’ అని ఇస్తారు. తర్వాతి చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండటం కోసం డాక్టర్లు ఈ చికిత్స ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ముందుగా ఆపరేషన్ చేయాలా, లేక కీమోథెరపీ ఇవ్వాలా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. రొమ్ము కేన్సర్ను మొదటి దశలోనే కనుగొంటే 90% పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం ఉంది. చికిత్స... ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉండే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అ΄ోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి.నిర్ధారణ పరీక్ష... తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం ద్వారా మామోగ్రాఫీ అనే స్కాన్ ద్వారా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే పరీక్ష పూర్తి నిర్ధారణ కోసం వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) ఛాతీ ఎక్స్రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ పెట్ స్కాన్. (చదవండి: కిడ్నీలను కిడ్స్లా కాపాడుకుందాం..!) -
పిల్లల అరచేతులు, అరికాళ్లలో దురదలా..ప్రమాదకరమా?
సాధారణంగా పిల్లల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు... మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చాక కొందరు చిన్నారుల్లో ఈ విధమైన లక్షణాలు కనిపి స్తుంటాయి. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. ఇది చాలా సాధారణం. అలాగే ఎగ్జిమా వంటి మామూలు సమస్యలతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, స్ట్రెస్ వంటి కొన్ని సిస్టమిక్ వ్యాధులు ఉన్నప్పుడూ, ఇక సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్లతోపాటు, కొన్నిసార్లు విటమిన్ లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అంత ప్రమాదకరం కాదు గానీ... పైన పేర్కొన్న సోరియాసిస్ వంటివి మినహాయిస్తే ఇలా చర్మం ఉడి΄ోతూ కొత్త చర్మం వచ్చే ఎగ్జిమా వంటి వాటితపాటు... కొంతమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లాగా కూడా వచ్చే ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అనే కండిషన్లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో వాటంతట అవే పూర్తిగా తగ్గి΄ోతాయి. దాదాపుగా ఏమాత్రం ప్రమాదకరం కాదనే చెప్పవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిçశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం వంటివి చేయాలి. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం ΄÷ందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గక΄ోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా పీడియాట్రీషియన్ లేదా డెర్మటాలజిస్ట్ను సంప్రదించాలి. ∙ చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో దురదలా? -
అన్ని డార్క్ సర్కిల్స్ ఒకటి కాదు..
చాలా మంది.. కంటికింద నల్లని వలయాలు కనిపిస్తుంటే ఒత్తిడికి గురవుతున్నామనో నిద్ర సరిగా పోవడం లేదనో అనుకుంటూ ఉంటారు. మార్కెట్లో లభించే క్రీములను రాస్తూ ఉంటారు. కానీ, సరైన పరిష్కారం లభించదు. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అనారోగ్యం అని తెలుసుకుంటే పరిష్కారం కూడా సులువు అవుతుంది.΄ాతికేళ్ల ఏంజెల్ మెడిసిన్ విద్యార్థిని. కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తన శరీరంలో ఏదో తీవ్రమైన సమస్యకు సంకేతమని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఒక ఈవెంట్లో ఏంజెల్ను కలిసిన డెర్మటాలజిస్ట్ ఆమె కళ్లకింద నల్లటి వలయాలను చూసి, అలెర్జీల సమస్యలను సూచిస్తున్నాయనిచెప్పాడు. అందరిలో ఆ విషయం గురించి ఎక్కువ చర్చించలేక ఇంటికి వెళ్లాక డెర్మటాలజిస్ట్కు ఫోన్ చేసింది. డెర్మటాలజిస్ట్ లారెన్ మాట్లాడుతూ – ‘ఈ సమస్యను పెరియార్బిటల్ హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. రక్తనాళాలకు సంబంధించిన సమస్య వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయ’ని వివరించారు. ఇన్నాళ్లూ నిద్రలేమి వల్ల కలిగే సాధారణ సమస్య ఇది అనుకుంది. డాక్టర్ చెప్పిన విధంగా తన కుటుంబంలో జన్యుపరంగా ఉబ్బసం, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంది. ‘మీకున్న అలెర్జీ ఏంటో కనుక్కొని, దానికి తగిన మందులు తీసుకుంటే నల్లని వలయాల సమస్య దూరం అవుతుంది’ అని డాక్టర్ చెప్పడంతో తగిన చికిత్స తీసుకోవడం మొదలుపెట్టింది. రోగనిరోధక శక్తి తగ్గుదలకళ్ల కింద వలయాలు మాత్రమే కాదు చర్మం ముడతలు పడటం, ముక్కుకు అడ్డంగా ఉన్న అలెర్జీ మచ్చలు కూడా తగ్గుతుండే రోగనిరోధక శక్తికి సూచికలు అంటున్నారు వైద్యులు. పోషకాహార నిపుణులు, బ్యూటీషియన్స్ కూడా నల్లటి వలయాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వాటిలో... ∙జన్యుపరమైనవి, పోషకాహార లో΄ాలు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలసట, జీర్ణకోశ సమస్యలు, ఏదీ తినాలని లేకపోవడం.. వంటివన్నీ కంటికింద భాగాన్ని నల్లగా చేస్తాయి. రకరకాల అలెర్జీలు, సైనస్ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కారణాన్ని గుర్తించి, వాటికి దూరంగా ఉంటే అవే తగ్గిపోతాయి. క్రీములకన్నా మేలైనవి.. నల్లటి వలయాలు తగ్గడానికి మార్కెట్లో రకరకాల క్రీములు లభిస్తుంటాయి. వీటిని వాడినా మార్పు రాలేదంటే సాధారణ సమస్య కాదని గుర్తించాలి. ∙రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత ద్రవాహారాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. →ఫేషియల్ ఎక్సర్సైజ్ల వల్ల చర్మ కణాలు చురుకు అవుతాయి. రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. → అలోవెరా, తేనె .. వంటి వాటిని అప్లై చేస్తూ సాధారణ చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఅనర్థాలను నివారించాలంటే.. తీవ్ర అనారోగ్య సమస్యలను గుర్తించడానికి నల్లని వలయాలను ఒక సూచికగా తీసుకోవాలి. ఆస్తమా, బ్రాంకైటిస్, డస్ట్ అలెర్జీల వల్ల నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. చర్మం ΄÷డిబారినా, బి12, ఐరన్ లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బరువు పెరగడంతో చర్మం మందం అవడం, బరువు తగ్గినప్పుడు చర్మం పలచబడటం, వయసు పైబడటం వల్ల చర్మంలో వచ్చిన మార్పుల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కంటి దగ్గర ఉండే భాగాన్ని అలెర్జీ ఉన్నప్పుడు రుద్దుతూ ఉన్నా, మొబైల్, లాప్టాప్.. వంటి స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉపయోగించినా, నైట్ షిఫ్ట్స్ వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి. 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. డ్రై స్కిన్ ఉందంటే మాయిశ్చరైజర్ వాడాలి. బరువు పెరుగుతున్నారంటే ఫిట్నెస్, పోషకాహారం జాగ్రత్తలు తీసుకోవాలి. అలెర్జీ సమస్యలకు వైద్య చికిత్స తప్పనిసరి. – డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
‘పొగ’బెడుతున్నా...పొమ్మనలేమా?
నగరానికి చెందిన ఒక బహుళజాతి సంస్థలో ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన యుక్తవయస్సు నుంచి ధూమపానం చేస్తున్నాడంటే... అతని ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పొగాకుపై ఖర్చు చేస్తున్నట్లే అర్థం. ఉత్సుకత, తోటివారి ఒత్తిడితో, కుటుంబ సభ్యుడు ఒకరు పొగతాగుతున్నట్లు చూసిన తర్వాతే అతనికి ధూమపానం అలవాటు ప్రారంభమైంది. సామాజిక అలవాటుగా మొదలై, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఒక విధానంగా పరిణామం చెందింది. ఆరోగ్య ప్రమాదాలు తెలిసినప్పటికీ, దాన్ని విడిచిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, కష్టపడినా దాన్ని అతను ఆపలేకపోయాడు. ఇది ఒకరికే ప్రత్యేకమైనది కాదు; ఇది దేశంలోని లక్షలాది మందికి సంబంధించింది.నియంత్రణలో సవాళ్లెన్నో...భారతదేశంలో, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన జనాభా కారణంగా పొగాకు నియంత్రణ సంక్లిష్టమైన సవాలును విసురుతుంది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల వల్ల వ్యక్తులు ఈ ఉత్పత్తులపై ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే అధిక పన్నులు అక్రమ పొగాకు వ్యాపారానికి కూడా ఆజ్యం పోస్తున్నాయి. మూడవదిగా చెపపుకోవాల్సింది పొగాకు వినియోగదారులు పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను అధికం అవుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మరింత భారంగా మారుస్తుంది.పొగాకు వాడకంలో... రెండో స్థానం...ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.. 2018 నాటికి 16 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న 250 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. 2020 నాటికి 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 27% మంది పొగాకుకు బానిసలని తేలింది.. పొగాకు వినియోగదారులతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా, చట్టబద్ధంగా ఉత్పత్తి చేస్తున్న సిగరెట్లు మొత్తం పొగాకు వినియోగంలో 8% మాత్రమే ఉండగా, మిగిలిన 92% బీడీలు పొగాకు నమలడం వంటి చౌకైన ఉత్పత్తులను వినియోగానిదే కావడం గమనార్హం.ఆడవారిలోనూ పెరుగుతున్న వినియోగం...జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–21 ప్రకారం... పురుషులు స్త్రీల మధ్య పొగాకు వినియోగంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ... మరోవైపు ఆడవారిలో సైతం పొగాకు వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడి మారుతున్న సామాజిక ఆర్ధిక పరిస్థితుల కారణంగా మగవారిలో ఇప్పటికీ పొగాకు వినియోగం గణనీయంగా ఉంది. పొగాకు వినియోగం ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉంది, వీరికి పొగాకు సంబంధిత హాని ఎక్కువగా ఉంటుంది. విషపూరిత పదార్థాలతో నిండి, ఫిల్టర్లు లేకపోవడం వల్ల బీడీలు సిగరెట్ కంటే ఎక్కువ హానికరమైనవి అయినప్పటికీ, బాగా వినియోగిస్తారు. . బీడీ ఉత్పత్తి మార్కెటింగ్ లపై పెద్దగా తనిఖీలకు అవకాశం లేదు. వీలు కల్పిస్తుంది. చౌకైన పొగాకు ఉత్పత్తుల విక్రయం పేదరికపు ఉచ్చును శాశ్వతం చేస్తుంది.ప్రత్యామ్నాయాలు లేక...మానలేక...యువకులలో (20–44 ఏళ్ల వయస్సులో) ధూమపానం ప్రాబల్యం ఆందోళనకరంగా ఉంది, ఇది శ్రామికశక్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉందనేది మరవకూడదు. నికోటిన్ గమ్లు, ప్యాచ్లు, లాజెంజ్లు, హీట్–నాట్–బర్న్ వంటి ఇతర సాంకేతిక ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల 45% మంది యువకులు ధూమపానం లేదా పొగాకు నమలడం మానుకోలేకపోతున్నారని గత ఏడాది ఒక సర్వే తేటతెల్లం చేసింది. ‘హ్యూమన్–సెంట్రిక్ అప్రోచ్ టు టుబాకో కంట్రోల్’ నివేదికలోని సమీక్షకు స్పందించిన వారిలో 66% మంది 20–25 సంవత్సరాల మధ్య పొగాకును ఉపయోగించడం ప్రారంభించారని, వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుకున్నామని గుర్తించారు.ఇది చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!సమగ్రవిధానంతోనే పరిష్కారం...పొగాకు నివారణలో పొగాకు వినియోగానికి దోహదపడే సామాజిక సాంస్కృతిక కారకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకుపై పూర్తి నిషేధం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది పొగాకు సాగులో నిమగ్నమైన రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పన్ను ఆదాయాన్ని తగ్గిస్తుంది అక్రమ వ్యాపారాన్ని పెంచుతుంది. బదులుగా, విరమణ విద్య రెండింటిపై దృష్టి పెట్టి మరింత సమగ్ర విధానానికి మారాలి.అలాగే, 74% మంది ధూమపానం చేసేవారు, పొగాకు నమిలే వినియోగదారుల కుటుంబంలో పెద్దలు సైతం ధూమపానం అలవాటును కలిగి ఉన్నట్టు తెలుస్తోంది, ఈ పరిస్థితుల్లో వారికి సుదీర్ఘమైన మద్దతు అవసరం. సైన్స్ ఆధారిత పరిష్కారాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యావేత్తలు కమ్యూనిటీ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా, భారతదేశం పొగాకు వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు దానితో సంబంధం ఉన్న పేదరికం వ్యాధుల చక్రాన్ని అడ్డుకోవచ్చు. -
అర్లీ మెనోపాజ్ ప్రమాదమా..?
బాలికకు యుక్తవయసు నాటి నుంచి ప్రతి నెలా వస్తుండే రుతుక్రమం ఒక వయసులో ఆగి΄ోతుంది. అలా ఆగిపోవడాన్ని ‘మెనో΄పాజ్’ అంటారు. మామూలుగా వచ్చే నెలసరి కనీసం ఏడాది పాటు ఏ నెలలోనూ కనిపించకుండా పూర్తిగా ఆగిపోతే అప్పుడే దాన్ని ‘మెనో΄పాజ్’గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య జరుగుతుంది. అంటే సగటున 51వ ఏట ఇది సంభవిస్తుంది. కానీ కొందరిలో మామూలుగా ఆగిపోయే సమయం కంటే చాలా ముందుగానే ఆగితే దాన్ని ‘అర్లీ మెనో΄పాజ్’గా చెబుతారు. ఇలా జరిగినప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. కొందరు మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య రుతుక్రమం ఆగిపోవడానికి బదులు 40 ఏళ్ల లోపు కూడా రుతుక్రమం ఆగి΄ోవచ్చు. ఇలా జరగడాన్ని అర్లీ మెనోపాజ్ లేదా ప్రి–మెచ్యుర్ ఒవేరియన్ ఇన్సఫిషియెన్సీ అని కూడా అంటారు. దీనికి నిర్దిష్టంగా కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. అయితే... కొందరిలో శస్త్రచికిత్స చేసి అండాశయాలు (ఓవరీలు) తొలగించాల్సి రావడం. కొన్ని కుటుంబాల్లో జన్యుపరంగా త్వరగా రుతుస్రావం ఆగిపోతుండవచ్చు కొందరిలో క్రోమోజోముల సమస్య కారణంగా... అంటే టర్నర్ సిండ్రోమ్ వంటివాటితో మానసిక ఒత్తిడి, మంచి ఆహారం తీసుకోకపోవడం, ఏదైనా దెబ్బతగలడం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాల్సి రావడం (ముఖ్యంగా నడుము దగ్గర) అండాశయాలను తొలగించడం పళ్లు, కూరగాయలపై ఉండే రసాయనాలు పొగ, మద్యం అలవాట్లు (విదేశాల్లో ఎక్కువ) థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవించడం కుటుంబ నియంత్రణ కోసం వాడే మందులు డాక్టర్ సలహా లేకుండా విచక్షణరహితంగా వాడటం పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) స్థూలకాయం.త్వరగా రుతుక్రమం ఆగడం ప్రమాదమా? మెనోపాజ్ రాబోతున్న సూచనగా కొందరు మహిళల ఒంట్లో నుంచి వేడి సెగలు వస్తున్నట్లు అనిపించడం (హాట్ ఫ్లషెస్), భావోద్వేగాలు వెంటవెంటనే మారడం (మూడ్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరిలో ఎముకలు పెళుసుబారి తేలిగ్గా విరిగిపోయేలా చేసే ‘ఆస్టియోరోసిస్’ ముప్పు నెలసరి ఆగి΄ోవడంతోనే ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల కొందరిలో గుండెపోటు, గుండెజబ్బుల ముప్పు ∙మూత్ర సంబంధమైన వ్యాధులు (యూరిన్ ఇన్ఫెక్షన్స్) ∙బరువు పెరగడం ∙కొందరిలో డిప్రెషన్, అయోమయం, త్వరగా కోపగించుకోవడం, అలసట వంటి మానసికమైన సమస్యలూ కనిపిస్తాయి.అర్లీ మెనోపాజ్కు తర్వాతి పరిణామాలకు చికిత్స? ఒకసారి మెనో΄పాజ్ ఆగి΄పోయాక దాన్ని పునరుద్ధరించడానికి ఏ చికిత్సతోనూ అవకాశముండదు. కాక΄ోతే మెనో΄ాజ్ తర్వాతి పరిణామంతో మహిళల్లో కొన్ని ఇబ్బందులు కనిపించవచ్చు. వీటికే చికిత్స అవసరం ఒంట్లోంచి వేడి సెగలు (హాట్ఫ్లషెస్) వస్తుండటం వల్ల బాధపడేవారికి హార్మోన్లను భర్తీ చేసేందుకు వచ్చే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) ఇవ్వాల్సి రావచ్చు. ఈ మందుల వల్ల ఒంట్లోంచి సెగలు రావడం ఆగడంతో పాటు ఎముకలూ బలంగా మారతాయి.అర్లీ మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుండగా మొదలయ్యే ఈ చికిత్సను స్వాభావికంగా మెనోపాజ్ వచ్చే వయసు వరకు కొనసాగించాలి. హెచ్ఆర్టీలో ఇచ్చేవి ప్రత్యేకమైన మందులేమీ కావు. శరీరంలోనే స్రవించాల్సిన హార్మోన్లు కొన్ని కారణాల వల్ల స్రవించక΄ోవడంతో వాటిని డాక్టర్లు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. కాబట్టి వీటితో ముప్పు ఏదీ ఉండదు.ప్రిమెచ్యుర్ మెనోపాజ్తో వచ్చే సమస్యలు, వాటి నివారణ కోసం... ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄పొట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం.డాక్టర్ క్రాంతి శిల్ప, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అబ్స్ట్రెట్రీషియన్ (చదవండి: ఆ ఏజ్లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) ప్రిమెచ్యుర్ మెనో΄ాజ్తో వచ్చే సమస్యలు, వాటి నివారణ కోసం... ∙ఆకుకూరలు, పళ్లు సరిగ్గా కడిగి తీసుకోవాలి ∙క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం ∙ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. అంటే... ΄÷ట్టుతో ఉండే గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు నిద్ర΄ోవడం, శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం. -
అన్యురిజమ్స్ అంటే?
మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అకస్మాత్తుగా ప్రమాదకరంగా పరిణమించే ఈ సమస్య గురించి...మెదడులోని ఏప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి ఉంటే ఆప్రాంతం పేరుతో అన్యురిజాన్ని చెబుతారు. ఉదాహరణకు సెరిబ్రమ్ అనే ప్రదేశంలో ఉంటే సెరిబ్రల్ అన్యురిజమ్స్ అంటారు. మెదడు చుట్టూ ఉండే ప్రధాన ప్రాంతం సబార్కనాయిడ్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమైతే దాన్ని ‘సబార్కనాయిడ్ హ్యామరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రదేశాన్ని బట్టి మెదడు ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ అవయవం ప్రభావితమవుతుంది. అయితే ఇలా అన్యురిజమల్ బ్లీడ్కి గురైన ప్రతి ఏడుగురిలోనూ నలుగురు ఏదో ఒక రకమైన వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. కీలక ప్రాంతంలో రక్తస్రావం కాగానే మొదట అది పక్షవాతానికీ (స్ట్రోక్కు), తీవ్రతను బట్టి కోమాలోకి తీసుకెళ్లే అవకాశాలెక్కువ.బయట పడేందుకు అవకాశం తక్కువ... ఎందుకంటే? అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో అవి వారి జీవితకాలంలో అవి చిట్లక΄ోవచ్చు. ఉబ్బు చిన్నగా ఉన్నవి కాకుండా... ‘జెయింట్ అన్యురిజమ్స్’ అని పిలిచే పెద్దవి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలెక్కువ. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా వస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక వల్ల గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు: కంట్రోల్లో లేని అధిక రక్త΄ోటు, డయాబెటిస్ వంటి జబ్బులు. చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు (ఈ కారణంగా ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ) రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్తో కలిగే కాంప్లికేషన్లు ఆరోగ్యకరంగా లేని జీవనశైలి పొగాకు వాడకం, మద్యం అలవాటు యాక్సిడెంట్లో రక్తనాళాలకు గాయం కొన్ని అరుదైన కేసుల్లో : ఉదా. ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియాకిడ్నీల్లో నీటితిత్తులు వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్.చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు: జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం.చికిత్సలు: మందులిస్తూ చేసే చికిత్స: ఇది రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స. రక్త΄ోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొన్ని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె (క్రేనియమ్) తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిగాక ముందులాగే రక్తప్రసరణ జరిగేలా చూస్తారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ను ప్రవేశపెట్టి... అందులో నుంచి మరింత చిన్నపైప్లను అన్యురిజమ్స్ వరకు చేరేలా చేసి, అక్కడ కాయిల్ అనే డివైజ్ని అన్యురిజమ్ నింపడానికి వాడతారు. దాంతో ఉబ్బిన బలహీన ప్రాంతానికి రక్తసరఫరా ఆగడంతో చిట్లడం జరగదు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియతో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. దాంతో పెద్ద రక్తనాళాల దగ్గర ఉన్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇక ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’తో రక్తపు దిశను మళ్లించి ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. (చదవండి: కేరళలో నిఫా వైరస్ కలకలం..!) -
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
జుట్టు రాలకుండా జాగ్రత్త ఇలా...జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. అయితే మనం మామూలుగా ఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రొటీన్ల లోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే మార్గాలూ..ప్రొటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రొటీన్తో కూడిన ఆహారం తీసుకోక΄ోవడమే. ఈ ప్రొటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారంలో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు చాలా ఎక్కువ. శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలి΄ోయేలా చేస్తాయి. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండి΄ోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. నివారణ ఇది: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. -
డయాబెటిస్ లేకపోయినా..తరచు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందా?
తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారిలో సహజంగానే ఇలా జరుగుతుంది. కనుక ఆ వ్యాధి ఉందో, లేదో చెక్ చేయించుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ లేకపోయినా మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందంటే.. దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ముఖం అంతా వాపులకు గురై ఉబ్బిపోయి కనిపిస్తుంది. కాలి మడమలు, కాళ్లు, పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి కిడ్నీ సమస్యలు ఉంటే తీవ్రమైన అలసట వస్తుంది. కొందరిలో రక్తహీనత సమస్య కూడా ఏర్పడుతుంది చర్మం పొడిగా మారి దురదలు పెడుతుంది ∙నోటి దుర్వాసన ఉంటుంది ∙కిడ్నీ సమస్యలు ఉంటే కొందరిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో వెన్ను నొప్పి వస్తుంటుంది వాంతి వచ్చినట్టుగా... వికారంగా అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారు వేడి వాతావరణంలో ఉన్నప్పటికీ చలిగా అనిపిస్తుంది. కొందరు వణుకుతారు. పైన తెలిపిన లక్షణాలు కనుక ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తినాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. (చదవండి: ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..!) -
చిన్న వయసులోనే అని.. జుట్టు పీక్కుంటే ఏం లాభం, ఇవి తెలుసుకోండి!
కాస్త వయసు మీద పడ్డాక అంటే దాదాపు 40-50 ఏళ్ల మధ్య నల్లటి జుట్టు తెల్లగా మారడం సహజమే. కానీ మారుతున్న జీవనశైలి ఇతర కారణలతో చిన్న వయస్సులోనే వైట్ హెయిర్ రావడంపెద్ద సమస్యగా మారుతోంది. దీనికి కారణాలేంటి? చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చిన్న వయసులోనే,అనుకున్నదానికంటే ముందుగానే జుట్టు మెరిసిపోవడం అనేది జన్యుపరమైన సమస్యలతో పాటు అంతర్లీన ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. హెయిర్ ఫోలికల్స్ కణాల ద్వారా తగినంత మెలనిన్ను ఉత్పత్తి చేయనప్పుడు, జుట్టు రంగు మారిపోతుంది. ఇంకా ఒత్తిడి, హార్మోన్ల మార్పులు లేదా బొల్లి లాంటి చర్మ వ్యాధి లాంటి అనేక కారణాలు దీనికి కారణమవుతాయంటున్నారు. డెర్మటాలజిస్ట్లు జన్యుపరమైన కారణం: తల్లిదండ్రులులేదా తాతల్లో ఇలానే చిన్న వయసులోనే జుట్టు తెలబడిపోయిందా? ఒక్కసారి పరిశీలించు కోండి. మన శరీరంలోని కొన్ని జన్యువులు మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇది గ్రే హెయిర్కు దారితీస్తుంది. ఒత్తిడి: శరీరంలో ఫ్రీ రాడికల్స్ ,యాంటీఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సిడేటివ్ ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం,యూవీ రేడియేషన్ , అనారోగ్యకరమైన ఆహారం వంటి బాహ్య కారకాలుదీనికి కారణం. ఈ ఒత్తిడి జుట్టు రంగుకు కారణమైన మెలనోసైట్లను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ లోపాలు: అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లోపం కూడా మరో ముఖ్య కారణం. ముఖ్యంగా విటమిన్ B12,ఐరన్,, రాగి, జింక్ తగినంతగా తీసుకోకపోవడం వల్ల జుట్టు తెల్లబడిపోతాయి. ఈ పోషకాలు మెలనిన్ ఉత్పత్తిలోనూ, హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్లు: శరీరంలో హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా యుక్తవయస్సు, గర్భధారణ లేదా బహిష్టు సమయంలో జుట్టును ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెలనోసైట్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) , కార్టిసాల్ వంటి హార్మోన్లలో హెచ్చుతగ్గులు తెల్ల జుట్టుకు దోహదం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది, జుట్టు రంగును మాత్రమే కాదు వివిధ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక లేదా అధిక స్థాయి ఒత్తిడి మెలనోసైట్లను ప్రభావితం చేస్తుంది. ధూమపానం: వివిధ ఆరోగ్య సమస్యలకారణమై, ఆరోగ్యాన్ని పాడు చేసే ధూమపానంవల్ల శరీరంలోకి హానికరమైన టాక్సిన్స్ చేరతాయి. ఫలితంగా మెలనిన్ ఉత్పత్తితో సహా సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. బొల్లి: ఈ చర్మ వ్యాధి సోకిన వారిలో రోగనిరోధక వ్యవస్థ వర్ణద్రవ్యం కణాలపై దాడి చేస్తుంది. ప్రధానంగా చర్మం,జుట్టు రంగును కూడా ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ : థైరాయిడ్ (హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం) ఉన్నవారిలో కూడా చిన్న వయసులోనే గ్రే హెయిర్ వచ్చే అవకాశః ఉంది. రక్తహీనత ,కీమోథెరపీ, ఇతర కొన్ని మందుల వల్ల కూడా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టుకు దోహదం చేస్తుంది. కెమికల్ ప్రొడక్ట్స్: రసాయనాలతోకూడిన బ్లీచ్ లేదా కలరింగ్ ఏజెంట్లను ఉపయోగించడం ,హెయిర్ ట్రీట్మెంట్స్ ఎక్కువైతే హెయిర్ షాఫ్ట్ దెబ్బతింటుంది . మెలనోసైట్లను ప్రభావితం చేయవచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్: రోగనిరోధక వ్యవస్థను ప్రభావితంచేసే ఆటోఇమ్యూన్ వ్యాధులు, లోపాలవల్ల కూడా తెల్లజుట్టు తొందరగా వచ్చేస్తుంది. అలోపేసియా అరేటా లాంటి డిజార్డర్ కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోవడంతో పాటు తెల్ల జుట్టు, ఇంకా పిగ్మెంటేషన్లో మార్పులు వస్తాయి. కాలుష్యం: వాయు, ఇంధన కాలుష్యం లాంటి పర్యావరణ కాలుష్య కారకాలు జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ కాలుష్య కారకాలు ఫ్రీ రాడికల్స్ను ఉత్పత్తి చేస్తాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఫలితంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. నోట్: ఈ కారణాల్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, లోపాలేంటో గమనించండి. వీలైతే పరిష్కరించుకోండి. దీంతో పాటు చక్కటి ఆహారం, నిద్ర, క్రమం తప్పని వ్యాయామం లాంటి నిబంధనలు పాటించండి. అదీ కానపుడు.. ఇపుడు గ్రే హెయిర్ కూడా ఒక ఫ్యాషనోయ్... అనుకుంటూ ముందుకుసాగిపోండి జాలీగా..! -
సూసైడ్ హెడేక్: ఈ 'తలనొప్పి'తో అంత ఈజీ కాదు!
బీపీ వల్లనో లేదా నిద్ర సరిగా పట్టకపోవడం వల్లో కాస్త తల నొప్పిగా ఉంటుంది. కొంతమందకి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్న ఈ భయానక తలనొప్పిని అనుభవిస్తారు. తలలో కంతుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తిపుణ్యానికి వచ్చే తలనొప్పి ఒకటి ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే..భరించలేక ప్రజలు కెవ్వుకెవ్వుమని అరుస్తూనే ఉంటారట. కొందరైతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని వైద్యుల చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పి బారినే డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి పడ్డాడు. దీంతో అతని జీవితం గందరగోళంగా మారిపోయింది. ఆఖరికి వైద్యులు సైతం దీనికి మందు లేదని జీవితాంత ఆ వ్యాధిని భరించాల్సిందేనని షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు. యూకేకి చెందిన డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి 17 ఏళ్లుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈనొప్పిని తట్టుకోలేక ఆయన గట్టిగా అరవడం, తలను గోడకేసి బాదుకోవడం వంటివి చేసేవాడని తెలిపాడు. తలపై బేస్బాల్ బ్యాట్తో గట్టిగా కొడుతున్నట్లు, కత్తితో కంట్లో పొడుస్తున్నట్లు ఆ నొప్పి ఉంటుందని ఈ 53 ఏళ్ల డారెన్ చెబుతున్నారు. ఆయన ఒక హార్టికల్చర్ఇంజనీర్. ఆయన ప్రతీక్షణం ఈ తలనొప్పి మళ్లీ ఎప్పుడూ వస్తుందో అన్న భయంతో బతుకుతున్నాడు. ఈ తలనొప్పి ఎప్పుడైన రావచ్చొనే సంగతి నాకు తెలుసు గానీ, ఇలా భయంతో బతకడం మాత్రం నరకంగా ఉందని ఆవేదనగా చెప్పారు డారెన్. ఆ నొప్పి 15 నిమిషాల నుంచి మూడు గంటల పాటు ఉంటుందని చెప్పారు. ఇది మొదటగా తన తలకు ఎడమ కన్నుపై నుంచి ప్రారంభమై తర్వాత కన్ను నీరు కారడం మొదలవ్వుతుందని తెలిపారు. ఎవరో కంటిలోపల కత్తితో గుచ్చుతున్న భావన కలిగి, దిండుని పట్టుకుని తట్టుకోలేక అరుస్తుంటానని చెప్పుకొచ్చారు. ఈనొప్పి వచ్చినప్పుడూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ బాధ మరింత ఎక్కువయ్యిందని అన్నారు. ఈ తలనొప్పిని వైద్య పరిభాషలో 'క్లస్టర్ తలనొప్పి లేదా సూసైడ్ తలనొప్పి' అంటారు. దీని కారణంగా అనుభవించే మానసిక వేదన చనిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆ వ్యాధికి ఆ పేరు వచ్చింది. క్లస్టర్ హెడేక్స్ అంటే.. క్లస్టర్ తలనొప్పులు అరుదైనవి. వెయ్యి మందిలో ఒకరిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు అంచనా. తలనొప్పి కంటే ఇది చాలా తీవ్రమైనదని బ్రెయిన్ రీసెర్చ్ యూకే రీసెర్చి మేనేజర్ కేటీ మార్టిన్ అన్నారు. బాధితుడు డారెన్ వివరించినట్లుగా క్లస్టర్ అటాక్ వల్ల కలిగే నొప్పి భరించలేనిది. ఆ నొప్పిని తట్టుకోలేక ప్రజలు అరుస్తారు, గోడలకు తలను బాదుకుంటారు. బాధితులకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు కొత్త చికిత్సల కోసం అవసరమైన పరిశోధనల కోసం తాము నిధులు సమకూర్చుతున్నాం అని పరిశోధకుడు కేటీ మార్టిన్ చెబుతున్నారు. ఈ తలనొప్పి మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిసిస్తుంది. బాధితులు 30 ఏళ్లు పైబడినవారై ఉంటారు. నొప్పి వచ్చే తీరు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలో ఒకసారి నొప్పి వస్తే, కొన్నిసార్లు ఒకే రోజులో పలుమార్లు ఈ నొప్పి వస్తుంది. అయితే నొప్పి వచ్చిన ప్రతీసారి 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు అది కొనసాగవచ్చు. నొప్పితో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు. ఇది ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగానికి దారి తీస్తుంది. దీనివల్ల డిప్రెషన్ వచ్చే ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది. పైగా ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే దీనికి చికిత్స లేదని చెబుతున్నారు. ఇక్కడ డారెన్ కూడా జీవితాంతం ఆ తలనొప్పిని భరించాల్సిందే అని తెలిపారు. వైద్యుల దీనికి మంచి చికిత్స కనిపెట్టే క్రమంలో ఆయనపై ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఆ నొప్పి ఉశమించేలా స్టెరాయిడ్స్, లిథియం సహా గుండె సంబంధిత మందులు, మూర్చకు ఇచ్చే మందులను సైతం వైద్యులు సూచించినట్లు డారెన్ చెబుతున్నాడు. అయితే అవేమి పనిచేయ లేదని అన్నాడు. చివరికి వైద్యులు తనకు ఇంజెక్షన్ని సిఫార్సు చేశారు. ఒక్కోసారి అది పనిచేస్తుంది. ఒక్కోక్కసారి అది కూడా పని చేయదని బాధగా చెబుతున్నాడు. అలాగే మత్తుమందులు నరాలను మొద్దుబారేలా చేయగా, స్టెరాయిడ్స్ ఒక ఏడాది వరకు తలనొప్పి రాకుండా ఆపగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా డారెన్ వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. ప్రస్తుతానికి వైద్యులు చికిత్సలో భాగంగా ఆయనకు తలలో ఒక నర్వ్ బ్లాక్ను ఇంజెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు కూడా లేవు. ఇక్కడ డారెన్ వైద్యలు సరైన చికిత్సా విధానం కనుగొనేంత వరకు ఆయన ఈ తలనొప్పితో జీవించాల్సిందే. అయితే యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు నివేదికలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..) -
అమ్మకు, అమ్మమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కచ్చితంగా వచ్చేస్తుందా?
నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. మా అమ్మకు, అమ్మమ్మకు 50వ ఏట బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు కూడా అలా వచ్చే చాన్స్ ఉందా? ఎలాంటి టెస్ట్లు చేయించాలి? టెస్ట్ల ద్వారా ముందుగా కనుక్కోవచ్చా? – జి. చిన్ని, ఎమ్మిగనూరు కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఆ కుటుంబ సభ్యులు 25వ ఏట నుంచే గైనకాలజిస్ట్ని లేదా జెనెటిక్ కౌన్సెలర్ని కలవాలి. ఇప్పుడు ఫ్యామిలీ క్యాన్సర్ క్లినిక్స్, జెనెటిక్ క్లినిక్స్ చాలా చోట్ల ఉంటున్నాయి. ఈ రకమైన కన్సల్టేషన్లో.. మీ కుటుంబంలో ఏవిధమైన క్యాన్సర్ ఉంది? అది వంశపారంపర్యంగా మీ జీవితం కాలంలో మీకు వచ్చే చాన్స్ ఎంత? ఎలాంటి టెస్ట్తో ముందే కనిపెట్టి చెప్పవచ్చు? ఏ టెస్ట్తో నివారించవచ్చు? వంటివాటితో రిస్క్ను అంచనా వేస్తారు. కొన్ని జన్యుపరమైన పరీక్షలను సూచిస్తారు. కేవలం 5 శాతం బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. కుటుంబంలో ఆల్టర్డ్ జీన్ కనుక ఉంటే తర్వాత తరానికీ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్స్కి చాలా వరకు వంశ పరంపర ఉండదు. మీ కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంది కాబట్టి మీరు ప్రతి నెలసరి తరువాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామూలుగా అయితే దీన్ని 40 ఏళ్లకి మొదలుపెడతారు. 50 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏడు ఈ పరీక్షను చేయించుకోవాలి. 50–70 ఏళ్ల మధ్య ప్రతి మూడేళ్లకోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామోగ్రఫీ అంటే ఎక్స్ రేతో చేసేది. అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. నొప్పిలేని లంప్ ఏదైనా చేయికి తగిలినా.. బ్రెస్ట్ సైజ్, షేప్ మారినా, స్కిన్లో తేడా కనిపించినా.. నిపిల్ డిశ్చార్జ్ ఉన్నా.. చంకల్లో వాపు ఉన్నా.. వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. పెయిన్ అనేది చాలావరకు క్యాన్సర్ సింప్టమ్ కాదు. జీన్ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వశపారంపర్య బ్రెస్ట్ క్యాన్సర్కి ముఖ్యంగా బీర్సీఏ 1, బీఆర్సీఏ 2 జీన్స్ కారణం. ఇవి మీలో జీన్ చేంజెస్ అయినాయా లేదా అని జెనెటిక్ పానెల్ టెస్ట్ చేసి తెలుసుకుంటారు. జీవనశైలిలో మార్పు ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గించవచ్చు. ఎత్తుకు తగిన బరువును మెయిన్టేన్ చేయడం, కనీసం 30 నిమిషాల వ్యాయామాన్ని వారానికి కనీసం అయిదురోజులు చేయడం, పౌష్టికాహారం వంటివన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గించడానికి దోహదపడతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?) -
మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్కి కారణమా?
పెద్ద పెద్ద ఆహార నిపుణులని పిలవబడేవాళ్ళందరూ భారతీయ ఆహారంలో ప్రొటీన్లు లేవు, పిండిపదార్థాలే ఎక్కువ ఇవే మధుమేహానికి కారణం అని ఊదరగొట్టి భయపెడుతుంటారు. అది నిజం కాదు అంటూ ట్విటర్ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రముఖ వైద్యులు శ్రీకాంత్ మిరియాల. ఆ వివరాలు మీకోసం యథాతథంగా . డా. శ్రీకాంత మిర్యాల ట్విటర్లో షేర్ చేసిన వివరాలు ►ప్రొటీన్లు అనేవి మన శరీర నిర్మాణానికే కాకుండా దేహంలో ఎన్నో జీవక్రియలు చేస్తుంటాయి. ఈ ప్రొటీన్లు ఉన్నపళంగా ఆహారంలోనివి మన ఒంట్లోకి చేరుకోవు, చేరుకున్నా అవి మన ప్రోటీన్లు కావు కాబట్టి దానికి మన దేహం వాటికి ప్రతిచర్య చూపిస్తుందే కానీ వాడుకోవు దాన్ని. ► ప్రొటీన్లు అనేవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి, ఇవేంటంటే గోడలో ఇటుకల్లా ఒక్కో అమైనో ఆమ్లం ఇంకో దాంతో జతచేరి అలా పొడవైన గొలుసులు ఏర్పడి, అ గొలుసులు మడతపడి గట్టి లేదా మెత్తటి ప్రొటీన్లు తయారవుతాయి. బాక్టీరియా, మొక్కలు, జంతువులు, మనిషి ఎవరైనా ఇదే పద్ధతి. ఇప్పుడు మనం ఈ ప్రోటీన్లని తిన్నప్పుడు మన జీర్ణాశయం వాటిని ముక్కలు చేసి, పేగుల్లో ఆ ప్రోటీన్లు జీర్ణం అయ్యి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైనవాటిని మనశరీరం శోషించుకుని వాడుకుని మనకి కావలసిన ప్రొటీన్లని తయారుచేసుకుంటుంది. ► మొత్తంగా ఈ అమైనో ఆమ్లాలు ఇరవై ఉంటాయి. వీటిలో తొమ్మిది మాత్రమే ఆవశ్యకమైనవి. అంటే మిగతా 11 మనదేహం తయారుచేసుకుంటుంది. ఆ తొమ్మిది మాత్రం ఆహారంలోంచి తీసుకోవాలి. ► భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైనది. ఇందులో మనకి కావాల్సిన అన్ని పోషకాలుంటాయి. కాకపోతే అవి తినే మోతాదు సరిచూసుకోవాలి. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయాధారిత జనాభా కాబట్టి పనిచేసేందుకు చాలా శక్తి అవసరం అందుకోసం పిండిపదార్థాలు ఎక్కువ తీసుకునేవాళ్లు. ఇప్పుడు దాదాపు 30-40% జనాభా పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు. వీరి రోజువారీ పనిలో శ్రమ వ్యవసాయమంత ఉండదు కానీ పాత మోతాదులోనే అన్నం, గోధుమలు తినడం వలన శక్తి ఖర్చవక ఊబకాయం వస్తోంది. ► పూర్వం నూనె ఖరీదైంది అందువలన భారతీయ వంటకాల్లో దాని వాడకం తక్కువ, కానీ ఇప్పుడు మెల్లిగా నూనె వాడకం ఎక్కువయ్యి ఉడికించిన కూరల బదులు వేపుళ్లు, అలాగే నూనెలో మునిగితేలి వేయించిన పిండి పదార్థాలు ఎక్కువయ్యాయి. ఐది కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ► కాబట్టి పాత పద్ధతిలో సమతుల్య ఆహారం తింటూ వ్యాయామం ద్వారా ఎక్కువ శ్రమ చెయ్యగలిగితే భారతీయ ఆహారం, అది యే రాష్ట్రానిదైనా మంచిదే. -
పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?
పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ)ని ఆయుర్వేద వైద్యంలో "కంపా వట" అని పిలుస్తారు, ఇది శరీరం యొక్క అవయవాలు అతిశయోక్తి కదలికలను ప్రదర్శిస్తాయని అర్థం. పీడీ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ క్షీణించిన వ్యాధి, ఇది మోటారు నైపుణ్యాలు, ప్రసంగం మరియు అనేక ఇతర విధులను ప్రభావితం చేస్తుంది, ఇది ప్రధానంగా డోపమైన్-ఉత్పత్తి చేసే కణాల నష్టం కారణంగా సంభవిస్తుంది. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక క్షీణత అనే రుగ్మత. ఇది ప్రధానంగా మోటారు వ్యవస్థను, అనగా శరీర అవయవ చలనమును ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్ర పడే కొద్ది, నాన్ మోటార్ లక్షణాలు సర్వసాధారణం అవుతాయి. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా బయటపడతాయి..వ్యాధి ప్రారంభంలో, చాలా స్పష్టమైన లక్షణాలు అంటే వణుకు, బిగుసుకు పోవడం , కదలిక మందగించడం, నడకలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ఆలోచించడం, ప్రవర్తనా సమస్యలు కూడా సంభవించవచ్చు. వ్యాధి ప్రారంభదశల్లో చిత్తవైకల్యం, జ్ఞాపక శక్తి తగ్గటం సాధారణం అవుతుంది. లక్షణాలు: కండరాల దృఢత్వం వణుకు నెమ్మదిగా శారీరక కదలిక (బ్రాడికినిసియా) మరింత తీవ్రమైన సందర్భాల్లో భౌతిక కదలిక (అకినేసియా) తోపాటు సంతులనం పూర్తిగా కోల్పోవడం. సాధారణ నిర్వహణ: విటమిన్ ఇ, బి12, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి ఎందుకంటే ఈ పోషకాలు మొత్తం మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఉదా. అవకాడో, సాల్మన్, సార్డిన్, అవిసె గింజలు, నానబెట్టిన గింజలు మొదలైనవి. బెర్రీలు, తాజా సాల్మన్ మొదలైన యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ తీసుకోండి. అశ్వగంధ, కర్కుమిన్ కూడా ఈ పరిస్థితికి చాలా సహాయకారిగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి దూలగొండి (ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens(కపికచ్చు)), దాని సహజ L-డోపా కంటెంట్కు కూడా ప్రసిద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి ప్రామాణిక ఔషధ చికిత్సలో ఎల్-డోపా కీలకమైన భాగం. --ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
కాపాడే కన్నీరు పొడిబారితే..!
కన్ను ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఏదైనా కాస్త తగలగానే కళ్లల్లోంచి నీళ్లు కారిపోతుంటాయి. కన్ను పొడిబారితే ప్రమాదమని ప్రకృతి ఈ కన్నీళ్లను ఏర్పాటు చేసింది. నిత్యం ఏసీ గదుల్లో ఉండటం, కంప్యూటర్దో, ల్యాప్టాప్లదో, ఆఖరికి మొబైల్ స్క్రీన్నో ఎప్పుడూ చూస్తూ ఉండటంతో పాటు... కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు, జబ్బులు ఉన్నప్పుడు కూడా కన్నుపొడిబారుతుంది. ఇలా పొడిబారడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చేందుకూ, ఒక్కోసారి చూపు కోల్పోయేందుకూ అవకాశముంది. కన్ను పొడిబారే సమస్యను వైద్య పరిభాషలో ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’(డ్రై ఐ) అని చెబుతారు. ఈ కండిషన్ అవగాహన పెంచుకుని, కంటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. కంటిని తడిగా ఉంచడానికి లాక్రిమల్ గ్లాండ్స్ అనే ప్రధాన కన్నీటి గ్రంథితో పాటు మ్యూసిన్ గ్లాండ్స్, మొబిమియన్ గ్లాండ్స్ అనే మరో రెండు రకాల గ్రంథులూ తోడ్పడతాయి. ఇందులో లాక్రిమల్ గ్లాండ్స్ నీటి మోతాదులెక్కువగా ఉండే కన్నీటినీ, మ్యూసిన్ గ్లాండ్స్ కాస్త జిగురుగా ఉండే పదార్థ్ధాన్నీ, ఇక మెబొమియాన్ గ్లాండ్స్ అనేవి కాస్త నూనెలా ఉండే పదార్థాన్ని (ల్యూబ్రికెంట్గా ఉపయోగపడేందుకు) స్రవిస్తాయి. ఈ మూడూ కలిసి పూర్తి కన్నీటి స్రావాలకు కారణమవుతాయి. గ్రంథుల పనితీరు మారుతుండే లోపాలు... ఈ మూడు గ్రంథుల పనితీరుల్లో, దేనిలో లోపం వచ్చినా... కన్నీటి నాణ్యత దెబ్బతింటుంది. ఏయే గ్రంథుల్లో లోపాలుంటాయో, దాన్ని బట్టి కన్నుపొడిబారడమనే ప్రక్రియలోనూ తేడాలొస్తాయి. ఉదాహరణకు... లాక్రిమల్ గ్లాండ్ కన్నీటిలోని నీళ్లను స్రవిస్తుంది. కాబట్టి దీనిలో లోపంతో కన్నీటిలోని నీరు మోతాదులు తగ్గుతాయి. మ్యూసిన్ తగ్గితే ‘టియర్ బ్రేకింగ్ టైమ్’ తగ్గుతుంది. అంటే కన్నీరు స్రవించాక అది ఓ పొర (ఫిల్మ్)లా ఏర్పడి... కొంతసేపు కన్ను ఉపరితలం మీద ఉంటుంది. ఏర్పడ్డ తర్వాత ఆ ఫిల్మ్ ఎంతసేపు ఉంటే... కంటికి అంత రక్షణ. ఇక కన్ను త్వరగా పొడిబారుతుందంటే... (అంటే నీరు త్వరత్వరగా ఆవిరైపోతుందంటే) మెబోమియన్ గ్లాండ్స్ పనితీరు తగ్గిందని అర్థం. బయట గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు (విసురుగా గాలి వీస్తున్నప్పుడు), టూవీలర్ డ్రైవింగ్లో కన్నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. కానీ జీవనశైలి మార్పులతో అంటే ఏసీలు, స్క్రీన్ను చాలాసేపు చూడటం, పొగతాగడం వంటి అలవాట్లతో ఆవిరి కావడం పెరుగుతుంది. దీన్నే ‘ఎవాపరేటివ్ డ్రై ఐ’ అంటారు. కన్ను పొడిబారడానికి మరికొన్ని కారణాలు... కన్ను పొడిబారడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి... ∙వయసు పైబడటం: వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను పొడిబారడమూ పెరుగుతుంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఇది ఎక్కువ. ∙కొన్ని వైద్య సమస్యలు: థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సాధారణ ఆటోఇమ్యూన్ సమస్యలు, కొలాజన్ వాస్క్యులార్ డిసీజ్, దీర్ఘకాలిక డయాబెటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమటోసిస్ వంటి రుగ్మతలు ఉన్నవారిలో, కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువ. కొన్ని రకాల మందులు: యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైటీని తగ్గించే మందులు, శరీరంలో నీటిని బయటకు పంపించే డైయూరెటిక్స్, మహిళల్లో గర్భనిరోధక మందులు, స్టెరాయిడ్స్, దీర్ఘకాలం పాటు గ్లకోమాకు మందులు వాడేవారిలో... ఇలా అనేక మందులతో ఈ సమస్య పెరుగుతుంది. జీవనశైలి మార్పులతో : ∙ ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం కనురెప్పలను తక్కువగా కదిలించడం... కంప్యూటర్పైనా లేదా ల్యాప్టాప్, టీవీ, మొబైల్ వరకూ ఏదైనా స్క్రీన్ను ఎక్కువగా సేపు చూస్తుండటం, మైక్రోస్కోప్ వంటి ఉపకరణాలపై ఎక్కువగా పనిచేయడం. ∙కనురెప్పలను పూర్తిగా మూయలేకపోవడం. కంటికి గాయం కావడం వల్ల కనురెప్పలను తగినంత కదిలించలేనప్పుడు. ∙కనురెప్ప అంచుల్లో ఇన్ఫెక్షన్ (బ్లెఫరైటిస్) ఉన్నవారిలో కన్ను పొడిబారడం ఎక్కువ. ∙కంటికి లేజర్ చికిత్స చేయించుకున్నవారిలో మొదటి మూడునెలల్లో మాత్రం కన్నుపొడిబారే సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక కొందరిలో కారణాలేవీ కనిపించకుండానే ఈ సమస్య రావచ్చు. కళ్లలో మంట: కళ్లలో తగినంతగా నీరు స్రవించనప్పుడు కళ్లు మంటలు వస్తాయి. కానీ కళ్లు ఎర్రబారవు. మసక బారడం: కొందరిలో చూపు కాస్తంత మసకబారవచ్చు. వెలుగును చూడలేకపోవడం: ఎక్కువ వెలుగును చూడలేకపోవడం, ప్రకాశవంతమైన కాంతిని భరించలేకపోవడం. కాంటాక్ట్ లెన్స్లు పెట్టుకునేవారిలో: కాంటాక్ట్లెన్స్లు వాడటంలో ఇబ్బందిగా ఉండటం. ఇబ్బందులివీ.. కన్ను పొడిబారడం వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలా ఉండవు. ఈ కింద పేర్కొన్న వాటిలో కొన్ని కనిపించవచ్చు. ∙కొందరిలో కంటిపైన ఉండే కంజెక్టివా పొరలో ఇన్ఫెక్షన్ రావచ్చు. (కంజంక్టివైటిస్). ∙కొందరిలో కార్నియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సమస్య తీవ్రతను బట్టి కొందరి కళ్లలో చిన్న చిన్న పుండ్లు రావచ్చు. చాలా అరుదుగా కొందరిలో కార్నియా దెబ్బతినే ప్రమాదంకూడా ఉండవచ్చు. నిర్ధారణ ఇలా... లక్షణాలను బట్టి కంటి డాక్టర్లు సమస్యను నిర్ధారణ చేస్తారు. అయితే కొందరిలో కొన్ని రకాల ఇతర వ్యాధుల వల్ల (జోగ్రన్స్ సిండ్రోమ్ వంటి వాటి కారణంగా) ఇలా జరుగుతుందేమో అని చూస్తారు. అందుకే కన్ను పొడిబారిన లక్షణాలు ఉండేవారికి వ్యాధి నిర్ధారణ చేసే సమయంలో అనేక ఇతర లక్షణాలను కూడా డాక్టర్లు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ష్కిర్మర్ టియర్ టెస్ట్: కొన్ని సందర్భాల్లో ష్కిర్మర్ పరీక్షతో దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో ఒక రకం ఫిల్టర్ పేపర్ను కంటి కిందివైపు రెప్ప కింద ఐదు నిమిషాల పాటు ఉంచుతారు. ఆ వ్యవధిలో ఆ పేపర్ ఎంత తడి అవుతుందో పరిశీలించడం ద్వారా లాక్రిమల్ గ్లాండ్ లోపాల్ని పరీక్షిస్తారు. టియర్ బ్రేకప్ టైమింగ్ : కంటి ఉపరితలంపై ఏర్పడే టియర్ ఫిల్మ్ ఎంతసేపటికి బ్రేక్ అవుతుందో తెలుసుకునే ఈ పరీక్షతో మ్యూసిన్ గ్రంథి లోపాలను తెలుసుకుంటారు. మెబోమియోగ్రఫీ : ఈ టెస్ట్తో మెబోమియన్ గ్రంథి లోపం తెలుస్తుంది. ఓసీటీ : ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ (ఓసీటీ) అనే పరీక్ష ద్వారా టియర్ ఫిల్మ్ మందం ఎంత ఉందో తెలుసుకుంటారు. చికిత్స... గతంలో కన్నీటిని స్రవించే చుక్కల మందులు, జెల్స్తో చేసే చికిత్స స్థానంలో ఇప్పుడు ఏయే గ్రంథి లోపాలు ఏమిటో తెలుసుకుని, వాటికి అనుగుణంగా చేసే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు... కృత్రిమ కన్నీటి మందులు: కృత్రిమంగా కన్నీళ్లను పెంచే చుక్కల మందులు, జెల్ రూపంలో లభ్యమయ్యే మందుల్ని వాడటం ద్వారా డాక్టర్లు లాక్రిమల్ గ్లాండ్ పనితీరును చక్కదిద్దుతారు. ‘సైక్లో ఇమ్యూన్ ఐ డ్రాప్స్’ కూడా డ్రై ఐ చికిత్సకు ఉపయోగపడతాయి. అలాగే లాక్రిమల్ ప్లగ్స్ను వాడతారు. వీటివల్ల కన్నీళ్లు ముక్కులోకి జారిపోవు. దాంతో అవి కళ్ల లోనే ఎక్కువసేపు ఉండి కళ్లను తడిగా ఉంచుతాయి. ఇక మ్యూసిన్ గ్రంథి పనితీరు మెరుగుపరచడానికి ‘సెక్రిటోగ్యాగ్స్’ అనే ఉపకరణాలు ఉపయోగిస్తారు. మొబోమియన్ గ్లాండ్స్ పనితీరును మెరుగుపరచడానికి కొన్ని రకాల మసాజ్లు, థెర్మో థెరపీలతో పాటు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడతారు. డ్రై ఐ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారిలో సంప్రదాయ చికిత్సలతో తగ్గనప్పుడు బాధితుని నుంచి సీరమ్ (ఆటోలాగస్ సీరమ్) సేకరించి, చుక్కల రూపంలో వాడతారు. ∙శస్త్ర చికిత్స : ఈ చికిత్సలో భాగంగా నోటిలోని అతి మృదువైన పొరలను తీసి, కంటిలో అమర్చి... పరిస్థితిని చక్కబరుస్తారు. ఇవేకాకుండా... పని ప్రదేశాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, కంప్యూటర్ ముందు కంటిని హాని తక్కువగా ఉండేలా ఎలా కూర్చోవాలో, తగిన వ్యాయామాలేమిటో, బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి పనిచేసే గదిలో తేమ (హ్యుమిడిటీ) పెంచుకోవడం... ఇవన్నీ బాధితులకు కౌన్సెలింగ్లో డాక్టర్లు చెబుతారు. కన్నుపొడిబారిపోవడం వల్ల ఒక్కోసారి చూపుకోల్పోవడం లాంటి పెను ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే కన్నుపొడిబారుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన మందులు వాడాలి. ∙ (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు.. -
‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే?
కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్ డిసీజ్, సిస్టమిక్ స్మ్లికరోసిస్, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్లో ప్రధానమైనది లూపస్ అని పిలిచే వ్యాధి. లూపస్ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్ అంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు... లూపస్లో కనిపించే ఈ (మాలార్) ర్యాష్ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు. కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్ రావచ్చు. తరచూ జ్వరం వస్తుంటుంది. బరువు తగ్గుతుంది. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి. కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు మిగతా వాస్క్యులార్ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు. అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... కొలాజెస్ వాస్క్యులార్ డిసీజ్లోని లూపస్ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అంటారు. చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్ఎల్ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. --డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..) -
ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?
‘సర్, చూడండీ.. అతను ఇక్కడే ఉన్నాడు. ఆ తలుపు చాటు నుంచి చూస్తున్నాడు’ అంది శోభ. నిజానికి అక్కడెవ్వరూ లేరు. అయినా ‘అతనెవరూ?’ అని అడిగాను. ‘తెలీదు సర్. కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఆఖరికి వాష్రూమ్కి కూడా. అందుకే స్నానం చేయడం కూడా మానేశా. ’‘ఎన్నాళ్ల నుంచీ ఇలా జరుగుతోంది? ’‘రెండు నెలల నుంచి సర్. ’‘ఇంకా ఏం జరుగుతోంది? ’‘నిన్ను చంపేస్తా అంటున్నారు సర్. ’‘ఎవరంటున్నారు? ’‘ఎవరో తెలియదు సర్. నాలోంచే మాటలు వినిపిస్తున్నాయి. చాలా భయమేస్తోంది. అందుకే ఎక్కడికీ వెళ్లడం లేదు. ’‘సర్లెండి. వాళ్లతో నేను మాట్లాడతాను’ అని ధైర్యం చెప్పా. శోభ ఒక గృహిణి. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అందమైన కుటుంబం. అయితే గత రెండు నెలలుగా శోభ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. తనతో ఎవరో మాట్లాడుతున్నారని, తనకు ఎవరో కనిపిస్తున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడుతూ తన గది నుంచి బయటకు రావడంలేదు. మొదట సర్ది చెప్పాలని ప్రయత్నించిన భర్త తన ప్రయత్నాలు విఫలం కావడంతో కౌన్సెలింగ్ సెంటర్కు తీసుకువచ్చారు. శోభ డెల్యూజన్స్, హెలూసినేషన్స్తో బాధపడుతోందని అర్థమైంది. సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె స్కిజోఫ్రీనియాతో బాధపడుతోందని నిర్ధారించుకుని చికిత్సకోసం సైకియాట్రిస్ట్కు రిఫర్ చేశాను. తీవ్రమైన మానసిక రుగ్మత స్కిజోఫ్రీనియా తీవ్రమైన మానసిక రుగ్మత. అది మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తూ ఆలోచనలు, జ్ఞాపకశక్తి, ప్రవర్తనలో జోక్యం చేసుకుంటుంది. దానివల్ల రోజువారీ జీవితం కష్టంగా మారుతుంది. ఇది లక్షకు 220 మందిలో కనిపిస్తుంది. ప్రాణాంతకం కాదు. కానీ ప్రమాదకరమైన, హానికరమైన ప్రవర్తనలకు దారితీయవచ్చు. మూడింట ఒక వంతు మందిలో లక్షణాలు కాలక్రమేణా తీవ్రం అవుతాయి. పదిశాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్ల సక్రమంగా చికిత్స చేయిస్తూ, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. మూడు ప్రధానకారణాలు.. స్కిజోఫ్రీనియాకు నిర్దిష్టంగా ఒక కారణమంటూ లేదు. వివిధ కారణాల వల్ల సంభవిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, తీవ్రమైన ఒత్తిడి కారణాలు కాగలవు. అలాగే గర్భధారణ సమయంలో తల్లి అనారోగ్యం, తక్కువ బరువుతో పుట్టడం వల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. యుక్తవయసులో భారీగా గంజాయి వాడకం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబంలో స్కిజోఫ్రీనియా ఉంటే వచ్చే ప్రమాదం ఎక్కువ. స్కిజోఫ్రీనియాకు మూడు ప్రధాన కారణాలు: 1. సెల్–టు–సెల్ కమ్యూనికేషన్ కోసం మీ మెదడు ఉపయోగించే రసాయన సంకేతాలలో అసమతుల్యత. 2. పుట్టుకకు ముందు మెదడు అభివృద్ధి సమస్యలు. 3. మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్షన్లు నష్టపోవడం. శాశ్వత చికిత్స లేదు.. స్కిజోఫ్రీనియాను శాశ్వతంగా నయం చేసే చికిత్స లేదు. అయితే చికిత్సతో లక్షణాలను మేనేజ్ చేయవచ్చు. కొద్దిమంది పూర్తిగా కోలుకోవచ్చు. స్కిజోఫ్రీనియా చికిత్సలో సాధారణంగా యాంటీసైకోటిక్స్ మందులు ఉపయోగిస్తారు. ఇవి సెల్–టు–సెల్ కమ్యూనికేషన్ కోసం మెదడు స్రవించే రసాయనాలను అడ్డుకుంటాయి ∙కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) వంటి టాక్ థెరపీ పద్ధతులు పరిస్థితిని ఎదుర్కోవటానికి సహాయపడతాయి. ఇతర చికిత్సలు పని చేయకపోతే వైద్యులు ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ (ఉఇఖీ)ని సిఫార్సు చేయవచ్చు ∙స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. వైద్యులు చెప్పకుండా ఆపకూడదు నిర్దేశించినట్లుగా డాక్టర్ని సంప్రదించాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా చర్చించాలి. ∙మద్యం, మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి ∙కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. ఐదు ప్రధాన లక్షణాలు.. స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వ్యక్తులు లక్షణాలను గుర్తించలేరు. కానీ చుట్టూ ఉన్నవారు గుర్తించవచ్చు. దీనికి ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. వీటిలో ఏ మూడు లక్షణాలు నెలకు పైబడి కనిపించినా వెంటనే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ను సంప్రదించాలి. సైకోడయాగ్నసిస్తో పాటు వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ చేసుకోవాలి. 1. కొన్ని నమ్మకాలు తప్పు అని చాలా సాక్ష్యాలు ఉన్నప్పటికీ అవి నిజమేనన్న భ్రమలో ఉండటం. 2. ఎవరికీ వినిపించని స్వరాలను వినడం, ఎవరూ చూడలేని వాటిని చూడటం. అలాగే వాసన, రుచి చూడగలగడం. 3. ఆలోచనల్లో గందరగోళం వల్ల మాటల్లో కూడా స్పష్టత లేకపోవడం. అసంబద్ధంగా మాట్లాడటం. 4. చుట్టూ ఉన్న వ్యక్తులు ఊహించిన దానికంటే భిన్నంగా కదలడం లేదా ఎలాంటి కదలికలూ లేకుండా రాయిలా ఉండిపోవడం. 5. రోజువారీ పనులను చేయగల సామర్థ్యం తగ్గడం లేదా కోల్పోవడం. మాటల్లో, ముఖకవళికల్లో ఎలాంటి ఎమోషన్స్ చూపకపోవడం. 6. ఇంకా పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, అనుమానించడం, భయపడటం, నిరాశ, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు. సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
విపరీతమైన దగ్గు, ఆయాసంతో ఊపిరి సలపనివ్వడం లేదా? ఐతే ..
ఇది పొగచూరడం లాంటి ఏవో అడ్డంకులతో, ఊపిరిత్తుల్లో వచ్చే సమస్యతో, దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధితుల్ని వేధించే జబ్బు అని పేరును బట్టి తెలుస్తుంది. దగ్గు, ఆయాసంతో వ్యక్తమయ్యే ఈ సమస్య ప్రధానంగా పెద్దవారినే వేధిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక (జన్యు) కారణాలతో చిన్న వయసువారిలో కూడా కనిపించవచ్చు. పొగతాగే అలవాటుతో పురుషుల్లో, ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఉంటే... ఈ కారణంగా మహిళల్లో ఈ జబ్బు కనిపించే అవకాశాలెక్కువ. అసలే దగ్గుతో ఊపిరి సలపనివ్వని ఈ సమస్య, చలి కాలంలోని చల్లటి వాతావరణానికి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది. దీని పేరే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. సంక్షిప్తంగా సీఓపీడీ అని పిలిచే ఈ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. దగ్గు ప్రధానంగా లక్షణంగా వ్యక్తమయ్యే సీవోపీడీ సమస్య పెద్దల్లో... అందునా 40 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లూ, బీడీలూ, చుట్టలూ, హుక్కా కాల్చే వారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యాల్లో ఉండే దుమ్మూ, ధూళితో పాటు బొగ్గుగనులు, సిమెంట్, టెక్స్టైల్స్, రసాయనాల కాలుష్యం వెలువడే పరిశ్రమల దగ్గర ఉండేవారిలోనూ, ఆభరణాలకు పూతపూసే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి కార్ఖానాల్లో పనిచేసేవారిలో కూడా ఇది ఎక్కువ. కారణాలు.. పొగతాగే అలవాటు ఉన్నవారిలో లేదా నిత్యం కాలుష్యాలకు ఎక్స్పోజ్ అవుతున్నవారిలో ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే శ్వాసనాళాలు వాపునకు గురవుతాయి. దాంతో ఊపిరి సరిగా అందదు. లంగ్స్ నిండుగా, కాస్త బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇక ఆస్తమా ఉన్న వ్యక్తులు సరైన చికిత్స తీసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోని సందర్భాల్లో... దీర్ఘకాలిక దుష్ప్రభావంగా సీవోపీడీ రావచ్చు. లక్షణాలు.. సీవోపీడీలో దగ్గు, ఆయాసాలు ప్రధాన లక్షణాలు. అయితే తీవ్రతను బట్టి ఇతరత్రా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా తీవ్రతను బట్టి ఈ వ్యాధిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... గోల్డ్ 1 (మైల్డ్), గోల్డ్ 2 (మోడరేట్), గోల్డ్ 3 (సివియర్), గోల్డ్ 4 (వెరీ సివియర్). ఇక్కడ గోల్డ్ అనేది ‘గ్లోబల్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్’ అనే సంస్థకు సంక్షిప్త రూపం. ‘గోల్డ్’ సంస్థ... సీవోపీడీ మీద పరిశోధనలు చేస్తూ పల్మనాలజిస్టులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తుంది. సీవోపీడీ అనగానే కేవలం ఊపిరితిత్తుల సమస్య అనే అనుకుంటాం. కానీ బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలూ ఎక్కువే ఉంటాయి. మచ్చుకు... ఆస్టియో పోరోసిస్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్ పల్మొనాలె... మొదలైన సమస్యలతో ఇది కలిసి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ, చికిత్స అందించాల్సి ఉంటుంది, దీనినే ‘సిండమిక్ అప్రోచ్’ అంటారు. ఈ నెలలోనే 2024కు సంబంధించిన కొత్త చికిత్స మార్గదర్శకాలను ‘గోల్డ్’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ.. స్పైరోమీటర్ అనే పరికరం సహాయంతో సీవోపీడీని నిర్ధారణ చేస్తారు. దీనితో కొన్ని శ్వాస పరీక్షలు చేసి, సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. అంటే మైల్డ్, మోడరేట్ లేదా సమస్య తీవ్రం (సివియర్)గా ఉందా అని తెలుసుకుంటారు. ఈ పరీక్షకు ముందరే... బాధితులను వ్యక్తిగతంగా / క్లినికల్గా పరీక్షించడంతో డాక్టర్లకు కొంత అవగాహన వస్తుంది. ఇలా చేసే క్లినికల్ పరీక్షల్లో బాధితుల వృత్తి వివరాలూ (ప్రొఫెషనల్ హజార్డ్స్), వారు పనిచేసే చోటు, వారుండే చోట కాలుష్య ప్రభావాలూ, పొగతాగడంలాంటి వారి అలవాట్లు... ఇవన్నీ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఐఓఎస్ అనే పరికరం ప్రారంభ దశలో ఉన్న సీవోపీడీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అపోహ–వాస్తవం ఈ వ్యాధి ఉన్నవారు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ ఉంటారు. దాంతో ఇదో అంటువ్యాధిలా అనిపిస్తుంది గానీ నిజానికి ఇది అంటువ్యాధి కానే కాదు. చికిత్స.. పేరులోనే దీర్ఘకాలిక సమస్య అని చెప్పే ఈ వ్యాధికి చికిత్స కూడా దీర్ఘకాలికంగానే అవసరమవుతుంది. సీవోపీడీ లక్షణాలు కనిపించినప్పుడు దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి, సీవోపీడీని అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు. వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ (ఇన్హేలర్స్ / నెబ్యులైజర్స్)ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించగానే అవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత హాయిగా, తేలిగ్గా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. సీవోపీడీకి దీర్ఘకాలం చికిత్స అవసరం కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించినట్లు ఫాలో అప్కు వెళ్తూ చికిత్స పూర్తయ్యేవరకు కొనసాగించాలి. నాన్ ఫార్మలాజికల్ థెరపీ.. సీవోపీడీతో బాధపడేవారిలో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దానిని క్లియర్ చేసే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. హోమ్ ఆక్సిజన్ థెరపీ : ఇది చికిత్సలో మరో ప్రక్రియ. తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారికి 19 గంటల పాటు ఇంటి దగ్గరే ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది. పల్మునరీ రీ–హ్యాబిలిటేషన్: ఇది చికిత్సలో ఇంకో ప్రక్రియ. తేలిక నుంచి ఓ మోస్తరు వరకు అవసరమున్న వ్యాయామాలు (పర్స్ లిప్ బ్రీతింగ్), అబ్డామినల్ బ్రీతింగ్తో పాటు చిన్న బరువులతో కండరాలను బలంగా చేసే (మజిల్ స్ట్రెంతెనింగ్) వ్యాయామాలు చేయడం అవసరం. నివారణ.. పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండటం / అప్పటికే పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయడం మంచి నివారణ. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం/కళ్లె మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మోతాదు బాగా తగ్గి, పనిచేసే శక్తి, సామర్థ్యాలు తగ్గుతాయి. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) ∙ -
ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?
గత కొద్దికాలంగా జ్వరాలు, దగ్గు, జలుబుతో పాటు శ్వాస సరిగా అందకపోవడం వంటి ఫ్లూ లక్షణాలతో చాలామంది హాస్పిటళ్లకు పరుగులెత్తుతున్నారు. జ్వరం తగ్గాక కూడా పొడి దగ్గు, కొందరిలో కఫంతో కూడిన దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడంతో ఆందోళన పడుతున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బాధితుల నుంచీ ఇవే కంప్లెయింట్స్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఫ్లూ జ్వరాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇవి ఎందుకిలా వస్తున్నాయి, లక్షణాలేమిటి, ముందస్తు నివారణకూ లేదా ఇప్పటికే వచ్చి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ఫ్లూలాంటి జ్వరాలు... లక్షణాలూ, జాగ్రత్తలుఇటీవల వస్తున్న ఫ్లూలాంటి జ్వరాలన్నింటికీ ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణమని వైద్య నిపుణుల భావన. రెండుమూడేళ్ల కిందట వచ్చిన కరోనా వైరస్ తాలూకు తీవ్రత బాగా తగ్గిపోయి, పెద్దగా ప్రమాదకరం కాని కోవిడ్ కూడా ఈ జ్వరాల కారణాల్లో ఒకటి కావచ్చునని కూడా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. రాబోయేది చలికాలం కావడంతో ఇవే జ్వరాలు... దాదాపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. లక్షణాలు : దాదాపు ఫ్లూ జ్వరాల్లో కనిపించే అన్ని లక్షణాలూ ఈ సీజనల్ ఫీవర్స్లో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు... ∙జ్వరం ∙తలనొప్పి ∙ఒళ్లునొప్పులు ∙గొంతునొప్పి ∙గొంతు కాస్త బొంగురుగా మారడం ∙కొన్నిసార్లు (తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఈ లక్షణాలు ఐదు నుంచి దాదాపు గరిష్ఠంగా పదిరోజులు ఉంటాయి. నిర్ధారణ పరీక్షలు / చికిత్స ముక్కు, గొంతు స్వాబ్తో కరోనా లేదా ఇతర ఇన్ఫ్లుయెంజా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని నిర్ధారణ చేయవచ్చు. తీవ్రత తక్కువగా ఉన్నవాళ్లకి (జ్వరం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు లక్షణాలు గలవారికి) ఇంటివద్దనే లక్షణాలకు తగినట్లుగా పారాసిటమాల్, ఓఆర్ఎస్, దగ్గు సిరప్లతో చికిత్స అందించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి అంటే... విపరీతమైన దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ తగ్గిపోవడం వంటి లక్షణాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించాలి. నివారణ / జాగ్రత్తలు: దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు తమ ఫుల్ స్లీవ్స్లోకి తుమ్మడం మంచిది. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. కరోనా సమయంలోలా వీలైతే జ్వరం, దగ్గు తగ్గేవరకు మాస్క్ ధరించడం మేలు. ∙దగ్గు లేదా తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు, తర్వాత చేతుల్ని 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. దగ్గు/తుమ్ము సమయంలో ఒకరు వాడిన రుమాలును వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. జలుబు లేదా ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి ∙బాధితుల పక్కబట్టలను, పాత్రలను విడిగా ఉంచాల్సినంత అవసరం లేదుగానీ... వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పాత్రలను మరొకరు వాడకపోవడమే మంచిది. బాధితుల్ని మిగతావారి నుంచి కాస్త విడిగా (ఐసోలేషన్) ఉంచటం మేలు. ∙ఇన్ఫ్లుయెంజాకు, కోవిడ్కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాధి తీవ్రత తగ్గించడానికీ, హాస్పిటల్లో చేరికల నివారణకు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఈ జ్వరాలు చాలావరకు పెద్దగా ప్రమాదకరం కావు. అరుదుగా ఎవరిలోనైనా పరిస్థితి మరీ తీవ్రంగా మారితే... తక్షణం బాధితుల్ని ఆసుపత్రికి తరలించాలి. వీళ్లలో తీవ్రత ఎక్కువ... ఇప్పటికే ఆస్తమా, దీర్ఘకాలిక లంగ్స్ సమస్యలు, బ్రాంకైటిస్, దీర్ఘకాలిక గుండెజబ్బులతో బాధపడేవారు, హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ బాధితులు, దీర్ఘకాలిక కిడ్నీ/లివర్ వ్యాధులున్నవారు, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్లతో బాధపడుతూ స్టెరాయిడ్ చికిత్స తీసుకుంటున్నవారూ, లుకేమియా, సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారు, వయోవృద్ధులూ వారితోపాటు ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు... వీళ్లందరి లోనూ లక్షణాల్లో తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిద్రలేమి, పల్స్ ఆక్సిమీటర్తో పరీక్షించినప్పుడు ఆక్సిజన్ శాచ్యురేషన్స్ తగ్గడం, ఆక్సిజన్ మోతాదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి బాధితుల్ని ఆసుపత్రులకు తీసుకురావాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. డాక్టర్ వి రాజమనోహర్ ఆచార్యులు, సీనియర్ కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్ (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?
చిన్నారుల్లో ఫిట్స్ (సీజర్స్) రావడం సాధారణంగా చూస్తుండేదే. ఇలా ఫిట్స్ రావడాన్ని వైద్యపరిభాషలో ‘ఎపిలెప్సీ’గా చెబుతారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ... ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. ఈ సీజర్స్లోనూ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ అనేవి ఇంకాస్త వేరు. నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్లో వచ్చే వీటి కారణంగా చిన్నారులు ఏ భంగిమలో ఉన్నా... ఉన్నఉన్నవారు ట్లుగానే వారు స్పృహ కోల్పోతారు. ఇవి పిల్లల్లో అకస్మాత్తుగా మొదలవుతాయి. హఠాత్తుగా వాళ్లను స్పృహలో లేకుండా చేస్తాయి. కనీసం 10 – 20 సెకండ్లు అలా ఉండిపోయి, మెల్లగా ఈలోకంలోకి వస్తారు. ఇలా హఠాత్తుగా కనిపించి, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేసే ‘ఆబ్సెన్స్ సీజర్స్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?పిల్లల్లో వచ్చే ఫిట్స్లో... ఆబ్సెన్స్ సీజర్స్ అనేవి కనీసం 20 నుంచి 25% వరకు ఉంటాయి. సాధారణంగా ఇవి జన్యుపరమైన (జెనెటిక్), జీవక్రియ పరమైన (మెటబాలిక్) సమస్యల వల్ల వస్తుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ‘ఆబ్సెన్స్ సీజర్స్’ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. అసాధారణంగా కొందరు చిన్నారుల్లో ఏడాదిలోపు వయసున్నప్పుడు కూడా ఇవి మొదలు కావచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన పిల్లల్లో హఠాత్తుగా మొదలైనప్పటికీ... కొందరు చిన్నారుల్లో మాత్రం... వారికి జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఫిట్స్తో ఇవి మొదలవుతాయి. అలాగే ఎదుగుదలలో లోపాలు (డెవలప్మెంటల్ డిలే) వంటి నాడీ సంబంధమైన సమస్యలున్నవారిలోనూ కనిపిస్తుంటాయి. ఇంక కొందరిలోనైతే... వాస్తవంగా కనుగొన్న నాటికి చాలా పూర్వం నుంచే... అంటే నెలలూ, ఏళ్ల కిందటి నుంచే ఇవి వస్తుంటాయి. కానీ తల్లిదండ్రులు (లేదా టీచర్లు) చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ... వీటినంత తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాకపోవడంతో పిల్లలేదో పగటి కలలు కంటున్నారనీ, ఏదో వాళ్ల లోకంలో వాళ్లు ఉన్నారంటూ తల్లిదండ్రులు, టీచర్లు, లేదా పిల్లల్ని చూసుకునే సంరక్షకులు పొరబడుతూ ఉండవచ్చు. సాధారణ సీజర్స్లో అవి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆబ్సెన్స్ సీజర్స్లో అవి వచ్చిన దాఖలా కూడా స్పష్టంగా తెలియదు. కొన్ని సందర్భాల్లో చాలాకాలం వరకూ తెలిసిరాదు. ప్రేరేపించే అంశాలు... ఈ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ను కొన్ని అంశాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి... తీవ్రమైన అలసట వేగంగా శ్వాస తీసుకోవడం పిల్లలు టీవీ, మొబైల్ చూస్తున్నప్పుడు తరచూ హఠాత్తుగా మారిపోతూ ఉండే కాంతిపుంజాలూ, ఫ్లాష్లైట్ల కారణంగా... ఆబ్సెన్స్ సీజర్స్ రావచ్చు. ఆబ్సెన్స్ సీజర్స్ లక్షణాలు... ఈ సందర్భాల్లో పిల్లలు... అకస్మాత్తుగా చేష్టలుడిగి (బిహేవియర్ అరెస్ట్తో) నిశ్చేష్టులై ఉండిపోవడం ∙ముఖంలో ఎలాంటి కవళికలూ కనిపించకపోవడం ∙కళ్లు ఆర్పుతూ ఉండటం, ఒంటి మీద బట్టలను లేదా ముఖాన్ని తడబాటుగా చేతి వేళ్లతో నలపడం, నోరు చప్పరించడం, మాటల్ని తప్పుగా, ముద్దగా ఉచ్చరిస్తూ ఉండటం (ఫంబ్లింగ్), చేస్తున్నపనిని అకస్మాత్తుగా నిలిపివేయడం / ఆపివేయడం ∙బయటివారు పిలుస్తున్నా జవాబివ్వకపోవడం / ఎలాంటి స్పందనలూ లేకపోవడం పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్లు బయటకు పూర్తిగా నార్మల్గానూ కనిపించవచ్చు. మాట్లాడటం మాత్రం చాలావరకు నార్మల్గా ఉండిపోవచ్చు. కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ వారు ఆటలాడుకుంటున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగుతుంటాయి. చిన్నారులు అన్యమనస్కంగా ఉండటమో లేదా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించడాన్ని తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. నిర్ధారణ ఇలా... ఆబ్సెన్స్ సీజర్స్లో ఎన్నో రకాలున్నప్పటికీ... సాధారణంగా టిపికల్ (అంతగా సంక్లిష్టం కానివి), అటిపికల్ (సంక్లిష్టమైనవి) అనే రకాలు ఉంటాయి. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ఎమ్మారై (బ్రెయిన్) వంటి మరికొన్ని పరీక్షలతో వీటిని నిర్ధారణ చేయవచ్చు. ఇక అటిపికల్ రకాల విషయంలో ఇతర నాడీ సంబంధమైన సమస్యలనూ, జీవక్రియలకు(మెటబాలిక్) సంబంధించిన, జన్యుసంబంధమైన మరికొన్ని పరీక్షలతో పాటు మెదడు / వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవం (సెరిబ్రో స్పైనల్ ఫ్లుయిడ్ – సీఎస్ఎఫ్)ను పరీక్షించడం ద్వారా ఈ (అటిపికల్) రకాన్ని తెలుసుకుంటారు. చికిత్స సమస్య నిర్దారణ అయిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫిట్స్ మందులు (యాంటీ సీజర్ మెడిసిన్స్) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడుతూ, బాధితుల మెరుగుదలను గమనిస్తూ, దాని ప్రకారం మోతాదును క్రమంగా తగ్గిస్తూ పోవాలి. ఈ మందులు చిన్నారుల్లో... కేవలం ఫిట్స్ తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ల జీవన నాణ్యతనూ మెరుగుపరుస్తాయి. స్కూల్లో వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సామాజికంగా ఒంటరి కాకుండా... నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల గుణం కనిపిస్తోందా లేదా అన్న విషయాన్ని నిర్ణీత వ్యవధుల్లో ఈఈజీ తీయడం ద్వారా పరిశీలిస్తూ ఉండాలి. ఇక సహాయ చికిత్సలు (సెకండ్ లైన్ ట్రీట్మెంట్)గా వాళ్లకు కీటోజెనిక్ డైట్ (కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం, వేగస్ నర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం (వేగస్ స్టిమ్యులేషన్) జరుగుతుంది. దాదాపు 70 శాతం కేసుల్లో చిన్నారులు యుక్తవయసునకు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది. (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
అక్కడ చేపలు జస్ట్ తినడానికి ట్రై చేసినా చాలు..క్యాన్సర్ ఖాయం!
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. పైగా చేపనూనె లేదా చేపతో చేసిన రెసిపీలు కనీసం వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలా మంచిదని పదేపదే ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు కూడా. కానీ ఆ దేశంలోని చేపలు గురించి వైద్యులు చెబుతున్న షాకింగ్ విషయాలు వింటే వెంటనే మీ నిర్ణయం మార్చుకుంటారు. ఎందుకంటే చేపలను జస్ట్ తినాలని ట్రై చేసినా చాలు మందులతో కూడా నయం చేయలేని భయానక క్యాన్సర్ రావడం పక్కా అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. అక్కడ చేపలతో చేసిన వంటకాలనే అక్కడ ప్రజలు చచ్చేంత ఇష్టంగా తింటారట. ఆ చేప కథకమామీషు ఏంటో చూద్దాం!. థాయ్ వంటకాలకు అత్యంత రుచికర, ఆరోగ్యకరమైన వంటకాలుగా మంచి ప్రసిద్ధి. కానీ అక్కడ ఓ చేప వంటకం మాత్రం చాలా డేంజర్ అని దాదాపు 20 వేల మంది మరణాలకు కారణమైందని వైద్యులు షాకింగ్ విషయాలు చెబుతున్నారు. థాయ్లోని కోయి ప్లా అనే మంచి నీటి చేప చాలా ప్రమాదకరమైందని ఒక్కసారి తిన్నా చాలు ఆ క్యాన్సర్ బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్యులు. కానీ అక్కడ ఈ చేపకు సంబంధించి వివిధ రకాల వంటకాలకు చాలా ప్రసిద్ధి. పైగా ప్రజలు కూడా ఆ చేప వంటకాలను తెగ ఇష్టంగా తింటుంటారు. థాయ్లోని ఖోన్సాన్, ఇసాన్ వంటి ప్రాంతాల్లో ఈ చేప వంటకాలను ఎక్కువగా తింటారట. ఈ వంటకానికి సంబంధించి కొంచెం తిన్నా చాలు ఆ భయనక క్యాన్సర్ కచ్చితంగా వస్తుందని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తిన్న వారికి కొద్ది రోజులు లేదా నెలల్లోనే కాలేయ సంబంధ క్యాన్సర్ వ్యాధి బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ చేపలో లివర్ ఫ్లూక్ అనే ఫ్లాట్ వార్న్ పరాన్నజీవి ఉందని ఇది కాలేయం పిత్తాశయం, చిన్నపేగులను కలిపి ఉండే ప్రాంతంలో దాడి చేసి పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్కి దారితీస్తుందని అంటున్నారు. ఈ చేపలను తినే ఆయా ప్రాంతాల్లో సర్వే చేయగా..దాదాపు 80 శాంత మంది శరీరంలో ఆ పరాన్నజీవి ఉందని వారంతా కూడా పిత్తాశయం లేదా కాలేయం క్యాన్సర్ బారిన పడినట్లు తేలిందని వెల్లడైంది. ఆయా బాధితులకు చికిత్స అందించడం కూడా ఓ సవాలుగా ఉందన్నారు. అంతేగాదు బాధితుల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందన్న నిర్థారణ ఆధారంగానే ఆ వ్యక్తలు నెలలు లేదా సంవత్సరాలు బతకగలరని అంచనా వేసి చెప్పగలం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్యాన్సర్ లక్షణాలు.. పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే వ్యక్తుల్లో కళ్లు చర్మం పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది, చర్మం చాలా దురదగా ఇరిటేషన్గా ఉంటుంది. ఆకలిని కోల్పోవడం. ఏ ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం సడెన్గా అధిక ఉష్ణోగ్రత లేదా వణుకుపోతున్న ఫీలింగ్ ఈ చేపల్లోని ఫ్లాట్ వార్మ్ పిత్తవాహికలో ఏళ్ల తరబడి నివశిస్తాయని చెబుతున్నారు వైద్యులు. వైద్య పరీక్షలు చేసినప్పుడు కూడా కాలేయ వాపుగానే కనిపిస్తుందని వాటిని గుర్తించలేం అని తెలిపారు ఆరోగ్య నిపుణులు. మనిషి బలహీనపడినప్పుడూ ఒకేసారి ఆ పరాన్నజీవి విజృంభించడం మొదలు పెట్టి క్యాన్సర్ బారిన పడేల చేస్తుందని చెబుతున్నారు. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
ఆర్థరైటిస్ వృద్ధులకే వస్తుందనుకోవద్దు! ఇప్పుడు అందరిలోనూ..
చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆర్థరైటిస్. దీన్నే కీళ్ళవాపు వ్యాధి అంటారు. మీదపడే వయస్సుతో మరింత తీవ్రమయ్యే ఈ వ్యాధి, పూర్వం ఎక్కువగా వృద్ధాప్యంలో అంటే 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ముందే వచ్చేస్తోంది. అనారోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12ను ప్రపంచ ఆర్థరైటిస్ డేగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ తేతలి దశరథరామారెడ్డిని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. వివరాలు ఆయన మాటల్లోనే.. లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకండి ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. అసాధారణమైన కీళ్ళ వాపు, నొప్పి లేక కీళ్ళు బిగుసుకుపోవడం వంటివి రోజుల తరబడి ఉన్నా, అకస్మాత్తుగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చినా, కీళ్లను తాకడం బాధాకరంగా మారినా ఆర్థోపెడిక్ సర్జన్ను సంప్రదించాలి. 65 ఏళ్ల మహిళలు 70 ఏళ్ల పురుషులు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) పరీక్ష చేయించుకోవాలి. ఆర్థరైటిస్లో అనేక రకాలు ఆర్థరైటిస్లో అనేక రకాలు ఉన్నాయి. ప్రతిదానికి వేర్వేరు చికిత్సలు కూడా ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ (ఓఏ): వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత నడిస్తే కీళ్ళు గట్టిగా అనిపించవచ్చు. అయితే ఒకసారి కదలడం మొదలుపెడితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ): రుమటాయిడ్ ఆర్థరైటిస్ను మందులతో, కీళ్ళపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా వ్యాయామంతో తగ్గించవచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఆర్ఏ లాగే ఇది ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి. సాధారణంగా సోరియాసిస్ ఉన్నవారిలో సంభవిస్తుంది. గౌట్: శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండటం ఈ సమస్యకు కారణం. లూపస్: లూపస్ అనేది చర్మం, అవయవాలు శరీరంలోని అనేక ఇతర ప్రదేశాలలో మంటను కలిగించే దీర్ఘకాలిక వ్యాధి. స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ (వెన్నెముక ఆస్టియో ఆర్థరైటిస్): కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ వెన్నెముక వద్ద నుండే నరాలపై ఒత్తిడి తెచ్చే ’స్పర్స్’ (ఎముక ఎదుగుదల)కు కారణమవు తుంది. దీనివల్ల ఉత్పన్న మయ్యే సమస్యలను స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఎలా నియంత్రించాలి? బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎక్కువ బరువుంటే తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. క్రమం తప్పకుండా నడకవంటి వ్యాయా మం చేయడంవల్ల కీళ్ల ఫ్లెక్సిబిలిటీ (సరళంగా వంగే గుణం) పెరుగుతుంది. ఈత కొట్టాలని, బరువులు ఎత్తడం లాంటి కసరత్తులు చేయాలని కొందరు వైద్యులు సిఫారసు చేస్తారు. పండ్లు, మూలికలు, చేపలు, కూరగాయలతో సహా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తినాలి. ధూమపానం, మద్యపానం మానాలి. ఎముకలు చిట్లకుండా చూసుకోవాలి. (చదవండి: ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్లో సగభాగం స్విచ్ఆఫ్ అయ్యింది? ఐనా..) -
కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?
కనురెప్పల లోపల గానీ బైటగానీ కురుపులు లేదా గడ్డలు పెట్టే బాధ అంత ఇంత కాదు. ఒకవేళ వచ్చినా అంత ఈజీగా తగ్గదు. ఇంతకీ ఇది అంటువ్యాధా? ఎలా తగ్గించుకోవాలి తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి గారి మాటల్లో చూద్దాం!. కనురెప్ప లోపలగాని బైటగాని లేచిన కంటి కురుపు నవీన్ నడిమింటి సలహాలు కనురెప్పల మీద కొందరికి కంటికురుపులు వచ్చి మహా ఇబ్బందిని కలుగజేస్తాయి. ఇది బ్యాక్టీరియా చేరడం వల్లగానీ, కనురెప్పల మీదనున్న తైల గ్రంధినాళం (sebaceous glands of Zeis) మూతపడటం వల్లగానీ జరుగుతుంది. దురదకు కళ్ళు పులుము కుంటే ఆ కురుపు చితికి ప్రక్కన మరో కురుపు వస్తుంది. ఇటువంటి కురుపులు ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిలా సోకే ప్రమాదం ఉంది. కంటికురుపులు వచ్చిన పిల్లలకు వాడిన సబ్బు, టవల్ ఇతర పిల్లలకు వాడకూడదు . లక్షణాలు: కనురెప్పపై అంచున చివరన ఉండే సెబాసియస్ గ్రంథి ఇన్ఫెక్షన్కు గురికావటం వల్ల కురుపులాగా ఏర్పడి, కంటికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఇందువల్ల కంటిభాగము ఎర్రగా మారిపోతుంది. కనురెప్పపై వాపు ఏర్ప డుతుంది. వాపుతో కూడిన ఈ చిన్నని పుండు కనురెప్ప అంచున ఏర్పడడం వల్ల కనురెప్పలు మూసి తెరచేటప్పుడు ఎంతో బాధాకరంగా ఉంటుంది. కళ్ళు మంటగా ఉంటాయి. కంటిలో ఏదో నలత పడి ఉన్నట్లు ఉంటుంది. కంటి చూపులో తగ్గుదల ఉంటుంది. కంటిలో నీరు, పుసి కారుతుంది. బ్యాక్టీరియ వలన కంటి కురుపులు తరచుగా వస్తాయి. రాత్రులు నిద్ర చాలకపోతే కొన్నాళ్ళకు కంటి కురుపులు వస్తాయి. సమతుల్య ఆహారం లోపం వలన, కంటి శుభ్రత లోపించే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కళ్ళను ఏ కారణము చేతనైనా బాగా రుద్దడం వలన, ఈ సమస్య తలెత్తుంది చికిత్స: ఒక స్పూన్ బోరిక్ పొడిని పావుకప్పు నీటిలో కరిగించి ... ఆ నీటితో కనురెప్పలను రోజులు 4 నుంచి 5 సార్లు కడగాలి.. ఇన్ఫెక్షన్ తగ్గి కురుపులు నయమవుతాయి. అటువంటి కురుపుకు వేడి చేసిన గుడ్డను కాపడం పెట్టాలి. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు ఒక చెంచా ధనియాలు ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాత ఆ కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. జామ ఆకును వేడి చేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి. లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టాలి. కంటి కురుపుకు చింతకాయ గింజలు రెండు రోజులు నానబెట్టి ఆ గంధంను పట్టించాలి. మల్లీ (మరల) ఎప్పడికీ రావు . ఒక కప్పు నీళ్లల్లో రెండు లేదా మూడు అలమ్ పూసలను బాగా కలిపి, ఆ నీటిని కండ్లు శుభ్రపర్చుకునేందుకు వాడాలి. లేదా మీరు స్పటిక భస్మాన్ని (ఇది ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతుంది) కూడా వాడవచ్చు. ఇందువల్ల కంటిపై వాపు, ఎర్రబడిన కనురెప్పలు మామూలు స్థితికి వస్తాయి. నీరుకారడం కూడా తగ్గిపోతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పసుపును బాగా మరగ కాచా లి. ఇలా అర గ్లాసు నీళ్ళుండేంతవరకు మరగకాచి, ఈ నీటిని వడగట్టి, ఒక శుభ్రమైన బట్టతో కంటిని శుభ్రం చేసుకొని రోజుకు రెండు లేదా మూడు చుక్కలను కంటిలో వేసుకోవడం వల్ల ఈ సమస్య సమసిపోతుంది. దీనిని 'ఐ డ్రాప్స్'గా కూడా వాడవచ్చు. ఖర్జూరపు విత్తనాన్ని ఒక రాయిపై బాగా రుద్దగా వచ్చిన చూర్ణాన్ని కంటికి నొప్పి కలిగించే ప్రాంతంలో అప్లై చేయాలి. ఉల్లిపాయపై ఎండిన పొరను నిప్పుల మీద కాల్చి ఆ మసిని కంటి రెప్ప పై కురుపు మీద రాస్తే ఆ కురుపు త్వరగా నయం అవుతుంది. ఆయుర్వేద నిపుణులు, డాక్టర్ నవీన్ నడిమింటి (చదవండి: చిన్నారుల్లో వచ్చే ఆటిజం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్కి ప్లాస్టిక్ కారణమా!) -
ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు వస్తాయా?
అయిచాలామంది టీనేజ్ పిల్లలనే కాదు కొందరూ పెద్దల్లో కూడా ఈ మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. వేడి చేసి కూడా వస్తుంటాయని అంటారు కొందరూ. కానీ వాటి వల్ల ముఖం కమిలి ర్యాషెస్ వచ్చినట్లుగా పోతాయి. ఆయిల్ వస్తువులు తినడం వల్ల వచిందా? లేక తలలోని చుండ్రు కారణమా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి ఇది నిజం. వినడానికి నమ్మశక్యం కానంత వింతగా అనిపిస్తుందని కొట్టిపారేయొద్దు. ఎలా సాధ్యమో సవివరంగా తెలుసుకునేందుకే ఈ కథనం. ముద్దు మీ మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరమైనదే అయినా ఒక్కోసారి ఇది కొన్ని సమస్యలు తెచ్చుపెడుతుంది. ముద్దు వల్ల చర్మం ఇరిటేషన్కి గురై ఆ తర్వాత మొటిమలు ఏర్పడేందుకు దాదితీస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జిడ్డు, మొటిమలు బారినపడే చర్మం ఉన్నవారైతే వారిలో బ్యాక్టీరియా, నూనెను బదిలీ చేసే కారకాలు ఎక్కువుగా ఉంటాయి. ఇలాంటి వారు ముద్దు పెట్టుకుంటే లాలాజలం ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యి చర్మం చికాకుగా అయ్యి మొటిమలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముద్దు పెట్టుకున్న వెంటనే మొటిమలు రావు. అలాగే ఇది అంటు వ్యాధి కాదు. లిప్ బామ్లు వంటివి వాడే వారైతే అవి మీ చర్మానికి సరిపడనది అయ్యి సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. జిడ్డు చర్మం, ప్రధానంగా డెడ్్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియాతో మూసుకుపోయిన రంధ్రాల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల నేరుగా రాకపోయిన వారి అపరిశుభ్రత కారణంగా పరోక్షంగా మొటిమొలు వచ్చేందుకు దోహదం చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు ముద్దులు పెట్టుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంటుంది. మీరు, మీ భాగస్వామి మధ్య అవగాహనతో మంచి పరిశుభ్రతతో ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అందులో ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతలో లోపం ఉన్నా ముద్దుల వల్ల సమస్య వస్తుంది. అది మొటిమలు వరకే కాదు ఇంకే ఇతర అనారోగ్య సమస్యలైన ఇలానే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందనే విషయం మరిపోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పార్లర్కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..) -
విపరీతమైన మూడ్ స్వింగ్స్.. బైపోలార్ డిజార్డర్కి కారణం అదేనా?
గోపీనాథ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య సునీత కూడా అదే కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు. హైదరాబాద్ శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీలో ప్రశాతంగా ఉంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో గోపీనాథ్ ప్రవర్తనలో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. తాను చేస్తున్న జాబ్ తన సామర్థ్యానికి ఏమాత్రం సరిపోనిదని, త్వరలోనే తాను సొంత కంపెనీ మొదలుపెట్టి బిల్ గేట్స్తో పోటీ పడతానని చెప్తున్నాడు. మొదట్లో సునీత.. సరదాగా అంటున్నాడనుకుంది. కానీ ఒకరోజు హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. అదేంటని అడిగితే కంపెనీ మొదలు పెడుతున్నానని చెప్పాడు. స్నేహితులు కొందరిని కూడగట్టుకుని కంపెనీ మొదలుపెట్టాడు. దానికోసం పలుమార్లు అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా తిరిగి వచ్చాడు. ఆ క్రమంలో సేవింగ్స్ అన్నీ ఖర్చుపెట్టేశాడు. కూడగట్టుకున్న ఆస్తులు కూడా అమ్మేశాడు. స్నేహితులతో పెట్టుబడులు పెట్టించాడు. అతనూ భారీగా అప్పులు చేశాడు. సునీత వారిస్తున్నా, గొడవపడినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆర్నెల్ల తర్వాత గోపీనాథ్ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోయింది. కంపెనీ ఆలోచన పక్కకు పడేశాడు. ఎక్కడికీ వెళ్లడంలేదు, ఎవ్వరితోనూ కలవడం లేదు. తన గదిలో కూర్చుని దిగులు పడుతున్నాడు. సమస్య ఏమిటని సునీత అడిగినా సమాధానం లేదు. ఈ దశలో ఫ్రెండ్స్ సలహా మేరకు అతన్ని కౌన్సెలింగ్కి తీసుకువచ్చింది సునీత. విపరీతమైన మూడ్ స్వింగ్స్.. గోపీనాథ్ బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని మొదటి సెషన్లోనే అర్థమైంది. సైకో డయాగ్నసిస్ అనంతరం అది నిర్ధారణైంది. వెంటనే సైకో ఎడ్యుకేషన్, సైకోథెరపీ ప్రారంభించి, మందులకోసం సైకియాట్రిస్ట్కి రిఫర్ చేశాను. విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఈ వ్యాధి లక్షణం. మేనియా ఎపిసోడ్లో ప్రపంచాన్ని జయిస్తాం, కొండలనైనా పిండి చేస్తామనే ఉత్సాహం చూపిస్తారు. డిప్రెసివ్ ఎపిసోడ్లో అంతా కోల్పోయినట్లు, ఇక జీవితమే లేనట్లు బాధపడుతుంటారు. ఈ స్వింగ్స్ అరుదుగా జరగొచ్చు లేదా తరచుగా జరగవచ్చు. వాటి తీవ్రత కూడా వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటుంది. సాధారణంగా టీనేజ్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ వయసులోనైనా రావచ్చు. బైపోలార్ డిజార్డర్కి కచ్చితమైన కారణం తెలియదు. కానీ ఈ డిజార్డర్ ఉన్నవారి మెదడులో మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ డిజార్డర్తో ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, సన్నిహిత బంధువులు గలవారిలో ఈ రుగ్మత కనిపిస్తోంది. అందుకు కారణమయ్యే జీన్స్ని కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. బైపోలార్ లక్షణాలు బైపోలార్ డిజార్డర్లో రెండు దశలుంటాయి. మేనియా, డిప్రెషన్. మేనియా దశలో మేనియా, హైపోమేనియా అనే రెండు విభిన్నమైన ఎపిసోడ్స్ ఉంటాయి. మేనిక్ ఎపిసోడ్ లక్షణాలు.. ► అసాధారణ ఉల్లాసం ► పెరిగిన కార్యాచరణ లేదా ఆందోళన ► విపరీతమైన ఆత్మవిశ్వాసం, ఆనందాతిరేకం (యుఫోరియా) ► నిద్ర అవసరం తగ్గిపోవడం ► అసాధారణమైన మాటకారితనం ► రేసుగుర్రాల్లా పరుగెత్తే ఆలోచనలు ► పేలవమైన నిర్ణయాధికారం మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ లక్షణాలు.. విచారంగా, ఖాళీగా, నిస్సహాయంగా ఉండటం కారణం లేకుండానే ఏడవడం ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం డైటింగ్ చేయనప్పటికీ గణనీయంగా బరువు తగ్గడం లేదా పెరగడం, ఆకలి తగ్గడం లేదా పెరగడం నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం చంచలత్వం లేదా మందగించిన ప్రవర్తన అలసట లేదా నీరసం విలువ లేని ఫీలింగ్ లేదా తగని అపరాధ భావన. ఆలోచించే సామర్థ్యం లేదా ఏకాగ్రత తగ్గడం ఆత్మహత్య గురించి ఆలోచించడం, ప్లాన్ చేయడం లేదా ప్రయత్నించడం జీవితకాల చికిత్స అవసరం.. ►బైపోలార్ డిజార్డర్ అనేది జీవితకాల పరిస్థితి. ప్రాథమిక చికిత్సలలో లక్షణాలను నియంత్రించడానికి మందులు, సైకోథెరపీ, సైకోఎడ్యుకేషన్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, సపోర్ట్ గ్రూప్లు ఉంటాయి. ► బైపోలార్ ట్రీట్మెంట్లో మందులు ప్రధానపాత్ర పోషిస్తాయి. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ► బైపోలార్ ఎపిసోడ్లను ప్రేరేపించే ట్రిగ్గర్స్ని గుర్తించడంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) సహాయపడుతుంది. అనారోగ్యకరమైన, ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటి స్థానంలో ఆరోగ్యకరమైన, సానుకూలమైన వాటితో భర్తీ చేస్తుంది. ► బైపోలార్ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిస్థితిని అర్థం చేసుకోవడంలో, బాధితుడికి సపోర్ట్ ఇవ్వడంలో సైకో ఎడ్యుకేషన్ సహాయపడుతుంది. ► ట్రీట్మెంట్ ప్లాన్ని పాటించడంలో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. అందుకు ఫ్యామిలీ ఫోకస్డ్ థెరపీ సహాయపడుతుంది. ► నిద్ర, ఆహారం, వ్యాయామం కోసం రోజువారీ దినచర్యను ఇంటర్ పర్సనల్, సోషల్ రిథమ్ థెరపీ (ఐ్క ఖఖీ) ఏర్పాటు చేస్తుంది. మూడ్ మేనేజ్మెంట్కి ఇది సహాయపడుతుంది. -
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? వాస్తవమిదే
మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే.. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి. తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం. లోబీపీ, డీహైడ్రేషన్ మధుమేహం గుండె జబ్బు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా) హైపర్వెంటిలేషన్ ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం. ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది. ► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి. ► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి. ► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. - నవీన్ నడిమింటి ఆయుర్వేద నిపుణులు ఫోన్ -9703706660 -
చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..
చిన్నారుల ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే చిన్న గాలిగొట్టాల్ని బ్రాంకియోల్స్ అంటారు. ఇన్ఫెక్షన్లు లేదా ఇతర కారణాలతో వీటిల్లో వాపు వస్తే దాన్నిబ్రాంకియోలైటిస్గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది నెలల వయసుగల పిల్లలు మొదలుకొని రెండేళ్ల వరకు చాలా తరచుగా కనిపిస్తుంది. పిల్లల్లో బ్రాంకియోలైటిస్కు చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రధాన గాలిగొట్టం (ట్రాకియా) లేదా నోరు, ముక్కు, గొంతుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు కిందికి వ్యాపించడం వల్ల ఈ సమస్య రావచ్చు. వైరస్లలో రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, రైనో వైరస్, ఎడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా, కరోనా లాంటి వైరస్లు, కొన్నిసార్లు కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా బ్రాంకియోలైటిస్కు కారణం కావచ్చు. ముప్పు ఎవరిలో ఎక్కువ? నెలలు నిండకముందే పుట్టిన చిన్నారులు తల్లిపాలపై పెరగని పిల్లల్లో ఇంతకుమునుపే ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు డే కేర్ సెంటర్లోని పిల్లలు... మొదలైనవారిలో. లక్షణాలు... బ్రాంకియోలైటిస్ లక్షణాలు దాదాపు ఓ వారం పాటు పిల్లలను బాధిస్తాయి. ఇవి ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. కొన్నిసార్లు తీవ్రమైన దగ్గుతో శ్వాస సరిగా అందక పిల్లలు బాధపడుతుంటారు. సాధారణంగా కనిపించే లక్షణాలివి... దగ్గు, పిల్లికూతలు ముక్కు కారడం ఊపిరి సాఫీగా అందకపోవడం పిల్లలు ఛాతీ పట్టేసినట్లుగా బాధపడటం జ్వరం, ఆకలి తగ్గడం చిరాకు / చికాకు కొన్నిసార్లు వాంతులు కావడం ∙ఆరు నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు పాలు సరిగా తాగలేకపోవడం, ఎక్కువగా ఏడవటం లాంటివి. నిర్ధారణ... ∙ ఛాతీ ఎక్స్–రే కొన్ని రకాల రక్తపరీక్షలు ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్ను పరీక్షించడం ద్వారా వైరలా లేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అన్నది చాలావరకు నిర్ధారణ చేయవచ్చు. నివారణ: ∙పిల్లలు తమ చేతుల్ని తరచూ శుభ్రంగా కడుక్కునేలా చూడటం పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం అవసరాన్ని బట్టి కొందరికి ఫ్లూ టీకాలు ఇప్పించడం చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా చూడటం ∙చల్లటి పదార్థాలు, కూల్డ్రింక్స్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స: చాలావరకు వైరల్ ఇన్ఫెక్షన్లే బ్రాంకియోలైటిస్కి కారణం కాబట్టి లక్షణాల ఆధారంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే... తగినన్ని నీళ్లు తాగించడం, కాస్త పెద్ద పిల్లలైతే ద్రవాహారాలు ఇవ్వడం, పాలు పట్టేముందర వారి నోరు, ముక్కుల్లో ఉండే చిక్కటి స్రావాలను ‘బల్బ్ సిరంజీ’తో బయటకు తొలగించడం, నిద్రపోతున్నప్పుడు బాగా శ్వాస అందేలా తలను కాస్త ఎత్తుగా ఉంచడం, జ్వరం ఉంటే టెంపరేచర్ తగ్గించే మందులు, యాంటిహిస్టమైన్స్, కాఫ్ సిరప్, నెబ్యులైజేషన్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. బ్లడ్ రిపోర్టులు, ఎక్స్–రే బట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ ఇస్తారు. పిల్లలు బాగా డల్గా ఉండటం, పాలు, ఆహారం తీసుకోవడం బాగా తగ్గడం, పిల్లలకు ఊపిరి అందనప్పుడు / తమంతట తామే శ్వాస తీసుకోలేనప్పుడు ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గ్రహించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అక్కడ డాక్టర్లు వారికి... ∙రక్తనాళం ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించడం ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పైప్తో ఆక్సిజన్ అందించడం ∙పిల్లల ఊపిరితిత్తుల్లో, ముక్కులోని చిక్కటి స్రావాలను (సక్షన్ ద్వారా) బయటకు పంపడం వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు.ఆక్సిజన్ అందకపోతే వెంటిలేటర్ మీద ఉంచాల్సి వస్తుంది. డాక్టర్ సత్యనారాయణ కావలి, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్. (చదవండి: చీలమండ నొప్పి తగ్గాలంటే...) -
రోజూ పాలు తాగడం కూడా ప్రమాదమేనా?.. వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
పాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. కాల్షియం ఉంటుంది ఎముకలకు బలం మన పెద్దవాళ్లు చెబుతుంటారు. చదివే పిల్లలు రోజు పాలు తాగడం మంచిదని మన బామ్మలు పాలు అవి ఇస్తుంటారు. కమ్మటి పాలు తాగితే హాయిగా నిద్ర కూడా వచ్చేస్తుంది. అలాంటి పాలను రోజు తాగొద్దంటూ ఆరోగ్య నిపుణులు. కాదని అలా తాగితే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందులోనూ పురుషులకైతే ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. కాల్షియం వంటి విటమిన్లను అందించే పాలు రోజు తాగితే..ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. ఎముకలకు బలం అన్న ఆ పాలే మంచిది కాదని స్ట్రాంగ్గా చెప్పేస్తున్నారు యూకే ఆధారిత క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వైద్యులు. ఆ రీసెర్చ్ సెంటర్ వైద్య బృందం చేసిన పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు వెల్లండించారు. పాలల్లో ఉండే హార్మోన్లు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆ హార్మోన్లే క్యాన్సర్ కారకాలుగా.. యూకే క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తన పరిశోదన ఫలితాల్లో పాలు ప్రోస్టేట్ క్యాన్సర్కు ఎలా కారకం అవుతుందో వెల్లడించారు. ఈస్ట్రోజన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు సహజంగా ఆవుపాల్లో ఉంటాయి. ఈ హర్మోన్లు పెరుగుదల హార్మోన్లు. అవే ఇప్పుడు క్యాన్సర్ వృద్ధికి కారణమవుతాయని అంటున్నారు. ప్రతి రోజు కాఫీతో పాలు తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. యూఎస్లోని లోమా లిండా విశ్వవిద్యాలయం మూడు దశాబ్దాలుగా 22 వేలమంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రోజు 2.5 శాతం పాల ఉత్పత్తులకు సంబంధించిన వాటిని ఇవ్వగా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని నిర్థారించారు వైద్యులు. అధిక వెన్న శాతం ఉన్న పాల కంటే తక్కువ వెన్న శాతం ఉన్న నాన్ క్రీమ్ పాలతోనే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. అయితే ప్రత్యేకించి ఈ ఆహారం నుంచే ఈ ప్రమాదం ఎక్కువ అని కచ్చితంగా చెప్పడం కష్టమేనని అన్నారు. దీనిపై మరింత పరిశోనలు చేయాల్సి ఉందని కూడా చెప్పారు. దీనికి సరైన విధమైన జీవనశైలి పాటించని వారై, చెడ్డ ఆహారపు అలవాట్లు ఉన్నట్లయితే ఆ ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!
హుక్ వార్మ్ అనే పరాన్నజీవి ప్రధానంగా చిన్నపేగుల్లో ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని అది సంగ్రహిస్తూ ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువ, పొషకాల లోపంతో పాటు ప్రధానంగా ఐరన్ లోపం కనిపిస్తుంది. చాలామందిలో ఇది ప్రధానంగా చిన్నపేగులనే ఆశ్రయించినా కొందరిలో మాత్రం ఊపిరితిత్తులు, చర్మం వంటి ఇతర అవయవాలపైనా ప్రభావం చూపవచ్చు. పోలాలకు వెళ్లే పెద్దలూ, మట్టిలో ఆడుకునే పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్ గురించి అవగాహన కోసం ఈ కథనం. హుక్వార్మ్ ఇన్ఫెక్షన్ అనేది పోలాల్లో నడిచేవారిలో... అది కూడా చెప్పులు, ΄ాదరక్షలు లేకుండా నడిచేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పటికీ కొన్ని మారుమూల పల్లెల్లో ఆరుబయలు మలవిసర్జన చేసే అలవాటు ఉంటుంది. మలంతో పాటు విసర్జితమైన హుక్వార్మ్ గుడ్లు ఏదో రూపంలో మనుషుల నోటి ద్వారా మళ్లీ లోనికి ప్రవేశించడం అన్నది దీని జీవితచక్రం (లైఫ్సైకిల్)లో భాగం. నేల/మట్టి ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది కాబట్టి దీన్ని ‘సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింథిస్’ అంటారు. మనుషులు నేల మీద నడవక తప్పదు కాబట్టి దీని విస్తృతి ఎంతంటే... ప్రపంచవ్యాప్త జనాభాలో దాదాపు 10% మందిలో ఈ ఇన్ఫెక్షన్ ఏదో ఒక దశలో వచ్చే ఉంటుందనేది ఒక అంచనా. లక్షణాలు: కొద్దిపాటి నుంచి ఓ మోస్తరు జ్వరం పొట్టలో నొప్పి ఆకలి మందగించడం ∙నీళ్ల విరేచనాలు బరువు తగ్గడం ∙రక్తహీనత ∙కొందరిలో దగ్గు / పిల్లికూతలు (ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు) ∙చర్మంపై ర్యాష్ (చర్మం ప్రభావితమైనప్పుడు). ఇదీ ముప్పు... తీసుకున్న ఆహారం, దాంతో సమకూరే శక్తి, సారం అంతా హుక్వార్మ్స్ గ్రహించడంతో తీవ్రమైన రక్తహీనత, ΄ోషకాల లోపం, ్ర΄ోటీన్స్ లోపం వంటి పరిణామాలతో తలతిరగడం, తీవ్రమైన అలసట, కండరాలు పట్టేయడం, ఊపిరి అందక΄ోవడం, ఛాతీలో నొప్పి వంటి అనేక పరిణామాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. దాంతో క్రమంగా భౌతికంగా, మానసికంగా బలహీనమయ్యే అవకాశం ఉంది. నిర్ధారణ: మల, రక్త (సీబీపీ) పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. రక్తపరీక్షలో ఈసినోఫిలియా (తెల్లరక్తకణాల్లో ఒక రకం) కౌంట్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మల పరీక్షలో హుక్వార్మ్ గుడ్లు కనిపిస్తాయి. నివారణ: కాచివడబోసిన నీళ్లు తాగాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినేయాలి. తినేముందు చేతులు కడుక్కవాలి ఆరుబయట మలవిసర్జనను పూర్తిగా నిలిపివేయాలి. (పల్లెల్లో సైతం ఇది జరగాలి) మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పెద్దలు పొలాల్లో తిరిగి వచ్చాక, పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా డీ–వార్మింగ్ చేయిస్తుండాలి. చికిత్స: కాళ్లకు లేదా ఒంటి మీద ఎక్కడైనా ర్యాష్ కనిపించినా, లేదా ఆకలి / బరువు తగ్గినట్లుగా ఉన్నా, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉన్నా డాక్టర్ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షల తర్వాత వ్యాధి నిర్ధారణ జరి΄ాక వారు మిబెండిజోల్, ఆల్బెండిజోల్ వంటి మందుల్ని సూచిస్తారు. --డాక్టర్ కె. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్! లాభాలేమిటంటే?) -
మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్లు ఏంటో తెలుసా!
మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్లు గురించి చాలామందికి తెలియదు. ఉన్నటుండి సడెన్గా చనిపోయాడనే అనుకుంటాం. అసలు ఇవి ఎలా సంభవిస్తాయి?. ఎందువల్ల అనే దాని గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో తెలుసుకుందాం. మానవ శరీరంలో సంభవించే అనేక రకాల షాక్లు ఉన్నాయి. వాటిలో అత్యంత సాధారణ రకాల షాక్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. హైపోవోలెమిక్ షాక్: తీవ్రమైన రక్తస్రావం లేదా నిర్జలీకరణం వంటి రక్తం లేదా శరీర ద్రవాల గణనీయమైన నష్టం జరిగినప్పుడు ఇది సంభవిస్తుంది. 2. కార్డియోజెనిక్ షాక్: తరచుగా గుండెపోటు లేదా గుండె వైఫల్యం కారణంగా శరీర అవసరాలను తీర్చడానికి గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు ఇది జరుగుతుంది. 3. అనాఫిలాక్టిక్ షాక్: ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య, ఇది ఆహారం, మందులు లేదా పురుగుల కుట్టడం వంటి అలెర్జీ కారకాలకు ప్రతిస్పందనగా సంభవించవచ్చు, దీని వలన రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 4. సెప్టిక్ షాక్: ఇన్ఫెక్షన్ శరీరం అంతటా వ్యాపించి, దైహిక తాపజనక ప్రతిస్పందన తక్కువ రక్తపోటుకు దారితీసినప్పుడు ఇది సంభవిస్తుంది. 5. న్యూరోజెనిక్ షాక్: వెన్నుపాము దెబ్బతిన్నప్పుడు లేదా స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థకు అంతరాయం ఏర్పడినప్పుడు ఈ రకమైన షాక్ ఏర్పడుతుంది, దీనివల్ల రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల ఏర్పడుతుంది. అన్ని రకాల షాక్లు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, తక్షణ వైద్య సహాయం అవసరమని గమనించడం ముఖ్యం. మీరు/మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి షాక్ లక్షణాలను ఎదుర్కొంటుంటే, దయచేసి వెంటనే వారికి తక్షణ వైద్య సాయం అందేలా చూడండి. --ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్ప్లేస్లో చేతులకు వచ్చే సమస్యలు!) -
అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్పై అవగాహన కోసం ఈ కథనం. మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ. అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లోలాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు ►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి ►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్) ►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙ ►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం. ►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్కు దారితీసే అంశాలు. చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙ జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం చికిత్సా ప్రత్యామ్నాయాలు శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా... మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్లతో మెదడులోని అన్యురిజమ్స్కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు. ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం... అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ (చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!) -
చిన్నారులు పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
చిన్నారులు తీసుకున్న ఆహారం అరగకపోతే వారి తల్లిదండ్రులు హైరానా పడతారు. ఆఘమేగాల మీద ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. పిల్లల్లో వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు మూలం నులి పురుగులే అని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కడుపులో నులి పురుగుల ఉన్నట్టు గుర్తిస్తే సులభ పద్ధతిలో వైద్యం చేయించవచ్చు. తగిన చికిత్స అందించకపోతే ప్రమాదకరంగా పరిగణిస్తాయని హెచ్చరిస్తున్నారు. నులి పురుగులు హెల్మెంత్ అనే పరాన్నజీవి జాతికి చెందినవి. ఇవి మూడు రకాలు. 1.రౌండ్ వారమ్స్ 2.పిన్ వారమ్స్ 3.ప్లూక్స్. వాటిలో రౌండ్ వారమ్స్ జాతికి చెందిన పురుగులు సాధారణంగా కనిపిస్తాయి. పిన్ వారమ్స్, ప్లూక్స్ వారమ్స్ జాతి పురుగులు ముఖ్యంగా పిల్లల పేగుల్లో జీవిస్తాయి. రౌండ్ వారమ్స్ జాతి పురుగులు 2 నుంచి 5 అంగుళాల పొడవుంటాయి. ఇవి పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లుల్లోనే గాకుండా మట్టిలో కూడా నివశిస్తాయి. పెంపుడు జంతువులతో చిన్నారులు సన్నిహితంగా ఉండడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా చిన్నారులకు నులి పురుగుల సంక్రమిస్తాయి. వ్యాప్తి ఇలా.. హుక్ వారమ్స్, పిన్ వారమ్స్ అనే జీవులు లార్వా రూపంలో మట్టిలో ఉంటాయి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలో తిరిగేటపుడు ఈ జీవులు వారి కాళ్ల చర్మం ద్వారా రక్తంలో ప్రవేశించి వారి ఊపిరితిత్తులలోకి చేరతాయి. అక్కడ నుంచి శ్వాస నాళంలోకి చేరి పురుగులుగా వృద్ధి చెందుతాయి. అక్కడే గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయి. ఆ గుడ్లు పిల్లల మలము ద్వారా బయటకు వచ్చి తిరిగి మట్టిలో లార్వాగా వ్యాప్తి చెందుతాయి. నులి పురుగుల లక్షణాలు నులి పురుగుల బారిన పడ్డ చిన్నారుల్లో ప్రాథమిక దశలో కొద్దిగా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లార్వా ఊపిరితిత్తులలోకి వెళ్ళడంతో కడుపులో నొప్పి, వాంతులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. హుక్ వార్మ్ జాతి పురుగులకు చిన్న దంతాలు వంటివి ఉంటాయి. వాటి సాయంతో అవి ఆమర నాళాల గోడలకు అతుక్కుని ఉంటూ క్రమంగా రక్తాన్ని పీల్చుకుంటాయి. చిన్నారుల జీర్ణ కోశంలో రక్త శ్రావం ఏర్పడుతుంది. దీంతో చిన్నారుల్లో రక్త హీనత, పోషకాహార లోపాల సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత కలిగిన పిల్లల్లో ఆయాసం ఉంటుంది. అలాగే శరీరం పాలిపోయినట్టుగా, నీరసంగా ఉంటారు. మట్టి తినే అలవాటు కనిపిస్తుంది. భారత్లో 22 కోట్ల చిన్నారులు .. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో జరిపిన సర్వే ప్రకారం భారత్లో 22 కోట్ల చిన్నారులు నులి పురుగుల బారిన పడినట్టు అంచనా. దేశంలో ప్రతి 10 మందిలో ఏడుగురు పిల్లలు నులి పురుగుల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్నారులు ఎక్కువ మంది నులి పురుగులు బారిన పడుతున్నారు. మాత్రలు ఉచితంగా వేస్తారు బయట ఆహారం తినడం, మట్టిలో ఆడడం, కలుషిత నీరు తాగడం వల్ల పిల్లలకు నులిపురుగుల సమస్యలు వస్తాయి. పిల్లలకు ఈ వ్యాధి రాకుండా తల్లిదండ్రులు ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. గర్భిణులు కూడా మాత్రలు తీసుకోవచ్చు. ప్రధానంగా పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కో వడం నేర్పించాలి. పిల్లలకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరు గుతోంది. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది సోమవారం పిల్లలకు ఉచితంగా ఈ మాత్రలు వేస్తారు. –డాక్టర్ హేనా, అర్బన్ హెల్త్ సెంటర్, నిడదవోలు -
పెద్దవయసు వారిని వణికించే పార్కిన్సన్స్ వ్యాధి!
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వారిలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తిం, ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... కనిపెట్టినవారి పేరుతోనే ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాధి గురిం ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటంతో దీన్ని అనువంశీకంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు. లక్షణాలు: కదలికలు నెమ్మదిస్తాయి (దీన్ని బ్రాడీకైనేసియా అంటారు). దాంతో నడక, స్నానం, దుస్తులు ధరించడం కష్టమవుతుంది. ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. బ్యాలెన్స్ కోల్పోతారు. కాళ్ల, చేతుల్లోని కండరాలు బిగుసుకుపోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట (ఫెటీగ్)కనిపిస్త, తరచూ నిద్రాభంగమవుతుంది. ఈ పరిణామాలతో పాటు మెదడులోని కొన్ని రసాయనాల అసమతౌల్యత వల్ల కుంగుబాటు (డిప్రెషన్), నిద్రసమస్యలు కనిపిస్తాయి. పీడకలల, రాత్రి నిద్రలేమితో అకస్మాత్తుగా పగటినిద్ర రావచ్చు. కొందరిలో మింగడం కష్టంకావడం, మింగలేకపోవడంతో ఆహారం గొంతులో పట్టేయడం /ఇరుక్కుపోవడం. కొందరిలో కండరాల నొప్పులు / కీళ్ల నొప్పులు. మొదట్లో కనిపించే ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే, అవి మరింత ముదిరి బాధితులు తమ రోజువారీ పనులు చేసుకోలేనంతగా ఇబ్బంది పడతారు. ∙కొన్ని చర్మ సమస్యలతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన సమస్యల అలాగే మలబద్దకం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ ఇలా... పార్కిన్సన్స్ వ్యాధిని పసిగట్టడం అన్నది ప్రధానంగా వ్యాధి లక్షణాల్ని బట్టి, క్లినికల్ పరీక్షల సహాయంతో జరుగుతుంది. నిర్ధారణ కోసం ఈ కింది పరీక్షలు అవసరమవుతాయి. మెదడు ఎమ్మారై పరీక్ష, స్పెక్ట్ అనే పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు. పెట్ స్కాన్ పరీక్ష. చికిత్స : వయసు పెరగడంతో మెదడులోని డోపమైన్ తగ్గడం, దాంతో కదలికలను నియంత్రించే మెదడు కణాలు నశించడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతో పాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూ పోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. ∙యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గిం, ఉపశమనాన్నిస్తాయి. శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. నివారణతో పాటు అవసరమయ్యే ఇతర పద్ధతులు: ∙వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో పోషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. అలాగే పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి వనసిక సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదమూ ఉంది. అందుకే సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం కావచ్చు. డాక్టర్ ఎం సాయి శ్రవంతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!
వర్షాలు కొన్ని ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొస్తాయి. మరికొన్ని వ్యాధుల్ని మరింతగా పెచ్చరిల్లేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో! వాళ్లతో పాటు పెద్దల్లో కూడా. ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యే. సామాన్యజనం పరిభాషలో ‘నెత్తుటిబంక విరేచనాలు’ అంటారు. విరేచనాలవుతూ ఉండగా అందులో కొద్దిగా రక్తం, మరికొద్దిగా చీములా పడుతుండటంతో ఈ పేరు. షిజెల్లా అనే ప్రజాతికి చెందిన ఓ బ్యాక్టీరియాతో వచ్చే సమస్య ఇది. కలుషితమైన నీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నీరు కలుషితం అవ్వడానికి అనువుగా ఉండే ఈ సీజన్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. షిజెల్లోసిస్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. మానవ విసర్జకాలతో కలుషితమైన నీరు తాగడం వల్ల, ఆ నీటితో చేసిన వంటల వల్ల షిజెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిం, మానవ జీర్ణవ్యవస్థలోకి చేరి, విరేచనాలు మొదలవుతాయి. ఈ విరేచనాలు కాస్త జిగటగా, నెత్తురుతో ఉండటంతో మామూలు వాటికంటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. పిల్లల్లో అందునా ఐదేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూస్తుంటారు. లక్షణాలు: విరేచనాల్లో బంక (మ్యూకస్), నెత్తురు కనిపించడం. కడుపు పట్టేసినట్లుగా అనిపించడం (స్టమక్ క్రాంప్స్), కడుపు నొప్పి జ్వరం (జ్వరతీవ్రత 101 ఫారెన్హీట్ వరకు ఉండవచ్చు) వికారం, కొన్నిసార్లు వాంతులు. వ్యాప్తి ఇలా... ∙కలుషితాహారంతో : షిజెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన నీటితో తయారు చేసిన ఆహారంతో లేదా ఆ నీళ్లు తాగడం వల్ల; లేదా ఆ నీటిలో ఈదినప్పుడు నోట్లోకి వెళ్లినప్పుడు మింగడం వల్ల. వ్యక్తి నుంచి వ్యక్తికి: ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న వ్యక్తి తన పెదవుల్ని చేతులతో తాకాక అవే చేతుల్ని ఇతరులు ముట్టుకున్నప్పుడు. ఇది పిల్లల డే కేర్ సెంటర్లలో, పిల్లలను ఆడిపించే క్రష్లు, స్విమ్మింగ్పూల్స్ ద్వారా... అలాగే హైజీన్ తక్కువగా ఉండే విద్యార్థుల హాస్టల్స్, మెస్లు, క్యాంపస్లలో వ్యాపించే అవకావం ఎక్కువ. ఇక ప్రయాణాల్లో అంతగా పరిశుభ్రత పాటించని హోటళ్ల వల్ల కూడా ఒకరినుంచి మరొకరికి పాకవచ్చు. కొన్నిసార్లు కాంప్లికేషన్లు... డీ–హైడ్రేషన్తో : విరేచనాల కారణంగా దేహంలోని ద్రవాలను కోల్పోవడంతో డీ–హైడ్రేషన్కు గురికావచ్చు. ఫలితంగా తల తిరగడం (డిజ్జీనెస్); తేలిగ్గా అనిపించడం (లైట్ హెడెడ్నెస్); పిల్లల్లో కన్నీళ్లు కూడా కనిపించకపోవడం, కళ్లు లోతుకుపోయినట్లుగా కనిపించడం... మరీ చిన్నపిల్లల్లో ఈ పరిస్థితులు తీవ్రమైతే ఒక్కోసారి షాక్కూ... అటు తర్వాత ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. మూర్ఛ (సీజర్స్) : కొంతమంది పిల్లల్లో మూర్ఛ (సీజర్స్) కనిపించవచ్చు. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకావాలు ఎక్కువ. ∙మలద్వారం చివరి భాగం బయటికి జారడం (రెక్టల్ ప్రొలాప్స్) : జిగురుతో కూడిన మ్యూకస్ బంకలా పడటం వల్ల మలద్వారం చివరి భాగం బయటకు జారే అవకాశం ఉంటుంది. దీన్నే రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. హీమోలైటిక్ అనీమియా : ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు అయినప్పటికీ కొట్టి పారేయలేని సమస్య. నెత్తుటి విరేచనాలు అవుతుండటంవల్ల ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం (హీమోలైటిక్ అనీమియా), ప్లేట్లెట్స్ తగ్గడం (థ్రాంబోసైటోపీనియా)... చాలా అరుదుగా ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కనిపించవచ్చు. టాక్సిక్ మెగాకోలన్: ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు. ఇందులో పేగుల కదలిక (బవెల్ మూవ్మెంట్) మందగించి మలం ముందుకు కదలడం ఆగిపోవచ్చు. దాంతో గ్యాస్గానీ, మలవిసర్జన గానీ జరగకపోవచ్చు. ఇలాంటి వైఫల్యం కనిపింనప్పుడు దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిం వెంటనే చికిత్స తీసుకోకపోతే పెద్దపేగు గాయపడటంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీసే ప్రవదం ఉంటుంది. బ్యాక్టీరిమియా : షిజెల్లా ఇన్ఫెక్షన్తో పేగుల లోపలి లైనింగ్ దెబ్బతినవచ్చు. దాంతో ఇలా దెబ్బతిన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఇది కాస్త అరుదు. నివారణ కేర్ఫుల్ డిస్పోజల్ ఆఫ్ డయపర్స్ : చిన్న పిల్లల డయపర్స్ను జాగ్రత్తగా పారేయాలి. వీటిని నీటివనరు (వాటర్ సోర్స్)తో కలవనివ్వకుండా జాగ్రత్తపడాలి. అప్పటికే విరేచనాల, నీళ్ల విరేచనాల, నెత్తుటిబంక విరేచనాలతో బాధపడుతున్నవారు... వంట చేయడం సరికాదు. వాళ్లు కిచెన్ నుంచి దూరంగా ఉండాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్ టాయెలెట్ హ్యాబిట్స్: పిల్లలకూ చేతులు కడుక్కునే అలవాటు నేర్పాలి. స్ల్స్కూ, పిల్లల కేర్ సెంటర్స్, ఆటస్థలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, వాళ్ల టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్లో లేదా పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈదుతున్నప్పుడు ఆ నీటిని మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు, వాగుల వంటి నీటి వనరు నుంచి తెచ్చిన నీటిని కాచి వడబోయకుండా తాగవద్దు. అలాగే పట్టణాల్లోన కొళాయి/నల్లా నీటిని శుభ్రం చేయడం, వడబోయడం వంటివి చేయకుండా వాడకూడదు. --డాక్టర్ శివనారాయణ రెడ్డి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..
ప్రస్తుత వర్షాలు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజల జీవితాలను మరింత అల్లకల్లోలం చేసే జ్వరమైన మలేరియాను మరింత పెంచవచ్చు. మిగతా తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించకపోయినా... అడవుల్లో, కొండకోనల్లో ఎప్పుడు ఎండెమిక్గా ఉండే మలేరియా... ఇప్పటి వర్షాలతో మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. అక్కడి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూ ఉంది. ఈ నేపథ్యంలో మలేరియాపై అవగాహన కోసం ఈ కథనం. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని అనాఫిలిస్ ఆడ దోమ వ్యాప్తి చేస్తుంది. ఈ పరాన్నజీవి నాలుగు ప్రధాన ప్రజాతులుగా... అంటే... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి ఉంది గానీ ఇది కొద్ది దేశాలకే పరిమితం. లక్షణాలు: దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. చలి, తలనొప్పి, ఒళ్లునొప్పులతో పాటు జ్వరం రావడం మలేరియా ప్రధాన లక్షణం. వ్యాధిని కలిగించే పరాన్న జీవిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో బాధితులు కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకం మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కామెర్లు, కిడ్నీలు విఫలం కావడం తోపాటు ఒక్కోసారి మృత్యువుకూ దారితీయవచ్చు. నిర్ధారణ: ∙డిప్–స్టిక్’ పద్ధతితో 15 నిమిషాల్లోనే ఫలితాలు చాలా కచ్చితంగా తెలుస్తాయి. రక్త పరీక్ష : థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్ష చేసి, ఒకసారి పరీక్షల్లో మలేరియా పరాన్నజీవి బయటపడకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్: మలేరియా యాంటిజెన్ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్–ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే పరీక్షలు కూడా ఉన్నాయి గాని వీటిని పెద్దగా వాడటం లేదు. నివారణ: దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. మన ఇంట్లోకి దోమలు రాకుండా రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు. దోమలు కుట్టకుండా శరీరంపైన పూత మందులు వాడవచ్చు. హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులు వద్దు. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులను వాడాలి. ఇళ్ల పరిసరాల్లో మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ∙పాత టైర్లు, ఖాళీ కొబ్బరి ప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకూడదు. కొంతమంది వాటర్ కూలర్స్లో కొన్ని నీళ్లు ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలు పడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, వాటిని మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్ స్థలాలుగా మారిపోతాయి. చికిత్స: గతంలో మలేరియాకు క్వినైన్, క్లోరోక్విన్ వంటి మందులతో చికిత్స చేసేవారు. అయితే పరాన్నజీవి ఆ మందులకు నిరోధక శక్తి పెంచుకోవడంతో వాటిపై నియంత్రణ విధించారు. లక్షణాల తీవ్రతను బట్టీ, అలాగే... తీవ్రత తక్కువగా ఉండే వైవాక్సా లేదా తీవ్రత ఎక్కవగా ఉండే పాల్సిఫేరవ అనే దాన్ని బట్టి వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత వల్ల ఇతర పరిణామాలు... అంటే...కిడ్నీల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస అందకపోతే వెంటిలేషన్ వంటివి అవసరమవుతాయి. మందులతో పాటు మంచి ఆహారం, విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. (చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..) -
మద్యం అలవాటు లేకపోయినా ఫ్యాటీ లివర్ వస్తుందా?
మనలో కొంతమందికి ఫ్యాటీలివర్పై ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారు కాలేయంలో క్రమక్రమంగా కొవ్వు పెరుగుతూ ఒక దశ తర్వాత కణాలన్నీ పూర్తిగా నశించి, కొవ్వు మయం అయిపోతే..అది సిర్రోసిస్ అనే కండిషన్కు దారితీస్తుందనీ, అప్పుడు కాలేయ మార్పిడి తప్పదనే అవగాహన కొంతమందిలో ఉంటుంది. అయితే మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుందన్నది పాక్షిక సత్యమే..ఆ అలవాటు లేనివారిలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కండిషన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్ఎల్డీ) అంటారు. శరీరతత్త్వాన్ని బట్టి మద్యం, మాంసాహార అలవాట్లు లేకపోయినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావచ్చేనే అవగాహన కల్పించేదే ఈ కథనం. మద్యం అలవాటు లేనివారిలోనూ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్! మానవుల పొట్టలో కుడివైపున కాలేయం ఉంటుంది. తీసుకున్న ఆహారంలోని చక్కెరలు శక్తిగా మారాక... మిగతావి కొవ్వు రపంలోకి వరి కాలేయంలో నిల్వ ఉంటాయి. మళ్లీ అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. ఈ నిరంతర పక్రియలో కొవ్వు వెతాదులు పెరుగుతున్న కొద్దీ కాలేయ కణాలు తమ స్వగుణాన్ని కోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతాయి. ఈ కండిషన్ను ఫ్యాటీలివర్ అంటారు. మద్యం అలవాటు ఉన్నా, పొట్ట ఎక్కువగా ముందుకొచ్చి ఉన్నా... వారిలో కాలేయం దశలవారీగా, ఎంతో కొంత ఫ్యాటీలివర్గా మారిపోయి ఉంటుంది. కారణాలు: జీవనశైలి / మెటబాలిక్ డిసీజెస్గా పేర్కొనే డయాబెటిస్ ఉన్నవారిలోన, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం (సెంట్రల్ ఒబేసిటీ), స్థూలకాయం (ఒబేసిటీ) వంటి అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్కు కారణం కావచ్చు. ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. లక్షణాలు: ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లోనైనా కొద్దిమేరకు లక్షణాలు కనిపింవచ్చేమోగానీ... నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో చాలావరకు లక్షణాలు కనిపించవు. అయితే మనకు చాలా సాధారణం అనిపించే కొన్ని లక్షణాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ను పట్టిస్తుంటాయి. ఉదా: పొట్ట పెరిగి, బానపొట్టలా ముందుకు రావడం. కొందరిలో కుడివైపు పొట్ట పైభాగంలో పొడుస్తున్నట్లుగా నొప్పి రావడం. లివర్ క్రమంగా పెరుగుతుండటంతో ఈ లక్షణం బయటపడుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్... దశలు... నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్లో నాలుగు దశలు ఉంటాయి. అవి మొదటి సింపుల్ స్టియటోసిస్ దశ, రెండోది స్టియటో–హెపటైటిస్ దశ. మూడోది ఫైబ్రోసిస్ దశ, నాలుగోదీ, వరదీ... ఇక వెనక్కు తిప్పడానికి వీలుకాని సిర్రోసిస్ దశ. మొదటి దశ: ఇది సాధారణమైన ఫ్యాటీ లివర్ వ్యాధి దశ. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా అంటే 5 శాతం నుంచి 10 శాతం మేరకు కొవ్వు శాతం పేరుకుంటుంది. రెండో దశ (నాశ్): ఈ దశను నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపటైటిస్ (ఎన్ఏఎస్హెచ్–నాశ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కాలేయ కణాలు కొన్ని నశిస్తాయి. మూడో దశ (ఫైబ్రోసిస్): ఈ దశలో కాలేయం పీచుగా మారినట్లుగా కనిపిస్తుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’గా పేర్కొంటారు. నాలుగో దశ (సిర్రోసిస్): ఫైబ్రోసిస్ నుం కాలేయం కొవ్వుకణాలతో నిండిపోయి, పూర్తిగా తన స్వరపాన్ని కోల్పోయి, కాలేయ వర్పిడి తప్ప ప్రత్యామ్నాయం లేని దశ వస్తుంది. ఇది వెనక్కుమరల్చలేని (ఇర్రివర్సిబుల్) దశ. నిర్ధారణ: బాధితుని స్థలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చసి డాక్టర్లు పరిస్థితిని కొంతమేర అంచనా వేయగలరు. కొన్ని రక్తపరీక్షలు, అలాగే డయాబెటిస్, కొలెస్ట్రాల్ వెతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నదీ చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్తో ఫ్యాటీలివర్ తప్పక బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం. లివర్ బయాప్సీతో ఎన్ఏఎఫ్ఎల్డీలో అది నాన్ఆల్కహాలిక్ ఫ్యాటీలివరా (ఎన్ఏఎఎఫ్ఎల్), లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అని నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్షతో లివర్లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయి, తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. చికిత్స : ఆల్కహాల్ అలవాటు లేనివారిలో దీని చికిత్సకు నిర్ణీతంగా ఒక ప్రొటోకాల్ లేదుగానీ... దీని చికిత్స సమయంలో ఫ్యాటీలివర్ డిసీజ్కు దోహదపడిన అంశాలను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. ముఖ్యంగా బాధితుల జీవనశైలిలోనూ, ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం వంటివి సస్తారు. బాధితులు ఏవైనా మందులు వాడుతుంటే, వాటి కారణంగా ఫ్యాటీలివర్ వచ్చిందని భావిస్తే, వాటిని మారుస్తారు. చాలా కొద్దిమందిలో మందులూ, శస్త్రచికిత్సా అవసరం కావచ్చు. ముందస్తు నివారణకు ఈ జాగ్రత్తలు... బరువు తగ్గడం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉన్నవారు ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించాలి. ప్రతి వారం అర కిలో నుంచి కిలో బరువు తగ్గించుకునేలా శ్రమించాలి. ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరి. పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు వాడాలి. రిఫైన్డ్ షుగర్స్, మైదా, స్వీట్లు తగ్గించాలి. మాంసాహారం తీసుకునేవారు చేపలు తినడం మంచిది. వ్యాయామం: చురుగ్గా ఉంటూ రోజూ ఒంటికి పనిచెప్పేలా శ్రమించాలి. రోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. డయాబెటిస్ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ వెతాదులను తగ్గించుకోండి. ఇందుకు వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాలి. (చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో.) -
నోటి దుర్వాసన.. లైట్ తీసుకోవద్దు, చాలా ప్రమాదం
మీ నోరు బాగుందా? నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్నది సామెత. అందులోని నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, మన నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందన్నది వైద్య నిపుణుల మాట. కొందరి నోటి నుంచి చెడు వాసన వస్తుంటుంది. అది వారికి తెలియదు. ఒకవేళ తెలిసినా, అది కేవలం నోటి సమస్య మాత్రమే అనుకుని నోటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం, మౌత్వాష్లను వాడటం వంటివి చేస్తారు. కానీ, చెడు శ్వాస అనారోగ్యానికి సంకేతమనే సంగతి మీకు తెలుసా? అవును. అది నిజం. బాగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంటే తప్పకుండా అనుమానించాలి. శరీరంలో నీరు తగ్గినట్లయితే.. ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు ఇస్తుంది మెదడు. ఆ సమయంలో ఆహారానికి బదులు నీళ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. నోరు పొడిబారితే లాలాజలంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణం తగ్గిపోయి నోటినుంచి చెడు వాసన వస్తుంది. అలర్జీలు కూడా కారణమే నోటి శుభ్రత పాటించకపోవడం, అలర్జీల వంటి సమస్యల వల్ల కూడా శ్వాస దుర్వాసన వస్తుంది. ఒకవేళ మీరు నోటిని శుభ్రంగా ఉంచుకుంటూ.. తగినన్ని నీళ్లు తాగే అలవాటు ఉన్నా సరే నోరు చెడు వాసన వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా నోటి నుంచి చెడు వాసన వస్తుంది. కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వివిధ అనారోగ్య సమస్యలు, చెడు అలవాట్ల వల్ల కూడా నోటినుంచి దుర్వాసన వస్తుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి టూత్ బ్రష్ను మార్చడం ముఖ్యం, అలాగే నాలుక స్క్రాపర్, ఫ్లాసర్ కూడా మార్చాలి. ఈ సాధనాలు మీ దంతాలు, చిగుళ్ళు, నాలుకను శుభ్రంగా ఉండేలా చూస్తాయి. పంటినొప్పి, చిగుళ్ళలో వాపు వంటి బాధాకరమైన పరిస్థితులకి దారితీసే అసౌకర్యాలను నివారిస్తాయి. భోజనం చేసిన తర్వాత ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం సహజమైన మౌత్వాష్గా పని చేస్తుంది, ఇది మీ నోటి పరిశుభ్రతను మరింత మెరుగుపరుస్తుంది. సరైన నోటి పరిశుభ్రత కోసం సాఫ్ట్–బ్రిస్టల్ బ్రష్, టూత్పేస్ట్, ఫ్లాస్, టంగ్ క్లీనర్, మౌత్ వాష్ వంటి ముఖ్యమైన ఉత్పత్తులను తప్పకుండా ఉపయోగించాలి. అప్పుడే నోటి ఆరోగ్యం బాగుండి, ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. గుండె జబ్బులను నివారించాలని అనుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్కు ముందు పళ్లు తోముకోవడం ఎంత ముఖ్యమో రాత్రి భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు పళ్లు తోముకోవడం కూడా అంతే ముఖ్యమని అధ్యయనకారులు సలహా ఇస్తున్నారు. కొన్ని ఆహారాలు మీ చిగుళ్ళను బలంగా ఇంకా దంతాలు ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. చిగుళ్ళు తగినంత బలంగా లేకుంటే, దంతాలు ఊడిపోతాయి. అందువల్ల, చిగుళ్ళను దృఢంగా చేయడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవటం అవసరం. నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు ►దుర్వాసన కేవలం నోటి నుంచే వస్తున్నట్లయితే.. రోజూ ఉదయాన్నే పళ్లు తోమగానే తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఏదైనా ఆహారాన్ని తిన్న తర్వాత నీటితో నోరు పుక్కిలించి ఉమ్మేయాలి. నోటిలో ఆహారం ఎక్కువసేపు ఉన్నట్లయితే బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. అది నోటిలో దుర్వాసన కలిగిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని నీటిని తాగుతుండాలి. ►రోజూ ఆపిల్ లేదా క్యారట్లను తినడం ద్వారా కూడా నోటిలో ఉండే మలినాలను తొలగించవచ్చు. కాఫీ ఎక్కువగా తాగినా సరే దుర్వాసన వస్తుంది కాబట్టి కాఫీకి బదులు గ్రీన్ టీ తాగడం మేలు. ఎందుకంటే గ్రీన్ టీ శ్వాసను మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. ► యాలుక్కాయను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ► దాల్చిన చెక్క, లవంగం కూడా మంచిదే. కిడ్నీలు సరిగా పని చేయకపోతే రక్తంలో ఉండే వ్యర్థాలు, మలినాలు పేరుకుపోతాయి. ఆ ప్రభావం నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్పై పడుతుంది. ఫలితంగా తినే ఆహారం రుచిగా అనిపించదు. పైగా ఏదో లోహాన్ని నోటిలో పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అంతేగాక.. చెడు రక్తం వల్ల ఊపిరితిత్తుల్లోకి కూడా చేరుతుంది. దానివల్ల శ్వాస క్రియ సమయంలో రక్తంలో ఉండే మలినాలు మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్లో కలుస్తాయి. ఆ గాలి బయటకు వచ్చినప్పుడు శ్వాస దుర్వాసనతో కూడి ఉంటుంది. కాబట్టి.. ఆ రెండు లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించడం అవసరం. ఎందుకంటే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది! అనారోగ్య కారణాలు కావచ్చు..! -
సారీ... మీ పేరు మరచిపోయాను!
ఢిల్లీకి చెందిన 22 సంవత్సరాల శ్రుతి అగర్వాల్ ఒకప్పుడు సినిమా చూస్తే.. ఆ సినిమా గురించి ఆర్డర్ తప్పకుండా సీన్ బై సీన్ చెప్పేది. ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన సినిమా అయినా సరే ఈరోజే చూసినంత ఫ్రెష్గా చెప్పేది. అలాంటి శ్రుతికి రెండు వారాల క్రితం చూసిన సినిమా కథ కూడా గుర్తుండడం లేదు అనేది ఒక విషయం అయితే కొత్త వారి పేర్లు త్వరగా మరచిపోవడం మరో విషయం. తనకు మతిమరుపు దగ్గరవుతుంది అని చెప్పడానికి ఈ రెండే కాదు ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.శృతికి ఎలాంటి దురలవాట్లు లేవు. వేళకు నిద్ర పోతుంది. సరిౖయెన ఆహారం తీసుకుంటుంది. మరి ఎందుకు తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతోంది? తనను తాను విశ్లేషించుకునే సమయంలో ఎప్పుడో స్కూల్ రోజుల్లో చదువుకున్న ‘యూజ్ ఇట్ ఆర్ లూస్ ఇట్’ అనే సామెత గుర్తుకువచ్చింది. అందులోనే తన సమస్యకు సగం పరిష్కారం కనిపించింది. స్కూల్, కాలేజీ రోజుల్లో ఏదైనా లెక్క చేయాలంటే మనసులో క్యాలిక్యులేట్ చేసుకోవడమో, కాగితం మీద చేయడమో జరిగేది. ఇప్పుడు మనసుతో పనిలేదు. చిన్నాచితకా లెక్కలకైనా స్మార్ట్ఫోన్లోని క్యాలిక్యులేటర్పై అతిగా ఆధారపడుతుంది. ఒక శుభకార్యం లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఆ తేదీని మదిలో ముద్రించుకునేది.. ఇప్పుడు సెల్ఫోన్లోని రిమైండర్కు పని చెబుతోంది. తన మెదడును సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే తనకు మతిమరపు దగ్గరవుతోందని గ్రహించిందామె. తనకు ఇప్పుడు కావాల్సింది బ్రెయిన్కు ఎక్సర్సైజ్ అనే విషయం అర్థమైంది. దీని గురించిన సమాచార శోధనలో తనను ఆకట్టుకున్నది.... పురాతనమైన మెమోరైజేషన్ స్ట్రాటజీ... మెథడ్ ఆఫ్ లోకి. మెమోరీ కోచ్, అథ్లెట్ బోరిస్ నికోలాయ్ వందల పేర్లను కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో గుర్తు పెట్టుకొని చెబుతాడు. నికోలాయ్ నెదర్లాండ్స్కు చెందిన న్యూరోసైంటిస్ట్ మార్టిన్ డ్రెస్లర్తో కలిసి ఒక అధ్యయనం నిర్వహించాడు. అందులో భాగంగా 20 ఏళ్ల వయసు ఉన్న 51 మందిని మూడు గ్రూప్లుగా విభజించారు. మొదటి గ్రూప్ చేత ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాక్టిస్ చేయించారు. రెండోగ్రూప్ చేత షార్ట్టర్మ్ మెమొరీ గేమ్స్ ఆడించారు. మూడో గ్రూప్కు మాత్రం ఎలాంటి కార్యక్రమం ఇవ్వలేదు. ఆరువారాల తరువాత... మొదటి గ్రూప్ మెమొరీ పవర్ పెరిగింది. రెండు, మూడు గ్రూప్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. పురాతనమైన ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాధాన్యత కోల్పోలేదు అని చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. అందుకే యూత్ దీనిపై ఆసక్తి కనబరుస్తోంది. ‘ మెథడ్ ఆఫ్ లోకి’ని మెమొరీ జర్నీ, మెమొరీ ప్యాలెస్... మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ‘లోకి’ అనేది ‘లోకస్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం... ప్రదేశం. సమాచారాన్ని మనసులోని ఊహాజనిత ప్రదేశాల్లో స్థిరపరుచుకోవడమే ‘మెథడ్ ఆఫ్ లోకి’ టెక్నిక్.ఉదాహరణకు...717, 919, 862, 9199.. లను గుర్తు పెట్టుకోవాలనుకుంటే మనసులో సుపరిచితమైన ప్రదేశాన్ని ఆవిష్కరించుకోవాలి. సపోజ్ మన ఇల్లు. ఆ ఇంట్లో కిచెన్కు ఒక సంఖ్య, డోర్కు ఒక సంఖ్య, విండోకు ఒక సంఖ్య ఇచ్చుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే... ‘మెథడ్ ఆఫ్ లోకి’ని ప్రాక్టీస్ చేసినా, రకరకాల మెమోరీ గేమ్స్ ఆడినా, జ్ఞాపకశక్తికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాలు చదివినా... శక్తిహీనత ప్రమాదం నుంచి బయటపడి జ్ఞాపకశక్తిని పదిలపరుచుకునే ప్రయత్నమే అవుతుంది. మంచిదే కదా! బిల్గేట్స్ నుంచి యూత్ వరకు... కోచీ(కేరళ)కు చెందిన 24 సంవత్సరాల కైష తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతున్న సమయంలో చదివిన పుస్తకం ‘మూన్వాకింగ్ విత్ ఐన్స్టీన్: ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ రిమెంబరింగ్ ఎవ్రీ థింగ్’ ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. జాషువా ఫోయర్ ఎంతో పరిశోధించి, విశ్లేషించి రాసిన ఈ పుస్తకానికి యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బిల్గేట్స్కు బాగా నచ్చిన పుస్తకం ఇది. 320 పేజీల ‘మూన్వాకింగ్ విత్ ఐన్స్టీన్’ లో ఫోయర్ రకరకాల నిమానిక్ టూల్స్ (జ్ఞాపక శక్తికి ఉపకరించేవి) నుంచి ఇంగ్లాండ్కు చెందిన విద్యావేత్త టోనీ బుజాన్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ వరకు ఎన్నో అంశాలు ప్రస్తావించాడు. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
మెడ పట్టేసినప్పుడు.. త్వరగా నార్మల్ కావాలంటే?
నిద్రలో మెడపట్టేయడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. అలాగే ప్రయాణాల్లో మెడను అసహజ భంగిమలో ఉంచి వాహనాల్లో నిద్రపోయేవారిలో కూడా ఇది కనిపిస్తుంది. మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్లో రై నెక్ అంటారు. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా నార్మల్ అయ్యేందుకు పాటించాల్సిన సూచనలివి.. నిద్రలో చాలా పలచటి తలగడను వాడుతూ దాన్ని మెడ భాగంలోనే కాకుండా.. భుజాల వరకు సపోర్ట్గా ఉంచాలి. తలగడకు బదులుగా మెత్తటి టర్కీ టవల్నూ గుండ్రంగా చుట్టి (రోల్ చేసి) మెడ కింద సపోర్ట్గా ఉంచవచ్చు. ఊ మెడ మీద భారం పడేలా ఎక్కువ బరువున్న వాటిని అకస్మాత్తుగా ఎత్తకూడదు. ఇలా చేయడం వల్ల నొప్పి ఇంకా పెరుగుతుంది. కొందరు సెలూన్స్లో మెడను రెండువైపులా విరిచేసినట్లుగా టక్కున తిరిగేలా చేస్తుంటారు. ఇలా ఎంతమాత్రమూ చేయకూడదు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదకరం. కానీ నొప్పినివారణ మందును రెండు రోజుల పాటు వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి డాక్టర్ను సంప్రదించాలి. (చదవండి: ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అంటే?) -
ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అంటే?
మన దేహంలోని నడుము భాగంలో కటి ఎముకలో రెండు గిన్నెల (సాకెట్స్) వంటి ఖాళీ భాగాలుంటాయి. ఆ రెండింటిలో తొడ ఎముక చివరన బంతిలా గుండ్రంటి భాగం (బాల్) సరిగ్గా అమరి ఉంటుంది. ఈ బంతి వంటి భాగాన్ని ‘ఫీమోరల్ హెడ్’ అంటారు. గిన్నె వంటి భాగంలో బంతి అమరి ఉండటం వల్లనే దీన్ని బంతి గిన్నె కీలుగా చెబుతారు. ఈ నిర్మాణమూ, ఈ అమరికే మనల్ని నిలబెడుతుంది, నిటారుగా ఉంచుతుంది, కదిలేందుకు ఉపకరిస్తుంది. కొంతమందిలో తొడ ఎముక చివర్న ఉండే ఆ బంతి వంటి భాగానికి ఆహారం, పోషకాలు, ఆక్సిజన్ అందక చచ్చుబడినట్లుగా అవుతుంది. ఆ కండిషన్ను ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ అంటారు. అలా అయినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి తుంటి ఎముక సర్జరీ చేయాల్సి వస్తుంది. భారత్లోని తుంటి ఎముక సర్జరీల్లో ఈ కారణంగా జరిగేవే చాలా ఎక్కువ. ఈ ఎవాస్క్యులార్ నెక్రోసిస్ గురించి అవగాహన కోసమే ఈ కథనం. తొడ ఎముకలోని బంతి వంటి భాగం (ఫీమోరల్ హెడ్) చచ్చుబడిపోయిపోవడం వల్ల వచ్చే ఎవాస్క్యులార్ నెక్రోసిస్ కేసులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చచ్చుబడ్డాక తుంటి ఎముక కూడా క్రమంగా అరుగుతూ ఉంటుంది. గతంలో (ఇప్పటికీ) ఏ మూత్రపిండాల జబ్బుల కారణంగానో లేదా ఏ ఇతర ఆరోగ్య సమస్యల వల్లనో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినప్పుడు ఎవాస్క్యులార్ నెక్రోసిస్కు దారితీయడానికి అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల కోవిడ్–19 వచ్చినప్పుడు స్టెరాయిడ్స్తో చికిత్స చేయడం చాలా ముమ్మరంగా జరగడంతో 20 – 30 ఏళ్ల వారిలో సైతం ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వీళ్లలోనూ యువతులతో పోలిస్తే యువకులే ఎవాస్క్యులార్ నెక్రోసిస్కు ఎక్కువగా గురవుతున్నారు (యువకులు, యువతుల నిష్పత్తి 3 : 2గా ఉంది). ఈమధ్య ఈ కేసులు గతంతో పోలిస్తే ఐదు నుంచి పదింతలు ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశం. ఎందుకు వస్తుందంటే..? ఏదైనా ప్రమాదంలోగానీ లేదా ఏదైనా కారణంతో తుంటి ఎముకకు గాయం కావడం. ఎసెటాబ్యులర్ ఫ్రాక్చర్ (అంటే బాల్ అండ్ సాకెట్ ప్రాంతంలోని స్కెలిటల్ స్ట్రక్చర్లో ఎక్కడైనా ఫ్రాక్చర్ కావడం) వంటి కారణాలతో ఫీమోరల్ హెడ్కు రక్తసరఫరా సరిగా జరగకపోవడం. ∙ఇతర ఆరోగ్య సమస్యలను మాయం చేయడానికి స్టెరాయిడ్స్ వాడాల్సి రావడంతో.. ఆ దుష్ప్రభావం ఫీమోరల్ హెడ్పై పడి, దానికి పోషకాలు, ఆక్సిజన్ ఆగిపోవడం. ∙ముందుగా చెప్పుకున్నట్లు కోవిడ్ సమయంలో కొందరు రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడాల్సి రావడం.. రెండేళ్ల తర్వాత ఆ దుష్ప్రభావాలు ఈ రూపంలో ఇప్పుడు కనిపించడం. ∙కొన్ని సందర్భాల్లో నిర్దిష్టంగా ఏ కారణమూ కనిపించకుండా కూడా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చు. లక్షణాలు.. తుంటి ఎముక ప్రాంతంలో, గజ్జెల్లో నొప్పి రావడం. ∙తుంటి ప్రాంతంలో తీవ్రమైన నొప్పితో నడకకష్టం కావడం. కొన్ని సందర్భాల్లో కనీసం నిలబడలేకపోవడం లేదా ఏమాత్రం కదల్లేకపోవడం. ఎక్కువ సేపు కూర్చుని, ఆ తర్వాత నిలబడ్డప్పుడు కీళ్లు స్టిఫ్గా అయినట్లు అనిపించడం. నడిచే సామర్థ్యం క్రమక్రమంగా తగ్గిపోతుండటం.. ఎక్కువ దూరం నడవలేక కుంటుతున్నట్లుగా నడవడం. వ్యాధి బాగా ముదిరాక... పై కారణాలతో బాధితులు తమ రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం. చికిత్స స్టేజ్1, స్టేజ్2లో సాధారణంగా స్టేజ్–1, స్టేజ్–2 లలో ఫీమోరల్ హెడ్ కొంతవరకు నొక్కుకుపోయినట్లుగా కావడంతో దానికి మందులతోనే చికిత్స చేస్తారు. ఇలా ఫీమోరల్ హెడ్ నొక్కుకుపోవడంతో కొంతమంది బాధితుల్లో చాలా తీవ్రమైన నొప్పి, కదలలేకపోవడం, కుంటటం వంటివి జరుగుతుంటే తొలిదశలో ‘కోర్ డికంప్రెషన్’ అనే శస్త్రచికిత్స చేస్తారు. దీంతోపాటు దెబ్బతిన్న / నశించిపోయిన అక్కడి కణాలు తిరిగి పుట్టేందుకు స్టెమ్సెల్స్ను పంపించి చికిత్స అందిస్తారు. అయితే ఈ తరహా ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స గానీ, స్టెమ్సెల్ థెరపీగానీ అందరిలోనూ ఒకేలాంటి ఫలితాలు ఇవ్వదు. కేవలం 65% మాత్రమే సక్సెస్ రేటు ఉంటుంది. అందునా ఫీమోరల్ హెడ్ పూర్తిగా దెబ్బతినక ముందు మాత్రమే ఈ ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స సాధ్యమవుతుంది. చికిత్స స్టేజ్-3, స్టేజ్-4లలో స్టేజ్–3, స్టేజ్–4 స్థాయి బాధితుల్లో సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఫీమోరల్ హెడ్ అనే ఆ బాల్ పూర్తిగా దెబ్బతినడంతో ‘హిప్ రీప్లేస్మెంట్’ అనే తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. పైగా ఆ దశలో ఆ శస్త్రచికిత్స తప్పక అవసరం. ఒకవేళ సరైన సమయంలో చికిత్స జరగకపోతే అది ఆ తర్వాత ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అనే ఎముకల తీవ్రమైన అరుగుదల, అవి బోలుగా మారిపోవడం వంటి కండిషన్స్ ఏర్పడతాయి. నిజానికి ఇప్పడున్న పరిస్థితుల్లో 20, 30 ఏళ్ల యువత ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ బారిన పడుతున్న తరుణంలో, ఈ వయసువాళ్లను కదల్లేకుండా ఒకేచోట కుదురుగా ఉంచే పరిస్థితులు ఉండవు. అది సరికాదు కూడా. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత, తుంటి ఎముక మార్పిడికి దోహదపడేందుకు వాడే సిరామిక్, పాలీ సిరామిక్ వంటి నాణ్యమైన పదార్థాలు, రోబోటిక్ సర్జరీ వంటి ప్రక్రియల వల్ల ఈ యువత బాగా కోలుకునేలా చేసే అవకాశాలున్నాయి. ఎవాస్క్యులార్ నెక్రోసిస్ రాకమునుపు ఉన్న పరిస్థితే పునరావృతమయ్యేలా, నొప్పి ఏమాత్రం లేకుండా పూర్తిగా బాసిపట్లు వేసుకుని కూర్చునేలా చేయగలగడం ఇప్పుడు సాధ్యమే. అయితే లక్షణాలు కనిపించగానే, ముందు దశల్లోనే డాక్టర్ను సంప్రదించడం అవసరం. నిర్ధారణ ఎవాస్క్యురాల్ నెక్రోసిస్కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు.. వారికి ఎక్స్–రే, ఎమ్మారై స్కాన్ పరీక్షలు చేసి, ఎవాస్క్యులార్ నెక్రోసిస్ను నిర్ధారణ చేస్తారు. చికిత్స ఎవాస్క్యులార్ నెక్రోసిస్ సమస్య స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3, స్టేజ్–4 అనే నాలుగు దశల్లో జరుగుతుంది. అంటే... ఫీమోరల్ హెడ్ అనే బంతి లాంటి నిర్మాణానికి ఏమేరకు రక్తసరఫరా, పోషకాలు, ఆక్సిజన్ తగ్గుతాయనే అంశాన్ని బట్టి ఎవాస్క్యులార్ నెక్రోసిస్ తీవ్రత, స్టేజ్ అనేవి ఆధారపడి ఉంటాయి. నివారణ నిజానికి దీనికి నివారణ అంటూ లేదు. ఎందుకంటే ఫీమోరల్ హెడ్గా పేర్కొనే ఆ బాల్వంటి ప్రాంతానికి రక్తప్రసరణలో అంతరాయం కలగడం లేదా ఆగిపోయాక మాత్రమే లక్షణాలు బయటపడతాయి. అందుకే ముందుగా నివారణ అన్నది సాధ్యం కాదు. అయితే స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవారిలో ఇది కనిపిస్తుందన్న అంశాన్ని బట్టి... ఈ విషయంలో కాస్త నియంత్రణ పాటిస్తే నివారణకు కొంతవరకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... స్టెరాయిడ్స్ తీసుకునే బాధితులు రోజుకు 20 మి.గ్రా. నుంచి 30 మి.గ్రా. వాడేవారూ, అలాగే చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ ఫిజీషియన్ను సంప్రదించి, మున్ముందు తమకు హానికరం కాని మోతాదుల్లో మాత్రమే స్టెరాయిడ్స్ తీసుకునేలా జాగ్రత్త వహించవచ్చు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
లావైపోతున్నారు! ముంచేస్తున్న ఆహారపు అలవాట్లు
ఊబకాయం.. ఇప్పుడు సాధారణమైపోయింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య పీడిస్తోంది. దీని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాల మీద పడుతోంది. ఫలితంగా గుండె, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులకు మూలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఊబకాయం నివారణకు జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత ఆహారపు అలవాట్లు లావు కావడానికి ఒక కారణమైతే, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణమని జాతీయ ఆరోగ్య మిషన్ చేసిన సర్వేలో తేలింది. శ్రమగల జీవన విధానం, సమతులాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం పెరిగిపోతోంది. దానికి తోడు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక బరువు ఉన్న వారిని గుండె జబ్బులతో పాటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఊబకాయులు ఇటీవల అనేక దుష్ఫలితాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. కార్డియాలజీ రోగుల్లో 25 శాతం మంది ఊబకాయులే ఉంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్ఎసీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతున్నట్లు తేలింది. జిల్లాలో 17,54,254 మంది ఉండగా 12,99,758 మందిని ఎన్సీడీ సర్వే చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వే 74.09శాతం పూర్తయింది. అయితే ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్నవారు 1,96,772 మంది, మధుమేహంతో 1,96,957 మంది, రెండు ఉన్నవారు 17,675 మంది ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి, అధికబరువు వంటివి అని వైద్యులు చెబుతున్నారు. బరువుతో గుండె బలహీనత గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కార్డియాలజీ ఓపీల సంఖ్య పెరుగుతోంది. రోజుకు జిల్లాలో 200 నుంచి 250 మంది వరకూ రోగులు వస్తున్నట్లు వైద్యులు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 25 శాతం మంది అంటే 55 మంది ఊబకాయులే. వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాకులు ఏర్పడటం, గుండెపై తీవ్ర ఒత్తిడి, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఉన్న వారికి వాటిని తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతోంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్లో ప్రొటీన్లు లీకవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు డయాలసిస్ కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం 50 నుంచి 65 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులు ఒబెసిటీ వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒబెసిటీ ఉన్న వారిలో పదిశాతం మందికి గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయసులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది. బరువు పెరగడానికి కారణాలు పట్టణాల నుంచి పల్లెల వరకు జంక్ఫుడ్ వినియోగం పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ఫుడ్, ఐస్క్రీమ్లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోని కొన్ని యాప్లద్వారా జంక్ఫుడ్ను ఆర్డర్ పెడితే క్షణాల్లో గుమ్మం ముందు డెలివరీ చేస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లలో విక్రయించే ఆహారాల్లో బిర్యానిదే మొదటిస్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండడం, వీటికి తోడు కూల్డ్రింక్లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మగవారితోపాటు అధికంగా మహిళలకు ఊబకాయం వచ్చేస్తోంది. ఇలా చేస్తే మేలు దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23.5 దాటిన వారందరినీ ఊబకాయులుగా భావిస్తారు. వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల ఆహారం తీసుకుంటే సత్పలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. దీర్ఘకాల విధానంలో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం ద్వారా బరువు చేయడం తగ్గించుకోవచ్చు. స్వల్పకాలంలో రోజుకు వెయ్యి కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులను అనుసరించినా బరువు తగ్గకుంటే బీఎంఐ 30 శాతం దాటిన వారికి బేరియాట్రిక్ (మెటబాలిక్) సర్జరీలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. బరువు తగ్గితే మంచిది ఊబకాయం ఉన్న మధుమేహులు తమ బరువులో ఐదు శాతం తగ్గించుకోగా తక్కువ మందులతో మెరుగైన వ్యాధి నియంత్రణా ఫలితాలు రాబట్టవచ్చు. హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చు. సమతుల ఆహారం, క్రమగల జీవన విధానం, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయుల్లో మధుమేహ నియంత్రణకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. – డాక్టర్ అరుణ్కుమార్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కంటి నిండా కునుకు తీసి ఎన్నాళ్లయిందో.. మనసారా నిద్రపోవడం ఒక కలగా మారింది..ఇప్పుడు ఎక్కువ మంది నోట వినిపించే మాట ఇది. అనారోగ్యానికి కారణమవుతున్న ప్రధాన సమస్య ఇది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రికి మంచమెక్కినా నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతోంది. ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుని రెండు మూడు గంటలకే మేల్కొనాల్సి వస్తోంది. జీవనశైలిలో వచ్చిన మార్పులు ఇందుకు కారణమవు తున్నాయి. అలాగని జీవనశైలిని ఏమైనా మార్చుకుంటున్నారా అంటే అదీ చేయడం లేదు. గాఢనిద్ర లేక పోవడం ఆరోగ్య పరంగా అనేక అనర్థాలకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పనిలో పెరిగిన ఒత్తిళ్లు, అమెరికా వంటి దేశాలలోని మల్టీ నేషనల్ కంపెనీల కోసం నిరంతరం రాత్రి పూట పనిచేయడం నిద్ర లేమికి కారణమవుతూ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 50 నుంచి 60శాతం మంది నిద్ర లేమితో బాధపడుతున్నారని వైద్యుల అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు గాఢనిద్ర అంటే పది గంటలు పైమాటే. మారిన పరిస్థితులతో నిద్రను అమెరికన్ స్లీప్ అసోసియేషన్ ఎనిమిది గంటలకు కుదించింది. నీరసం..నిస్సత్తువ నిద్ర లేమిని వైద్య పరిభాషలో ఇన్సామ్నియా అంటారు. దీని బాధితులకు రాత్రి వేళ్లల్లో నిద్ర త్వరగా పట్టకపోవడం, మధ్య రాత్రి వేళల్లో మెలకువ రావడం, త్వరగా లేచిపోవడం, మెదడు పనితీరు క్షీణించడం, నిద్రపోయిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకున్న భావన కలగక పోవడం, రోజంతా మత్తుగా ఉండటం జరుగుతుంది. ఫలితంగా నీరసం వచ్చేస్తుంది. పగలంతా శ్రమించిన వారికి, మెదడుకు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. వైద్యులు నిద్రను రెండు రకాలుగా పేర్కొంటున్నారు. నిద్రలో ఉన్న 1, 2, 3 దశల్లో గాఢ నిద్రలో 2,3 స్టేజ్లుగా చెబుతున్నారు. నిద్రలో మూడో స్టేజ్ చాలా కీలకమైంది. ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలు ఈ సమయంలోనే మెదడులో నమోదవుతుంటాయి.ఆ సమయంలో సరిగ్గా నిద్ర పట్టలేదంటే ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్టేనని గుర్తించాలంటున్నారు. నిద్ర అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఏడాది లోపు పిల్లలు 12 గంటలు నిద్రపోతారు. వయస్సు పెరిగే కొద్దీ 8 గంటలు ఉండాలి. యుక్త వయసు నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉన్న వారికి మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిది కాదు. నిద్రపోయేందుకు ఇవి పాటించాలి ♦నిద్రపోయే ముందు మొబైల్ చూడకూడదు. ♦పడకునే గదిలో లైట్ వేసుకోకూడదు.అసలు టీవీ ఉండకూడదు. ♦పడుకునే గది కొంత చీకటిగా ఉండాలి.బెడ్లైట్ కూడా కాంతివంతంగా ఉండకూడదంటున్నారు. ♦మధ్య వయస్సు వారు మధ్యాహ్నం పడుకోకూడదు. తిన్న తరువాత పడుకోకపోవడమే చాలా మంచింది. ♦బెడ్కు ఎదురుగా గడియారం పెట్టుకోవడం, టైం ఎంతయిందనిని తరచు చూడటం వల్ల నిద్ర లేమికి మరో కారణం. ♦ఈ మధ్య కాలంలో నిద్ర లేమితో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. రెండు, మూడు గంటలు, ఐదు గంటలు లోపు నిద్రపోయే వారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ♦ఇది చాలా ప్రమాదకరం. మెదడుతో పాటు ఇతర భాగాలపై ప్రభావం చూపుతోంది. నిద్రపై ఆరోగ్య ప్రభావం సుఖమైన నిద్ర పోయే వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు పరీక్షలు కోసం రాత్రి అంతా చదివేసినా అవి ఒకటి, రెండు రోజులు మాత్రమే గుర్తుంటాయి. ఆ తరువాత మరరిచిపోతారు. చదివినంత సమయం నిద్ర కూడా ఉన్నప్పుడే చదువుకున్నది మెదడులో స్థిరంగా ఉంటుంది. పిల్లల్లో .నిద్ర సరిగ్గా లేని వారు పెరగాల్సినంత పెరగక పోవచ్చు. చదవండి: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ! నిద్ర పోకపోవడం పొగతాగడం కంటే ప్రమాదకరం పడుకునే ముందు మొబైల్ వినియోగం, ఆన్లైన్, ఛాటింగ్లు, డ్రగ్స్ వంటిని తగ్గించాలి. పడుకోవడానికి మూడు గంటలు ముందు కాఫీ, టీ, ఆల్కాహాల్, కూల్డ్రింక్ తీసుకోకూడదు. గంట ముందు పాలు తీసుకోవచ్చు. నిద్రపోయేందుకు ముందు వ్యాయామం చేయకూడదు. కొందరు రాత్రి పూట వాకింగ్, వ్యాయామం చేస్తుంటారు. అది ఏమంత మంచిది కాదు. నిద్రపోకపోవడమనేది పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికంటే ప్రమాదకరంగా పేర్కొంటున్నారు. – డాక్టర్ పిల్లారిశెట్టి శంకర్, ఎండీ, డీఎన్బీ, న్యూరో ఫిజీషియన్, రాజమహేంద్రవరం నిద్ర మాత్రలతో మతిమరుపు మానసిక సమస్యలు, యాంగ్జయిటీ, డిప్రెషన్ వల్ల కూడా స్లీపింగ్ డిస్ట్రబెన్స్ ఉంటుంది. అసలు కారణానికి మందులు వాడాలి తప్ప నేరుగా నిద్రలేమికి మందులు వాడకూడదు. ఆ్రల్పాజోలం ఎక్కువగా వాడుతున్నారు. నిద్రకు సమయ పాలన లేకపోవడంతోనే యువతలో నిద్ర లేమి సమస్యలు వస్తున్నాయి. జీవన శైలి మార్చుకుంటే మందులతో పనిలేదు. శ్వాస సంబంధిత ఇబ్బందుల వల్ల కూడా నిద్ర లేమి ఎదురవుతుంది. నిద్రమాత్రల వల్ల మతిమరుపు త్వరగా వస్తుంది. పాలీ సోమినో గ్రాఫీ యంత్రం ద్వారా నిద్ర లేమిని పరీక్షించవచ్చు. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ -
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.. పరాకు వద్దు
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్ను క్యాన్సర్స్ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఊపిరితిత్తుల క్యాన్సర్స్కు లాగానే ఈ క్యాన్సర్స్కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ. నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్నూ, గ్రేడింగ్లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది. లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్. పారానేసల్ సైనసెస్తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్లు. లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు. మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్ఏటీ, ఐఎమ్ఆర్టీ, ఐజీఆర్టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్డ్ ట్రీట్మెంట్గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్లో ఉండాలి. మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం. - డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు: 9849022121 -
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ గుర్తించడం ఇలా.. కారణాలివే..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికే ప్రతినెలా 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి బ్రెయిన్ స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు చూసేవారమని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30–40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్లు చూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు చెపుతున్నారు. కారణాలివే.. ► జన్యుపరమైన లోపాలు ► తీసుకునే ఆహారం వలన ► సెల్ఫోన్ రేడియేషన్ ► స్మోకింగ్, ఆల్కాహాల్ తీసుకునే వారిలోనూ రావచ్చు. గుర్తించడం ఇలా... బ్రెయిన్ ట్యూమర్కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. మొదటి దశ : తలనొప్పి, వాంతులు, తల తిరగడం. రెండోదశ : తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు అవడం, తలతిరగడం ఎక్కువగా ఉంటుంది. మూడో దశ : బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశ : ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు. చికిత్సలు ఇలా.. బ్రెయిన్ ట్యూమర్ దశను బట్టి చికిత్స అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్స, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. నిర్ధారణ ఇలా.. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సైతం రెండు సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు, ఒక ఎంఆర్ఐ పరికరం అందుబాటులో ఉంది. ప్రైవేటులో సైతం విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావడంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. (క్లిక్ చేయండి: చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!) ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు ప్రభుత్వాస్పత్రిలోని న్యూరాలజీ ఓపీకి నెలకు 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వాలా, శస్త్ర చికిత్స చేయాలా అనేది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్ను నిర్ధారిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాస్పత్రిలో రెండు సీటీ స్కాన్లు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం అందుబాటులో ఉంది. – డాక్టర్ దార వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి, జీజీహెచ్, విజయవాడ కచ్చితమైన నిర్ధారణ బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశ వరకూ తెలుసుకునే వారు కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందుబాటులోకి రావడంతో. మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నారు. తలనొప్పితో వచ్చిన వారికి లక్షణాలను బట్టి స్కాన్ చేస్తే ట్యూమర్ ఉంటే నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ ఎన్.దీప్తిలత, రేడియాలజిస్ట్ -
కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..
సాక్షి, కర్నూలు: ఉదయం లేచిన వెంటనే కదలలేరు, నడవలేరు. కాసేపు కుర్చీలో కూర్చుని మళ్లీ లేవాలంటే నరకం. కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా, కాస్త కష్టమైన పనిచేయాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దీనినే వైద్యపరిభాషలో రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం) అంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత వేదనకు గురి చేస్తుంది. చలితీవ్రత పెరిగే కొద్దీ ఈ వ్యాధి బాధితుల బాధ వర్ణణాతీతం. జిల్లాలో ఇటీవల కీళ్లవాతం బాధితుల సంఖ్య పెరుగుతోంది. గతంలో జిల్లా జనాభాలో 5 శాతం ఉన్న వారి సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ సమస్య బాధితులు ఉండగా.. ఇప్పుడు గ్రామాల్లోనూ పెరిగారు. జీవనశైలిలో మార్పుల కారణంగా జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడం, వ్యాయామం చేయకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం అధికంగా వంశపారంపర్యం మరో కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో ఈ సమస్య 40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా కనిపించేది. ఇప్పుడు పాతికేళ్ల వయస్సు నుంచే మొదలవుతోంది. చదవండి: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే... ఇది దీర్ఘకాలిక వ్యాధి. శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ఇది సంభవిస్తుంది. దీనివల్ల కీళ్లలో నొప్పి, వాపు, బిగువును కలుగజేస్తుంది. ఒకే సమయంలో శరీరం రెండువైపులా సమంగా కీళ్లనొప్పి కలుగుతుంది. కొన్ని వారాల్లో ఇది వృద్ధి చెంది కీళ్లను నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఇది సాధారణంగా చెయ్యి, పాదం, మణికట్టు, మోచేయి, చీలమండలంలోని చిన్న కీళ్లను ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణకు ప్రభావిత కీళ్లకు శారీరక పరీక్ష, ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటి సీసీపీ రక్తపరీక్షలు, ఎక్స్రే చేయించాలి. చదవండి: మూడ్స్ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్! లక్షణాలు ➡ఒకటి లేదా ఎక్కువ చేయికీళ్లలో మానకుండా ఉన్న వాపు ➡తెల్లవారుజామున 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండే కీళ్ల బిగువు ➡కీళ్లలో మెలిపెడుతున్న నొప్పి ➡పిడికిలి బిగించడంలో ఇబ్బంది ➡అలసట, అలసిన భావన ➡ఈ వ్యాధి వల్ల కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, చర్మం ప్రభావితం అవుతాయి. కారణాలు ➡వంశపారంపర్యం, జీవనశైలిలో లోపాలు, జంక్ఫుడ్, మాంసాహారం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం ➡గతంలో చికున్గున్యా, డెంగీ జ్వరం వచ్చినా దాని తాలూకు వైరస్లు కీళ్లలో ఉండి దీర్ఘకాలం నొప్పులుగా మారి కీళ్లవాతానికి దారి తీస్తుంది. ➡ఇది కీళ్లకు, దాని చుట్టుపక్కల ఉన్న మృదులాస్తికి, సమీప ఎముకలకు హాని కలిగిస్తుంది. చదవండి: గుడ్న్యూస్! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే.. కీళ్లను కాపాడుకోవడం ఇలా.. వ్యాయామం.. చలికాలంలో రోజూ వ్యాయామం చేయడం వల్ల నొప్పి తగ్గడం, కీళ్లు, కండరాలు బలంగా తయారు అవుతాయి. దీనివల్ల కీళ్లు చురుకుగా కదులుతాయి. అయితే ఒకేసారి ఎక్కువగా గాకుండా చిన్న చిన్న వ్యాయామాలు వైద్యుల సూచనలతో చేయాలి. కీళ్ల వాతం ఉండేవారు వారు నడిచే మార్గాలు, పనుల వల్ల కీళ్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. వెచ్చగా ఉంచుకోవడం.. శరీరానికి వెచ్చదనం రక్తప్రసరణను మెరుగుపరిచి నొప్పికి కారణమయ్యే కెమికల్ను తొలగిస్తుంది. దీంతో పాటు నొప్పి సెన్సిటివిటీని తగ్గించి నొప్పిని తట్టుకునేస్థాయిని పెంచుతుంది. దీనివల్ల కీళ్లు బిగుసుకుపోవడం తగ్గుతుంది. వేడినీటి స్నానం, హీటింగ్ ప్యాడ్స్, గ్లౌజ్లు, షూస్, ఉలెన్ డ్రెస్ ధరించడం వల్ల కీళ్లు బిగుసుకోవడాన్ని తగ్గించుకోవవచ్చు. విటమిన్ డి లోపం.. విటమిన్ డి ఎముకలు, కీళ్లు, పళ్లకే గాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచేందుకు ప్రధానం. విటమిన్ డి లోపం వల్ల కీళ్లనొప్పి అధికం అవుతుంది. కీళ్లు బిగుతుగా అవుతాయి. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది. అది వీలుకాని వారు ప్రతిరోజూ 600 ఐయూ విటమిన్ డి మాత్రను తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవాలి.. కీళ్ల వ్యాధి ఉండేవారికి చలికాలంలో వ్యాధినిరోధకశక్తి బలహీన పడి సులువుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఫ్లూ, న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. అధిక బరువు వల్ల చురుకుతనం తగ్గిపోతుంది. వీరిలో అధిక శాతం వ్యాయామంపై నిర్లక్ష్యం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే వ్యాయామాలు చేయాలి. నీరు అధికంగా తాగాలి. ముఖ్యంగా గౌట్ రోగులు ఉప్పు తగ్గించాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా నీటి శాతం చేరి కీళ్లు మరీ ఎక్కువగా బిగుసుకుపోతాయి. చలికి బిగుసుకునే కీళ్లు సాధారణంగా చలికాలంలో కీళ్లు కొంచెం బిగుతుగా ఉంటాయి. కీళ్లవాతం వ్యాధిగ్రస్తులలో మరీ ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణంలో వచ్చే మార్పులు కీళ్లపై ప్రభావం చూపుతాయి. కీళ్లు వ్యాకోచించడం వల్ల కీళ్లలో ఉండే ద్రవంలో మార్పుల వల్ల, పెయిన్ సెన్సిటివిటివి చలికాలంలో పెరగడం వల్ల 20 శాతం ఎక్కువ నొప్పి తెలుస్తుంది. కీళ్లు ఎక్కువగా బిగుతుగా మారతాయి. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ ఎ. సృజన, రుమటాలజిస్టు, కర్నూలు -
మన దేశంలో ఈ సమస్య తీవ్రత ఎక్కువే..
ఈ చలికాలంలో నీళ్లు తాగేది ఒకింత తక్కువే అయినా... కొందరికి తరచూ మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సాధారణం కంటే చాలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితినే ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అంటారు. ఇది ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగా కూడా బాధితులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో ఈ సమస్య ఉన్న బాధితులు నీళ్లు తక్కువగా తాగడం మొదలుపెడతారు. ఫలితంగా సాధారణ జీవక్రియలు, మూత్రపిండాలకు సంబంధించిన మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశముంది. తరచూ నిద్రాభంగం వల్ల ‘నిద్రలేమి’తో వచ్చే ఆరోగ్యసమస్యలు అదనం. ఈ సమస్య లక్షణాలేమిటో, దాన్ని అదుపు చేయడం ఎలాగో తెలుసుకుందాం. కొందరిలో మూత్రాశయపు బ్లాడర్ గోడలు తరచూ అతిగా స్పందించి, త్వరత్వరగా ముడుచుకుపోతూ... మూత్రాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు తాము ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ టాయిలెట్ గదులెక్కడున్నాయో వెతుక్కుంటూ ఉంటారు. ఈ ప్రవర్తననే ‘‘టాయిలెట్ మ్యాపింగ్’’ అంటారు. ఇక రాత్రివేళ తరచూ పక్క మీది నుంచి లేస్తూ ఉండటం... కేవలం వారిని మాత్రమేగాక వారి భాగస్వామికీ నిద్రాభంగం కలిగిస్తూ ఇబ్బందిగా పరిణమిస్తుంది. దాంతో ఆరోగ్యసమస్య కాస్తా... కుటుంబ సమస్యగా కూడా పరిణమిస్తుంది. ఫలితంగా ఇది వారి ‘జీవననాణ్యత’ (క్వాలిటీ ఆఫ్ లైఫ్)ను దెబ్బతీస్తుంది. మనదేశంలో దీని తీవ్రత... నిజానికి మన దేశంలో ఈ సమస్య ఎక్కువే అయినప్పటికీ దీని గణాంకాలు చాలా తక్కువగా నమోదవుతుంటాయన్నది వైద్య నిపుణుల భావన. అయినప్పటికీ కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషుల్లోని 14 శాతం, మహిళల్లో 12 శాతం మందిలోనూ ఈ సమస్య ఉంటుంది. మెనోపాజ్కు చేరువైన/ మెనోపాజ్ వచ్చిన మహిళలు, ప్రోస్టేట్ సమస్య ఉన్న పురుషుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. మేనేజ్మెంట్ / చికిత్స ∙జీవనశైలి మార్పులు : ఇందులో భాగంగా సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకొమ్మని డాక్టర్లు / నిపుణులు సలహా ఇస్తారు. కొందరు అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. ఉదాహరణకు... ఉదయాన్నే చేసే మూత్రవిసర్జన వల్ల దేహంలోని చాలా విషపదార్థాలు బయటకు వెళ్తాయనే అపోహతో చాలామంది రెండు లీటర్లకు పైగా నీళ్లు తాగేస్తారు.అవసరానికి మించి నీళ్లు తాగకుండా జాగ్రత్తపడాలి. (ఇందుకు కొంత పరిశీలన, అభ్యాసం అవసరం. మనకు ఎన్ని నీళ్లు సరిపోతాయనే అంశాన్ని మరీ నీళ్లు తక్కువైనప్పుడు డీహైడ్రేషన్లో కనిపించే లక్షణాలైన కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) వంటి వాటిని గమనిస్తూ... దేహానికి అవసరమైన నీళ్ల మోతాదును ఎవరికి వారే స్వయంగా గుర్తించగలిగేలా నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.); నిద్రపోవడానికి రెండు గంటల ముందుగా నీళ్లు తాగడం...ఆ తర్వాత తాగకపోవడం; పొగతాగడం, కాఫీ (కెఫిన్), ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం; ఓవర్ ద కౌంటర్ మందులకు దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులతో ఈ సమస్యను చాలావరకు కట్టడి చేయవచ్చు. ►బిహేవియర్ థెరపీ : మానసిక చికిత్సలో భాగంగా ఇచ్చే అభ్యాస చికిత్సతో బ్లాడర్పై క్రమంగా అదుపు సాధించేలా చేయడం. ►నోటితో ఇచ్చే మందులు / బ్లాడర్కు ఇంజెక్షన్లు : సమస్య తీవ్రత తక్కువగా ఉన్నవారికి నోటితో ఇచ్చే కొన్ని మందులతో... సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారిలో నేరుగా బ్లాడర్ కండరాలు బలోపేతమయ్యేందుకు నేరుగా బ్లాడర్లోకి ఇచ్చే కొన్ని ఇంజెక్షన్లతో. ►ఎలక్ట్రిక్ ఇంపల్స్ / స్టిమ్యులేషన్ టెక్నిక్స్ : ఏదైనా నరం దెబ్బతిన్నప్పడు దాన్ని ప్రేరేపించేలా (నర్వ్ స్టిమ్యులేటింగ్ టెక్నిక్స్) చేయడం. ఇందులో భాగంగా మెదడు, వెన్నుపూస నుంచి వచ్చే నరాలు, అవి బ్లాడర్కు చేరాక... వాటి నుంచి అందే సిగ్నల్స్ అన్నీ సరిగా అందేలా దెబ్బతిన్న నరాలకు ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన కలిగేలా విద్యుత్ ప్రేరణలు కల్పించడం. ►శస్త్రచికిత్స : ఇది చాలా చాలా అరుదుగా మాత్రమే అవసరమయ్యే ప్రక్రియ. ►పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సర్సైజ్లు : కెగెల్స్ ఎక్సర్సైజ్ అని పిలిచే ఈ వ్యాయామల వల్ల పొత్తికడుపు కండరాలు, యూరినరీ బ్లాడర్ కింది భాగంలోని కండారాలు, మూత్రసంచి (బ్లాడర్) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాకు మధ్య ఉండే ‘నెక్’ లాంటి చోట ఉండే కండరాలు బలోపేతమవుతాయి. ఈ వ్యాయామాలతో మూత్రం ఆపుకోగల సామర్థ్యం క్రమంగా (అంటే 4 – 8 వారాలలో) పెరుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోల సూచనలతో చేసే ఈ వ్యాయామాలతో పరిస్థితి క్రమంగా చాలావరకు మెరుగువుతుంది. ఏ వైద్య నిపుణులను సంప్రదించాలి ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’తో బాధపడే పురుషులు యూరాలజిస్ట్ను సంప్రదించాలి. అలాగే ఓవర్ ఆక్టివ్ బ్లాడర్తో బాధపడేవారైనా లేదా స్ట్రెస్ యురినరీ ఇన్కాంటినెన్స్ (ఎస్యూఐ) ఉన్న మహిళలైనా యూరోగైనకాలజిస్ట్ను సంప్రదించాలి. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కొందరు మహిళల్లో మూత్రం నిల్వ అయ్యేందుకు ఉపయోగపడే సంచి అయిన బ్లాడర్కు కాకుండా... మూత్రాన్ని బయటకి చేరవేసేందుకు... మూత్రసంచి (బ్లాడర్) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాలో సమస్య ఉంటుంది. ఇలాంటివారిలో ఏ చిన్న ఒత్తిడి పడ్డా వారి యురెథ్రా మూత్రాన్ని బయటకు కారేలా చేస్తుంది. అంటే... దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా... వారికి తెలియకుండానే మూత్రం కారిపోతుంది. అంటే అర్జెంటుగా మూత్రానికి వెళ్లాలనిపించే భావన వేరు, తమకు తెలియకుండానే మూత్రం పడిపోవడం వేరు. ఇలా... తమకు తెలియకుండానే మూత్రం పడిపోయే సమస్యను స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ (ఎస్యూఐ) అంటారు. ఇక్కడ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి కాదు. మూత్రసంచి లేదా దాని పరిసరాల్లో ఉండే కండరాలపై పడే చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోవడమని అర్థం. ఇది మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే సమస్య. ప్రసవం సమయాల్లో గర్భసంచి నుంచి శిశువు బయటకు వచ్చే మార్గం (బర్త్ కెనాల్) చాలా ఎక్కువగా సాగడం, ఎక్కువ సార్లు కాన్పులు కావడం (మల్టిపుల్ వెజినల్ డెలివరీస్) వంటి అనేక అంశాలు... మూత్రవిసర్జనను నియంత్రించే కండరాలను బలహీనపరచడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్నవారి కంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్య ఉన్న మహిళలకు ఇవ్వాల్సిన చికిత్స ఒకింత వేరుగా ఉంటుంది. కారణాలు ► ఏదైనా కారణాలతో మెదడు, వెన్నుపూసలోని నరాలు దెబ్బతినడంతో తలెత్తే నాడీ సంబంధ సమస్యల వల్ల. ►పక్షవాతం, మల్టిపుల్ స్కిరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వాటి కారణంగా. ►వయసు పెరుగుతున్న కొద్దీ బ్లాడర్ కండరాలు బలహీనం కావడం (ఇది అందరిలో జరిగే పరిణామం కాదు... కేవలం కొద్దిమందిలోనే). ►వెన్నుపూస లేదా పెల్విక్ లేదా నడుముకు సర్జరీ జరిగిన కొంతమందిలో. ►కెఫిన్ / ఆల్కహాల్ / కొన్ని ఓవర్ ద కౌంటర్ మందుల వల్ల. ►ఇన్ఫెక్షన్ల (ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వల్ల. ►స్థూలకాయం వల్ల. ►మహిళల్లో మెనోపాజ్ తర్వాత దేహంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల లోపం వల్ల. డా. శివరాజ్ మనోహరన్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యాండ్రాలజిస్ట్ – రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. -
జిమ్ చేసి కండలు పెంచితే చాలా? గుండె కోసం ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: గత 20 ఏళ్లలో యువతలో గుండెపోటు 200 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారిలో దాదాపు 50శాతం మంది భారతీయులే. మరీ ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం గమనార్హం. గుండె సమస్యల కారణంగా 40-50 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా చనిపోతున్నారు. ఫిట్గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తూ కూడా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా , నటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ వంటి ప్రముఖుల మరణాలే ఇందుకు ఉదాహరణ. ఆహార అలవాట్లు జీవనశైలిలో మార్పులే కారణమని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన శరీరంలో అతి కీలకమైన గుండెకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే.. దాన్ని సరి చేయడం అంత తేలిక కాదు. అందుకే నివారణే ముఖ్యం. రోజులు, నెలలు సంవత్సరాలబడి నిమిషానికి 70-80 సార్లు కొట్టుకునే గుండెను లైట్ తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదు. మన వాహనాల ఇంజీన్లను ఎలారిపేర్ చేస్తామో శుభ్రం చేసుకుంటామో,దాని కోసం ఎంత శ్రద్ధ పెడతామో మన హృదయంపై అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. టైం లేదు లాంటి కుంటి సాకులు చెబితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. టీవీ చూసేందుకు, పేపర్ చదివేందుకు, స్మార్ట్ఫోన్ కోసమే కాదు వ్యాయామంకోసం కూడా కొంత సమయాన్ని వెచ్చించాల్సిందే. గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారకం ఒత్తిడి. తీవ్రమైన ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందని. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ధమనుల లోపలి పొరల్లో వాపుకు కారణమవుతుంది. అలాగే రక్తం గడ్డకట్టడంతో పాటు గుండెపోటుకు దారితీస్తుందని ప్రఖ్యాత కార్డియాలజిస్ట్లు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో కాలంతో పరిగెడుతున్న క్రమంలో జీవనశైలిలో స్పష్టమైన మార్పులతోపాటు ధూమపానం పెరుగుదలలాంటి ముఖ్యమైన మార్పులను మనం మర్చి పోకూడదు, అంటే వేళా పాళా లేని ఆహార అలవాట్లకు తోడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, తీవ్ర ఒత్తిడి, డెడ్లైన్లు. దీనికి తోడు కాలుష్యం ముఖ్యంగా మెట్రో నగరాల్లో తన ప్రభావాన్ని భారీగానే చూపుతోంది. కాలుష్యంతో ధమనులవాపు, గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి భారతీయుడు యూరోపియన్ల కంటే మూడు రెట్లు, చైనీయుల కంటే ఆరు రెట్లు ఎక్కువ, జపనీస్ కంటే ఇరవై రెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. అందులోనూ మధుమేహం ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువ. ఆరోగ్యకరమైన గుండె కోసం వారానికి ఐదు సార్లు రోజుకు 45 నిమిషాలు వేగంగా నడవడంవల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను 20శాతం తగ్గించవచ్చు. ఒకేసారి 45 నిమిషాలు సాధ్యం కాకపోయినా, ఉదయం 25 నిమిషాలు, సాయంత్రం 25 నిమిషాలుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఒత్తిడిని జయించి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వ్యాయామం కావాలి. గుండె ఆరోగ్యానికి నడక ఉత్తమమైంది. వాకింగ్, సైక్లింగ్తోపాటు యోగా, ఏరోబిక్స్ను మిక్స్ చేసి ఎక్సర్సైజ్ చేయవచ్చు. లిఫ్ట్ బదులు, మెట్లు ఎక్కండి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఇది మరో బెస్ట్ ఐడియా. టీ విరామాన్ని వ్యాయామ బ్రేక్గా మార్చుకోవడం మరో మార్గం. ఇందుకోసం ప్రతి ఆఫీసులో ట్రెడ్మిల్ ఏర్పాటు చేసుకోండి. అయితే రోజూ 10 నుండి -20కి.మీ రన్నింగ్ లేదా జాగింగ్కి చేస్తే గుండెకు, శరీరానికి హానికరం ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జిమ్లో విపరీతంగా కసరత్తు చేసి చక్కటి బాడీబిల్డింగ్ పెంచుకున్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు అనేది గమనించాల్సిన ముఖ్య అంశం. 25 శాతం గుండె జబ్బులకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. 30-40శాతం మంది ఎలాంటి బ్లాక్స్ లేకుండానే గుండెపోటుకు గురవుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో గుండెపోటు వచ్చినా, ఆకస్మిక మరణం సంభవించినా ఆయా కుటుంబాల్లోని వారికి గుండె సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అలాగే మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ చేయించు కోవాలి. ఇది 20 సంవత్సరాల వయస్సులోనే మొదలు కావాలి. 30 సంవత్సరాల వయస్సులోపు వారు ప్రతి సంవత్సరం బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. -
మూత్రంలో ఇబ్బందా? ప్రోస్టేట్ పరీక్ష చేయించుకోండి
మగవారిలో ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్ను ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. మనకు వీర్యంలో కనబడే ద్రవాన్ని ఇది తయారుచేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవం ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. మొదటిదశలో ఇది ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది లేదా కొందరి లో చికిత్స చేయాల్సిన అవసరమే రాకపోవచ్చు. కానీ కొన్ని రకాల ప్రోస్టేట్ క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే... అంటే గ్రంథికి పరిమితమైన దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభదశలో... దానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలూ బయటపడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రం లో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపులో ఇబ్బంది... వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేం. వయసు పైబడటం, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండటం, స్థూలకాయం వంటి ప్రోస్టేట్కు కారణాలు కావచ్చు. పురుషులు తమ 50 ఏటికి చేరగానే క్రమం తప్పకుండా ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ (పీఎస్ఏ) పరీక్షల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షలలో రిపోర్ట్ ‘అబ్నార్మల్’గా వస్తే, అల్ట్రాసౌండ్, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి, బయాప్సీలో పాజిటివ్గా వస్తే గ్రేడింగ్ చేయించుకోవాలి. అంటే వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించాలి. వ్యాప్తిని గుర్తించడం క్యాన్సర్ వ్యాధి ప్రోస్టేట్ గ్రంథిని దాటి ఇతర అవయవాలకూ వ్యాప్తి చెందిందా అని అనుమానం వస్తే సీటీ స్కాన్, ఎమ్మారై వంటి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ దశలు (స్టేజ్లు) స్టేజ్ – 1 : మొదటి స్టేజ్లో ఉందంటే క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో ఉందని అర్థం. స్టేజ్ – 2 : ఈ దశలో క్యాన్సర్ సులభంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రోస్టేట్ గ్రంథికే పరిమితమై ఉంటుంది. స్టేజ్ – 3 : ఈ దశలో క్యాన్సర్... ప్రోస్టేట్ గ్రంథిని దాటి వీర్యవాహికలు లేదా సమీపంలోని ఇతర కణాజాలానికి పాకి ఉండవచ్చు. స్టేజ్ – 4 : ఈ దశలో లింఫ్ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకి ఉంటుంది. చికిత్స వెంటనే అవసరం పడకపోవచ్చు... క్యాన్సర్ మొదటిదశలో ఉన్నవారికి వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అప్రమత్తతో వేచిచూడాల్సిందిగా డాక్టర్లు రోగులకు సూచిస్తారు. అంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, పురీషనాళ పరీక్షలు, అవసరమైతే బయాప్సీ వంటివి చేయించుకుంటూ శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అప్రమత్తతతో వేచిచూడటం అనేది క్యాన్సర్ చాలా నెమ్మదిగా వృద్ధిచెందుతున్నవారికీ, క్యాన్సర్ లక్షణాలు బయటపడని వారికి డాక్టర్లు సూచిస్తారు. క్యాన్సర్ వృద్ధి చెందుతున్నట్లు గమనిస్తే శస్త్రచికిత్స, రేడియోథెరపీ వంటి చికిత్స పద్ధతులను ఉపయోగిస్తారు. రేడియేషన్ థెరపీ : ఇందులో అధికశక్తి కలిగిన రేడియోధార్మిక కిరణాలు ఉపయోగించి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్లో రెండు రకాలుగా రేడియేషన్ ఇస్తారు. శరీరం బయట నుంచి రేడియోధార్మికతను ఇవ్వడం, శరీరం లోపలే రేడియోధార్మిక కిరణాలు ప్రసరించేలా ఏర్పాటు చేయడం (బాకీథెరపీ). హార్మోన్ థెరపీ : ఇందులో శరీరంలోని టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నిలిపివేస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్లో క్యాన్సర్ కణాలు టెస్టోస్టెరాన్ మీద ఆధారపడి వృద్ధి చెందుతుంటాయి. దాని సరఫరాను నిలిపివేయడం వల్ల క్యాన్సర్ కణాల వృద్ధి మందగించడం గానీ, అవి చనిపోవడంగానీ జరుగుతుంది. హార్మోన్ థెరపీని వివిధ రకాలుగా ఇవ్వవచ్చు. మందులతో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నిలిపివేయడం.. వృషణాలు టెస్టోస్టెరాన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. అవి టెస్టోస్టెరాన్ను ఉత్పిత్తి చేయకుండా కొన్ని రకాల మందుల ద్వారా నిరోధించవచ్చు. టెస్టోస్టెరాన్ను క్యాన్సర్ కణాలకు అందకుండా చేయడం... ‘యాంటీ–యాండ్రోజన్’ మందుల ద్వారా టెస్టోస్టెరాన్ క్యాన్సర్ కణాలకు అందకుండా చేయవచ్చు. వృషణాలను తొలగించడం : రెండు వృషణాలను తొలగించడం ద్వారా శరీరంలో టెస్టోస్టెరాన్ పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఇది కూడా హార్మోన్ థెరపీలాంటిదే. ఈ పద్ధతిలో టెస్టోస్టెరాన్ స్థాయిని వేగంగా తగ్గించవచ్చు. అయితే దీన్ని క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవారికి మాత్రమే ఉపయోగిస్తారు. క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నవారికి హార్మోన్ థెరపీ సరిపోతుంది. వృషణాలను తొలగించాల్సిన అవసరం ఉండదు. హార్మోన్ థెరపీ వల్ల క్యాన్సర్ కణుతులు కుంచించుకుపోతాయి. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. శస్త్రచికిత్స: శస్త్రచికిత్సలో ప్రోస్టేట్ గ్రంథిని, దాని చుట్టుపక్కల కణాజాలాన్ని, లింఫ్ గ్రంథుల్లో కొంతభాగాన్ని తొలగిస్తారు. అయితే దీనివల్ల అంగస్తంభన సమస్య. మూత్ర విసర్జనలో సమస్యలు తలెత్తవచ్చు. కీమోథెరపీ : ఇందులో మందుల ద్వారా క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో మందులను ఇంజెక్షన్ల రూపంలో గానీ, మాత్రల రూపంలో గానీ ఇస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బాగా ముదిరి, శరీరంలోని ఇతర భాగాలకు పాకినట్లయితే కీమోథెరపీ ఇస్తారు. నిత్యం వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు. -
పాపకు తరచూ విరేచనాలు... ఎందుకిలా?
మా పాప వయసు పదేళ్లు. గత కొద్ది నెలలుగా పదే పదే విరేచనాలు అవుతున్నాయి. కొద్దిపాటి మందులతో తగ్గినట్లే తగ్గినా... మళ్లీ సమస్య తిరగబెడుతోంది. మరీ చెప్పాలంటే... పాప భోజనం తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఎప్పుడైనా కొద్దిగా నీరసంగా ఉంటోంది. మా పాప సమస్య ఏమిటి? ఎందుకిలా జరుగుతోంది. పరిష్కారం ఉందా? మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీ పాపకు రికరెంట్ డయేరియల్ ఎపిసోడ్స్ ఉన్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో వారు సాధారణంగా విసర్జనకు వెళ్లే టాయిలెట్స్ హాబిట్స్తో పోల్చినప్పుడు... వారు మలవిసర్జనకు వెళ్లాల్సిన విడతలు ఎక్కువైనా లేదా వారి క్రమబద్ధమైన వేళల్లో మార్పువచ్చినా దాన్ని డయేరియా అని నిర్వచించవచ్చు. అలాగే అది ఒకేసారి ఎక్కువగా విరేచనాలు (అక్యూట్ డయేరియా), లేదా పదే పదే విరేచనాలు కావడం లేదా దీర్ఘకాలికంగా ఉండే డయేరియా అయినా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తూంటే మీ అమ్మాయిది రికరెంట్ డయేరియా అని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ లేదా ప్రోటోజోవా (అమీబిక్) కావచ్చు. లేదా నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా కూడా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలతో మీ అమ్మాయిది నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా అయ్యేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటి కండిషన్కు చాలా అంశాలు కారణం కావచ్చు. ఉదాహరణకు... ►తిన్న తిండి ఒంటికి పట్టడంలో సమస్యలు (మాల్ అబ్జార్ప్షన్). ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్స్ లేదా ఫ్యాట్ అబ్జార్ప్షన్లో సమస్యలు. ►ఎండోక్రైన్ సమస్యలు, కొన్ని ఆటో ఇమ్యూన్ సమస్యలు, నిర్దిష్టమైన ఎంజైమ్స్లో లోపాలు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ (ఐబీడీ), ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి ఏదైనా కారణం వల్ల కూడా ఆమెకు సమస్య వచ్చి ఉండవచ్చు. తిన్న తిండి ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్ప్షన్) ఉన్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు, పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఎదుగుదల లోపాలు రావడం, కడుపునొప్పి ఎక్కువగా ఉండటం, దుర్వాసనతో కూడిన మలం, కొన్నిసార్లు ముఖం–కాళ్లూ చేతుల్లో వాపురావడం, కొన్ని విటమిన్ (ముఖ్యంగా ఎ, డి, ఈ, కె, బి12) లోపాలతో కనిపించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని అరుదైన ఉదంతాల్లో కౌమార వయసులో (అడాలసెంట్) పిల్లల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు లేదా చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు, రుతుస్రావంలో మార్పుల (మెనుస్ట్రువల్ డిస్టర్బెన్సెస్)తో కూడా డయేరియా లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే మీ పాపకు ఉన్న రికరెంట్ డయేరియాకు కారణం చెప్పడానికి కూలంకషమైన పరీక్షలు, డిటెయిల్డ్ స్టూల్ ఇవాల్యుయేషన్, హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎస్సేతో పాటు... అవసరమనిపిస్తే తప్పనిసరిగా కొలనోస్కోపీ, ఎండోస్కోపీ చేయించడం కూడా ముఖ్యం. ఇటువంటి పిల్లల్లో ఆహారంలో మార్పులు – అంటే ముఖ్యంగా వాళ్లకు ఏది సరిపడటం లేదో, లేదా ఏది తింటే సరిగా జీర్ణం కావడం లేదో గుర్తించి, ఆ ఆహారంలో మార్పులు చేయడంతో పాటు కొవ్వు పదార్థాలు, మసాలాలు తగ్గించడం వల్ల చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. కొన్ని ఎంజైమ్ సప్లిమెంట్లు ఇవ్వడంతో పాటు వైటమిన్లు, జింక్ ఇవ్వడం, యాంటీమొటిలిటీ డ్రగ్స్ (పేగుల కదలికలను తగ్గించే మందులు), యాంటీ సెక్రిటరీ డ్రగ్స్ (జీర్ణవ్యవస్థలో ఊరే రసాయనాలను తగ్గించే మందులు), అబ్జార్బెంట్స్, ప్రోబయాటిక్స్ (శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచే మందులు) ఇవ్వడం వల్ల పాపకు డయేరియా లక్షణాలు తగ్గుతాయి. అయితే ఇలా విరేచనాలు ఎక్కువగా అవుతున్నప్పుడు కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం జరిగితే వ్యాధి తీవ్రత మరింత పెరగడానికి (యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్ డయేరియాకు) దారితీయవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించి మీ పాప సమస్యకు తగిన చికిత్స తీసుకోండి. ముర్రుపాలు,తల్లిపాలు, పోతపాలు –ప్రయోజనాలు కొత్తగా తల్లి అయిన చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరు, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరు అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. ఈ ముర్రుపాలలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. ఆ నేచురల్ ఇమ్యూనిటీ వల్ల జీవితకాలంలో బిడ్డ ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. అంతేకాదు... వయసు పెరిగాక కనిపించే ఎన్నో జబ్బులు... ఈ ముర్రుపాల కారణంగా రాకపోవచ్చు లేదా చాలా ఆలస్యం రావచ్చు. అందుకే బిడ్డకు ముర్రుపాలు తప్పక పట్టించాలి. ఇక ఆ తర్వాత కూడా పిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. కేవలం తల్లికి తగినన్ని పాలు పడనప్పుడు మాత్రమే పోతపాలకు వెళ్లాలి తప్ప... ఒకవేళ తల్లి దగ్గర పుష్కలంగా పాలు ఉంటే పిల్లలకు కడుపు నిండా తల్లిపాలు తాగించడం మంచిది. దీనివల్ల బిడ్డలకు ఎన్నో లాభాలు చేకూరుతాయి. బిడ్డల్లో రోగనిరోధక శక్తి పెరగడం, వాళ్లు పెద్దయ్యాక వచ్చే అనేక డీజనరేటివ్ డిసీజెస్ ఆలస్యం కావడం వంటి ప్రయోజనాలు తల్లిపాల వల్ల సమకూరుతాయి. మరి పోతపాలు వాడవచ్చా? ఇటీవలి కొన్ని నిరూపితమైన అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్ మిల్క్)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని తేలింది. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలకు కూడా పోతపాలు ఒక ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తి పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్ ఉపయోస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాలపై పెరిగిన పిల్లల్లో వాళ్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఆ రసాయనాల దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు వాడటం సరికాదు. ఒకవేళ తల్లికి తగినన్ని పాలు పడకపోవడం లేదా బిడ్డకు పాలుసరిపడకపోవడం వంటి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్ ఇన్టాలరెన్స్, ప్రోటీన్ ఇన్టాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే). మార్కెట్లో దొరికే కొన్ని ఫార్ములా ఫీడ్స్ ఉపయోగించవచ్చు. కానీ తల్లి వద్ద సరిపడా పాలు లేనప్పుడు పోత పాలు లేదా ఆవు లేదా గేదె పాలు పట్టించడం కంటే తల్లిలోనే పాలు పెరిగేలా కొన్ని స్వాభావిక విధానాలు (ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. అలా చేయడం వల్ల కూడా తల్లిలో పాలు పడకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్ సలహామేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే... ముర్రుపాలు తప్పనిసరి. తల్లిపాలు కంపల్సరీ. తల్లి దగ్గర తగినన్ని పాలు లేనప్పుడు మాత్రమే పోతపాలు. పాపకు నోట్లో పుండ్లు... తగ్గేదెలా? మా పాప వయసు ఏడేళ్లు.ఈమధ్య ఒకసారి గొంతులో నొప్పి ఉందని చెప్పింది. వెంటనే డాక్టర్కు చూపించాం. పాప నోట్లో, నాలుక మీద, గొంతులోపలా పుండ్లలాగా వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్లా కొంచెం పుండులాగా ఎర్రబారింది. ఏదైనా తినడానికి పెడితే గొంతులో నొప్పి అంటూ ఏడుస్తోంది. ఏమీ తినలేకపోతోంది. మా పాప సమస్యకు పరిష్కారం చూపండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది.ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ఉద్వేగాలపరమైన ఒత్తిడి బాగా నీరసంగా అయిపోవడం ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) గాయాలు కావడం (బ్రషింగ్లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా). పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు వస్తుంటాయి. లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగానీ సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
వాళ్లను తిట్టడం ఫ్యాషనైపోయింది.. ఇది సరికాదు!
న్యూఢిల్లీ: కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలను ప్రదాని నరేంద్ర మోదీ మరోసారి సమర్ధించారు. కార్పొరేట్లు వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేస్తున్నప్పటికీ.. వారిని తిట్టడం ఫ్యాషన్గా మారిందని మోదీ ఆక్షేపించారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఐటీ నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలతో బుధవారం చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు అత్యుత్తమంగా సామాజిక సేవ చేస్తుండటం, తమ ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండటం మనం చూస్తున్నాం. ఎందుకో తెలియదు కానీ మన దేశంలో వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను విమర్శిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదో ఫ్యాషన్గా మారింది. ఇది నాకు ఆమోదయోగ్యమైన విషయం కాదు’ అని మోదీ పేర్కొన్నారు. కార్పొరేట్లను మోదీ సమర్ధించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కూడా కీలకపాత్ర పోషించారని, వారితో కలిసి కనిపించడానికి తాను భయపడబోనని జూలైలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పన్నులు కట్టడమే కాదు.. సమాజ సేవా చేయాలి.. కేంద్రం ప్రజా ధనాన్ని సద్వినియోగం చేస్తోందన్న నమ్మకం కలగడం వల్లే తమ ప్రభుత్వ హయాంలో పన్నులు సక్రమంగా చెల్లించే వారి సంఖ్య పెరిగిందన్నారు. అయితే, సామాజిక బాధ్యత కింద నిజాయితీగా పన్నులు చెల్లించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పౌరు లు తమ వంతుగా మరికాస్త పాటుపడాలని సూచించారు. ‘పన్నులు చెల్లించడమన్నది సహజసిద్ధమైన ప్రకృతి. కట్టకపోవడమన్నది వికృతి. కానీ పన్నులు సక్రమంగా కట్టడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మరికాస్త పాటుపడటమనేది సంస్కృతి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు టెక్నాలజీపరమైన పరిష్కారమార్గాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని ఐటీ నిపుణులకు ప్రధాని సూచించారు. కాగా కొత్తగా ప్రారంభించిన సెల్ఫ్4సొసైటీకి ఐటీ దిగ్గజ కంపెనీలు మద్దతు తెలిపాయి. -
వీడియో ఆపద్బాంధవి
కెమెరాకు షూట్ చేసే శక్తి మాత్రమే ఉంటుంది.స్పందించే హృదయాలు మనుషులకే ఉంటాయి.ఈ మనుషుల్లో తడి మిగిలే ఉంది.ఆర్ద్రత మిగిలే ఉంది. మానవత్వం మిగిలే ఉంది. కావలసిందల్లా కదిలించే కన్ను.కేరళ అమ్మాయి జిన్షా బషీర్ కెమెరాతో లోకంలో ఉన్న కష్టాన్ని చెబుతుంది.వెంటనే దానికి లభిస్తున్న స్పందన ఆమెను ఆపద్బాంధవిగా మారుస్తోంది. కేరళలోని అలెప్పీకి చాలామంది బ్యాక్వాటర్స్లో హౌస్బోట్ విహారం కోసం వెళతారు.కానీ ఇప్పుడు ‘జిన్షా బషీర్’ను చూడటానికి వెళుతున్నారు.శిరస్సు మీద ఇస్లామీయ వస్త్రాన్ని చుట్టుకొని, జీన్స్ ప్యాంట్ ధరించి, క్లాసిక్ మోడల్ బుల్లెట్ను బటన్ స్టార్ట్ చేసి రివ్వున దూసుకుపోతూ కనిపించే జిన్షా బషీర్ను చూడటం, ఆమెకు కరచాలనం ఇవ్వడం చాలా తృప్తినిచ్చే పని. ఒక మంచి పనికి మద్దతు ఇచ్చే పని.ఎందుకంటే ఇవాళ కేరళలో మమ్ముట్టి, మోహన్లాల్ వలే జిన్షా కూడా స్టార్.ఆ స్టార్డమ్ ఆమెకు సినిమాల నుంచి రాలేదు.కేవలం ఫేస్బుక్ నుంచి వచ్చింది.అందులో ఆమె పెట్టే వీడియోల ద్వారా వచ్చింది. ఆ వీడియోల నుంచి ఆశించే మంచి ద్వారా వచ్చింది.పెట్రోల్బంక్ మోసాన్ని చూసిదాదాపు సంవత్సరం క్రితం. జిన్షా ఆ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో ఒక సగటు ఉద్యోగిగా పని చేస్తోందిదారిన పోతూ తన టూ వీలర్లో పెట్రోల్ పోయించుకోవడం కోసం ఆగింది. అందరూ పెట్రోలు పోయించుకుని పోతున్నారు. తన వంతు వచ్చింది. అయితే పెట్రోల్ పోసే వ్యక్తి మీటర్ను ట్యాంపర్ చేసి పెట్రోల్ పోస్తున్నట్టు జిన్షా గమనించింది.ఏమిటి నువ్వు చేస్తున్న పని’ అంది.ఇదిక్కడ రోజూ మామూలే. నోరు మూసుకొని పోయించుకుని పో’ అన్నాడా వ్యక్తి. అందరిలా జిన్షా కూడా నోరు మూసుకొని పెట్రోలు పోయించుకుని పోయి ఉంటే ఇవాళ ఆమె గురించి రాయడానికి ఉండేది కాదు. కానీ జిన్షా ఊరుకోలేదు. టూ వీలర్ దిగి తన సెల్ఫోన్ ద్వారా అప్పటికప్పుడు జరుగుతున్నది రికార్డ్ చేసింది. అక్కడ పెట్రోల్ పోయించుకుంటున్న వాళ్లతో మాట్లాడి ‘మీరెందుకు ఈ అన్యాయాన్ని నిలదీయరు’ అని ఇంటర్వ్యూ చేసింది. అదంతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. వెంటనే ఐదు వేల లైకులు వచ్చాయి.జిన్షా చాలా ఆశ్చర్యపోయింది. అన్యాయాలు అందరికీ తెలుసు. కానీ వాటిని నలుగురి దృష్టికి తెచ్చి ప్రశ్నించేవారే కావాలి అని అర్థం చేసుకుంది. సోషల్ మీడియాలో బ్లాగర్స్ చాలామందే ఉన్నారు. కానీ వీడియోల ద్వారా సమాజానికి సందేశాలిచ్చే ‘వ్లోగర్స్’ కూడా ఉన్నారని తెలుసుకుని తాను కూడా ‘వ్లోగర్’గా మారాలని నిశ్చయించుకుంది.ఉద్యోగాన్ని వదిలి సమాజ హితం కోరే వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. సహాయాల పరంపర జిన్షాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. అతని పేరు షాన్ షాహుల్. పేదవాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. వెళ్లిన ఇరవై అయిదు రోజులకే దురదృష్టవశాత్తు మరణించాడు. జిన్షా వెంటనే అతడి కుటుంబాన్ని కలిసింది. అది ఎంత పేదరికంలో ఉందో షూట్ చేసి తన వ్యాఖ్యానంతో ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసింది. ‘ఇంటి పెద్ద లేకుండాపోయే దురదృష్టం ఎవరికీ వద్దు. ఈ కుటుంబానికి మనమంతా ఉన్నాం అనే ధైర్యం చెబుదాం’ అని పిలుపు ఇచ్చింది. దీనికి వెంటనే సౌదీలోని ఒక స్వచ్ఛంద సంస్థ స్పందించింది. షాన్ షాహుల్ కుటుంబానికి 11 లక్షల రూపాయల సహాయాన్ని అందించింది. ఇది కేవలం జిన్షా వీడియో వల్లే సాధ్యమైంది. జిన్షా ఫేస్బుక్ పేజీకి లైకులు పెరుగుతున్నాయి. ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అటువంటి సమయంలోనే ఆయేషా అనే ఒక సంవత్సరం పాప గురించి జిన్షా ఒక వీడియో పెట్టింది. ‘ఈ పాపను చూశారా? బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఈ పాప బోన్ మేరోతో చావు బతుకుల మధ్య ఉంది. ఈమె పెదాల మీద చిరునవ్వును పూయించే శక్తి మీ సహాయానికి ఉంది. ఈమెను బతికించే శక్తి మీకే ఉంది’ అని అప్పీల్ చేసింది. ఆశ్చర్యం... ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల రూపాయలు ఆ పాప సహాయానికి అందాయి. వ్యతిరేకత మొదలు ఏ పనికైనా వ్యతిరేకత ఉంటుంది. జిన్షాకు కూడా వ్యతిరేకత మొదలైంది. ఆమె ఉద్దేశాలను తప్పు పట్టేవారు మెల్లగా గొంతు విప్పడం మొదలుపెట్టారు. ‘ఇది సంఘసేవ కాదు గాడిద గుడ్డూ కాదు. పేరు కోసమే ఆమె ఇలా చేస్తోంది’ అనే విమర్శలు వచ్చాయి. ‘ఇస్లాంలో పుట్టిన ఆడపిల్ల ఇలా రోడ్డున పడి తిరగడం బుల్లెట్ నడపడం ఏమిటి?’ అని సొంత బంధువులు కూడా నొసలు చిట్లించారు. ఇవన్నీ చీప్ట్రిక్స్ అని మరికొందరు కొట్టిపారేశారు. ఫేస్బుక్ పేజీలో బూతులు రాసి ఆమెను హేళన చేసినవారు కూడా ఉన్నారు. ఇదంతా చూసి జిన్షా తల్లి, సోదరి హడలిపోయారు. మనకెందుకు ఈ గోలంతా... ఇదంతా మానేయ్ అని ఆమెకు హితవు చెప్పారు. అయితే ఆమె తండ్రి, భర్త తోడు నిలిచారు. గతంలో మిలట్రీలో పని చేసిన జిన్షా తండ్రి ‘మరేం పర్లేదమ్మా... నీకు ఏది అనిపిస్తే అది చెయ్’ అని ధైర్యం చెప్పాడు. ‘నువ్వు ఏ దారిలో నడిచినా నా మద్దతు నీకే’ అని భర్త హామీ ఇచ్చాడు. ఇక జిన్షాకు లోకానికి వెరవాల్సిన అవసరం లేకపోయింది. తనను తిట్టే వాళ్ల కామెంట్స్ను స్క్రీన్ షాట్స్ తీసి తిరిగి ఫేస్బుక్లో పెట్టింది జిన్షా. చాలామంది వాటిని అసహ్యించుకున్నారు. మరోవైపు క్షణక్షణానికి ఆమె ఫేస్బుక్ పేజీ మీద లైక్ బటన్ నొక్కేవాళ్లు పెరిగారు. జిన్షా బుల్లెట్ మరింత స్పీడందుకుంది. పెళ్లి చేసిన పుణ్యం వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ జిన్షా ఒక వీడియో పెట్టి చాలా సులువుగా ఒక పెళ్లి చేయగలిగింది. మునీర్ అనే ఒక నిరుపేద ఆమె దృష్టిలో పడ్డాడు. అతనికి సొంత ఇల్లు లేదు. ఉపాధి లేదు. పెళ్లికెదిగిన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లకు అతను జన్మలో పెళ్లి చేయలేడు. జిన్షా అతని పరిస్థితిపై వీడియో చేసి పోస్ట్ చేసింది. స్పందన చెప్పాలా? ఒక అమ్మాయి పెళ్లి క్షణాల్లో జరిగిపోయింది. ఇంకో అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగింది. అంతేకాదు దాతలు స్పందించి ఒక నాలుగు లక్షలు సహాయం చేశారు. మునీర్కు ఇప్పుడొక సొంత గూడు ఉంది. వాక్కే ఆకర్షణ జిన్షాకు వాక్కే ఆకర్షణ. అనర్గళంగా మాట్లాడుతుంది. ఎదుటివారిని ఒప్పించే విధంగా విషయాన్ని విశదీకరిస్తుంది. ఆమె చేసిన తెలివైన పని ఏమిటిరా అంటే మతాన్ని, రాజకీయాలను దూరంగా పెట్టడం. ‘వాటి గురించి నా వీడియోలు ఉండవు’ అంటుందామె. జిన్షా చేసే ముఖ్యమైన పని తన పేజీలో ఉపాధి అవకాశాల ప్రకటనలు విరివిగా పోస్ట్ చేయడం. గల్ఫ్ దేశాలలో ఉన్న ఉపాధి అవకాశాలను ఆమె నలుగురి దృష్టిలోకి తెస్తుంది కనుక ఆ విషయంగా కూడా ఆమె పేజీని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య మూడున్నర లక్షలు. ఈ పాపులారిటీ చూసి సంస్థలే ఆమెకు తమ వద్ద ఉన్న ఉపాధి అవకాశాల ప్రకటనలు పంపిస్తుంటాయి. ఇవే కాదు జిన్షా తన పేజీలో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను కూడా ఇస్తుంటుంది. తనలా మంచి పనులు చేసేవారి వివరాలు కూడా. జిన్షాను తమతో కలిసి పని చేయమని చాలా ఎన్జీఓలు కోరాయి. ‘అయితే అవన్నీ ఎంతోకొంత లాభాపేక్షతో పని చేస్తాయి. నేను వ్యక్తిగతంగా చేయగలిగింది చేస్తాను’ అంటుంది జిన్షా.జిన్షాకు ‘బెస్ట్ సోషల్ మీడియా బ్లాగర్ అవార్డ్ 2018’ వచ్చింది. ఆమె చేయాలనుకుంటున్న మంచి పనుల ముందు అదేమి పెద్ద విశేషం కాదు.ఇవాళ సమాజానికి జిన్షాల అవసరం చాలానే ఉంది.ఈ జిన్షా చాలామందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం. సామాన్యురాలిగా ఆగిపోవద్దు స్త్రీలు చాలా శక్తిమంతులు. వారు తమ సంస్కృతిని గౌరవించాల్సిన మాట నిజమే కానీ అన్నిసార్లు పురుషులను వెంబడించాల్సిన పని లేదు. తాము స్వతంత్రంగా ఉండటం నేర్చుకోవాలి. నేను కూడా సామాన్యురాలినే. కానీ ఇవాళ చాలా సంతృప్తికరమైన పని చేస్తున్నాను. ఇలా వీలైన స్త్రీలందరూ చేయవచ్చు. – జిన్షా బషీర్ -
గాలి కాలుష్యంతో డయాబెటిస్
బెర్లిన్: దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గుర య్యే వారు టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. గ్లూకోజ్ జీవక్రియ బలహీనపడిన వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. జీవనశైలి, జన్యు లోపాలతోనే కాకుండా వాయు కాలుష్యం ద్వారా టైప్-2 డయాబెటిస్ సంక్రమిస్తుందని జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పీటర్స్ తెలిపారు. ఈ మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 3,000 మందిపై పరిశోధన చేశామన్నారు. వీరి రక్తంలోని నమూనాల ఆధారంగా గ్లూకోజ్ స్థాయి, ఇన్సులిన్ స్థాయిలను పరీక్షించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారి కంటే దీర్ఘకాలంగా వాయుకాలుష్యానికి గురవుతూ పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్నవారిలో టైప్-2 డయాబెటిస్ సంక్రమించే లక్షణాలు ఎక్కువగా కనిపించాయన్నారు. -
మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు
ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాలలో శంకర్ ఖమ్మం మామిళ్లగూడెం: మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ అన్నారు. సోమవారం ఖమ్మం ఆర్టీసీ గ్యారేజ్లో ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ వాహనాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రమాదాలు జరగవన్నారు. ఓవర్ టేక్ చేయటం, డ్రైవింగ్లో సెల్ఫోన్ మాట్లాడటం, డ్రంక్అండ్డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. ఆర్టీసీ సీఎంఈ జాన్రెడ్డి ,డిప్యూటీ సీటీఎం రామ్మూర్తినాయక్ మాట్లాడుతూ బస్సులోని ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యాలను చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. ఒక వ్యక్తిపై కుటుంబాలు ఆధార పడి ఉంటాయన్నారు. ఖమ్మం డీఎం సుగుణాకర్ మాట్లాడుతూ బస్సు కండీషన్, టెక్నికల్ ఫెయిల్ అయినపుడే ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ప్రయాణికులకు భరోసా కలిగించాలన్నారు. -
‘ఔటర్’ బేజార్ !
ప్రమాణాలు గాలికి... ప్రాణాలు మృత్యుఒడికి ‘రింగ్రోడ్డు’పై ప్రయాణం గందరగోళం సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్రోడ్డును నిర్మించామని గొప్పలు చెబుతున్న హెచ్ఎండీఏకు ఈ మార్గంలో తరచూ జరుగుతోన్న ప్రమాదాలు మాయని మచ్చను తెచ్చిపెడుతున్నాయి. 120 కి.మీ వేగంతో ప్రయాణించేందుకు వీలుగా నిర్మించే మార్గంలో ఎక్కడా గతుకులకు అవకాశం ఉండకూడదు. రోడ్డు సమాంతరంగా ఉంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అయితే... ప్రధాన రోడ్డు అనేకచోట్ల ఎగుడు దిగుడుగా ఉండటంతో హైస్పీడ్లో వెళ్లే పవర్ స్టీరింగ్ వాహనాలు కాస్త దిశమారితే ఘోరం జరుగుతోంది. రోడ్డు మలుపులను సరిగ్గా డిజైన్ చేయకపోతే అక్కడే మృత్యువు మాటేసి ఉంటుంది. ఔటర్పై అక్కడక్కడా ఉన్న మలుపుల వద్ద కూడా హైస్పీడ్ వాహనాలు ఫల్టీ కొడుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో ఇంజనీరింగ్ డిజైన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సైనేజెస్ (సూచికలు) అవసరమైన చోట ఏర్పాటు చేయకపోవడం పెద్ద లోపంగా కన్పిస్తోంది. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్కు మధ్యలో 500 మీ. ఒక సైన్బోర్డును తర్వాత 100 మీ. ఒకటి, అనంతరం ఎగ్జిట్ (కిందకు దిగేచోట) వద్ద మరొకటి విధిగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. అయితే... ఈ క్రమంలో అన్ని చోట్ల సైనేజీలు కన్పించట్లేదు. సరిగ్గా ఎగ్జిట్ పాయింట్ వద్దే ఆ జంక్షన్ సైన్బోర్డును ఏర్పాటు చేయడంతో దాన్ని గుర్తించని వాహనచోదకులు ముందుకెళ్లిపోతున్నారు. ఒకవేళ ఎగ్జిట్పాయింట్ వద్ద సైనేజిని చూసి వెంటనే షడెన్గా బ్రేక్ వేస్తే వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం బలంగా ఢీకొని ప్రమాదం సంభవిస్తోంది. ఒకే మార్గంలో.. కోకాపేట జంక్షన్ వద్ద ఒకే ర్యాంపుపై ఎదురెదురుగా కార్లు, ఇతర వాహనాలు ప్రయాణిస్తుండటం విస్మయం కల్గిస్తోంది. ఈ జంక్షన్ (ఇంటర్ఛేంజి)లో మొత్తం 4 ర్యాంపులు నిర్మించాల్సి ఉండగా 100 మీటర్లకు సంబంధించి భూసేకరణపై కోర్టులో వివాదం నడుస్తుండటంతో ఇక్కడ 3 ర్యాంపులే నిర్మించారు. ఫలితంగా ఒకవైపు ఔటర్పైకి ఎక్కేందుకు, దిగేందుకు ఒకే ర్యాంపును వినియోగించాల్సి వస్తోంది. కిందనుంచి ఔటర్పైకి వెళ్లే వాహనం 40 కి.మీ. వేగానికి మించకుండా ప్రధాన రోడ్డుపై ఓక్సిలరీ లైన్లోనే ప్రయాణించాలి. అయితే... కార్లు, లారీలు మితిమీరిన వేగంతో ఔటర్పైకి ఎక్కుతుండటంతో అటువైపు నుంచి 120 కి.మీ వేగంతో వస్తున్న వాహనంతో ఢీకొంటున్నాయి. ఔటర్ పొడవునా ఫెన్షింగ్ మెష్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్నిచోట్ల అండర్పాస్ల వద్ద వదిలేశారు. ఇక్కడ ఔటర్ పైకి సులభంగానే పశువులు, ఇతర జంతువులు వెళ్తున్నాయి. వీటివల్ల రాత్రుల్లో ఘోరం జరిగిపోతోంది. -
గ్యాస్ లీకై వ్యాపించిన మంటలు
-
సెల్యులైటిస్: ఈ ఎరుపూ, మెరుపూ డేంజరే!
చర్మానికి సోకే ఒక తరహా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఈ కండిషన్లో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, ఎర్రగా కనిపిస్తూ, ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)ని కలిగిస్తూ బాధాకరంగా మారిపోతుంది. ఇది కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఒకవేళ ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే మొదట కాలుకి మాత్రమే పరిమితమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతటికీ పాకి ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి సెల్యులైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం తప్పనిసరిగా తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సెల్యులైటిస్, దాని లక్షణాలు, దానివల్ల కలిగే పరిణామాల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. సెల్యులైటిస్ సోకగానే కాలు బాగా వాచి, ఎర్రబారి (ఎరిథిమా), ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఇన్ఫ్లమేషన్తో సెల్యులైటిస్ కనిపించిందంటే అది కాస్త తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అంటే అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించినకొద్దీ సెల్యులైటిస్లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్నోడ్స్కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... నిజానికి సెల్యులైటిస్ అన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. కానీ ప్రధానంగా శరీరంలోని కింది భాగమైన కాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సెల్యులైటిస్ సోకిన కాలు ఎర్రగా నునుపుదనంతో మెరుస్తూ కనిపిస్తుంది. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరి, అది సెకండరీ కండిషన్లో సెల్యులైటిస్కు దారితీవయచ్చు. ఇందుకు చాలారకాలైన సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) దోహదపడతాయి. అవి... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధానమైన రకాలూ ఉన్నాయి. సెల్యులైటిస్ ఎలా వస్తుంది? సాధారణంగా మన చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ మనకు రక్షణ కలిగిస్తుందన్న విషయం తెలిసిందే. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలుగాని, చీరుకుపోయి గాని ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుంచి బయటి సూక్ష్మజీవులు చర్మాన్ని దాటి లోపలి భాగాలకు వెళ్లగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియాపెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. దాంతో వెంటనే చర్మం తనను తాను రక్షించుకునే వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)లో భాగంగా ఎర్రబారుతుంది. అది క్రమంగా సెల్యులైటిస్కు దారితీస్తుంది. లక్షణాలు ఏ చర్మపు రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. దాంతో అప్పటికే ఎర్రటి చర్మం కలవారు కొందరిలో దీన్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. అదే నల్లటి చర్మం కలవారిలో ఈ రంగు కారణంగా దీన్ని వెంటనే గుర్తుపట్టి, తగిన చికిత్స చేయడానికి వీలవుతుంది. వాపు: సాధారణంగా కాలివాపు పాదం నుంచి మొదలై పైకి వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలవుతుంది. ఏ కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది నునుపుదనాన్ని ఆపాదించుకుని మెరుస్తూ కనిపిస్తుంది. వాపుకారణంగా చర్మం బాగా బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది. ఏ ముట్టుకుంటే మంట, నొప్పితో పాటు ఆ ప్రాంతంలో లోపల వేడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఏ ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలు, చలితో కూడిన జ్వరం వచ్చినట్లుగా అనిపించడం కూడా కనిపించవచ్చు. ఏ రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి సూచన. ఏ వాచిన కాలి భాగంలో ఉన్న పుండ్ల నుంచి పసుపు రంగుతో చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్కు దారితీసే పరిస్థితులు ఏ చర్మానికి గాయమై, అది దీర్ఘకాలికంగా ఉండటం. చర్మం చీరుకుపోయి ఆ గాయం చాలాకాలంగా మానకుండా ఉండటం. కాలికి పుండ్లు. ఏ కాలికి దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి మానకుండా ఉండటం (ప్రధానంగా అథ్లెట్స్ ఫూట్ వంటివి) ఏ డయాబెటిస్ ఉన్నవారికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు (వేరికోసిక్ వెయిన్స్ వంటివి) ఏ పెరిఫెరల్ వ్యాస్కులార్ డిసీజ్ వంటి జబ్బులు ఏ శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం ఏ దీర్ఘకాలికంగా కాలేయ జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో (క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్ కనిపించే అవకాశాలెక్కువ) ఏ స్థూలకాయంతో బాధపడేవారిలో ఏ ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఏచర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్- ఉదాహరణకు చికెన్పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఏ దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా సెల్యులైటిస్ రావచ్చు ఏ ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కూడా ఒక్కోసారి సెల్యులైటిస్కు కారణం కావచ్చు. ఏ కాలిన గాయాలు చాలా సందర్భాల్లో సెల్యులైటిస్కు దారితీస్తాయి. ఏ చర్మంలో మనం ప్రవేశపెట్టే సూదులు (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మం లోపల అమర్చే వస్తువుల వంటి వాటితో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏ చర్మంలోపల ఉండే ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. ఏ కొన్ని కీటకాల కాటు తర్వాత (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల కూడా సెల్యులైటిస్ ప్రమాదం ఉంటుంది ఏ దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఉన్నవారిలో స్వాభావికంగా ఉండే వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడంతో సెల్యులైటిస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’గా అభివర్ణిస్తారు. ఈ దశలో సెల్యులైటిస్కు సరైన చికిత్స తీసుకోకపోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్కు చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు. ఇక సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూ పోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. మామూలుగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇది జరుగుతుంది. సాధారణంగా సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటుంది. దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్గా పేర్కొంటారు. అయితే రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించడం ఒకింత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. సాధారణంగా మన కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. నివారణ / చికిత్స ఒకసారి సెల్యులైటిస్ కనిపించాక దానికి చికిత్స చేయడమే మార్గం. అది రాకముందే కొన్ని జాగ్రత్తలతో దాన్ని నివారించుకోవచ్చు. ఉదాహరణకు కాలిపై ఎలాంటి దీర్ఘకాలికమైన గాయాలు, రంధ్రాలు, పుండ్లు లేకుండా చూసుకోవడం అవసరం. ఒకవేళ అలాంటివేవైనా ఉంటే అవి తగ్గేలా ముందే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది సెల్యులైటిస్కు దారితీయవచ్చు. ఏ చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం (డ్రై స్కిన్): చర్మాన్ని ఆరోగ్యంగా, పొడిగా ఉంచుకోవడం వల్ల వీలైనంతగా సెల్యులైటిస్ను నివారించవచ్చు. సాఫ్ట్ పారఫిన్ను, లిక్విడ్ పారఫిన్ను సగం, సగం పాళ్లలో కలిపి, చర్మానికి ప్రధానంగా కాళ్లకు రాసుకోవడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఇలాంటి చర్యలతో సెల్యులైటిస్ను నివారించవచ్చు. ఏ వాచిన కాలిని కాస్త ఎత్తున ఉండేలా జాగ్రత్త తీసుకోవడం: మనం పడుకున్న సమయంలో సెల్యులైటిస్తో వాపు వచ్చిన కాలిని శరీర భాగం కంటే కాస్త ఎత్తున ఉండేలా చేయడటం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది. ఏ యాంటీబయాటిక్స్తో చికిత్స: స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ బ్యాక్టీరియాను తుదముట్టించే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకునేలా చేయడం లేదా నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపితో చికిత్స చేస్తారు. ఏ వ్యాయామం: వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం. సెల్యులైటిస్ అన్నది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు కాబట్టి అది వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కంటే చిన్న చిన్న జాగ్రత్తలతో అసలు రాకుండానే చూసుకోవడం చాలా మంచిది. నిర్వహణ: యాసీన్ కొన్ని జాగ్రత్తలు సెల్యులైటిస్ రాకుండా నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ కాలికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఏ కాలికి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా కాలి వేళ్లకు గోళ్లు తొలగించే సమయంలో గాయాలు కాకుండా చూసుకోవాలి ఏ కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ మాత్రమే ధరించాలి. గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్ను బలవంతంగా ధరించకూడదు. షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి చేస్తుంటే ఆ పాదరక్షలను విసర్జించి, సౌకర్యంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. అంతేతప్ప ఎంతో డబ్బుపోసి కొన్నాం కదా అని వాటినే బలవంతంగా ధరించడాన్ని కొనసాగించకూడదు. పాదరక్షల వల్ల కాలికి ఏదైనా గాయాలవుతున్నాయేమో తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పైన పేర్కొన్న లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కీటకాలు, జంతువులు కుట్టకుండా/కరవకుండా జాగ్రత్త వహించాలి. కాలిన గాయాలు అయినప్పుడు అవి పూర్తిగా తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి. కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైనవారు మురికినీళ్లలోకి వెళ్లకూడదు. గాయమైన భాగాన్ని సముద్రపు నీటిలో ముంచకూడదు. అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్కు, అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని అవి పూర్తిగా తగ్గేలా చూసుకోవాలి. మనదేశంలో దీర్ఘకాలికంగా ఉండే వేరికోస్వెయిన్స్కు చికిత్స తీసుకోకుండా ఉండటం మామూలే. ఈ పరిస్థితి ఉన్నవారు తప్పనిసరిగా చికిత్స తీసుకుని, సెల్యులైటిస్ వంటి రిస్క్ను తగ్గించుకోవాలి.