Devdutt Padikkal
-
CT 2025: కరుణ్ నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు సమయం ఆసన్నమవుతోంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీకి భారత జట్టు ఎంపిక చేసే విషయంలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు సీనియర్ బ్యాట్స్మన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక చర్చనీయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ తన పరుగుల ప్రవాహం తో సెలెక్టర్ల పై ఒత్తిడి పెంచాడు. తాజాగా 24 ఏళ్ళ ఎడమచేతి వాటం కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ జాబితా లో చేరాడు. బుధవారం విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో హర్యానాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన నిలకడైన బ్యాటింగ్ తో పడిక్కల్ కర్ణాటక జట్టుకి ఫైనల్ బెర్త్ ని ఖాయం చేసాడు. పడిక్కల్ లిస్ట్-‘ఎ’ ఫార్మాట్ లో వరుసగా తన ఏడో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.కాగా హర్యానాతో 238 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక మొదటి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వికెట్ని కోల్పోయింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన నుండి తిరిగి వచ్చిన పడిక్కల్ 86 పరుగులు సాధించడమే కాక స్మరణ్ రవిచంద్రన్ (76 పరుగులు )తో కలిసి మూడో వికెట్కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కర్ణాటక ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.కోహ్లీ రికార్డుని అధిగమించిన పడిక్కల్ఈ ఇన్నింగ్స్ లో భాగంగా పడిక్కల్ లిస్ట్ ఎ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. పడిక్కల్ 82.38 సగటుతో ఈ ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇదే అత్యధికం. మరో భారత్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (58.16), ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బ్యాటర్ మైఖేల్ బెవాన్ (57.86), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (57.05), దక్షిణాఫ్రికాకి చెందిన ఎబి డివిలియర్స్ (53.47) వంటి టాప్ బ్యాటర్ని పడిక్కల్ అధిగమించడం విశేషం.రోహిత్, కోహ్లీలకు మరో ఛాన్స్? ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కి ఎంపిక చేయడం ఖాయంగా కనబడుతోంది. ఆస్ట్రేలియా పిచ్లపై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ లపై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో పరాజయం చవిచూడటమే కాక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుండి కూడా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పై భారత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ పిచ్లు భారత్ బ్యాటర్లకి అనుకూలంగా ఉండే కారణంగా, ఎంతో అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ లను ఛాంపియన్స్ ట్రోఫీ కి తప్పనిసరిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో వీరి ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తునడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
సత్తా చాటిన పడిక్కల్.. ఫైనల్లో కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక ఫైనల్కు చేరింది. నిన్న (జనవరి 15) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు హర్యానాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ అంకిత్ కుమార్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. హిమాన్షు రాణా (44), అనుజ్ థక్రాల్ (23 నాటౌట్), రాహుల్ తెవాటియా (22), సుమిత్ కుమార్ (21), దినేశ్ బనా (20), అమిత్ రాణా (15 నాటౌట్), ఆర్ష్ రంగా (10), నిషాంత్ సంధు (10) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో రెండు, హార్దిక్ రాజ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ మూడు క్యాచ్లు పట్టాడు.238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫీల్డర్గా రాణించిన దేవ్దత్ పడిక్కల్ బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. పడిక్కల్ 113 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 86 పరుగులు చేశాడు. పడిక్కల్కు జతగా స్మరణ్ రవిచంద్రన్ కూడా రాణించాడు. స్మరణ్ 94 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి భీకర ఫామ్లో ఉండిన కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్లో డకౌటయ్యాడు. అనీశ్ 22, కృష్ణణ్ శ్రీజిత్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. శ్రేయస్ గోపాల్ (23 నాటౌట్), అభినవ్ మనోహర్ (2 నాటౌట్) కర్ణాటకను విజయతీరాలకు చేర్చారు. హర్యానా బౌలర్లలో నిషాంత్ సంధు రెండు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్, అమిత్ రాణా, పార్త్ వట్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. వరుసగా రెండో మ్యాచ్లో సత్తా చాటిన పడిక్కల్కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో మ్యాచ్లో సత్తా చాటాడు. సెమీస్కు ముందు క్వార్టర్ ఫైనల్లోనూ పడిక్కల్ ఇరగదీశాడు. బరోడాతో జరిగిన మ్యాచ్లో పడిక్కల్ (102) సూపర్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనకు గానూ పడిక్కల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. హర్యానాతో జరిగిన సెమీస్లోనూ పడిక్కల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మహారాష్ట్రతో విదర్భ 'ఢీ'ఇవాళ జరుగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర, విదర్భ జట్లు ఢీకొంటాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు జనవరి 18న జరిగే ఫైనల్లో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఇంగ్లండ్తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి రెస్ట్!
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణంగా భారత బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పవచ్చు. ఇక ఆటలో గెలుపోటములు సహజం కాబట్టి.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లపై దృష్టి సారించనుంది.ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడిన టీమిండియా స్టార్లలో కొందరు.. స్వదేశంలో అడుగుపెట్టగానే దేశీ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రసిద్ కృష్ణ, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లలో భాగం కానున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్కు విశ్రాంతిఅయితే, కేఎల్ రాహుల్ను కూడా ఈ టోర్నీలో ఆడాలని యాజమాన్యం సూచించగా.. అతడు తనకు విశ్రాంతి కావాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా.. దేవ్దత్ పడిక్కల్ పెర్త్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. నిరాశపరిచిన పడిక్కల్అయితే, తొలి ఇన్నింగ్స్లో డకౌటై పూర్తిగా నిరాశపరిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 25 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత మళ్లీ అతడు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం సంపాదించలేకపోయాడు.వాషీకే పెద్దపీటఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు మాత్రం ఈ సిరీస్లో ప్రాధాన్యం దక్కింది. రవిచంద్రన్ అశ్విన్ను కాదని మరీ.. టీమిండియా మేనేజ్మెంట్ వాషీ వైపు మొగ్గుచూపింది. అందుకు తగ్గట్లుగానే వాషీ రాణించాడు. అవసరమైన వేళ బ్యాట్ ఝులిపించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు ఈ చెన్నై చిన్నోడు.ప్రసిద్ హిట్అయితే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో పాటు పేస్ దళంలో ఆకాశ్ దీప్తో పోటీలో వెనుకబడ్డ ప్రసిద్ కృష్ణకు ఆఖరి టెస్టులో అవకాశం వచ్చింది. సిడ్నీ టెస్టుకు ముందు ఆకాశ్ దీప్ గాయపడిన కారణంగా.. ప్రసిద్కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్లో మొత్తంగా ఆరు వికెట్లు తీసి.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ కర్ణాటక యువ పేసర్.నాకౌట్ మ్యాచ్ల బరిలోఇక పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ తదుపరి ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లపై కూడా కన్నేశారు. సీనియర్లు విశ్రాంతి పేరిట దూరమయ్యే పరిస్థితుల నేపథ్యంలో అవకాశాన్ని ఒడిసిపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లలో ఆడేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాగా గురువారం (జనవరి 9) నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రి క్వార్టర్ పైనల్ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. తమిళనాడు, రాజస్తాన్, హర్యానా, బెంగాల్ ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించాయి. మరోవైపు.. అద్భుత ప్రదర్శనతో టాప్-6లో నిలిచిన గుజరాత్, విదర్భ, కర్ణాటక, బరోడా, మహారాష్ట్ర, పంజాబ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇంగ్లండ్తో ఐదు టీ20లు, మూడు వన్డేలుఈ నేపథ్యంలో తమిళనాడు తరఫున వాషీ, కర్ణాటక తరఫున ప్రసిద్ కృష్ణ, దేవ్దత్ పడిక్కల్ బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్లు జరుగుతాయి.చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’ -
పాపం డేవిడ్ వార్నర్.. ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు..!
నిన్న (నవంబర్ 24) ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 92 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 72 మంది అమ్ముడుపోగా.. 20 మంది అన్ సోల్డ్గా మిగిలారు. అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. పాపం వార్నర్నిన్న జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వార్నర్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తొలి రోజు వేలంలో వార్నర్తో పాటు దేవ్దత్ పడిక్కల్, జానీ బెయిర్స్టో లాంటి పేరు కలిగిన ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిద్దరు కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..!దేవ్దత్ పడిక్కల్ (బేస్ ధర 2 కోట్లు)డేవిడ్ వార్నర్ (2 కోట్లు)జానీ బెయిర్స్టో (2 కోట్లు)వకార్ సలామ్ఖిల్ (ఆఫ్ఘనిస్తాన్, 75 లక్షలు)పియుశ్ చావ్లా (50 లక్షలు)కార్తీక్ త్యాగి (40 లక్షలు)యశ్ ధుల్ (30 లక్షలు)అన్మోల్ప్రీత్ సింగ్ (30 లక్షలు)ఉత్కర్శ్ సింగ్ (30 లక్షలు)లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)ఉపేంద్ర సింగ్ యాదవ్ (30 లక్షలు)శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)కాగా, తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిసి 467.85 కోట్లు ఖర్చు చేశాయి. తొలి రోజు వేలంలో రిషబ్ పంత్కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర.నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్కు లభించింది. శ్రేయస్ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్కు లభించింది. వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్కు భారీ ధర దక్కలేదు. రాహుల్ను ఢిల్లీ కేవలం రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. -
గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో తలమునకలైంది.అయితే, ఈ ఐదు మ్యాచ్ల కీలక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.శుబ్మన్ గిల్ స్థానంలో..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్మన్ గిల్ స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్కు జోడీగా కేఎల్ రాహుల్ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.కేరళకు చెందిన దేవ్దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.ఫస్ట్క్లాస్ కెరీర్లోనూఅయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో దేవ్దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్క్లాస్ కెరీర్లోనూ 24 ఏళ్ల పడిక్కల్కు మంచి రికార్డే ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!ఇప్పటి వరకు 40 మ్యాచ్లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్ను కూడా మిడిలార్డర్లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్కు తోడుగా కేఎల్ రాహుల్ను ఓపెనర్గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.ఓపెనర్గా రాహుల్ బెస్ట్కాగా టీమిండియా తరఫున ఓపెనర్గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు -
Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆసీస్ టార్గెట్?
Australia A vs India A, 1st unofficial Test Day 3: ఆస్ట్రేలియా ‘ఎ’తో మొదటి అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. మెక్కే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలిన రుతురాజ్ సేన.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం పట్టుదలగా నిలబడింది. సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా 312 పరుగులు చేయగలిగింది.సాయి సుదర్శన్ 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం సాధించగా.. దేవ్దత్ పడిక్కల్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 199 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 88 పరుగులు రాబట్టాడు. వీరితో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32) రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.💯 for Sai Sudharsan Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSvIND pic.twitter.com/xIWxfavDFh— cricket.com.au (@cricketcomau) November 2, 2024ఆసీస్ టార్గెట్?ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్లో 312 పరుగులు చేసిన భారత్-ఎ ఓవరాల్గా 224 పరుగుల ఆధిక్యం సాధించింది. తద్వారా ఆసీస్కు 225 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో టీ సమయానికి ఆసీస్ జట్టు 21 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. తన బ్యాటింగ్ తీరుతో జూనియర్ రికీ పాంటింగ్గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కొన్స్టాస్(16) మరోసారి విఫలమయ్యాడు. మార్కస్ హ్యారిస్ 29, కామెరాన్ బాన్క్రాఫ్ట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.First runs for Australia A from Sam Konstas 👀Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSAvINDA pic.twitter.com/an2oO9LPH9— cricket.com.au (@cricketcomau) November 2, 2024తొలి ఇన్నింగ్స్లో మూకుమ్మడిగా విఫలంకాగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 64 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. గురువారం మొదటి రోజు ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ ‘ఎ’ 47.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ఆసీస్ ‘ఎ’ బౌలర్ బ్రెండన్ డగెట్ 6 వికెట్లు తీశాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ‘ఎ’ 62.4 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. ముకేశ్ కుమార్ (6/46), ప్రసిధ్ కృష్ణ (3/59) ఆసీస్ను 136/7 స్కోరు వద్ద కట్టడి చేసినప్పటికీ మర్ఫీ (33), ఓనీల్ (13) ఎనిమిదో వికెట్కు 41 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), అభిమన్యు ఈశ్వరన్ (12) వికెట్లను కోల్పోయింది. ఆ దశలో సుదర్శన్, పడిక్కల్ జట్టును ఒడ్డున పడేసే ఆట ఆడారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్కు 178 పరుగులు జోడించారు. తుదిజట్లుభారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.ఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్స్టాస్, మార్కస్ హ్యారిస్, కామెరాన్ బాన్క్రాఫ్ట్, నాథన్ మెక్స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డగెట్, జోర్డాన్ బకింగ్హామ్.చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IND A vs AUS A: సెంచరీకి చేరువగా సాయి సుదర్శన్
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 107 పరుగులకే ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 208/2గా ఉంది. సాయి సుదర్శన్ (96), దేవ్దత్ పడిక్కల్ (80) క్రీజ్లో ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్ (12), రుతురాజ్ గైక్వాడ్ (5) ఔటయ్యారు. రుతురాజ్ వికెట్ ఫెర్గస్ ఓ నీల్కు దక్కగా.. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 120 ఆధిక్యంలో కొనసాగుతుంది.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మెక్స్వీని (39) టాప్ స్కోరర్గా నిలువగా.. కూపర్ కన్నోలీ 37, వెబ్స్టర్ 33, టాడ్ మర్ఫీ 33, మార్కస్ హ్యారిస్ 17, ఫెర్గస్ ఓనీల్ 13, సామ్ కోన్స్టాస్ 0, బాన్క్రాఫ్ట్ 0, ఫిలిప్ 4, బ్రెండన్ డాగ్గెట్ 8 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డాగ్గెట్ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్ బకింగ్హమ్ రెండు, ఫెర్గస్ ఓనీల్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో దేవ్దత్ పడిక్కల్ (36), నవ్దీప్ సైనీ (23), సాయి సుదర్శన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 0, బాబా ఇంద్రజిత్ 9, ఇషాన్ కిషన్ 4, నితీశ్ రెడ్డి 0, మానవ్ సుతార్ 1, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. కాగా, రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
పడిక్కల్ పోరాటం
సాక్షి అనంతపురం: ఓపెనర్లు ప్రథమ్ సింగ్ (82 బంతుల్లో 59 బ్యాటింగ్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదడంతో భారత్ ‘డి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ‘ఎ’ 28.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆరంభం నుంచి సాధికారికంగా ఆడిన ఈ జంట తొలి వికెట్కు 115 పరుగులు జోడించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగియడానికి ముందు భారత్ ‘డి’ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్లో మయాంక్ ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 288/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ మరో రెండు పరుగులు జోడించి 290 వద్ద ఆలౌటైంది. షమ్స్ ములానీ (187 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జత చేయగలిగాడు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా 4... విద్వత్ కావేరప్ప, అర్‡్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘డి’ 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (124 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 107 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’... రెండో ఇన్నింగ్స్ స్కోరుతో కలుపుకొని ఓవరాల్గా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. పడిక్కల్ ఒక్కడే... భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్లో మిడిలార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (5), అథర్వ (4), యశ్ దూబే (14), రికీ భుయ్ (23), సారాంశ్ జైన్ (8), విఫలమయ్యారు. ఒక ఎండ్లో పడిక్కల్ క్రీజులో పాతుకుపోగా... మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు. సహచరులతో ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా... పడిక్కల్ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సామ్సన్ మరోసారి అంచనాలు అందుకోలేకపోగా... మెరుగైన ఆరంభం దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్... ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో హర్షిత్ రాణా (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ‘డి’183 పరుగులు చేయగలిగింది.స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 288 ఆలౌట్; భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 4; యశ్ దూబే (సి) కుశాగ్ర (బి) అఖీబ్ 14; శ్రేయస్ (సి) అఖీబ్ (బి) ఖలీల్ 0; పడిక్కల్ (సి) కుశాగ్ర (బి) ప్రసిధ్ కృష్ణ 92; సంజూ సామ్సన్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అఖీబ్ 5; రికీ భుయ్ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 23; సారాంశ్ (ఎల్బీ) తనుశ్ 8; సౌరభ్ (సి) శాశ్వత్ (బి) అఖీబ్ 1; హర్షిత్ రాణా (బి) ములానీ 31; అర్‡్షదీప్ (రనౌట్) 0; విద్వత్ కావేరప్ప (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు: 3, మొత్తం: (52.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–44, 4–52, 5–96, 6–122, 7–141, 8–154, 9–170, 10–183. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 8–0–39–3; ప్రసిధ్ కృష్ణ 11–4–30–1; అఖీబ్ ఖాన్ 12–2–41–3; తనుశ్ కొటియాన్ 12–5–22–1; షమ్స్ ములానీ 9.1–1–50–1. భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (బ్యాటింగ్) 59; మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) శ్రేయస్ అయ్యర్ 56; మొత్తం: (28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 115. వికెట్ల పతనం: 1–115, బౌలింగ్: హర్షిత్ రాణా 3–0–12–0; విద్వత్ కావేరప్ప 3–0–18–0; సౌరభ్ కుమార్ 11–1–46–0; అర్‡్షదీప్ సింగ్ 4–0–21–0; సారాంశ్ జైన్ 7–1–18–0; శ్రేయస్ అయ్యర్ 0.1–0–0–1. -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన పడిక్కల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్.. తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేసిన పడిక్కల్.. సిక్సర్ సాయంతో అర్దసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 103 బంతులు ఎదుర్కొన్న అతను.. 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 పడిక్కల్కు ఇది మొదటి టెస్ట్ మ్యాచే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పడిక్కల్తో పాటు ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్లోని టాప్ ఐదుగురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును తాకారు. భారత్కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. గతంలో ఆసీస్, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టెస్ట్ల్లో భారత టపార్డర్లోని ఐదుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీ మార్కును దాటారు. ఈ ఇన్నింగ్స్లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110), సర్ఫరాజ్ ఖాన్ (56) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (14), దృవ్ జురెల్ (15) క్రీజ్లో ఉన్నారు. 100 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 426/5గా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే ఆధిపత్యం
India vs England 5th Test Day 1 updates: టీమిండియాతో ధర్మశాల వేదికగా గురువారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ శతకం(52)తో ఆకట్టుకుని.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(26)తో కలిసి క్రీజులో ఉన్నాడు. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్గా ఐదో టెస్టులో టీమిండియా తొలిరోజు 10 వికెట్లు తీయడంతో పాటు.. 135 పరుగులు చేసి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) 24.2: రోహిత్ శర్మ అర్ధ శతకం బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్మ్యాన్ తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా యశస్వి జైస్వాల్(57) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. షోయబ్ బషీర్ బౌలింగ్లో జైస్వాల్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 104-1(21) 1000 పరుగుల వీరుడు 14.3: టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్. 16 ఇన్నింగ్స్లోనే అరుదైన మైలురాయిని చేరుకుని.. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా రికార్డు. 13 ఓవర్ల ముగిసే సరికి భారత్ స్కోరు: 57/0 రోహిత్ 30, జైస్వాల్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.4: హాఫ్ సెంచరీ కొట్టిన టీమిండియా 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 47/0 జైస్వాల్ 25, రోహిత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0 ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 4, రోహిత్ శర్మ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 218 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ ఐదో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. అశ్విన్ ఖాతాలో మూడో వికెట్ 218 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో బెన్ ఫోక్స్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ 49.4: అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్క్ వుడ్ డకౌట్గా వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 183-8(50) ఏడో వికెట్ డౌన్ 49.2: వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్కు ఇంగ్లండ్ టెయిలెండర్ టామ్ హార్లే రూపంలో ధర్మశాల మ్యాచ్లో తొలి వికెట్ దక్కింది. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కుల్దీప్ బౌలింగ్లో స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ. స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోగా.. కుల్దీప్ యాదవ్కు ఐదో వికెట్ దక్కింది. టామ్హర్లే క్రీజులోకి వచ్చాడు. ►ఇంగ్లండ్ జో రూట్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. 175 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 37.2: టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన మాయాజాలం ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టి ప్రమాదకరంగా మారిన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(79)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఫలితంగా మూడో వికెట్నూ తనఖాతాలోనే వేసుకున్నాడు. వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-3(38) రెండో వికెట్ డౌన్.. 100 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. లంచ్ విరామానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే(61) పరుగులతో ఉన్నాడు. తొలి వికెట్ డౌన్.. 64 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు. 14.2: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఇంగ్లండ్.. స్కోరు: 51/0. డకెట్ 21, క్రాలే 29 పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు: 43/0 నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే(11), డక్కెట్(8) నిలకడగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్: 20/0 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో డక్కెట్, జాక్ క్రాలే(7) ఉన్నారు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్ పాటిదార్ స్ధానంలో పడిక్కల్కు చోటు దక్కింది. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆకాష్ దీప్ ప్లేస్లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ సైతం ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ రాబిన్సన్ స్ధానంలో మార్క్ వుడ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. ఇక భారత స్పిన్ లెజండ్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో సైతం తన వందో టెస్టులో బరిలోకి దిగాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
Ind vs Eng: తిరిగి వెళ్లమన్న సెలక్టర్లు.. పాటిదార్పై వేటు?
'Go back and play Ranji...': BCCI wants To: ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ సందర్భంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయగా.. మరో ఆటగాడికీ ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో స్టోక్స్ బృందంతో టెస్టు సిరీస్ను రోహిత్ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్లో ఆరంభ మ్యాచ్లో ఓడినా.. విశాఖపట్నం, రాజ్కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సొంతగడ్డపై ఈ మేరకు ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక విశాఖ టెస్టులో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్.. రాజ్కోట్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. రాంచిలో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ టీమిండియా క్యాపులు అందుకున్నారు. వీరిలో రజత్ పాటిదార్కు వరుసగా మూడుసార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సిరీస్లో అతడు చేసిన పరుగులు 32,9,5,0,17,0. ఫలితంగా రజత్ పాటిదార్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు నుంచి పాటిదార్ను తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2023-24లో విదర్భతో మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ తొలుత ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి స్పష్టత రాకపోవడంతో పాటిదార్ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. అయితే, రాహుల్ రాకపోయినా పాటిదార్ను తుదిజట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు బ్యాటర్గా అతడిని జట్టుతోనే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కర్ణాటక బ్యాటర్ తాజా రంజీ సీజన్లో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున కూడా రాణించాడు. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? -
IND VS ENG 4th Test: పాటిదారా.. పడిక్కలా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్ ఓ అడుగు ముందుకేసి ఇదివరకే తుది జట్టును కూడా ప్రకటించింది. తుది జట్టు విషయంలో టీమిండియానే ఎటూ తేల్చుకోలేకపోతుంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో నాలుగో టెస్ట్కు అర్హత కోల్పోయాడు. రాహుల్కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్లు ఆడిన రజత్ పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఒక్క స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పాటిదార్కు మరో అవకాశం ఇవ్వాలా లేక దేవ్దత్ పడిక్కల్కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వాలా అని మేనేజ్మెంట్ జట్టు పీక్కుంటుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నోరు విప్పాడు. పాటిదార్ మంచి ప్లేయర్ అని, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదని పరోక్షంగా పాటిదార్ను వెనకేసుకొచ్చాడు. రాథోడ్కు పాటిదార్పై సదుద్దేశమే ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులు మాత్రం దేవ్దత్ పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడని, పాటిదార్తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అని వారభిప్రాయపడుతున్నారు. మరి నాలుగో స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొన్ని గంటలు వేచి చూస్తే కాని తెలీదు. మరోవైపు బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఆకాశ్దీప్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్లో ఆకాశ్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. నాలుగో టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్/దేవ్దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్దీప్ -
నాలుగో టెస్టు.. భారత తుది జట్టు ఇదే! సెంచరీల వీరుడి అరంగేట్రం?
రాంఛీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాజ్కోట్ నుంచి భారత జట్టు రాంఛీకి పయనమైంది. అక్కడకి చేరుకున్న రోహిత్ సేన బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. అయితే నాలుగో టెస్టులో టీమిండియా పలుమార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ఔట్.. ముఖేష్ ఇన్ రాంఛీ టెస్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు జట్టు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుమ్రా స్ధానంలో స్పీడ్ స్టార్ ముఖేష్ కుమార్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. మరోవైపు బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ పేరును కూడా మేనెజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు ఆకాష్ దీప్ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆకాష్కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డుంది. రాహుల్ రీ ఎంట్రీ.. పాటిదార్పై వేటు ఇక ఇంగ్లండ్తో గత రెండు టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. రాహుల్ జట్టులోకి వస్తే మిడిలార్డర్ బ్యాటర్ బెంచ్కే పరిమితవ్వాల్సిందే. వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. జైశ్వాల్ రెస్ట్..పడిక్కల్ ఎంట్రీ మరోవైపు రాంఛీ టెస్టుకు యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కూడా దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. వెన్ను నొప్పితో బాధపడుతున్న జైశ్వాల్ నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అతడి స్ధానంలో దేవ్దత్త్ పడిక్కల్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. పడిక్కల్ సెంచరీల మోత.. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో పడిక్కల్ సెంచరీల మోత మోగించాడు. పంజాబ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్(193).. అనంతరం గోవాతో మ్యాచ్లోనూ సెంచరీతో దుమ్ము లేపాడు. అక్కడతో కూడా పడిక్కల్ జోరు ఆగలేదు. ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో దేవ్దత్(105) మెరిశాడు. అదేవిధంగా ఆఖరిగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లోనూ విధ్వంసకర సెంచరీతో పడిక్కల్(151) చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 31 మ్యాచ్లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు. భారత తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), పడిక్కల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్ -
సెంచరీల మోత మోగించాడు.. టీమిండియాలో చోటు కొట్టేశాడు
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటుదక్కింది. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్ధానాన్ని పడిక్కల్తో సెలక్టర్లు భర్తీ చేశారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడు ప్రస్తుతం తన గాయం నుంచి 90 శాతం మాత్రమే కోలుకున్నాడు. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు తిరిగి నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు రాహుల్ స్ధానంలో దేవదత్ పడిక్కల్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని" బీసీసీఐ పేర్కొంది. పడిక్కల్ సెంచరీలు మోత.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్లో కర్ణాటక తరపున పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్(193).. అనంతరం గోవాతో మ్యాచ్లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడతో కూడా పడిక్కల్ జోరు ఆగలేదు. ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో దేవ్దత్(105) మెరిశాడు. అదేవిధంగా తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లోనూ విధ్వంసకర సెంచరీతో పడిక్కల్(151) చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 31 మ్యాచ్లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు. కాగా పడిక్కల్ ఇప్పటికే భారత జట్టు తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2021లో శ్రీలంతో జరిగిన టీ20 సిరీస్తో పడిక్కల్ డెబ్యూ చేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పడిక్కల్కు పిలుపురావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: బంగ్లాదేశ్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే? 🚨 NEWS 🚨: KL Rahul ruled out of third #INDvENG Test, Devdutt Padikkal named replacement. #TeamIndia | @IDFCFIRSTBank Details 🔽https://t.co/ko8Ubvk9uU — BCCI (@BCCI) February 12, 2024 -
రాహుల్ అవుట్
రాజ్కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్కోట్లో జరుగుతుంది. రాజ్కోట్కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్లతో పాటు పార్ట్టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
సెంచరీల మోత మోగిస్తున్న పడిక్కల్.. 8 ఇన్నింగ్స్ల్లో నాలుగు
కర్ణాటక యువ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన అతను.. తాజాగా మరో సెంచరీ బాదాడు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్లో పడిక్కల్ అజేయమైన సెంచరీతో (151; 12 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ తొలి మ్యాచ్లో పంజాబ్పై శతక్కొట్టిన పడిక్కల్.. గోవాతో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీ బాదాడు. తాజా సెంచరీతో ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పడిక్కల్ చేసిన సెంచరీల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఏడాది అతను ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు చేయడం విశేషం. సీజన్ మధ్యలో ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఇతను ఇండియా-ఏ తరఫున సెంచరీ చేశాడు. ఓవరాల్గా పడిక్కల్ ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇది ఆరో సెంచరీ. ఇప్పటివరకు 31 మ్యాచ్లు ఆడిన ఇతను.. 42కు పైగా సగటుతో ఆరు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 2100కు పైగా పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన పడిక్కల్.. 82కు పైగా సగటున మూడు సెంచరీల సాయంతో 450కు పైగా పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు (తొలి ఇన్నింగ్స్లో) చేసింది. రవికుమార్ సమర్థ్ 57, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 20, నికిన్ జోస్ 13, మనీశ్ పాండే 1, కిషన్ బెదరే 2 పరుగులు చేసి ఔట్ కాగా.. పడిక్కల్కు జతగా హార్దిక్ రాజ్ (35) క్రీజ్లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 3, అజిత్ రామ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇవాళే మొదలైన పలు రంజీ మ్యాచ్ల్లో టీమిండియా ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర, 110), పృథ్వీ షా (ముంబై, 159), తిలక్ వర్మ (101) సెంచరీలతో కదంతొక్కారు. వీరితో పాటు మనన్ వోహ్రా (134), హిమాన్షు మంత్రి (111), అంకిత్ కుమార్ (హర్యానా, 109), భుపేన్ లాల్వాని (102), సచిన్ బేబీ (110), వైభవ్ భట్ (101), తన్మయ్ అగర్వాల్ (164) లాంటి లోకల్ ప్లేయర్స్ కూడా వేర్వేరు మ్యాచ్ల్లో శతక్కొట్టారు. -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్ను సమర్థించిన రవిశాస్త్రి -
సెంచరీలతో విరుచుకుపడిన పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఇండియా-ఏ ఆటగాళ్లు దేవ్దత్ పడిక్కల్ (105), సర్ఫరాజ్ ఖాన్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. నిన్న (జనవరి 24) ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే కుప్పకూలింది. పేసర్ ఆకాశ్దీప్ సింగ్ 4 వికెట్లతో లయన్స్ పతనాన్ని శాశించగా.. వాషింగ్టన్ సుందర్, యశ్ దయాల్ చెరో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. లయన్స్ ఇన్నింగ్స్లో ఒలివర్ ప్రైస్ (48), బ్రైడన్ కార్స్ (31), టామ్ లేవ్స్ (15), జెన్నింగ్స్ (11) మత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ జట్టు రెండో రోజు రెండో సెషన్ సమయానికి (73 ఓవర్లు) 4 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పడిక్కల్ 118 బంతుల్లోనే 17 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేయగా.. ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్ 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (58) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (6), రింకూ సింగ్ (0) నిరాశపరిచారు. సర్ఫరాజ్ ఖాన్తో పాటు వాషింగ్టన్ సుందర్ (35) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్-ఏ 161 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కాగా, ఇంగ్లండ్ లయన్స్ జట్టు మూడు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
శతక్కొట్టిన పడిక్కల్, మనీశ్ పాండే.. కర్ణాటక భారీ స్కోర్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్లో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. దేవ్దత్ పడిక్కల్, మనీశ్ పాండే శతకాల మోత మోగించారు. పడిక్కల్ 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 193 పరుగుల భారీ శతకం బాదగా.. మనీశ్ పాండే సైతం మెరుపు శతకంతో (165 బంతుల్లో 118; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వీరిద్దరికి తోడు శ్రీనివాస్ శరత్ (76) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 514 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసి, ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా.. ఓపెనర్ ఆర్ సమర్థ్ 38, నికిన్ జోస్ 8, శుభంగ్ హేగ్డే 27, విజయ్ కుమార్ వైశాఖ్ 19, రోహిత్ కుమార్ 22 నాటౌట్, విధ్వత్ కవేరప్ప 4 నాటౌట్ పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్ దత్, నమన్ ధిర్ తలో 2 వికెట్లు, సిదార్థ్ కౌల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (85), ప్రభసిమ్రన్ సింగ్ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్ స్కోర్ 169/0గా ఉంది. -
టెస్టు మ్యాచ్లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పడిక్కల్.. మరో సెంచరీ
విజయ్ హాజరే ట్రోఫీ 2023లో కర్ణాటక ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), మూడు మెరుపు హాఫ్ సెంచరీలు (71 నాటౌట్, 70 నాటౌట్, 93 నాటౌట్) సాధించిన అతను.. తాజాగా మరో శతకంతో విరుచుకుపడ్డాడు. చండీఘడ్తో ఇవాళ (డిసెంబర్ 1) జరుగుతున్న మ్యాచ్లో 103 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్లు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024కు సంబంధించి ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడింగ్ అయిన పడిక్కల్.. తన లిస్ట్-ఏ కెరీర్లో 29 ఇన్నింగ్స్లు ఆడి 5 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు సాధించి విజయవంతమైన దేశవాలీ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో పడిక్కల్తో పాటు నికిన్ జోస్ (96), మనీశ్ పాండే (53 నాటౌట్) రాణించారు. మయాంక్ అగర్వాల్ (19) మరో మ్యాచ్లో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన కర్ణాటక అన్నింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. -
మరో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడిన పడిక్కల్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ప్లేయర్, కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), రెండు మెరుపు హాఫ్ సెంచరీలు (71 నాటౌట్, 70) చేసిన అతను.. తాజాగా బీహార్తో జరిగిన మ్యాచ్లో మరోసారి చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో 57 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 320 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 80.04 సగటుతో 351 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. బీహార్తో మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్తో పాటు నికిన్ జోస్ (69) కూడా రాణించడంతో ఈ మ్యాచ్లో కర్ణాటక 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్.. సకీబుల్ గనీ అజేయ సెంచరీతో (113 నాటౌట్) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. బీహార్ ఇన్నింగ్స్లో గనీ మినహా అందరూ విఫలమయ్యారు. ముగ్గురు డకౌట్లు, ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. షర్మన్ నిగ్రోద్ (21), అమన్ (33 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కర్ణాటక బౌలర్లలో సుచిత్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప, విజయ్కుమార్ వైశాక్, సమర్థ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. పడిక్కల్, నికిన్ జోస్ రాణించడంతో 33.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కర్ణాటక ఇన్నింగ్స్లో రవికుమార్ సమర్థ్ 4, కెప్టెన్ మయాంక్ అగార్వల్ 28, మనీశ్ పాండే 17 పరుగులు చేశారు. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్, రఘువేంద్ర ప్రతాప్ సింగ్, అశుతోష్ అమన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో కర్ణాటక పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (4 మ్యాచ్ల్లో 4 విజయాలు) ఎగబాకింది. -
భీకర ఫామ్లో పడిక్కల్.. మెరుపు ఇన్నింగ్స్లతో విజృంభణ
విజయ్ హజారే ట్రోఫీ 2023లో కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ దేశవాలీ వన్డే టోర్నీలో అతను మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్లు ఆడిన పడిక్కల్.. సెంచరీ, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 258 పరుగులు చేశాడు. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పడిక్కల్ 69 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. దీనికి ముందు ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీ (13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 117) చేసిన అతను.. దానికి ముందు జమ్మూ కశ్మీర్తో జరిగిన మ్యాచ్లోనూ మెరుపు హాఫ్ సెంచరీతో (35 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిశాడు. కాగా, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. విధ్వత్ కావేరప్ప (3/25), కౌశిక్ (3/19), విజయ్కుమార్ వైశాఖ్ (2/27), కృష్ణప్ప గౌతమ్ (2/32) ధాటికి 36.3 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ ఇన్నింగ్స్లో అయూశ్ బదోని (100) ఒక్కడే మూడొంతుల స్కోర్ చేయడం విశేషం. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన కర్ణాటక.. పడిక్కల్ (70) రాణించడంతో 27.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్లో సెంచరీతో అలరించిన మయాంక్ అగర్వాల్ (12) ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే పరిమితమయ్యాడు. మనీశ్ పాండే (28 నాటౌట్).. శరత్ (7 నాటౌట్) సహకారంతో కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, సుయాశ్ శర్మ, లలిత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
IPL 2024: రాజస్తాన్ రాయల్స్ కీలక ప్రకటన.. అతడిని వదిలేసి..
IPL 2024- Avesh Khan: ఐపీఎల్-2024 వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాపార్డర్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ను వదిలేసి.. అతడి స్థానంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ను జట్టులోకి తీసుకుంది. మరో ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్తో డైరెక్ట్ స్వాప్ పద్ధతిలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. లక్నోకు చెందిన ఆవేశ్ను తాము తీసుకుని.. బదులుగా పడిక్కల్ను ఆ ఫ్రాంఛైజీకి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాజస్తాన్ రాయల్స్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. లక్నో 10 కోట్లకు కొంటే.. రాజస్తాన్ కూడా కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రూ. 10 కోట్లు వెచ్చించి ఆవేశ్ ఖాన్ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో లక్నో తరఫున 22 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ 26 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అదే ధరకు రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ అయ్యాడు. పడిక్కల్కు అంతమొత్తం ఇవ్వనున్న లక్నో మరోవైపు.. గతంలో.. రాజస్తాన్ పడిక్కల్ను 7.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా.. లక్నో అంత మొత్తం అతడికి చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్లు ఆడిన దేవ్దత్ పడిక్కల్.. 1521 పరుగులు చేశాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ శతకం, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్ తరఫున పడిక్కల్ 28 మ్యాచ్లు ఆడి 637 పరుగులు సాధించాడు. కాగా ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం టీమిండియాతో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో జట్టుకు ఎంపికైన అతడు.. నవంబరు 23న జరుగనున్న తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? To all those hits and a smile we'll miss. Go well, DDP! 💗💗💗 pic.twitter.com/ONpXOULjNY — Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2023 🚨Trade Alert: Right-arm quick Avesh Khan will now #HallaBol in Pink! 🔥 Devdutt Padikkal moves to LSG and we wish him the best for his new chapter. 💗 pic.twitter.com/ZiTzxB5f8o — Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2023 -
బిల్డప్ బాబాయ్.. ఒక్క మ్యాచ్లో అయినా ఆడు నాన్న
-
ఎందుకు బాబు మా మర్యాద తీస్తున్నారు.. ఆర్సీబీ బ్యాటర్లను మించిపోయారు..!
స్టార్ ఆటగాళ్లు, విధ్వంసకర బ్యాటర్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లో ఓటమిపాలైంది. సొంతగడ్డపై ఇవాళ (మే 5) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్ సేన 9 వికెట్ల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. గుడ్డి కంటే మెల్ల మేలు అన్న చందంగా సంజూ శాంసన్ (30) ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. విధ్వంసకర హిట్టర్లు యశస్వి జైస్వాల్ (14), జోస్ బట్లర్ (8), హెట్మైర్ (7)దారుణంగా నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లతో రెచ్చిపోగా, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 13.5 ఓవర్లలో గిల్ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (41 నాటౌట్), శుభ్మన్ గిల్ (36) రాణించగా.. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్ వికెట్ చహల్కు దక్కింది. రియాన్ పరాగ్, దేవ్దత్ పడిక్కల్లపై ధ్వజమెత్తిన ఫ్యాన్స్.. ఈ మ్యాచ్లో ఓటమి అనంతరం రాజస్థాన్ ఫ్యాన్స్ ఇద్దరు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 7.75 కోట్ల ఆటగాడు దేవ్దత్ పడిక్కల్, 3.8 కోట్లు పోసి కొనుక్కున్న రియాన్ పరాగ్లపై అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వంద రెట్లు నయమని అంటున్నారు. వీరి వల్ల రాజస్థాన్ రాయల్స్ ఇమేజ్ డామేజ్ అయిపోతుందని వాపోతున్నారు. రానురాను రాజస్థాన్ ఆటగాళ్ల ఆటతీరు ఆర్సీబీ మిడిలార్డర్ కంటే చెండాలంగా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రియాన్, పడిక్కల్ మారరని, తక్షణమే వీరిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్పై కాస్త కనికరం చూపిస్తున్న అభిమానులు రియాన్ పరాగ్ను మాత్రం తూర్పారబెడుతున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. పైగా ఈ మ్యాచ్లో ఇతనేదో పొడుస్తాడని ఆర్ఆర్ యాజమాన్యం ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించడం సోచనీయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇవాల్టి మ్యాచ్లో ఓవరాక్షన్ ఆటగాడు రియాన్ పరాగ్ 4 (6), పడిక్కల్ 12 (12) పరుగులు చేశారు. ఈ సీజన్లో పరాగ్ 6 మ్యాచ్ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేస్తే.. పడిక్కల్ 9 మ్యాచ్ల్లో 206 పరుగులు సాధించాడు. -
IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానంలో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ రాజస్తాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఉప్పల్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో 72 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్ల మెరుపులు పెద్దగా లేకపోయినా.. రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అదరగొట్టాడు. ఈ టీమిండియా స్పీడ్స్టర్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాజస్తాన్ బ్యాటర్లు దేవ్దత్ పడిక్కల్(2)ను అద్భుత డెలివరీతో బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదిహేనో ఓవర్లో సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన ఉమ్రాన్ దెబ్బకు వికెట్ ఎగిరి పడింది. దీంతో బ్యాటర్ పడిక్కల్ విస్మయానికి లోనుకగా.. ఉమ్రాన్ ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. ఇక బౌలింగ్లో ఫర్వాలేదనిపించిన ఉమ్రాన్.. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్-2023 సన్రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ స్కోర్లు: టాస్: సన్రైజర్స్- బౌలింగ్ రాజస్తాన్ రాయల్స్- 203/5 (20) ఎస్ఆర్హెచ్- 131/8 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(22 బంతుల్లో 54 పరుగులు) చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి.. .@umran_malik_01 doing Umran Malik things! 👍 Relive how he picked his first wicket of the #TATAIPL 2023 👇#SRHvRR | @SunRisers pic.twitter.com/QD0MoeW1vF — IndianPremierLeague (@IPL) April 2, 2023 -
శతక్కొట్టిన దేవదత్ పడిక్కల్
Devdutt Padikkal: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ (175 బంతుల్లో 114; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్.. కే గౌతమ్ (4/61), శ్రేయస్ గోపాల్ (3/18), కావేరప్ప (2/34), శుభంగ్ హేగ్డే (1/16) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. పడిక్కల్ సెంచరీ, వికెట్కీపర్ శరత్ (60) అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో 300 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో షాబాజ్ నదీమ్ 5 వికెట్లతో చెలరేగగా.. అనుకుల్ రాయ్ 3, వినాయక్ విక్రమ్ ఓ వికెట్ పడగొట్టారు. 146 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. కుమార్ (20), ఆర్యమాన్ సేన్ (0) ఔట్ కాగా.. కుమార్ సూరజ్ (34), కుమార్ కుషాగ్రా (24) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం జార్ఖండ్ కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 51 పరుగులు వెనుకపడి ఉంది. గ్రూప్-సిలో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక ఇదివరకే క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. కాగా, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సంచలన ఇన్నింగ్స్లతో పడిక్కల్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2020లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్.. ఆ సీజన్లో 473 పరుగులు, ఆతర్వాతి సీజన్లలో వరుసగా 411, 376 పరుగులు చేశాడు. గతేడాదే పడిక్కల్ రాజస్థాన్ రాయల్స్కు బదిలీ అయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021 సీజన్లో వరుసగా నాలుగు శతకాలు బాదిన పడిక్కల్.. లిస్ట్-ఏ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. -
మహారాజా టీ20 లీగ్లో ఆడనున్న కర్ణాటక స్టార్ ఆటగాళ్లు..!
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ శనివారం కీలక ప్రకటన చేసింది. ఆరు జట్లతో కూడిన మహారాజా టీ20 లీగ్ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఆగస్ట్ 7 ప్రారంభమై ఆగస్ట్ 26న ముగియనుంది. ఈ టోర్నీలో దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, శ్రేయాస్ గోపాల్, కె గౌతమ్, జగదీశ సుచిత్, కరుణ్ నాయర్ అభిమన్యు మిథున్ వంటి ఆ రాష్ట్ర స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. ఇక బెంగళూరు, మైసూర్, హుబ్లీ, శివమొగ్గ, రాయచూర్, మంగళూరు జట్లుగా ఉన్నాయి. కాగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మైసూర్ మహారాజు దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మహారాజా టీ20 ట్రోఫీలోని 18 మ్యాచ్లు మైసూర్లోని శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ గ్రౌండ్లో జరగనుండగా.. ఫైనల్తో సహా మరో 16 మ్యాచ్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. చదవండి: Robert Lewandowski: తొమ్మిది నిమిషాల్లో 5 గోల్స్.. ఫుట్బాల్లో కొత్త మొనగాడు -
IPL 2022: ఢిల్లీ ఆశలు పదిలం
ముంబై: సీజన్లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ అదే శైలిని కొనసాగించింది! తాజా ఫలితం అనంతరం సరిగ్గా సగం మ్యాచ్లలో విజయం, సగం పరాజయాలతో ఆ జట్టు ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు పదిలంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన పోరులో క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్పై నెగ్గింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అశ్విన్ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 89; 5 ఫోర్లు, 7 సిక్స్లు), డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 144 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రాణించిన పడిక్కల్... ప్రమాదకర బ్యాటర్ బట్లర్ (7)ను అవుట్ చేసి సకరియా ఢిల్లీకి శుభారంభం అందించగా, యశస్వి జైస్వాల్ (19) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే అనూహ్యంగా మూడో స్థానంలో వచ్చిన అశ్విన్ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, అక్షర్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరో ఎండ్లో పడిక్కల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. అక్షర్ ఓవర్లో వరుస బంతుల్లో అతను రెండు సిక్సర్లు కొట్టాడు. 37 బంతుల్లో అశ్విన్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్ సహా టి20 క్రికెట్లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. మూడో వికెట్కు పడిక్కల్తో 36 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం అశ్విన్ వెనుదిరగ్గా... సామ్సన్ (6), పరాగ్ (9) విఫలమయ్యారు. శతక భాగస్వామ్యం... కేఎస్ భరత్ (0) మరోసారి విఫలమవ్వగా... వార్నర్, మార్ష్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. పవర్ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 38 పరుగులకు చేరింది. మార్ష్ దూకుడు కనబర్చగా, వార్నర్ నెమ్మదిగా ఆడాడు. కుల్దీప్ సేన్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మా చహల్ ఓవర్లో మరో భారీ సిక్స్తో 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 79 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం నమో దైంది. వేగంగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకుపోయిన మార్ష్ ఆ అవకాశం చేజార్చుకున్నాడు. 18 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన స్థితిలో మా అవుటయ్యాడు. వార్నర్, పంత్ (13 నాటౌ ట్; 2 సిక్స్లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) లలిత్ (బి) మార్ష్ 19; బట్లర్ (సి) శార్దుల్ (బి) సకరియా 7; అశ్విన్ (సి) వార్నర్ (బి) మార్ష్ 50; పడిక్కల్ (సి) (సబ్) నాగర్కోటి (బి) నోర్జే 48; సామ్సన్ (సి) శార్దుల్ (బి) నోర్జే 6; పరాగ్ (సి) పావెల్ (బి) సకరియా 9; డసెన్ (నాటౌట్) 12; బౌల్ట్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–107, 4–125, 5–142, 6–146. బౌలింగ్: సకరియా 4–0–23–2, నోర్జే 4–0–39–2, శార్దుల్ 4–0–27–0, అక్షర్ 2–0–25–0, మా 3–0–25–2, కుల్దీప్ 3–0–20–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: భరత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; వార్నర్ 52 (నాటౌట్); మార్ష్ (సి) కుల్దీప్ సేన్ (బి) చహల్ 89; పంత్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–144. బౌలింగ్: బౌల్ట్ 4–0–32–1, ప్రసిధ్ 3–1–20–0, అశ్విన్ 4–0–32–0, కుల్దీప్ సేన్ 3.1–0–32–0, చహల్ 4–0–43–1. ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
IPL 2022: ఇలాంటి బ్యాటింగ్ జట్టుకు భారం.. యశస్వి మాత్రం సూపర్!
IPL 2022 PBKS Vs RR: ‘‘32 బంతుల్లో 31 పరుగులు.. భారీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో ఇలాంటి ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడటం కాదు.. భారంగా మారుతుంది’’ అంటూ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ ఆట తీరును టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. అదే విధంగా.. క్లిష్ట సమయాల్లో హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్ను ఎందుకు కాస్త ముందే రంగంలోకి దించడం లేదని ప్రశ్నించాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, 190 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో సంజూ బృందానికి శుభారంభం లభించినా.. ఆఖరి ఓవర్ వరకు పంజాబ్ మ్యాచ్ను లాక్కొని రాగలిగింది. ముఖ్యంగా పడిక్కల్ స్లో ఇన్నింగ్స్ కాస్త కంగారు పెట్టింది. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా అతడు పట్టుదలగా నిలబడటం గమనార్హం. కానీ.. చివరి రెండు ఓవరల్లో హెట్మెయిర్ గనుక రాణించి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. 16 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం రాజస్తాన్ సొంతమైంది. ఈ ఫలితంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒకవేళ దేవ్దత్ పడిక్కల్ను ఓపెనర్గా పంపకపోతే.. నాలుగో స్థానంలో ఎందుకు ఆడించినట్లు? అతడిని ఐదో స్థానంలో పంపినా పెద్దగా తేడా ఏమీ ఉండదు కదా! ఒకవేళ అదే సమయంలో మీరు గనుక హెట్మెయిర్కు అవకాశం ఇచ్చి ఉంటే మెరుగ్గా ఉండేది. వీళ్లేమో(రాజస్తాన్) హెట్టీని, వాళ్లేమో(పంజాబ్) లియామ్ను ఎందుకు ప్రమోట్ చేయరో అర్థం కాదు. వాళ్లకు ఇదేం నియమమో’’ అని పేర్కొన్నాడు. ఇక పంజాబ్తో మ్యాచ్లో అద్బుత ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైశ్వాల్పై ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ‘‘యశస్వి ఆరంభంలోనే అదరగొట్టాడు. ఇక జోస్ ది బాస్(జోస్ బట్లర్) గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. రబడ బౌలింగ్లో విధ్వంసం సృష్టించాడు. ఒకవేళ బట్లర్ ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే 18 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసి ఉండేది’’ అంటూ రాజస్తాన్ ఓపెనర్లను కొనియాడాడు. ఐపీఎల్ మ్యాచ్: 52- పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు పంజాబ్-189/5 (20) రాజస్తాన్-190/4 (19.4) That's that from Match 52 as @rajasthanroyals win by 6 wickets.#TATAIPL #PBKSvRR pic.twitter.com/RloiU9m1LJ — IndianPremierLeague (@IPL) May 7, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి👉🏾Kane Williamson: కేన్ విలియం నుంచి విలన్గా మారాలి.. లేదంటే: అక్తర్ -
IPL 2022: ‘నాలుగు’ పరుగెత్తారు...!
IPL 2022- RR Vs KKR: ఓవర్ త్రో లేకుండా నేరుగా వికెట్ల మధ్య పరుగెత్తి నాలుగు రన్స్ తీయడం సాధ్యమా! సాధ్యమేనని రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు జోస్ బట్లర్, దేవ్దత్ పడిక్కల్ చేసి చూపించారు. కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతిని బట్లర్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. బంతిని వెంటాడిన వెంకటేశ్ బౌండరీకి చేరువలో దానిని ఆపి వెనక్కి తోయగలిగాడు. ఇక దానిని అందుకున్న రాణా బంతిని కీపర్ వైపు విసిరాడు. అయితే మూడు పరుగులు సునాయాసంగా పూర్తి చేసుకున్న బట్లర్, డైవ్తో నాలుగో పరుగు కూడా సాధించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘‘మీ ఫిట్నెస్ లెవల్స్ సూపర్.. పరుగెత్తి నాలుగు పరుగులు సాధించారు.. గ్రేట్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సోమవారం రాజస్తాన్, కోల్కతా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ బృందం కోల్కతాపై విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో శ్రేయస్ సేనను ఓడించి ఐపీఎల్-2022లో నాలుగో గెలుపును నమోదు చేసింది. తద్వారా ఎనిమిది పాయంట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా #JosButtler #DevduttPadikkal ran four runs Incredible #IPL2022 #RRvsKKR pic.twitter.com/No9HK41HHM — Raj (@Raj93465898) April 18, 2022 WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏 The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍 Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg — IndianPremierLeague (@IPL) April 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా.. ఫామ్లోకి వస్తే బాగుంటుంది
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఐపీఎల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పడిక్కల్ ఈ ఫీట్ సాధించాడు. కాగా ఐపీఎల్లో వెయ్యి పరుగులను అత్యంత వేగంగా సాధించిన మూడో ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సాధించాడు. 35 మ్యాచ్ల్లో ఈ మార్క్ అందుకున్న పడిక్కల్ ఖాతాలో ఒక సెంచరీ, ఆరు అర్థసెంచరీలు ఉన్నాయి. అయితే ఈ సీజన్లో పడిక్కల్ బ్యాట్ నుంచి మెరుపులు కనబడడం లేదు. గత సీజన్లో ఆర్సీబీ తరపున మంచి ఇన్నింగ్స్లు ఆడిన పడిక్కల్ ఈసారి మాత్రం రాజస్తాన్ తరపున ఐదు మ్యాచ్ల్లో వరుసగా 41,7,37,29,0 పరుగులు సాధించాడు. తాజాగా కేకేఆర్తో మ్యాచ్ 18 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐపీఎల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్న పడిక్కల్ను క్రికెట్ ఫ్యాన్స్ అభినందిస్తూనే చురకలు అంటించారు. ''రికార్డుల పరంగా ఓకే.. కానీ ఫామ్లోకి వస్తే బాగుంటుంది.. నీ నుంచి పెద్ద స్కోర్లు చూసే భాగ్యం ఉందా లేదా'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Carlos Brathwaite: 2016 టి20 ప్రపంచకప్ హీరోకు వింత అనుభవం.. -
కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే పడిక్కల్ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్ ఆఖరి బంతిని పడిక్కల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్కు తగలడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి -
ఆర్సీబీకి రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు వెన్నుపోటు!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అద్భుత విజయాలు సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్లో ఉండగా.. రెండు మ్యాచ్ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. మరి ఇవాళ జరిగే సమరంలో రాయల్స్ రాజసం చూపిస్తుందా.. లేక ఆర్సీబీ గెలుస్తుందా అనేది చూడాలి. కాగా ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూపర్ మీమ్తో రెచ్చొపోయాడు. గత సీజన్లో చహల్, పడిక్కల్లు ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం వారిద్దరు రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్నారు. ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా.. మహాభారతంలో అర్జున పాత్రతో చహల్, పడిక్కల్లను చూపుతూ... భీష్ముని పాత్రలో ఆర్సీబీని ఉంచి ఫోటో రిలీజ్ చేశాడు. ''చహల్, దేవదత్ పడిక్కల్ను చూస్తుంటే ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తున్నారంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన చహల్ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ అతన్ని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ తరపున చహల్ 2 మ్యాచ్ల్లో 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పడిక్కల్ కూడా ఆర్సీబీ తరపున ఐపీఎల్లో సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆర్సీబీ తరపున పడిక్కల్ కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. చదవండి: IPL 2022: 'ఎస్ఆర్హెచ్కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు' IPL 2022 RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఇలా! .@yuzi_chahal and @devdpd07 playing against RCB tonight. #RRvRCB #IPL2022 pic.twitter.com/QpteUJU6AY — Wasim Jaffer (@WasimJaffer14) April 5, 2022 -
IPL 2022 SRH Vs RR: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్!
IPL 2022- Kane Williamson: ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ చర్చకు దారి తీసింది. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ సామ్సన్ వైపు వెళ్లింది. అతడు దానిని వదిలేయగా, బంతి గాల్లోకి లేవడంతో మొదటి స్లిప్లోనే ఉన్న పడిక్కల్ దానిని అందుకున్నాడు. అయితే పడిక్కల్ క్యాచ్ తీసుకునే ముందు బంతి నేలను తాకిందనే అనుమానంతో విలియమ్సన్ క్రీజ్ నుంచి కదల్లేదు. టీవీ అంపైర్ పదే పదే రీప్లేలు చూసినా దానిపై స్పష్టత రాలేదు. కొన్ని యాంగిల్స్లో మాత్రం అది నేలను తాకిన తర్వాత పడిక్కల్ చేతుల్లో పడినట్లు కనిపించింది. చివరకు అంపైర్ ‘అవుట్’గా ప్రకటించడంతో నిరాశగా హైదరాబాద్ కెప్టెన్ వెనుదిరిగాడు. దీనిపై నెట్టింట ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ‘‘వెయ్యిసార్లు చూసినా అదే కనిపించేది అదే. అదే నిజం కూడా.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! అనవసరంగా బలయ్యాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. What is this🙄🤔 Wrong decision by Umpire. Kane Williamson was Not Out👇👇 #RRvSRH #SRHvRR #KaneWilliamson #IPL2022 #Umpire pic.twitter.com/51GNpFnVQp — Cricket Countdown (@Cric8Countdown) March 29, 2022 See it 1000 times, that would still be not out...Just poor umpiring. Feeling sad for Kane Williamson 😞#IPL2022 #SRHvRR pic.twitter.com/0FjWS2DnZf — Cricket Fanatic🏏 (@cric8fanatic) March 29, 2022 Kane Williamson clearly not out.The ball was stepping on the ground.This is absolutely ridiculous.#TATAIPL2022 #SRHvRR pic.twitter.com/71yPsHpVAk — Dipankar Das Gibbs🇮🇳 (@DipankarGibbs) March 29, 2022 Match 5. Rajasthan Royals Won by 61 Run(s) https://t.co/GaOK5ulUqE #SRHvRR #TATAIPL #IPL2022 — IndianPremierLeague (@IPL) March 29, 2022 -
IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..!
Rajasthan Royals: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా, శుక్రవారం జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు శివాలెత్తారు. టీమ్ పింక్, టీమ్ బ్లూ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ పింక్.. పడిక్కల్ (51 బంతుల్లో 67), రియాన్ పరాగ్ (27 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగి బ్యాటింగ్ చేయడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. Our first practice game went something like... 👀💗#RoyalsFamily | #दिलसेरॉयल | #TATAIPL2022 pic.twitter.com/GQGwGKkAA5 — Rajasthan Royals (@rajasthanroyals) March 25, 2022 అనంతరం ఛేదనలో షిమ్రోన్ హెట్మైర్ (37 బంతుల్లో 70 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ, అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో టీమ్ బ్లూ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టులో కొత్తగా చేరిన పడిక్కల్, హెట్మైర్, చహల్ (2/30) రాణించడంతో ఆర్ఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మెగా వేలంలో ఆర్ఆర్ యాజమాన్యం హెట్మైర్ను రూ. 8 కోట్ల 50 లక్షలకు, దేవదత్ పడిక్కల్ను రూ. 7.75 కోట్లకు, చహల్ను రూ. 6.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ నేటి (మార్చి 26) నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్తో తాజా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. చదవండి: IPL 2022 Auction: ప్రసిధ్ కృష్ణకు జాక్పాట్.. రాజస్తాన్ రాయల్స్కు వెళ్లిన ఆటగాళ్లు -
మెగావేలంలో టాప్ లేపిన భారత కుర్రాళ్లు
IPL 2022 Auction: ఐపీఎల్ మెగావేలం 2022లో ఊహించనట్లుగానే టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. అంచనాలకు మించి ఈ ఆటగాళ్లు మంచి ధరను సొంతం చేసుకున్నారు. నితీష్ రాణా, హర్షల్ పటేల్, ఆల్రౌండర్ దీపక్ హుడా, దేవదూత్ పడిక్కల్ ఈ జాబితాలో ఉన్నారు. హర్షల్ పటేల్: గత సీజన్లో అంచనాలకు మించి రాణించిన హర్షల్ పటేల్కు జాక్పాట్ తగిలింది. 32 వికెట్లతో పర్పుల్క్యాప్ అందుకున్న హర్షల్ను మరోసారి ఆర్సీబీ దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన హర్షల్ను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ మరోసారి దక్కించుకుంది. నవంబర్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ ద్వారా టీమిండియా తరపున హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీసిన హర్షల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దేవదూత్ పడిక్కల్: టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ దేవదూత్ పడిక్కల్ దశ తిరిగింది. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ఆర్సీబీ తరపున దేవదూత్ పడిక్కల్ దుమ్మురేపాడు. ఐపీఎల్ 2020 సీజన్లో 473 పరుగులతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న పడిక్కల్.. మరుసటి ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అదే జోరు చూపెట్టాడు. 411 పరుగులు చేసిన పడిక్కల్ సీజన్లో వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించి ఔరా అనిపించాడు.తాజాగా ఐపీఎల్ మెగావేలంలో ఆర్సీబీ అతని కోసం పోటీపడినప్పటికి చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది. నితీష్ రాణా: గత సీజన్లో కేకేఆర్ తరపున నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతనిపై నమ్మకముంచిన కేకేఆర్ నితీష్ రాణాను రూ. 8 కోట్లతో దక్కించుకుంది. కాగా గత సీజన్లో కేకేఆర్ తరపున 17 మ్యాచ్ల్లో 383 పరుగులు చేసిన నితీష్ ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా 2015లో తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన నితీష్ రానా ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడని నితీష్.. ఆ తర్వాతి సీజన్లో 4 మ్యాచ్ల్లో 104 పరుగులు చేశాడు. 2017 సీజన్లో 13 మ్యాచ్ల్లో 333 పరుగులతో ఆకట్టుకున్న నితీష్ను ముంబై రిలీజ్ చేయగా.. 2018 వేలంలో అతన్ని కేకేఆర్ దక్కించుకుంది. అప్పటినుంచి నితీష్ రాణా కేకేఆర్ రెగ్యులర్ ప్లేయర్గా మారిపోయాడు. దీపక్హుడా: టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడాను రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీపక్ హుడాది మంచి ధరే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్లో 80 మ్యాచ్లాడిన దీపక్ హుడా 785 పరుగులు చేశాడు. -
IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..!
India A Squad Announced For South Africa Tour: ఐపీఎల్-2021లో మెరుపులు మెరిపించిన పృథ్వీ షా(డీసీ), దేవ్దత్ పడిక్కల్(ఆర్సీబీ), ఉమ్రాన్ మాలిక్(ఎస్ఆర్హెచ్)లకు స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోయినా దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత్-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశం లభించింది. ఈ నెల 23 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్ల (నాలుగు రోజుల మ్యాచ్లు) సిరీస్ కోసం 14 మంది సభ్యుల భారత-ఏ జట్టును బీసీసీఐ ఇవాళ(నవంబర్ 9) ప్రకటించింది. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియాతో పాటే ఈ జట్టును కూడా బీసీసీఐ ఇవాళే ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ప్రియాంక్ పంచల్ను ఎంపిక చేసిన భారత క్రికెట్ బోర్డు.. సీనియర్లు రాహుల్ చాహర్, నవ్దీప్ సైనీలకు చోటు కల్పించింది. ఐపీఎల్ స్టార్లతో పాటు జట్టు సభ్యులంతా ఈ సిరీస్లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. భారత్-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ నవంబర్ 23-26 వరకు, రెండో మ్యాచ్ నవంబర్ 29-డిసెంబర్ 2 వరకు, మూడో మ్యాచ్ డిసెంబర్ 6-9 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సెకెండ్ లెగ్లో పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. పృథ్వీ షా దాదాపు ప్రతి మ్యాచ్లో రాణించగా, పడిక్కల్ సూపర్ శతకంతో, ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బంతులతో అదరగొట్టారు. భారత-ఏ జట్టు: ప్రియాంక్ పంచల్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవ్దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్(వికెట్కీపర్), కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవ్దీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్జాన్ నగవస్వల్లా చదవండి: బ్రేకింగ్: రోహిత్ కెప్టెన్గా టీమిండియా ఎంపిక.. జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ -
ఆ ఆర్సీబీ ఆటగాడు ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఇంకా ఉంది..
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ప్రాతినిధ్యం వహించే దేవ్దత్ పడిక్కల్ భారత ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే ఛాన్సులు ఇంకా ఉన్నాయని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ రెండో దశలో ఈ కేరళ కుర్రాడు రాణించగలిగితే టీమిండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నాడు. అక్టోబర్లో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఇదివరకే ప్రకటించినప్పటికీ.. ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్ 10 వరకు జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ ఫేస్-2లో సత్తా చాటే ఆటగాళ్లకు టీమిండియాలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్లో రాణించగలిగితే పడిక్కల్ సహా సంజూ సామ్సన్లను భారత సెలెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశముందని తెలిపాడు. పొట్టి ఫార్మాట్లో ఇషాన్ కిషన్, దేవ్దత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, సంజూ సామ్సన్ లాంటి యువ ఆటగాళ్ల ఆటను ఆస్వాధిస్తానని.. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం వస్తే కచ్చితంగా పడిక్కల్వైపే మొగ్గుచూపుతానని పేర్కొన్నాడు. పడిక్కల్ బ్యాటింగ్ శైలీ చాలా బాగుంటుందని.. పొట్టి క్రికెట్కు అతను సరైన అటగాడని అభిప్రాయపడ్డాడు. కాగా, గతేడాది ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్.. సెహ్వాగ్ లాగే డాషింగ్ ఆటతీరుతో వేగంగా పరుగులు రాబట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్-2021 ఫస్ట్ లెగ్లో అతను సాధించిన సూపర్ సెంచరీ.. సీజన్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఆ ప్రదర్శనతో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు(ధవన్ సేన)లో అతను చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 21 మ్యాచ్లు ఆడిన పడిక్కల్.. 5 హాఫ్ సెంచరీలు, సెంచరీ సాయంతో 668 పరుగులు సాధించాడు. చదవండి: టీమిండియాకు లక్కీ ఛాన్స్.. పాక్తో పోరుకు ముందు టాప్ జట్లతో మ్యాచ్లు.. -
ఇరగదీసిన డివిల్లియర్స్.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!
AB de Villiers Scores Century Intra Squad Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ఇక ఈసారైనా కప్ కొట్టాలన్న ఆశయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్లో గట్టిగానే శ్రమిస్తున్నారు. రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లతో కావాల్సినంత ప్రాక్టీసు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్లో... ఆర్సీబీ ఏ కెప్టెన్ హర్షల్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పవర్ప్లేలో వికెట్ కోల్పోయిన ‘ఏ’ జట్టును స్టార్ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్, మహ్మద్ అజారుద్దీన్ ఆదుకున్నారు. ఏడో ఓవర్ ముగిసేసరికి డివిల్లియర్స్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అదే జోరులో శతకం(46 బంతుల్లో 104 పరుగులుఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఏ 212 పరుగులు చేయగలిగింది. అయితే లక్ష్యఛేదనలో భాగంగా దేవదత్ పడిక్కల్ సారథ్యంలోని ఆర్సీబీ బీ మెరుగైన ఆట కనబరిచింది. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. బౌండరీ బాది విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించి గెలుపొందింది. ఈ టీంలో కేఎస్ భరత్ 95 పరుగులు సాధించి సత్తా చాటగా.. ఆర్సీబీ ఏ జట్టులోని సెంచరీ చేసిన డివిల్లియర్స్ పోరాటం వృథాగా పోయింది. ఈ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. చదవండి: IPL 2021 Phase 2: నాలాంటి ‘ఓల్డ్ మ్యాన్’కు కష్టమే: డివిల్లియర్స్ Bold Diaries: RCB’s Practice Match AB de Villiers scores a century, KS Bharat scores 95 as batsmen make merry in the practice match between Devdutt’s 11 and Harshal’s 11.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/izMI4LCSG1 — Royal Challengers Bangalore (@RCBTweets) September 15, 2021 -
చరిత్ర సృష్టించిన పడిక్కల్.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు
కొలొంబో: శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో టీ20 ద్వారా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన దేవ్దత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోని భారత క్రికెటర్లలో ఈ శతాబ్దంలో పుట్టిన ఏకైక క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. భారత టెస్ట్, వన్డే, టీ20 జట్లలో ప్రస్తుతం కొనసాతున్న క్రికెటర్లంతా 1999 లేదా అంతకంటే ముందు పుట్టిన వాళ్లే కాగా, కేవలం పడిక్కల్ మాత్రమే ఈ శతాబ్దంలో జన్మించాడు. కర్ణాటకకు చెందిన పడిక్కల్ 2000 జులై 7న జన్మించాడు. కేవలం 21 ఏళ్ల వయసులో అతనికి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కోవిడ్ సోకడంతో అతడితో పాటు మరో ఎనిమిది మంది క్రికెటర్లు ఐసోలేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో పడిక్కల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్. చేతన్ సకారియా, నితీశ్ రాణాలకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. పడిక్కల్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి హసరంగ బౌలింగ్లో అవుటయ్యాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆతిధ్య జట్టు.. భారత బౌలర్లు ప్రతిఘటించడంతో అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకోగలిగింది. ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో తొలిసారిగా పడిక్కల్ ప్రతిభ అందరికీ తెలిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన పడిక్కల్.. ఆ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఆడి 473 పరుగులు చేశాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో కూడా పడిక్కల్ తన ఫామ్ను కొనసాగించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో పడిక్కల్ ఆరు మ్యాచ్లలో 195 పరుగులు చేశాడు. ఇందులో ఒక అద్భుతమైన సెంచరీ కూడా ఉంది. కాగా, సీనియర్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో పడిక్కల్కు అనూహ్యంగా శ్రీలంక పర్యటనకు పిలుపు అందింది. వన్డే సిరీస్తో పాటు తొలి టీ20లో బెంచ్కే పరిమితం అయిన పడిక్కల్.. ఎట్టకేలకు రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. -
రవిశాస్త్రి ఎలెవెన్తో మ్యాచ్లు నిర్వహించండి.. బీసీసీఐకి ఫ్యాన్స్ విజ్ఞప్తి
కొలొంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న గబ్బర్ సేన తొలి వన్డేలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు.. ద్రవిడ్ పర్యవేక్షణలోని భారత యువ జట్టుకు మధ్య మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంగ్లండ్లో ఉన్న భారత రెగ్యులర్ జట్టుకు రవిశాస్త్రి హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఎలెవెన్-ద్రవిడ్ ఎలెవెన్ మధ్య పరిమిత ఓవర్ల మ్యాచ్లు ప్లాన్ చేయాలని బీసీసీఐని కోరుతున్నారు. అవసరమైతే ప్రస్తుత లంక పర్యటనను రద్దు చేసైనా ఈ మ్యాచ్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. Bro @bcci get rid of this Sri Lanka tour, we want a match "Dravid XI vs Shastri XI" now.— Neeche Se Topper (@NeecheSeTopper) July 18, 2021 అయితే కోహ్లీ సేనలో ఉన్న రోహిత్ శర్మను ద్రవిడ్ జట్టులోకి తీసుకొచ్చి.. ప్రస్తుతం ధవన్ అండ్ కో లో ఉన్న పడిక్కల్ను వారికి ఇవ్వాలని ఆసక్తికర ప్రతిపాదనలు చేస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు చేస్తున్న ఈ సరికొత్త ప్రతిపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలోనే గబ్బర్ సేన 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. పేరుకు ద్వితీయ శ్రేణి జట్టయినా ఊహించినట్టుగానే పూర్తి ఆధిపత్యం చలాయించింది. శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలోనే చేధించి ఔరా అనిపించింది. Just one change will be there... Send Rohit to dravid xi and padikkal to shashtri xi— Shashanka Sekhar🇮🇳 (@sekhar31086) July 18, 2021 బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్(42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో వన్డే కెరీర్ను ప్రారంభించగా.. ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) ధనాధన్ బ్యాటింగ్తో సెహ్వాగ్ను తలపించాడు. ఈ ఇద్దరికి శిఖర్ ధవన్ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో భారత యువ జట్టు చిరస్మరణీయ విజయాన్నందుకుంది. మూడు వన్డేల సిరీస్లో ప్రస్తుతం ధవన్ సేన 1-0 ఆధిక్యంలోకి ఉండగా, ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. -
ఆ ఇద్దరి కోసం పట్టుపట్టిన కోహ్లీ సేన.. బేఖాతరు చేసిన చీఫ్ సెలక్టర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో, టీమిండియా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఓపెనర్లైన పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్లను ఇంగ్లండ్కు పంపించాలని భారత సెలక్షన్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గత నెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మకు మెయిల్ చేశాడని, బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే షా, పడిక్కల్ను కాదని అనూహ్యంగా బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ను స్టాండ్బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటేనే సెలక్షన్ కమిటీ చైర్మన్ స్పందించేలా ఉన్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి పృథ్వీషా, పడిక్కల్ను ఇంగ్లండ్కు పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ నుంచి బీసీసీఐకి ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ అందలేదు. మరోవైపు షా, పడిక్కల్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో ఉన్నారు. జూలై 26న ఈ సిరీస్ ముగిసాక వీరి ఇంగ్లండ్ పర్యటన అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. -
ఎక్కడ చూసినా పరుగులే.. భారత్కు ఆడటం ఖాయం!
ముంబై: గతేడాది జరిగిన ఐపీఎల్ ద్వారా ఈ లీగ్లో అరంగేట్రం చేసిన ఆర్సీబీ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్.. ఈ ఏడాది కూడా అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో పడిక్కల్ వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు ఘన విజయంలో సహకరించాడు. దాంతో పడిక్కల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్.. పడిక్కల్ను ఆకాశానికెత్తేశాడు. భవిష్యత్తులో ఆ యువ క్రికెటర్ టీమిండియాకు ఆడటం ఖాయమని జోస్యం చెప్పాడు. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్న పడిక్కల్కు భారత జట్టులో చోటిస్తే ఆశ్చర్యపోవాల్సిందేమీ ఉండదన్నాడు. ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాట్లాడిన గావస్కర్.. పడిక్కల్ దేశవాళీ జర్నీ అద్భుతమని కొనియాడాడు. అతను ఏ దేశవాళీ టోర్నీ ఆడినా పరుగుల దాహంతో తపించిపోతాడన్నాడు. ‘ టీమిండియా తరఫున పడిక్కల్ ఆడినా నాకేమీ ఆశ్చర్యం అనిపించదు. అతను క్లాస్ ఆటగాడు, అదే సమయంలో సామర్థ్యం కూడా ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో భారీ స్కోర్లు చేశాడు. ఎక్కడ చూసినా పరుగులే. రంజీ ట్రోఫీలో భారీ సెంచరీలు సాధించాడు. 50 ఓవర్ల క్రికెట్లోనూ అంతే. టీ20 క్రికెట్లో కూడా పరుగుల వరద పారించాడు. అటువంటి క్రికెటర్ను భారత జట్టులోకి ఎందుకు తీసుకోరు. పడిక్కల్ కచ్చితంగా భారత్ తరఫున ఆడతాడు. అది త్వరలో కావొచ్చు.. కాస్త ఆలస్యం కావొచ్చు’అని గావస్కర్ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ 7 మ్యాచ్ల్లో 700కు పైగా పరుగులు చేశాడు. అందులో నాలుగు వరుస సెంచరీలు ఉన్నాయి. ఇక గత ఐపీఎల సీజన్లో పడిక్కల్ 493 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకూ లిస్ట్-ఎ క్రికెట్లో 20 మ్యాచ్లు ఆడి 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 కెరీర్లో రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్క్లాస్ కెరీర్లో 15 మ్యాచ్లు ఆడి 10 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక్కడ అతని అత్యధిక స్కోరు 99. ఇక్కడ చదవండి: ఢిల్లీతో అక్షర్ పటేల్.. ఆ నవ్వే ఓ కథ అంటోన్న ఫ్రాంచైజీ 16 కోట్ల ఆటగాడిపై ఒత్తిడి.. నేనైతే అంత ఇవ్వను! ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..! -
పడిక్కల్కు సాయం చేసిన బట్లర్.. వీడియో వైరల్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాజస్తాన్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ను నడిపించిన పడిక్కల్ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో విజృంభించిన పడిక్కల్ 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకొని ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో పడిక్కల్ ఆటతీరుపై ప్రశంసలు కురుస్తున్న వేళ రాజస్తాన్ ఆటగాడు జోస్ బట్లర్ పడిక్కల్ షూలేస్ కట్టడం వైరల్గా మారింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో పడిక్కల్ షూలేస్ ఊడిపోయింది. ఇంతలో అది గమనించిన బట్లర్ పడిక్కల్ దగ్గరకు వచ్చి షూలేస్ కట్టి సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐపీఎల్ టీ20 డాట్కామ్ తన ఇన్స్టాలో షేర్ చేసింది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఇదే.. అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఆర్సీబీ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ముంబై వేదికగా ఏప్రిల్ 25న సీఎస్కేతో ఆడనుంది. చదవండి: ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..! టాస్ గెలిచి మరిచిపోయాడు.. ఏంటి కోహ్లి View this post on Instagram A post shared by IPL (@iplt20) -
ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..!
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ సెంచరీతో కదంతొక్కాడు. 52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్లతో 101 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అరుదైన జాబితాలో చేరిపోయాడు పడిక్కల్. భారత అన్క్యాప్డ్ ప్లేయర్గా సెంచరీ నమోదు చేసిన మూడో క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు 2009లో మనీష్ పాండే(114 నాటౌట్), పాల్ వాల్తాటి(120 నాటౌట్)లు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వారి సరసన్ పడిక్కల్ చేరాడు. 2009లో మనీష్ పాండు ఈ ఘనత సాధించగా, 2011లో వాల్తాటి ఈ ఫీట్ను చేరాడు. సుమారు పదేళ్ల తర్వాత ఒక భారత అన్క్యాప్డ్ ప్లేయర్ సెంచరీ చేశాడు. కాగా, ఆర్సీబీ విజయానికి 16 పరుగులు దూరంలో ఉన్న సమయంలో పడిక్కల్ను సెంచరీ కోసం అడిగినట్లు కెప్టెన్ కోహ్లి తెలిపాడు. ఆ సమయంలో పడిక్కల్ శతకం చేయడానికి 9 పరుగులే కావాలనే విషయాన్ని ఈ సందర్భంగా కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ తర్వాత పడిక్కల్ సెంచరీ గురించి పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో కోహ్లి మాట్లాడుతూ.. ‘సెంచరీ కోసం మేమిద్దరం చర్చించుకున్నాం. నన్ను మ్యాచ్ను ఫినిష్ చేయమని చెప్పాడు. నా సెంచరీ గురించి ఆలోచించకుండా మ్యాచ్ను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేద్దాం అని పడిక్కల్ అన్నాడు. ఇది నీకు తొలి సెంచరీ అవుతుందని చెప్పా. కానీ ఇటువంటివి చాలా వస్తాయి అని పడిక్కల్ నాతో అన్నాడు. దానికి నేను అంగీకరిస్తూనే ముందు ఈ మైలురాయిని ముందు చేరుకో అని చెప్పా. ఈ సెంచరీ పూర్తి చేసుకుని అప్పుడు చెప్పు అని అన్నాడ. పడిక్కల్కు మూడంకెల మార్కును దాటే అర్హత ఉంది’ అని తెలిపాడు. నిన్నటి మ్యాచ్లో విరాట్ కోహ్లి 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసే సరికి బోర్డుపై 181 పరుగులు ఉండటంతో ఆ జట్టు కొత్త రికార్డును లిఖించింది. ఇది ఆర్సీబీకి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదైంది. ఆర్సీబీ క్రికెట్ చరిత్రలో అంతకుముందు 2013లో క్రిస్ గేల్-దిల్షాన్లు నమోదు చేసిన 167 పరుగుల రికార్డును పడిక్కల్-కోహ్లిల జోడి సవరించింది. 2016లో గేల్-కోహ్లిలు కింగ్స్ పంజాబ్పై నమోదు చేసిన 147 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీ తరఫున మూడొ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది. -
అలాంటి పరిస్థితుల్లో గంభీర్లా ఆడాలని ఉంటుంది: పడిక్కల్
ముంబై: జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్లే చేసిన రోల్స్ను ప్లే చేయాలని ఉందని అంటున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్. స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన పడిక్కల్.. గంభీర్ తన ఆరాధ్య దైవమని, ఆట విషయంలో అతన్నే అనుకరిస్తానని చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. తాను ప్రాతినిధ్యం వహించే జట్టు ఏ స్థాయిదైనా గంభీర్ ఒకే డెడికేషన్తో ఆడతాడని, క్లిష్ట సమయాల్లో జట్టును ఆపద్బాంధవుడిలా ఆదుకుంటాడని, అతనో గొప్ప మ్యాచ్ విన్నర్ అని, అంచేతనే గంభీర్ను తాను ఆదర్శంగా తీసుకుంటానని అంటున్నాడీ 20 ఏళ్ల కేరళ కుర్రాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే గొప్ప ప్లేయర్లు పుట్టుకొస్తారని, అలాంటి చాలా క్లిష్ట సందర్భాల్లో గంభీర్ తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడని, తనకు కూడా అలాంటి రోల్స్ ప్లే చేయాలని ఉందని పడిక్కల్ ఆకాంక్షిస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్లో కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడం గొప్ప అనుభూతని, కోహ్లికి ఆట పట్ల ఉన్న నిబద్దత, విపరీతమైన ప్యాషన్ తనను బాగా ఆకర్శిస్తాయని పడిక్కల్ తెలిపాడు. కాగా, గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో ఆరోన్ ఫించ్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన పడిక్కల్.. ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఆ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లాడిన అతను 124. 80 స్ట్రయిక్ రేట్తో 379 పరుగులు సాధించి ఆర్సీబీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే, పడిక్కల్.. ప్రస్తుత సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. అతనాడిన రెండు మ్యాచ్ల్లో కేవలం 36 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ మాత్రం ఐపీఎల్ చరిత్రలో తొలిసారి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి మాంచి జోరుమీదుంది. కాగా, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ను గురువారం(ఏప్రిల్ 22) రాజస్థాన్తో ఆడుతుంది. చదవండి: మొన్న కోహ్లికి ఎసరు పెట్టాడు.. ఇప్పుడు మలాన్ వంతు -
వాషింగ్టన్, పడిక్కల్లకు బంపర్ ఆఫర్..
ముంబై: ఇటీవలి కాలంలో జరిగిన అన్ని క్రికెట్ ఫార్మాట్లలో విశేషంగా రాణించిన వాషింగ్టన్ సుందర్, దేవ్దత్ పడిక్కల్లు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా.. ఈ యువ క్రికెటర్లతో దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్యూమా ఇదివరకే టీమిండియా స్టార్ క్రికెటర్లను తమ సంస్థ ప్రచారకర్తలుగా నియమించుకుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, యువరాజ్సింగ్ లాంటి స్టార్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్ సుష్మా వర్మతో ప్యూమా ఒప్పందం కుదుర్చుకుంది. 'ప్యూమా ఫరెవర్ ఫాస్టర్ స్పిరిట్' అనే నినాదానికి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు సరిగ్గా సరిపోతారని, అందుకే వారిని ఎంపిక చేసుకున్నట్లు ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్ గంగూలీ వెల్లడించారు. స్టార్ ఆటగాళ్లనే కాకుండా యువ క్రికెటర్లను కూడా ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో ఈ ఇద్దరు క్రికెటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ప్యూమాతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఈ ఇద్దరు క్రికెటర్లు స్పందించారు. ప్యూమా లాంటి సంస్థతో డీల్ కుదుర్చుకోవడం తమ అదృష్టమని, ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల సరసన చేరడం నిజంగా గొప్ప అనుభూతి అని ఇద్దరు క్రికెటర్లు తెలిపారు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో విశేషంగా రాణించిన వాషింగ్టన్ సుందర్.. ఆతరువాత ఇంగ్లండ్తో జరిగిన సిరస్లోనూ ఆకట్టుకున్నాడు. సుందర్ ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు గత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున టాప్ స్కోరర్గా నిలిచిన పడిక్కల్.. ఈ ఏడాది జరిగిన దేశవాళీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో పరుగుల వరద పారించాడు. ప్యూమా ఎంచుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లే కావడం విశేషం. చదవండి: సీఎస్కే అసలుసిసలైన ఆల్రౌండర్ అతనే.. -
'ఆ చిన్న లోపాలు సరిచేసుకో.. మిగతాదంతా సూపర్'
ముంబై: ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ గతేడాది ఐపీఎల్ సీజన్లో ఆ జట్టు తరపున టాప్ స్కోరర్గా నిలిచిన సంగతి తెలిసిందే. 15 మ్యాచ్లాడిన పడిక్కల్ 473 పరుగులు సాధించగా.. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్లో ముంబైతో మ్యాచ్కు ముందు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషనలో ఉన్న అతన్ను ముంబైతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే ఎస్ఆర్హెచ్తో జరిగిన రెండో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చిన పడిక్కల్ 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పడిక్కల్ ఆటతీరుపై కీలకవ్యాఖ్యలు చేశాడు.''పడిక్కల్లో మంచి టాలెంట్ దాగుంది. గతేడాది ఐపీఎల్ సీజన్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేగాక గత ఐదు నెలలుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న పడిక్కల్ విజయ్ హజారే ట్రోపీలో 700 పరుగులకు పైగా సాధించాడు. అతని బ్యాటింగ్లో ఉన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుంటే ఈ సీజన్లో సెంచరీ మార్క్ సహా పలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను చెన్నై వేదికగా రేపు కేకేఆర్తో తలపడనుంది. చదవండి: చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్ మాత్రం -
పడిక్కల్ను పక్కకు పెట్టడానికి కారణం అదేనా..
చెన్నై: ఇటీవలే కరోనా బారిన పడి, తిరిగి కోలుకుని జట్టులో చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్కు ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభ మ్యాచ్లో ఆడే అవకాశం లభించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు(15 మ్యాచ్ల్లో 473 పరుగులు, 5 హాఫ్ సెంచరీలు) సాధించిన ఆటగాడిగా నిలిచిన ఈ కేరళ కుర్రాడిని ముంబైతో జరిగిన మ్యాచ్ నుంచి ఎందుకు తప్పించారని ఆరా తీస్తున్న సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. కరోనా నుంచి కోలుకుని పట్టుమని మూడు రోజులు కూడా గడవక ముందే పడిక్కల్ను డైరెక్ట్గా బయో బబుల్లోకి తీసుకురావడంపై ఇతర ఫ్రాంఛైజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను ఆర్సీబీ యాజమాన్యం తుంగలో తొక్కిందని, దీని వల్ల ఇతర ఆటగాళ్లు వైరస్ బారిన పడే ప్రమాదముందని మిగతా ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. హోమ్ క్వారంటైన్ అనే ఆప్షన్ ఎవరికీ లేనప్పుడు ఆర్సీబీ ఆటగాడికి ఎందుకా ఆప్షన్ ఇచ్చారని ఓ ఫ్రాంచైజీ యజమాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తతంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్ను ఈ మ్యాచ్ నుంచి తప్పించిందని తెలుస్తుంది. కాగా, మార్చి 22న పడిక్కల్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అతను ఆర్సీబీ క్యాంప్ను నుంచి నేరుగా హోం క్వారంటైన్కు వెళ్లి, తిరిగి ఏప్రిల్ 7న ఆర్సీబీ బబుల్లోకి నేరుగా ప్రవేశించాడు. అతనికి మూడు టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందనే తాము బబుల్లోకి అనుమతిచ్చామని ఆర్సీబీ యాజమాన్యం చెబుతుంది. చదవండి: మొన్న మైఖేల్ జాక్సన్ ఇవాళ దలేర్ మెహందీ.. -
ఒక ఓపెనర్కు రెస్ట్.. మరొక ఓపెనర్ క్వారంటైన్లో
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీలు తలపడుతుండగా ఇరుజట్లలో ఇద్దరు కీలక ఆటగాళ్లు మిస్సయ్యారు. వారిద్దరూ ఆయా జట్లలో ఓపెనర్లగా కీలక పాత్ర పోషించినవారే. ఒకరు ముంబై ఇండియన్స్ ఆటగాడు క్వింటాన్ డీకాక్ అయితే మరొకరు ఆర్సీబీ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. ఇటీవల కరోనా బారిన పడ్డ దేవదత్ పడిక్కల్కు విశ్రాంతి ఇస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోగా, డీకాక్ ఇంకా క్వారంటైన్లో ఉన్నాడు. దేవదత్ పడిక్కల్కు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో తొలి మ్యాచ్ తుది జట్టులో అవకాశం దక్కలేదని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్కు వచ్చిన క్రమంలో స్పష్టం చేశాడు. తాము ఆడే రెండో గేమ్ నాటికి పడిక్కల్ అందుబాటులోకి వస్తాడని కోహ్లి తెలిపాడు. దాంతో రజత్ పాటిదార్కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఇతను కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక డీకాక్ ఇంకా క్వారంటైన్లో ఉన్నాడు. దాంతో ముంబై తరఫున అరంగేట్రం చేసిన క్రిస్ లిన్ ఓపెనర్గా దిగాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్ కూడా ముంబై తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా ముంబైను బ్యాటింగ్కు ఆహ్వానించింది. -
పడిక్కల్కు పాజిటివ్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కష్టకాలం వచ్చింది. ఈ లీగ్పై కరోనా వైరస్ పడగ విప్పినట్లుంది. అందుకే ఆటగాళ్లు, గ్రౌండ్ సిబ్బంది, ఈవెంట్ మేనేజర్లు వరుసగా కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. తాజా పరిణామాలు, పాజిటివ్ రిపోర్టులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్కి ఈ మహమ్మారి సోకింది. గత నెల 22న అతని నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో 20 ఏళ్ల యువ బ్యాట్స్మన్ను బెంగళూరులోని తన స్వగృహంలో క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్ గడువు ముగిశాక వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలితే అతన్ని బయో బబుల్లోకి తీసుకుంటామని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్సీబీ మెడికల్ టీమ్ అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని అందులో పేర్కొంది. క్వారంటైన్ నేపథ్యంలో పడిక్కల్ ఈ నెల 9న జరిగే సీజన్ తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. చెన్నైలో మొదలయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ తలపడుతుంది. లీగ్ ప్రారంభం కాకముందే కరోనా బారిన పడ్డ క్రికెటర్ల సంఖ్య మూడుకి చేరింది. నితీశ్ రాణా (కోల్కతా నైట్రైడర్స్) కరోనా నుంచి కోలుకోగా... అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఐసోలేషన్లో ఉన్నాడు. ముంబై వేదికని మార్చలేదు: రాజీవ్ శుక్లా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలతో ముందుకెళ్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ‘ముంబై వేదికని మార్చే నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం అక్కడే మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయో బబుల్ కూడా ఉంది. కేసుల తీవ్రత పెరిగితే తప్ప స్టాండ్బై వేదికలు (హైదరాబాద్, ఇండోర్) పరిశీలించం’ అని శుక్లా తెలిపారు. -
కోహ్లితో ఓపెనర్గా అతనైతే బాగుంటుంది, కానీ..
చెన్నై: ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనర్గా వచ్చి అదరగొట్టిన నేపథ్యంలో ఐపీఎల్లో సైతం అతను ఓపెనింగ్ చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ విషయమై కోహ్లి సైతం ఆసక్తి కనబరచడటంతో అతనికి జోడి ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఆర్సీబీ ఓపెనింగ్ స్థానాలపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందిస్తూ.. కోహ్లితో ఓపెనింగ్ స్థానానికి తన ఛాయిస్ను వెల్లడించాడు. అతను కోహ్లికి జోడీగా డివిలియర్స్, దేవ్దత్ పడిక్కల్ పేర్లను పరిశీలించి, చివరకు యువ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్వైపు మొగ్గు చూపాడు. అయితే ఇంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పడిక్కల్ కరోనా బారిన పడటంతో అతను లీగ్కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ బలమైన టాపార్డర్ కలగి ఉందని హాగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో అన్ని జట్లతో పోలిస్తే ఆర్సీబీ టాప్-6 బ్యాట్స్మెన్లు చాలా ప్రమాదకరమని వివరించాడు. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్వెల్, డేనియల్ క్రిస్టియన్, మహమ్మద్ అజహారుద్దీన్, ఫిన్ అలెన్ లాంటి విధ్వంసకర వీరులు ఆర్సీబీ టాప్-6లో ఉన్నారన్నారు. కాగా, గతేడాది ఐపీఎల్లో పడిక్కల్ ఆర్సీబీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2020 సీజన్లో అతను 15 మ్యాచ్ల్లో 5 అర్ధసెంచరీల సాయంతో 473 పరుగులు సాధించి, కోహ్లి, డివిలియర్స్ లాంటి స్టార్లచే ప్రశంసలందుకున్నాడు. ఇటీవల ముగిసిన భారత దేశవాళీ టోర్నీలో సైతం అతను పరుగుల వరద పారించాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో అతను 7 మ్యాచ్ల్లో 4 శతకాలు బాది 147.70 సగటుతో 737 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ముంబై కెప్టెన్ పృథ్వీ షా(8 మ్యాచ్ల్లో 4 భారీ శతకాల సాయంతో 827 పరుగులు) తరువాత అత్యధిక పరుగులు సాధించింది పడిక్కలే కావడం విశేషం. చదవండి: ఆటగాళ్లకు కరోనా వ్యాక్సినేషన్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
ఆటగాడికి కరోనా.. ఆర్సీబీలో కలవరం
ఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికే ముందు ఆటగాళ్లు కరోనా బారిన పడడం ఆయా జట్ల ఫ్రాంచైజీలను కలవరపరుస్తుంది. లీగ్ ప్రారంభం కాకముందే ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆర్సీబీ ఆటగాడు దేవదత్ పడిక్కల్కు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం పడిక్కల్ ఐసోలేషన్ కేంద్రానికి పంపించినట్లు ఆర్సీబీ యాజమాన్యం తెలిపింది. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో దేవదత్ పడిక్కల్ ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. 15 మ్యాచ్ల్లో 473 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కాగా ఇప్పటికే కేకేఆర్ నుంచి నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్ కూడా కరోనా పాజిటివ్గా తేలడంతో క్వారంటైన్కు పంపించారు. మరోవైపు సీఎస్కే శిబిరంలో కూడా కరోనా కలకలం రేపింది. సీఎస్కే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలడంతో అతను పూర్తి ఐసోలేషన్లో ఉన్నాడు. కాగా, జట్టులోని సభ్యులు కానీ, కోచింగ్ స్టాఫ్కు కానీ ప్లేయర్స్ కానీ కరోనా రాకపోవడంతో సీఎస్కే యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది. చదవండి: సీఎస్కే శిబిరంలో కరోనా కలకలం ఐపీఎల్ 2021: కరోనా బారిన మరో క్రికెటర్ -
6 మ్యాచ్లు 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు..
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో కర్ణాటక ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) యువ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సీజన్లో నాలుగో సెంచరీ బాది.. టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్నాడు. ఈ మ్యాచ్లో పడిక్కల్ 119 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి మరో ఓపెనర్, కర్ణాటక కెప్టెన్ సమర్థ్ (22 ఫోర్లు, 3 సిక్స్లతో 192) విధ్వంసం తోడవడంతో కర్ణాటక 80 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్లోకి దూసుకెళ్లింది. గతేడాది ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన పడిక్కల్.. సూపర్ ఇన్నింగ్స్లతో ఆకట్టుకొన్నాడు. ఆ సీజన్లో పడిక్కల్ 15 మ్యాచ్ల్లో 124 స్ట్రైక్ రేట్తో 473 పరుగులు సాధించి, ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న అనుభవంతో అతను ప్రస్తుత దేశవాళీ సీజన్లో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సీజన్లో వరుసగా 52, 97, 152, 126*, 145*, 101 స్కోర్లు సాధించి పడిక్కల్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో పడిక్కల్ మొత్తం 673 పరుగులు సాధించి.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా తయారవుతన్నాడు. -
లారా మెచ్చిన యంగ్ క్రికెటర్ అతనే!
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఇప్పుడు ఉన్న ఇండియన్ యంగ్ క్రికెటర్లలలో తనకు ఎవరు ఇష్టమో ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఐదుగురు యంగ్ క్రికెటర్ల పేర్లు ప్రస్తావిస్తూ వారంటే తనకు ఎందుకు అంత ఇష్టమో పేర్కొన్నారు. లారాకు ఇష్టమైన క్రికెటర్లలో సంజూ సామ్సన్ ముందు వరుసలో ఉన్నాడు. తనకు ఇష్టమైన ప్లేయర్ల గురించి అడగగా ఆయన మొదట సంజూ పేరునే ప్రస్తావించారు. ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న సంజూ రెండు మ్యాచ్ల్లో 16 సిక్స్లు కొట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఆ తరువాత మ్యాచ్ల్లో దానిని కొనసాగించలేకపోయాడు. లారా, సంజూ గురించి మాట్లాడుతూ, ‘నాకు సంజూ సామర్థ్యం అంటే చాలా ఇష్టం. అతనికి మంచి టైమింగ్, సామర్థ్యం ఉంది. అతను ఉన్నత స్థాయికి చేరుతాడు’ అని అన్నారు. ఇక లారాకు ఇష్టమైన మరో క్రికెటర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్. ఈయన ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడి 461 పరుగులు చేశాడు. సరాసరి 41.90 పరుగులు. ‘ఒక వేళ టీంలో బెస్ట్ ప్లేయర్లు ఓపెనర్లుగా లేనప్పుడు సూర్యకుమార్ను నెంబర్ 3గా దించాలి. ఓపెనర్లు ఆడటంలో విఫలమైన ఇతను నిలకడగా ఆడి టీంని గెలిపించే అవకాశాలు ఉన్నాయి’ అని లారా పేర్కొన్నారు. ఇక తనకిష్టమంటూ లారా చెప్పిన మరో పేరు దేవ్దత్ పడిక్కల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్న దేవ్దత్ ఈ సీజన్లో ఆర్సీబీ జట్టులో ఎక్కువ రన్స్ చేశాడు. ఇక ఇతని గురించి లారా మాట్లాడుతూ, ‘దేవ్దత్కు చాలా సామర్థ్యం ఉంది. అయితే అతను కొన్ని విషయాలను మార్చుకోవాలి. నేను అతను కేవలం టీ20, ఐపీఎల్లో మాత్రమే ఆడాలని కోరుకోవడం లేదు. అతను టెస్ట్లలో కూడా ఆడాలి. దానికి కొన్ని టెక్నిక్లను తెలుసుకోవాలి’ అని అన్నారు. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తనకు ఇష్టమైన ఆటగాళ్లలో ఉన్నాడంటూ లారా చెప్పారు. ‘అతను కచ్ఛితంగా ఒక మంచి ఆటగాడు. అతని గురించి ఇంతకి మించి ఏం చెప్పగలను’ అని లారా పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఆటగాడు, అండర్ -19 మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా లారా దృష్టని ఆకర్షించాడు. ‘నాకు తెలిసి ప్రియమ్ గార్గ్కు చాలా సామర్థ్యం ఉంది’ అని అన్నారు. ఇక సన్రైజర్స్ జట్టులోని మరో ఆటగాడు, జమ్ము- కశ్మీర్ ఆల్ రౌండర్ అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడుతున్నాడు అంటూ లారా కితాబిచ్చాడు. చదవండి: ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా -
ఈ బెంగ తీరనిది..!
‘విలియమ్సన్ క్యాచ్ను పడిక్కల్ పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో’... ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో ఓడిన తర్వాత రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఇది! ఇదొక్కటి చాలు ఐపీఎల్లో అతని నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపించేందుకు. బ్యాటింగ్లో 131 పరుగులే చేయగలిగిన తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా 17 బంతుల్లో రైజర్స్ 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంతో కష్టసాధ్యమైన క్యాచ్ను తీవ్రంగా ప్రయతి్నంచిన తర్వాత కూడా ఒక యువ ఆటగాడు అందుకోలేకపోతే పరాజయాల్లో దానిని ఒక కారణంగా చూపించడం కోహ్లి పరిణతిని ప్రశ్నిస్తోంది. గత మూడు సీజన్లలో వరుసగా ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మెరుగ్గా నాలుగో స్థానంతో ముగించింది. అయితే తొలి సీజన్ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్ కోరిక మాత్రం తీరలేదు. ఆటగాడిగా, భారత కెప్టెన్గా ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి ఐపీఎల్ నాయకత్వంపై కూడా ఈ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తోంది. –సాక్షి క్రీడా విభాగం ఈసారి ఐపీఎల్లో తాము ఆడిన చివరి నాలుగు లీగ్ మ్యాచ్లు, ఎలిమినేటర్ కలిపి వరుసగా ఐదు మ్యాచ్లలో బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారిగా మాత్రమే 160 పరుగులు దాటగలిగింది. ఇలాంటి ప్రదర్శనతో ఐపీఎల్లో గెలుపును కోరుకోవడం అత్యాశే అవుతుంది. 2019 ఐపీఎల్లో ఆర్సీబీ టోర్నీ తొలి ఆరు మ్యాచ్లలో ఓటమి పాలైంది. తర్వాత ఐదు మ్యాచ్లు గెలిచినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే 2008 నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా కోహ్లి ట్రోఫీని అందిస్తాడని నమ్మారు. అందుకు తగినట్లుగా తొలి 10 మ్యాచ్లలో 7 గెలవడంతో ఆర్సీబీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపించింది. కానీ కథ మళ్లీ మొదటికి వచి్చంది. ఆ తర్వాత ఒక్క గెలుపూ దక్కక... రన్రేట్ అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్కు చేరినా, ఎలిమినేటర్లోనే జట్టు ఆట ముగిసింది. ఏబీ మెరుపు ప్రదర్శన... బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్ ప్రదర్శనే హైలైట్గా నిలిచింది. ఏకంగా 158.74 స్ట్రయిక్రేట్తో అతను 454 పరుగులు సాధించాడు. ఏబీ అర్ధసెంచరీ చేసిన ఐదు మ్యాచ్లలో నాలుగు సార్లు జట్టు గెలిచింది. డివిలియర్స్కు ఇతరుల నుంచి సహకారం లభించలేదు. తొలి ఐపీఎల్ ఆడిన యువ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ జట్టు తరఫున అత్యధికంగా 473 పరుగులు చేయడం మరో చెప్పుకోదగ్గ అంశం. బౌలింగ్లో 21 వికెట్లతో చహల్ సత్తా చాటగా, ఆరుకంటే తక్కువ ఎకానమీ నమోదు చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ఆ్రస్టేలియా కెపె్టన్ ఫించ్ వైఫల్యం (268 పరుగులు–1 అర్ధ సెంచరీ) జట్టును బాగా దెబ్బ తీసింది. గాయంతో మోరిస్ 9 మ్యాచ్లకే పరిమితం కావడం కీలక సమయంలో సమస్యగా మారింది. సీనియర్ పేసర్లు స్టెయిన్ (11.40 ఎకానమీ), ఉమేశ్ యాదవ్ (11.85)లు ఘోరంగా విఫలమవ్వగా... కోల్కతాతో (3/8) ప్రదర్శన మినహా సిరాజ్ భారీగా పరుగులిచ్చాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడే ఒక్క బ్యాట్స్మన్ కూడా లేకపోవడం జట్టులో పెద్ద లోటుగా కనిపించింది. కోహ్లి అంతంతే... అన్నింటికి మించి కోహ్లి వ్యక్తిగత వైఫల్యం కూడా జట్టును ఇబ్బంది పెట్టింది. కెపె్టన్ మొత్తంగా 466 పరుగులు చేసినా...స్ట్రయిక్రేట్ 121.35కే పరిమితమైంది. 2012 సీజన్లో వెటోరి మధ్యలో తప్పుకోవడంతో కెపె్టన్గా కోహ్లి బాధ్యతలు స్వీకరించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అతనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది పూర్తి సీజన్లలో కూడా కోహ్లి తన జట్టుకు టైటిల్ అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. 2016లో రన్నరప్గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. 125 మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరిస్తే గెలిచిన మ్యాచ్లకంటే (55) ఓడిన మ్యాచ్ల సంఖ్య (63) ఎక్కువ. ఈ నేపథ్యంలో కోహ్లి ఇంకా కెప్టెన్గా కొనసాగుతాడా, ఫ్రాంచైజీ యాజమాన్యం మార్పు కోరుకుంటుందా అనేది చూడాలి. బ్యాటింగ్పరంగా తాను నెలకొలి్పన ప్రమాణాలను కోహ్లి అందుకోలేకపోయాడు. అతనివైఫల్యమే జట్టును ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇంత కాలం బౌలింగ్ బలహీనంగా ఉండి ఓడిన బెంగళూరు ఇప్పుడు బ్యాటింగ్ బలహీనతతో ఓడింది. –సునీల్ గావస్కర్ 100 శాతం కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనేదే నా అభిప్రాయం. ఈ పరాజయాలకు నేనే కారణమని అతనే చెప్పుకోవాలి. ఎనిమిదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. ఇన్నేళ్లు ఒక్క ట్రోఫీ గెలవకుండా కూడా కెపె్టన్గా ఎవరైనా కొనసాగగలరా. కెప్టెన్సీ విషయంలో ధోని (3 టైటిల్స్), రోహిత్ (4 టైటిల్స్)లతో కోహ్లికి అసలు పోలికే లేదు. సరిగ్గా చెప్పాలంటే బెంగళూరుకు ప్లే ఆఫ్స్కు వెళ్లే అర్హతే లేదు. ఒక్క డివిలియర్స్ ప్రదర్శనతోనే వారు ముందుకొచ్చారు. – గంభీర్ -
‘అతనిది మాథ్యూ హేడెన్ స్టైల్’
దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదూత్ పడిక్కల్పై సహచర ఆటగాడు క్రిస్ మోరిస్ ప్రశంసలు కురిపించాడు. తాను ఆడుతున్న ఆరంభపు ఐపీఎల్ సీజన్లోనే అదరగొడుతున్న పడిక్కల్ అచ్చం ఆసీస్ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తరహాలోనే ఆడుతున్నాడన్నాడు. హేడెన్ను పడిక్కల్ గుర్తుచేస్తున్నాడని మోరిస్ కొనియాడాడు. షాట్ సెలక్షన్లో పడిక్కల్ను చూస్తుంటే హేడెన్ జ్ఞప్తికివస్తున్నాడన్నాడు. ‘అరోన్ ఫించ్తో పడిక్కల్ ఓపెనింగ్ పంచుకోవడం నిజంగా గొప్పగా అనిపిస్తోంది. పడిక్కల్ ఆటకు హేడెన్ ఆటకు చాలా దగ్గర లక్షణాలున్నాయి. సైజ్ పరంగా హేడెన్ భారీకాయుడు. హేడెన్ చెస్ట్ చాలా పెద్దది. ఇందులో పడిక్కల్కు పోలిక లేదు(నవ్వుతూ). బ్యాటింగ్ టెక్నిక్ పరంగా హేడెన్కు పడిక్కల్కు చాలా దగ్గర పోలికలున్నాయి. (రోహిత్ శర్మ ఔట్..) పడిక్కల్ను చూస్తే అతనిలో ఏదో ఉంది అనిపిస్తోంది’ అని మోరిస్ తెలిపాడు. ఇక తమ పేసర్లు నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్లపై మోరిస్ ప్రశంసలు కురిపించాడు. యువ పేసర్లు తమ జట్టులో ఉండటమే కాకుండా వారికి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టుకు విజయాల్ని అందిస్తున్నారన్నాడు. గతంలో సైనీ ఢిల్లీ జట్టులో ఉన్నప్పుడు తాను కూడా అదే ఫ్రాంచైజీలో ఉన్నానన్నాడు. అప్పుడే అతనొక మంచి బౌలర్ అనే విషయాన్ని గ్రహించానన్నాడు. ఆ టాల్ బౌలర్ బౌలింగ్ రాకెట్లు దూసుకుపోతున్నట్లు ఉంటుందన్నాడు. కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్ అసాధారణమని మోరిస్ కొనియాడాడు. -
విరాట్ వీరబాదుడు
పరుగు పెట్టని స్కోరు బోర్డుకు కోహ్లి మెరుగులు దిద్దాడు. బౌలర్ల అడ్డగా మారిన పిచ్పై తన బ్యాటింగ్ తడఖా చూపించాడు. బెంగళూరు ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆఖర్లో మెరిపించాడు. తర్వాత పని తమ బౌలర్లకు అప్పగించాడు. జట్టును గెలిపించాడు. దుబాయ్: బంతులు నిప్పులు చెరిగేచోట కోహ్లి బ్యాట్ గర్జించింది. ఇరు జట్లలో ఏ బ్యాట్స్మెన్కు సాధ్యం కానీ ఇన్నింగ్స్తో అతను బెంగళూరును గెలిపించాడు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 37 పరుగులతో చెన్నై సూపర్కింగ్స్ను ఓడించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్దత్ పడిక్కల్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్లో అరంగేట్రం చేసిన జగదీశన్ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు. ఫించ్ 2, ఏబీ 0 పిచ్ బౌలింగ్కు సహకరించడంతో బెంగళూరు పరుగు పరుగుకు చాలానే కష్టపడింది. పవర్ ప్లే (6 ఓవర్లు)లో కేవలం 36 పరుగులే చేసిన ఆర్సీబీ జట్టు ఎంతో ఆలస్యంగా... 8వ ఓవర్లో 50 పరుగులు చేసింది. అలాగని వికెట్లను టపాటపా కోల్పోలేదు. ఓపెనర్ ఫించ్ (2) ఒక్కడే ఔటయినప్పటికీ తొలి సిక్స్ పదో ఓవర్లో వచ్చింది. ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ ఆ సిక్సర్ కొట్టాడు. అలాగని ఫోర్లు బాదారనుకుంటే పొరపాటు. పడిక్కల్, కోహ్లి కలిసి ఈ 10 ఓవర్లలో కొట్టిన బౌండరీలు కూడా నాలుగే! మరుసటి ఓవర్లో దేవ్దత్తోపాటు డివిలియర్స్ (0)కూడా ఔటయ్యాడు. వీళ్లిద్దరిని శార్దుల్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో కోహ్లి ఉన్నా...ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో ఆర్సీబీ స్కోరు 100 చేరేందుకు మరో 8 (16వ)ఓవర్లు అవసరమయ్యాయి. కోహ్లి బాదితే... కోహ్లి ఆడితే... 30 బంతుల్లో 34 (2 ఫోర్లు)! అదే కోహ్లి బాదితే... 52 బంతుల్లో 90 నాటౌట్ (4 ఫోర్లు, 4 సిక్స్లు). చూశారా ఎంత తేడా ఉందో! కోహ్లినా మజాకా! మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. 14 ఓవర్ల పాటు కోహ్లి ఆడాడు. 15వ ఓవర్ నుంచి బాదేశాడు. ఫోర్లు, సిక్సర్లు తక్కువే అయినా... అతని ఫిట్నెస్ అసాధారణం కావడంతో సింగిల్స్ డబుల్స్తోనే అన్ని పరుగులు చేశాడు. అప్పటిదాకా వన్డేలా కనబడిన మ్యాచ్ 15వ ఓవర్ నుంచే టి20గా మారిపోయింది. అదే ఓవర్లో సుందర్ (10) అవుటైతే శివమ్ దూబే (22 నాటౌట్) జతయ్యాడు. 17వ ఓవర్లో దూబే, కోహ్లి చెరో ఫోర్ కొట్టారు.ఆ ఫోర్తో కోహ్లి 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయ్యింది. శార్దుల్ వేసిన ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ చుక్కలు చూపించింది. సామ్ కరన్ బౌలింగ్లో దూబే మొదట సిక్స్ బాదాడు. తర్వాత కోహ్లి లాంగాన్, స్క్వేర్ లెగ్ల మీదుగా రెండు సిక్సర్లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో మరో సిక్స్ లాంగాన్లో పడింది. 20వ ఓవర్లో బౌండరీ ఒక్కటే కొట్టినా చకచకా బంతికి రెండేసి పరుగులు తీశాడు. ఈ 2 ఓవర్లలో 14 చొప్పున పరుగులు రావడంతో బెంగళూరు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. చివరి 6 ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు సాధించింది. ఇందులో 56 పరుగులు కోహ్లివే. చతికిలపడిన చెన్నై... పిచ్ పరిస్థితులను గుర్తెరిగిన బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో చెన్నై పరుగులు చేయడంలో బెంగళూరు కంటే వెనుకబడిపోయింది. తొలి 5 ఓవర్లలో వరుసగా 4, 2, 7, 6, 2 పరుగులతో 21 స్కోరే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ (8) వికెట్నూ కోల్పోయింది. తర్వాత వాట్సన్ (14) కూడా చేతులెత్తేశాడు. 10 ఓవర్లు ముగిసే చెన్నై స్కోరు 47/2. ఇందులో ఏ ఒక్క ఓవర్లోనూ పట్టుమని 10 పరుగులైనా చేయలేకపోయింది. నానాకష్టాలు పడిన చెన్నై... 11వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకుంది. జగదీశన్, రాయుడు క్రీజులో పాతుకుపోయినా... పరుగులు, మెరుపులు కష్టతరం కావడంతో చేయాల్సిన లక్ష్యం కాస్తా కొండంత అయ్యింది. మూడో వికెట్కు ఎంతో కష్టపడుతూ 64 పరుగులు జోడించాక జగదీశన్ రనౌటయ్యాడు. తర్వాత ధోని (10) వచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్లో ఏకైక సిక్సర్ కొట్టాడు. ఆ వెంటనే అతనూ పెవిలియన్ చేరాడు. కుదురుగా ఆడిన రాయుడు క్లీన్బౌల్డయ్యాక ఇంకెవరూ కనీసం 8 పరుగులైనా చేయలేకపోయారు. సామ్ కరన్ (0), జడేజా (7), బ్రేవో (7) తేలిగ్గానే అవుటయ్యారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (సి) డుప్లెసిస్ (బి) శార్దుల్ 33; ఫించ్ (బి) చహర్ 2; కోహ్లి (నాటౌట్) 90; డివిలియర్స్ (సి) ధోని (బి) శార్దుల్ 0; సుందర్ (సి) ధోని (బి) స్యామ్ కరన్ 10; దూబే (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–13, 2–66, 3–67, 4–93. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–10–1, స్యామ్ కరన్ 4–0–48–1, శార్దుల్ ఠాకూర్ 4–0–40–2, బ్రేవో 3–0–29–0, కరణ్ శర్మ 4–0–34–0, జడేజా 2–0–7–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (బి) సుందర్ 14; డుప్లెసిస్ (సి) మోరిస్ (బి) సుందర్ 8; రాయుడు (బి) ఉదాన 42; జగదీశన్ (రనౌట్) 33; ధోని (సి) గురుకీరత్ (బి) చహల్ 10; స్యామ్ కరన్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 0; జడేజా (సి) గురుకీరత్ (బి) మోరిస్ 7; బ్రేవో (సి) పడిక్కల్ (బి) మోరిస్ 7; దీపక్ చహర్ (నాటౌట్) 5; శార్దుల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–19, 2–25, 3–89, 4–106, 5–107, 6–113, 7–122, 8–126. బౌలింగ్: మోరిస్ 4–0–19–3, సైనీ 4–0–18–0, ఉదాన 4–0–30–1, సుందర్ 3–0–16–2, చహల్ 4–0–35–1, దూబే 1–0–14–0.