Dhawan
-
ఈ సెలబ్రిటీల పెట్టుబడులు ఎక్కడో తెలుసా?
చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్లుగా ఎదుగుతున్నాయి. ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే! సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్లు.. శిఖర్ధావన్: అప్స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. విరాట్కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు. -
ఢిల్లీ దంచేసింది
నీరు పల్లమెరుగు అన్నట్లే పరుగు ప్రవాహామెరిగిన మ్యాచ్ ఇది. రహనే శతకంతో రాజస్తాన్ భారీ స్కోరే చేసింది. గెలుపు ఆశలతో ఉంది. కానీ ప్రత్యర్థి ఢిల్లీ కూడా ఛేదనలో ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా శిఖర్ ధావన్ తాను ఉన్నంతసేపు దంచేస్తే... రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో బంతి పదేపదే బౌండరీని తాకింది. ఢిల్లీ క్యాపిటల్స్ను విజయం వరించింది. జైపూర్: ఐపీఎల్లో మళ్లీ బంతి బలయింది. బ్యాట్ చెలరేగింది. దీంతో లక్ష్యం పెద్దదైనా ఛేదన సులువైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో రిషభ్ పంత్ (36 బంతుల్లో 78 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) పవర్ హిట్టింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే (63 బంతు ల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్ స్మిత్ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించాడు. రబడకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు) ఛేజింగ్కు అవసరమైన బ్యాటింగ్ చేశాడు. గోపాల్ 2 వికెట్లు తీశాడు. పంత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మార్పుల్లేని రాయల్స్ జట్టు బరిలోకి దిగగా... ఢిల్లీ క్యాపిటల్స్లో సందీప్ లమిచానే స్థానంలో మోరిస్ తుది జట్టులోకి వచ్చాడు. సామ్సన్ డకౌట్... టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు క్రీజులోకి వచ్చిన సంజూ సామ్సన్ (0) ఒక్క బంతి ఆడకుండానే రనౌటయ్యాడు. తర్వాత రహానేకు కెప్టెన్ స్మిత్ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో జట్టును నడిపించారు. రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన (ఇన్నింగ్స్ ఐదోది) ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న రహానే షార్ట్ ఫైన్ లెగ్లోకి షాట్ ఆడాడు. అక్కడే ఉన్న ఇషాంత్ శర్మ సులభమైన క్యాచ్ను నేలపాలు చేయడంతో బతికి పోయిన రహానే ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ వెంటనే రెండు బంతులను 6, 4గా తరలించాడు. రహానే కళాత్మక వేగం... లైఫ్ దక్కిన రహానే అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. కళాత్మక షాట్లతో అలరించాడు. రబడ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, ఫోర్తో 14 పరుగులు సాధించాడు. దీంతో పవర్ప్లేలో రాయల్స్ స్కోరు 52/1కు చేరింది. మరుసటి ఓవర్లోనే రహానే చూడచక్కని బౌండరీ బాది 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ కూడా ఫోర్లు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. దీంతో 10 ఓవర్లలో రాజస్తాన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. స్మిత్ 11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి కెప్టెన్ శ్రేయస్ శతవిధాలా కష్టపడినా ఫలితం పొందలేకపోయాడు. మరోవైపు స్మిత్ కూడా 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే అతను నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మిగతా వారెవరూ నిలకడగా ఆడలేకపోయారు. స్టోక్స్ (8), టర్నర్ (0), పరాగ్ (4) పెద్దగా కష్టపడలేదు. స్టువర్ట్ బిన్నీ (19; 2 ఫోర్లు) అండతో 58 బంతుల్లో రహానే శతకం సాధించాడు. అయితే రబడ ఆఖరి ఓవర్లో బిన్నీ, పరాగ్ వికెట్లను పడగొట్టడంతో జట్టు 200 పరుగుల మార్క్ను అందుకోలేకపోయింది. ధనాధన్ ఆరంభం... ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 192 పరుగులు. అంటే ఓవర్కు దాదాపు 10 పరుగులు చేయాలి. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలిద్దరు కూడా ఛేదించాల్సిన లక్ష్యానికి తగ్గట్లే ధనాధన్ ఆరంభమిచ్చారు. దీంతో క్యాపిటల్స్ స్కోరు క్రమపద్ధతిలో దూసుకెళ్లింది. రెండో ఓవర్ వేసిన కులకర్ణి బౌలింగ్లో 6, 4 బాదిన ధావన్ తన అర్ధసెంచరీ చేసేదాకా ఇదే ధాటిని కొనసాగించాడు. దీంతో ధావన్ ఉన్నంత సేపూ ప్రతీ ఓవర్లోనూ బౌండరీలు, సిక్సర్లు అలవోకగా వచ్చాయి. 25 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్సర్లు) శిఖర్ అర్ధశతకం పూర్తయింది. ఆ వెంటనే మరో బౌండరీ కొట్టిన అతను నిష్క్రమించడంతో 72 పరుగుల శుభారంభం ముగిసింది. పంత్ పటాకా... అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4) విఫలమయ్యాడు. 77 పరుగుల వద్ద రెండో వికెట్. రాజస్తాన్ శిబిరంలో ఆనందం. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు, ఢిల్లీ చితగ్గొట్టేందుకు ఎక్కువ సమయం పట్టనే లేదు. ఓపెనర్ పృథ్వీ షా (39 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన హిట్టర్ రిషభ్ పంత్ ఆద్యంతం తన ధాటిని కొనసాగించాడు. ఇద్దరు మరో భాగస్వామ్యానికి తెరలేపారు. ఒక ఓవర్లో çపృథ్వీ షా బౌండరీలు బాదితే మరుసటి ఓవర్లో పంత్ సిక్సర్లు కొట్టాడు. ఇలా ఒకర్నిమించి మరొకరు రాజస్తాన్ బౌలింగ్ను తుత్తునియలు చేయడంతో కొండంత లక్ష్యం చిన్నదైంది. పంత్ 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మూడో వికెట్కు 84 పరుగులు జోడించాక పృథ్వీ ఆట ముగిసినా... రూథర్ఫర్డ్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలువకపోయినా... రిషభ్ పంత్ తన సిక్సర్ల ధాటితో మ్యాచ్ను విజయవంతంగా ముగించాడు. కులకర్ణి, పరాగ్ చెరో వికెట్ తీశారు. ►ఈ మ్యాచ్లో డకౌట్ కావడం ద్వారా టి20 చరిత్రలో వరుసగా ఐదు ఇన్సింగ్స్లో ఖాతా తెరవకుండా ఔటైన తొలి బ్యాట్స్మన్గా ఆస్టన్ టర్నర్ గుర్తింపు పొందాడు. ►ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టుపై నమోదైన సెంచరీలు. ►ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నమోదైన సెంచరీలు. సామ్సన్ (రాజస్తాన్), బెయిర్స్టో, వార్నర్ (హైదరాబాద్), లోకేశ్ రాహుల్ (పంజాబ్), కోహ్లి (బెంగళూరు), రహానే (రాజస్తాన్) ఈ ఘనత సాధించారు. -
ధోని, ధావన్ సాధన
సిడ్నీ: ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా చేరిన టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని నెట్స్లో సాధన చేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో ధోని ఇండోర్ నెట్స్లో గడపగా... రాయుడు, ధావన్ పూర్తిగా కుడి, ఎడమ త్రో డౌన్స్ను ఎదుర్కొన్నారు. జాదవ్ రెండు నెట్స్లోనూ పాల్గొన్నాడు. ప్రాక్టీస్ ఐచ్ఛికం కావడంతో టెస్టు సిరీస్ నెగ్గిన మిగతా జట్టు సభ్యులెవరూ రాలేదు. -
ధావన్పై వేటు పడితే ఆశ్చర్యం లేదు!
ఇంగ్లండ్లో క్రికెట్ సీజన్ భారత్కు అనుకూలంగా మారిపోతుందనుకున్న దశలో కుర్రాడు స్యామ్ కరన్ నేతృత్వంలో ఆ జట్టు పేసర్లు ఒక్కసారిగా ఆశలు కూల్చేశారు. తొలి టెస్టును ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో గెలుచుకొని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగిందంటే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్ వల్లనే. చివరి వరుస బ్యాట్స్మెన్ను ఒక వైపు కాపాడుకుంటూ మరో వైపు పరుగులు చేస్తూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని కేవలం 13 పరుగులకే పరిమితం చేయడం కన్నార్పకుండా చూడగలిగిన ప్రదర్శన. ఇతరులతో పోలిస్తే పరిస్థితికి తగినట్లుగా మానసికంగా సిద్ధం కావడం గొప్ప ఆటగాళ్ల లక్షణం. కోహ్లి తాను ఎదుర్కొన్న ప్రతీ బంతి ద్వారా దానిని నిజం చేసి చూపించాడు. ఆరంభంలో బంతి విపరీతంగా స్వింగ్ అవుతున్న సమయంలో పట్టుదలగా ఆడిన కోహ్లి ఆ ఉత్కంఠ క్షణాలను అధిగమించాడు. తన బ్యాక్ లిఫ్ట్లు మార్పు చేసి, బ్యాట్ వేగాన్ని తగ్గించి అతను ఫలితం సాధించాడు. ఆ తర్వాత తనదైన శైలిలో చక్కటి షాట్లతో చెలరేగిపోయాడు. దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్లు మాత్రం మానసికంగా సన్నద్ధం కాలేకపోయారు. ధావన్ను రెండో టెస్టునుంచి తప్పిస్తారనే వార్తలు వినిపించాయి. అది నిజమైతే మాత్రం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. జట్టు ఎప్పుడు ఓడిపోయినా అందరికంటే ముందు అతనిపైనే వేటు పడుతూ వస్తోంది. ఓడిన మ్యాచ్లలో సహచరులకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాల్లో కూడా ధావన్పైనే వేటు వేశారు. అతనిపై అంత అపనమ్మకం ఉంటే అసలు విదేశీ పర్యటనల్లో ఎంపిక చేయడమెందుకు? దీనికి ధావన్ తనను తాను నిందించుకోవాలి. చక్కగా ఆడుతున్న సమయంలో కూడా అనవసరంగా వికెట్ పారేసుకునే తత్వం అతనిది. కనీసం డబుల్ సెంచరీలాంటి ఇన్నింగ్స్ ఆడితే అతనిపై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకం పెరిగి ఇతరులలాగే అదనపు అవకాశాలు ఇస్తారు కదా. పిచ్లు బ్యాటింగ్కు స్వర్గధామంలా నిలిస్తే తప్ప ఈ సిరీస్లో తక్కువ స్కోర్లు నమోదు కాబోతున్నాయని తొలి టెస్టు రుజువు చేసింది. కాబట్టి అదనపు బ్యాట్స్మన్తో ఆడటం జట్టుకు ఉపయోగకరం. పుజారాకు అవకాశం ఉంది కానీ కార్తీక్, అశ్విన్, పాండ్యా కూడా స్వింగ్ అవుతు న్న బంతిని ఆడలేకపోతున్నారు కాబట్టి ఆరో బ్యాట్స్మన్ పనికొస్తాడు. అయితే పుజారాను తీసుకురావాలంటే ఒక నమ్మకమైన ఆటగాడిని తప్పించాల్సి వస్తుంది. అది మాటల్లో చెప్పినంత సులువు కాదు. -
ధావన్ బాదేశాడు
-
ప్లే ఆఫ్కు సన్రైజర్స్
-
హైదరా'బాద్షా'
ధావన్ ధనాధన్ ముందు రిషభ్ పంత్ మెరుపులు వెలవెలబోయాయి. ఇప్పటిదాకా బౌలింగ్ సత్తాతో గెలిచిన సన్రైజర్స్ ఈసారి బ్యాట్తో పరుగుల వాన కురిపించింది. తొమ్మిదో విజయంతో ఐపీఎల్–11లో ప్లే ఆఫ్కు చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందిది. లీగ్ కీలక సమయంలో బ్యాటింగ్ కూడా బలపడటం హైదరాబాద్ ఆల్రౌండ్ సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసింది. న్యూఢిల్లీ: సన్రైజర్స్ బలం బౌలింగే. ఇంటాబయటా హైదరాబాద్ విజయాల్లో బౌల ర్లదే కీలక భూమిక. కానీ ఫిరోజ్ షా కోట్లాలో సీన్ మారింది. ముందుగా బౌలింగ్లో తేలిపోయింది. రిషభ్ తుఫాను సెంచరీలో నిండా మునిగింది. కానీ బ్యాటింగ్లో ఎగిసిపడింది. కష్టమైన లక్ష్యాన్ని హైదరాబాద్ ధనాధన్ మెరుపులతో అధిగమించింది. గురువారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్డెవిల్స్పై ఘన విజయం సాధించింది. వరుసగా ఆరో విజయంతో ఈ సీజన్లో తొమ్మిదో గెలుపుతో సన్రైజర్స్ ప్లే ఆఫ్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (63 బంతుల్లో 128 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత హైదరాబాద్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (50 బంతుల్లో 92 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి గెలిపించారు. 60 బంతుల్లో 60 చేయలేదు కానీ... ఈ టి20 మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ను 10–10 ఓవర్లుగా విడదీసి చూసుకుంటే ఆరంభం పేలవంగానే కనబడుతుంది. తొలి సగం ఇన్నింగ్స్లో డేర్డెవిల్స్ బంతికో పరుగైనా చేయలేదు. పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసింది. రెండో సగం మాత్రం దద్దరిల్లింది. ఈ సెకండాఫ్లో నష్టపోయింది రెండే వికెట్లు... కానీ తుఫాన్ వేగంతో ఏకంగా 135 పరుగులు చేసేసింది. పవర్ స్టార్ పంత్ డెత్ ఓవర్లలో సన్ బౌలర్లను చితగ్గొట్టాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి నాలుగో ఓవర్లోనే కష్టాలు రెట్టింపయ్యాయి. ఓపెనర్లు పృథ్వీ షా (9), జాసన్ రాయ్ (11) ఇద్దరూ షకీబ్ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల్లోనే నిష్క్రమించారు. అప్పటికి ఢిల్లీ స్కోరు 21/2. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ల ఆట మొదలైంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఆరో ఓవర్లో పంత్ ‘హ్యాట్రిక్’ ఫోర్లతో ఢిల్లీకి ఊపు తెచ్చాడు. కానీ అతని అనవసర పిలుపు కెప్టెన్ అయ్యర్ (3)ను రనౌట్ చేసింది... ఢిల్లీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ దశలో రిషభ్కు హర్షల్ పటేల్ జతయ్యాడు. పదో ఓవర్దాకా సాదాసీదాగానే ఇన్నింగ్స్ సాగింది. సరిగ్గా 11వ ఓవర్ నుంచి పంత్ ప్రతాపం మొదలైంది. కౌల్ వేసిన ఆ ఓవర్లో అతను సిక్స్, ఫోర్తో 14 పరుగులు రాబట్టాడు. 12వ ఓవర్లో రషీద్నూ వదిలిపెట్టలేదు. మూడు బౌండరీలతో మరో 15 పరుగులు పిండుకున్నాడు. ‘భువి’కి దించాడు... హైదరాబాద్ డెత్ ఓవర్ల కింగ్ భువనేశ్వర్. అలాంటి అనుభవజ్ఞుడైన భువీని ఒక్కో షాట్తో నేలకు దించాడు రిషభ్ పంత్. ఇంతవరకు పూర్తి కోటాలో 25, 30 పరుగులిచ్చుకోని ఈ పేసర్ను ఫిఫ్టీ పరుగుల క్లబ్లో చేర్చాడు. భువీ వేసిన 18 ఓవర్లో 18 పరుగులు బాదేసిన యువ సంచలనం... చివరి ఓవర్లో అయితే శివమెత్తాడు. ఫీల్డర్లకు చిక్కని బౌండరీలను, ప్రేక్షకుల చేతికందే సిక్సర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. ఆడుతూ పాడుతూ... 18.5 ఓవర్లు వేసిన ఢిల్లీకి ఏ ఓవరూ కలిసిరాలేదు. 113 బంతులేస్తే... ఒకే ఒక్క బంతి మాత్రం హేల్స్ (14)ను ఔట్ చేసింది. ఢిల్లీని మురిపించింది. కానీ ఇది క్షణాలపాటే! తర్వాత ప్రతి బంతి, ప్రతి ఓవర్ అన్ని హైదరాబాద్ను విజయబావుటావైపే తీసుకెళ్లాయి. రెండో ఓవర్లోనే ఓపెనర్ ధావన్కు జతయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కడదాకా సమన్వయంతోనే బ్యాటింగ్ చేశాడు. పరస్పరం స్ట్రయికింగ్ మార్చుకుంటూ, చేయాల్సిన రన్రేట్ను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ హైదరాబాద్ పరుగుల నావను నడిపించారు. ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసిన సన్రైజర్స్ సగం ఓవర్లు ముగిసేసరికి 91/1తో పటిష్టస్థితికి చేరింది. ధావన్ 30 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ 38 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. శ్రేయస్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఆఖరిదాకా ఆడుతూ పాడుతూనే పని ముగించారు. అబేధ్యమైన రెండో వికెట్కు 176 పరుగులు జోడించి సన్రైజర్స్ను గెలిపించారు. ఈ విధ్వంసం వీరోచితం... లీగ్లో హైదరాబాద్ భీకర బౌలింగ్ లైనప్ను చూసి బరిలో దిగకముందే జట్లకు జట్లు జావగారిపోతున్న వేళ... రిషభ్ పంత్ ఒక్కడు నిలిచాడు. షాట్లకు వీలుచిక్కని బంతులతో ప్రత్యర్థులను ముప్పేట చుట్టేస్తున్న భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్ త్రయాన్ని గురువారం మ్యాచ్లో నాలుగు చెరువుల నీళ్లు తాగించాడు. కసిగా కొట్టాలన్న పంతం పట్టాడో, మ్యాచ్లో తనవల్ల జరిగిన రెండు రనౌట్ తప్పులను దిద్దుకోవాలన్న దీక్షబూనాడో కాని ర్యాంప్ షాట్లతో చెరిగేశాడు. వాస్తవానికి మ్యాచ్లో రిషభ్ వస్తూనే వరుసగా మూడు ఫోర్లు కొట్టి దూకుడుగా కనిపించాడు. కానీ, కెప్టెన్ అయ్యర్ రనౌట్తో పరిస్థితిని గ్రహించి కొంత తగ్గాడు. కుదురుకున్నాక మాత్రం వెనుదిరిగి చూడలేదు. అతడి దెబ్బకు మొదటి నుంచి బలైంది సిద్ధార్థ్ కౌల్. తర్వాతి వంతు రషీద్ ఖాన్ది. మధ్యలో షకీబ్ కూడా చిక్కినా అప్పటికి కోటా అయిపోవడంతో బతికిపోయాడు. ఇక డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్కు 18, 20వ ఓవర్లలో ఏకంగా చుక్కలు చూపాడు. క్రీజుకు ముందు నిల్చొని, పాదాలను వేగంగా కదిలిస్తూ, ర్యాంప్ షాట్కు బ్యాట్ను పూర్తిగా తెరిచేసి... ఇలా అతడి బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో ఇతరులకు పాఠం చెబుతున్నట్లుగా ఆడాడు. ఈ రెండు ఓవర్లలో భువీ వైడ్ సహా 44 పరుగులివ్వగా... అందులో పంత్ చేసినవే 43. చివరి ఓవర్లో అయితే రిషభ్ విధ్వంసమే సృష్టించాడు. రెండు ఫోర్లు, మూడు వరుస సిక్స్లతో 26 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్తో రిషభ్... ఇషాన్ కిషన్, సంజు శామ్సన్ వంటి యువ వికెట్ కీపర్లతో పోటీలో ఒక మెట్టు పైకెదిగాడనేది కాదనలేని నిజం. ►50 ఐపీఎల్ చరిత్రలో నమోదైన సెంచరీల సంఖ్య ►12 ఐపీఎల్లో సెంచరీ చేసిన 12వ భారతీయ క్రికెటర్ రిషభ్ పంత్. గతంలో మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, పాల్ వాల్తాటి, రహానే, సచిన్, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రైనా ఒక్కో సెంచరీ చేశారు. మురళీ విజయ్, సెహ్వాగ్ రెండేసి సెంచరీలు సాధించారు. విరాట్ కోహ్లి అత్యధికంగా నాలుగు సెంచరీలు చేశాడు. ►128 ఐపీఎల్లో, టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రిషభ్ పంత్. ►2 మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు–2009లో) తర్వాత ఐపీఎల్లో సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా పంత్ (20 ఏళ్ల 218 రోజులు). -
శిఖర్ నడిపించగా...
శ్రీలంక చేతిలో పరాజయం నుంచి భారత్ వెంటనే కోలుకుంది. బౌలర్ల సమష్టి ప్రదర్శనకు తోడు శిఖర్ ధావన్ మరోసారి కదం తొక్కడంతో ముక్కోణపు టి20 టోర్నీలో బోణీ చేసింది. ఆడుతూ పాడుతూ బంగ్లాదేశ్పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. టి20 తరహాలో భారీ షాట్లు, మెరుపు బ్యాటింగ్ పెద్దగా కనిపించని ఈ మ్యాచ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగించగా... బంగ్లాదేశ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఫలితంగా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే గెలుపు రోహిత్ సేన ఖాతాలో చేరింది. కొలంబో: ముక్కోణపు టి20 టోర్నీ (నిదహాస్ ట్రోఫీ)లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లిటన్ దాస్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), షబ్బీర్ రహమాన్ (26 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో ఉనాద్కట్ 3, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విజయ్ శంకర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (43 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఫామ్ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, సురేశ్ రైనా (27 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 54 బంతుల్లో 68 పరుగులు జోడించారు. చివర్లో మనీశ్ పాండే (19 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. తమ తర్వాతి మ్యాచ్లో భారత్ సోమవారం శ్రీలంకతో తలపడుతుంది. నిస్సారంగా... భారత్తో గతంలో ఆడిన ఐదు టి20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఈ మ్యాచ్లోనూ నాసిరకంగా కనిపించింది. టి20 స్థాయిలో ఎలాంటి మెరుపులు లేకుండా, ఒక్క ఆటగాడు కూడా ధాటిగా ఆడకుండా జట్టు ఇన్నింగ్స్ సాగింది. మధ్యలో భారత్ రెండు క్యాచ్లు వదిలేసినా, రనౌట్ అవకాశాలు వృథా చేసినా ఆ జట్టు వాటిని ఉపయోగించుకోలేకపోయింది. జట్టు ఇన్నింగ్స్లో ఏకంగా 55 డాట్ బాల్స్ ఉండటం పరిస్థితిని సూచిస్తోంది. ఉనాద్కట్ వేసిన మూడో ఓవర్లో సిక్సర్ కొట్టిన సర్కార్ (14) అదే ఓవర్లో వెనుదిరగడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శార్దుల్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన తమీమ్ (15) తర్వాతి బంతికే అవుటయ్యాడు. విజయ్ శంకర్ తొలి ఓవర్లో రైనా, సుందర్ క్యాచ్లు వదిలేయడంతో బతికిపోయిన దాస్ ఆ తర్వాత మరికొన్ని పరుగులు జోడించగలిగాడు. కీపర్ కార్తీక్ క్యాచ్తో ముష్ఫికర్ (18) ఆట ముగిసింది. రివ్యూ ద్వారా భారత్ ఈ ఫలితం పొందగా... విజయ్ శంకర్ కెరీర్లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. కెప్టెన్ మహ్ముదుల్లా (1) కూడా ప్రభావం చూపలేకపోయాడు. దాస్ను చహల్ ఔట్ చేయగా, చివర్లో వేగంగా ఆడే ప్రయత్నం చేసిన షబ్బీర్ను చక్కటి బంతితో ఉనాద్కట్ డగౌట్కు పంపించాడు. బంగ్లా బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన మన బౌలర్లు కొన్ని సార్లు గతి తప్పారు. 11 వైడ్లు, 2 నోబాల్లు సహా మొత్తం 15 పరుగులు ఎక్స్ట్రాలు ఇచ్చారు. అర్ధసెంచరీ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీమిండియా విజయం దిశగా దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ రెండో బంతిని ఫోర్గా మలచి ధావన్ శుభారంభం చేయగా, రెండో ఓవర్లో రోహిత్ (17) తాను ఎదుర్కొన్న ఐదు బంతుల వ్యవధిలో మూడు బౌండరీలు బాదాడు. అయితే ముస్తఫిజుర్ బంతిని రోహిత్ వికెట్లపైకి ఆడుకోగా, కొద్ది సేపటికి రూబెల్ బౌలింగ్లో రిషభ్ పంత్ (7) కూడా అదే తరహాలో అవుటయ్యాడు. ఈ దశలో ధావన్, రైనా చకచకా పరుగులు సాధిస్తూ పోయారు. ధావన్ గత మ్యాచ్ జోరును కొనసాగించగా, రైనా మాత్రం తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. మెహదీ హసన్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ ద్వారా కొట్టిన సిక్సర్తో రైనా అంతర్జాతీయ టి20ల్లో 50 సిక్సర్లు పూర్తి చేసుకోవడం విశేషం. నజ్ముల్ బౌలింగ్లో ఫైన్లెగ్ దిశగా ఫోర్ కొట్టిన ధావన్ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగినా... దినేశ్ కార్తీక్ (2 నాటౌట్)తో కలిసి పాండే జట్టును గెలిపించారు. -
ఇంటాబయటా ఎక్కడైనా గెలుస్తాం: ధావన్
భారత వన్డే జట్టు అద్భుతంగా రాణిస్తోందని, ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలిగే సత్తా ప్రస్తుత కోహ్లి సేనలో ఉందని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో చాలా మంది అనుభవజ్ఞులున్నారు. సత్తాగల కుర్రాళ్లతో సమతూకంగా ఉంది. పాండ్యాలాంటి ఆల్రౌండర్ జట్టుకు అదనపు బలం. దీంతో దక్షిణాఫ్రికాల పేలవమైన రికార్డును చెరిపేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది’ అని ధావన్ అన్నాడు. ఫ్లాట్ పిచ్లపై కూడా చెలరేగే మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లను ఎదుర్కోవడం ఇప్పుడు ఏ జట్టుకైనా కష్టమేనన్నాడు. -
ఎమిరేట్స్ అనుచిత ప్రవర్తన!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్కు దక్షిణాఫ్రికాకు వెళ్లే సమయంలో అనూహ్య ఘటన ఎదురైంది. దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సిబ్బంది ధావన్ కుటుంబ సభ్యులను అడ్డుకున్నారు. అతని భార్య, పిల్లల గుర్తింపు కోసం బర్త్ సర్టిఫికెట్తో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించాల్సిందిగా కోరారు. దాంతో సర్టిఫికెట్లు వచ్చే వరకు వారిని అక్కడే ఉంచి ధావన్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా వెళ్లిపోవాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో ధావన్ తన ఆగ్రహాన్ని ప్రకటించాడు. ‘ఎమిరేట్స్ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. కేప్టౌన్ ఫ్లయిట్ ఎక్కే సమయంలో నా కుటుంబ సభ్యులు ప్రయాణించడానికి వీల్లేదని వారు చెప్పారు. నా భార్యా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించమన్నారు. మేం వాటిని వెంట తీసుకుపోలేదు. దాంతో డాక్యుమెంట్ల కోసం ఎదురు చూస్తూ వారు ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. అలాంటివి అవసరం అని భావిస్తే మేం ముంబైలో ఫ్లయిట్ ఎక్కే సమయంలోనే అధికారులు చెప్పాలి కదా. కారణం లేకుండా ఎమిరేట్స్ ఉద్యోగి ఒకరు దురుసుగా ప్రవర్తించాడు’ అని ధావన్ ఆక్రోశించాడు. -
చెలరేగిన ధావన్
సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ధావన్ (63 నాటౌట్), మరో ఓపెనర్ రోహిత్ శర్మ(43 నాటౌట్) రాణిస్తున్నారు. శిఖర్ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డులో వేగం పెంచాడు. శాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సింగిల్ తీసిన ధావన్ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 13 ఓవర్లలో భారత్ స్కోరు 114/0. -
రాణించిన భారత ఓపెనర్లు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో వరుసగా ఐదు మ్యాచ్లలో 50కి పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించిన ఆటగాళ్లుగా నిలిచారు. 2015లో చివరిసారి ఈ జోడీ 50కి పైగా పరుగులు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఆటగాళ్లు ఆపై రన్రేట్ను మెరుగు పరిచారు. 25 ఓవర్లలో శతక భాగస్వామ్యం అందించాక 132 పరుగుల వద్ద రహానే(78 బంతుల్లో 62: 8 ఫోర్లు) ను విండీస్ బౌలర్ జోసెఫ్ ఔట్ చేశాడు. మిడాన్లో విండీస్ కెప్టెన్ హోల్డర్ క్యాచ్ పట్టడంతో రహానే తొలి వికెట్గా వెనుదిరిగాడు. 32వ ఓవర్లో మరో ఓపెనర్ ధావన్(78 బంతుల్లో 87: 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. విండీస్ బౌలర్ బిషూకు ధావన్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయి రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 32 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. -
ముంబైని పడగొట్టి ముందడుగు..
-
ముంబైని పడగొట్టి ముందడుగు...
⇒హైదరాబాద్ కీలక విజయం ⇒ప్లే ఆఫ్కు మరింత చేరువ ⇒7 వికెట్లతో ముంబై చిత్తు ⇒రాణించిన ధావన్, కౌల్ డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ కీలక సమయంలో స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యే స్థితిలో బరిలోకి దిగిన జట్టు సొంతగడ్డపై తమ బలాన్ని ప్రదర్శించింది. ముందు బౌలింగ్లో, ఆ తర్వాత బ్యాటింగ్లోనూ సమష్టి ప్రదర్శనతో పటిష్ట ముంబైని కంగుతినిపించింది. ఫలితంగా లీగ్లో ముందుకెళ్లే అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఉప్పల్ స్టేడియంలో తమ చివరి లీగ్ మ్యాచ్లో నెగ్గి సీజన్లో సొంత మైదానంలో తమ విజయాల రికార్డును 6–1తో ముగించింది. హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్కు ఐపీఎల్లో మరో చక్కటి విజయం దక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. సునాయాస లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం సన్రైజర్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (46 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి బ్యాటింగ్తో ముందుండి నడిపించగా... హెన్రిక్స్ (35 బంతుల్లో 44; 6 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్కు 66 బంతుల్లో 91 పరుగులు జోడించారు. హైదరాబాద్ శనివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్తో కాన్పూర్లో తలపడుతుంది. కెప్టెన్ ఇన్నింగ్స్... భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మైదానంలో మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయింది. 20 ఓవర్లలో ఏ దశలోనూ ఆ జట్టు రన్రేట్ ఓవర్కు 7 పరుగులు దాటలేదు. నెమ్మదైన పిచ్తో పాటు సన్రైజర్స్ బౌలర్లు ప్రత్యర్థిని పూర్తిగా కట్టి పడేశారు. తొలి రెండు ఓవర్లలో 4 పరుగులే చేసిన ముంబై, సిమన్స్ (1) వికెట్ కూడా కోల్పోయింది. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ సహా 16 పరుగులు రాగా, ఒత్తిడిలో నితీశ్ రాణా (9) విఫలమయ్యాడు. పవర్ప్లే ముగిసేసరికి ముంబై 36 పరుగులే చేయగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో పార్థివ్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రోహిత్, హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 15) కలిసి జట్టును ఆదుకున్నారు. రోహిత్ ధాటిని ప్రదర్శించగా, పాండ్యా సింగిల్స్కే పరిమితమయ్యాడు. హెన్రిక్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్కు 49 బంతుల్లో 60 పరుగులు జోడించిన తర్వాత పాండ్యా అవుటయ్యాడు. కొద్ది సేపటికే కౌల్ బౌలింగ్లో రోహిత్ కూడా బౌల్డ్ కాగా, పొలార్డ్ (5) ప్రభావం చూపలేకపోయాడు. భారీ భాగస్వామ్యం... ఫామ్లో ఉన్న కెప్టెన్ వార్నర్ (6)ను ఆరంభంలోనే అవుట్ చేసి ముంబై సంబరాల్లో మునిగింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ధావన్, హెన్రిక్స్ సాధికారిక బ్యాటింగ్ ముందు ఎలాంటి వ్యూహాలు పని చేయలేదు. ఎలాంటి తడబాటు లేకుండా చకచకా పరుగులు రాబట్టిన ధావన్, హెన్రిక్స్లను ఏ ముంబై బౌలర్ కూడా నియంత్రించలేకపోయాడు. కరణ్ శర్మ బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లతో ధావన్ దూకుడు కనబర్చగా, పాండ్యా, మలింగ ఓవర్లలో హెన్రిక్స్ రెండేసి ఫోర్లు కొట్టాడు. చివరకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. మరో ఎండ్లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, యువరాజ్ (9) విఫలమయ్యాడు. అయితే విజయ్ శంకర్ (15 నాటౌట్) సహకారంతో ధావన్ మ్యాచ్ ముగించాడు. ఇదీ సమీకరణం... ఐపీఎల్లో అధికారికంగా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న కోల్కతా, పుణే కూడా దాదాపుగా ముందుకు వెళ్లినట్లే. తాజా విజయంతో సన్రైజర్స్ 15 పాయింట్లతో తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా... గుజరాత్పై చివరి మ్యాచ్ కూడా గెలిస్తే ఎలాంటి లెక్కల అవసరం లేకుండా 17 పాయింట్లతో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్కు వెళుతుంది. హైదరాబాద్ను దాటి పంజాబ్ ముందుకు వెళ్లాలంటే అది తమ మిగిలిన మూడు మ్యాచ్లలో కూడా తప్పనిసరిగా విజయం సా«ధించాల్సి ఉంటుంది. అది అంత సులువు కాదు కాబట్టి హైదరాబాద్కు ప్రమాదం ఉండకపోవచ్చు. ముంబైపై సన్రైజర్స్ గెలుపుతో ఢిల్లీ డేర్డెవిల్స్ కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి అవుటైంది. -
దుమ్మురేపిన సన్ రైజర్స్..
► పంజాబ్ లక్ష్యం 208 ► అర్ధసెంచరీలు సాధించిన విలియమ్సన్, శిఖర్ ధావన్, వార్నర్ మోహాలీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విలియమ్సన్ లు అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్ పంజాబ్ కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఓపెనర్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి జట్టు 60 పరుగులు చేసింది. అదే ఊపును కొనసాగిస్తూ వార్నర్ 25 బంతుల్లో, ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. అయితే మాక్స్ వెల్ 9 ఓవర్లో వార్నర్ 51( 4 ఫోర్లు, 4 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో వీరద్దరీ 107 పరుగుల అజేయ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలయమ్సన్ కూడా దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 9 ఫోర్లు ఒక సిక్సర్ తో 77 పరుగులు చేసిన ధావన్ మోహిత్ శర్మ బౌలింగ్ లో ఓ భారీషాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్(15) త్వరగా అవుటై మరోసారి నిరాశపర్చగా విలయమ్సన్, హెన్రిక్స్ తో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 బంతుల్లో విలయమ్సన్ అర్ధసెంచరీ సాధించడంతో హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మాక్స్ వెల్ కు 2 వికెట్లు దక్కగా, మోహీత్ ఒక వికెట్ దక్కింది. -
విలియమ్సన్ విలయతాండవం
-
విలియమ్సన్ విలయతాండవం
► 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలియమ్సన్ ► రాణించిన శిఖర్ ధావన్ (70) హైదరాబాద్: ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు విలియమ్సన్ విలయ తాండవానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం స్టేడియం దద్దరిల్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి192 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి మ్యాచ్ ఆడుతున్నవిలయమ్సన్ కు శిఖర్ ధావన్ జత కావడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ 21 పరుగుల వద్ద ఓపెనర్ వార్నర్ (4) వికెట్ ను కోల్పోయింది. 17 ఇన్నింగ్స్ ల తర్వాత వార్నర్ సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలయమ్సన్, ధావన్ తో జత కలిసి దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ దశలో 33 బంతుల్లో విలయమ్సన్ అర్ద సెంచరీ పూర్తి చేయగా ధావన్ 40 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలయమ్సన్ క్రిస్ మోరిస్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యడు. రెండో వికెట్ కు విలియమ్సన్, ధావన్ లు 136 పరుగుల జోడించారు. 200 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశిస్తునుకున్న తరుణంలో క్రిస్ మోరిస్ వరుస బంతుల్లో ధావన్ (70), యువరాజ్ (3)లను పెవిలియన్ కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్, సందీప్ హుడా చివరి ఓవర్లో 17 పరుగులు రాబట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 191 పరుగులు చేయగలిగింది. క్రిస్ మోరిస్ కు నాలుగు వికెట్లు దక్కాయి. -
తొలి టి20లో భారత్ ఓటమి
-
చివర్లో చేతులెత్తేశారు...
తొలి టి20లో భారత్ ఓటమి రెండు పరుగులతో గెలిచిన జింబాబ్వే భారత్ గెలవాలంటే 6 బంతుల్లో 8 పరుగులు కావాలి. క్రీజులో సూపర్ ఫినిషర్ ధోనితో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు... మామూలుగా అయితే ఈ జోడీకిది పెద్ద స్కోరు కాదు... అందులోనూ బౌలింగ్ వేయడానికి వచ్చిన మద్జీవా కూడా ఓవర్కు 9కి పైగా పరుగులు ఇచ్చాడు. దీంతో ఇక భారత్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో జింబాబ్వే అనూహ్యంగా షాకిచ్చింది. క్రీజులో ఉన్న ధోనికి సరైన అవకాశం ఇవ్వకుండా ఇతర బ్యాట్స్మెన్ను కట్టడి చేసి కేవలం ఐదు పరుగులతోనే సరిపెట్టింది. దీంతో ఈ టూర్లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. హరారే: వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి ఊపుమీదున్న భారత్ను జింబాబ్వే ఒకే ఒక్క మ్యాచ్తో కిందకు దించింది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణిస్తూ టి20 సిరీస్లో శుభారంభం చేసింది. చిగుంబురా (26 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్తో... శనివారం జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 2 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. మనీష్ పాండే (35 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. సిరీస్లో రెండో టి20 మ్యాచ్ సోమవారం జరుగుతుంది. సిక్సర్ల జాతర... అనుభవం లేని భారత కుర్ర పేసర్లపై ఓపెనర్ మసకద్జా మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డా... ఐదో ఓవర్లో బుమ్రా దెబ్బకు వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్లో ముతుబామి (0) రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. అయితే పవర్ప్లేలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన జింబాబ్వే.. ఏడో ఓవర్లో చిబాబా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) వికెట్ను చేజార్చుకుంది. ఈ దశలో రజా (18 బంతుల్లో 20; 2 ఫోర్లు), వాలర్ (30) సింగిల్స్తో పాటు వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్రేట్ తగ్గకుండా చూశారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 34 బంతుల్లో 47 పరుగులు జత చేశారు. ఆఖర్లో చిగుంబురా భారత బౌలర్ల దుమ్ముదులిపాడు. ఏడు సిక్సర్లు బాది 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సాధించాడు. మనీష్ హవా... వన్డే సిరీస్లో విశేషంగా రాణించిన లోకేశ్ రాహుల్ (0) తొలి బంతికే డకౌట్ అయినా... మన్దీప్ సింగ్, రాయుడు (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఒకర్నిమించి ఒకరు బౌండరీలు బాదారు. అయితే ఆరో ఓవర్లో రాయుడు అనూహ్యంగా అవుట్కావడంతో రెండో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో మనీష్ పాండే నిలకడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నా.. రెండో ఎండ్లో మన్దీప్ వికెట్ చేజార్చుకున్నాడు. ఇక కేదార్ జాదవ్ (19), మనీష్లు సింగిల్స్కు పరిమితమైనా.. చెరో సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించుకున్నారు. నాలుగో వికెట్కు 37 పరుగులు జోడించాకా జాదవ్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 90/4. తర్వాత ధోని (19 నాటౌట్) అండతో మనీష్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. చకచకా ఐదో వికెట్కు 53 పరుగులు జత చేసి వెనుదిరిగాడు. దీంతో స్కోరు 143/5కి చేరుకుంది. ఇక 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ (18)... 19వ ఓవర్లో 13 పరుగులు రాబట్టినా... ఆఖరి ఓవర్లో పేలవమైన బ్యాటింగ్తో భారత్ బోల్తా పడింది. ► 2 టి20ల్లో భారత్పై జింబాబ్వేకిది వరుసగా రెండో విజయం. గతేడాది జులై 19న హరారేలోనే జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 10 పరుగులతో నెగ్గింది. ► 1 టి20ల్లో ఒకే మ్యాచ్లో భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు (రిషి ధావన్, మన్దీప్ సింగ్, ఉనాద్కట్, రాహుల్, చాహల్) అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. ► 1 టి20 మ్యాచ్లో తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోవడం ఇదే మొదటిసారి. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (బి) ధావన్ 20; మసకద్జా (సి) ధోని (బి) బుమ్రా 25; ముతుబామి రిటైర్డ్ హర్ట్ 0; సికిందర్ రజా రనౌట్ 20; వాలర్ (బి) చాహల్ 30; ముటోంబోది (సి) ధావన్ (బి) పటేల్ 3; చిగుంబురా నాటౌట్ 54; క్రెమర్ (సి) ధావన్ (బి) బుమ్రా 4; మద్జీవా నాటౌట్ 5; ఎక్స్ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1-33; 2-50; 3-97; 4-98; 5-111; 6-130. బౌలింగ్: ఉనాద్కట్ 4-0-43-0; రిషీ ధావన్ 4-0-42-1; బుమ్రా 4-1-24-2; అక్షర్ పటేల్ 4-0-18-1; చాహల్ 4-0-38-1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) తిరిపానో 0; మన్దీప్ (సి) ముటోంబోడి (బి) చిబాబా 31; రాయుడు (బి) చిబాబా 19; మనీష్ పాండే (సి) తిరిపానో (బి) ముజురబాని 48; కేదార్ జాదవ్ (బి) ముజురబాని 19; ధోని నాటౌట్ 19; అక్షర్ పటేల్ (సి) సబ్ మసకద్జా (బి) మద్జీవా 18; రిషీ ధావన్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1-0; 2-44; 3-53; 4-90; 5-143; 6-164. బౌలింగ్: తిరిపానో 4-0-35-1; మద్జీవా 4-0-34-1; ముజురబాని 4-0-31-2; చిబాబా 2-0 -13-2; రజా 3-0-18-0; క్రెమెర్ 3-0-35-0. -
తీరంలో ‘సూర్యో’దయం
► సన్రైజర్స్ విజయాల హ్యాట్రిక్ 85 పరుగులతో ముంబై చిత్తు ► రాణించిన ధావన్, వార్నర్ చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు ‘సొంత మైదానం’ కాని సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ తన పట్టును ప్రదర్శించింది. గత ఏడాది ఇక్కడే హోం గ్రౌండ్గా మూడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ జట్టు ఇప్పుడు ప్రత్యర్థి స్థానంలో తలపడింది. అయితే వేదిక మారినా ఆ జట్టు జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి విశాఖ తీరంలో ముంబైని తుక్కుగా ఓడించి లీగ్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ముందుగా వార్నర్, ధావన్ మెరుపులకు తోడు అద్భుత బౌలింగ్ రైజర్స్ను నిలబెట్టింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...నలుగురు సన్రైజర్స్ బౌలర్లు తమ తొలి ఓవర్లోనే వికెట్ తీస్తే భారీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అచేతనంగా మారిపోయింది. 26 బంతులు ఆడే సరికే ఐదుగురు ఆటగాళ్లు అవుట్ కాగా... లీగ్లో ఛేదన అంటే చెలరేగిపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం మొదలు... పది ఓవర్ల లోపే ఏడు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు ఏమీ చేయలేక చేతులెత్తేసింది. సీజన్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన రోహిత్ బృందం మూడు విజయాల తర్వాత ఓటమిని మూటగట్టుకుంది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుతమైన ప్రదర్శనతో ఆ జట్టు లీగ్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో రైజర్స్ 85 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (57 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయమైన బ్యాటింగ్కు తోడు వార్నర్ (33 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారం జట్టుకు భారీ స్కోరు అందించాయి. అనంతరం ముంబై 16.3 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సన్ బలమైన బౌలింగ్ ముందు ముంబై బ్యాటింగ్ సమష్టిగా విఫలమైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆశిష్ నెహ్రా (3/15), ముస్తఫిజుర్ రహమాన్ (3/16) చెలరేగగా, బరీందర్కు 2 వికెట్లు దక్కాయి. సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో మంగళవారం ఇదే మైదానంలో పుణేతో తలపడుతుంది. ఓపెనర్లు దూకుడు: ఫామ్లో ఉన్న ఓపెనర్లు వార్నర్, ధావన్ మరోసారి హైదరాబాద్కు అదిరే ఆరంభం ఇచ్చారు. ముందుగా వార్నర్ జోరు మొదలు పెట్టగా, ఆ తర్వాత ధావన్ లయ అందుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్గా మలచిన వార్నర్...హర్భజన్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించాడు. మెక్లీనగన్ బౌలింగ్లో కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. అయితే భజ్జీ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్, అదే ఊపులో అవుట్ కావడంతో 85 పరుగుల (59 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. విలియమ్సన్ (2) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ధావన్, యువరాజ్ కలిసి జట్టును నడిపించారు. గత మ్యాచ్లో విఫలమైన యువరాజ్ తన 100వ ఐపీఎల్ మ్యాచ్లో చెలరేగాడు. పొలార్డ్ వేసిన ఓవర్లో యువీ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో రైజర్స్ ఇన్నింగ్స్ వేగం పెరిగింది. మరోవైపు 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్, అనంతరం బుమ్రా వేసిన రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది దూకుడు ప్రదర్శించాడు. చివరి ఓవర్ నాలు గో బంతికి యువీ హిట్ వికెట్గా వెనుదిరగ్గా, ఓవర్లో ఏడు పరుగులే వచ్చాయి. అయితే 15-19 మధ్య ఐదు ఓవర్లలో సన్రైజర్స్ 68 పరుగులు చేయడం జట్టు భారీ స్కోరుకు కారణమైంది. టపటపా...: భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ పూర్తిగా పట్టు తప్పింది. ఆ జట్టులో ఒక్క బ్యాట్స్మన్ కూడా కనీస స్థాయిలో పోరాడలేకపోయాడు. తొలి ఓవర్ చివరి బంతికి పార్థివ్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ శుభారంభం ఇవ్వగా, నెహ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతినే రోహిత్ (5) వికెట్లపైకి ఆడుకున్నాడు. నెహ్రా తన రెండో ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. నాలుగో బంతికి రాయుడు (6) వెనుదిరగ్గా, ఆరో బంతిని బట్లర్ (2) నేరుగా కీపర్ చేతుల్లోకి పంపించాడు. భువీ, నెహ్రాలాగే తొలి ఓవర్లో వికెట్ పండగ చేసుకుంటూ బరీందర్ కూడా తన రెండో బంతికే కృనాల్ (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేయడంతో ముంబై 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. బరీందర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ (11) ఆదుకునే ప్రయత్నం చేసినా అతనూ వెంటనే అవుటయ్యాడు. ఈసారి నా వంతు అంటూ తొలి బంతికే హార్దిక్ (7)ను అవుట్ చేసిన ముస్తఫిజుర్, రెండో ఓవర్ తొలి బం తికి సౌతీ (3)ని వెనక్కి పంపడంతో ముంబై గెలు పు ఆశలు కోల్పోయింది. హర్భజన్ (21 నాటౌట్; 2 ఫోర్లు) కొద్దిసేపు పోరాడినా మరో 21 బంతులు ఉండగానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 48; ధావన్ (నాటౌట్) 82; విలియమ్సన్ (సి) రోహిత్ (బి) హర్భజన్ 2; యువరాజ్ (హిట్వికెట్) (బి) మెక్లీనగన్ 39; హెన్రిక్స్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177 వికెట్ల పతనం: 1-85; 2-91; 3-176. బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-38-1; హర్భజన్ 4-0-29-2; బుమ్రా 4-0-35-0; హార్దిక్ 1-0-10-0; పొలార్డ్ 2-0-23-0; కృనాల్ 1-0-5-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) నెహ్రా 5; పార్థివ్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రాయుడు (సి) విలియమ్సన్ (బి) నెహ్రా 6; కృనాల్ (సి) ధావన్ (బి) బరీందర్ 17; బట్లర్ (సి) ఓజా (బి) నెహ్రా 2; పొలార్డ్ (సి) బరీందర్ (బి) హెన్రిక్స్ 11; హార్దిక్ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 7; హర్భజన్ (నాటౌట్) 21; సౌతీ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 3; మెక్లీనగన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 8; బుమ్రా (సి) ఓజా (బి) బరీందర్ 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1-5; 2-5; 3-28; 4-30; 5-30; 6-49; 7-50; 8-58; 9-78; 10-92. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-23-1; నెహ్రా 3-0-15-3; బరీందర్ 3.3-0-18-2; హెన్రిక్స్ 4-0-18-1; ముస్తఫిజుర్ 3-0-16-3. -
మరింత రైజింగ్
► సన్రైజర్స్కు ఐదో విజయం ► 5 వికెట్లతో గుజరాత్ ఓటమి ► సమష్టిగా రాణించిన బౌలర్లు ► ధావన్ కీలక ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మొదటి రెండు ఓవర్లు మెయిడిన్లు... బౌలర్లంతా పోటాపోటీగా కట్టుదిట్టంగా బంతులు వేయడం... సన్రైజర్స్కు బలమైన బౌలర్లు మరోసారి చెలరేగారు. అయితే 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాట్స్మెన్ తడబడినా... శిఖర్ ధావన్ కీలక ఇన్నింగ్స్తో సన్రైజర్స్ లయన్స్పై గెలిచింది. సీజన్లో వార్నర్ సేనకు ఇది ఐదో విజయం. దీంతో ప్లే ఆఫ్ దిశగా హైదరాబాద్ మరో అడుగు ముందుకు వేసింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతోంది. సమర్థ బౌలింగ్కు తోడు ధావన్ బ్యాటింగ్ ప్రదర్శనతో మరో కీలక విజయం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ముస్తఫిజుర్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. భువనేశ్వర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫించ్ మినహా...: మెకల్లమ్, స్మిత్... ఇద్దరూ విధ్వంసకర బ్యాట్స్మెన్. కానీ సన్ బౌలర్ల నిలకడతో కనీసం సింగిల్స్ తీయడానికి కూడా కిందామీదా పడ్డారు. మూడో ఓవర్ రెండో బంతికి ఆ జట్టు ఖాతా తెరిచింది. అయితే ఇదే ఒత్తిడిలో స్మిత్ (9 బంతుల్లో 1) అవుటయ్యాడు. రైనా (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేదు. పవర్ప్లేలో ఆ జట్టు 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. విలియమ్సన్, వార్నర్ల అద్భుతమైన క్యాచ్లకు కార్తీక్ (0), మెకల్లమ్ (19 బంతుల్లో 7) వెనుదిరగడంతో లయన్స్ 34 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫించ్, బ్రేవో (20 బంతుల్లో 18; 1 ఫోర్) కొద్దిగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్కు 39 బంతుల్లో 45 పరుగులు జోడించిన తర్వాత బ్రేవో వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాంగాఫ్లో వార్నర్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో ఫించ్ బతికిపోయాడు. ఆఖర్లో ఫించ్కు కొద్ది సేపు జడేజా (13 బంతుల్లో 18; 2 ఫోర్లు) అండగా నిలవడంతో లయన్స్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. ధావన్ యాంకర్ ఇన్నింగ్స్: స్వల్ప లక్ష్య ఛేదనలో రైజర్స్కు వార్నర్ (17 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడైన ఆరంభం అందించాడు. సాంగ్వాన్ వేసిన రెండో ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. అయితే ధావల్ తన తొలి బంతికే వార్నర్ను అవుట్ చేయడంతో గుజరాత్కు బ్రేక్ లభించింది. ఆ వెంటనే విలియమ్సన్ (6) వెనుదిరగ్గా, హెన్రిక్స్ (16 బంతుల్లో 14; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్లో ధావన్కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 10 ఓవర్లు ముగిసే సరికి అతను 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత మరింత బాధ్యత తీసుకొని ఆడిన అతను జట్టును ముందుండి నడిపించాడు. ఐపీఎల్-9లో తొలి మ్యాచ్ ఆడిన యువరాజ్ (14 బంతుల్లో 5) పూర్తిగా నిరాశపరిచాడు. ఈ దశలో గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కొంత ఒత్తిడి నెలకొంది. అయితే ధావన్ సంయమనంతో ఆడుతూ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు గుజరాత్ లయన్స్ బ్యాటింగ్: డ్వేన్ స్మిత్ (సి) ముస్తఫిజుర్ (బి) భువనేశ్వర్ 1; మెకల్లమ్ (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 7; రైనా (సి) అండ్ (బి) భువనేశ్వర్ 20; కార్తీక్ (సి) విలియమ్సన్ (బి) ముస్తఫిజుర్ 0; ఫించ్ (నాటౌట్) 51; బ్రేవో (సి) (సబ్) విజయ్ శంకర్ (బి) బరీందర్ 18; జడేజా (సి) భువనేశ్వర్ (బి) ముస్తఫిజుర్ 18; ప్రవీణ్ కుమార్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1-2; 2-24; 3-25; 4-34; 5-79; 6-106; బౌలింగ్: భువనేశ్వర్ 4-1-28-2; నెహ్రా 4-1-23-0; ముస్తఫిజుర్ 4-0-17-2; బరీందర్ 3-0-21-1; హెన్రిక్స్ 3-0-24-1; యువరాజ్ 2-0-13-0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ప్రవీణ్ (బి) ధావల్ 24; ధావన్ (నాటౌట్) 47; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) ప్రవీణ్ 6; హెన్రిక్స్ (సి) కార్తీక్ (బి) బ్రేవో 14; యువరాజ్ (సి) సాంగ్వాన్ (బి) ధావల్ 5; హుడా (సి) కార్తీక్ (బి) బ్రేవో 18; ఓజా (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1-26; 2-33; 3-55; 4-81; 5-108. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-28-1; సాంగ్వాన్ 2-0-28-0; ధావల్ 4-1-17-2; కౌశిక్ 4-0-25-0; జడేజా 2-0-14-0; బ్రేవో 3-0-14-2. -
కొత్త ఉత్సాహంతో ఉన్నాం...
► విశ్రాంతి అనంతరం ► నేడు బరిలోకి సన్రైజర్స్ సాక్షి, హైదరాబాద్: దాదాపు వారం రోజుల క్రితం బెంగళూరుపై కీలక విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఆ తర్వాత దక్కిన ఐదు రోజుల విరామాన్ని ఆటగాళ్లు పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఈ విరామంలో ఆటగాళ్లు తమకు నచ్చిన రీతిలో సరదాగా గడిపారు. ఇప్పటికి సరిగ్గా సగం మ్యాచ్లు ఆడిన జట్టు, రెండో దశకు సిద్ధమైంది. కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగి ప్లే ఆఫ్ దిశగా దూసుకుపోవాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రైజర్స్ ప్రధాన ఆటగాళ్లు వార్నర్, ధావన్, భువనేశ్వర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆటతో పాటు తమ ఆసక్తులను పంచుకున్నారు. విశేషాలు వారి మాటల్లోనే... నాకు నచ్చిందే చేస్తా! ఐపీఎల్ ఆరంభంలో కాస్త తడబడ్డాను. కానీ కొద్ది సేపు నిలదొక్కుకోగలిగితే రాణిస్తానని నాకు నమ్మకముంది. ఇప్పుడు మళ్లీ లయ అందుకున్నాను. కెప్టెన్గా, ఓపెనింగ్ సహచరుడిగా కూడా వార్నర్ ఎంతో అండగా నిలిచాడు. క్రీజ్లో ఉన్నప్పుడు నాపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. రెండేళ్లుగా కలిసి ఆడటంతో అతనితో మంచి సమన్వయం ఉంది. టి20ల్లో టాపార్డర్ బాగా ఆడితే విజయం దక్కుతుంది. రైజర్స్కు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞులు యువరాజ్, నెహ్రాల రాకతో జట్టు బలం పెరిగింది. మా ఫీల్డింగ్ కాస్త మెరుగైతే చాలు. పాతతరం ఆటగాళ్లకు ఎలా ఉండేదో తెలీదు కానీ సోషల్ మీడియా వల్ల మా జనరేషన్ క్రికెటర్లపై బాగా ఒత్తిడి పెరిగింది. ప్రతీ విషయం అందరికీ చేరిపోతోంది. నాకు నచ్చింది నేను చేస్తాను తప్ప ఎవరి కోసమో, స్టైల్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకునేందుకో కాదు. మీసం మెలేసినా, పఠానీ సూట్ ధరించినా, చెవిపోగు అయినా అదంతా నేను ఇష్టంతో చేసే పని. వీటి వల్ల నాలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక నేను ఎవరికో చూపించడానికో, సరదాకో స్విచ్ హిట్లు, స్కూప్లులాంటి షాట్లు ఆడను. సాధారణ షాట్లతోనే పరుగులు వస్తుంటే ఇంక వాటి అవసరం లేదు’ - ధావన్ మందు మానేశా... అంతా బాగుంది! మనం ఏదైతే బాగా ఇష్టపడతామో దానిని వదిలేయడం అంత సులువు కాదు. గతంలో మ్యాచ్కు ముందు గానీ, మ్యాచ్ తర్వాత గానీ తప్పనిసరిగా మద్యం తీసుకునేవాడిని. దీనివల్ల నా మనసు ప్రశాంతంగా అనిపించేది. మానేశాక అంతా భిన్నంగా ఉంది. ఇప్పుడు నా శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత 12 నెలల కాలంలో ఆస్ట్రేలియా తరఫున, ఐపీఎల్లో చాలా క్రికెట్ ఆడటమే కాదు బాగా ఆడుతున్నాను కూడా. ప్రతీ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నా. మందు మానేయడం వల్ల గాయాలయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీని వల్ల నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించగలుగుతున్నా. అల్కహాల్కు గుడ్బై చెప్పి నాకు నేనే సవాల్ విసిరా. లక్ష్యం చేరుకోవడం సంతోషంగా ఉంది. నేను కెప్టెన్గా మరీ కొత్త వ్యూహాలు ఏమీ అమలు చేయడం లేదు. పైగా ప్రతీది చెప్పాల్సిన అవసరం లేకుండా ఆటగాళ్లంతా బాగా ఆడుతుండటంతో నా పని మరింత సులువైంది. జట్టులో 11 మందీ సమానమే. ఎవరినీ గొప్ప చేసి చెప్పను. యువరాజ్ ఇప్పుడు పూర్తి ఫిట్గా ఉన్నాడు’ - వార్నర్ స్పీడున్నా ‘స్వింగ్’ మారదు ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లో విఫలమైన తర్వాత నా బౌలింగ్పై కాస్త ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత మరింత ప్రాక్టీస్తో నియంత్రణ సాధించాను. నేను ప్రధానంగా స్వింగ్ బౌలర్నే. కానీ వేగంగా వేసేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాను. బౌలింగ్లో వేగం పెరిగితే స్వింగ్ పోతుందని చాలా మంది అంటారు. కానీ నేను రెండింటినీ సమన్వయం చేసుకోగలననే నమ్మకముంది. దాని కోసం ప్రాక్టీస్ సెషన్లోనే ఎక్కువగా సాధన చేస్తున్నాను. తొలి ఆరు ఓవర్లలో, చివరి ఓవర్లలో నా బౌలింగ్లో కచ్చితంగా వైవిధ్యం ఉంటుంది. టి20 ఫార్మాట్లో బౌలర్ మరింత తెలివిగా వ్యవహరించాలి. యార్కర్లు, స్లో బౌన్సర్లు సమర్థంగా ఉపయోగించాలి. మా జట్టులో మంచి పేసర్లు ఉండటంతో ఒకరినుంచి మరొకరు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. ముస్తఫిజుర్ గొప్పతనం అతని యాక్షన్లో ఉంది. అది అతనికి సహజంగా వచ్చింది. ఐపీఎల్లాంటి బిజీ షెడ్యూల్లో సుదీర్ఘ విశ్రాంతి లభించడం చాలా మంచి విషయం. కొత్తగా ఆలోచించేందుకు, బాగా ఆడేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని ఇది ఇస్తుంది. రాబోయే మ్యాచ్లలో మరింతగా రాణిస్తాను’ - భువనేశ్వర్ -
మనీష్ పాండేను ఆడించాలి
సంజయ్ మంజ్రేకర్ ఆస్ట్రేలియాతో చావోరేవోలాంటి మ్యాచ్లో భారత్ స్థాయికి తగ్గట్లుగా ఆడి గెలిచింది. మొహాలీలో విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ భారతీయుడు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్. భారత్ను సెమీస్కు చేర్చినందుకు కోహ్లికి థ్యాంక్స్ చెప్పాలి. గత రెండు మ్యాచ్లలో వెస్టిండీస్ ప్రదర్శన చూసిన తర్వాత భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేతిలోనూ ఓడిపోయారు. చాలామంది గేల్ గురించి మాట్లాడేటప్పుడు అతడి పవర్ గురించి మాత్రమే చెబుతారు. కానీ అతడిలో అంతకు మించి చాలా ఉంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో లక్ష్య ఛేదనలో గేల్ చూపించిన టెంపర్మెంట్ అద్భుతం. భారత్తో మ్యాచ్లో గేల్ది ఎంత పెద్ద వికెట్టో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత బ్యాటింగ్ లైనప్లోని లోపాలు కోహ్లి అద్భుత ప్రదర్శనల వల్ల కనిపించడం లేదు. ఇక బౌలింగ్ మాత్రం అద్భుతంగా, నిలకడగా ఉంది. భారత జట్టు బౌలింగ్ బలంతో ఆడుతుండటం చాలా అరుదుగా జరిగే విషయం. యువరాజ్ సింగ్ అందుబాటులో లేనందున మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకోవాలి. ఈ ఫార్మాట్లో రహానే కంటే కూడా పాండే ప్రమాదకర ఆటగాడు. వాంఖడే పిచ్ బ్యాట్స్మెన్కు స్వర్గధామం. కాబట్టి ధావన్కు మరో మ్యాచ్లో అవకాశం ఇవ్వొచ్చు. ఆస్ట్రేలియాతో చావోరేవోలాంటి మ్యాచ్లో భారత్ స్థాయికి తగ్గట్లుగా ఆడి గెలిచింది. మొహాలీలో విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ భారతీయుడు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్. భారత్ను సెమీస్కు చేర్చినందుకు కోహ్లికి థ్యాంక్స్ చెప్పాలి. గత రెండు మ్యాచ్లలో వెస్టిండీస్ ప్రదర్శన చూసిన తర్వాత భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ చేతిలోనూ ఓడిపోయారు. చాలామంది గేల్ గురించి మాట్లాడేటప్పుడు అతడి పవర్ గురించి మాత్రమే చెబుతారు. కానీ అతడిలో అంతకు మించి చాలా ఉంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో లక్ష్య ఛేదనలో గేల్ చూపించిన టెంపర్మెంట్ అద్భుతం. భారత్తో మ్యాచ్లో గేల్ది ఎంత పెద్ద వికెట్టో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత బ్యాటింగ్ లైనప్లోని లోపాలు కోహ్లి అద్భుత ప్రదర్శనల వల్ల కనిపించడం లేదు. ఇక బౌలింగ్ మాత్రం అద్భుతంగా, నిలకడగా ఉంది. భారత జట్టు బౌలింగ్ బలంతో ఆడుతుండటం చాలా అరుదుగా జరిగే విషయం. యువరాజ్ సింగ్ అందుబాటులో లేనందున మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకోవాలి. ఈ ఫార్మాట్లో రహానే కంటే కూడా పాండే ప్రమాదకర ఆటగాడు. వాంఖడే పిచ్ బ్యాట్స్మెన్కు స్వర్గధామం. కాబట్టి ధావన్కు మరో మ్యాచ్లో అవకాశం ఇవ్వొచ్చు. -
మీ సంగతేంటి..?
► ఆందోళన కలిగిస్తున్న ఓపెనర్లు ► మిడిలార్డర్ కూడా అంతంత మాత్రమే మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: భారత జట్టు టి20 ప్రపంచకప్లో సెమీస్కు చేరినా జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పట్ల పెద్దగా ఎవరికీ సంతృప్తి లేదు. కోహ్లి మినహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటివరకూ ఆడలేదు. కోహ్లి పుణ్యమాని పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై గెలిచాం. బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధంతో గట్టెక్కాం. మొత్తానికి సెమీస్కు చేరాం. కానీ రేపు సెమీస్లో కోహ్లి పొరపాటున విఫలమైతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు భారత జట్టు సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న ఇది. ఓపెనర్ల వైఫల్యం వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు, టి20ల్లో కూడా సెంచరీ ఉన్న ఘనత రోహిత్ శర్మ సొంతం. కానీ అదంతా బ్యాటింగ్ పిచ్ల మహిమే తప్ప రోహిత్ గొప్పతనం కాదేమో అన్నట్లుగా అతని ఆట కొనసాగుతోంది. నాలుగు ఇన్నింగ్స్లలో ఒక్కసారి కూడా అతను కనీస ప్రభావం చూపలేకపోయాడు. మొత్తం టోర్నీలో అతను ఇప్పటి వరకు 45 పరుగులే చేశాడు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలిస్తుంటే చాలు చేతులెత్తేస్తున్నాడు. పోరాటపటిమ అనేది మచ్చుకైనా కనిపించక పోగా, అవుటైన తీరు నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. శిఖర్ ధావన్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈసారి టోర్నీలో ఒక్క మ్యాచ్లో కూడా ప్రభావం చూపలేదు. ధావన్ వరుసగా 1, 6, 23, 13 పరుగులు చేశాడు. నేరుగా వచ్చిన బంతులను స్వీప్ ఆడి అతను రెండు సార్లు ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం ఇంకా డెరైక్టర్, కోచ్లు గుర్తించినట్లు లేదు. గతంలో చాలా సందర్భాల్లో టి20లైనా సరే వీరిద్దరు ఆరంభంలో కాస్త నిలదొక్కుకొని ఆ తర్వాత చెలరేగిపోయేవారు. ఫలితంగా స్ట్రైక్రేట్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడూ నిలబడే ప్రయత్నంలో బంతులు తినేస్తున్నారు. కానీ ఆ వెంటనే అవుట్ కావడంతో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది. గత నాలుగు మ్యాచ్లలో భారత ఓపెనింగ్ భాగస్వామ్యం 5 పరుగులు (5 బంతుల్లో), 14 (13), 42 (36), 23 (23)గా ఉంది. టి20ల్లో సాధారణంగా పవర్ప్లేలో కనిపించే మెరుపు ఆరంభానికి ఇది భిన్నం. మిడిల్ అంతంత మాత్రమే ఇక ఈ టోర్నీలో అందరికంటే దారుణం రైనా. బంగ్లాదేశ్పై చేసిన 30 పరుగులు మినహా ఏమాత్రం ఆడలేదు. పడుతూ లేస్తూ పరుగులు చేస్తున్న యువరాజ్ను చూసి సంతోషించాలో లేక గతంలో అతడి స్థాయిని గుర్తు చేసుకుని బాధపడాలో తెలియడం లేదు. ఒకప్పుడు గొప్ప మ్యాచ్ ఫినిషర్గా పేరున్న యువరాజ్ ఇప్పుడు చివరి వరకూ నిలబడలేకపోతున్నాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్లు కలిపి 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొద్ది సేపు నిలబడగలిగితే ఆ మాత్రం పరుగులైనా వస్తున్నాయి కానీ లేదంటే ఆరంభంలో తడబడితే అక్కడితోనే సరి. కెప్టెన్ ధోని నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఇప్పటివరకూ పరుగులు రాలేదు. ఆల్రౌండర్ పేరున్న జడేజా బ్యాటింగ్ మరచిపోయి చాలా కాలం అయింది కాబట్టి అతనిపై ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం. టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కనీసం 100 పరుగులు చేసిన 23 మందిలో కోహ్లి మినహా మరెవరూ భారతీయులు లేకపోవడం మన బ్యాట్స్మెన్ ఆటకు ఉదాహరణ. ఇక స్ట్రైక్రేట్ పరంగా చూస్తే కోహ్లి (132.37)నే 46వ స్థానంలో నిలిచాడంటే మన స్టార్ బ్యాట్స్మెన్ వేగంగా కూడా ఆడలేకపోతున్నారని అర్థమవుతుంది. యువరాజ్ సరిగ్గా 100 స్ట్రైక్రేట్తో పరుగులు చేస్తే...రోహిత్ (88.23), ధావన్ (82.69) బంతికో పరుగు కూడా చేయలేకపోయారు. మరోసారి టి20ల్లో విశ్వ విజేతగా నిలిచేందుకు, సొంతగడ్డపై వరుసగా ప్రపంచకప్ గెలిచేందుకు ఇక ఆడాల్సింది రెండు మ్యాచ్లే. ఇతర బ్యాట్స్మెన్ కూడా టోర్నీలో తమదైన ముద్ర వేసేందుకు ఇదే మిగిలిన అవకాశం. మరి ఇకనైనా కోలుకుంటారా..? -
ప్రాణం లేచొచ్చింది!
► ఒక్క పరుగుతో బంగ్లాదేశ్పై గెలిచిన భారత్ ► చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లతో సంచలనం ► టి20 ప్రపంచకప్లో సెమీస్ ఆశలు సజీవం ► తర్వాతి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో కోట్లాది మంది ఊపిరి బిగపట్టి చూస్తున్న క్షణం.. లక్షలాది గొంతుకలు మూగబోతున్న తరుణం... వేలాది కనులు రెప్పార్పకుండా చూసిన సమయం... ఏదో జరుగుతోంది.... ఏదేదో అయిపోతోంది. ఊహకందని స్థాయిలో... ఊహించని రీతిలో... కళ్లముందే భారత్ స్వప్నం చెదిరిపోతోంది అభిమానుల మనసు మూగబోవడానికి ఇక మిగిలింది క్షణమే...స్వదేశంలో ధోనిసేన పరువు పాతాళంలో కలవడానికి మిగిలిందీ ఆ క్షణమే... కానీ ఆ ఒక్క క్షణమే.... భారత జట్టు తల రాతను తిరగరాసింది. జరిగింది కలో.. అద్భుతమో తెలుసుకునే లోపే... ఆశకు, నిరాశకు మధ్య ఊగిసలాడుతున్న ఎన్నో ప్రాణాలు లేచి వచ్చేలా మాయ జరిగింది.చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీసి... చేజారిన మ్యాచ్ను రెండు చేతులా భారత్ ఒడిసిపట్టింది. కేవలం రెండు పరుగులు చేయలేక బంగ్లా గుండె పగిలింది. టి20 ప్రపంచకప్లో భారత్ ఒక్క పరుగుతో బంగ్లాదేశ్ను ఓడించింది.సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి నరాలు తెగే ఉత్కంఠ... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఆఖరి బంతి వరకూ విజయం దోబూచులాడిన వేళ... భారత జట్టు ఒత్తిడిని జయించింది. చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసింది. సురేశ్ రైనా (23 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకు పరిమితమయింది. తమీమ్ ఇక్బాల్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. 2 కీలక వికెట్లు తీసిన అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్కు చేరుతుంది. కనిపించని దూకుడు: తొలి ఐదు ఓవర్లలో 27 పరుగులు... తర్వాతి ఓవర్లో 15 పరుగులతో పాటు రోహిత్ శర్మ అవుట్. ఇదీ పవర్ప్లేలో భారత జట్టు ఆట కొనసాగిన తీరు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు దూకుడైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ధావన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (16 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడారు. ముస్తఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్, ధావన్ చెరో సిక్సర్ బాది వేగం పెంచగా... చివరి బంతికి రోహిత్ను అవుట్ చేసి బౌలర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరుసటి ఓవర్లోనే చక్కటి బంతితో షకీబ్... ధావన్ను పెవిలియన్ పంపించాడు. కోహ్లి, రైనా మూడో వికెట్కు 50 పరుగులు జోడించిన అనంతరం మరోసారి బంగ్లా ఆధిక్యం ప్రదర్శించింది. షువగత వేసిన 14వ ఓవర్లో 17 పరుగులు రాబట్టి భారత్ దూకుడు ప్రదర్శించినా...అదే ఓవర్లో కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) క్లీన్బౌల్డ్ అయ్యాడు. అనంతరం వరుస బంతుల్లో రైనా, పాండ్యా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అమీన్ అవుట్ చేయగా, యువరాజ్ (3) విఫలమయ్యాడు. చివర్లో ధోని (13 నాటౌట్), జడేజా(12) కొన్ని పరుగులు జోడించినా స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది. అంతా కలిసికట్టుగా...: సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన మ్యాచ్లో బుమ్రా... బంగ్లా ప్రధాన బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్ నెత్తిన పాలు పోశాడు. ఫీల్డింగ్ వైఫల్యంతో ఇన్నింగ్స్ తొలి బంతికే తమీమ్కు బౌండరీని ఇచ్చిన బుమ్రా... 15 పరుగుల వద్ద అతను ఫైన్లెగ్లో ఇచ్చిన అతి సునాయాస క్యాచ్ను వదిలేశాడు. అంతే... ఈ అవకాశాన్ని అందుకున్న తమీమ్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే చెలరేగిపోయి నాలుగు ఫోర్లు బాదాడు. అయితే అదే ఊపులో భారీ షాట్కు ప్రయత్నించి తమీమ్ వెనుదిరగ్గా, మరో వైపు దూకుడు ప్రదర్శించిన షబ్బీర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్)ను ధోని అద్భుతంగా స్టంపౌట్ చేశాడు. ఎనిమిది పరుగుల వద్ద షకీబ్ (15 బంతుల్లో 22; 2 సిక్సర్లు) క్యాచ్ను అశ్విన్ వదిలేసినా... కొద్ది సేపటికే అద్భుత బంతికి అతనే అవుట్ చేశాడు. ఈ దశలో మహ్ముదుల్లా, సర్కార్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు పూర్తిగా కట్టి పడేశారు. 19వ ఓవర్లో బుమ్రా 6 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పాండ్యా 9 పరుగులు ఇచ్చినా 2 కీలక వికెట్లు తీయడం, చివరి బంతికి ధోని రనౌట్ చేయడంతో భారత్కు చిరస్మరణీయ విజయం దక్కింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) షబ్బీర్ (బి) ముస్తఫిజుర్ 18; ధావన్ (ఎల్బీ) (బి) షకీబ్ 23; కోహ్లి (బి) షువగత 24; రైనా (సి) షబ్బీర్ (బి) అమీన్ 30; పాండ్యా (సి) సర్కార్ (బి) అమీన్ 15; ధోని (నాటౌట్) 13; యువరాజ్ (సి) అమీన్ (బి) మహ్ముదుల్లా 3; జడేజా (బి) ముస్తఫిజుర్ 12; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-42; 2-45; 3-95; 4-112; 5-112; 6-117; 7-137. బౌలింగ్: మొర్తజా 4-0-22-0; షువగత 3-0-24-1; అమీన్ 4-0-37-2; ముస్తఫిజుర్ 4-0-34-2; షకీబ్ 4-0-23-1; మహ్ముదుల్లా 1-0-4-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 35; మిథున్ (సి) పాండ్యా (బి) అశ్విన్ 1; షబ్బీర్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 26; షకీబ్ (సి) రైనా (బి) అశ్విన్ 22; మొర్తజా (బి) జడేజా 6; మహ్ముదుల్లా (సి) జడేజా (బి) పాండ్యా 18; సర్కార్ (సి) కోహ్లి (బి) నెహ్రా 21; ముష్ఫికర్ (సి) ధావన్ (బి) పాండ్యా 11; షువగత (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-11; 2-55; 3-69; 4-87; 5-95; 6-126; 7-145; 8-145; 9-145 బౌలింగ్: నెహ్రా 4-0-29-1; బుమ్రా 4-0-32-0; అశ్విన్ 4-0-20-2; జడేజా 4-0-22-2; పాండ్యా 3-0-29-2; రైనా 1-0-9-1. హైడ్రామా సాగిందిలా... బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు కావాలి. హార్దిక్ పాండ్యా బంతి అందుకున్నాడు.తొలి బంతి: మహ్మదుల్లా డీప్ కవర్లోకి ఆడి సింగిల్ తీశాడు.రెండో బంతి: లెంగ్త్ బాల్. ముష్ఫిఖర్ ఎక్స్ట్రా కవర్లోకి బౌండరీ కొట్టాడు.మూడో బంతి: ముష్ఫిఖర్ స్కూప్ షాట్ ఆడి బౌండరీ సాధించాడు. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది.నాలుగో బంతి: ముష్ఫికర్ పుల్షాట్ ఆడాడు. డీప్ మిడ్వికెట్లో ధావన్ క్యాచ్ పట్టాడు. ఐదో బంతి: పుల్టాస్ బంతిని మహ్మదుల్లా భారీ షాట్ కొట్టాడు. డీప్ మిడ్వికెట్లో జడేజా పరిగెడుతూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.సింగిల్ తీస్తే మ్యాచ్ టై. రెండు పరుగులుచేస్తే బంగ్లా విజయంఆఖరి బంతి: ఆఫ్ స్టంప్ బయట పడిన బంతిని బ్యాట్స్మన్ షువగతా మిస్ చేశాడు. నాన్స్ట్రయికర్ ముస్తఫిజుర్ పరుగు పూర్తి చేసేలోపు... కీపర్ ధోని తెలివిగా పరిగెడుతూ వచ్చి బెయిల్స్ ఎగరగొట్టాడు. రనౌట్. భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. బంగ్లా గుండె పగిలింది. -
ప్రతి మ్యాచ్ కీలకమే
సంజయ్ మంజ్రేకర్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత్ తిరిగి గాడిలో పడింది. పాకిస్తాన్పై గెలుపు భారత్కు అత్యంత కీలకమైంది. ఎందుకంటే టోర్నమెంట్లో నిలవాలంటే ఆ మ్యాచ్లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కాబట్టి అంచనాలకు అనుగుణంగా రాణించి చక్కని విజయాన్ని అందుకుంది. ఇక ఇక్కడి నుంచి భారత్ ఆడబోయే ప్రతి మ్యాచ్ కీలకమే. న్యూజిలాండ్తో ఊహించని పరాజయం తర్వాత భారత్ అదృష్టం కొద్దీ పాక్తో తలపడింది. చాలా మంది ఈ మ్యాచ్పై ఆసక్తి చూపడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయితే ఈ రోజుల్లో పాక్ను ఓడించడం భారత్కు చాలా సులువుగా మారింది. కాబట్టి తొలి ఓటమి తర్వాత టీమిండియాకు తక్షణ విజయం దక్కింది. దీంతో గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు చాలా మెరుగుపడుతోంది. కానీ ఇద్దరు బౌలర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించడం ఆందోళనగా మారింది. తుది జట్టులో టస్కిన్ లేకపోవడం బౌలింగ్పై ప్రభావం చూపుతుంది. ఆస్ట్రేలియాపై తమీమ్ ఆడకపోవడంతో తుది జట్టులో అతని ఎంపికపై సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాట్స్మెన్కు అనుకూలంగా మారిన ఆటలో షాట్లు ఆడే సమయంలో మరింత బలం వచ్చేందుకు గాను బరువు ఎక్కువ ఉన్న బ్యాట్లను వాడినా ఎవరూ పట్టించుకోరు. కానీ అదే బౌలర్లు మోచేతిని కొద్దిగా పక్కకు వంచితే మాత్రం వేటు వేస్తున్నారు. ఒకరకంగా ఇది బౌలర్ల పట్ల చాలా కఠినంగా వ్యవహరించడమే. భారత్, బంగ్లాదేశ్ల మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. కాబట్టి భారత్కు స్పిన్ వికెట్ కాకుండా తొలిసారి మంచి బ్యాటింగ్ పిచ్ లభించనుంది. ధావన్, రోహిత్లకు ఇది శుభవార్త. -
వర్ణ రంజితం కావాలి
నేడు బంగ్లాదేశ్తో భారత్ ఢీ నెట్న్ర్రేట్పై ధోనిసేన దృష్టి తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగానే... తెల్ల గోడ వెలిసిపోయినట్లు అనిపించింది. మన నీలి రంగు మెరుపు తగ్గిందనే ఆందోళన కలిగింది. తర్వాత మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేయగానే... ప్రత్యర్థిపై పచ్చరంగు చల్లి బల్లే బల్లే అంటూ గంతులేశాం. ఇప్పుడు ప్రత్యర్థిపై అన్ని రంగులూ కలిపి బలంగా చల్లాల్సిన సమయం వచ్చింది. ఏదో సాదాసీదా గెలుపు గులాల్తో సరిపెట్టకుండా రంగ్దే బసంతి అంటూ రంగుల్లో ముంచెత్తాలి. హోళీ వేల యావత్ దేశం ధోనిసేన నుంచి ‘కలర్ఫుల్’ విజయాన్ని ఆశిస్తోంది. పాక్ను కసితీరా ఓడించినా... మరో పక్క అడపాదడపా విజయాలతో పక్కలో బల్లెంలా మారుతున్న బంగ్లాదేశ్నూ తక్కువ అంచనా వేయకూడదు. తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉన్నందున ఈ మ్యాచ్లో బంగ్లాపై భారీ విజయం సాధించి నెట్న్ర్రేట్ను మెరుగు పరుచుకోవాలి. సెమీస్ బెర్త్లను ఖరారు చేసే ప్రక్రియలో నెట్న్ర్రేట్ కూడా అవసరం కావచ్చు మరి. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్లో భారత జట్టు తమ మూడో లీగ్ మ్యాచ్కు సన్నద్ధమైంది. నేడు (బుధవారం) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్లో ఓడిన ధోనిసేన ఇక్కడా నెగ్గితే సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరో వైపు ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకున్న బంగ్లా ఓడితే అధికారికంగా టోర్నీనుంచి నిష్ర్కమిస్తుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో ఈ మ్యాచ్లో విజయంతో పాటు సాధ్యమైనంతగా రన్రేట్ను పెంచుకోవాలని కూడా భారత జట్టు భావిస్తోంది. రైనా, ధావన్లపై ప్రత్యేక దృష్టి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. మూడు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్లో పాల్గొన్నారు. అయితే టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ప్రత్యేకంగా మరో నెట్స్లో ధావన్, రైనాల చేత ప్రాక్టీస్ చేయించారు. అంతా బాగుందని చెబుతున్నా ప్రస్తుతం జట్టు ఫామ్, ఆటతీరును చూస్తే వీరిద్దరు రాణించడమే ముఖ్యమని జట్టు గుర్తించినట్లుంది. వీరిద్దరికి అన్ని రకాల బౌలింగ్లు వేయిస్తూ శాస్త్రి సాధనను పర్యవేక్షించారు. అందరికంటే ముందుగా వచ్చిన ధావన్ ఆఖర్లో వెళ్లగా, రైనా కూడా సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. అశ్విన్ బౌలింగ్కంటే బ్యాటింగ్పైనే ఎక్కువ దృష్టి పెట్టడం కనిపించింది. ఆసియా కప్లో ఇటీవలే రెండు సార్లు బంగ్లాదేశ్తో తలపడి గెలవడం, ఇరు జట్లలో పెద్దగా మార్పులు కూడా లేకపోవడంతో టీమిండియా అదే జోరులో హ్యట్రిక్ విజయంపై దృష్టి పెట్టింది. జట్టులో మార్పులకు కూడా ఇక ఏ మాత్రం అవకాశం లేదు. నైరాశ్యంలో బంగ్లాదేశ్: సోమవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ భారత్తో మ్యాచ్కు ముందు రోజు ప్రాక్టీస్లో పాల్గొనలేదు. ఐసీసీ నిషేధం కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో గత మ్యాచ్లో టాస్ సమయంలోనే కెప్టెన్ మషఫ్ ్రమొర్తజా మొహంలో ఒకింత నైరాశ్యం కనిపించింది. ప్రధాన బౌలర్ అయి ఉండీ అతను ఒక్క ఓవర్ మాత్రమే వేయడం అతని మానసిక పరిస్థితిని సూచిస్తోంది. జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిన బంగ్లాదేశ్ ఇక ముందంజ వేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గత కొంత కాలంగా బంగ్లాదేశ్ ఫామ్, దూకుడు చూస్తే భారత్కు కూడా గట్టి పోటీ ఇవ్వగల జట్టుగా కనిపించింది. అయితే ఈ వరల్డ్కప్లో పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన జట్టు, ఆస్ట్రేలియాకు తలవంచింది. ఆసీస్తో ఆడని తమీమ్ ఫిట్నెస్పై ఇంకా స్పష్టత లేకపోవడంతో మరోసారి బంగ్లా సీనియర్ షకీబ్పై ఆధార పడుతోంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), మిథున్, సర్కార్, షబ్బీర్, షకీబ్, షువగత, మహ్ముదుల్లా, ముష్ఫికర్, సక్లాయిన్, అల్ అమీన్, ముస్తఫిజుర్. నేనూ... నా నోకియా... ఆశిష్ నెహ్రా సాధారణంగా పెద్దగా మీడియాలో హడావిడి చేయడు. గంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకునే రకం. అయితే మంగళవారం మీడియా సమావేశంలో అతను చేసిన వ్యాఖ్య నవ్వులు పంచింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఫోటోలతో రచ్చ చేస్తున్న ధోరణి పెరిగిపోవడంపై ప్రశ్నకు అతను సరదాగా జవాబిచ్చాడు. ‘మీరు ఎవరిని అడుగుతున్నారో చూడండి. నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. ట్విట్టర్, ఇన్స్టగ్రామ్ వాడను. ఇప్పటికీ ఎప్పటిదో నోకియా ఫోన్నే వాడుతున్నాను. కాస్త పాతకాలం మనిషిలాగా కనిపించవచ్చు కానీ ఇలాగే ఉంటాను. పత్రికలూ చదవను కాబట్టి సోషల్ మీడియా సంగతులు నేను పట్టించుకోను’ అని నెహ్రా అన్నాడు. ► 4 భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకూ నాలుగు టి20లు జరిగితే అన్నింటిలోనూ భారత్ గెలిచింది. పిచ్, వాతావరణం చిన్నస్వామి సాధారణంగా బ్యాటింగ్కు మంచి వేదిక. విండీస్, లంక మధ్య జరిగిన మ్యాచ్ పిచ్నే దీని కోసం ఉపయోగిస్తున్నారు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ముందు రోజు నగరంలో వాతావరణం కాస్త చల్లబడినా... వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం ఉండకపోవచ్చు. -
సమష్టిగా సాధిద్దాం
⇒నేటినుంచి టి20 ప్రపంచ కప్ ⇒తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ ఢీ ఐదేళ్ల క్రితం సొంతగడ్డపై ధోనిసేన సగర్వంగా వన్డే ప్రపంచకప్ను అందుకున్న జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. విదేశాల్లో ఎంత పెద్ద సిరీస్లు గెలిచినా, ఎన్ని ట్రోఫీలు సాధించినా... స్వదేశంలో, సొంత ప్రేక్షకుల సమక్షంలో ప్రపంచకప్ను అందుకోవడం దేశంలో ప్రతి క్రికెట్ అభిమానికి గర్వకారణం. మరోసారి ధోని నేతృత్వంలోని భారత బృందం ఈ ఘనత సాధించడానికి సన్నద్ధమైంది. ఆటగాళ్లు మారినా, ఫార్మాట్ మారినా... కెప్టెన్ అయిన దగ్గరి నుంచి ధోనిది ఒకటే మంత్రం. ‘జట్టులో ప్రతి ఆటగాడి సక్సెస్ను మిగిలిన ఆటగాళ్లంతా ఆస్వాదించాలి’... ‘సమష్టితత్వం కనబరిస్తేనే విజయాలు దక్కుతాయి’.... ఈ రెండు సూత్రాలతోనే ధోని భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా ఎదిగాడు. మరోసారి అదే మంత్రంతో యువ జట్టును తీసుకుని ప్రపంచ సమరానికి సిద్ధమయ్యాడు. స్వదేశంలో ఆడుతున్న ఒత్తిడి తగ్గాలంటే తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించాలి. ఇప్పుడు భారత్ అదే లక్ష్యంతో ప్రపంచకప్ తొలి మ్యాచ్కు సిద్ధమైంది. నాగ్పూర్నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఆసియా కప్లో పరుగుల వరద పారని బోరింగ్ మ్యాచ్లను చూసిన విషయాన్ని ఇక మరచిపోండి. రికార్డులు కొల్లగొట్టే స్కోర్లు కనిపించలేదని బెంగ వద్దు. ఇప్పుడు అసలైన ధనాధన్ క్రికెట్కు చిరునామాగా టి20 ప్రపంచకప్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన అభిమానులు క్రికెట్లో ఆనందం వెతుక్కునే సమయం ఆసన్నమైంది. రాబోయే 20 రోజుల పాటు పరుగుల ప్రవాహం సాగే వరల్డ్ కప్ నేడు (మంగళవారం) ప్రారంభమవుతోంది. ఆతిథ్య జట్టు హోదాలో భారత్ మొదటి మ్యాచ్ ఆడుతోంది. ఇక్కడి జామ్తా మైదానంలో జరిగే ఈ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్తో తలపడుతుంది. ఎలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలాంటి హంగామా, సందడి లేకుండా నేరుగా మ్యాచ్తోనే టోర్నీ మొదలు కానుంది. బ్యాటింగ్ ఆర్డర్లో... తొలి మ్యాచ్కు ముందు టీమిండియా సన్నాహకం భిన్నంగా సాగింది. బ్యాట్స్మెన్, బౌలర్లు విడిగా వేర్వేరు నెట్స్లో సాధన మొదలు పెట్టారు. జట్టులోని ప్రధాన బ్యాట్స్మెన్ అంతా నెట్స్లో త్రో డౌన్స్కే ప్రాక్టీస్ చేశారు. ముందుగా రోహిత్, ధావన్, కోహ్లి... ఆ తర్వాత రైనా, యువరాజ్, ధోని బ్యాటింగ్ చేశారు. చివర్లో కొన్ని బంతులు మినహా జట్టు సహాయక సిబ్బంది, ప్రాక్టీస్ బౌలర్లు విసిరిన బంతులకు అంతా భారీ షాట్లు ఆడారు. ప్రధాన బౌలర్లు ఎవరూ బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేయలేదు. మరో వైపు బౌలర్లు ప్రత్యేకంగా సాధన చేశారు. నెట్స్లో బ్యాట్స్మన్ లేకుండా కేవలం స్టంప్స్ను పెట్టి బౌలింగ్ చేశారు. అయితే బుమ్రా, షమీ మాత్రం బౌలింగ్ చేయకుండా కేవలం బంతులు అందించేందుకే పరిమితం కాగా... అశ్విన్, హర్భజన్, జడేజా మాత్రం చాలా కొద్ది సేపు మాత్రమే బౌలింగ్ చేశారు. సెషన్ ముగిసినా యువరాజ్ మాత్రం ఎక్కువ సేపు ప్రత్యేకంగా శ్రమించాడు. క్యురేటర్ చెప్పినదాని ప్రకారం పూర్తిగా బ్యాటింగ్ వికెట్, భారీ స్కోరుకు అవకాశం ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ అదే ఆలోచనతో ప్రాక్టీస్ చేయించినట్లుంది. ప్రస్తుత స్థితిలో బ్యాట్స్మెన్పైనే భారం ఎక్కువ కాబట్టి బౌలర్లను పెద్దగా శ్రమ పెట్టినట్లు లేదు. ఎప్పటిలాగే గాయాల భయంతో వార్మప్ ఫుట్బాల్కు దూరంగా ఉన్న నెహ్రా కూడా నెట్స్లో కనీసం రెండు ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేదు. అయితే షమీపై ఇంకా సందేహాలు ఉండటంతో తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. జోరుగా అండర్సన్ ‘ఐపీఎల్ ఎలాగూ ఆడుతున్నాడు కాబట్టి ఈ టోర్నీకి మెకల్లమ్ ఉంటే బాగుండేది. రిటైర్మెంట్కు ఇది తగిన సమయం కాదు’... కివీస్ కెప్టెన్ విలియమ్సన్ చేసిన వ్యాఖ్య ఇది. బ్రెండన్ ఉండి ఉంటే అతని ప్రభావం ఎలా ఉండేదో చెప్పడానికి ఈ మాట చాలు. బయట ఎంత క్రికెట్ ఆడినా ఒక రకంగా భారత్లో కివీస్ పూర్తిగా కొత్త జట్టులాంటిదే. ప్రాక్టీస్ సందర్భంగా నెట్స్లో న్యూజిలాండ్ అందరు ఆటగాళ్లను పరీక్షించింది. బ్యాట్స్మెన్, బౌలర్లు సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో శ్రమించారు. నేటి మ్యాచ్లో కివీస్ తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న కోరీ అండర్సన్ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడగా, మరో కీలక ఆటగాడు గప్టిల్ ఎక్కువసేపు సాధన చేశాడు. ఇక్కడ ఆ జట్టుకు ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్న స్పిన్పైనే వారు ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. కివీస్కు సహకరించిన ప్రాక్టీస్ బౌలర్లంతా స్పిన్నర్లే కావడం విశేషం. జట్లు (అంచనా) భారత్ : ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా న్యూజిలాండ్ : విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, రాంచీ, టేలర్, ఇలియట్, సాన్ట్నర్, మెకల్లమ్, సౌతీ, మెక్లీన్గన్, బౌల్ట్. ఇక్కడ స్పిన్ పిచ్లు ఎదురవుతాయని తెలుసు. అందుకోసం సన్నద్ధమయ్యే వచ్చాం. టోర్నీకి ముందు ఎక్కువ టి20 మ్యాచ్లు ఆడలేదు. కానీ అదేమీ వరల్డ్ కప్ మ్యాచ్ల గెలుపుపై గ్యారంటీ ఇవ్వదు. బ్రెండన్ లేడని తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే మా వ్యూహాలు రూపొందించుకున్నాం. టోర్నీ గెలవగలిగితే మార్టిన్ క్రోకు అంతకంటే పెద్ద నివాళి ఉండదు - విలియమ్సన్, కివీస్ కెప్టెన్ వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీ ఆడుతున్నప్పుడు పాండ్యా, బుమ్రాలాంటి కుర్రాళ్లలో ఒక రకమైన ఉద్వేగం ఉంటుంది. 2011లో నేనూ దానిని అనుభవించాను. అయితే దీని వల్ల దృష్టి మరలకుండా ఏకాగ్రతగా ఆడటం ముఖ్యం. సొంతగడ్డపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. మైదానంలో మేం హాయిగా ఆడతాం. కానీ మైదానం బయట దీనిని తట్టుకోవడమే కష్టం. బ్యాటింగ్ చేసే అవకాశం రాని ఆటగాళ్లనుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడమే మా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న మంచి వాతావరణానికి సూచన. టోర్నీలో శుభారంభంపై నమ్మకంతో ఉన్నాం. - విరాట్ కోహ్లి ⇒ 4 న్యూజిలాండ్తో జరిగిన నాలుగు టి20 మ్యాచ్ల్లో భారత్ ఒక్కటీ గెలవలేదు. రా. గం. 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలం, భారీ స్కోరు నమోదు కావచ్చని క్యురేటర్ కర్లేకర్ చెప్పారు. పేస్బౌలర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చు. మంచు ప్రభావం లేదు. శనివారం క్వాలిఫయర్ మ్యాచ్ రోజున అనూహ్యంగా ఇక్కడ వర్షం కురిసినా... ఇప్పుడు దాని ప్రభావం లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. భువనేశ్వర్ కూడా జట్టుతోనే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తరహాలోనే ఈ సారి కూడా భారత్ అదనపు ఆటగాడిని జట్టుతో కొనసాగిస్తోంది. షమీ గాయం గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో లేని భువనేశ్వర్కుమార్ టీమ్తోపాటు వెళుతున్నాడు. సోమవారం షమీ ఒక్క బంతి వేయకపోగా, భువీ మాత్రం సుదీర్ఘంగా నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. నల్ల రిబ్బన్లతో న్యూజిలాండ్ ఆటగాళ్లు టి20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో న్యూజి లాండ్ ఆటగాళ్లు తమ భుజాలకు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగబోతున్నారు. తమ క్రికెట్ దిగ్గజం మార్టిన్ క్రో మృతికి నివాళిగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం క్యాన్సర్తో పోరాడిన 53 ఏళ్ల మార్టిన్ క్రో ఈనెల 3న మరణించిన విషయం విదితమే. -
ఆఖర్లో పంచ్
► రెండోప్రాక్టీస్ మ్యాచ్లో ఓడిన భారత్ 4 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు ► చెలరేగిన డుమిని, డికాక్ ధావన్, రైనా, ధోనిల శ్రమ వృథా ముంబై: పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న భారత్కు టి20 ప్రపంచకప్కు ముందు పంచ్ పడింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ధోనిసేన 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 196 పరుగులు చేసింది. డుమిని (44 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (33 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. మిల్లర్ (18) ఓ మాదిరిగా ఆడినా మిగతా వారు విఫలమయ్యారు. పాండ్యా 3, షమీ, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసింది. ధావన్ (53 బంతుల్లో 73; 10 ఫోర్లు), రైనా (26 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధావన్, రైనా నాలుగో వికెట్కు 94 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో ధావన్, రైనా రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగారు. ఈ దశలో వచ్చిన యువరాజ్ (16 నాటౌట్), ధోని వీరవిహారం చేశారు. 18 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇక ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 9 పరుగులు మాత్రమే రాబట్టడంతో ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) ధోని (బి) బుమ్రా 5; డికాక్ రిటైర్డ్ అవుట్ 56; డు ప్లెసిస్ (సి) జడేజా (బి) షమీ 12; డుమిని (సి) జడేజా (బి) షమీ 67; మిల్లర్ (సి) ధోని (బి) పాండ్యా 18; రోసోవ్ (సి) జడేజా (బి) పాండ్యా 11; వీస్ (సి) ధోని (బి) పాండ్యా 0; మోరిస్ (బి) బుమ్రా 14; బెహర్డిన్ రనౌట్ 5; అబాట్ నాటౌట్ 0; ఫాంగిసో నాటౌట్ 0; ఎక్స్ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-15; 2-33; 3-110; 4-148; 5-170; 6-171; 7-186; 8-194; 9-195. బౌలింగ్: హర్భజన్ 4-0-27-0; షమీ 4-0-37-2; బుమ్రా 4-0-51-2; పాండ్యా 4-0-36-3; నేగి 1-0-12-0; జడేజా 2-0-18-0; రైనా 1-0-13-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 10; ధావన్ రిటైర్డ్ అవుట్ 73; కోహ్లి (సి) డికాక్ (బి) స్టెయిన్ 1; రహానే రనౌట్ 11; రైనా రిటైర్డ్ అవుట్ 41; యువరాజ్ నాటౌట్ 16; ధోని నాటౌట్ 30; ఎక్స్ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-11; 2-16; 3-48; 4-142; 5-142. బౌలింగ్: స్టెయిన్ 4-0-36-1; అబాట్ 4-0-32-1; మోరిస్ 4-0-43-0; వీస్ 2-0-26-0; తాహిర్ 3-0-25-1; డుమిని 2-0-16-0; ఫాంగిసో 1-0-13-0. -
ఆసియా కప్ విజేత భారత్
-
ఆసియాను గెలిచాం 'ప్రపంచం' మిగిలింది
⇒ భారత్దే ఆసియాకప్ ⇒ ఫైనల్లో బంగ్లాదేశ్పై 8 వికెట్ల విజయం ⇒ రాణించిన ధావన్, కోహ్లి అదే జోరు... ఆసియాకప్లో తొలి మ్యాచ్ నుంచి ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా చెలరేగిపోయిన ధోనిసేన... ఫైనల్లోనూ చెలరేగింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో సొంతగడ్డపై ఫైనల్ వరకూ వచ్చిన బంగ్లా పులులను భారత్ అలవోకగా వేటాడింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, యూఏఈ... ఇలా ఈ ఏడాదిఎదురైన ప్రతి ప్రత్యర్థినీ చిత్తు చేసిన ధోనిసేన... ఇక సొంతగడ్డపై ప్రపంచాన్ని గెలవడమే మిగిలింది. మిర్పూర్: ఆసియాకప్ ఆసాంతం నిలకడగా ఆడి, ఓటమి లేకుండా చెలరేగిన భారత్ ఫైనల్లోనూ అదే జోరు చూపించింది. సొంతగడ్డపై, అభిమానుల అండతో సంచలనం సృష్టించాలనుకున్న బంగ్లాదేశ్ ఆశలు నెరవేరలేదు. శిఖర్ ధావన్ (44 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు)ల సమయోచిత బ్యాటింగ్తో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో 15 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 120 పరుగులు చేసింది. మహ్మదుల్లా (13 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షబ్బీర్ రెహమాన్ (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగి ఆడారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. ధోని (6 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ధావన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, షబ్బీర్ రెహమాన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు లభించాయి. ఆఖర్లో హవా కొత్త బంతిని అశ్విన్ చేతికి ఇచ్చిన ధోని.. బంగ్లా ఓపెనర్లు తమీమ్ (13), సౌమ్య (14)లను కట్టడి చేయగా, తర్వాతి ఓవర్లలో నెహ్రా, బుమ్రాలు ఒత్తిడిని కొనసాగించారు. దీంతో తొలి మూడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే వచ్చాయి. ఒత్తిడిని అధిగమించేందుకు నాలుగో ఓవర్లో సౌమ్య వరుసగా రెండు ఫోర్లు బాదినా... ఆఖరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే బుమ్రా అద్భుతమైన ఇన్స్వింగర్తో తమీమ్ను వెనక్కి పంపాడు. దీంతో బంగ్లా స్కోరు 30/2కు చేరుకుంది. ఈ దశలో షబ్బీర్, షకీబ్ (21)లు నిలకడగా ఆడారు. అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 34 పరుగులు జత చేశాక షకీబ్ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఇక 12వ ఓవర్లో ముష్ఫికర్ (4), మోర్తజా (0)లు వరుస బంతుల్లో అవుట్కావడం బంగ్లా 75 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత షబ్బీర్కు జత కలిసిన మహ్మదుల్లా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయి చివరి మూడు ఓవర్లలో 42 పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్కు అజేయంగా 20 బంతుల్లోనే 45 పరుగులు జోడించడంతో బంగ్లా మంచి స్కోరు సాధించింది. అశ్విన్, నెహ్రా, బుమ్రా, జడేజా తలా ఓ వికెట్ తీశారు. రోహిత్ విఫలమైనా... లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. అమిన్ బంతిని ఆడబోయి రోహిత్ (1) స్లిప్లో దొరికిపోయాడు. దీంతో భారత్ 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత ధావన్, కోహ్లిలు కాస్త జాగ్రత్తగా ఆడారు. అయితే ఐదు, ఆరు ఓవర్లలో ఆరు ఫోర్లతో 29 పరుగులు చేసి జోరు పెంచారు. తర్వాత స్పిన్నర్ నాసిర్ హుస్సేన్ కట్టడి చేసినా... మోర్తజా ఓవర్లో ధావన్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో భారీ సిక్సర్ బాదడంతో పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 71/1కి చేరింది. ఈ క్రమంలో ధావన్ 11వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 12వ ఓవర్లో కోహ్లి... మూడు బౌండరీలతో నాసిర్కు చుక్కలు చూపెట్టాడు. ఇక 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో ధావన్ కొట్టిన బలమైన షాట్ను పాయింట్లో సౌమ్య అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రెండో వికెట్కు 67 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో ధోని మెరుపులు మెరిపించాడు. అమిన్ వేసి న 14వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. ధోని, కోహ్లి మూడో వికెట్కు 7 బంతుల్లో అజేయంగా 23 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 13; సౌమ్య సర్కార్ (సి) పాండ్యా (బి) నెహ్రా 14; షబ్బీర్ నాటౌట్ 32 ; షకీబ్ (సి) బుమ్రా (బి) అశ్విన్ 21; ముష్ఫికర్ రనౌట్ 4; మోర్తజా (సి) కోహ్లి (బి) జడేజా 0; మహ్మదుల్లా నాటౌట్ 33; ఎక్స్ట్రాలు: 3; మొత్తం: (15 ఓవర్లలో 5 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1-27; 2-30; 3-64; 4-75; 5-75. బౌలింగ్: అశ్విన్ 3-0-14-1; నెహ్రా 3-0-33-1; బుమ్రా 3-0-13-1; జడేజా 3-0-25-1; పాండ్యా 3-0-35-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌమ్య (బి) అల్ అమిన్ 1; ధావన్ (సి) సౌమ్య (బి) తస్కిన్ 60; కోహ్లి నాటౌట్ 41; ధోని నాటౌట్ 20; మొత్తం: (13.5 ఓవర్లలో 2 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-5; 2-99. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 3-0-14-1; అల్ అమిన్ 2.5-0-30-1; అబు హైదర్ 1-0-14-0; షకీబ్ 2-0-26-0; మోర్తజా 2-0-16-0; నాసిర్ హుస్సేన్ 3-0-22-0. -
వన్స్మోర్
► భారత్, బంగ్లా ఫైనల్ పోరు నేడు ఆత్మవిశ్వాసంతో ధోనిసేన ► సంచలనం కోసం బంగ్లా తహతహ ఆసియా కప్ టి20 టోర్నీ సరిగ్గా పది రోజుల క్రితం బంగ్లాదేశ్పై ఘనంగా గెలిచి ఆసియా కప్ను మొదలుపెట్టిన భారత్... ఆ తర్వాత టోర్నీ మొత్తం తన సత్తా చూపెట్టింది. ప్రత్యర్థులందర్నీ చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు టైటిల్ పోరులో మళ్లీ బంగ్లాదేశ్తో అమీతుమీకి సిద్ధమైంది. మరోసారి టోర్నీ తొలి మ్యాచ్ ఫలితాన్ని ధోనిసేన పునరావృతం చేస్తే ఆసియాకప్తో ఘనంగా స్వదేశానికి వచ్చి ప్రపంచకప్ సమరాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించొచ్చు. మిర్పూర్: బంగ్లాదేశ్ జట్టు ఏడాది కాలంగా సొంతగడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతోంది. ప్రస్తుత ఆసియాకప్ టి20 టోర్నీలోనూ ఒక్క భారత్ మినహా అన్ని జట్లపై గెలిచింది. ఇందులో పాకిస్తాన్, శ్రీలంకలాంటి బలమైన జట్లపై విజయాలు ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. దీనికితోడు స్టేడియాన్ని హోరెత్తించే అభిమానుల మద్దతు కూడా వారికే ఉంటుంది. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో ధోనిసేన ఏమాత్రం అలసత్వం చూపకుండా బంగ్లాను మరోసారి కొట్టేయాలి. ఫామ్ పరంగా భారత్ ఈ మ్యాచ్లో తిరుగులేని ఫేవరెట్. అయితే అనిశ్చితికి మారుపేరైన టి20 ఫార్మాట్లో భారత్నూ ఓడించి ఓ పెద్ద టైటిల్ గెలవాలని బంగ్లాదేశ్ తహతహలాడుతోంది. మళ్లీ పాత జట్టే యూఏఈతో మ్యాచ్కు రిజర్వ్ బెంచ్కు అవకాశం ఇచ్చిన ధోని... ఫైనల్కు మాత్రం మళ్లీ పాత జట్టునే బరిలోకి దించనున్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. ఓపెనర్లలో రోహిత్ ఇప్పటికే టోర్నీలో 137 పరుగులు చేసినా.. ధావన్ చెలరేగాల్సి ఉంది. కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగించాలని భావిస్తుండగా, రైనా కూడా భారీ ఇన్నింగ్స్పై కన్నేశాడు. శ్రీలంక, యూఏఈలపై మంచి ఇన్నింగ్స్ ఆడి ఒత్తిడి తగ్గించుకున్న యువరాజ్ ఈ మ్యాచ్లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడు. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తుండటం భారత్కు అదనపు బలం. జడేజా బ్యాట్ మెరవకపోయినా... బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నాడు. కీలక వికెట్లతో పాటు ఫీల్డింగ్లోనూ మెరుపులు చూపెడుతున్నాడు. ఇక ప్రధాన స్పిన్నర్ అశ్విన్ తన బాధ్యత మరోసారి సమర్థంగా నిర్వర్తిస్తే టీమిండియాకు తిరుగుండదు. పేసర్లు నెహ్రా, జస్ప్రీత్ బూమ్రాలు అంచనాలకు అనుగుణంగా రాణిస్తుండటం అనుకూలాంశం. ఓవరాల్గా జట్టుపై కెప్టెన్ ధోని పూర్తి విశ్వాసం చూపెట్టడం శుభసూచకం. గాయాల బెడద మరోవైపు బంగ్లాదేశ్ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ టోర్నీ నుంచి వైదొలగగా, ఆల్రౌండర్ షకీబ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆడటంపై అనిశ్చితి నెలకొంది. అయితే పాక్తో ఆడిన తుది జట్టునే ఫైనల్కు కొనసాగించాలని మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ స్లో వికెట్ను ఎంచుకుంటే మాత్రం స్పిన్నర్ అరాఫత్ సన్నీ చోటు నిలబెట్టుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఫామ్లో ఉన్నా కీలక సమయంలో తడబడటం ఆందోళనగా మారింది. తమీమ్ ఇక్బాల్ ఇంతవరకు బ్యాట్కు పని చెప్పలేదు. సౌమ్య సర్కార్, షబ్బీర్ రెహమాన్లు పోరాడుతున్నా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోతున్నారు. ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా మరోసారి కీలకం కానున్నారు. బౌలింగ్లో స్ట్రయిక్ బౌలర్ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమిన్ హుస్సేన్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. తస్కిన్, మోర్తజా, షకీబ్లు గాడిలో పడాల్సి ఉంది. అంచనాలకు మించి రాణిస్తే తప్ప ఈ మ్యాచ్లో భారత్ను కట్టడి చేయడం బంగ్లాకు అంత సులువుకాదు. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా. బంగ్లాదేశ్: మోర్తజా (కెప్టెన్), తమీమ్, సౌమ్య, షబ్బీర్, ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా, మిథున్, అల్ అమిన్, సన్నీ, తస్కిన్. పిచ్, వాతావరణం టోర్నీ ఆరంభంతో పోలిస్తే పిచ్లు క్రమంగా బ్యాటింగ్కు అనుకూలిస్తున్నాయి. అలాగే మంచు కూడా కీలక పాత్ర పోషిస్తున్నందున టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వర్షం ముప్పేమీ లేదు. బంగ్లాదేశ్తో ఫైనల్ కూడా ఓ మామూలు మ్యాచ్లాంటిదే. భారత జట్టులో ప్రతి ఒక్కరికీ అనుభవం ఉంది కాబట్టి ప్రతి జట్టును, ప్రతి మ్యాచ్ను ఒకేలా చూశాం. అయితే తొలి మ్యాచ్లో బంగ్లాపై గెలవడం మాకు కలిసొచ్చింది. ఎందుకంటే ఆ మ్యాచ్లో మేం చివరి 10 ఓవర్ల వరకూ ఒత్తిడిలోనే ఆడాం. ఇక తర్వాతి మ్యాచ్ల్లో మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. మా బ్యాటింగ్, బౌలింగ్ బాగా పని చేశాయి. ఎలాంటి పిచ్లు ఇస్తారనేది మన చేతుల్లో లేదు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. - రవిశాస్త్రి (భారత్ టీమ్ డెరైక్టర్) 1 భారత్, బంగ్లాదేశ్ జట్లు ఒక పెద్ద టోర్నీ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి ఈ మ్యాచ్లో భారత్ జట్టే ఫేవరెట్. ఇందులో ఎలాంటి చర్చకు తావులేదు. అయితే ఇక్కడి అభిమానులు, పరిస్థితులు, పిచ్ మాకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో చివరి వరకు పోరాడేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికీ మా జట్టులో టి20 స్టార్ లేడు. అయినా మేమంతా సమష్టిగా రాణించి విజయాలు సాధిస్తున్నాం. - మోర్తజా (బంగ్లా కెప్టెన్) -
ఓ పనైపోయింది!
► ఆఖరి మ్యాచ్లోనూ గెలిచిన భారత్ ► 9 వికెట్లతో ఓడిన యూఏఈ ► అగ్రస్థానంతో లీగ్ దశ ముగింపు ► ఆసియా కప్ టి20 టోర్నీ ఆసియాకప్లో ఒక మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్కు చేరిన భారత్ ఆఖరి మ్యాచ్లో పసికూన యూఏఈని కూడా చిత్తు చేసింది. పనిలోపనిగా ఇన్నాళ్లూ బెంచ్ మీద కూర్చున్న ముగ్గురు బౌలర్లు హర్భజన్, నేగి, భువనేశ్వర్లకూ అవకాశం ఇచ్చింది. దీనిని ఈ త్రయం చక్కగా వినియోగించుకుని బెంచ్ బలంగా ఉందని నిరూపించింది. మొత్తం మీద నాలుగో విజయంతో ఆసియాకప్ లీగ్ దశను ధోనిసేన అగ్రస్థానంతో ముగించింది. మిర్పూర్: ఇప్పటి వరకు రిజర్వ్ బెంచ్కే పరిమితమైన భారత బౌలర్లు... వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి కాకపోయినా... కట్టుదిట్టమైన బౌలింగ్తో యూఏఈని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో... గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది. షైమాన్ అన్వర్ (48 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. పచ్చిక వికెట్పై ఆరంభంలో భువనేశ్వర్, బుమ్రాలు చెలరేగితే.. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. పరుగులు నిరోధించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దీంతో భాగస్వామ్యాలు నమోదు చేయడంలో యూఏఈ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఓవరాల్గా ఏడుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది. భువనేశ్వర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ధావన్ (20 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా... రోహిత్ జోరు కనబర్చాడు. ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో పరుగులు వేగంగా వచ్చాయి. నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్తో 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆరో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాది అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్కు 35 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్డౌన్లో వచ్చిన యువరాజ్ (14 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) షెహజాద్ బౌలింగ్లో భారీ సిక్సర్తో రెచ్చిపోయాడు. తర్వాత ధావన్తో కలిసి బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరు రెండో వికెట్కు అజేయంగా 39 పరుగులు సమకూర్చడంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ సొంతమైంది. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు యూఏఈ ఇన్నింగ్స్: రోహన్ ముస్తఫా (సి) కోహ్లి (బి) పాండ్యా 11; స్వప్పిల్ పాటిల్ (సి అండ్ బి) భువనేశ్వర్ 1; షెహజాద్ (సి) రైనా (బి) బుమ్రా 0; అన్వర్ రనౌట్ 43; ఉస్మాన్ (సి) హర్భజన్ (బి) నేగి 9; జావేద్ (సి) నేగి (బి) హర్భజన్ 0; కలీమ్ (సి) పాండ్యా (బి) యువరాజ్ 2; ఫహద్ తారిక్ రనౌట్ 3; నవీద్ (సి) నేగి (బి) భువనేశ్వర్ 5; రజా నాటౌట్ 0; అహ్మద్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1-1; 2-2; 3-25; 4-51; 5-53; 6-62; 7-66; 8-80; 9-81. బౌలింగ్: భువనేశ్వర్ 4-2-8-2; బుమ్రా 4-0-23-1; పాండ్యా 3-1-11-1; హర్భజన్ 4-1-11-1; నేగి 3-0-16-1; యువరాజ్ 2-0-10-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నవీద్ (బి) అహ్మద్ 39; ధావన్ నాటౌట్ 16; యువరాజ్ నాటౌట్ 25; ఎక్స్ట్రాలు: 2; మొత్తం: (10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 82. వికెట్ల పతనం: 1-43. బౌలింగ్: నవీద్ 4-0-21-0; జావేద్ 2-0-18-0; అహ్మద్ 2-0-23-1; షెహజాద్ 1.1-0-14-0; ముస్తఫా 1-0-6-0. మార్టిన్ క్రోకు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్ ధరించి మ్యాచ్ ఆడారు. అలాగే మ్యాచ్కు ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు మార్టిన్ అన్న జెఫ్ క్రో ఈ మ్యాచ్లో రిఫరీగా విధులు కొనసాగించారు. 59 ఈ మ్యాచ్లో భారత్ 59 బంతులు మిగిలుండగానే గెలిచింది. టి20ల్లో భారత్కు ఇదే అతి పెద్ద విజయం (బంతులపరంగా). -
కసితీరా కొట్టారు
► రెండో టి20లో భారత్ ఘన విజయం ► రాణించిన ధావన్, రోహిత్, రైనా ► పెరీరా ‘హ్యాట్రిక్’ వృథా ► మూడో మ్యాచ్ రేపు వైజాగ్లో తొలి టి20లో ఘోర ఓటమి కసి పెంచిందేమో... భారత క్రికెటర్లు రెచ్చిపోయారు. వికెట్ కాస్త ఫ్లాట్గా కనిపించగానే వీర బాదుడు బాదేశారు. ఇక తమ శైలికి సరిగ్గా సరిపోయే పిచ్పై భారత స్పిన్నర్లూ పండగ చేసుకున్నారు. వెరసి... శ్రీలంకను కసితీరా కొట్టారు. రెండో టి20లో ఏకంగా 69 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో నిర్ణయాత్మక ఆఖరి టి20 రేపు విశాఖపట్నంలో జరుగుతుంది. రాంచీ: సొంతగడ్డపై తమ బ్యాటింగ్ బలాన్ని చూపెట్టిన భారత్... ప్రతీకార మ్యాచ్లో రెచ్చిపోయింది. శిఖర్ ధావన్ (25 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రోహిత్ శర్మ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్సర్) అండగా నిలవడంతో... శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత్ 69 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రైనా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. కపుగెడెర (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. చండిమల్ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు), షనక (18 బంతుల్లో 27; 3 సిక్సర్లు) మోస్తరుగా ఆడారు. ధావన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆదివారం వైజాగ్లో జరుగుతుంది. ధావన్ జోరు భారత్కు రోహిత్, ధావన్ చక్కని శుభారంభం ఇచ్చారు. తొలి బంతిని రోహిత్ బౌండరీకి తరలిస్తే.. తర్వాతి రెండు ఓవర్లలో ధావన్ రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో ఓవర్లో రజిత నాలుగు ఫోర్లు సమర్పించుకోవడంతో పవర్ప్లే ముగిసేసరికి భారత్ 70 పరుగులు చేసింది. అయితే 22 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్ను ఏడో ఓవర్లో చమీరా అవుట్ చేయడంతో తొలి వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రహానే, రోహిత్ మంచి సమన్వయంతో ఆడినా.. లంక బౌలర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్లో రోహిత్ ఒక్క సిక్సర్ బాదితే... తర్వాతి ఓవర్లో రహానే ఓ రెండు ఫోర్లతో అలరించాడు. అయితే ఆరు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్కావడంతో భారత్ స్కోరు 127/3గా మారింది. ఈ దశలో రైనా, పాండ్యాల జోరుతో స్కోరు బోర్డు కదం తొక్కింది. 17వ ఓవర్లో పాండ్యా రెండు సిక్సర్లు, తర్వాతి ఓవర్లో రైనా నాలుగు ఫోర్లతో చెలరేగాడు. కానీ 19వ ఓవర్లో పెరీరా మ్యాజిక్ చేశాడు. వరుసగా మూడు బంతుల్లో పాండ్యా, రైనాతో పాటు యువరాజ్ (0)నూ అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. రైనా, పాండ్యా నాలుగో వికెట్కు 4.2 ఓవర్లలో 59 పరుగులు జత చేశారు. చివర్లో ధోని (9 నాటౌట్), జడేజా (1 నాటౌట్) ఓ మాదిరిగా ఆడారు. పెరీరా 3, చమీరా 2 వికెట్లు తీశారు. చకచకా వికెట్ల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లంకేయులు ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. ఓపెనర్లు గుణతిలక (2), దిల్షాన్ (0), ప్రసన్న (1)లు స్వల్ప వ్యవధిలో అవుట్కావడంతో లంక 16 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. చండిమల్, కపుగెడెరా నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 52 పరుగులు జోడించాక వరుస బంతుల్లో అవుటయ్యారు. దీంతో లంక 68 పరుగులకు సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సిరివర్ధన (28 నాటౌట్), షనక భారీ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ యువరాజ్, జడేజాలు నాణ్యమైన బంతులతో ఈ ఇద్దరినీ నిలువరించారు. ఆరో వికెట్కు 48 పరుగులు జత చేశాక షనక అవుటయ్యాడు. ఆ తర్వాత మరో మూడు పరుగుల వ్యవధిలో పెరీరా (0), సేననాయకే (0), చమీరా (0)లు అవుట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. అశ్విన్ 3, నెహ్రా, జడేజా, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. ‘భారత క్రికెట్లో ప్రయోగాలు అనే మాటను నిషేధించాం. టాప్ ఆర్డర్లో అందరూ నిలకడగా ఆడుతున్నారు. కాబట్టి మిగిలిన వాళ్లకి అవకాశాలు కల్పించాలని అనుకున్నాం. ఈ మ్యాచ్ లో అందరూ అన్ని విభాగాల్లో రాణించారు.’ - ధోని స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) చమీరా 43; ధావన్ (సి) చండిమల్ (బి) చమీరా 51; రహానే (సి) దిల్షాన్ (బి) సేననాయకే 25; రైనా (సి) చమీరా (బి) పెరీరా 30; హార్దిక్ పాండ్యా (సి) గుణతిలక (బి) పెరీరా 27; ధోని నాటౌట్ 9; యువరాజ్ (సి) సేననాయకే (బి) పెరీరా 0; జడేజా నాటౌట్ 1; ఎక్స్ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-75; 2-122; 3-127; 4-186; 5-186; 6-186. బౌలింగ్: రజిత 4-0-45-0; పెరీరా 3-0-33-3; సేననాయకే 4-0-40-1; చమీరా 4-0-38-2; ప్రసన్న 3-0-21-0; సిరివర్ధన 1-0-6-0; షనక 1-0-12-0 శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) నెహ్రా 2; దిల్షాన్ (స్టంప్) ధోని (బి) అశ్విన్ 0; ప్రసన్న (సి) యువరాజ్ (బి) నెహ్రా 1; చండిమల్ (స్టంప్) ధోని (బి) జడేజా 31; కపుగెడెర (సి) పాండ్యా (బి) జడేజా 32; సిరివర్ధన నాటౌట్ 28; షనక (సి) రైనా (బి) అశ్విన్ 27; పెరీరా (సి) రహానే (బి) అశ్విన్ 0; సేననాయకే ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 0; చమీరా (బి) బుమ్రా 0; రజిత నాటౌట్ 3; ఎక్స్ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-2; 2-3; 3-16; 4-68; 5-68; 6-116; 7-117; 8-119; 9-119. బౌలింగ్: అశ్విన్ 4-0-14-3; నెహ్రా 3-0-26-2; యువరాజ్ 3-0-19-0; జడేజా 4-0-24-2; రైనా 2-0-22-0; బుమ్రా 3-0-17-2; పాండ్యా 1-0-5-0. -
‘ప్రాక్టీస్’లో బాదేశారు
► ఆసీస్ పర్యటనలో భారత్ శుభారంభం ► వెస్టర్న్ ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం ► చెలరేగిన కోహ్లి, ధావన్ నేడు ప్రాక్టీస్ వన్డే మ్యాచ్ పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనను ధోని సేన భారీ గెలుపుతో మొదలు పెట్టింది. వన్డే సిరీస్కు ముందు సన్నాహకంగా జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 74 పరుగుల తేడాతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ను చిత్తు చేసింది. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (46 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు రెండో వికెట్కు 14.1 ఓవర్లలోనే 149 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వెస్టర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రెవిస్ బర్త్ (60 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్... పేసర్ బరీందర్ శరణ్ తలా 2 వికెట్లు తీశారు. శనివారం జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్లో భారత్... ఇదే జట్టుతో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్లో అనవసరపు సింగిల్కు ప్రయత్నించి రోహిత్ శర్మ (6) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ధావన్, కోహ్లి కలిసి తమదైన శైలిలో ఆడారు. ఇద్దరు బ్యాట్స్మెన్ తమ టి20 నైపుణ్యం, అనుభవాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ముందుగా ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మూడీ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 బాదిన కోహ్లి 35 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ధావన్ మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్లో కూడా 22 పరుగులు రాబట్టిన భారత్... అదే ఓవర్లో కోహ్లి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో ధావన్, అజింక్య రహానే (2) అవుటైనా, చివర్లో ధోని (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఆకట్టుకున్న శరణ్ భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) జట్టును ఆరంభంలోనే బరీందర్ శరణ్ కట్టి పడేశాడు. తన రెండో ఓవర్లో షార్ట్ (5)ను అవుట్ చేసిన అతను, మూడో ఓవర్లో బొసిస్టో (1)ను వెనక్కి పంపాడు. ఒకవైపు బర్త్ చక్కటి షాట్లతో దూసుకుపోయి 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నా... మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పూర్తిగా కట్టడి చేయడంతో డబ్ల్యూఏ బ్యాట్స్మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లిస్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. జడేజా తన వరుస ఓవర్లలో 2 వికెట్లు తీయగా, అక్షర్ కూడా అదే తరహాలో 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బర్త్ చివరకు అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 6; శిఖర్ ధావన్ (సి) షార్ట్ (బి) కెల్లీ 74; విరాట్ కోహ్లి (సి) ఇంగ్లిస్ (బి) నికోలస్ 74; ధోని (నాటౌట్) 22; అజింక్య రహానే (సి) ఇంగ్లిస్ (బి) డఫీల్డ్ 2; గుర్కీరత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-12; 2-161; 3-173; 4-185. బౌలింగ్: డఫీల్డ్ 4-0-21-1; నికోలస్ 4-0-44-1; కెల్లీ 4-0-31-1; మూడీ 3-0-40-0; కానర్ 3-0-34-0; ముర్హెడ్ 2-0-17-0. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్: బర్త్ (నాటౌట్) 74; షార్ట్ (సి) అశ్విన్ (బి) శరణ్ 5; బొసిస్టో (సి) అశ్విన్ (బి) శరణ్ 1; ఇంగ్లిస్ (సి) శరణ్ (బి) జడేజా 11; హాబ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 5; మోర్గాన్ (సి) రహానే (బి) అక్షర్ 3; కెల్లీ (స్టంప్డ్) ధోని (బి) అక్షర్ 2; నికోలస్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-20; 2-26; 3-61; 4-73; 5-83; 6-92. బౌలింగ్: శరణ్ 4-0-24-2; ఉమేశ్ 3-0-23-0; రిషి ధావన్ 3-0-22-0; జడేజా 3-0-13-2; అశ్విన్ 4-0-20-0; అక్షర్ 3-0-13-2. -
'పటాస్' పేలుతుందా"!
తడబడుతున్న భారత ఓపెనర్ తొలి టెస్టులో ఘోర వైఫల్యం ధావన్ స్థానానికి ముప్పు! రాహుల్నుంచి గట్టి పోటీ ఒక్కసారి అతను క్రీజ్లో నిలదొక్కుకుంటే తన మాట తానే వినడు. అతని బ్యాటింగ్ హైడ్రోజన్ బాంబులా విధ్వంసం సృష్టిస్తుంది. దీపావళి టపాసుల మోతంతా ఆ షాట్లలోనే కనిపిస్తుంది. సిక్సర్లు తారాజువ్వల్లా శిఖరాన్ని తాకుతాయి. బౌలర్ ఎలాంటివాడైనా, స్పిన్నర్ బంతిని భూచక్రంలా తిప్పినా దానిని సమర్థంగా అతను తిప్పికొట్టేయగలడు. అదీ శిఖర్ ధావన్ బ్రాండ్ అంటే. ఇప్పుడు ఆ బ్రాండ్ బ్యాండ్ బజాయించలేకపోతోంది. గత టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో సున్నాకే వెనుదిరిగిన ఈ మీసాలరాయుడిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. మరో వైపునుంచి కేఎల్ రాహుల్లాంటి యువ ఆటగాడు ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్న తరుణంలో ధావన్ తన సత్తాను మరోసారి ప్రదర్శించాలి. చిన్నస్వామి స్టేడియంలోనైనా చిచ్చుబుడ్డిలా చెలరేగి పరుగుల మోత మోగించాలి. తొలి టెస్టు విజయం తర్వాత భారత క్రికెటర్లంతా టీవీల్లోకి వచ్చి దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఆ వెంటనే ‘టపాసుల శబ్దం లేకుండా ఈ సారి దీపావళి జరుపుకుంటున్న ఏకైక క్రికెటర్ ధావన్’ అంటూ సోషల్ నెట్వర్కింగ్లో కామెంట్స్ వెల్లువెత్తాయి. హాస్యంగా కనిపిస్తున్నా ఇందులో వాస్తవం ఉంది. మొహాలీ పిచ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న వేళ తన వైఫల్యం కచ్చితంగా ధావన్ను ఆలోచనలో పడేసి ఉంటుంది. ఎందుకంటే స్పిన్నర్లు చెలరేగిన చోట తాను మాత్రం రెండు సార్లు పేస్ బౌలింగ్కే వికెట్ సమర్పించుకున్నాడు. అదీ పెద్దగా ప్రమాదకరం కాని... దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి మరీ రీప్లేలా ఒకే తరహాలో అవుటయ్యాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం తొలి మ్యాచ్లోనే వేగవంతమైన సెంచరీతో రికార్డు ఇన్నింగ్స్ ఆడిన ఇదే మైదానంలో ఇప్పుడు ‘పెయిర్’తో పునరాగమనం చేయడం నిరాశపర్చే విషయం. నాటి సెంచరీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్నే బలి తీసుకుంటే... ఇప్పుడు ఈ ప్రదర్శన స్వయంగా ధావన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫామ్కు ఏమైంది? ధావన్ వన్డే, టెస్టు ఫామ్లను వేర్వేరుగా చూస్తే అతను మొహాలీ మ్యాచ్లోనే విఫలమైట్లు కనిపిస్తుంది. అంతకు ముందు అతను ఆడిన రెండు టెస్టుల్లో (ఫతుల్లా, గాలే) సెంచరీలు చేయడంతో గాయంనుంచి కోలుకున్నాక టెస్టులకు ఫామ్తోనే వచ్చినట్లు లెక్క. అయితే దానికి ముందు కూడా ధావన్ గొప్పగా ఆడలేదు. 13 టెస్టు ఇన్నింగ్స్లలో ఒకే ఒక అర్ధ సెంచరీ, అదీ బ్రిస్బేన్ టెస్టులో జట్టు పరాజయం ఖరారైన తర్వాత చేసినది. కాబట్టి నిలకడ లేదని మాత్రం స్పష్టమవుతుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ చాలా కఠినంగా ఉండబోతోందంటూ సిరీస్కు ముందు వ్యాఖ్యానించిన ధావన్, తాను భయపడినట్లే బ్యాటింగ్లో తడబడ్డాడు. వన్డేల్లో తొలి నాలుగు మ్యాచ్లలో విఫలమైన తర్వాత చివరి వన్డేలో అతను ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేసినా అది జట్టును ఘోర పరాజయంనుంచి రక్షించలేకపోయింది. వన్డే ప్రపంచకప్లో 412 పరుగులతో భారత్ టాప్ స్కోరర్గా నిలిచిన అనంతరం బంగ్లాదేశ్లోనూ వన్డే సిరీస్లో రాణించిన ధావన్, సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు. మొదటి టెస్టులో పిచ్ను అంచనా వేయకుండా, కొద్ది సేపు ఓపిక ప్రదర్శించకుండా ఆడిన షాట్లు ఆత్మహత్యా సదృశ్యమని కామెంటేటర్లు అతని ఆటను విశ్లేషించారు. మరో అవకాశం దక్కుతుందా! విమర్శలు వచ్చిన ప్రతీ సారి ఒక చక్కటి ఇన్నింగ్స్తో సత్తా చాటడం ధావన్కు కొత్త కాదు. కెరీర్కు శుభారంభం దక్కిన తర్వాత వరుసగా ఏడు ఇన్నింగ్స్లలో ఘోర వైఫల్యంతో ‘వన్ మ్యాచ్ వండర్’ అని అందరూ అనుకున్న సమయమది. ఆ దశలో న్యూజిలాండ్ గడ్డపై ఆక్లాండ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌటైనా, రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీ చేయడం అతని పట్టుదలకు నిదర్శనం. చాంపియన్స్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన తర్వాత వచ్చిన విమర్శలను అతను జైపూర్ ఇన్నింగ్స్ (95)తో తిప్పి కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టక ముందే అతని పోరాటం ఆరంభమైంది. తొమ్మిదేళ్ల పాటు 81 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి దాదాపు 6 వేల పరుగులు చేసిన తర్వాత గానీ అతనికి అదృష్టం తలుపు తట్టలేదు. లోకేశ్ రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ అందుబాటులో ఉండటంతో ధావన్ను తప్పించి సొంతగడ్డపై రాహుల్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. ‘ధావన్ను తప్పించాలనే ఆలోచన సరైంది కాదు. అతని గత రికార్డుతో పాటు ఓపెనింగ్లో లెఫ్ట్ హ్యండ్, రైట్ హ్యండ్ కాంబినేషన్ అవసరాన్ని బట్టి చూసినా ధావన్కు మరో అవకాశం ఇవ్వడమే మం చిది. అవసరమైతే నెట్స్లో మరింత కఠోర సాధనతో సిద్ధం కావాలి’ అనేది సునీల్ గవాస్కర్ అభిప్రాయం. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు ధావన్ బెంగళూరులోనే బంగ్లాదేశ్ ‘ఎ’తో మూడు రోజుల మ్యాచ్లో చెలరేగి శతకం బాదాడు. రెండో టెస్టులో అతను తిరిగి ఫామ్లోకి వస్తాడా...సెంచరీ చేయగానే హెల్మెట్ తీసి చేతులు బార్లా చాపి మీసం మెలేసే ‘గబ్బర్ మూమెంట్’ మళ్లీ చూడగలమా! కోహ్లి మద్దతిస్తాడా? నిజానికి ఇప్పుడు శిఖర్ ధావన్పై విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు స్టార్ ఆటగాళ్లకు కెప్టెన్ అండగా నిలబడతాడు. ఇప్పుడు కోహ్లి కూడా ‘గబ్బర్’కు మద్దతుగానే మాట్లాడాడు. ‘ఒక్కసారి కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపిస్తాడు’ అంటూ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. అయితే రెండో టెస్టు వేదిక బెంగళూరు కేఎల్ రాహుల్కు సొంత మైదానం. ఫామ్ పరంగా కూడా తాను ధావన్కంటే మెరుగ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మార్పు జరగాలనే ఒత్తిడి రావచ్చు. ఇలా ఆఖరి నిమిషంలో ఏదైనా తేడా వస్తే తప్ప ధావన్ రెండో టెస్టుకు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. -
రాణించిన భారత కుర్రాళ్లు
బెంగళూరు: బంగ్లాదేశ్'ఎ' తో జరుగుతున్న మూడు రోజుల అనధికార మ్యాచ్ లో భారత కుర్రాళ్లు ఆకట్టుకున్నారు. రెండో రోజు ఆటలో భాగంగా 161/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం బ్యాటింగ్ చేపట్టిన భారత 'ఎ' జట్టు దూకుడుగా ఆడింది. భారత 'ఎ' జట్టు 411/5 వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి బంగ్లా'ఎ'కు సవాల్ విసిరింది. భారత 'ఎ' జట్టులో శిఖర్ ధవన్(150;146 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్ లు) కు తోడుగా కరుణ్ నాయర్(71), విజయ్ శంకర్(86) ఆకట్టుకున్నారు. భారత్ స్కోరు 411 పరుగుల వద్ద ఉండగా విజయ్ శంకర్ ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో భారత 'ఎ' జట్టు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ చేసే సమయానికి నమాన్ ఓజా(25) క్రీజ్ లో ఉన్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అనాముల్ హక్ (0), సౌమ్య సర్కారు(19) లు పెవిలియన్ కు చేరి బంగ్లాకు షాకిచ్చారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 'ఎ' రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం 148 పరుగులు వెనుకబడ్డ బంగ్లా చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 228 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
శతక్కొట్టారు
► విరాట్, ధావన్ వీరోచిత సెంచరీలు ► తొలి ఇన్నింగ్స్లో భారత్ 375 ఆలౌట్ ► రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 5/2 పరుగుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కోహ్లితో పాటు శిఖర్ ధావన్ కూడా తొలి టెస్టులో సత్తా చాటాడు. లంక బ్యాట్స్మెన్ విఫలమైన వికెట్పై ఇద్దరూ శతకాల మోత మోగించారు. స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన ఆరంభాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుని మ్యాచ్లో పట్టు బిగించారు. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో తడబడిన లంకేయులు రెండో ఇన్నింగ్స్లోనూ పేలవ ఆటతీరుతో ఎదురీదుతున్నారు. గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో లంకేయులను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా బ్యాటింగ్లోనూ తడాఖా చూపెట్టింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (271 బంతుల్లో 134; 13 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (191 బంతుల్లో 103; 11 ఫోర్లు) శతకాలు బాదడంతో గురువారం రెండోరోజు భారత్ తొలి ఇన్నింగ్స్లో 117.4 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది. దీంతో కోహ్లిసేనకు 192 పరుగుల ఆధిక్యం దక్కింది. సాహా (120 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక రెండో ఇన్నింగ్స్లో 4 ఓవర్లలో 2 వికెట్లకు 5 పరుగులు చేసింది. ప్రసాద్ (3 బ్యాటింగ్), సంగక్కర (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు కరుణరత్నే (0), జేకే సిల్వా (0)లు విఫలమయ్యారు. తొలి ఓవర్ నుంచే స్పిన్ అటాక్ను దించిన కోహ్లి లంకపై ఒత్తిడి పెంచాడు. ఫలితంగా 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం మ్యాథ్యూస్సేన ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. భారీ భాగస్వామ్యం అంతకుముందు 128/2 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ధావన్, కోహ్లి నిలకడగా ఆడారు. లంక పేసర్లు, స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ధావన్ 178 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే 227/2 స్కోరుతో లంచ్కు వెళ్లిన భారత్ రెండో సెషన్లో తడబడింది. 187 బంతుల్లో కెరీర్లో 11వ శతకం సాధించిన కోహ్లి.. కౌశల్ బంతిని స్వీప్ చేయబోయి అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్కు ధావన్తో కలిసి నెలకొల్పిన 227 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్వల్ప విరామాల్లో రహానే (0)తో పాటు ధావన్ కూడా వెనుదిరగడంతో భారత్ స్కోరు 294/5గా మారింది. ఈ దశలో సాహా నిలకడను చూపెట్టినా... అశ్విన్ (7), హర్భజన్ (14), మిశ్రా (10)లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో ఒత్తిడికి లోనైన సాహా స్కోరు పెంచే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నాడు. ఆ వెంటనే ఆరోన్ (4) కూడా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఓవరాల్గా కోహ్లిసేన 73 పరుగుల తేడాలో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. కౌశల్కు 5, ప్రదీప్కు 3 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 183 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ ఎల్బీడబ్ల్యు (బి) ప్రసాద్ 7; ధావన్ (బి) ప్రదీప్ 134; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) మ్యాథ్యూస్ 9; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 103; రహానే ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 0; సాహా (సి) చండిమల్ (బి) ప్రదీప్ 60; అశ్విన్ (బి) ప్రదీప్ 7; హర్భజన్ (బి) కౌశల్ 14; మిశ్రా (బి) కౌశల్ 10; ఇషాంత్ నాటౌట్ 3; ఆరోన్ (సి) మ్యాథ్యూస్ (బి) కౌశల్ 4; ఎక్స్ట్రాలు: 24; మొత్తం: (117.4 ఓవర్లలో ఆలౌట్) 375. వికెట్ల పతనం: 1-14; 2-28; 3-255; 4-257; 5-294; 6-302; 7-330; 8-344; 9-366; 10-375. బౌలింగ్: ప్రసాద్ 22-4-54-1; ప్రదీప్ 26-2-98-3; మ్యాథ్యూస్ 4-1-12-1; కౌశల్ 32.4-2-134-5; హెరాత్ 33-4-67-0. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: కరుణరత్నే (బి) అశ్విన్ 0; సిల్వ (బి) మిశ్రా 0; ప్రసాద్ బ్యాటింగ్ 3; సంగక్కర బ్యాటింగ్ 1; ఎక్స్ట్రాలు: 1; మొత్తం: (4 ఓవర్లలో 2 వికెట్లకు) 5. వికెట్ల పతనం: 1-0; 2-1. బౌలింగ్: అశ్విన్ 2-2-0-1; మిశ్రా 1-0-1-1; హర్భజన్ 1-0-4-0. -
భారత్ ప్రాక్టీస్ మొదలు...
నెట్స్లో చెమటోడ్చిన ఆటగాళ్లు కొలంబో : మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంకకు వచ్చిన భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 15 మంది ఆటగాళ్లు సహాయక సిబ్బంది సమక్షంలో నెట్స్లో చెమటోడ్చారు. ముందుగా ధావన్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత కోహ్లి, విజయ్ ఆడారు. అధిక ఒత్తిడి లేదు: విజయ్ లంకతో సిరీస్లో కెప్టెన్ కోహ్లి ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో... బ్యాట్స్మెన్పై ఎలాంటి అధిక ఒత్తిడి లేదని ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. ‘ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఆడాలన్న డిమాండేమీ లేదు. ఆడినా పెద్దగా భారం పడదు. వీళ్లలో ఒక్కరు కుదురుకున్నా జట్టుకు భారీ స్కోరు అందించడం ఖాయం. చాలాసార్లు ఇలా జరి గింది కూడా. అయితే బ్యాట్స్మెన్కు ఇది సవాలే. మ్యాచ్ మన భుజాలపై ఉండటం మంచి బాధ్యతే. అయితే మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించాలంటే మాత్రం సమష్టిగా రాణించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలకు కట్టుబడి ఆడాలి’ అని విజయ్ పేర్కొన్నాడు. ఓపెనింగ్ కోసం పోటీ ఉండటం మంచిదేనన్నాడు. లంక జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. ‘మ్యాథ్యూస్, తిరిమన్నేలాంటి యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. అయితే మా జట్టులో కూడా యువ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ సిరీస్లో గట్టిపోటీ తప్పుదు. రెండో టెస్టు తర్వాత సీనియర్ ఆటగాడు సంగక్కర రిటైర్ అవుతున్నాడు. అప్పుడు లంక జట్టులో సీనియర్లు తక్కువగా ఉం టారు. కాబట్టి తర్వాతి మ్యాచ్లో భారత్దే పైచేయి అవుతుంది. హోరాహోరీగా సాగిన పాక్, లంక సిరీస్ మాదిరిగానే ఇది కూడా జరుగుతుందని భావిస్తున్నాం’ అని ఈ చెన్నై బ్యాట్స్మన్ వెల్లడించాడు. ప్రస్తుతం భారత టెస్టు క్రికెట్ సంధి దశలో ఉందని చెప్పిన విజయ్... కోహ్లి నేతృత్వంలోని యువ జట్టు బాగా రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఊరట విజయం
♦ ఆఖరి వన్డేలో భారత్ గెలుపు ♦ 2-1తో సిరీస్ బంగ్లా వశం ♦ రాణించిన ధావన్, ధోని హమ్మయ్య... ఇక భారత జట్టు కాస్త ధైర్యంగానే స్వదేశానికి రావచ్చు. సిరీస్ ఓటమితో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనిసేన.. బంగ్లాదేశ్తో ఆఖరి వన్డేలో ఊరట విజయాన్ని దక్కించుకుంది. సిరీస్లో తొలిసారి భారత్ అసలు సిసలు ఆటతీరుతో చెలరేగడంతో... బంగ్లా‘వాష్’ ఆశ నెరవేరలేదు. మిర్పూర్ : సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి అరుదైన రికార్డును అందుకోవాలనుకున్న బంగ్లాదేశ్కు భారత్ కళ్లెం వేసింది. సిరీస్లో తొలిసారి అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన ధోనిసేన మూడో వన్డేలో 77 పరుగులతో ఘన విజయం సాధించింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 317 పరుగులు చేసింది. ధావన్ (73 బంతుల్లో 75; 10 ఫోర్లు), ధోని (77 బంతుల్లో 69; 6 ఫోర్లు, 1 సిక్స్), రాయుడు (49 బంతుల్లో 44; 3 ఫోర్లు), రైనా (21 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మొర్తజా 3, ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. షబ్బీర్ రెహమాన్ (38 బంతుల్లో 43; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లిట్టన్ దాస్ (50 బంతుల్లో 34; 3 ఫోర్లు), నాసిర్ హుస్సేన్ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు)లు మెరుగ్గా ఆడారు. రైనా 3, అశ్విన్, ధవల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరచిన సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ముస్తాఫిజుర్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. ధావన్ జోరు జడేజా, భువనేశ్వర్ల స్థానంలో బిన్నీ, ఉమేశ్లను భారత్ తుది జట్టులోకి తెచ్చింది. ఓపెనర్లలో ధావన్ ఫామ్ను కొనసాగించగా, రోహిత్ (29 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి నిరాశపర్చాడు. వన్డౌన్లో కోహ్లి (35 బంతుల్లో 25; 1 ఫోర్) విఫలమయ్యాడు. 50 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్... రెండో వికెట్కు కోహ్లితో కలిసి 75 పరుగులు జోడించాడు. తర్వాత ధావన్తో జతకలిసిన ధోని వేగంగా ఆడాడు. నాసిర్ ఓవర్ (23)లో సిక్సర్, ఫోర్తో కెప్టెన్ టచ్లోకి వచ్చాడు. అయితే 27వ ఓవర్లో మొర్తజా.. ధావన్ను అవుట్ చేయడంతో మూడో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రాయుడు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ధోనితో పోటీగా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 58 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధోనితో పాటు రాయుడు కూడా స్వల్ప వ్యవధిలో అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను పటిష్టపరిచారు. చివర్లో రైనా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. బిన్నీ (11 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) కూడా జోరు పెంచడంతో భారత్కు భారీస్కోరు లభించింది. ఆకట్టుకున్న బౌలర్లు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ను భారత్ బౌలర్లు బాగా కట్టడి చేశారు. రెండో ఓవర్లోనే తమీమ్ (5)ను అవుట్ చేసిన ధవల్.. పవర్ప్లే ముగియకముందే సౌమ్య సర్కార్నూ పెవిలియన్కు చేర్చాడు. వన్డౌన్లో లిట్టన్ దాస్, తర్వాత ముష్ఫికర్ (24) ఓ మాదిరిగా ఆడారు. అయితే రైనా, అక్షర్లు స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దర్ని అవుట్ చేయడంతో బంగ్లా 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో షకీబ్ (20), మొర్తజా (0)లు నిరాశపరిచారు. షబ్బీర్ రెహమాన్, నాసిర్ హుస్సేన్లు కాసేసపు పోరాడినా టెయిలెండర్ల నుంచి సహకారం లభించలేదు. ఓవరాల్గా బంగ్లా 122 పరుగుల తేడాలో చివరి 6 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ ప్రపంచ రికార్డు మూడో వన్డేలో రెండు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్... మొత్తం 13 వికెట్లతో సిరీస్లో అత్యధిక వికెట్ల రికార్డు నెలకొల్పాడు. గతంలో హారిస్ (ఆస్ట్రేలియా) కూడా 13 వికెట్లు తీసినా... ఐదు వన్డేల సిరీస్లో సాధించాడు. భారత్పై బంగ్లాదేశ్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. రెండు ఓటముల తర్వాత పౌరుషం పొడుచుకొచ్చిందో... లేక ప్రతిష్ట గుర్తొచ్చిందో... మొత్తానికి ధోనిసేన తమ సత్తా చూపెట్టింది. నిజానికి భారత్, బంగ్లాదేశ్ల బలాలను పరిశీలిస్తే... మూడు వన్డేల్లోనూ ధోని సేన సులభంగా గెలవాల్సింది. కానీ తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిపోయి, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఆలస్యంగా కోలుకుంది. ఈసారి కూడా ఓడిపోయి ఉంటే పరువు పాతాళంలోకి పోయేది. సిరీస్లో తొలిసారి భారత బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గట్టు ఆడారు. రోహిత్ విఫలమైనా, ధావన్ నిలకడగా ఆడటంతో లోటు తెలియదు. ఇక కోహ్లి సిరీస్ ఆసాంతం విఫలమయ్యాడు. సిరీస్కు ముందు ఊహించినట్లే ధోని తనని తాను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసుకున్నాడు. ఇన్నాళ్లూ ఆరో స్థానంలో ఆడిన కెప్టెన్... ఇకపై నాలుగో నంబర్లో ఆడతానని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లోనూ కీలక దశలో వచ్చిన ధోని క్రీజులో ఎక్కువ సేపు గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. మొత్తానికి ఓ అర్ధసెంచరీతో విమర్శకులకు కొంతమేర సమాధానం చెప్పాడు. నిజానికి ధోని సహజశైలిలో ఆడిన షాట్లు తక్కువ. అయితే ఇకపై గతంలో లాగా హెలికాప్టర్ ఎగరదనేది ధోనికి కూడా అర్థమైంది. అందులో మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పడమనే బాధ్యత తీసుకుంటున్నాడు. రాయుడు, రైనా కూడా రాణించడంతో భారత్ సిరీస్లో తొలిసారి 300 మార్కును దాటింది. తొలి రెండు వన్డేల విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం బంగ్లాదేశ్ జట్టులో కనిపించింది. పవర్ప్లేలో సర్కార్ ఆడిన తీరు... రెండు వికెట్లు పడ్డాక కూడా ముష్ఫికర్, దాస్ ఆడిన షాట్లు చూస్తే... కచ్చితంగా మరో విజయం కోసమే ఆ జట్టు తపన పడిందని అర్థమైంది. అయితే భారీ లక్ష్యం ఛేదించే సమయంలో కచ్చితంగా టాపార్డర్లో ఎవరో ఒకరు సెంచరీ చేసి నిలబడాలి. లేకపోతే ఎంత పెద్ద జట్టుకైనా 300 ఛేదించడం కష్టం. కాబట్టి బంగ్లా క్లీన్స్వీప్ ఆశ తీరలేదు. ఇక కొంత విశ్రాంతి ప్రస్తుతం భారత జట్టుకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. షెడ్యూల్ ప్రకారం జులైలో జింబాబ్వే వెళ్లాల్సి ఉన్నా ఆ సిరీస్కు ద్వితీయ శ్రేణి జట్టును పంపుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రావచ్చు. ఒకవేళ సీనియర్లు విశ్రాంతి తీసుకుంటే... ఆగస్టులో శ్రీలంక వెళ్లేదాకా వీళ్లకి క్రికెట్ లేదు. కాబట్టి భారత క్రికెటర్లకు పూర్తిగా నెలరోజులకు పైగా విశ్రాంతి దొరుకుతుంది. మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయి ఉంటే ధోని రాజీనామా చేసేదాకా గోల జరిగేది. కానీ మూడో వన్డేలో జట్టు గెలవడం, ధోని ఆడటంతో తాత్కాలికంగా విమర్శలకు తె రపడుతుంది. చాలా లోపాలు ఉన్నాయి బంగ్లాదేశ్ పర్యటన ద్వారా భారత్కు పరాభవం ఎదురైనా... ఆకాశంలో విహరిస్తున్న స్టార్ ఆటగాళ్లను ఈ సిరీస్ కొంత మేరకు నేలకు దించింది. స్టార్ హోదా ఉంటే పరుగులు రావని, చిన్న జట్టయినా కచ్చితంగా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని తెలిసొచ్చింది. బౌలింగ్ విభాగంలో మాత్రం చాలా లోపాలు కనిపించాయి. అశ్విన్తో సమస్య లేకపోయినా రెండో స్పిన్నర్ పాత్రను జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ సరిగ్గా పోషించలేకపోయారు. చివరకు రైనా రెండో స్పిన్నర్గా జట్టును ఆదుకోవాల్సి వచ్చింది. ఇక పేస్ విభాగంలో ఏ ఒక్కరు కూడా మూడు మ్యాచ్లు ఆడలేకపోయారు. బంగ్లాదేశ్ కుర్రాడు ముస్తాఫిజుర్ చూపించిన దారిలో కూడా బంతులు వేయలేకపోయారు. కాబట్టి భారత సెలక్టర్లు ఈ సిరీస్ ఫలితాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇప్పటికిప్పుడు జట్టును పూర్తిగా మార్చకపోయినా... దేశవాళీ క్రికెట్లో నిలకడ చూపుతున్న కుర్రాళ్లను ఒకరిద్దరిని తీసుకుని అవకాశాలివ్వాలి. కోచ్ కావాలి తాను జట్టుతో ఉండగా ప్రత్యేకంగా కోచ్ అవసరం లేదని రవిశాస్త్రి అంటున్నాడు. కోహ్లి, ధోని కూడా దీనికి వంత పాడుతున్నారు. కోచ్ లేకుండా తమ సమస్యలు సరిదిద్దుకునే ప్రొఫెషనలిజమ్ ఈ క్రికెటర్లలో ఉంటే ఈ సిరీస్లో ఓడిపోయేవారే కాదు. కాబట్టి ఢాంబికాలు పక్కనబెట్టి సరైన కోచ్ను వెతుక్కోవడమే మేలు. సలహా కమిటీ సచిన్, లక్ష్మణ్, గంగూలీ ఈ సిరీస్ ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తారనేది అన్నింటికంటే ఆసక్తికర అంశం. -సాక్షి క్రీడావిభాగం స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) లిట్టన్ (బి) ముస్తాఫిజుర్ 29; ధావన్ (సి) నాసిర్ (బి) మొర్తజా 75; కోహ్లి (బి) షకీబ్ 25; ధోని (సి) ముస్తాఫిజుర్ (బి) మొర్తజా 69; రాయుడు (సి) లిట్టన్ (బి) మొర్తజా 44; రైనా (బి) ముస్తాఫిజుర్ 38; బిన్నీ నాటౌట్ 17; అక్షర్ పటేల్ నాటౌట్ 10; ఎక్స్ట్రాలు: 10; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 317. వికెట్ల పతనం : 1-39; 2-114; 3-158; 4-251; 5-268; 6-301. బౌలింగ్ : ముస్తాఫిజుర్ 10-0-57-2; మొర్తజా 10-0-76-3; అరాఫత్ సన్నీ 6-0-42-0; రూబెల్ హుస్సేన్ 9-0-75-0; నాసిర్ హుస్సేన్ 6-0-27-0; షకీబ్ 9-1-33-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : తమీమ్ ఎల్బీడబ్ల్యు (బి) కులకర్ణి 5; సౌమ్య సర్కార్ (సి) అశ్విన్ (బి) కులకర్ణి 40; లిట్టన్ దాస్ (బి) అక్షర్ 34; ముష్ఫికర్ (సి) ధోని (బి) రైనా 24; షకీబ్ (సి) కులకర్ణి (బి) రైనా 20; షబ్బీర్ (బి) బిన్నీ 43; నాసిర్ హుస్సేన్ (సి) రాయుడు (బి) అశ్విన్ 32; మొర్తజా (బి) అశ్విన్ 0; అరాఫత్ సన్నీ నాటౌట్ 14; రూబెల్ హుస్సేన్ (సి) అక్షర్ (బి) రైనా 2; ముస్తాఫిజుర్ ఎల్బీడబ్ల్యు (బి) రాయుడు 9;ఎక్స్ట్రాలు: 17; మొత్తం: (47 ఓవర్లలో ఆలౌట్) 240. వికెట్ల పతనం : 1-8; 2-62; 3-112; 4-118; 5-148; 6-197; 7-205; 8-216; 9-222; 10-240 బౌలింగ్ : స్టువర్ట్ బిన్నీ 6-0-41-1; ధవల్ కులకర్ణి 8-0-34-2; ఉమేశ్ 4-0-33-0; అశ్విన్ 10-1-35-2; అక్షర్ 9-1-44-1; రైనా 8-0-45-3; రాయుడు 2-1-5-1. -
ధావన్ కు జీవనదానం
హామిల్టన్: ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ భారత్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయే ప్రమాదాన్ని తప్పించుకుంది. డాషింగ్ ఓపెనర్ శిఖర్ కు జీవనదానం లభించింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మూనీ బౌలింగ్ లో ధావన్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను పోర్టర్ ఫీల్డ్ నేలపాలు చేశాడు. దీంతో ధావన్ ఊపిరి పీల్చుకున్నాడు. టిమిండియా 8 ఓవర్లలో 40/0 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
కోహ్లీ, ధవన్, వార్నర్లకు జరిమానా
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్తో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్లకు జరిమానా విధించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో వీరు దూషించుకున్నందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. కోహ్లీ, ధవన్లకు మ్యాచ్ ఫీజులో 30 శాతం చొప్పున, వార్నర్కు 15 శాతం జరిమానా వేసినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ నాలుగో రోజు శుక్రవారం వీరు దూషణలకు దిగారు. దీంతో ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ 48 పరుగులతో భారత్పై విజయం సాధించింది. -
టాప్-5లో కోహ్లీ, ధవన్
దుబాయి: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5 జాబితాలో ఇద్దరు భారత బ్యాట్స్మెన్ చోటు సంపాదించారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన తాజా జాబితాలో యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మూడో ర్యాంక్ను నిలబెట్టుకోగా, ఓపెనర్ శిఖర్ ధవన్ నాలుగు స్థానాలు సంపాదించి ఐదో ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో సిరీస్లో ధవన్ అద్భుతంగా రాణించడంతో ర్యాంక్ మెరుగుపడింది. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్లో నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా క్రికెటర్లు డివిలియర్స్,ఆమ్లా వరుసగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో భారత్ యువ పేసర్ భువనేశ్వర్ కుమార్.. పాక్ క్రికెటర్ హఫీజ్తో కలసి సంయుక్తంగా ఆరో ర్యాంక్లో నిలిచాడు. -
శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం
కటక్: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 169 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. టీమిండియా విసిరిన 364 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో లంకేయులు చతికిలబడ్డారు.ఆదిలోనే శ్రీలంకకు దిల్షాన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దిల్షాన్(18) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరగా, మిడిల్ ఆర్డర్ ఆటగాడు కుమార సంగక్కరా(13) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అనంతరం మరో ఓపెనర్ ఉపల్ తరంగ(28) పరుగులు చేసి నిష్క్రమించడంతో శ్రీలంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. తరువాత జయవర్ధనే(43), మాథ్యూస్ (23), పెరీరా (29) పరుగులు మాత్రమే చేయడంతో లంకేయులు 39. 2 ఓవర్లలో 194 పరుగులకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు లభించగా,ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ కు తలో రెండో వికెట్లు దక్కాయి. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ కు భారీ పరుగులతో ఆకట్టుకుంది. -
కటక్ వన్డే.. కష్టాల్లో లంక
కటక్: కటక్ వన్డేలో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లం 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. దిల్షాన్ (18) , సంగక్కర (13), తరంగ (28), ప్రసన్న (5), మహేల జయవర్ధనె (43) అవుటయ్యారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ రెండు, ఇషాంత్, ఉమేష్, అశ్విన్ తలా వికెట్ తీశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ లంకేయులను కట్టడి చేస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లంకేయులు గెలవడం కష్టం. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు. -
కటక్ వన్డే.. భారత్ స్కోరు 363/5
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా 364 పరుగుల లక్ష్యాన్ని లంకకు నిర్దేశించింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు. -
మొదటి వన్డేలో జోరుమీదున్న భారత్
-
రహానె, ధవన్లు సెంచరీలు
కటక్: కటక్ వన్డేలో భారత్ ఓపెనర్లు రహానె, ధవన్ సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. ఆదివారం శ్రీలంకతో జరుగుతున్న తొలివన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 231 పరుగులు చేసింది. రహానె (109), ధవన్ (113) జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీ చేసిన అనంతరం ధవన్ ప్రియంజన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. రహానెకు తోడుగా రైనా బ్యాటింగ్కు దిగాడు. -
రహానె, ధవన్లు హాఫ్ సెంచరీలు
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 23 ఓవర్లలో 124 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రహానె (54), ధవన్ (63) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించారు. భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు.