combination
-
Kanuma special recipe : చిట్టి గారెలు, నాటు కోడి పులుసు, డెడ్లీ కాంబినేషన్
సంక్రాంతి పండగ అంటేనే పిండివంటలు.భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులు అనేక రకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. అరిశెలులు, సున్నుండలు, సకినాలు, పొంగడాలు, జంతికలు, తీపి బూంది ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వీటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా పొంగల్, పరమాన్నం, బెల్లం అన్నం ఇలా ఒక్కో చోట ఒక్కో రకం. కానీ కనుమ రోజు అయితే మాంసాహార ప్రియులకు పండగే. మరీ ముఖ్యంగా గారెలు, నాటుకోడి పులుసు మరింత ప్రత్యేకం. మరి క్రిస్పీగా గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం!ప్రాంతం ఏదైనా, పండగ ఏదైనా మినపగారెలు , నాటు కోడి కాంబినేషన్ చాలా ఫ్యామస్. ఈ రెండింటి కాంబినేషన్ రుచితోపాటు, ప్రోటీన్లను కూడా అధికంగా అందిస్తాయి. తయారీముందుగా 2 కప్పుల మినపప్పు, కొంచెం బియ్యం వేసి కనీసం నాలుగైదు గంటల పాటు నానెబట్టుకోవాలి. ఇందులో ఇనుప గరిటె, లేదా అట్ల కాడ వేస్తే తొందరగా నానుతుందని చెబుతారు. పొట్టు పప్పుఅయితే పొట్టు పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేకుండా వంపుకోవాలి. దీన్ని మెత్తగా, కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి(రుబ్బుకుంటే ఇంకా బావుంటుంది). ఇందులో పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి.తరువాత స్టవ్మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. గారెలు వేసే ముందు నీటితో చేతులను తడి చేసుకుని, అరిటాకుపై చక్కగా గుండ్రంగా అద్దుకోవాలి,మధ్యలో మధ్యలో చిన్న రంధ్రం చేసి వేడి నూనెలో జాగ్రత్తగా వేయాలి. ఆ తర్వాత మీడియం మంటపై గారెలను రెండు వైపులా సమానంగా వేయించుకోవాలి. దీని వల్ల నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. టిష్యూ పేపర్ వేసిన గిన్నెలో వేసుకుంటే అదనపు నూనెను పీల్చేస్తుంది. నాటుకోడి పులుసు తయారీముందుగా నాటు కోడి(మరీ ముదురు కాకుండాస్త్ర మాంసాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,ఎండుమిర్చి, లవంగాలు,యాలకులు, వెల్లుల్లి, జాజికాయ ,స్పూన్ ధనియాలను నూనెలేకుండా మూకుడులో దోరగా వేయించుకిన పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు,ఎండు కొబ్బరి , గసగసాలు,సారపప్పు జీలకర్ర కలిపి మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.కుక్కర్లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని యించుకోవాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. ఇపుడు ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుని మరికాసేపు వేయించుకోవాలి. ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ పెరుగు వేసి, సన్న మంట మీద మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలాక, మ్యారినేట్ చేసుకున్ననాటుకోడి ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాతమసాలా పేస్ట్, కొద్దిగా కారం,ఉప్పు కూడావేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి..అనంతరం కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. మూత వచ్చాక,ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా ఉంటే మరికొద్దిసేపు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాటే, టేస్టీ టేస్టీ నాటుకోటి పులుసురెడీ. ఈ నాటుకోడి పులుసుతో లేదా చికెన్ కూరతో వేడి వేడి గారెలను నంజుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు.ఇదీ కూడా చదవండి: Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా? -
దసరా కాంబినేషన్ షురూ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం షురూ అయింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘దసరా’కి 2023 మార్చి 7న చివరిసారిగా కట్, షాట్ ఓకే అని చెప్పాను. 2024 సెపె్టంబర్ 18న ‘నాని ఓదెల 2’ ప్రకటన వీడియో కోసం మళ్లీ యాక్షన్ చెప్పాను.48,470,400 సెకన్లు గడిచాయి. ప్రతి సెకను ఈ ్రపాజెక్ట్ కోసం సిన్సియర్గా ఉన్నాను. ‘దసరా’ చిత్రం స్థాయిని ‘నాని ఓదెల 2’తో వంద రెట్లు పెంచుతానని మాట ఇస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘నానీని ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్లో చూపిస్తూ, యునిక్ అండ్ ఎగ్జయిటింగ్ నెరేటివ్తో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ‘నాని ఓదెల 2’ చిత్రం అందించనుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్లో...
మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ దశాబ్దం తర్వాత మళ్లీ కలిసి నటించి ఫ్యాన్స్ను ఖుషీ చేయనున్నారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నాయి. 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్రాన్ని షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మూవీ స్టోరీలైన్కి తగ్గట్టు షూటింగ్ లొకేషన్ పర్మిషన్ కోసం నిర్మాతలు శ్రీలంక ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినట్టు కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం షూటింగ్ శ్రీలంకలోనూ మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్లోనూ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి, మోహల్ లాల్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు మహేశ్ నారాయణ్. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్లాల్ చివరిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్ను షేర్ చేసుకున్నారు. -
కాంబినేషన్ రిపీట్?
‘పవర్’ మూవీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పవర్’. 2014లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే రవితేజ, బాబీల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రవితేజ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నారట బాబీ. త్వరలోనే రవితేజకి ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట దర్శకుడు.అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అవుతుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారని భోగట్టా. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..??
నవపాకాలతో అన్నం వడ్డించినా, చివరలో పెరుగన్నం తినకుండా ఆ భోజనం పరిపూర్ణం అనిపించుకోదు. ఎందుకంటే పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా పెరుగు ΄÷ట్టకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రోటీన్, కాల్షియం,ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు చాలా పదార్థాలను పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే, పెరుగుతో కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి తినడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుతో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో... ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.పెరుగు, చేపల మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేదం ప్రకారం, చేప, పెరుగు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కలయికతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.సిట్రస్ పండ్లు... పెరుగు: ఇప్పటికే కాస్త పుల్లగా ఉండి, నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి పెరుగు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పిని కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండూ ప్రోటీన్ కు మంచి మూలాధారాలు. అయితే వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ΄÷త్తికడుపులో భారాన్ని, గ్యాస్ను కలిగిస్తుంది.ఉల్లిపాయ, పెరుగు: వీటి కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తుంది.పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.ఇవి చదవండి: ఆరోగ్యమే ఆనందం.. -
హిట్ కాంబినేషన్ రిపీట్
హిట్ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్చరణ్ కెరీర్లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం ప్లాన్ అని సమాచారం. -
ఆరంభం అప్పట్నుంచేనా..?
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ్రపారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ టార్గెట్ అని సమాచారం. -
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని భోగట్టా. చరణ్ సినిమాలో సంజయ్ దత్? రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక హిందీలో రామ్చరణ్ చేసిన తొలి చిత్రం ‘తుఫాన్’లో సంజయ్ దత్ ఓ రోల్ చేశారు. మరి.. రామ్చరణ్, సంజయ్ దత్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
గోవాలో మాఫియా
ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంతో మాఫియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో జరగనున్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారట దర్శకులు శేఖర్ కమ్ముల. ఈ షెడ్యూల్లోనే రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
బ్యాక్ టు హోమ్
మహేశ్బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫిట్నెస్ ట్రైనింగ్, ఓ వర్క్షాప్లో భాగంగా మహేశ్ బాబు ఇటీవల జర్మనీ వెళ్లవారు. ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్లోని స్వగృహానికి చేరుకున్నారాయన. కాగా ఈ సినిమాలో హీరో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేలా రాజమౌళి ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. -
సీక్వెల్ కోసం వెంకటేశ్– అనిల్ రావిపూడి ప్లాన్
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల (వరుణ్ తేజ్ మరో హీరో) కోసం కలిసి పని చేసిన హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అనిల్ రావిపూడి ఓ కథను వెంకటేశ్కు వినిపించారట. ఈ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. అయితే వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లోని సినిమా ‘ఎఫ్ 4’ అవుతుందా? లేక వేరే కొత్త కథా? అనే విషయాలపై స్పష్టత రావాల్సింది. మరి... వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
రాజమౌళి- మహేశ్ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున
సూపర్ స్టార్ మహేశ్బాబు– కింగ్ నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫిల్మ్నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏ సినిమాకీ? అంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందనున్న చిత్రానికి అంటున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా హిట్తో ఫుల్ జోష్లో ఉన్న మహేశ్బాబు తన తర్వాతి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్బాబు కెరీర్లో 29వ మూవీగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్తో రూపొందనుంది. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సినిమాలో చాలాప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. నాగార్జునకి దక్షిణాదితో పాటు ప్రత్యేకించి బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే జాతీయ స్థాయిలో పేరున్న నాగార్జునను ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భోగట్టా. ఏప్రిల్లో ఈ సినిమాప్రారంభం కానుంది. మరి మహేశ్బాబు– నాగార్జున కాంబో తెరపై కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న. -
మళ్లీ మాస్ కాంబో
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్గా బాధ్యతలు తీసుకున్నారు రవితేజ. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు హరీష్శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ల సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్ పాత్రలో రవితేజ నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ను గురువారం ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. -
రవితేజ మిస్టర్ బచ్చన్
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ఖరారైంది.‘నామ్ తో సునా హోగా..!’ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో ఆదివారం ఈ సినిమాప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కె. రఘురామకృష్ణ, టీజీ భరత్లు కలిసి కెమెరా స్విచ్చాన్ చేయగా, మంగత్ పాఠక్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు షాట్కు ‘‘మిస్టర్ బచ్చన్... నామ్ తో సునా హోగా!’’ అని రవితేజ డైలాగ్ చెప్పగా, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘురామకృష్ణలు కలిసి హరీష్ శంకర్కు ఈ సినిమా స్క్రిప్ట్ను అందించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
అడివిశేష్తో జోడీ కట్టనున్న శృతి హాసన్
అడివి శేష్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే షార్ట్ ఫిల్మ్కు షాన్ దర్శకత్వం వహించారు. శేష్, శ్రుతి కాంబినేషన్లో ఆయన దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్లను హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరించనున్నాం. ప్రతి భాషకు ఉన్న ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ సినిమాను విభిన్నంగా చేస్తున్నాం. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
లవ్.. యాక్షన్.. రొమాన్స్
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు అనిల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లవ్.. యాక్షన్.. రొమాన్స్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని, తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో బిజీగా ఉన్నారు నాగార్జున. -
కాంబినేషన్ కుదిరిందా?
హీరో అజిత్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్బైజాన్లో పూర్తయిందని కోలీవుడ్ టాక్. అయితే అజిత్ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. -
ఫైట్తో ప్రారంభం
‘అంటే..సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రధారి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఓ యాక్షన్ సీక్వెన్స్తో మంగళవారం హైదరాబాద్లోప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్–లక్ష్మణ్ ఈ ఫైట్ ఎపిసోడ్ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
గోవా టు హైదారాబాద్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబరులో హైదరాబాద్లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
భలే చాన్స్
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మంచి జోరుమీద ఉన్నారు. ఇటీవల తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించేందుకు శ్రీనిధి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భలే చాన్స్ అందుకున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సరసన నటించను న్నారు శ్రీనిధి శెట్టి. హీరో సుదీప్, దర్శకుడు చేరన్ కాంబినేషన్లో సత్యజ్యోతి ఫిలింస్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు శ్రీనిధి. త్వరలోనే ఈ సినిమా సెట్స్లో జాయిన్ కానున్నారట ఈ బ్యూటీ. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
కల నెరవేరనుందా?
పూజా హెగ్డేకి బోలెడన్ని కలలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన నటించాలన్న కల ఒకటి. ‘షారుక్ ఖాన్ రొమాంటిక్ లుక్స్ అంటే నాకిష్టం. అందుకోసమే ఆయన సినిమాలు చూడ్డానికి ఇష్టపడతాను. షారుక్ రొమాంటిక్ కింగ్’ అని గతంలో ఓ సందర్భంలో పూజా పేర్కొన్నారు కూడా. షారుక్ సరసన నటించాలనే తన కల నెరవేరే చాన్స్ ఉందని కూడా ఆమె అన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లుంది. ప్రస్తుతం షారుక్ ‘డంకీ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘డంకీ’ తర్వాత షారుక్ నటించనున్న చిత్రంలోనే పూజా హెగ్డే ఈ బాలీవుడ్ బాద్షా సరసన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కాగా, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందనున్న ‘టైగర్ వెర్సస్ పఠాన్’లోనే పూజా హెగ్డే నటించనున్నారట. ఈ విష యంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రెండు భాగాలు?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నదనే టాక్ తాజాగా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఓ సాధారణ కానిస్టేబుల్ గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాల్సి వచ్చిందనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు. కానీ కాల్షీట్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బందులు రావడంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో రష్మికా మందన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో విజయ్–రష్మిక కాంబినేషన్లో ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
ఆ దర్శకుడితో ధనుష్ మరో సినిమా
హీరో ధనుష్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. అయితే ‘కెప్టెన్ మిల్లర్’ తర్వాత అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నారు ధనుష్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇలా ధనుష్, అరుణ్ కాంబినేషన్ రిపీట్ కానుంది. అలాగే ఈ సినిమాకు ధనుష్ నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కెరీర్లోని 50వ సినిమాతో బిజీగా ఉన్నారు ధనుష్. ఈ మూవీలో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే అరుణ్ సినిమాని స్టార్ట్ చేస్తారట. -
ఇండియన్ 3.. ఆన్ ది వే!
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాగా శంకర్ మూడో భాగాన్ని కూడా ప్లాన్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘ఇండియన్ 2’ షూటింగ్ పూర్తయిందని, ‘ఇండియన్ 3’ షూటింగ్ కూడా 70 శాతం పూర్తయిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ‘ఇండియన్ 2’ విడుదలైన ఏడాది తర్వాత ‘ఇండియన్ 3’ రిలీజ్ అవుతుందని భోగట్టా. -
పాన్ ఇండియా రేంజులో విజయ్ మరో సినిమా!
హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే మూడుప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతుండగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’(వర్కింగ్ టైటిల్), పరశురామ్ డైరెక్షన్లో ‘వీడీ 13’ (వర్కింగ్ టైటిల్) సినిమాలకు కొబ్బరికాయ కొట్టారు విజయ్. తాజాగా ఇంద్రగంటి–విజయ్ల కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని టాక్. ఈ మూవీకి ‘జటాయు’ అనే టైటిల్ని పరిశీలిస్తోందట చిత్రబృందం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని, ప్రీ ప్రోడక్షన్ పనులు కూడాప్రారంభమయ్యాయని భోగట్టా. కాగా ‘గీత గోవిందం’ వంటి హిట్ తర్వాత విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లోప్రారంభమైన ‘వీడీ 13’ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్–ఇంద్రగంటి కాంబినేషన్ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారట ‘దిల్’ రాజు. -
కాంబినేషన్ రిపీట్
హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కొత్త సినిమా కోసం మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’(2013), ‘క్రాక్’ (2021) చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో నాలుగోసారి రిపీట్ అవుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘వాస్తవ సంఘటనలతో గోపీచంద్ మలినేని ఓ కథను తయారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
కమల్ విషయంలో ఫైనల్గా అదే నిజమైంది
జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు హీరో కమల్హాసన్. వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’తో కమల్ బిజీగా ఉంటున్నారు. కాగా ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) తర్వాత మణిరత్నంతో మళ్లీ ఓ సినిమా చేయడానికి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది కమల్హాసన్ కెరీర్లో 234వ సినిమాగా ప్రకటించారు. దీంతో ఆయన 233వ సినిమా చర్చనీయాంశమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపించింది. ఫైనల్గా అదే నిజమైంది. హీరో కమల్హాసన్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్లో సినిమాను మంగళవారం ప్రకటించారు. ‘‘అండ్ ఇట్ బిగిన్స్. రైజ్ టు రూల్’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి ట్వీట్ చేశారు కమల్. -
పదహారేళ్ల తర్వాత...
పదహారేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. చిరంజీవి హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల నటించనున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. -
సీనియర్ హీరోయిన్పై మనుసు పడిన రౌడీబాయ్
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్ హీరోయిన్పైనే ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని వారికి సూచించాడట. ఇదే టాపిక్ టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!) పూజానే ఎందుకు? పూరి డైరెక్షన్లో 'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్కు 'లైగర్' షాక్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి.. పరుశురాం సినిమాతో తనను తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేశాడట. ఈ విషయంపై మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఏదేమైనా సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు. (ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్గా ఎప్పుడైనా చూశారా?) -
32 ఏళ్ల తర్వాత మిత్రుడితో నటించేందుకు రెడీ అయిన రజినీ?
భారతీయ సినిమా రంగంలో ఇద్దరు దిగ్గజాలు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. వీటికి ప్రధాన మూలం తన 170వ సినిమాకు 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారని రజనీ ప్రకటించడమే. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు కూడా ఆయన తెలిపాడు. (ఇదీ చదవండి: కాబోయే తోడి కోడలికి ఉపాసన గ్రాండ్ వెల్కమ్!) జైలర్ తర్వాత షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని దర్శకుడు ప్రకటించాడు. దీంతో నటీనటుల ఎంపికపై రోజుకో వార్త వస్తుంది. ఈ స్టార్స్ కలిసి తక్కువ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్య మంచి స్నేహం, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రచారం నిజం కావచ్చనడంలో సందేహం లేదు. మూడు దశాబ్దాల క్రితం హమ్, అంధ కానూన్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను ఈ దిగ్గజ నటులు అందించిన విషయం తెలిసిందే. యదార్థ సంఘటనలే కథకు మూలం రజినీ కాంత్ 170 ఫిల్మ్ యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడుతున్నట్లు సమాచారం. ఇందులో పోలీసు ఆఫీసర్గా ఆయన నటించనున్నారట. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2024 చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: సమంత నవ్వులు.. మృణాల్ బోల్డ్ క్యాప్షన్) -
ఓకైకే పాన్ దోశ వాలా!
‘ఎన్ని రకాల పాన్లు ఉన్నాయి?’ అని అడిగితే హైదరాబాద్ నుంచి అలహాబాద్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పవచ్చు. అలాగే దోశలలో కూడా మైసూర్ దోశ నుంచి రవ్వ దోశ వరకు ఎన్నో రకాల దోశలు ఉన్నాయి. దోశ ప్లస్ పాన్ కాంబినేషన్ అనేది ఊహకు అందదు. అయితే ముంబైవాలా ఒకరు దోశకు పాన్ జత చేస్తూ తయారుచేసిన ‘పాన్ దోశ’ను చూసి నెటిజనులు ‘ఔరారా’ అంటున్నారు.వేడి వేడి దోశలో పాన్తో పాటు అంజీర్, డ్రై ఫ్రూట్స్... మొదలైనవి చేర్చాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో 1.5 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. -
పాన్ఇండియా ని షాక్ చేస్తున్న కాంబినేషన్..!
-
బోళా శంకర్ అదిరిపోయే అప్డేట్ ఫాన్స్ కి పూనకాలే..!
-
వెంకటేష్,అభిరాం,నాగచైతన్యతో అసలు సినిమా చేయను ....
-
ఆరోజు చెప్పిన వినలేదు..
-
రామ్ ఫ్యాన్స్కి డబల్ బోనాంజా
-
దిల్ రాజు, ఎన్టీఆర్ తో ఆ నెక్స్ట్ లెవెల్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటె..
-
భీమ్ హాలీవుడ్ మూవీ చేస్తున్నాడా..?
-
ఫ్యూచర్ లో రిపీట్ కాబోతున్న అరవింద సమేత కాంబో...?
-
జూనియర్ ఎన్టీఆర్- వెట్రిమారన్ కాంబో.. క్లారిటీ ఇదే!
కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ రానున్నట్ల నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. వెట్రిమారన్ డైరెక్షన్లో యంగ్ టైగర్ నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. తాజాగా విషయంపై స్పందించిన డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. విడుదల పార్ట్-1 తెలుగులో రిలీజవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన విడుదలై: పార్ట్1 ప్రేక్షకులను అలరిస్తోంది. వెట్రిమారన్ మాట్లాడుతూ..' 'అసురన్' మూవీ తర్వాత లాక్డౌన్ ముగిశాక ఎన్టీఆర్ను కలిశా. మేమిద్దరం చాలా విషయాలు చర్చించుకున్నాం. అయితే ఆయనతో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. అంతే కాకుండా ఏ కాంబినేషన్లో ఎలాంటి మూవీ రావాలన్న విషయంపై నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కేవలం స్టార్ వాల్యూ, కాంబినేషన్ మాత్రమే కాకుండా తాను ఎంచుకునే కంటెంట్ డిమాండ్ చేస్తే అతడితో సినిమా చేస్తా.' అంటూ వెట్రిమారన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వెట్రిమారన్ ప్రస్తుతం విడుదల:పార్ట్1'కు సీక్వెల్గా 'పార్ట్2' తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత సూర్యతో 'వాడివాసల్' అనే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్30 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. I will only Collaborate For A Content that will Demand A Star like @tarak9999 - #vetrimaaran 👌🔥❤️🔥. pic.twitter.com/9BTYhcGwNq — Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 11, 2023 -
క్రేజీ కాంబినేషన్స్... పదేళ్ల తర్వాత మళ్లీ ఇలా..
ఓ సినిమా సూపర్హిట్ అయితే ఆ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఆడియన్స్ కోరుకుంటుంటారు. కానీ సరైన కథ కుదిరితేనే ఆ కాంబో రిపీట్ అవుతుంది. అలా మంచి కథ కుదరడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్పై (హీరో–డైరెక్టర్) ఓ లుక్కేద్దాం. ♦ హీరో మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి దర్శకుడు త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘అతడు’ సినిమా కోసం మహేశ్, త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలిపారు. ఆ మూవీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2010లో ‘ఖలేజా’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రూ΄పొందుతున్న సినిమా సెట్స్పైన ఉంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ వారంలోనే హైదరాబాద్లోప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పాటు పూజాహెగ్డే, శ్రీలీల పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటోంది చిత్రయూనిట్. ♦ హీరో అల్లు అర్జున్తో ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) వంటి ప్రేమకథా చిత్రాలు తీశారు దర్శకుడు సుకుమార్. పది సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ రూ΄పొందుతోంది. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయం సాధించింది. దీంతో మలిపార్టు ‘పుష్ప: ది రూల్’పై మరింత ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్రెడీ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ మార్చి మొదటివారంలోప్రారంభం కానున్నట్లు తెలిసింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2024లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ♦ పదిహేను సంత్సరాల క్రితం వచ్చిన ‘ఢీ: కొట్టిచూడు’(2007) సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లోని మరో సినిమా ప్రకటన రావడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ‘ఢీ: కొట్టిచూడు’ సినిమాకు సీక్వెల్గా ‘ఢీ2: డబుల్ డోస్’ సినిమా రూ΄పొందనున్నట్లు 2020 నవంబరులో ప్రకటించారు మంచు విష్ణు. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. మరోవైపు గోపీచంద్తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. మరి.. ఆయన దర్శకత్వంలో ఏ హీరో సినిమా ముందుగా సెట్స్పైకి వెళుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి. ♦ ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రాల్లో 2009లో వచ్చిన హారర్ ఫిల్మ్ ‘ఈరమ్’ మంచి హిట్ సాధించింది. అరివళగన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘వైశాలి’గా 2011లో విడుదలై సక్సెస్ సాధించింది. పద్నాలుగేళ్ల తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లక్ష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా పదేళ్ల గ్యాప్ తర్వాత రిపీట్ అవుతున్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్ జాబితాలో మరికొన్ని తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
మన టీ, సమోసాకు ఆ దేశంలో యమా క్రేజ్..! విజయసాయి రెడ్డి ట్వీట్
లండన్: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని, పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్కి ఇప్పడు బ్రిటన్ యువతరంలో యమా క్రేజ్ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్ కింగ్డమ్ టీ అండ్ ఇన్ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్గా గ్రానోలా బార్స్ (ఓట్స్తో చేసేది) చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ యూకే పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 16-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. It is happy to note that tea and samosa have become favourite menu in UK. The young there prefer them instead of sweets as snacks. 16 to 24-year-olds are half as likely to enjoy a sweet biscuit with their tea as those over 55. #indianculture #foodie #uk #india pic.twitter.com/bRTlbIZq1W — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023 -
కాంబినేషన్ సెట్?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జోరు పెంచారు. ఓ సినిమా చేస్తుండగానే తర్వాతి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేస్తున్నారాయన. ప్రస్తుతం నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్ కానుందట. అయితే ‘జైలర్’ తర్వాత రజనీ నటించనున్న చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం కోలీవుడ్లో సాగుతోంది. కామెడీతో కూడిన ఓ కమర్షియల్ లైన్ను రజనీకాంత్కు చక్రవర్తి చెప్పారంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. రీసెంట్గా మరోసారి రజనీని కలిసిన ఆయన కథ చెప్పారట. ఈ కథ పట్ల రజనీ పాజిటివ్గా ఉండటంతో ఫైనల్ స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో ఉన్నారట చక్రవర్తి. ఈ కొత్త కాంబినేషన్ గురించి త్వరలోనే ప్రకటన రానున్నదని భోగట్టా. కాగా శివకార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘డాన్’(తమిళ్) చిత్రం మంచి హిట్ అయింది. -
కాంబినేషన్ రిపీట్
హీరో సూర్య – దర్శకురాలు సుధ కొంగరది హిట్ కాంబినేషన్. సూర్య హీరోగా సుధ దర్శకత్వంలో రూపొందిన ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా’) మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి ఐదు అవార్డులు దక్కాయి. కాగా సుధ కొంగర దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సూర్య అంగీకరించారు. గ్యాంగ్స్టర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సుధ పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఆరంభానికి కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతం బాల దర్శకత్వంలో సూర్య ‘వణంగాన్’ (తెలుగులో ‘అచలుడు’) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుధ దర్శకత్వంలో సూర్య చేసే సినిమా ఆరంభం అవుతుందని సమాచారం. పక్కా మాస్ మసాలా కథతో కమర్షియల్ చిత్రంగా సుధ తెరకెక్కించనున్నారని తెలిసింది. -
ఆ డైరెక్టర్తో సాయిధరమ్ తేజ్ యాక్షన్ ఎంటర్టైనర్..
Sai Dharam Tej Movie With Director Sampath Nandi: తనదైన శైలీలో సినిమాలతో అలరిస్తున్నాడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఇటీవల రిపబ్లిక్ మూవీతో సందడి చేసిన సాయిధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనుంది. హై ఓల్టేజ్ యాక్షన్గా రూపొందనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. సంపత్ నంది మార్క్ ఆఫ్ స్టైల్తో సాయితేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. కాగా కార్తీక్ అనే కొత్త దర్శకుడితో ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి:👇 లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
క్రేజీ కాంబినేషన్లో కొత్త సినిమా.. త్వరలో షూటింగ్
చెన్నై సినిమా: కోలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ప్రముఖ నటుడు శరత్కుమార్, యువ నటుడు గౌతమ్ కార్తీక్ (హీరో కార్తీక్ కుమారుడు) కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. బిగ్ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐబీ. కార్తికేయన్ త్రిపుర క్రియేషన్స్, తరాస్ సినీ కార్పొ సంస్థలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షిణామూర్తి రామర్ దర్శకత్వం వహించనున్నారు. మదురై నేపథ్యంలో సాగే క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. నటుడు శరత్కుమార్ ఇంతకు ముందు పలు చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారని, అయితే వాటికి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపిస్తారని చెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. శరత్కుమార్, గౌతమ్ కార్తీక్ వంటి అంకిత భావంతో పని చేసే నటులతో కలిసి పన చేయడంతో తన కల నెరవేరినట్లు భావిస్తున్నానన్నారు. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి అరవింద్ సింగ్ చాయాగ్రహణ, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా షాకింగ్ : న్యూడ్గా నటించిన హీరోయిన్ ఆండ్రియా? -
కాంబినేషన్ సెట్?
‘మనం’, ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రాల్లో తనయుడు నాగచైతన్యతో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్ చేశారు నాగార్జున. ఇప్పుడు తన మరో తనయుడు అఖిల్కు కూడా ఈ చాన్స్ను నాగార్జున కల్పించనున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో జోరుగా వినిపిస్తోంది. నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్రాజా దర్శకత్వం వహించనున్నారని భోగట్టా. నాగార్జునకు ఇది వందో సినిమా అని, మలయాళంలో మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్లు కలిసి చేసిన ‘బ్రో డాడీ’ చిత్రానికి రీమేక్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
కాంబినేషన్ వ్యాక్సిన్లు అంటే...
గతంలో ఒక్కో రకం వైరస్కు నిర్దిష్టంగా ఒక్కో వ్యాక్సిన్ ఇచ్చేవారు. అటు తర్వాత ఒక్క వ్యాక్సిన్ డోస్లోనే అనేక రకాల వ్యాక్సిన్లను ఒకేసారి ఇవ్వడం సాధ్యమైంది. ఇలా ఒకే డోస్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనేలా రూపొందించిన వ్యాక్సిన్లనే కాంబినేషన్ వ్యాక్సిన్లు అంటారు. ఉదాహరణకు ‘ఎమ్ఎమ్ఆర్ ప్లస్ వారిసెల్లా’ అనే వ్యాక్సిన్ ద్వారా మీజిల్స్, మంప్స్, రుబెల్లా, వారిసెల్లా అనే సమస్యలకూ, ‘డీటీఏపీ ప్లస్ ఐపీవీ’ అనే వ్యాక్సిన్ వల్ల డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, పోలియో అనే సమస్యలకు ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారానే నివారణ లభిస్తుంది. ఇలాంటి రకరకాల కాంబినేషన్ వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల మాటిమాటికీ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అగత్యం తప్పుతుంది. ఒకే ఇంజెక్షన్ ద్వారా మూడు/ నాలుగు/ఐదు సమస్యలను నివారించవచ్చు. చిన్నారులు డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి అంత సుముఖంగా ఉండరు. అందుకే కాంబినేషన్ వ్యాక్సిన్లతో మాటిమాటికీ హాస్పిటల్కు వెళ్లాల్సిరావడంతో పాటు కొన్ని వ్యాక్సిన్లను మిస్ అయ్యే అనర్థాల్లాంటివి చాలావరకు తప్పుతాయి. టీకా వేయించాల్సిన చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు తమ పీడియాట్రీషియన్ను కలిసి, ఏయే కాంబినేషన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో, తమ బిడ్డకు ఏవేవి అవసరమవుతాయో తెలుసుకుంటే, తక్కువ ఇంజెక్షన్లలోనే ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వడానికి వీలవుతుంది. చదవండి: (కిడ్నీలో రాళ్ల తొలగింపు ఇప్పుడు తేలికే!) -
కాంబినేషన్ రిపీట్?
ఆరేళ్ల క్రితం వచ్చిన ‘ఎవడు’ (2014)తో హీరో రామ్చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుందనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కొత్త స్టోరీ లైన్ రామ్చరణ్కు నచ్చిందట. దీంతో ఫుల్ స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో ఉన్నారట వంశీ. ఈ సంగతి ఇలా ఉంచితే... రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’లో నటిస్తున్నారు చరణ్. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్చరణ్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. -
కేన్సర్ చికిత్సలో కాంబినేషన్ థెరపీ
సాక్షి, సంగారెడ్డి: కేన్సర్ మహమ్మారిని నిర్మూలించేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల్లో ముందడుగు పడింది. కేన్సర్ చికిత్స కోసం సమర్థవంతమైన కాంబినేషన్ థెరపీని అభివృద్ధి చేశారు. కేన్సర్కు ఎలాంటి మందులు లేకపోవడంతో చికిత్స ద్వారానే నిర్మూలించేందుకు తాము మెరుగైన చికి త్స కోణంలో పరిశోధనలు జరిపిన ట్లు ఐఐటీ హైదరాబాద్ బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్కుమార్ రెంగన్ తెలిపారు. యాంటీ కేన్సర్ ఏజెంట్ను ఉపయోగించి ఫొటోథర్మల్ థెరపీ (పీటీటీ), కీమోథెరపీ సినర్జెటిక్ కలయికను గుర్తించినట్లు వివరించారు. పరిశోధన వివరాలతో మంగళవారం ఐఐటీ హెచ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కాంబినేషన్ థెరపీపై ఐఐటీ బాంబే, కోల్కతా బోస్ విశ్వవిద్యాలయం సహకారంతో పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ అరవింద్కుమార్ రెంగన్ పేర్కొన్నారు. హోస్ట్ కణాలను నాశనం చేస్తారిలా.. ఫొటోథర్మల్ థెరపీలో కాంతిని వేడిగా మార్చే పదార్థం కణతి (గడ్డ) ఉన్న ప్రాంతానికే నేరుగా వెళ్తుందని.. తద్వారా హోస్ట్ కేన్సర్ కణాలను తొలగించడం, నాశనం చేయడం చాలా సులువవుతుందని అరవింద్కుమార్ రెంగన్ తెలిపారు. ఐఆర్ 780 ఇన్ఫ్రారెడ్ కాంతిని గ్రహించడంతో పాటు కణతి వద్ద ఉండే కేన్సర్ కణాలను చంపేస్తుందని పేర్కొన్నారు. ఐఆర్ 780 హోస్ట్ కేన్సర్ కణాలను నశింపజేసే ఆక్సిజన్ జాతులను ఉత్పత్తి చేస్తుందని పరిశోధన ద్వారా తెలుసుకున్నామన్నారు. -
కట్టు కళ్లు చెదిరేట్టు
ఈ రోజుల్లో చీర సంప్రదాయ వేడుకల డ్రెస్ మాత్రమే కాదు ఈ రోజుల్లో చీర అమ్మలు, బామ్మలకే పరిమితం కాదు అమ్మాయిల వినూత్న కట్టులో విరివిగా మెరిసే ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ చీరతో ఇప్పుడిక స్టైల్గా ఆ‘కట్టు’కోవడంలోనే ఉంది అసలు సిసలు కిటుకు. 1 కుచ్చుల అంచులు వచ్చే చీరలు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. ఈ కుచ్చుల వల్ల మరింత అందంగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలు, యువతులకు ఈ చీరలు బాగుంటాయి. 2 బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కంచి కుప్పడం శారీ ఇది. పూర్తి సంప్రదాయ వేడుకలకు ఎంపిక చేసుకునే ఈ చీరను వెస్ట్రన్ లుక్లో కట్టుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకొని, పెద్ద బెల్ట్ నడుముకు పెట్టుకొని ఇండోవెస్ట్రన్ లుక్లో రెడీ అవ్వచ్చు. 3 సీతాకోకచిలుకల ప్రింట్లు ఉన్న కాటన్ చీర ఇది. దీనిని అన్ని చీరల విధంగా కాకుండా మెడచుట్టూ పవిట కొంగు వచ్చేలా స్క్రార్ప్ స్టైల్లో కట్టుకోవచ్చు. వింటర్ సీజన్కి కూడా ఇది బాగుంటుంది. మోడ్రన్స్టైల్లో ఆకట్టుకుంటుంది. 4 గ్రీన్ లెనిన్ శారీని జెగ్గింగ్, లెగ్గింగ్ లేదా ప్యాంట్ మీధకు ధోతీ స్టైల్లో కట్టేయచ్చు. దీనికి బ్లౌజ్గా క్రాప్టాప్ వేసుకొని పైన బ్లేజర్ వేసుకోవచ్చు. ఈ లుక్ ఫార్మల్గానూ స్టైలిష్గానూ ఉంటుంది. 5 కుచ్చుల చీరకు కాంట్రాస్ట్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ ధరించి, నడుముకు సన్నని బెల్ట్ ధరిస్తే స్టైలిష్గా మెరిసిపోతారు. 6 ఎరుపు–నలుపు కాంబినేషన్తో ముందే కుట్టి సిద్ధంగా ఉన్న రెడీ మేడ్ చీర ఇది. దీనిని ఒన్ మినట్ శారీ అని కూడా అంటారు. చీరకట్టుకోవడం రాకపోయినా, కాలేజీ అమ్మాయిలు వేగంగా, సులువుగా చీర లుక్లో మెరిసిపోవచ్చు. నవ్యశ్రీ మండవ ఫ్యాషన్ డిజైనర్ స్టైల్ అప్ విత్ సృష్టి, హైదరాబాద్ navyasrigoud30 @gmail.com -
నా పాట నీ నోట పలకాల బాలు
ఇళయరాజా– యస్పీ బాలసుబ్రహ్మణ్యంలది ఎవర్గ్రీన్ కాంబినేషన్. రాజా కంపోజిషన్లో బాలు అద్భుతమైన పాటలెన్నో పాడారు. సంగీతప్రియుల మ్యూజిక్ కలెక్షన్లో ఎవర్గ్రీన్ ఆల్బమ్స్లో నిలిచిపోయారు. అయితే ఈ మధ్య రాయల్టీ విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నేను స్వరపరిచిన పాటలెక్కడ పాడినా నాకు రాయల్టీ చెల్లించాలంటూ’ రాజా కొన్నేళ్లుగా సంచలన స్టేట్మెంట్స్ జారీ చేస్తూ వచ్చారు. దానికి ‘రాజా పాట పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరని’ యస్పీబీ కూడా చెప్పారు. అది వీరి మధ్య చిన్న గ్యాప్కు కారణం అయింది. ఇటీవలే ఇళయరాజా, యస్పీబీ మళ్లీ కలసిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న ‘తమిళరసన్’ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు. ఇందులో ఓ పాటను యస్పీబీ ఆలపించారు. ఇటీవలే ఆ పాటను రికార్డ్ చేయించారు. ఇవాళ చెన్నైలో జరగబోయే ఇళయరాజా కన్సెర్ట్లో యస్పీబీ పాడనున్నారని తెలిసింది. ట్యూన్కి, టోన్కి మళ్లీ నేస్తం కుదిరింది. సో.. మళ్లీ మరెన్నో మ్యూజికల్ హిట్స్ సంగీతాభిమానులకు ఇవ్వడానికి ఈ కాంబినేషన్ నిశ్చయించుకుందని అనుకోవచ్చు. -
అక్షరాలా ఐదోసారి
ఆ రోజుల్లో హీరో, దర్శకుడు పది సినిమాల వరకూ కలసి చేసేవారు. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు తగ్గింది. హీరో–డైరెక్టర్ రెండు మూడు సినిమాలు చేస్తే ఎక్కువ అన్నట్లు ఉంది. కానీ తమిళ హీరో అజిత్, దర్శకుడు శివ అందుకు భిన్నంగా ఉన్నారు. వీళ్ల కాంబినేషన్లో ఆల్రెడీ ‘వీరమ్, వేదాళమ్, వివేగమ్’ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐదోసారి కూడా వీళ్ల కాంబినేషన్ రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఈ సినిమా కూడా ‘వి’ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ‘వి’తో టైటిల్ పెడతారో లేదో వేచి చూడాలి. -
వి’ ఫర్ విక్టరీ!
‘వి’ సింబల్ అనగానే తెలుగులో విక్టరీ వెంకటేశ్ గుర్తుకురాక మానరు. తమిళంలో విక్టరీకి చిరునామా అనదగ్గ హీరో అజిత్. వరుస విజయాలతో దూసుకెళోతున్న ఈ హీరోకీ, దర్శకుడు శివకీ, ‘వి’కీ లింకుంది. అసలు మేటర్ ఏంటంటే.. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన ‘వీరమ్’, ‘వేదాళం’, ‘వివేగం’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించాయి. ఇప్పుడు మరో ‘వి’ కోసం.. అదేనండీ విక్టరీ కోసం ఈ ఇద్దరూ చేతులు కలిపారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందట. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా టైటిల్స్ అన్ని ‘వి’ లెటర్తోనే స్టార్టయ్యాయి. దీంతో రాబోయే సినిమా టైటిల్ని కూడా ‘వి’ అక్షరంతోనే స్టార్ట్ చేస్తారేమోనన్న టాపిక్ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ‘వి’ అక్షరంతో టైటిల్ పెట్టకపోయినా సక్సెస్ గ్యారంటీ అని, ఎందుకంటే.. అజిత్–శివ చేస్తే సక్సెస్ఫుల్ సినిమాయే చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. అన్నట్లు ఇంకోమాట.. హీరో అజిత్ ఈ సినిమా తర్వాత ‘విక్రమ్ వేదా’ సినిమా దర్శక ద్వయం పుష్కర్–గాయత్రిల డైరెక్షన్లో నటించనున్నారనే వార్త నిజం కాదట. ‘‘అజిత్ సార్తో సినిమా ఇంకా సెట్ కాలేదే. ఆయనతో సినిమా చేసే చాన్స్ రావాలని తాము కోరుకుంటున్నాం’’ అని వాళ్లు పేర్కొన్నారు. -
ఇప్పుడు టైమొచ్చింది!
ఏ కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందో ఎవరూ ఊహించలేం. ఫలానా హీరోతో సినిమా చేయాలని ఓ దర్శకుడూ... ఆ దర్శకుడితో సినిమా చేయాలనీ ఆ హీరో ఎంతగా ప్రయత్నించినా ఒక్కోసారి అంత త్వరగా సెట్ కాదు. హీరో విక్రమ్ - దర్శకుడు గౌతమ్ మీనన్లు ఈ కోవకే వస్తారు. వీళ్లిద్దరూ ఎప్పట్నుంచో కలసి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ కుదరడం లేదు. ఈసారి అంతా సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విక్రమ్కి గౌతమ్ మీనన్ ఓ కథ చెప్పారట. ఆ కథ ఈ విలక్షణ హీరోకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయం గురించి గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా అప్పటి నుంచి విక్రమ్తో సినిమా చేయాలనుకుంటున్నా. మేం చాలాసార్లు కలిశాం. పలు కథల గురించి చర్చించుకున్నాం. మన ప్రయత్నాలు సఫలం కావాలంటే రైట్ టైమ్ రావాలనే ఫిలాసఫీని నమ్ముతాను. ఆ టైమ్ ఇప్పుడు వచ్చేసిందనిపిస్తోంది. విక్రమ్కి నేను చెప్పిన స్టోరీ ఐడియా నచ్చి, పది రోజుల్లో ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిద్దామని అన్నాడు’’ అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే సూర్య హీరోగా గౌతమ్ ‘ధ్రువ నక్షత్రమ్’ పేరుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ముహూర్తం జరిగినా, ఆ స్క్రిప్ట్ సినిమాగా రాలేదు. ఇప్పుడు విక్రమ్తో గౌతమ్ చేయనున్నది ఆ స్క్రిప్టేనని ఓ టాక్. -
344 ఔషధాలపై ఆరోగ్యశాఖ నిషేధం!
దేశవ్యాప్తంగా చలామణి అవుతున్న 344 కాంబినేషన్ ఔషధాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. వీటిలో ముఖ్యంగా కోరెక్స్, ఫెన్సిడిల్ వంటి దగ్గు మందుల వాడకంతో అనేక నష్టాలు కలుగుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాంబినేషన్ ఔషధాలు మెదడుకు హాని చేస్తుండటమే నిషేధానికి ప్రముఖ కారణంగా తెలుస్తోంది. ఆరోగ్యశాఖ నిషేధం విధించిన 344 డ్రగ్స్ పై గతంలోనే ప్రతిపాదనలు తెచ్చింది. అయితే అప్పట్నుంచీ పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఆమోదించారు. ప్రముఖ సైంటిస్టుల పరిశోధనల్లో ఆయా ఔషధాలు హాని కలిగించేవిగా నిర్థారించారని.. దీంతో వెంటనే వాటిపై నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిషేధించిన ఔషధాలను తయారుచేస్తున్న 344 పైగా కంపెనీలకు షోకాజ్ నోటీసులను కూడ జారీ చేసింది. నిపుణుల సలహాల మేరకు తదితర సమాచారాన్ని అందిచనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధం అనేక పరీక్షల అనంతరం అమల్లోకి తెచ్చామని తెలిపారు. కాంబినేషన్ డ్రగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో ఉత్పత్తిచేసి మార్కెట్లో ప్రవేశ పెడుతున్న కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం 2014 లో దృష్టి సారించింది. సుమారు ఆరువేల సమ్మేళనాలను సమీక్షించేందుకు అప్పట్లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నిర్థారణ మేరకు ఆయా ఔషధాలపై ప్రస్తుతం నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. నిపుణుల కమిటి సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం... ఆయా ఔషధాల ఉత్పత్తి, అమ్మకాలతోపాటు పంపిణీపైనా నిషేధం విధించింది. కాంబినేషన్ డ్రగ్స్ తో దేశ ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తాజా నోటిఫికేషన్లో వెల్లడించింది. ముఖ్యంగా మార్కెట్లో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న క్లోఫెనిరామిన్ మలీట్, కొడైన్ లు కలిగిన కోరెక్స్ దగ్గుమందు బ్రాండ్ ను వెంటనే బ్యాన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనలకు స్పందించిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ ఫిజర్.. తమ ఉత్పత్తుల్లోని కోరెక్స్ పంపిణీతో పాటు ఉత్పత్తిని నిలిపివేసినట్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు తెలిపింది. -
మళ్ళీ మాయ చేయబోతున్న గౌతమ్...
-
జోడి నెం.1
-
సుకుమార్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ
-
సినిమాయణం: కాంబినేషన్