Curd
-
చిటికెలో హెల్దీగా..చియా కర్డ్ పుడ్డింగ్
చియా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అందులో ఒకటి చియా కర్డ్ పుడ్డింగ్. ఇందులో పెరుగు, క్యారెట్, కీరా లాంటి కూరగాయలు జోడించడం వల్ల రుచికీ రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. చియా కర్డ్పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలికావలసినవి: చియా సీడ్స్ (నల్ల గసగసాలు) – 4 టేబుల్ స్పూన్లు (రెండు గంటల సేపు నానబెట్టాలి); క్యారట్ తురుము-పావు కప్పు; బీట్ రూట్ తురుము-పావుకప్పు, కీరకాయ తురుము-పావుకప్పు. పెరుగు – కప్పు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా తరగాలి); దానిమ్మగింజలు -పావుకప్పు ఉప్పు రుచిని బట్టి; ఇంగువ – చిటికెడు; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్;పోపు కోసం...: నెయ్యి– టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి శనగపప్పు – గుప్పెడు; వేరుశనగపప్పు – గుప్పెడు.తయారీ: ఒక పాత్రలో నానబెట్టిన చియా సీడ్స్, పెరుగు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారట్ , బీట్రూట్, కీరకాయ తురుము వేసి బాగా కలపాలి. ∙ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి అందులోఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేయించి కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర చల్లి వడ్డించాలి. పోషకాలు: మ్యాక్రో న్యూట్రియెంట్స్: కేలరీలు – 230; ప్రొటీన్ – 8 గ్రాములు;కార్బోహైడ్రేట్లు – 20 గ్రాములు;ఫైబర్– 7 గ్రాములు;చక్కెర – 6 గ్రాములు;ఫ్యాట్ – 12 గ్రాములు;సాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3 గ్రాములు;మైక్రో న్యూట్రియెంట్స్: క్యాల్షియమ్– 280 మిల్లీగ్రాములు;ఐరన్– 2.5 మిల్లీగ్రాములు;మెగ్నీషియమ్– 90 మిల్లీగ్రాములు; పొటాషియమ్– 450 మిల్లీగ్రాములు;విటమిన్ సి– 8– 1– మిల్లీగ్రాములు;విటమిన్ ఏ – 350 మైక్రోగ్రాములు;ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు – 3–4 గ్రాములు ఇదీచదవండి : అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఅలాగే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ చియా కర్డ్ పుడ్డింగ్. అంతేకాదు సులువుగా చేసుకునే అల్పాహారం. స్ట్రాబెర్రీ, దానిమ్మ, యాపిల్, ఇలా పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే మరింత ఆరోగ్యకరమైంది కూడా. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ పుడ్డింగ్ చాలాసేపు పొట్టనిండుగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. చదవండి: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ : శారీ స్నీకర్స్ -
Manmohan Singh: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో యావత్తు దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థిక వేత్తగా, ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, సేవలను గుర్తించేసుకుంటూ..ప్రముఖలు, రాజకీయనేతలు నివాళులర్పించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన తొలి సిక్కుగా ఘనత దక్కించుకున్నా మన్మోహన్ వ్యక్తిగత అలవాట్లు గురించి పెద్దగా ఎవ్వరికి తెలియవు. ఎందుకంటే మితభాషిగా ఉండే ఆయన వ్యవహారశైలినే కారణమని చెప్పొచ్చు. అయితే విదేశాలకు వెళ్లినప్పుడూ..అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను ఇష్టపడే వంటకాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అవేంటో చూద్దామా.ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతావనిగా రూపు ఇచ్చి.. యావత్ ప్రపంచం మనవైపు చూసేలా చేసిన దార్శనికుడు. పాలన, దౌత్యపరంగా ఆయన చేసిన కృషి అసామాన్యమైనది. రాజీయ చతురత, వినయపూర్వకమైన ప్రవర్తనకు తగ్గటుగానే ఆయన అభిరుచులు ఉండేవని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆయన ఆహారపు అలవాట్లు ఓ సాధారణ వ్యక్తి ఇష్టపడేవే. ఎందుకంటే ఆయన అమితంగా ఇష్టపడేది పెరుగు అన్నమే. దానిమ్మ, ఊరగాయలు అంటే మహా ఇష్టం. ఉత్తర భారతదేశంలో కధీ చావల్గా పిలిచే పెరుగన్నం(Curd Rice) మన్మోహన్ మెచ్చే వంటకమని చెబుతుంటారు సన్నిహితులు. ఇది శరీరానికి చలువ చేస్తుంది, పైగా మనసును ప్రశాంతంగా ఉంచే రెసిపీ అని అంటుంటారట మన్మోహన్. అయితే మధుమేహం(Diabetes) కారణంగా స్వీట్స్కి దూరంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవారట. చెప్పాలంటే ఇక్కడ మన్మోహన్ పూర్తి శాకాహారి(Vegetarian). అయితే బంగ్లాదేశ్ పర్యటనలో ఆ శాకాహార నియమాన్ని ఉల్లంఘించే గమ్మతైన ఘటన జరిగిందంటే. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పేరుగాంచిన డిష్ బెంగాలీ హిల్సా ఫిష్ కర్రీ. ఈ రెసిపీలో చేపకు ఆవపిండిని పట్టించి అరటి ఆకుల్లో ప్యాక్ చేసి ఆవిరిపై వండుతారట. ఈ వంటకం రుచి గురించి తెలుసుకుని మరీ తెప్పించుకుని ఆస్వాదించారట మన్మోహన్. పైగా దీని రుచికి ఫిదా అయ్యి శాకాహార నియమాన్ని ఉల్లంఘించక తప్పలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారట. ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోయినా..ఆయన విశిష్ట వ్యక్తిత్వం, ఆదర్శవంతమైన జీవితం తాలుకా జ్ఞాపకాలు సదా నిలిచే ఉంటాయి. (చదవండి: మన్మోహన్ సింగ్ ఆ డ్రైస్సింగ్ స్టైల్నే ఎంచుకోవడానికి రీజన్ ఇదే..!) -
జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?
కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు కూడా తమ అందమైన శిరోజాల సీక్రెట్ ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. అయితే సెలబ్రిటీ హెయిర్స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ఇలా గుడ్లు, పెరుగు కురులకు అప్లై చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జుట్టుకి కండిషనర్గా అవి రాయడం వల్ల ఏమవుతుందో కూడా వెల్లడించారు. ఇంతకీ ఠాగూర్ ఏమన్నారంటే..జుట్టుకి పెరుగు, గుడ్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. ఇది రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండదని తెలిపారు. ఇక్కడ పెరుగులో పుష్కలంగా ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టులోని పీహెచ్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మంచి కండిషనర్గా ఉంటుంది. అయితే జుట్టు నష్టాన్ని రిపేర్ చేయదని అన్నారు. అలాగే గుడ్డులో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల శిరోజాలు మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. అయితే శాశ్వతమైన మార్పును కలిగించదు. ఈ సహజసిద్ధమైన వాటితో తయారైన ఉత్పత్తులు కురులను ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అన్నారు. మన బడ్జెట్కి అనుగుణంగా కురులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పెరుగు, గుడ్లు వంటి వాటిని కండిషనర్లుగా ఉపయోగించొచ్చని చెప్పారు.కానీ జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేందుకు, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసేందుకు మాత్రం ఇవి అస్సలు సరిపోవని తేల్చి చెప్పారు హెయిర్స్టైలిస్ట్ ఠాగూర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది కూడా. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ని కరిగించే బెడ్టైమ్ 'టీ'..!) -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!
ఇటీవల చాలామందికి డాక్టర్లు అత్యంత ఖరీదైన బయాటిక్స్ ప్రిస్క్రయిబ్ చేస్తుండటం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. జీర్ణవ్యవస్థ పొడవునా ఉంటూ మనకు మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. అవి ఉండటం వల్లనే వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అందుకే పెరుగు తినడం అన్నివిధాలా ఆరోగ్యానికి మేలు చేసే విషయం మాత్రమే కాదు... ఎన్నో రకాల వ్యాధులను దూరంగా ఉంచేందుకు ఓ సమర్థమైన మార్గం కూడా. పెరుగుతో ఉండే ప్రయోజనాలు చూద్దాం. జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సంఖ్యలో ఉండే బ్యార్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూడటం మాత్రమే కాకుండా... కడుపులో మంటను తగ్గిస్తాయి. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ టాబ్లెట్ తీసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది నేచురల్గా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. ∙చర్మంలో తేమ ఎల్లప్పుడూ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందన్నది ఆహార నిపుణుల మాట. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్త΄ోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో ΄ోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సెంటిఫిక్ సెషన్స్లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మహిళల్లో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్న మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. (చదవండి: -
పెరుగుతో అధిక బరువు చెక్, మేనికి మెరుపు
మారుతున్న జీవన శైలి రీత్యా అధిక బరువు, ఊబకాయం చాలామందిన వేధిస్తున్న సమస్య. అధిక బరువుతో బాధపడేవారికి ఏ ఆహారం తీసుకోవలన్నా భయంగానే ఉంటుంది. ఇది తింటే ఎన్ని కేలరీల బరువుపెరిగిపోతామో అని ఆందోళనపడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పెరుగు. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించే గుణాలుంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో వేగంగా బరువు తగ్గుతారుబరువు తగ్గాలని, ఆహారం తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. పోషకాలు ఎక్కువగా అందే ఆహారంపై దృష్టి పెట్టాలి. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినొచ్చు. పెరుగు తింటే బరువు బాధ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. పెరుగులో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ తినవచ్చు. దీంతో కడుపు నిండి ఉంటుందిన. పోషకాలు అందుతాయి. కీర, పుదీనా కలిపి తీసుకోవచ్చు. అలాగే కప్పు పెరుగుకు నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. వేడి చేసినపుడు పెరుగు, చక్కెర కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పెరుగు డీహైడ్రేషన్నుంచి కాపాడుతుంది. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.ఇలాంటి కొన్ని చిట్కాలతోపాటు రెగ్యులర్ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంఊ జంక్ ఫుడ్ ,ఆయిలీ ఫుడ్ జోలికి పోకూడదు. ఒత్తిడి లేని జీవనశైలికి అలవాటుపడాలి. సరిపడా నీళ్ళు నిద్రకూడా చాలా అవసరం అనేది గుర్తించాలి. -
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి : 7 ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఈ మూడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. పెరుగు అనేది అన్ని వయసులవారికి మంచి చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ లభిస్తుంది. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్రపొడి కలుపుకొని తిన్నారా? తద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుందని మీకు తెలుసా. రండి తెలుసుకుందాం.జీర్ణక్రియకు మంచిదిపెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థనుమంచిది. ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ డయేరియా, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. అయితే జీలకర్ర కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసారం, అపానవాయువు మొదలైన వాటిని దూరం చేస్తుంది. సో...పెరుగు ,జీలకర్రను కలిపి రైతా లేదా మజ్జిగ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కోసంపెరుగులో ప్రోబయోటిక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ప్రేగులకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. జీలకర్రలో విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు, వాపు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రను పెరుగుతో కలిపి తీసుకుంటే, విటమిన్ సీ పుష్కలంగా అంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది.చర్మానికి మెరుపుపెరుగులో జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి మెరుపునిచ్చి జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. అదే సమయంలో, విటమిన్ ఇ ,యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు, కేన్సర్, వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ ఏ, ఇ కూడా అంది, అనేక చర్మ సమస్యలనుంచి రక్షిస్తుంది.ఊబకాయానికి పరిష్కారంజీలకర్ర తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్నవారు వేయించిన జీలకర్రను తీసుకుంటే, సమస్య తొలగిపోతుంది. అలాగే స్థూలకాయాన్ని తొలగించడానికి పెరుగు కూడా మంచి ఎంపిక. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగిస్తుంది. రక్తపోటు సమస్యతోనూ పోరాడుతుంది. పెరుగులో ఒక చెంచా వేయించిన జీలకర్ర కలిపి ప్రతిరోజూ తింటే బరువు సులభంగా తగ్గుతారు.ఆకలిని పెంచుతుందిపెరుగు ,జీలకర్ర వాడకం ఆకలిని పెంచుతుంది. యోగా, జిమ్, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి ఇది చాలామంది. బాడీబిల్డింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సన్నగా ఉన్నవారు పెరుగు, జీలకర్ర వాడితే ఆకలి పెరుగుతుంది. కాస్త ఒళ్లు చేస్తారు.కంటి ఆరోగ్యానికిపెరుగులో,జీలకర్రలో నూ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. పెరుగు, జీలకర్రను కలిపి తీసుకుంటే, విటమిన్ ఎ లోపాన్ని తీరుస్తుంది. విటమిన్ ఏ కంటికి చాలా ముంచిది.డయాబెటిక్ రోగులకుడయాబెటిక్ రోగులకు డయాబెటిస్ సమస్యతో బాధ పడేవారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. -
పుల్లటి పెరుగు ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే..
భారతీయుల భోజనంలో పెరుగు ప్రధానమైనది. దీన్ని కూరల్లో కూడా జోడిస్తారు. రైతాగానూ, మజ్జిగగా పలు రకాలుగా తీసుకుంటారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, చలువ చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతేగాదు మొత్తం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది పెరుగు. అయితే పుల్లటి పెరుగు వినియోగించొచ్చా? ఇది ఆరోగ్యకరమైనదేనా? అని చాలామందిలో మెదిలే సందేహం. వేసవి కాలల్లో పెరుగు తొందరగా పులుసుపోతుంది. అలాంటప్పుడూ అది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం రావడం సహజం. అయితే నిపుణులు పుల్లటి పెరుగు కూడా ఆరోగ్యాని మంచిదేనని ధీమగా చెబుతున్నారు. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా బేషుగ్గా తీసుకోమని చెబుతున్నారు. కానీ ఇక్కడ పెరుగుని ఎలా స్టోర్ చేస్తున్నామనేది కీలకం అని నొక్కి చెబుతున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని తినొచ్చా లేదా అని నిర్థారించగలమని అంటున్నారు.పుల్లని పెరుగుని వినియోగించాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు..నిల్వ చేసే విధానం: పుల్లని పెరుగుని చల్లటి ప్రదేశంలో గాలి చొరబడని శుభ్రమైన కంటైనర్లో ఉంచాలి. పెరుగును సరిగ్గా నిల్వ చేయకపోతే ప్రమాదకరమైన సూక్ష్మక్రీములు వృద్ధి చెందుతాయి.. తినడానికి అనారోగ్యకరంగా మారుతాయి. వాసన, స్వరూపం: పెరుగు కాస్త చిక్కబడి నురుగ వచ్చినట్లుగా ఉండి, పుల్లటి వాసన ఘాటుగా వస్తుంటే దాన్ని వినియోగించకపోవడమే మంచిది. లేదంలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిల్వ సమయం: పెరుగు పుల్లడం అనేది సహజ ప్రక్రియ. ఎక్కువ కాలవ ఉండటం వల్ల పులయబడటానికి అనుమతిస్తుంది. ఇక్కడ ఎంతసేపు నుంచి పులియబడింది అనేదాన్ని పరిగణలోనికి తీసుకుని వినయోగించాలి. సరైన శీతలీకరణ: కిణ్వణ ప్రక్రియ మందగించేలా, చెడిపోకుండా ఉండేందుకు పెరుగును ఎల్లప్పుడూ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద రిప్రిజిరేటర్లో ఉంచాలి. పరిశుభ్రత: శుభ్రమైన గిన్నెల్లో పెరుగును తయారు చేయడం వంటివి చేయాలి. ఒక్కసారి వినియోగించిన పెరుగు గిన్నెలోనే పాలు వేసి తోడిపెట్టడం వంటివి చెయ్యకూడదు. అలవాటు చేసుకోవాలి: పుల్లని పెరుగు తినే అలవాటు లేకుంటే నెమ్మదిగా అలవాటు చేసుకునే యత్నం చేస్తే జీర్ణవ్యవస్థ ఈ పెరుగుని స్వీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇతర ఆహారాలతో జోడించడం: పుల్లని పెరుగు నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటే..పండ్లు, తేనె లేదా తృణధాన్యాలు వంటి ఇతర ఆహారాలతో కలపవచ్చు. ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా భోజనానికి వివిధర రకాల పోషకాలను అందిస్తుంది. ఏ టైంలో తీసుకుంటే మంచిది: పుల్లటి పెరుగు రాత్రిపూట కంటే పగటి పూట తీసుకోవడమే మంచిది. ఎందుకంటే జీర్ణక్రియ సాధారణంగా పగటిపూట మరింత చురుకుగా ఉంటుంది. జీర్ణ సమస్యల సంభావ్యతను తగ్గిస్తుంది. శరీర స్పందన: పుల్లని పెరుగు మీ శరీరతత్వానకి సరిపోతుందో లేదో గమనించాలి. కడుపునొప్పి లేదా అసౌకర్యం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తే తీసుకునే పరిమాణం తగ్గించడం లేదా నిలిపేయడం మంచిది. సరైన పద్ధతుల్లో పెరుగుని నిల్వ చేస్తే పుల్లటి పెరుగుని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణుల చెబుతున్నారు. కానీ యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ పుల్లటి పెరుగు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.(చదవండి: గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!) -
ఇవి కలిపితే ఆరోగ్యం పెరుగుతుంది
పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. పెరుగులో కొందరు పంచదార కలిపి తింటే, ఉప్పు కలిపి మరికొందరు తింటుంటారు. గతవారం మనం పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలేమిటో చెప్పుకున్నాం. పెరుగులో ఏయే పదార్థాలు కలిపి తింటే ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వారం చూద్దాం.జీలకర్రతో...పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకవేళ మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే, పెరుగుతో జీలకర్ర పోడిని కలిపి తింటే, దాని నుంచి మంచి ప్రయోజనం పోందుతారు. దీని కోసం ముందు జీలకర్రను కాస్త వేయించి, ఆ తర్వాత దానిని పెరుగులో కలుపుకుని తినాలి.సైంధవ లవణంతో...పెరుగు, సైంధవ లవణం కలిపి తింటే ఎసిడిటీ తగ్గుతుంది.కోడి గుడ్డుతో...పెరుగు, కోడిగుడ్డు కలిపి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి మేలు జరుగుతుంది. మీకు పంటి నొప్పి ఉంటే, ఈ రెండు పదార్థాలను కలిపి తినండి. ఇది నోటి అల్సర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నల్ల ఉప్పుతో,,,నల్ల ఉప్పును పెరుగు లో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, కడుపునొప్పి తగ్గుతాయి.వాముతో...కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీనివల్ల నోటిపూత, పంటి నొప్పి, ఇతర దంత సంబంధ సమస్య లు తొలగుతాయి.చక్కెరతో కలిపితే...పెరుగు చక్కెర... ఈ రెండింటిని కలిపి తినడం వల్ల దగ్గు తగ్గుతుంది. వంటికి తక్షణ శక్తి లభిస్తుంది.మిరియాల పోడితో...ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మలబద్దకం పోతుంది.పండ్ల ముక్కలతో కలిపితే... పెరుగులో తాజా పండ్లముక్కలు కలిపి తింటే వ్యాధి నిరోధకత పెరుగుతుంది. తేనెతో... పెరుగులో పోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. తేనెలో రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు పోషకాలు కలిసి ఎముకలను దృఢపరుస్తాయి కాబట్టి ఎముకల నొప్పులు ఉన్నవారు పెరుగు, తేనె కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పోందవచ్చు. ఇంకా బోలు ఎముకల వ్యాధి, రక్తం గడ్డకట్టడం, అతిసార, ఊబకాయం, కీళ్లనొప్పులు, గుండె, రక్త సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. -
వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..??
నవపాకాలతో అన్నం వడ్డించినా, చివరలో పెరుగన్నం తినకుండా ఆ భోజనం పరిపూర్ణం అనిపించుకోదు. ఎందుకంటే పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా పెరుగు ΄÷ట్టకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రోటీన్, కాల్షియం,ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు చాలా పదార్థాలను పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే, పెరుగుతో కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి తినడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుతో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో... ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.పెరుగు, చేపల మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేదం ప్రకారం, చేప, పెరుగు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కలయికతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.సిట్రస్ పండ్లు... పెరుగు: ఇప్పటికే కాస్త పుల్లగా ఉండి, నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి పెరుగు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పిని కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండూ ప్రోటీన్ కు మంచి మూలాధారాలు. అయితే వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ΄÷త్తికడుపులో భారాన్ని, గ్యాస్ను కలిగిస్తుంది.ఉల్లిపాయ, పెరుగు: వీటి కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తుంది.పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.ఇవి చదవండి: ఆరోగ్యమే ఆనందం.. -
డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చి..హైబైపీకి బ్రేక్ వేయండి
మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ వేధించే వ్యాధి హైబీపీ. ముఖ్యంగా నిద్రలేమి ఒత్తిడి ఈ హైబీపీ బారిన పడేస్తున్నాయి. బీపీని సకాలంలో గుర్తించి నియంత్రణలో ఉంచుకోకుంటే అది స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాంటి బీపీని నేచురల్ ప్రోబయాటిక్ ఆహారంతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు అవేంటో చూద్దామా..!జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉన్నందుకే పెరుగును నేచురల్ప్రోబయాటిక్ ఆహారం అంటారు. అరటిలో పొటాషియమ్ లవణాలుంటాయి. ఇటు అరటి, అటు పెరుగు... ఈ రెండూ రక్తపోట (హైబీపీ)ని సమర్థంగా అదుపు చేస్తాయని ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లో తేలడం మాత్రమే కాదు... ఆ సంగతి ‘హైపర్టెన్షన్’ అనే హెల్త్జర్నల్లోనూ ప్రచురితమైంది. హైబీపీ రాకముందే నివారించాలంటే... అందుకు అరటి, పెరుగు, తియ్యటి మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. వాటితోపాటు ఇంకా పూర్తిగా పులవకుండా... అందుకు సంసిద్ధంగా ఉన్న అట్ల పిండితో వేసే అట్లు, ఇడ్లీ వంటివి తీసుకుంటే కూడా హైబీపీ నేచురల్గానే నివారించవచ్చని వైద్య పరిశోధకులు, న్యూట్రిషన్ నిపుణులు పేర్కొంటున్నారు. (చదవండి: మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!) -
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ దరిచేరవు. పైగా వ్యాధులు తగ్గుముఖం పట్టడమే కాకుండా మళ్లీ తలెత్తవట. ముఖ్యంగా విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోయి శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఉంది. అంతేగాదు స్వర్గంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవ౦తుడు సృష్టించాడని ఆ గ్రంథం చెబుతోంది. అలాంటి మజ్జిగని ఈ వేసవిలో తాగుతుంటే వడదెబ్బ కొట్టదట. పైగా మహాభారత కాలం నుంచే వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఈ మజ్జిగతో రకరలా పానీయాలు తయారు చేసుకుని తాగేవారట. అవేంటో చూద్దామా..!'కూర్చిక' పానీయం: ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని ‘కూర్చిక’ అంటారు. ఇందులో పంచదార గానీ, ఉప్పు గానీ కలపకుండానే తాగవచ్చు. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ కూర్చికను తాగినప్పుడల్లా అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే వడదెబ్బ కొట్టదు, పైగా పేగులకు బలాన్నిస్తు౦ది. అంతేగాదు జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తు౦ది. అలాగే వేసవిలో వచ్చే జలుబుని నివారిస్తు౦ది.'రసాల' పానీయం:పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన 'రసాల' అనే పానీయాన్ని భీముడు తయారు చేశాడని భావప్రకాశ వైద్య గ్ర౦థంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట!. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన విందులో 'రసాల' కూడా ఉంది. ఎలా చేస్తారంటే..?బాగా కడిగిన ఒక చిన్న కుండ లేదా ముంత తీసుకోండి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రెండుమూడు పొరల మీద వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ) కట్ట౦డి. ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “పంచదార” కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వంతో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్టండి.పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్రంలోంచి క్రి౦ది ముంతలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా వాడుకోండి. ఈ రసాల పానీయం తయారీకి దీంతో పనిలేదు. ముంతలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని ద్రప్యం అంటారు. ఈ ద్రప్యం నిండా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షించి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టింపు కొలతలో తీసుకొని ముంతలోని పెరుగు నీళ్ళతో కలప౦డి. చల్లకవ్వంతో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అందులో ఏలకుల పొడి, లవంగాల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, మిరియాల పొడి కలపండి. ఈ కమ్మని పానీయమే రసాల!.దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.తేటతో కూడా..ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమానంగా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చాలా స్వల్పంగా పచ్చకర్పూరం” వీటన్నింటిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మజ్జిగ మీద తేటలో కేవలం ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉంటాయి. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి, చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట. ఇది ”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారికి కూడా ఇవ్వదగిన పానీయం. వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది. వడ దెబ్బ తగలనీయదు. శరీరంలో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణం శక్తినిస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుంది. పెరుగు మీద తేట, వైద్యపరంగా, చెవులను బలసంపన్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చెవిలో హోరు(టినిటస్), చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు (వెర్టిగో)లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తు౦దన్నమాట.తేమనం..తేమనం అనేది శ్రీనాథుడి కాలంలో ప్రసిద్ధి చె౦దిన వంటకమే!. దీన్ని తిపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేసుకొంటారు. ఈ మజ్జిగలో పాలు, బెల్లం, తగినంత చేర్చి, ఒక పొంగు వచ్చే వరకూ కాచితే అది “తేమనం” అనే తెలుగు పానీయంగా తయారవుతుంది. ఇది వేసవి పానీయాలలో మేలైన పానీయం. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. చల్లారిన తరువాత త్రాగటం మంచిది. దీన్ని తీపి మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు.మజ్జిగమీద తేట:మజ్జిగ మీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొంతుల వరకూ నీళ్ళు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచండి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొంటుంది. మజ్జిగ తేటను వంచుకొని మళ్ళీ నీళ్ళు పోయండి. ఇలా ప్రతి రెండు మూడు గంటల కొకసారి మజ్జిగ నీళ్ళు వంచుకొని వేసవి కాలం అంతా మంచి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. ఎండల్లో బయటకు వెళ్ల వలిసి వస్తే చిలికిన మజ్జిగలో నిమ్మకాయి, ఉప్పు వేసుకుని తాగండి. అవసరమయ్యితే ఓ బాటిల్ నిండా వేసుకుని తీసుకువెళ్లండి. లేదా తిరిగి ఇంటికి వచ్చాక మరొక్కసారి తాగండి వడదెబ్బ కొట్టదు.(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!) -
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
మే నెల వచ్చేసింది... ఎండలు మండుతున్నాయి. భోజనం చేయాలంటే చెమటలు పడుతున్నాయి. కూరలను చూస్తేనే ఆకలి పోయి దాహం వేస్తోంది. నేరుగా మజ్జిగలోకి వెళ్లాలనిపించేంత దాహం అది. అందుకే పెరుగుతోనే కూరలు చేసుకుందాం. ఇవన్నీ నాలుకకు హితవుగా ఉంటాయి. తిన్న తర్వాత పొట్టను చల్లగా ఉంచుతాయి.దహీ బైంగాన్..కావలసినవి.. వంకాయ – 1 (మీడియం సైజు); నూనె – టేబుల్ స్పూన్ (వంటకు ఉపయోగించే నూనె ఏదైనా) ; ఆవనూనె – టేబుల్ స్పూన్ (పోపు కోసం) ; యాలకులు – 2 ; లవంగాలు – 2 ; పెరుగు – పావు లీటరు (చిలకాలి). గ్రేవీ కోసం: మెంతిపిండి – టేబుల్ స్పూన్ ;అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; కశ్మీర్ మిర్చిపౌడర్ – టేబుల్ స్పూన్ ; నీరు – కప్పు (పై వన్నీ కలపడానికి) ; ఇంగువ– చిటికెడు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; పసుపు – టీ స్పూన్.తయారీ..ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో మెంతిపిండి, మిర్చిపౌడర్, అల్లం పేస్టు వేసి కలపాలి.వంకాయను మందపాటి చక్రాల్లా తరిగి ఉప్పు రాయాలి.నూనె వేడి చేసి వంకాయ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి(ఎయిర్ ఫ్రయర్ ఉంటే నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు)అదే బాణలిలో మిగిలిన నూనెలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, ఇంగువ వేయాలిఇందులో మెంతిపిండి, అల్లం, మిరప్పొడి కలిపిన మిశ్రమం, పసుపు వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలిఆ మిశ్రమం వేడెక్కిన తర్వాత పెరుగు వేసి గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల పాటు మరిగించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మరో కప్పు నీటిని పోసి కలిపితే చిక్కటి గ్రేవీ తయారవుతుందిఇప్పుడు ఉప్పు కలిపి గ్రేవీ చిక్కదనాన్ని సరిచూసుకుని అవసరమైతే మరికొన్ని నీటిని పోసి మరగనివ్వాలిఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలిపి వడ్డించాలిఇది అన్నంలోకి రోటీకి కూడా మంచి కాంబినేషన్.పులిస్సెరి..కావలసినవి.. పెరుగు – పావు లీటరు ; పసుపు – పావు టీ స్పూన్ ; నీరు – పావు లీటరు. కొబ్బరి పేస్టు కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చిమిర్చి– 3 ; జీలకర్ర– టీ స్పూన్; నీరు – కప్పు లేదా కొబ్బరి పేస్టు చేయడానికి తగినంత.పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు (వంటకు ఉపయోగించే కొబ్బరి నూనె లేదా ఇతర వంట నూనె) ; ఆవాలు – అర టీ స్పూన్ ; కరివేపాకు – 2 రెమ్మలు ; మెంతులు– పావు టీ స్పూన్ ; ఎండుమిర్చి– 2 ; ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు ; అల్లం – అర అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేయాలి. తగినంత నీటిని వేస్తూ మెత్తగా చేసుకోవాలిఒక పాత్రలో పెరుగు, పసుపు, నీరు కలిపి చిలికి అందులో ఉప్పు, కొబ్బరి పేస్టు వేసి కలపాలిఈ పాత్రను స్టవ్ మీద పెట్టి మీడియం మంటమీద మధ్యలో గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.దీనిని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మరగడం మొదలైన వెంటనే దించేయాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలిఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత పోపును ముందుగా వేడి చేసి సిద్ధంగా ఉంచిన పెరుగు– కొబ్బరి పేస్టు మిశ్రమంలో కలిపి, కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. ఈ కేరళ వంట అన్నంలోకి రుచిగా ఉంటుంది.గుజరాతీ కడీ..కావలసినవి: శనగపిండి– 4 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చిమిర్చి పేస్ట్– అర టేబుల్ స్పూన్ (అల్లం అంగుళం ముక్క, రెండు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి); తాజా పెరుగు – కప్పు ; బెల్లం లేదా చక్కెర – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నీరు – రెండున్నర కప్పులు. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర– అర టీ స్పూన్ ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; కరివేపాకు – ఒక రెమ్మ ; ఎండు మిర్చి – 2; మెంతులు – పావు టీ స్పూన్ ; ఇంగువ – చిటికెడు ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..ఒక పాత్రలో శనగపిండి, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, బెల్లం, ఉప్పు వేసి బాగా చిలకాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలిఅవి పేలిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, ఎండు మిర్చి (విరిచి వేయాలి), మెంతులు, ఇంగువ వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలిఈ పోపును ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు – శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలిఇప్పుడు ఆ పాత్రను మీడియం మంట మీద ఉంచి మిశ్రమం అడుగుకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి కలుపుతూ మాడకుండా చూసుకోవాలిశనగపిండి పచ్చి వాసన పోయిన తర్వాత మిశ్రమం మంచి రుచికరమైన వాసన వస్తుంటుంది. అప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలిగుజరాతీ కడీని సూప్లాగ భోజనానికి ముందు తాగవచ్చు. అన్నంలో కలుపుకోవచ్చు, రోటీలోకి కూడా తినవచ్చు. ఇది వేసవి, శీతాకాలాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం.గుజరాతీ కడీ, కుకురార్కుకురార్..కావలసినవి.. చికెన్ – అర కేజీ ; చిక్కటి పెరుగు – 5 టేబుల్ స్పూన్లు ; బంగాళదుంప – 2 (ముక్కలుగా తరగాలి) ; అల్లం వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – 3 (తరగాలి) ; ఆవ నూనె లేదా సాధారణ వంటనూనె – 5 టేబుల్ స్పూన్లు ; చక్కెర – చిటికెడు ; ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి ; ఎండు మిర్చి– 5 ; పచ్చిమిర్చి– 3 (నిలువుగా చీరాలి) ; పసుపు – టీ స్పూన్ ; మిరప్పొడి– 2 టీ స్పూన్లు ; గరం మసాలా పొడి – టీ స్పూన్ ; చికెన్ మసాలా పొడి– టీ స్పూన్ ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..చికెన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి.అందులో పసుపు, చికెన్ మసాలా పొడి, మిరప్పొడి వేసి మసాలా పొడులు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలిఈ లోపు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఇంగువ, చక్కెర, ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలిఇవి చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులోనే పెరుగు కూడా వేసి సమంగా కలిసేటట్లు ఒకసారి తిప్పి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టాలిఉల్లిపాయలు వేయించిన బాణలిలో మిగిలిన నూనెలో బంగాళాదుంప ముక్కలు వేయించి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలిఅదే బాణలిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి తీసి పెట్టుకోవాలిఇప్పుడు మిగిలిన నూనెలో మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలిచికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేవరకు వేయించి అప్పుడు ఉప్పు వేసి ముక్కలకు పట్టేటట్లు కలపాలిచికెన్ ముక్కల నుంచి నూనె వేరవుతున్న సమయంలో బంగాళాదుంప ముక్కలను వేయాలిఈ రెండింటినీ కలిపి పది నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులో రెండు కప్పుల నీరు పోసి కలిపి మంట పెంచి ఉడకనివ్వాలిచికెన్ ఉడికేటప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితోపాటు గరం మసాలా పొడి, చిలికిన పెరుగు మిశ్రమాన్ని వేయాలిఇవన్నీ కలిసి ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. ఈ కుకురార్ అస్సాం వాళ్ల వంట. అన్నం, రోటీల్లోకి రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!
వేసవి ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండల్ని తట్టుకునేలా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మన శరీరానికి చల్లదనాన్ని, పోషకాలు అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఫర్మెంటెడ్ రైస్, లేదా పులియ బెట్టిన పెరుగున్నం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం.! పులియబెట్టినపెరుగన్నంతో ప్రయోజనాలు వేసవిలో పెరుగు అన్నం లేదా రాత్రంతా పెరుగులో పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి పెరుగు అన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. కడుపులో చికాకు, అజీర్ణం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. కాల్షియం, బీ12 విటమిన్ డీ, ప్రోటీన్తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కాల్షియం చాలా అవసరం. పిల్లలు ఇది అలవాటు చేస్తే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఈ పెరుగు అన్నం ఎలా చేసుకోవాలి ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సులభం. వండిన అన్నాన్ని కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నె (మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది) లోకి తీసుకోవాలి. ఇందులో పాలు పోసి తోడు పెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఇందులో ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీన్ని తాలింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు. టిప్: పచ్చిమిర్చి వేయకుండా నల్లద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు లాంటివి వేసి చక్కగా గార్నిష్ చేసి ఇస్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు బోలెడన్ని పోషకాలు కూడా లభిస్తాయి. -
పెరుగు తొందరగా పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవికాలంలో పాలు పెరుగు తొందరగా పాడ పోతూ ఉంటాయి. ముఖ్యంగా పెరుగు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్లో పెట్టినా రెండురోజుల్లో పెరుగు పులిసి పోతుంది. మరిపెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ చేసుకోవాలో చూద్దాం. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పులావ్, ఖిచ్డీ, పరాటా, ఉప్మా ,ఇలాంటి అనేక వంటకాల తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. ఇక వేసవిలో అయితే లస్సీకున్న ప్రాధాన్యతే వేరు. ♦ మట్టిపాత్రలో పాలు తోడుపెడితే పెరుగు కమ్మగా ఉంటుంది. నిల్వ ఉంటుంది కూడా. ♦ చక్కటి , చిక్కటి పాలను బాగా మరిగించి, కొద్దిగా వేడిగా ఉన్నపుడే తోడు పెట్టాలి. తోడు పెట్టే పెరుగు రుచిగా ఉండేలా చూసుకోవాలి. ♦ తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే గట్టిగా తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా కూడా ఉంటుంది. ♦ గాలి చొరబడని కంటైనర్లలో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయాలి. మూత తీసినప్రతీసారి టైట్గా పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ♦ పెరుగు తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తీసుకొని, మళ్లీ అదే గిన్నిని ఫ్రిజ్లో పెట్టడం కాకుండా, కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకోవాలి ( దోసెలు, ఇడ్లీ పిండిలాగా) ఉపయోగించే స్పూన్ కూడా శుభ్రంగా, తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ♦ ఫ్రిజ్ డోర్లో నిల్వ ఉంచ కూడదు. ప్రిజ్ను తెరచిన ప్రతిసారి డోర్ మొదట వేడెక్కుతుంది. సో.. పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్లోపల ఉంచితే పెరుగు తాజగా ఉంటుంది. -
వండర్ఫుల్ టిప్స్ : బ్రెడ్ ప్యాకెట్లో బంగాళదుంప...ఓసారి ట్రై చేయండి..!
మన బామ్మల దగ్గర్నించి, ఇప్పటిదాకా వంటిట్లో గానీ, వంటల్లో గానీ, చిన్న చిన్న అనారోగ్యాలకు కానీ చక్కటి ఇంటి చిట్కాలను, హోం రెమిడీస్ను ఫాలో అవుతూ ఉంటాం. నిజానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కూడా. మరి అలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని మీ కోసం.. ⇒ కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు. ⇒ అగరబత్తిసుసితో ఇత్తడి పాత్రలు కడగడితే భలే శుభ్రపడతాయి. ⇒ కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది. ⇒ మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుప వస్తువు ఏదైనా వేయాలి. ⇒ బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలుంచితే త్వరగా పాడవ్వదు. ⇒ నిమ్మ చెక్క మీద ఉప్పు, మిరియాల పొడి చల్లి స్టౌ మీద ఉంచి, కొద్దిగా వేడి చేసి, ఆ రసాన్ని పిండుకొని తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం దొరుకుతుంది ⇒ నిమ్మ రసం, తేనె, గ్లిజరిన్లను సమపాళ్ళలో కలపాలి. రోజుకు మూడుసార్లు ఒక టీ స్పూను చొప్పున తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది ⇒ ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పి, తల తిరిగినట్లు ఉంటుంది కదా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి తాగితే ఉపశమనం. ⇒ పిల్లలకు జలుబు చేసినపుడు, తులసి, అల్లం, నాలుగు వామ్ము ఆకులు వేసి మరిగించిన నీళ్లను తాగిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ⇒ ముక్కు బాగా దిబ్బడ వేసినపుడు, పిల్లల్ని వెల్లకిలాకాకుండా, ఒక పక్కకు పడుకోబెట్టి, వీపు మీద బేబీ విక్స్ రాసి మెల్లిగా రుద్దితే తొందరగా నిద్ర పోతారు. -
మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!?
'సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా!?' ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇవి కూడా చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి! -
పెరుగు అడిగితే చంపేశారు!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: బిర్యానీ తింటూ అదనంగా రైతా(పెరుగు) అడిగిన పాపానికి రెస్టారెంట్ సిబ్బంది ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు వచ్చినా వారి ముందు కూడా కొట్టడం.. పోలీస్స్టేషన్లో ఊపిరి ఆడటం లేదని చెప్పినా పోలీసులు సైతం పట్టించుకోకుండా చివరి నిమిషంలో ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని మెరీడియన్ రెస్టారెంట్లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మినరల్ వాటర్ వ్యాపారం చేసే పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ లియాకత్ (32) ఆదివారం రాత్రి 10:30 ప్రాంతంలో తన స్నేహితులైన తొమ్మిది మందితో కలిసి పంజగుట్ట కూడలిలో ఉన్న మెరీడియన్ రెస్టారెంట్కు వచ్చారు. బిర్యానీ తింటున్న సమయంలో లియాకత్ రైతా అదనంగా కావాలని వెయిటర్ను కోరారు. రెండు సార్లు అడిగినా వెయిటర్ నుంచి నిర్లక్ష్యపు సమాధానం, పరుషపదజాలం రావడంతో లియాకత్కు, అతడికి వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడి: దీంతో మరో ఇద్దరు వెయిటర్లు, రెస్టారెంట్ మేనేజర్, సూపర్వైజర్ వచ్చి విచక్షణారహితంగా లియాకత్తో పాటు అతడి స్నేహితులపై దాడికి దిగారు. ఇంతలో ఓ రెస్టారెంట్ ఉద్యోగి సమాచారంకో అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసుస్టేషన్ గస్తీ సిబ్బంది ఎదుటే రెస్టారెంట్ సిబ్బంది, నిర్వాహకులు లియాకత్ తదితరులపై దాడి కొనసాగించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తూ రెస్టారెంట్పై అంతస్తు నుంచి కింది వరకు తీసుకువచ్చారని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. వీరి దెబ్బలు తాళలేకపోయిన లియాకత్ ఆయాసంతో అక్కడే కూలబడిపోయాడు. దీంతో పోలీసులు అతడితో పాటు స్నేహితులు మహ్మద్ జమీర్, మహ్మద్ నాసర్, మహ్మద్ ముస్తఫాను ఠాణాకు తీసుకువచ్చారు. ఠాణాకు తీసుకువచ్చినా నిర్లక్ష్యం... అప్పటికే లియాకత్ తనకు తీవ్రంగా ఆయాసం వస్తోందని, ఊపిరి అందట్లేదని చెప్తున్నా డ్యూటీలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పట్టించుకోలేదని అంటున్నారు. ‘నాటకాలు ఆడుతున్నావా..?’ అంటూ అతడినే గద్దించారు. కొద్దిసేపటికి లియాకత్ అక్కడే కుప్పకూలిపోవడంతో కారు తాళాలు ఇచ్చి స్నేహితులతోనే సోమాజీగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్ళడంతో... అప్పటికే లియాకత్ చనిపోయినట్టు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ ఆస్పత్రి వద్దకు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగింది. వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డెవిస్ పంజగుట్ట పోలీసులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేయించారని సమాచారం. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. హత్య కేసు నమోదు... లియాకత్ స్నేహితుడు, బండ్లగూడకు చెందిన హస్ర చాంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెయిటర్లు బీహార్ వాస్తవ్యుడు, అమీర్పేట హాస్టల్లో ఉండే కృష్ణ సూర్య ప్రకాష్ (33), అమీర్పేట బాపూ నగర్కు చెందిన మెగావత్ పాండు (36), సరూర్నగర్కు చెందిన మేనేజర్ సయ్యద్ హఫ్తాబ్ హైదర్ (55), జగద్గిరిగుట్టకు చెందిన సూపర్వైజర్ అబ్దుల్ మోయిన్(40), సనత్నగర్కు చెందిన సూపర్వైజర్ మహ్మద్ అజీజుద్దీన్ (23)పై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. -
పెరుగు అమ్ముతూ లక్షలు గడిస్తున్న బీహార్ వ్యక్తి - ఎలాగో తెలిస్తే..
మనిషి జీవితంలో పెరుగు అనేది ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఒక భాగమైపోయింది. దాదాపు పెరుగంటే ఇష్టం లేని వారు ఉండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది పెరుగును తెగ ఇష్టపడిపోతుంటారు. బీహార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పెరుగు అమ్ముతూ రూ. 10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఇప్పుడు ప్యాకెట్లలో లభించే పెరుగుని ఎక్కువ వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా బీహార్లోని ఖగారియాకు చెందిన 'చంద్రభూషణ్ కుమార్' అనే వ్యక్తి 'మట్కా' పెరుగుతో లక్షలు సంపాదిస్తున్నాడు. 2018 ప్రారంభించిన ఈయన వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది. కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలతో తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. 'గావ్ సే' బ్రాండ్ను స్థాపించడానికి తన గ్రామం నుండి వలస వచ్చిన కార్మికులతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత ఇది మంచి ప్రజాదరణ పొందగలిగింది. ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా.. నిజానికి మట్కా పెరుగు ప్రత్యేకత ఏమిటంటే.. కుండను కిందికి బోర్లించినప్పటికీ పెరుగు కిందపడదు. అలాగే కుండకు అతుక్కుని ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ పెరుగు నాణ్యత ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మార్కెట్లోని ఇతర బ్రాండెడ్ పెరుగులకంటే కూడా ఈ మట్కా పెరుగుకి డిమాండ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ పెరుగు బీహార్ సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపారిస్తోంది. -
వర్షాకాలంలో పెరుగు తింటున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే
వర్షాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ఎంతో ముఖ్యం.ఈ క్రమంలో వర్షాకాలంలో చాలామంది తమ డైట్ను కూడా మార్చుకుంటుంటారు. ఇక ప్రతిరోజు మనం తినే పాలు, పెరుగు, మజ్జిగ,నెయ్యి వంటివి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పెరుగు వినియోగానికి కాస్త దూరంగా ఉండాలంటున్నారు. దీనికి కారణం ఏంటి? వర్షకాలంలో పెరుగు తినడం మంచిదా? కాదా? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఈ సీజన్లో జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. ఆ లిస్ట్లో పెరుగు కూడా ఉంది. చాలామందికి భోజనం చివర్లో పెరుగు లేకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతుంటారు. అయితే ఈ సీజన్లో పెరుగు తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వర్షకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగు తినడం వల్ల కఫం ఏర్పడుతుంది. దీని వల్ల గొంతు నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ సీజన్లో ఒకవేళ పెరుగు తినాలనుకున్నా మధ్యాహ్న భోజనంలో తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగులోని ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. కానీ పెరుగు తినాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా క్వాంటిటీని తగ్గించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, అలెర్జీ ఉన్నవారు వర్షాకాలంలో పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. -
ప్రతిరోజూ పెరుగు తింటున్నారా? పొరపాటున కూడా ఈ పని చేయకండి
పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారతీయుల భోజనంలో పెరుగు కశ్చితంగా ఉండాల్సిందే. చాలామందికి ఎన్ని కూరలు ఉన్నా సరే చివరికి పెరుగుతోనే భోజనాన్ని ముగిస్తారు.పెరుగులో ప్రోబయోటిక్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు పెరుగు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. అయితే వీటిని తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఎక్కువ తీసుకుంటే కూడా నష్టమే అంటున్నారు నిపుణులు.కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు పెరుగును తినకూడదని, అలాంటి వారు పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. పెరుగు ఎలా తినాలి? పెరుగును నేరుగా తీసుకుంటే వేడి చేస్తుంది. కాబట్టి అందులో కాస్త నీళ్లు కలుపుకొని తీసుకోవాలి. అలా చేయడం వల్ల వేడి స్వభావాన్ని సమతుల్యం చేస్తుంది. ఈమధ్య దహీ కా థడ్కా, దహీ ఫ్రై పేరిట రకరకాల వంటలు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగులో తాళింపు వేసుకొని లాగించేస్తున్నారు. కానీ నిజానికి పెరుగును వేడి చేసి తినకూడదు. ఇలా చేయడం వల్ల పెరుగులోని పోషకాలన్నీ నశిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పెరుగును పండ్లలో కలిపి కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రిపూట పెరుగు తినొచ్చా? పెరుగుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. రాత్రిపూట పెరుగును తీసుకవడం వల్ల తినడం మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం ఏర్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణం చల్లపడినప్పుడు పెరుగును తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తప్పనిసరిగా పెరుగు తినాలనిపిస్తే పలుచని మజ్జిగ చేసుకొని తాగాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో పెరుగు తింటే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందట. రోజూ పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు ► ఆస్తమాతో బాధపడుతున్న వారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారు పెరుగును కాస్త మితంగానే తీసుకోవాలి. తినాలని భావిస్తే కేవలం పగటిపూట మాత్రమే తినాలి. రాత్రిళ్లు తినకూడదు. ► చాలామంది అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు సైతం పెరుగుకు దూరంగా ఉండాలి. ► వర్షాకాలంలో ప్రతిరోజు పెరుగు తినడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు, జలుబు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ► మీరు తరచుగా అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే పెరుగుకు దూరంగా ఉంటేనే మంచిది. ► మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ పెరుగును తీసుకోవద్దు. ముఖ్యంగా పుల్లటి పెరుగు తింటే తలనొప్పి మరింత బాధిస్తుంది. ► కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తినకూడదు. పెరుగు పుల్లని ఆహారం , పుల్లని ఆహారాలు కీళ్ల నొప్పులను తీవ్రతరం చేస్తాయి ► ప్రతిరోజూ ఎక్కువ మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మితంగా తీసుకోవడం మంచిది. -
ఎండలు బాబోయ్ ఎండలు... చుండ్రు తగ్గేదెలా..?
వేసవిలో తలకి ఎక్కువ చెమట పట్టడం, దానికితోడు వాతావరణ కాలుష్యం వల్ల తల తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ►వేసవిలో చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. తలలో అమితంగా పొట్టు చేరడం, తలంతా దురద.. ఈ సమస్యలు ఎండాకాలంలో కాస్త ఎక్కువుంటాయి. అలాంటపుడు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవేమిటో చూద్దాం... ►వేప నూనె లేదా వేప ఆకులను గుజ్జుగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్యే కాదు, దురద కూడా తగ్గుతుంది. ►నాలుగు స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనెలో అరచెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి గంట తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ►పెరుగు కూడా బాగానే పని చేస్తుంది. కప్పు పెరుగును తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు. ►కలబంద గుజ్జును తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ ను కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►పావు కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ను పావు కప్పు నీళ్లలో కల΄ాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు తడిగా ఉన్నపుడు మాడుకు పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు. చుండ్రు ఎందుకు వస్తుంది? ►చుండ్రుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, నిద్రలేమి. అయితే ఎండాకాలంలో చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ►షాంపూను ఎక్కువగా వాడటం వల్ల మాడు పొడుబారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్య వస్తుంది. ►కొందరికి జడను గట్టిగా బిగించి కట్టుకోవడం అలవాటు. అయితే అలా జుట్టును బిగుతుగా అల్లుకోవడం వల్ల గాలి తగలక సమస్య తీవ్రమవుతుంది. ►ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. అందువల్ల తల మీద ఎండపడకుండా తలను కవర్ చేసేందుకు ఏమైనా వాడాలి. ►చెమట వల్ల చికాకుగా ఉండి ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటాం. దీనివల్ల కూడా చర్మం పొడిబారి చుండ్రు సమస్య వస్తుంది. ఇవి పాటించాలి ►వారానికి మూడుసార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడునుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువవుతుంది. ►తరచూ తల ముట్టుకోకూడదు. అంటే తలలో చేతులు పెట్టి గోక్కోకూడదు. చుండ్రు వల్ల దురద వస్తుంది. దాంతో తరచూ తలలో చేయి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. సమస్య ఇంకాస్త పెరుగుతుంది. ►ఎండాకాలంలో హెయిర్ స్టైలింగ్ కోసమని క్రీములు, స్ప్రేలు ఎక్కువగా వాడితే అవి మాడును పొడిబారేలా చేసి చుండ్రును పెంచుతాయి. ►వారానికి ఒకసారైనా ఏదైనా ఆయిల్తో కుదుళ్లకు బాగా మర్దనా చేసుకోవాలి. దీనివల్ల మంచి రక్త సరఫరా జరుగుతుంది. మాడులో ఉండే చర్మ కణాల పనితీరు మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది. -
‘దహీ’పై వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
చెన్నై/బెంగళూరు: పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లిష్ ‘కర్డ్’కు బదులుగా హిందీలోని ‘దహీ’ముద్రించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెనక్కి తగ్గింది. కర్డ్ను కొనసాగిస్తూనే పక్కనే సమానార్థం.. తెలుగులో అయితే పెరుగు, కన్నడలో మొసరు, తమిళమైతే తాయిర్ అని ప్రాంతీయ భాషను ముద్రించవచ్చని స్పష్టతనిస్తూ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్కు బదులుగా హిందీ సమానార్ధం ‘దహీ’ని ముద్రించాలంటూ ఈ నెల 10వ తేదీన ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తమిళనాడు కో ఆపరేటివ్ మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ ‘ఆవిన్’బ్రాండ్తో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) నంది బ్రాండ్తో పెరుగును విక్రయిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎప్పటిలాగానే తమిళ ‘తాయిర్’నే వాడుతామని, ‘దహీ’అని మాత్రం వాడబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏఐకి సమాధానమిచ్చింది. అధికార డీఎంకే పార్టీ ‘నహీ టు దహీ’అంటూ ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘దహీ’వివాదంపై తమిళనాడు బీజేపీ విభాగం అభ్యంతరం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని బ్రాండ్తో తీసుకువస్తున్న పెరుగు ప్యాకెట్లపై హిందీ దహీ పక్కన బ్రాకెట్లలో కన్నడ (మొసరు) ముద్రించాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన మార్గదర్శకాలపై రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఈ చర్య కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనన్నారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా సవరణ ఉత్తర్వులిచ్చింది. -
బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్ మజ్జిగచారు తయారీ ఇలా
వేసవిలో కడుపులో చల్లచల్లగా ఉండాలంటే ఈసారి కన్నడ కుంబలకాయ్ మజ్జిగె హులి ట్రై చేసి చూడండి! కన్నడ స్టైల్ మజ్జిగచారుతో ఎంచక్కా భోజనం చేసేయండి! కావలసినవి: ►బూడిద గుమ్మడికాయ ముక్కలు – పావు కేజీ (చెక్కు, గింజలు తొలగించి ముక్కలు చేయాలి) ►పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ►పచ్చి కొబ్బరి తురుము– కప్పు ►పచ్చిమిర్చి– 3 ►అల్లం– అంగుళం ముక్క ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►పెరుగు – కప్పు. ►పోపు కోసం: వంట కొబ్బరి నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఇంగువ – పావు టీ స్పూన్; కరివేపాకు – 4 రెమ్మలు. తయారీ: ►ముందుగా పచ్చిశనగపప్పును కడిగి నీటిలో 20 నిమిషాల సేపు నానబెట్టాలి. ►పెరుగులో కప్పు నీరు పోసి చిలికి పక్కన ఉంచాలి. ►గుమ్మడి కాయ ముక్కలను ప్రెషర్ కుక్కర్ లేదా నేరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►శనగపప్పును నీటి నుంచి తీసి మరో గిన్నెలో వేసి అందులో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. ►పెనంలో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, మిక్సీలో రుబ్బిన పేస్ట్ వేసి కప్పు నీటిని పోసి వేడి చేయాలి. ►ఈ మిశ్రమం ఉడకడం మొదలైన తర్వాత చిలికిన పెరుగు వేసి దించేయాలి. ►పోపు లేని మజ్జిగె హులి సిద్ధమైందన్నమాట. ►ఇప్పుడు మరొక పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తరవాత జీలకర్ర వేయాలి. ►అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి ఈ పోపును మజ్జిగె హులిలో కలపాలి. చదవండి: అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ.. -
ఎండకు చల్ల గొడుగు
మార్చి నెల రానేలేదింకా... వాతావరణం మారిపోయింది. ఎండకు గొడుగు పట్టాల్సిందే. ఇంట్లోనే ‘చల్ల’ గొడుగు పడదాం. పెరుగు చిలికి... లస్సీ చేద్దాం. రోజ్ లస్సీ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; చల్లటి నీరు – కప్పు; చక్కెర లేదా తేనె – 3 టేబుల్ స్పూన్లు; రోజ్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 10 (పలుకులు చేయాలి). తయారీ: మిక్సీ జ్యూస్ జార్లో పెరుగు, రోజ్సిరప్, చక్కెర, నీరుపోసి బ్లెండ్ చేయాలి. రుచిని బట్టి మరింత తీపి కావాలనుకుంటే మరో రెండు స్పూన్ల చక్కెర వేసి కరిగే వరకు కొద్దిసేపు బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోసి పిస్తాతో గారి్నష్ చేసి సర్వ్ చేయాలి. మసాలా చాస్ కావలసినవి: పెరుగు – కప్పు; జీలకర్రపొ డి – అర టీ స్పూన్; చాట్ మసాలా – పా వు టీ స్పూన్; నల్ల ఉప్పు – చిటికెడు; అల్లం తురుము – పా వు టీ స్పూన్; పచ్చిమిర్చి – 1 ( తరగాలి); మిరియాలపొ డి – పా వు టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; పుదీనా – 5 ఆకులు; కొత్తిమీర తరుగు – టీ స్పూన్; మంచి నీరు – 4 కప్పులు. తయారీ: ఒక పా త్రలో పెరుగు, జీలకర్ర, చాట్ మసాలా, జీలకర్రపొ డి, నల్ల ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల΄÷డి, ఇంగువ, ఉప్పు వేసి బీటర్తో బాగా చిలకాలి. ఇప్పుడు నీటిని పోసి అరనిమిషం పా టు చిలకాలి. చివరగా పుదీన, కొత్తిమీర వేసి తాగడమే. రోజూ ఉదయం బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు తాగితే ఎండ వేడిమి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కేసర్ ఇలాచీ ... కావలసినవి: పెరుగు – 2 కప్పులు; కుంకుమ పువ్వు రేకలు – 2; తేనె– 3 టేబుల్ స్పూన్లు; యాలకులు – 6 (తొక్క వేరు చేసి గింజలనుపొ డి చేయాలి); బాదం తరుగు – టేబుల్ స్పూన్; పిస్తా – టేబుల్ స్పూన్. తయారీ: ఒక పా త్రలో బాదం, పిస్తా మినహా పైన తీసుకున్న అన్నింటినీ వేసి బీటర్తో రెండు నిమిషాల సేపు చిలకాలి. తీపి సరి చూసుకుని అవసరమైతే మరికొంత తేనె వేసి కలిసేవరకు చిలకాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి పైన బాదం, పిస్తాతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది మధ్యాహ్న భోజనంలో భాగంగా తీసుకుంటే బాగుంటుంది. స్వీట్ మింట్ ... కావలసినవి: పెరుగు – కప్పు; తేనె– 2 టేబుల్ స్పూన్లు; పుదీన ఆకులు – అర కప్పు; జీడిపప్పు – 20 (వలిచినవి); బాదం – 10 (తరగాలి); పిస్తా – 10 (తరగాలి); మంచి నీరు – 4 కప్పులు. తయారీ: జీడిపప్పులను చిన్న పలుకులు చేసి, బాదం తరుగు, పిస్తా తరుగులో కలిపి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో పెరుగు, పుదీన, తేనె వేసి బ్లెండ్ చేయాలి. నీటిని కలిపి మరోసారి కలిసేలా తిప్పాలి. ఈ లస్సీని గ్లాసుల్లో పోసి బాదం, పిస్తా, జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇష్టమైతే ఐస్క్యూబ్స్ వేసుకోవచ్చు. కేసర్ పిస్తా ... కావలసినవి: పెరుగు – కప్పు; చక్కెర లేదా తేనె – టేబుల్ స్పూన్; క్రీమ్– పా వు కప్పు; కుంకుమ పువ్వు– పది రేకలు; పిస్తా – టేబుల్ స్పూన్; మంచి నీరు – 4 కప్పులు. తయారీ: మిక్సీజార్లో పిస్తా, పెరుగు, క్రీమ్, చక్కెర లేదా తేనె, కుంకుమ పువ్వు నాలుగురేకలు వేసి బ్లెండ్ చేయాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేసి పైన రెండు కుంకుమ పువ్వు రేకలతో గా ర్నీష్ చేసి సర్వ్ చేయాలి. పైనాపిల్ ... కావలసినవి: పైనాపిల్ ముక్కలు – అర కప్పు; చక్కెర – పా వు కప్పు; పెరుగు – 2 కప్పులు; క్రీమ్ – పా వు కప్పు; పుదీనా – 4 ఆకులు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; తయారీ: పెనం వేడి చేసి పైనాపిల్ ముక్కలు, చక్కెర వేసి సన్న మంట మీద కలుపుతూ మగ్గనివ్వాలి. సుమారుగా మూడు నిమిషాల సేపటికి ముక్కలు మెత్తబడతాయి. ఆ తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక పా త్రలో పెరుగు, క్రీమ్ వేసి బీటర్తో బాగా చిలకాలి. ఇందులో ఉడికించిన పైనాపిల్ మిశ్రమాన్ని వేసి చిలకాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి పుదీనాతో అలంకరించి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. చల్లగా చిక్కగా ఇష్టపడే వాళ్లు ఓ అరగంట ఫ్రిజ్లో పెట్టి చల్లబడిన తరవాత తాగవచ్చు. -
Beauty: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్ తగ్గుముఖం పట్టడం ఖాయం!
Honey Pack Benefits: ట్యాన్ తొలగి ముఖారవిందం ద్విగుణీకృతం కావాలా? సహజసిద్దమైన నిగారింపుతో మెరిసిపోవాలా? అయితే, తేనెతో వీటిని కలిపి ముఖానికి అప్లై చేయండి. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పెరుగుతో ►రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూను తేనె తీసుకుని బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ►పదిహేను నిమిషాల తరువాత కడగాలి. పసుపులో కలిపి ►టీ స్పూను తేనెలో అర టీస్పూను పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి ►ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ►ఈ రెండు ప్యాక్లను వారానికి మూడు సార్లు వేయడం వల్ల చర్మం మృదువుగా మారడమేగాక, ఆరోగ్యంగా ఉంటుంది. సహజసిద్ధ నిగారింపు ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి ►పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ►బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఈ ప్యాక్ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. ►రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. చదవండి: Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్వాటర్.. ఇలా చేశారంటే Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై జీఎస్టీ బాదుడు.. పెరుగు, మజ్జిగలపైనా పెంపు
న్యూఢిల్లీ: నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ బాదుడు షురూ అయింది. 25 కిలోలు/లీటర్లు, అంతకులోపు పరిమాణంలో ఉండే ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై (బ్రాండెడ్ కాకపోయినా) కొత్తగా 5 శాతం జీఎస్టీ పడనుంది. ప్యాక్ చేసి విక్రయించే గోధుమ పిండి, మైదా వంటి అన్ని రకాల పిండులు, బియ్యం, గోధుమల వంటి ధాన్యాలు, పప్పు దినుసులు తదితరాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వీటిని ‘ప్రీ ప్యాకేజ్డ్, లేబుల్డ్ కమోడిటీ’ విభాగం కిందకు చేరుస్తూ 5 శాతం జీఎస్టీని కేంద్రం సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని లూజ్గా కొనుగోలు చేస్తే ఈ పన్నుండదని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది. అలాగే 25 కిలోలకు/లీటర్లకు మించిన పరిమాణంలో విక్రయించినా జీఎస్టీ పడదని స్పష్టం చేసింది. కొత్త పన్ను రేట్లపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ధరలు పెంచిన ప్రముఖ సంస్థలు పెరుగు, మజ్జిగ, పనీర్, టెట్రా ప్యాక్లో విక్రయించే పానీయాలపైనా జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ సంస్థలు అమల్లోకి తీసుకొచ్చేశాయి. బటర్మిల్క్, పెరుగు, లస్సీ, టెట్రా ప్యాక్ల్లో విక్రయించే పానీయాలపై ధరలను 5 శాతం పెంచినట్టు అమూల్ బ్రాండ్ పేర్కొంది. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం ధరలను సవరిస్తున్నట్టు మదర్ డెయిరీ కూడా మంగళవారమే ప్రకటన జారీ చేసింది. ఇదీ చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
తరుచూ పెరుగు వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
వివిధ రకాల ఫేస్ ప్యాక్లలో పెరుగు కలిపి వాడడం సర్వసాధారణం. పెరుగు చర్మనిగారింపుని పెంచడంతోపాటు, ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ను తొలగిస్తుంది. ఈ రెండు కారణాలతోనే ఎక్కువగా ఫేస్ ప్యాక్లలో పెరుగుని వాడుతారు. అలాగని తరచూ పెరుగు వాడడం వల్ల చర్మానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జిడ్డు చర్మతత్వం ఉన్న వారు పెరుగుని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గడానికి బదులు పెరుగుతాయి. ఎందుకంటే ముఖం మీద ఉన్న రంధ్రాలు పెరుగు వల్ల మరింత తెరుచుకుని మొటిమలు వస్తాయి. వేసవి, వర్షాకాలంలో పెరుగు వాడకం ఎక్కువగా ఉంటే మొటిమల సమస్య తీవ్రం అవుతుంది. పెరుగులో ప్రోటిన్, ల్యాక్టోజ్, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్నాయని రాత్రి సమయంలో పెరుగు తింటే చర్మసమస్యలు పెరుగుతాయి. శరీరం మొత్తంలో ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇంతటి సున్నితమైన చర్మంపై పుల్లటి పెరుగు అప్లై చేస్తే మంట, దురద, దద్దుర్లు వస్తాయి. పెరుగుని ముఖానికి రాసి ఎక్కువసేపు ఉంచుకోకూడదు. జిడ్డు చర్మంపై పెరుగు రాస్తే చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులు సరిపడవు. ల్యాక్టోజ్ అలెర్జీని కలుగజేస్తుంది. ఇటువంటి వారు ఫేస్ప్యాక్లలో కూడా పెరుగుని వాడకపోవడమే మంచిది. ఫేస్ప్యాక్లలో పెరుగు వాడితే మరిన్ని చర్మసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. -
కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి!
కొన్నిరకాల కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు రుచి అంతగా బావుండదు. ఇటువంటప్పుడు గ్రేవి చిక్కగా, మరింత రుచిగా రావాలంటే ఏం కలపాలో చూద్దాం...! ►పెరుగు, ఫ్రెష్ క్రీమ్లను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కూరలో వేసి కలపాలి. ►దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవి చిక్కగా రుచికరంగా వస్తుంది. ►జీడిపప్పులను పాలలో నానబెట్టాలి. ►నానాక జీడిపప్పుని నేతిలో వేయించాలి. ►చల్లారాక పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది. ►కార్న్ఫ్లోర్ను నీళ్లలో కలిపి కూరలో వేసినా గ్రేవీ చిక్కబడుతుంది. ►వేయించిన వేరు శనగపప్పుని మెత్తని పొడిలా చేయాలి. ►దీనిలో కాసిన్ని నీళ్లుపోసి కలిపి కూరలో వేస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? -
Recipe: పెరుగు, కీరా.. ఫహాడీ రైతా.. అరగంట ఫ్రిజ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే!
పెరుగు, కీరా కలగలసిన ఫహాడి రైతా తయారీ విధానం తెలుసా? ఫహాడి రైతా తయారీకి కావల్సినవి ►పెరుగు – రెండు కప్పులు ►కీరా – ఒకటి ►ఆవాలు – టీస్పూను ►పచ్చిమిర్చి – రెండు ►ఆవ నూనె – పావు కప్పు ►కొత్తిమీర – గుప్పెడు ►కారం – టీస్పూను ►పసుపు – అరటీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ... ►తొక్క, గింజలు తీసిన కీరాను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ►పెరుగును పెద్దగిన్నెలో వేసి కవ్వంతో చిలకాలి. ►తరువాత పావు కప్పు నీళ్లుపోసి కలపాలి. ►ఇప్పుడు ఆవాలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ►దంచిన మిశ్రమం, కీరా తరుగుని చిలికిన పెరుగులో వేయాలి. ►పసుపు, కారం కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ►దీనిని అరగంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Recipe: ఉత్తరాఖండ్ వంటకం ఆలుకీ గుట్కే తయారీ ఇలా! Indonesian Chicken Satay Recipe: ఇవన్నీ కలిపి బోన్లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే! -
ప్రోబయాటిక్స్తో డిప్రెషన్ దూరం!
మన జీర్ణవ్యవస్థలో ప్రతి చదరపు అంగుళంలోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం తెలిసిందే. జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి అందడానికి అవి ఎంతో తోడ్పతతాయి. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే పెరుగు, మజ్జిగ, కొద్దిగా పులిసేందుకు అవకాశం ఉన్న పిండితో చేసే ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తీసుకొమ్మని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇప్పుడు ఇదే ప్రో–బ్యాక్టీరియా మనుషుల్లోని డిప్రెషన్ తగ్గడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బాసెల్కు చెందిన మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. డిప్రెషన్తో బాధపడుతూ యాంటీడిప్రెసెంట్స్ వాడుతున్న కొందరిని ఓ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఇందులో భాగంగా... డిప్రెషన్ చికిత్స కోసం ముందుకొచ్చిన వలంటీర్లలో కొంతమందికి ప్రోబయాటిక్స్ ఇచ్చారు. వారిని పరీక్షించి చూసినప్పుడు... ఇలా ప్రోబయాటిక్స్ పుష్కలంగా తీసుకుంటున్న వ్యక్తుల మెదడు పనితీరు మరింత త్వరగా నార్మల్ అయ్యిందంటూ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైకియాట్రిస్ట్ అన్నా కియారా స్క్వాబ్ పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవరాశికీ... మెదడుకూ మధ్య ఏదో సంబంధం ఉందని ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల్లో తేలినా... అదెలా జరుగుతుందన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ప్రోబయాటిక్ ఆహారంతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతోంది. అంతమాత్రాన డిప్రెషన్కు ప్రో–బయాటిక్ ఒక్కటే చికిత్స అని చెప్పడం ఈ పరిశోధన ఉద్దేశం కాదు. కానీ ఒక్క యాంటీడిప్రెసెంట్స్ మాత్రమే వాడుతున్న మూడింట రెండు వందల మందికి వెంటనే మంచి గుణం కనిపించడం లేదు. అయితే మందులు వాడుతూనే ప్రోబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు మంచి గుణమే కనిపిస్తోంది. ప్రోబయాటిక్స్లోని ఏ అంశం ఇలా మేలు చేస్తోందనేది కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దాంతో భవిష్యత్తులో మరింత సమర్థంగా డిప్రెషన్కు చికిత్స అందించే వీలుంద’’ని చెబుతున్నారు అన్నా కియారా పేర్కొంటున్నారు. -
Health Tips: రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ రెండు కలిపి తినండి..!
పెరుగు అంటే అదో ప్రో–బయాటిక్ ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఆధునిక వైద్యవిజ్ఞానం ఈ విషయాన్ని నిరూపణ చేయడానికి చాలా ముందునుంచీ... అంటే అనాదిగా పెరుగు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. తోడేసిన పాలు పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే... మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ప్రోబయాటిక్స్ రక్తపోటు (హైబీపీ)ని అదుపుచేయడానికి సమర్థంగా ఉపయోగపడతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు... ఈ విషయం ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలిందని, ఇదే విషయం ‘హైపర్టెన్షన్’ అనే హెల్త్జర్నల్లోనూ ప్రచురితమైందని పేర్కొంటున్నారు. అందుకే పులవడానికి సిద్ధంగా ఉన్న పిండితో వేసే అట్లు, ఇడ్లీతో పాటు తాజా పెరుగు, తాజా మజ్జిగ రక్తపోటును సమర్థంగా అదుపు చేస్తాయన్నది వైద్యవర్గాల మాట. అంతేకాదు... చాలామందికి అరటిపండుతో పెరుగన్నం తినడం ఓ అలవాటు. అరటిలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పెరుగన్నం, అరటి కాంబినేషన్ రక్తపోటు అదుపునకు స్వాభావికంగా పనికి వచ్చే ఔషధం లాంటిది అంటున్నారు వైద్యనిపుణులు, న్యూట్రిషన్ నిపుణులు. -
Summer Drinks: నీర్ మోర్.. ఎసిడిటీ సమ్యసలు దూరం! ఇంకా..
Summer Drinks- Neer Mor: పెరుగుతో తయారు చేసే నీర్ మోర్ను మంచి ఎండల్లో తాగడం వల్ల డీహైడ్రేషన్కు గురికారు. దాహం కూడా తీరుతుంది. జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా ప్రోత్సహించి, ఎసిడిటీ సమస్యలను దరిచేరనివ్వదు. రక్త పోటు(బీపీ)ను నియంత్రణలో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! నీర్ మోర్ తయారీకి కావలసినవి: ►పెరుగు – కప్పు, నీళ్లు – కప్పు ►అల్లం తరుగు – టీస్పూను ►మిరియాల పొడి – పావు టీస్పూను ►పచ్చిమిర్చి – ఒకటి ►కరివేప ఆకులు – ఏడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా. ►తాలింపునకు: ఆయిల్ – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు. నీర్ మోర్ తయారీ విధానం: ►బ్లెండర్లో కప్పు పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కరివేపాకు వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి కొత్తిమీర తరుగు వేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ►తర్వాత ఇంగువ వేసి దించేయాలి. ►తాలింపు మిశ్రమాన్ని మజ్జిగ మిశ్రమంలో వేసి తిప్పితే నీర్ మోర్ రెడీ. దీనిని వెంటనే తాగితే చాలా బావుంటుంది. చదవండి👉🏾 Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్ల వల్ల.. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Summer: బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ తాగితే..
Summer Drinks- Poha Banana Shake Recipe: అటుకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం మంచిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటితో తయారు చేసే పోహా బనానా షేక్లో ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్ కూడా అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. పోహా బనానా షేక్ తయారీకి కావలసినవి: అటుకులు – పావు కప్పు(శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి), అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి), తియ్యటి పెరుగు – అరకప్పు, చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు. తయారీ: బ్లెండర్లో అరటిపండు ముక్కలు, నానబెట్టిన అటుకులను వేయాలి. దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి సర్వ్ చేసుకోవాలి. పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్ కాబట్టి దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. చదవండి: Healthy Weight Gain Tips: గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే.. -
Beauty Tips: ముఖంపై మృతకణాలు తొలగిపోవాలంటే...
పెరుగు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మ సంరక్షణలోనూ అంతే మేలు చేస్తుంది. ముఖంపై కనిపిస్తోన్న మొటిమలను తగ్గించి, సహజసిద్ద మెరుపుని అందించడంలో పెరుగు బాగా పనిచేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగించి కొత్తకణాల పుట్టుకలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ►పెరుగుని ముఖానికి, మెడకు అప్లై చేసి గుండ్రంగా కింద నుంచి పైకి మర్దన చేయాలి. ►పదిహేను నిమిషాలు ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►రోజుమార్చి రోజు ఈ విధంగా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా ఫ్రెష్గా కనిపిస్తుంది. ►ఇక ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నయమవుతాయి.. ►అదే విధంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేసి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. -
Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే!
Summer Drinks- Lassi Recipe: భారత ఉపఖండంలో ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతంలో శతాబ్దాల కాలం నుంచి విరివిగా వాడుకలో ఉన్న వేసవి పానీయం లస్సీ. హిందీలోని కొన్ని మాండలికాల్లో మజ్జిగనే ‘లస్సీ’ అంటారు. ‘లస్సీ’ తయారీలో కమ్మని పెరుగులో చక్కెర కలిపి, దానిని బాగా చిలికి తయారు చేస్తారు. అందులో జీడిపప్పు, కిస్మిస్, చెర్రీ, రోజ్వాటర్, స్ట్రాబెర్రీ వేసుకుంటారు. లస్సీ తయారీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన శైలి. పురాణాలలో వర్ణించిన ‘రసాల’ అనే పానీయానికి లస్సీ ఆధునిక రూపం అనుకోవచ్చు. విరాటరాజు కొలువులో వలలుడి వేషంలో ఉన్నప్పుడు భీముడు ‘రసాల’ను తయారు చేసినట్లు ప్రతీతి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, పాకిస్తాన్లోని సింద్ ప్రాంతాలు లస్సీ తయారీకి ప్రసిద్ధి. ఒడిశాలో లస్సీని ఇంకొంత విలక్షణంగా తయారు చేస్తారు. పెరుగులో పచ్చికోవాను కలిపి బాగా చిలికి, అందులో లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు, మొగలిపూల ఎసెన్స్ వంటివి కలుపుతారు. పెరుగులో ఉండే అన్ని పోషకాలూ లస్సీలోనూ ఉంటాయి. చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే -
Summer Tips: వేసవిలో తినడానికి చక్కని పోషకాహారం..
చద్దన్నం ఇష్టపడనివారికి పెరుగన్నం చక్కని ప్రత్యామ్నాయం. తాజాగా వండిన అన్నంలో పెరుగు కలుపుకొని తింటే కడుపులో ఎలాంటి గడబిడ లేకుండా హాయిగా ఉంటుంది. పెరుగు కలిపిన అన్నానికి నేతితో తాలింపు వేసుకుని దద్ధోజనం కూడా చేసుకోవచ్చు. వేసవిలో మసాలాలు దట్టించిన వంటకాలకు బదులు పెరుగన్నం లేదా దద్ధోజనం తినడం చాలా శ్రేయస్కరం. దద్ధోజనం వినియోగం చాలాకాలంగా ఉంది. ఆలయాల్లో నైవేద్యంగా కూడా దీనిని పెడతారు. పెరుగును సంస్కృతంలో ‘దధి’ అంటారు. అందువల్ల పెరుగన్నానికి ‘దద్ధ్యోదనం’ అనే పేరు వచ్చింది. వాడుకలో దద్ధోజనం అయింది. దీనికి నేతి తాలింపులో ఉపయోగించే ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు వంటి సంబరాల వల్ల అదనపు రుచి ఏర్పడుతుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, తగుమాత్రం కొవ్వులు కలిగిన దద్ధోజనం వేసవిలో తినడానికి అనువైన చక్కని పోషకాహారం. చదవండి: Ambali Health Benefits: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా -
బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి హాజరై.. తెల్లవారుజామున పెరుగు తెస్తామని ఇద్దరు మైనర్లు మోటర్సైకిల్పై వెళ్లగా ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఆడెపు ప్రసాద్ గృహాప్రవేశానికి అతని దగ్గరి బంధువుల అబ్బాయి ఆడెపు రోహిత్(16) హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున గృహాప్రవేశం ముగియగా సత్యనారాయణ వ్రతం కోసం పెరుగు అవసరం పడింది. అక్కడే ఉన్న ఆడెపు రోహిత్, మరో బంధువుల అబ్బాయి మనోజ్(14)తో కలిసి మోటార్సైకిల్పై తెల్లవారుజామున 5 గంటలకు పైడిమడుగు శివారులోని పెరుగు విక్రయ కేంద్రం వద్దకు వెళ్దామని బైక్పై బయలుదేరారు. ఊరు దాటి కొంత దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్సైకిల్ నడుపుతున్న రోహిత్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు. మనోజ్కు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దొంగచాటుగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి కారణమైనట్లుగా భావిస్తున్నారు. మనోజ్ది మహారాష్ట్రలోని భీవండి కాగా శుభకార్యం కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. రోహిత్ తల్లి వందన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ కల్లూర్ మాడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రోహిత్ తండ్రి సత్యనారాయణ ఉపాధి కోసం గల్ప్ దేశాల్లో ఉంటున్నాడు. చదవండి: కంప్యూటర్ ఆపరేటర్కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి -
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్క్రీమ్గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
పెరుగుతో ఇమ్యూనిటీ ఎందుకు పెరుగుతుందంటే?
పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ వేసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు... పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందట. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సైంటిఫిక్ సెషన్స్లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక మహిళలకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నీ అని చెప్పలేం. పెరుగులోని ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ముఖ్యంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చూడటం మాత్రమే కాదు... కడుపులో మంటనూ తగ్గిస్తుంది. అందువల్ల తాజా పెరుగుతో చిలికిన మజ్జిగ తాగగానే కడుపు మంట తగ్గడం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. -
పెరుగుతో ఆరోగ్యం.. వీటితో కలిపి తిన్నారంటే మాత్రం అంతే ఇక!
పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని మన పెద్దలు చెప్పేవారు. అంతేగాక వైద్యులు కూడా పెరుగు తినాలని సూచిస్తున్నారు. పెరుగు వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. ఉదాహరణకు పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం ద్వారా వారికి మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషదంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. ఇందులో ఓ సమస్య దాగుంది, ఇదే పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదన్నది వైద్యుల అభిప్రాయం. అవేంటో వెంటనే తెలుసుకుందాం, ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం కదా. మామిడి ►పెరుగును మామిడి పండుతో కలిపి అస్సలు తినకూడదు. అలా పెరుగుతో మామిడి కలిపి తినడం కారణంగా శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేసవి కాలం వచ్చిందంటే ఈ కాంబో ఎక్కువ కనిపిస్తుంది. ఉల్లిపాయలు ► ఉల్లిపాయలతో పెరుగును కలిపి తినడం కూడా అంత మంచిదికాదు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే.. పెరుగు చల్లదానానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలు ►ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదన్నది నిపుణుల సలహా. రెండు తెల్లగానే ఉన్నాయి కదా తింటే ఏం కాదు అనుకోకండి. ఈ కాంబో తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల సలహా. చేపలు ►చేపలను పెరుగుతో కలిపి అసలు తినకూడదు. ప్రోటీన్లు పరంగా ఈ రెండింటిలో ఎక్కువగానే ఉన్నాయి కదా రెండింతలు ప్రోటీన్లు లభిస్తుందనుకుంటే పొరపాటే.. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వంటనూనేతో చేసే వంటకాలు ►వీటితో పాటు ఎక్కువ వంట నూనెలు తీసుకునే వంటకాలను సైతం పెరుగుతో కలిపి తినకపోవడమే మంచిదని వైద్యులు చెప్తుంటారు. చదవండి: సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయొద్దా? -
రక్తపోటును తగ్గించే పెరుగు!
మనం తోడేసిన పాలు పెరుగుగా మారడానికి మనకు మేలు చేసే ఒక రకం బ్యాక్టీరియానే అన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పుష్కలంగా ఉన్న పదార్థాలను ‘ప్రోబయాటిక్’ ఉత్పాదనలుగా మార్కెట్లో అమ్ముతున్న విషయమూ మనకు కొత్త కాదు. ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయన్న విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కొద్దికాలం కిందట ఒక అధ్యయనంలో తెలుసుకున్నారు. ఈ సంగతి ఆస్ట్రేలియా నుంచి వెలువడే హెల్త్ జర్నల్ ‘హైపర్టెన్షన్’లోనూ ప్రచురితమైంది. ఒకవేళ మీకు హైబీపీ లేకపోయినా పరవాలేదు. పెరుగూ, ఒకింత పులిసిన అట్ల వంటి టిఫిన్లు పుష్కలంగా తీసుకుంటూ ఉంటే ఇందులోని ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రక్తపోటును చాలావరకు నివారిస్తుంది. ఫలితంగా గుండెజబ్బులూ, పక్షవాతం ప్రమాదాలూ చాలావరకు నివారించుకోవచ్చు. -
మ్యాగీ విత్ పెరుగు ట్రై చేశారా?!
మ్యాగీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి ఫేవరెట్ ఫుడ్ ఐటం. చాలా వరకు ఊరికే నీటిలో వేసి ఉడికించుకుని తింటారు. కొందరు మాత్రం పోపు వేసి కూరగాయలతో కలిపి వండితే.. మరి కొందరు ఎగ్, చికెన్తో ట్రై చేస్తారు. కానీ మ్యాగీని పెరుగతో ఎప్పుడైనా తిన్నారా. పేరు వినగానే ముఖం అదోలా మారిపోయింది కదా. చాలా మంది అస్సలు వినడానికి, ట్రై చేయడానికి ఇష్టపడని ఈ కాంబినేషన్ని ఓ యువతి నిజం చేసి చూసింది. మ్యాగీలో పెరుగు వేసుకుని తిన్నది. ‘మ్యాగీ అండ్ కర్డ్ ఇజ్ ఫుడ్ ఫర్ ద సౌల్’ పేరుతో ట్విట్టర్లో మ్యాగీలో పెరుగు కలిపిన ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజనుల్లో ఎక్కువ మంది ‘ఏం టెస్ట్ తల్లి .. ఇంత చండాలంగా ఉంది’.. ‘మ్యాగీ మీద విరక్తి పుట్టించావ్గా’.. ‘అసాధ్యాన్ని సాధ్యం చేశావ్గా’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘అద్భుతం’.. ‘టేస్ట్ కోసం దానిలో మయోన్నైస్ కలపండి’ అంటూ సూచనలు చేస్తున్నారు. (చదవండి: నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది) Maggi and curd is food for the soul ❤️ pic.twitter.com/RmNRVRvnfw — Felon Mask (@acnymph) November 16, 2020 గతేడాది ఓ యువతి పాలు, గులాబీ రెక్కలతో స్వీట్ మ్యాగీ తయారు చేసింది. "చాక్లెట్ మ్యాగీ", "మ్యాగీ పానీపూరి" అనే విభిన్న వంటకాలు భోజన ప్రియులకు వికారం కలిగించిన విషయం తెలిసిందే. ఇవేకాక రసగుల్లా బిర్యానీ, చాక్లెట్ చికెన్ వంటి వింత వంటకాలు వైరలయిన సంగతి తెలిసిందే. -
జుట్టు రాలుతుందా? అయితే ఇది ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో జట్టు రాలడం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ జుట్టు తెల్లబడటం, ఎక్కువగా రాలిపోవడం, దురద, చుండ్రు లాంటి అనేక సమస్యలకు పెరుగు చాలా చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వేలకు వేలు పోసి జుట్టుపై కెమికల్స్ ప్రయోగించినా ఎలాంటి ఫలితం ఉండకపోగా దీర్ఘకాలిక సమస్యలు, సైడ్ ఎఫెక్స్ వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పెరుగులోని ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే పెరుగులో ఉండే జింక్, బయోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. (సరస్సులో సినిమా) మన శరీర దృఢత్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అంతే పోషకాలు అవసరం. పెరుగులో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమగా, మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా తలస్నానం చేశాక జుట్టుకు కండీషనింగ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగు గొప్ప కండీషనర్గా పని చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం వీకెండ్స్లో పార్లర్లు, స్పాలకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్రయత్నించి ఆరోగమైన కురులకు వెల్కమ్ చెప్పేయండి. (‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) -
సాగనివ్వకండి బ్యూటిప్
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై చర్మం సాగుతుంటుంది. దాంతో మనసు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తున్నా, ఎదుటి వారికి మాత్రం ముడతలను చూడగానే మీ వయసు ఇట్టే తెలిసి పోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100 శాతం నేచురల్ ట్రీట్మెంట్. 5–6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి. గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్ఫూన్ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి. బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీ పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20–30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. -
శాంసంగ్ కొత్త ఫ్రిజ్లు, ప్రపంచంలోనే మొదటివి
సాక్షి, ఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తాజాగా కొత్త రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. పెరుగు తోడుపెట్టే బాదరబందీ లేకుండా చేసే 'కర్డ్ మేస్ట్రో' ఫ్రిజ్ కూడా వీటిలో ఉంది. పాలు..పెరుగుగా మారడంలో కీలకమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఆటోమేటిక్గా నిర్వహించే టెక్నాలజీని శాంసంగ్ ఈ ఫ్రిజ్లో పొందుపర్చింది. ఇందుకోసం ఫ్రిజ్లో ప్రత్యేక అర ఉంటుంది. అయిదు నుంచి ఆరు గంటల్లో పెరుగు సిద్ధమవుతుందని సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ తరహా మొట్టమొదటి ఫ్రిజ్ ఇదేనని పేర్కొంది. 244 లీ. నుంచి 336 లీ. దాకా సామర్ధ్యముండే కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్ల ధరల శ్రేణి రూ. 30,990 నుంచి రూ. 45,990 దాకా ఉంటుంది. మరోవైపు, 2020 ఏడాదికి సంబంధించి ప్రవేశపెట్టిన ఇతర ఫ్రిజ్ల ధరల శ్రేణి రూ. 17,990 నుంచి రూ. 45,990 దాకా ఉందని శాంసంగ్ తెలిపింది. -
ముఖమా! ముత్యమా!
మార్చి, ఏప్రిల్, మే.. మూడు నెలలు ఎండలు దంచి కొట్టాయి. రోట్లో స్వయానా మనమే ఎండు మిరపకాయలు దంచి కొట్టినా ఇంతగా మంటెత్తిపోదేమో. ప్రచండుడు ప్రతాపం చూపించాడు. రెండు మూడు రోజుల్లో రుతు ³వనాలు అంటున్నారు. వానలే వానలు. సంతోషమే కదా. భూమి చల్లబడుతుంది. మన ఇళ్లూ, ఒళ్లూ చల్లబడతాయి. అయితే ఇన్నాళ్లూ ఎండలకు ఛాయ తగ్గిన మోము మాటేమిటి? మెల్లిగా మునుపటి మెరుపులోకి తెచ్చుకోవలసిందే. అయితే అందుకోసం గొడుగు వేసుకుని సూపర్ బజార్కి పరుగెత్తే పని లేదు. ఇంట్లో ఉండి, ఇంట్లో ఉండేవాటితో ముఖ కాంతిని చల్లని చంద్రకాంతిలా వెలిగించుకోవచ్చు. ‘ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్’ అంటున్నారా.. ఇంటి క్రీమ్లు అనగానే! క్రీమ్లు కావివి. కీర దోసకాయలు, బేసన్ ఫ్లోర్.. (సెనగపిండి), పసుపు, పెరుగు, తేనె, నిమ్మ, పాలు. అంతే! అన్నిటినీ కలిపి ముఖానికి టచింగ్ ఇవ్వమనడం లేదు. కాంబినేషన్లతో మూడు రకాలుగా ప్రయోగిస్తే చాలు. వా..డా..య్.. అంటూ మీ ముఖంలోకి కాటుక లేని అందమైన చంద్రముఖి వచ్చేస్తుంది. దోస్కాయ్ తీస్కోండి దోసంటే కీర దోస. రౌండ్గా చక్రాల్లా కొయ్యండి. రౌండ్గా ఎలా కొయ్యాల్రా దేవుడా అని కంగారు పడకండి. కళ్లు మూసుకుని కోసినా.. కీర చక్రాలు చక్రాలుగానే వస్తుంది. ఆ చక్రాలను కళ్ల మీద పెట్టుకోనవసరం లేదు. మెల్లిగా ముఖమంతా రుద్దండి. ఒకే చక్రాన్ని కాదు. ముఖానికంతటికీ చాలినన్ని చక్రాలు. ఇప్పుడు ముఖమంతా కీరా అయింది కదా. అదే.. కీరా రుద్దడంతో తడితడిగా అయింది కదా. ఆ తడిని పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయండి. వెంటనే మెరిసిపోతుందా ముఖం?! మెరుపు కనిపిస్తుంది.. మంచి మెరుపు కోసం వారానికి రెండుసార్లైనా కీరాను కొయ్యాల్సిందే. సెనగ ప్యాక్ వేస్కోండి కీరాతో రుద్ది కడిగాక సెనగ ప్యాక్ వెయ్యమని కాదు. అది వేరు. ఇది వేరు. ఇదింకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనే మాట బాగోలేదా! అయితే సౌందర్యసాధనం అందాం. రెండు టేబుల్స్పూన్ల సెనగ పిండి తీసుకోండి. బజ్జీలు వేసే సెనగపిండే. ఇక రెండు టేబుల్స్పూన్లంటే రెండు రెండు చిన్న కూరగరిటెలంత. టీస్పూన్ లెక్క వేరు. కాఫీని, టీని కలపడానికి ఉపయోగించే స్పూన్ టీస్పూన్. సరే, ఇవి మీకు తెలియనివా కానీ, ఇప్పుడేం చేస్తారంటే సెనగపిండిలో టీ స్పూను పసుప్పొడి కలపండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వెయ్యండి.మూడింటినీ మిక్స్ చెయ్యండి. బాగా పేస్ట్లా వచ్చేయాలి. ఆ పేస్ట్ని బ్రష్తో ముఖానికికంతటికీ అద్దండి. మళ్లీ ఈ బ్రెష్ ఎక్కడి నుంచి తేవాలి! ఫేస్ప్యాక్ బ్రెష్ అని బయట అమ్ముతారు కానీ.. అక్కర్లేదు, వేళ్లతో మృదువుగా ముఖానికి పామేయండి. అదంతా ఆరిపోయేవరకు ఆగి, ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి. చల్లని నీళ్లతోనే. ముఖం తళతళ. మార్పు ఇమ్మీడియెట్గా కనిపిస్తుంది. తేనె, నిమ్మ రాస్కోండి రెండు చిన్నగరిటెల తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. మంచి వాసనొస్తుంది. తినబుద్ధవుతుంది. తినకండి. మనం పెట్టుకున్న పని వేరే కదా. ఆ సెషన్ (తినే సెషన్) మరోసారెప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడైతే ముఖానికి పూసుకోండి. పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.ఈ మూడు ట్రిక్లలో (మీ ముఖం ఎలా ఇంతగా మెరిసిపోతుంది అని అడిగినవారికి చెప్పకపోతే అది ట్రిక్కే కదా).. ‘చల్లటి నీరు’ అనే మాట కనిపించింది కదా. చల్లటి నీరు అంటే ఫ్రిజ్లోని వాటర్ కాదు. ముఖానికి హాయినిచ్చేంత చల్లగా ఉండే నీరు. ఎటూ వర్షాలు మొదలై వాతావరణ చల్లబడబోతోంది కాబట్టి ట్యాంకులోని నీళ్లు, తొట్లలోని నీళ్లు, బిందెల్లోని నీళ్లు చల్లగానే ఉంటాయి. అవి చాలు. ఓ మగ్గు నీటితో మెరిసేయొచ్చు.. ఒకవేళ వర్షాలొచ్చినా.. మీ కాలనీలో నీళ్లు రాకపోతుంటే.గుర్తుంచుకోండి.. ఈ మూడు ఒకేసారి, ఒకే రోజు చేయవలసినవి కాదు. మీ మూడ్ని బట్టి, మీ టైమ్ని బట్టి, కిచెన్లో మీకు అందుబాటులో ఉన్నవాటిని బట్టి ఏదో ఒకటి ఎంచుకుని చెయ్యండి. ఇంకో రోజు ఇంకోటి.. తర్వాత ఇంకోటి.. ఇలా!వెలిగిపోతున్న మీ ముఖాన్ని చేసి, అంత కాంతిని భరించలేక సూర్యుడే తన కళ్లకు చెయ్యడ్డు పెట్టకోవాలి. దెబ్బకు దెబ్బ తియ్యకుండా ఊరుకుంటామా మరి. -
ప్రత్యేకంగా మెరవాలంటే...
ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు ఖరీదైన ఫేస్క్రీమ్స్ వాడుతుంటారు చాలా మంది. మామూలు రోజుల్లో కూడా ప్రత్యేకంగా కనిపించాలంటే సహజసిద్ధమైన చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు పైపై పూతలు పూసుకునేకంటే... శాశ్వతంగా తొలగిపోయేందుకు ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆరెంజ్ జ్యూస్ – 3 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, గడ్డపెరుగు – 1 టీ స్పూన్ మాస్క్: ఖర్జూరం – 2(గింజలు తొలగించాలి), తేనె – 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం – పావు టీ స్పూన్. తయారీ : ముందుగా ఆరెంజ్ జ్యూస్, చిక్కటి పాలు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, గడ్డపెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం, తేనె, నిమ్మరసం కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఎండ పెరుగుతోందా!
పరీక్షల సీజన్... ఎండల సీజన్ ఒకేసారి రాబోతున్నాయి.పరీక్షలకి ప్రిపేర్ అయినట్టే... ఎండలకీ ప్రిపేర్ అవ్వాలి.వట్టివేర్ల తెరలు కట్టుకోవడం, కూల్సెమ్ పెయింట్ రూఫ్కు వేసుకోవడం,కూలర్లు రెడీ చేసుకోవడం లాంటి ఏర్పాట్లతో పాటు శరీరం, ఉదరం చల్లగా ఉండటానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి.పెరిగే ఎండకు పెరుగును మించిన విరుగుడు లేదు.వీటిని నేర్చుకోండి... ఎండకు చూపుడు వేలు ఆడించండి. దహీ పూరీ కావలసినవి: పానీ పూరీలు – 6; ఉప్పు – తగినంత; కారం – తగినంత; జీలకర్ర పొడి – అర టీ స్పూను; బంగాదుంపలు – 2; బఠాణీలు – అర కప్పు; గ్రీన్ చట్నీ – కొద్దిగా; ఖట్టామీఠా చట్నీ కొద్దిగా; సన్న కారప్పూస – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; నల్ల ఉప్పు – చిటికెడు; తరిగిన టొమాటో – 1; తరిగిన ఉల్లిపాయ – 1. తయారీ: పెరుగులో కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి మెదపాలి ►బఠాణీని ఉడికించాలి. ►ఒక పాత్రలో ఉడికించిన బంగాళ దుంపలు, ఉడికించిన బఠాణీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలిపి పక్కన ఉంచాలి. ►ఒకప్లేట్లో పానీ పూరీలను ఉంచి, మధ్యలో చిన్నగా రంధ్రం చేయాలి. ►సిద్ధం చేసుకున్న బంగాళ దుంప మిశ్రమం కొద్దికొద్దిగా ఉంచాలి. ►ముందుగా టేబుల్ స్పూను పెరుగు ఒక్కో పూరీ మీద వేయాలి. ►ఖట్టామీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లి తరుగు, కారప్పూస ఒక దానిమీద ఒకటి వేయాలి. ►చివరగా మళ్లీ పెరుగు వేసి అందించాలి (వెంటనే తినేయాలి) గుజరాతీకడీ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి. ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి. ►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి. ►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. దహీ కే కబాబ్ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి ►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. దహీ ఆలూ టిక్కీ చాట్ కావలసినవి: బంగాళదుంపలు – 2 (మీడియం సైజువి); మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. టాపింగ్ కోసం: పెరుగు – అర కప్పు; చింతపండు స్వీట్ చట్నీ – తగినంత; గ్రీన్ చట్నీ – తగినంత; చాట్ మసాలా – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – తగినంత. తయారీ: బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి చేతితో మెదిపి ఒక పాత్రలో ఉంచాలి ►మిరప కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్, ఉప్పు జత చేసి కలపాలి ►గుండ్రంగా టిక్కీల మాదిరిగా చేతితో ఒత్తాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఒత్తి ఉంచుకున్న టిక్కీలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►గ్రీన్ చట్నీ, స్వీట్ చింతపండు చట్నీలు పైన వేసి, కొత్తి మీరతో అలంకరించి వెంటనే అందించాలి. పంజాబీ కడీ పకోరా కావలసినవి: గడ్డపెరుగు – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 3 కప్పులు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 8 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. ఆనియన్ పకోరా కోసం: ఉల్లి తరుగు – ఒక కప్పు (సన్నగా పొడవుగా తరగాలి); సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని. పంజాబీ కడీ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టే బుల్ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ఒక పాత్రలో పెరుగు పోసి బాగా గిలకొట్టాలి ∙సెనగ పిండి, మిరప కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు జత చేసి, అన్నీ బాగా కలిసేలా కలపాలి ∙నీళ్లు జత చేసి, ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచాలి. ఆనియన్ పకోరా తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, వాము, మిరప కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి ►ఉల్లి తరుగు జత చేసి (ఉల్లి తరుగు నుంచి తగినంత నీరు వస్తుంది కనుక నీళ్లు జతచేయనక్కరలేదు. అవసరమనుకుంటే కొద్దిగా జత చేస్తే చాలు) ►బాగా కలిపి, మూత పెట్టి సుమారు గంటసేపు పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా నూనెలో వేసి వేయించాలి ►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకుని పక్కన ఉంచాలి. కడీ తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ►అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►పెరుగు మిశ్రమం జత చే సి, మిశ్రమం బాగా చిక్కబడే వరకు కలుపుతుండాలి ►కొద్దిగా వేడి నీళ్లు జత చేయాలి ►ఆనియన్ పకోరాలు వేసి కలపాలి ►గరం మసాలా పొడి చల్లి, బాగా కలియబెట్టి, దింపేసి మూత పెట్టాలి ►అన్నం, లేదా జీరా రైస్లలో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది. -
ఆరోగ్యానికి తోడు
గడ్డపెరుగు చూశాక ఎప్పుడెప్పుడు భోజనం చివరికొస్తుందా... ఒకింత ఎక్కువ పెరుగన్నం తినేద్దామా అని అనుకోని వారుండరు. కొందరికైతే అసలు పెరుగు తినకుండా భోజనం పూర్తయిన ఫీలింగే ఉండదు. పైగా చలికాలం ముగింపునకొస్తూ... వేసవిలోకి ప్రవేశించబోతున్న ఈ తరుణంలో శీతాకాలం తాత్కాలికంగా పెరుగు తిననివారు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రపడే పెరుగు కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. వాటిలో ఇవి కొన్ని... మన జీర్ణవ్యవస్థ పొడవునా మనకు మేలు చేసే బ్యాక్టీరియా కోటానుకోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటినే ప్రోబయోటిక్స్ అంటారు. పెరుగు నిండా మనకు మేలు చేసే బ్యాక్టీరియా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూస్తుంది. అంతేకాదు... కడుపులో మంటను తగ్గిస్తుంది.పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ కలుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ వేసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. రోజూ పెరుగు తినేవారికి మేనిలో మంచి నిగారింపు వస్తుంది. చర్మంలో ఎప్పుడూ తేమ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందంటున్నారు ఆహార నిపుణులు. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31శాతం తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సెంటిఫిక్ సెషన్స్లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మహిళల్లో పెరిగే... హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్నం మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. చివరగా చిన్నమాట... గడ్డపెరుగు చూశాక టెంప్ట్ అయి వేసుకున్నా... కనీసం చెంచా నీళ్లయినా అందులో కలుపుకుంటే మంచిదనీ, అది వాతాన్ని హరిస్తుందన్నది పెద్దల మాట. నమ్మితే ఆచరించండి. నమ్మకపోతే రుచిని ఆస్వాదించండి. ఎందుకంటే పెరుగులో కీడు చేసే అంశం దాదాపుగా లేనే లేదు. -
పెరుగుతో జలుబు దూరం!
టెక్సాస్: పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే జలుబు చేసినప్పుడు ఎక్కువ అవుతుందని చాలామంది పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ పెరుగు జలుబు లక్షణాలను తగ్గిస్తుందని అమెరికాలోని నేషనల్ డైరీ కౌన్సిల్లోని న్యూట్రీషియన్ రీసెర్చి వైస్ ప్రెసిడెంట్ మైకీ రుబిన్ తెలిపారు. పెరుగులో ఉండే జింక్, ప్రోబయాటిక్స్లు జలుబును నియంత్రించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు. -
పెరుగు... ఎండ విరుగు
వెళ్లేదేది ఊరికే వెళ్లదు. ఎండలు వెళ్లే ముందు చివరి ప్రతాపం చూపబోతున్నాయి. ఆరోగ్యాన్ని హడలగొట్టబోతున్నాయి. భయం లేదు. పెరుగు ఉంది. పెరుగుతో చేసిన పదార్థం ఉంది. పెరుగుట.. ఎండ విరుగుట కొరకే. దహీ ఆలూ కర్రీ కావలసినవి: బంగాళ దుంపలు – పావు కేజీ; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; పుల్ల పెరుగు – 100 గ్రా.; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; లవంగాలు – 5; బిరియానీ ఆకు – 3; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; గరం మసాలా – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – గ్లాసుడు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙ముందుగా ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, పెరుగు వేసి చిక్కగా గిలకొట్టాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, జీలకర్ర, లవంగాలు, బిరియానీ ఆకు వేసి కలపాలి గరం మసాలా, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలిపి నీళ్లు పోసి మరోమారు కలపాలి ∙చిక్కగా చేసుకున్న మజ్జిగ వేసి బాగా కలియబెట్టాలి ∙ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళ దుంప ముక్కలు వేసి కలిపి, చిన్న పాత్రలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించి అందించాలి. గుజరాతీ కడీ కావలసినవి: సెనగ పిండి – రెండు టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 కప్పులు; పుల్ల పెరుగు – 2 కప్పులు; ఉప్పు – తగినంత; పంచదార – ఒక టేబుల్ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా మధ్యకు కట్ చేయాలి); అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; పోపు కోసం... నూన – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో పెరుగు, నీళ్లు, సెనగ పిండి వేసి చిక్కటి మిశ్రమంలా అయ్యేవరకు గిలకొట్టాలి ∙ఈ మిశ్రమానికి ఉప్పు, పంచదార, పసుపు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి, నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి, మరుగుతున్న కడీలో వేసి బాగా కలిపి, కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి ∙అన్నం లేదా కిచిడీలోకి రుచిగా ఉంటుంది. అవిసె గింజల రైతా కావలసినవి: అవిసె గింజలు – ఒక టేబుల్ స్పూను (నూనె లేకుండా వేయించి పొడి చేసి వాడాలి); సొరకాయ తురుము – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – అర కప్పు; జీలకర్ర పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, సొరకాయ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి నాలుగు నిముషాలు ఉడికించి దించేయాలి. ∙ఒక పెద్ద పాత్రలో మిగిలిన పదార్థాలను వేసి బాగా కలిపి, ఉడికించుకున్న సొరకాయ తురుము జత చేసి కొద్దిసేపు ఫ్రిజ్లో ఉంచి చల్లగా అందించాలి. క్యారెట్ పెరుగు కట్లెట్ కావలసినవి: కోడిగుడ్లు – 4 (బ్లెండర్లో వేసి గిలకొట్టాలి) క్యారెట్లు – 8 (మీడియం సైజువి, తొక్క తీసి తురమాలి) కొత్తిమీర తరుగు – పావు కప్పుసెనగ పిండి – పావు కప్పుఉప్పు – తగినంతమిరియాల పొడి – కొద్దిగాఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లుగట్టి పెరుగు – ఒక కప్పునిమ్మ రసం – ఒక టేబుల్ స్పూనుఉప్పు – కొద్దిగా తయారీ: ∙ఒక పాత్రలో గిలకొట్టిన కోడిగుడ్డు సొన, క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, సెనగపిండి వేసి గరిటె జారుగా కలపాలి. ∙స్టౌ మీద పాన్ ఉంచి వేడయ్యాక, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి పాన్ అంతా పట్టేలా గరిటెతో పరవాలి. ∙అర కప్పు క్యారట్ మిశ్రమాన్ని పెనం మీద పాన్ కేక్ మాదిరిగా మందంగా సరిచేయాలి. ∙బాగా కాలి బంగారు రంగులోకి వచ్చే వరకు సుమారు మూడు నిమిషాలు ముందుకు వెనుకకు తిప్పి ప్లేటులోకి తీసుకోవాలి. ∙ఒక పాత్రలో పెరుగు వేసి బాగా గిలకొట్టి, ఉప్పు, మిరియాల పొడి జత చేసి బాగా కలిపి, నిమ్మ రసం జత చేయాలి. ∙చిన్న బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి, పెరుగులో వేయాలి. ∙తయారుచేసి ఉంచుకున్న క్యారెట్ పాన్కేక్లను ప్లేట్లో ఉంచి, అందించే ముందు తయారుచేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని పాన్కేక్ల మీద వేసి అందించాలి. పెరుగు స్మూతీ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; అరటి పండు – ఒకటి; ఏలకుల పొడి – చిటికెడు ; పంచదార – మూడు టీ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; జీడిపప్పు పలుకులు – తగినన్ని తయారీ: ∙ముందుగా అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ∙పంచదార, పెరుగు జత చేసి మరోమారు మిక్సీ పట్టి. గ్లాసులోకి తీసుకుని ఫ్రిజ్లో కొద్దిసేపు ఉంచి తీసేయాలి. ∙కుంకుమ పువ్వు, జీడిపప్పు పలుకులు జత చేసి చల్లగా అందించాలి. పెరుగు – ప్రయోజనాలు పాలను బాగా కాచి, చల్లార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు, కొంచెం చిక్కని మజ్జిగను కలిపి (తోడు వేసి), నాలుగైదు గంటల పాటు కదపకుండా ఉంచితే అది పెరుగుగా మారుతుంది. వాస్తవానికి పాలు శరీరానికి చలవ (శీత వీర్యం) చేస్తాయి. కాని పెరుగు (దధి) వేడి (ఉష్ణవీర్యం) చేస్తుంది. ఆవు, గేదె, మేకల పాలు మనకి సాధారణంగా లభిస్తుంటాయి. దాదాపు అన్ని జంతువుల పాలూ శీత వీర్యమే. ఒక్క... గుర్రం, గొర్రె పాలు మాత్రం ఉష్ణ వీర్యం. రుచిని బట్టి పెరుగును ఐదు రకాలుగా విభజించింది ఆయుర్వేదం... 1. మందం: పూర్తిగా తోడుకునే ముందు కొంచెం చప్పగా తియ్యగా ఉంటుంది. 2. స్వాదు: పూర్తిగా తోడుకొని తియ్యగా ఉంటుంది. 3. స్వాద్యమ్లం: కించిత్ పులుపు కలిగి తోడుకుంటుంది. 4. ఆమ్లం: పుల్లగా తోడుకుంటుంది. 5. అత్యమ్లం: పులుపు అధికంగా ఉంటుంది. గుణకర్మలు: ‘మందం’ మలమూత్రాలను సాఫీ చేస్తుంది. కాని శరీరానికి వేడి చేస్తుంది. ‘స్వాదు’ స్రోతస్సులతో అవరోధం కలుగచేస్తుంది. (దీనికి ‘అభిష్యంది’ అని పేరు). రక్తస్రావాన్ని అరికడుతుంది. శుక్రవర్ధకమై శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. కఫాన్ని, కొవ్వు (మేదస్సు) ను పెంచుతుంది. బలకరమై నరాలకు శక్తినిస్తుంది. పెరుగు రుచి పులుపుగా మారుతున్నకొద్దీ‘అగ్నిదీప్తి’ (ఆకలి) ని పెంచుతుంది. కాని పిత్త ప్రకోపాన్ని చేస్తుంది. అంటే కంఠం, కళ్లు మండటం, పళ్లు లాగటం, రక్తవికారం కలిగి రక్తస్రావం అధికం అవుతుంది. ఆవు పెరుగు గుణాలు: గవ్యం దధి విశేషేణ స్వాద్యమ్లంచ రుచిప్రదంపవిత్రం దీపనం హృద్యం పుష్టికృత్, పవనాపహం‘‘ఉక్తం దధ్నామ శేషాణాం మధ్యే గవ్యం గుణాధికం ‘‘(భావప్రకాశ సంహితా)కొంచెం పులుపు, ఎక్కువ తీపి కలిగిన రుచితో ఉండి, ఆకలిని పెంచి, ధాతుపుష్టిని కలిగించి గుండెకు కూడా శక్తిని ఇస్తుంది. నాడీ వ్యవస్థను పటిష్ఠ పరుస్తుంది. (వాతహరం) అందువల్ల∙ఇది చాలా ‘పవిత్ర’మని చెప్పబడింది. గేదె పెరుగు: ఇది చాలా చిక్కగా ఉండటం వలన దీనిని బరువైన ఆహారంగా చెప్పారు. శుక్రవర్థకం, కఫకరం, అభిష్యంది, రక్తాన్ని దూషిస్తుంది. మేక పెరుగు: అజం దధి ఉత్తమం గ్రాహీ లఘు దోష త్రయాపహ‘శశ్యతే శ్వాసకాసార్శః క్షయకార్మ్యేషు దీపనం‘‘ఇది శరీరానికి చాలా మంచిది. తేలికగా జీర్ణం అవుతుంది. నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. ఆకలిని పెంచి కృశత్వాన్ని తగ్గించడం ద్వారా కావలసిన బరువును పెంచుతుంది. త్రిదోష హరం. దగ్గు, ఆయాసం, పైల్స్ (మూల శంక), క్షయ రోగాలను తగ్గించడానికి దోహదపడుతుంది.1. పాల మీద మీగడను తొలగించి లభించే ద్రవాన్ని సంస్కృతంలో ‘మస్తు’ అంటారు. ఇది నీరసాన్ని తగ్గిస్తుంది. లఘువు, బలకరం, రుచికరం. దాహాన్ని పోగొడుతుంది. పంచేంద్రియాలకు ప్రసన్నత కలిగిస్తుంది. మృదు విరేచనకరం. బరువును కూడా తగ్గిస్తుంది. పెరుగును సేవించడానికి నిషేధ కాలం... రాత్రిపూట పెరుగు తినకూడదు (రాత్రౌ దధి న భుంజీత). ఒకవేళ తినాలనుకుంటే కొద్దిగా నెయ్యి కాని, పంచదార కాని కలిపి తినాలి. పెరుగును వేడి చేసి తినకూడదు. శరత్, వసంత, గ్రీష్మ ఋతువులలో పెరుగును ఎక్కువగా తినకూడదు. చాలా కొద్దిగా తినొచ్చు. మజ్జిగ (తక్రం) ఎక్కువగా తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకోవడం వలన అనర్థాలు: పైన చెప్పిన గుణధర్మాలను విడిచిపెట్టి, క్రమశిక్షణ రహితంగా పెరుగును అతిగా సేవిస్తే, ‘జ్వరం, చర్మరోగాలు, రక్తస్రావం, తల తిరగడం (భ్రమ), రక్తహీనత (పాండు రోగం), కామలా (పచ్చ కామెర్లు) మధుమేహం వ్యాధులకు దారితీయొచ్చు. – డా. వృద్ధుల లక్ష్మీ నరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకు లకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail : familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా : సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34. -
ఇంటిప్స్
►గ్రేవీ చిక్కగా రావాలంటే, కొద్దిగా కొబ్బరి పాలు లేదా గిలక్కొట్టిన పెరుగు వేసుకోవచ్చు ►కూరలో నూనె ఎక్కువైతే, రెండు బ్రెడ్స్లైసుల్ని పొడిలా చేసి అందులో వేస్తే సరి. ►బంగాళదుంపల వేపుడు కరకరలాడేలా ఉండాలంటే, ముక్కలు తరిగాక అరగంటసేపు చల్లని నీళ్లలో ఉంచి ఆ తరవాత వేయించాలి. ►బాదం పప్పులు ఉంచిన డబ్బాలో ఒక గుప్పెడు పంచదార, రెండు లవంగాలు వేస్తే పురుగు పట్టకుండా తాజాగా ఉంటాయి. ►బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే చిటికెడు పసుపు, చెంచాడు వేరుసెనగనూనె కలపాలి. ►ఉల్లిపాయల్ని వేపుడులో వాడటానికి ముందు కొద్దిసేపు పాలలో నాననిస్తే, పదార్థాలకి మరింత రుచి వస్తుంది. ►నెయ్యి తాజాగా ఉండాలంటే గిన్నె అడుగున చిన్న బెల్లం ముక్క వేస్తే సరి. ►కూరల్లో వెల్లుల్లి వేయాలనుకుంటే, ముందు వాటిని దోర గా వేయించి వాడాలి. అప్పడు పదార్థాలకు మంచి రుచి వస్తుంది. గాఢమైన వాసన లేకుండా ఉంటుంది. ►రసం తీసిన నిమ్మచెక్కలను పారేయకుండా, ఉడికించి ఆ నీళ్లలో స్పాంజిని ముంచి స్టౌవ్లు, స్టీలు సామాన్లను తుడిస్తే త్వరగా శుభ్రపడతాయి. ►లంచ్ బాక్సులను కడిగి తుడిచి కాస్త వంటసోడా వేసి మూతపెడితే, ఆహార పదార్థాల తాలూకు దుర్వాసన రాకుండా ఉంటుంది. -
చర్మం నిగారింపు కోసం...
బ్యూటిప్స్ క్యారట్, సగం బీట్రూట్ ముక్క, చిన్న టొమాటో అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేయాలి. దీంట్లో పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. టీ స్పూన్ గడ్డ పెరుగులో పావు టీ స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత కడిగేయాలి.అర టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ పాలలో వేసి పది నిమిషాలు నానబెట్టి, పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మూడు నాలుగు జీడిపప్పులను పొడి చేయాలి. ఈ పొడిలో పచ్చిపాలను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. అర టీ స్పూన్ ఆవాల నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుని వలయాకారంలో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది. నాలుగు బాదం పలుకులను పొడి చేయాలి. దీంట్లో టీ స్పూన్ రోజ్ వాటర్, టీ స్పూన్ పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్లతో వలయాకారంలో పది నిమిషాల పాటు మర్దనా చేసి, అయిదు నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసి, పొడిగా తుడిచిన తరవాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేయడం వలన చర్మం నునుపవుతుంది -
ఏకదంతుడికి శతకలశ క్షీరాభిషేకం
–తరలివచ్చిన భక్తజన సమూహం కాణిపాకం(ఐరాల): స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శతకలశ క్షీరాభిషేకం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాకార మండపంలో ఉభయదారులు ఉత్సవమూర్తులకు సాంప్రదాయ బద్ధంగా అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థాన సిబ్బంది, అర్చకులు, వేదపండితులు ఆలయ సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. వారితో పాటు గ్రామస్తులు క్షీర కలశాలను కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ తేనె, నెయ్యి , పెరుగు, పాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి, దూపధీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయాధికారులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ పూర్ణచంద్రారావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు , ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు. -
మహా శివలింగానికి అభిషేకాలు
కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న మహా శివలింగానికి 108 కిలోల పెరుగుతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు గుండేటి రజినీ కుమార్, మార్త ఓంప్రకాష్లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శివలింగానికి అన్నాభిషేకం చేశారు. పూజల్లో కార్పొరేటర్ బయ్యస్వామి, ఆలయ కమిటీ ప్రతినిధులు గోనె జగదీశ్వర్, సంతోష్, బోడకుంట్ల వైకుంఠం, ఓరుగంటి కొమురయ్య, రమేష్, సాంబారి ఉప్పలయ్య, భాస్కర్, కృష్ణమూర్తి, మండల శ్రీరాములు, భక్తులు పాల్గొన్నారు. -
పెరుగుతో బీపీకి చెక్
పరిపరి శోధన పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా పేగులకు రక్షణగా నిలుస్తుందని, పెరుగులోని కాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుందని... ఇలా పెరుగు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే, తరచుగా పెరుగు తీసుకుంటూ ఉంటే, రక్తపోటు కూడా అదుపులోకి వస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. వారానికి కనీసం ఐదుసార్లు పెరుగు తీసుకున్నట్లయితే, రక్తపోటు గణనీయంగా అదుపులోకి వస్తుందని బోస్టన్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 2.40 లక్షల మందిపై విస్తృతంగా నిర్వహించిన పరిశోధనల ద్వారా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు బోస్టన్ పరిశోధకులు చెబుతున్నారు. -
మజ్జిగే... మరింత రుచిగా!
ఫుడ్ n బ్యూటీ కావాల్సినవి: ఒక కప్పు పెరుగు (చిలకాలి), రెండు వెల్లుల్లిరేకలు, రెండు టీస్పూన్ల నిమ్మరసం, రుచికోసం మిరియాల పొడి, ఉప్పు, పుదీనా ఆకులు, మూడు గ్లాసుల నీళ్లు తయారీ విధానం: పెనంలో ఏదైనా ఆయిల్ వేసి వెల్లుల్లి రేకలను ఒక మోస్తరుగా వేయించాలి. దించిన తర్వాత వాటిని చేత్తో చిదమాలి. అందులో నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో వేసి కలపాలి. కాసేపు ఫ్రిజ్లో చల్లబరిచి సర్వ్ చేసే ముందు పుదీనా ఆకులు వేసుకోవాలి. పోషక విలువలు: ఒక గ్లాసు గార్లిక్ బటర్మిల్క్తో 85 క్యాలరీల శక్తి, ఒక గ్రాము ప్రొటీన్, కొవ్వు ఒక గ్రాము, 375 మిల్లీ గ్రాముల సోడియం లభిస్తాయి. -
రెండు గంటల్లో పెరుగు రెడీ!
వాయనం పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు మనకి. మాంచి కూరతో ఫుల్లుగా లాగించినా, చివర్లో రెండు ముద్దలు పెరుగన్నం తినకపోతే తృప్తి ఉండదు. ఆరోగ్యానికి కూడా పెరుగు ఎంతో మంచిది కావడంతో, దాన్ని తప్పక తింటారు అందరూ. అయితే పెరుగు అంత తేలికగా తయారవదు. పాలలో కాసింత పెరుగు వేసి తోడుపెడితే... కొన్ని గంటల తర్వాత పెరుగు రెడీ అవుతుంది. ఎంత అర్జంట్ అయినా చేసేదేమీ ఉండదు. దాంతో చుట్టాలు వచ్చినప్పుడు, ఫంక్షన్లప్పుడూ ఒక్కోసారి ఇబ్బంది కలుగుతుంది. ఆ సమస్యను తీర్చడానికే ఈ యంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఇన్స్టంట్ కర్డ్ మేకర్స్ లేక ఇన్స్టంట్ యోగర్ట్ మేకర్స్ అంటారు. ఐదు వందల నుంచి పది వేల వరకూ రకరకాల ఖరీదుల్లో లభిస్తున్నాయి. కరెంటుతో పని చేసే మెషీన్లో పాలు పోసి, రెండు చెంచాల పెరుగు వేసి మూతపెట్టి, స్విచ్ ఆన్ చేస్తే చాలు... పెరుగు తయారైపోతుంది. పాలు ఎంత పరిమాణంలో ఉన్నా తోడు కోవడానికి పట్టే సమయం రెండే రెండు గంటలు. కొన్ని మేకర్స్లో ఒకే గిన్నె కాకుండా చిన్న చిన్న డబ్బాల మాదిరిగా ఉంటాయి. తోడుకున్న తర్వాత వాటినలాగే ఫ్రిజ్లో పెట్టేసుకోవడానికి అనువుగా ఉండేందుకే ఇలా తయారు చేశారు. సాధారణంగా చలికాలంలో పాలు త్వరగా తోడుకోవు కదా! కానీ ఈ మెషీన్లు చలికాలంలో కూడా రెండు గంటల సమయంలోనే పాలను తోడు పెట్టేస్తాయి. -
పల్లెకు పాలూ..పెరుగు
అరేయ్ చిన్నోడా.. పాల చెంబు అందుకొని బూదమ్మ పెద్దమ్మ ఇంటికెళ్లి పాలు తీసుకురారా.. అదే చేత్తో ఇంకో గిలాస పట్టుకెళ్లి పెరుగు కూడా తీసుకురా... ఇదీ పల్లెల్లో నిన్నామొన్నటివరకు వినిపించిన మాట. ఇటీవల కాలంలో పాడిపరిశ్రమ అభివృద్ధి పేరిట పట్టణాల్లో ఏర్పడ్డ డెయిరీలు పెద్ద ఎత్తున పాలసేకరణ చేపడుతున్నాయి. దీంతో పల్లెల్లో ఉత్పత్తయిన పాలు డెయిరీలకు వెళ్లి.. తిరిగి ప్యాకెట్లలో పల్లెలకు చేరుతున్నాయి. దీంతో పల్లెల్లో పాలకూ పెరుగుకూ కొరత ఏర్పడటంతో పాటు వాటి ధరలు రెట్టింపవుతున్నాయి. -పెద్దపల్లి పెద్దపల్లి : పల్లెల్లోని కిరాణ షాపుల్లో పప్పు, ఉప్పు, అగ్గిపెట్టే, సిగరేట్ ఇవి మాత్రమే అమ్మే వ్యాపారులు ఇప్పుడు పట్టణాల నుంచి పాలప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్నారు. కిరాణషాపుల్లో పాలూ, పెరుగు ప్యాకెట్లను చూసి ఒకనాటి పల్లెజీవనాన్ని తలుచుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఇంటింటికీ ఓపాడి గేదెను పెంచుకొని పొరుగింటివారికి మర్యాదగా పాలూ, పెరుగు, మజ్జిగ ఉచితంగా ఇచ్చేవారు. కాస్త దూరపు బంధువులుగా ఉన్నవారికి మాత్రం సాధారణ ధరకే పాలూ, పెరుగును విక్రయించేవారు. పట్టణాల్లో పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి పర్చడంకోసం ఏర్పాటు చేసిన డెయిరీలతో పల్లెల మర్యాద మాయమవుతోంది. ఇంట్లో ఉన్న చిన్నోడు పాల చెంబు అందుకొని ‘ఆవలివాడ’కెళ్లి పాలుతెచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరు కూడా ఇలా అరలీటర్, లీటర్ పాలు పోసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బజారుకు వెళ్లి కిరాణషాపుల్లో లభించే పాలప్యాకెట్లు తెచ్చి టీ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. రోజుకు లక్షలీటర్లు జిల్లాలో వివిధ పాలకేంద్రాల ద్వారా రోజుకు లక్షలీటర్లపాల సేకరణ కొనసాగుతోంది. విజయ, ప్రియ, తిరుమల డెయిరీలతోపాటు ముల్కనూరు మహిళా స్వకృషి డెయిరీ ఆధ్వర్యంలో పాల సేకరణ ఎక్కువగా జరుగుతోంది. పెద్దపల్లిలోని పాలసేకరణ కేంద్రం ఎనిమిదే ళ్ల క్రితం ప్రారంభించగా అప్పుడు 600 లీటర్లు సేకరించగా ప్రస్తుతం సేకరణ 2,630 లీటర్లకు పెరిగింది. రైతులు ఎక్కువగా పాలసేకరణ కేంద్రానికే పాలు అందించడానికి ఇష్టపడుతుండడంతో ఈ కేంద్రాల వ్యాపారం వర్ధిల్లుతోంది. గంగిగోవుపాలు గరిటడైనా చాలు గంగి గోవుపాలు గరిటడైనా చాలు అన్న పదం సామెతగా మిగిలిపోయే రోజులు వస్తున్నాయి. అప్పుడు మా ఇంట్లో ఆవు ఉండేది అనే జ్ఞాపకాలుగా దేశవాళీ ఆవులు నిలుస్తున్నాయి. రైతులు జెర్సీ ఆవుల పెంపకంపై దృష్టిపెట్టడంతో దేశవాళీ సంపదకు గడ్డురోజులు వచ్చాయి. ప్రభుత్వం సైతం విదేశీ ఆవుల పెంపకానికే రుణాలు ఇచ్చి ప్రోత్సహించడంతో స్థానిక సంపద కనుమరుగవుతోంది. కేవలం పట్టణాల్లో మాత్రమే గోమాతను పూజించే ఒక వర్గం దేశవాళీ ఆవులపై మమకారం చూపుతోంది. అవికూడా ఒకటి రెండు మినహాయిస్తే పెద్దసంఖ్యలో కనిపించడం లేదు. పెద్దకల్వలలో బట్టీ పాలు.. సింగరేణి కాలనీలకు... 30 ఏళ్ల నుంచి పెద్దపల్లి మండలం పెద్దకల్వల పాలబట్టీ నుంచి గోదావరిఖని, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాలకు డబ్బాల ద్వారా పాలు తరలిస్తున్నారు. ఇక్కడి గ్రామంలోని బట్టీ(పొయ్యి)వద్ద కాచి వేడిచేసిన పాలను డబ్బాలతో తీసుకెళ్లి కార్మిక కుటుంబాలకు అందిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం 2 వేల లీటర్ల పాలు ఈ గ్రామం సరఫరా చేసేది. ప్రస్తుతం అవి 200 లీటర్లకు పడిపోయాయి. ప్రతీ ఇంటికి రెండు పాడిగేదెలు ఉండేవని, వాటి సంఖ్య 2వేలకు పైనేనని వ్యాపారం మానేసిన వారు తెలిపారు. ఇప్పుడు ఊరంతా కలిపితే 200 కూడా పాడిగేదెలు లేవని చెప్పాడు. అయినా గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న బట్టీ పాల వ్యాపారాన్ని ఓ కుటుంబం కొనసాగిస్తోంది. చిన్నబోయిన సింగరేణి రైలు ప్రతీ ఉదయం జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొత్తపల్లి, కొలనూర్ రైల్వేస్టేషన్లో ఉదయం సింగరేణి రైలు ఆగిందంటే చాలు పదుల సంఖ్యలో పాలడబ్బాలు కిటికీలకు కొక్కెం వేసి తగిలించేవారు. అలా ప్రతీరోజు కోల్బెల్ట్ ప్రాంతానికి నాలుగైదువేల లీటర్ల పాలు డబ్బాల ద్వారా తీసుకెళ్లేవారు. దాని ద్వారా పదుల సంఖ్యలో కూలీలు, యువకులు పాలవ్యాపారంతో జీవనం సాగించేవారు. ప్రస్తుతం గ్రామాలకు కంపెనీల వాహనాలు రావడంతో రైతులు తమ పాలను డబ్బాలకు పోస్తున్నారు. స్థానికంగా విక్రయించడానికి ఇష్టం చూపకపోవడంతో డెయిరీ సంస్థలు గ్రామాలకు పరుగులు తీస్తున్నాయి.