founder
-
కోటీశ్వరుడు అవ్వడమే శాపమైంది..!
డబ్బే జీవితంగా బతుకుతుంటారు కొందరూ. అందుకోసం తన పర అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. బంధాలన్నింటిని డబ్బుతోనే చూస్తారు. నిజానికి అదొక స్టాటస్ ఆఫ్ సింబల్. కాస్త డబ్బు పలుకుబడి ఉంటేనే సమాజంలో గౌరవం కూడా. అయితే అదే డబ్బు మనిషికి కొంచెం కూడా మనశ్శాంతిని, నమ్మకమైన వ్యక్తులను ఇవ్వలేదు అనే నిజం తెలిసేలోపే అన్నింటిని కోల్పోతాం. ఏం కావాలో తెలియక మనో వ్యధకు గురవ్వుతాం. అచ్చం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు ఓ మిలియనీర్. పాపం డబ్బే సర్వం అనుకున్నాడు ఇప్పుడదే అతడికి మనశ్శాంతిని దూరం చేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన జేక్ కాసన్ అనే కాలేజ్ డ్రాపౌట్ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికాడు. సంపదే తనకు ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్మాడు. అందుకోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. చిన్న వయసులోనే లాస్ ఏంజిల్స్కు చెందిన యాక్సెసరీ బ్రాండ్ MVMT వాచెస్ కంపెనీని స్థాపించాడు. అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు. 27 ఏళ్ల వయసుకి తన బ్రాండ్కి ఉన్న ఇమేజ్ చూసి ఏకంగా రూ. 871 కోట్లకు విక్రయించాడు. మిలియనీర్గా మారాలన్న అతడి కల నెరవేరింది. కానీ అదే అతడికి కష్టాలు, కన్నీళ్లని తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే కోటీశ్వరుడు అయ్యాడో అక్కడ నుంచి వ్యక్తిగత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. జస్ట్ 30 ఏళ్లకే వైవాహిక జీవితంలో బ్రేక్అప్లు, ఏదో లక్ష్యం కోల్పోయినట్లు మనశ్శాంతి లేకపోవడం తదితరాలు చుట్టుముట్టాయి. అయితే అతడికి ఎందరో ప్రాణ స్నేహితులు ఉన్నా.. తన ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయి. ఏదో కావాలన్న ఆరాటం..కానీ ఏం కావాలో తెలియక ఒక విధమైన నైరాశ్యంతో కొట్టుమిట్టాడాడు. చివరికి అదికాస్తా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. "డబ్బే అనందాన్ని ఇస్తుందనుకుని కష్టపడి స్థాపించిన కంపెనీని అమ్మేశాను అదే నేను చేసిన తప్పు. వ్యవస్థాపక ప్రయాణం అత్యంత అమూల్యమైనది. ఒక కంపెనీని స్థాపించి దాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడంలో ఉన్న ఆనందం కిక్కు వేరు. డబ్బులు పోగేసుకోవడంలో లేదనే విషయం గ్రహించేలోపే..వ్యక్తిగతంగా అత్యంత ముఖ్యమైన మనశ్శాంతిని కోల్పోయా". అంటూ విలపిస్తున్నాడు కాసన్. అందుకే మళ్లీ పనిలో పడాలని నిర్ణయించుకుని యూట్యూబ్ చానెల్ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. అలాగే తన బ్రాండ్కి పెట్టుబడిదారుడిగా ఉండాలని చూస్తున్నాడు. ఇతడి స్టోరీ ఓ గొప్ప విషయాన్ని చాటి చెప్పింది. "డబ్బు వెంట పరిగెడితే మనశ్శాంతి ఉండదు..కష్టపడటంలోనే ఆత్శసంతృప్తి ఉంటుందనే సత్యాన్ని చాటి చెబుతోంది కదూ..!. అయినా అవసరానికి మించిన ధనం కూడా చేటేనేమో..!."(చదవండి: ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి..!) -
భారత్ బయోటెక్ అధినేత డా.కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక గుర్తింపు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ (Bharat Biotech) సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా (Dr Krishna Ella) ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2025 సంవత్సరానికి గాను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) ప్రతిష్టాత్మకమైన ఇండియా ఫెలోషిప్ ప్రకటించింది.కొత్త విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త వ్యాక్సిన్ టెక్నాలజీల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న సాంకేతికతల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఐఎన్ఎస్ఏ ఆయనకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేసింది. దీంతో ఈ గౌరవం అందుకున్న విశిష్ట శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రముఖుల జాబితాలో డాక్టర్ ఎల్లా కూడా చేరారు.ఇందులో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డీడీఆర్&డీ కార్యదర్శి సమీర్ వి కామత్, డీఆర్డీఓ చైర్మన్ డా. కేఎన్ శివరాజన్ వంటివారు ఉన్నారు.ఈ సంవత్సరం మొత్తం 61 ఫెలోషిప్లు అందించగా మొట్టమొదటిసారిగా పరిశ్రమ నాయకులకు ఫెలోషిప్లు అందించారు. ఎంపికైన సభ్యులు ఐఎన్ఎస్ఏ సాధారణ సమావేశాలకు హాజరై ఓటు వేయవచ్చు. ఫెలోషిప్లు లేదా ఐఎన్ఎస్ఏ అవార్డుల కోసం ఇతర వ్యక్తులను ప్రతిపాదించవచ్చు.“వ్యాక్సిన్లు, బయోటెక్నాలజీ రంగంలో నా సహకారాన్ని గుర్తించినందుకు ఐఎన్ఎస్ఏకు కృతజ్ఞతలు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, కొత్త వ్యాక్సిన్లను కనుగొనడంలో భారత్ ఆధిపత్య శక్తిగా ఎదగడానికి నా మద్దతును మరింత కొనసాగిస్తాను” అని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. -
టేబుల్ స్పేస్ సీఈవో అమిత్ బెనర్జీ కన్నుమూత
వర్క్స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘టేబుల్ స్పేస్’ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అమిత్ బెనర్జీ కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుండెపోటుతో ఆయన చనిపోయాడంటూ కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ అమిత్ బెనర్జీ మరణానికి తక్షణ కారణం ఇంకా తెలియలేదు.“మా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు ప్రకటించడం చాలా విచారకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ సొల్యూషన్ పరిశ్రమను మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. ఆయన నాయకత్వంలో టేబుల్ స్పేస్ ఈస్థాయికి చేరింది” అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.కంపెనీ, దాని వ్యక్తులు మరియు పరిశ్రమపై అతని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది మరియు అతని కుటుంబం, స్నేహితులు మరియు భాగస్వాములచే అతను తీవ్రంగా మిస్ అవుతాడు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.అమిత్ బెనర్జీ గురించి..దాదాపు 44 ఏళ్ల వయస్సు ఉన్న అమిత్ బెనర్జీ, 2017 సెప్టెంబర్లో టేబుల్ స్పేస్ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్గా అందుబాటులోకి వచ్చింది.పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 2002లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన అమిత్ బెనర్జీ 2004 జనవరిలో ఐటీ మేజర్ యాక్సెంచర్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సంస్థలో 13 సంవత్సరాలు పనిచేసిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్కు బాధ్యత వహించారు.వృత్తిపరమైన అనుభవం అతన్ని రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టేబుల్ స్పేస్ను ప్రారంభించడంలో సహాయపడింది. అమిత్ బెనర్జీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. బెనర్జీ సెజ్ డీల్ స్ట్రక్చరింగ్లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్లో ఆవిష్కరణలతో పేటెంట్ హోల్డర్ కూడా.టేబుల్ స్పేస్ గురించి..గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ హిల్హౌస్ క్యాపిటల్ మద్దతుతో ఉన్న టేబుల్ స్పేస్, 2025లో ఐపీఓకి వెళ్లాలని చూస్తున్న అనేక స్టార్టప్లలో ఒకటి. రూ. 3,500 కోట్ల కంటే ఎక్కువ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.టేబుల్ స్పేస్ వెబ్సైట్ ప్రకారం.. సంస్థ నిర్వహించే వర్క్స్పేస్లలో మార్కెట్ లీడర్గా ఉంది. ప్రధానంగా గూగుల్ (Google), యాపిల్ (Apple), డెల్ (Dell) వంటి ఫార్చూన్ (Fortune) 500 కంపెనీలతో కలిసి పని చేస్తుంది. పెద్ద స్థలాలను లీజుకు ఇవ్వడం, వాటిని ఆధునీకరించడమే కాకుండా వాణిజ్య రియల్ ఎస్టేట్ను సొంతం చేసుకోవడానికి జాయింట్ వెంచర్ల కోసం కంపెనీ భారతీయ రియల్టర్లతో కూడా జతకట్టింది.వరుస విషాదాలుస్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వారాల క్రితం, ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్లో బైకింగ్ ట్రిప్లో గుండెపోటుతో మరణించారు. -
హెచ్బీవో ఫౌండర్ చార్లెస్ డోలన్ కన్నుమూత
కేబుల్ టీవీ దిగ్గజం, హెచ్బీవో (HBO) టీవీ చానెల్ వ్యవస్థాపకుడు చార్లెస్ డోలన్ (Charles Dolan) కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన సహజ కారణాలతో శనివారం (డిసెంబర్ 28) తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లుగా స్థానిక న్యూస్ పోర్టల్ న్యూస్డే పేర్కొంది.చార్లెస్ డోలన్ 1972లో హెచ్బీవోని స్థాపించారు. తర్వాత ఏడాదిలోనే దేశంలోని అతిపెద్ద కేబుల్ ఆపరేటర్లలో ఒకటైన కేబుల్విజన్ని సృష్టించారు. దీన్ని 2017లో ఆల్టిస్కి 17.7 బిలియన్ డాలర్లకు విక్రయించారు. 1986లో ఆయన కేబుల్విజన్ న్యూస్ 12 లాంగ్ ఐలాండ్ను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. యూఎస్లో ఇది తొలి 24 గంటల ప్రాంతీయ కేబుల్ న్యూస్ ఛానెల్. తర్వాత ఇది న్యూయార్క్ ప్రాంతంలో స్థానిక వార్తా ఛానెల్ల న్యూస్ 12 నెట్వర్క్ల సమూహానికి దారితీసింది. కేబుల్విజన్ నుండి ప్రత్యేక పబ్లిక్ కంపెనీగా విడిపోయిన ఏఎంసీ నెట్వర్క్స్ డైరెక్టర్ల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న చార్లెస్ డోలన్ 2020లో ఆ పదవి నుంచి వైదొలిగారు.డోలన్ భార్య కూడా కొన్ని నెలల క్రితమే మరణించారు. వీరికి ఆరుగురు సంతానం ఉన్నారు. వీరిలో పాట్రిక్ డోలన్ న్యూస్డే సంస్థను నడిపిస్తున్నారు. మరో కుమారుడు జేమ్స్ డోలన్ భార్య క్రిస్టిన్ డోలన్ ఏఎంసీ నెట్వర్క్స్ సీఈవోగా ఉన్నారు.దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ (Bitcoin) మూలాలపై హెచ్బీవో ఇటీవల ఓ సంచలనాత్మక డాక్యుమెంటరీ చిత్రీకరించింది. వాటిని తొలిసారి చేసిన వ్యక్తిగా ఇప్పటివరకు సతోషి నకమోటో పేరు చాలామందికి తెలుసు. కానీ కెనడాకు చెందిన పీటర్ టోడ్డ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తొలిసారి బిట్కాయిన్ తయారుచేశాడంటూ ‘మనీ ఎలక్ట్రిక్: బిట్కాయిన్ మిస్టరీ’ పేరిట 100 నిమిషాల నిడివితో నిర్మించిన ఈ చిత్రాన్ని విడుదల చేసింది. -
గుండెపోటుతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తన ప్రియతమ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ అకాల మరణం చెందారని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రోహన్ లేకపోయినప్పటికీ.. ఆయన విలువలు మాకు మార్గదర్శకంగా కొనసాగుతాయి. అయన కలలను నిజం చేయడానికి, సంస్థను అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తామని కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.అంకుర్ గోయెల్ (సీఓఓ & వ్యవస్థాపక సభ్యుడు), ఉదయ్ థాక్కర్ (కో-ఫౌండర్ & డైరెక్టర్) నేతృత్వంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇందులో రోహన్ కుటుంబం కూడా ఉంటుంది. రోహన్ మా గురువు, స్నేహితుడు.. నాయకుడు. అతని విజన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని అంకుర్ గోయెల్ & ఉదయ్ థాక్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
'జెఫ్ బెజోస్' జీతం ఇంతేనా..
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు. -
బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూత
ఎలక్ట్రానిక్స్ సంస్థ బీపీఎల్ (బ్రిటిష్ ఫిజికల్ లేబొరేటరీస్ ఇండియా ) గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎమిరిటస్ చైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ (94) గురువారం కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 10.15 గంటల ప్రాంతంలో మరణించారు.టీపీజీగా ప్రసిద్ధి చెందిన ఆయన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్కి మామగారు. ఈ వార్తను ధ్రువీకరిస్తూ చంద్రశేఖర్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “బీపీఎల్ గ్రూప్ చైర్మన్, నా మామగారు టీపీజీ నంబియార్ మరణించడం గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం శాంతి.." రాసుకొచ్చారు.నంబియార్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేశారు. “టీపీజీ నంబియార్ భారతదేశ ఆర్థిక బలోపేతాన్ని బలంగా కాంక్షించిన మార్గదర్శక ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త. ఆయన మృతి బాధ కలిగింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. -
ఆనంద్ గ్రూప్ ఫౌండర్ కన్నుమూత
ఆనంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు దీప్ సి ఆనంద్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. అక్టోబరు 27న హౌజ్ ఖాస్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అంతిమ ప్రార్థనలు నిర్వహించనున్నారు.ఆనంద్ సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నారు. యూకేలోని చిపెన్హామ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ప్లాంట్ మేనేజర్గా 1954లో తన కెరీర్ను ప్రారంభించారు. ఆనంద్ 27 ఏళ్ళ వయసులో తన మొదటి వ్యాపార వెంచర్, గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ గాబ్రియేల్ ఇండియాను ప్రారంభించారు. షాక్ అబ్జార్బర్లను తయారు చేసే ఈ కంపెనీని అమెరికాకు చెందిన మేర్మాంట్ కార్పొరేషన్తో కలిసి ఆయన స్థాపించారు.తరువాతి దశాబ్దాలలో వివిధ దేశాలకు చెందిన అగ్ర ఆటోమోటివ్ సంస్థలు ఎన్నింటితోనో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆనంద్ గ్రూప్ భారతదేశంలోని అనేక సంస్థలకు విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను సరఫరా చేస్తుంది. అలాగే తమ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 2017లో ఆనంద్ గ్రూప్ టర్నోవర్ రూ. 9,000 కోట్లు. -
శతాబ్ది స్ఫూర్తి కొనసాగించేలా స్మృతి మందిరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను 1925 విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవరామ్ బలిరామ్పంత్ హెడ్గేవార్ ప్రారంభించారు. హెడ్గేవార్ తాత నరహరిశాస్త్రి సరిగ్గా 168 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యం ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్పూర్కు వలస వెళ్లారు. ఈ క్రమంలోనే కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్ కులదైవమైన చెన్నకేశవనాథ్ విగ్రహం, హెడ్గేవార్ విగ్రహం ప్రతిష్టించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100వ ఏట అడుగు పెట్టిన నేపథ్యంలో హెడ్గేవార్ పూరీ్వకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భారీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాదికి దీని నిర్మాణం పూర్తి చేస్తారు. దీని వద్దనే గోదావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. శ్రీ కేశవ శిశు విద్యామందిర్లో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తుండడం గమనార్హం. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్సంఘ్ చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ స్మృతిమందిరం ప్రారంభానికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రెంజల్ మండలంలో అక్షరాస్యత పెంచడంలో కేశవ సేవాసమితి కీలకపాత్ర 1989లో శ్రీ కేశవ శిశు విద్యామందిర్ ప్రారంభం కాగా, 2004లో పాఠశాల నూతన భవనాన్ని శ్రీరాంబావ్ హల్దేకర్ జీ ప్రారంభించారు. 2013 నుంచి కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఈ–తరగతులు, ఎల్ఈడీ టీవీ సౌకర్యం కలి ్పంచారు. ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు కందకుర్తి చుట్టుపక్కల గ్రామాల యువతీయువకులకు ఎండాకాలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించి సరి్టఫికెట్లు అందిస్తున్నారు. కందకుర్తి గ్రామం నుంచి మొదటి సైనికుడిగా ఎంపికైన జుబెర్ బాషా, రెంజల్ మండలం నుంచి మొదటిసారిగా నావికాదళానికి ఎంపికైన శశివర్ధన్ ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఇక కేశవ సేవాసమితి పాఠశాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చుట్టుపక్కల 19 గ్రామాల్లో బాలబాలికలలో సంస్కారం, చదువుకు బాల సంస్కార కేంద్రాలు, బాలికలకు కిషోరి వికాస్ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లు, పెద్దవారికి భజన మండళ్లు, గృహిణులకు మాతృమండళ్లు, యువకులకు క్రీడాకేంద్రం, గ్రంథాలయం, నారాయణ సేవ లాంటి కార్యక్రమాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటి వల్ల రెంజల్ మండలంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. పేద కుటుంబాల యువతకు చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద..... తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నడుమ కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడతారు. భిన్న సంస్కృతులకు నిలయంగా ఈ ప్రాంతం మారింది. త్రివేణి సంగమ ప్రాంతానికి కొన్ని అడుగుల దూరంలోనే కందకుర్తి (తెలంగాణ)–బెల్లూర్ (మహారాష్ట్ర)లను అనుసంధానం చేసే వంతెనను 1992లో నిర్మించారు. ఇక్కడికి 15 కిలోమీటర్ల దిగువన బాసర పుణ్యక్షేత్రం ఉంది. కందకుర్తిలో ఉన్న రామాలయానికి సైతం గొప్ప ప్రాశస్త్యం ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, ఆయన గురువు సమర్ధ రామదాసు ఈ ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఇక్కడ ప్రాచీన స్కంధ (కుమారస్వామి) మందిరం ఉండేది. మూడు నదులు కలిసే కూడలి కావడంతో కూడతి అనేవారు. కాలక్రమంలో కందకుర్తి పేరు వచి్చనట్టు చరిత్రకారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన స్కంధ మందిరం స్థానంలో కొత్త మందిర నిర్మాణం చేస్తున్నారు. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీరాముడు శివాలయాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. దీన్ని తర్వాత రాణి అహల్యాబాయి మందిరాన్ని పునరుద్ధరించారు. -
Preeti: పనిమనిషి కావాలా... ఆస్క్కు చెప్పండి!
సాక్షి, సిటీబ్యూరో: ఏ ఇంట చూసినా ఇంతి పని అంతా ఇంతాకాదు. పొద్దుతో ఆమె పోటీ పడుతోంది. ఉద్యోగ జీవనంలో ఇంటిపని, వంటపనికి అదనంగా ఇప్పుడు ఆమెకు ఆఫీస్ పని తోడైంది. లివింగ్ కాస్ట్, ఇతర ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో భార్యాభర్తలు జాబ్ చేస్తేనే, అనుకున్న లైఫ్ను లీడ్ చేయొచ్చని చాలామంది భావిస్తున్నారు. మహిళాసాధికారత పెరిగిన తర్వాత భర్తతోపాటు భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అదనపు పని, అదనపు ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆమెకు పనిమనిషి అవసరం చాలా ఏర్పడింది. హైటెక్సిటీ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో పనిమనుషులకు చాలా డిమాండ్ ఉంది. ఎంతగా అంటే ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఖాళీగా లేము అనేంతగా..! ఇలాంటి సమస్యకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వినూత్న పరిష్కారం చూపుతున్నారు. ‘ఆస్క్ లో’పేరుతో వాట్సాప్ వేదికగా ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఇలా నలుగురికి సాయపడేందుకు ప్రయతి్నస్తున్నారు.పనిమనుషులు, వంటవారు, డ్రైవర్లు కావాలనుకుంటే.. ‘ఆస్క్ లో’వాట్సాప్కు మెసేజ్ పెడితే చాలు, మీకు కావాల్సిన పని చిటికెలో అయిపోతుందని చెబుతున్నారు. మీ మెసేజ్ పనిమనుషులు, డ్రైవర్లకు వెళ్తుంది. అది కూడా వాయిస్ రూపంలో తెలుగులో ఆటోమాటిక్గా పంపిస్తారు. మీకు కావాల్సిన సమయంలో వాళ్లు ఖాళీగా ఉంటే తాము వస్తామని తిరిగి మెసేజ్ చేస్తారు. అయితే అప్పటివరకే కాకుండా పూర్తిస్థాయిలో కూడా ఏ టైమ్కు రావాలో కూడా మాట్లాడుకుని పనికుదుర్చుకోవచ్చు. ఇలా పనిమనుషులు, డ్రైవర్లకు పని దొరకడంతోపాటు అవసరం ఉన్న ఉద్యోగులకు కూడా మేలు జరుగుతోంది. రెండు పారీ్టల నడుమ మధ్యవర్తి లేకుండా నేరుగా వారే మాట్లాడుకునే వీలుంది.మహిళలకు ఉపయోగంగా ఉంటుందని..రాజస్థాన్కు చెందిన ప్రీతి 20 ఏళ్ల కింద హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 10 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు. నిత్యజీవితంలో ఎదురైన అనుభవాలు ఈ స్టార్టప్ ఏర్పాటు చేసేందుకు దోహదపడ్డాయని ప్రీతి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో సామాన్యులకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని, అది ఈ వేదిక ఏర్పాటుతో నెరవేరిందని ప్రీతి చెబుతున్నారు. అప్లికేషన్ లేదా వెబ్సైట్తో సంబంధం లేకుండా ఈ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. పైగా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారికి అప్లికేషన్స్ వెబ్సైట్ వాడటం రాకపోవచ్చు. అందుకే అలాంటివారికి సులువుగా పనిదొరికే విధంగా ఈ ప్లాట్ఫారం ఉపయోగపడుతుందని వివరించారు.సేవా దృక్పథంతో..సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను అందిస్తున్నా. భవిష్యత్తులో సేవలు మరింత మందికి అందించాలని భావిస్తున్నా. ఇప్పుడు నేను నివసిస్తున్న గచ్చిబౌలి ప్రాంతంలో మాత్రమే అందిస్తున్నా. చాలామంది ఈ సేవలను మెచ్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాస్త ఇబ్బంది అయినా వారి ప్రశంసలతో ముందుకు వెళ్లాలనే ఆకాంక్ష పెరుగుతోంది. – ప్రీతి, ఆస్క్ లో, వ్యవస్థాపకురాలు -
10 అత్యంత వివాదాస్పద ‘వికీలీక్స్’
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఐదేళ్లకు పైగా బ్రిటీష్ హై-సెక్యూరిటీ జైలులో, ఏడేళ్లపాటు లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన తర్వాత బుధవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. 2010లో వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్లో విడుదల చేయడంతో చిక్కుల్లో పడి న్యాయపోరాటం సాగించారు. ప్రపంచాన్ని కదిలించిన 10 వికీలీక్స్ ఇవే..1. ఇరాక్ యుద్ధం2010లో వికీలీక్స్ ఇరాక్ యుద్ధంలో పౌరుల ప్రాణనష్టం, వివాదాస్పద వ్యూహాలను బహిర్గతం చేసే రహస్య యూఎస్ఏ సైనిక పత్రాలను విడుదల చేసింది. దీంతో సైనిక కార్యకలాపాలలో పారదర్శకత ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అమెరికా సంకీర్ణ దళాల చర్యల కారణంగా చోటు చేసుకున్న పౌర మరణాలు వికీలీక్స్ కారణంగా వెల్లడయ్యాయి.2. గ్వాంటనామో ఫైల్స్వికీలీక్స్ గ్వాంటనామో బేలో జరుగుతున్న కార్యకలాపాలను వివరించే పత్రాలను ప్రచురించింది. ఖైదీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను దీనిలో బహిర్గతం చేసింది. ఇది అంతర్జాతీయ నిరసనలకు ఆజ్యం పోసింది. ఖైదీలను హింసించడం, వారి హక్కులను కాలరాడయం లాంటి వివరాలు దీనిలో వెల్లడయ్యాయి.3. ఆఫ్ఘన్ వార్ డైరీఆఫ్ఘన్ వార్ డైరీ పత్రాలను వికీలీక్స్ విడుదల చేసింది, పౌర మరణాలు, రహస్య కార్యకలాపాలు, తాలిబాన్ వ్యూహాలను దానిలో బహిర్గతం చేసింది. యూఎస్ఏ కాంట్రాక్టర్లు ఆఫ్ఘనిస్తాన్లో కుర్రాళ్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్న తీరు దీనిలో వెల్లడయ్యింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ బలోపేతమవుతున్నదని వికీలీక్స్ వెల్లడించింది.4. కొల్లేటరల్ మర్డర్ వీడియోబాగ్దాద్లో యూఎస్ అపాచీ హెలికాప్టర్ దాడికి సంబంధించిన ఒక రహస్య వీడియోను వికీలీల్స్ విడుదల చేసింది. హెలికాప్టర్ సిబ్బంది పౌరులను సాయుధ తిరుగుబాటుదారులుగా పొరపాటుగా గుర్తించి, వారితోపాటు రాయిటర్స్ ఫోటోగ్రాఫర్, అతని డ్రైవర్పై కాల్పులు జరుపుతున్నట్లు ఉన్న వీడియోను బయటపెట్టింది. నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది.5. ప్రపంచ నేతలపై ఎన్ఎస్ఏ టార్గెట్అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) ప్రపంచ నేతలను టార్గెట్ చేసిందని వికీలీక్స్ వెల్లడించింది. బెర్లిన్లో అప్పటి యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య జరిగిన ప్రైవేట్ సమావేశాన్ని ఎన్ఎస్ఏ బగ్ చేసిందని వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి.6. డీఎన్సీ ఈ మెయిల్ వివాదం2016లో వికీలీక్స్.. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ)కి చెందిన ఈ మెయిల్స్ను విడుదల చేయడం ద్వారా పార్టీ అంతర్గత విభేదాలు ప్రపంచం ముందు వెల్లడయ్యాయి. లీకైన ఈ మెయిల్స్లో డీఎన్సీ అధికారులు బెర్నీ సాండర్స్ కన్నా హిల్లరీ క్లింటన్కు ప్రాధాన్యతనిచ్చారని వెల్లడయ్యింది. ఈ వివాదం సాండర్స్ మద్దతుదారులలో అపనమ్మకాన్ని పెంచింది. ఇది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతపై చర్చకు దారితీసింది.7. సౌదీ కేబుల్స్సౌదీ దౌత్య వ్యవహరాలకు సంబంధించిన కీలక విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. లీకైన పత్రాలలో సౌదీ వ్యూహాత్మక పొత్తులు, రహస్య కార్యకలాపాలు, దౌత్య వివరాలున్నాయి. ఈ లీక్లు సౌదీ అరేబియా విదేశీ విధానాలను, ప్రాంతీయ సంఘర్షణలను బహిర్గతం చేసింది.8. స్నోడెన్ ఎన్ఎస్ఏ పత్రాలుఎడ్వర్డ్ స్నోడెన్తో కలిసి, వికీలీక్స్ గ్లోబల్ నిఘా కార్యక్రమాలను బహిర్గతం చేసే క్లాసిఫైడ్ ఎన్ఎస్ఏ పత్రాలను ప్రచురించింది. ఇది గోప్యతా హక్కులు, ప్రభుత్వ పర్యవేక్షణ, విజిల్బ్లోయర్ల పాత్రపై చర్చలకు దారితీసింది. ఈ వెల్లడి జాతీయ భద్రత, పౌర స్వేచ్ఛల మధ్య సమతుల్యతపై పలు సందేహాలకు పురిగొల్పింది.9. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వికీలీక్స్ హిల్లరీ క్లింటన్ ప్రచారం, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన ఈ మెయిల్స్ను ప్రచురించింది. ఇది సైబర్ భద్రత, రాజకీయ పారదర్శకత, విదేశీ జోక్యంపై ఆందోళనలకు దారితీసింది.10. వాల్ట్ 72017లో వాల్ట్ 7 సిరీస్ను వికీలీక్స్ విడుదల చేసింది. దీనిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) హ్యాకింగ్ సాధనాలు, నిఘా పద్ధతులను బహిర్గతం చేసింది. ఇది ప్రభుత్వ నిఘా సామర్థ్యాలు, డిజిటల్ గోప్యతపై ఆందోళను లేవనెత్తింది. -
హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
కేవలం రూ.3,400 కోట్లకే అమ్మించారు.. ఎయిర్సెల్ ఫౌండర్ ఆవేదన
రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు.అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్కాస్ట్ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. ‘రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్సెల్ రూ. 6,500 కోట్లు చెల్లించింది. 2012 నవంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 5 మిలియన్ల 3G వినియోగదారులను కలిగి ఉంది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ సెల్ 3జీ టారిఫ్ ను అప్పట్లో భారీగా తగ్గించింది. 2011లో భారతీ ఎయిర్టెల్తో కలిసి యాపిల్ ఐఫోన్ 4 లాంచ్ భాగస్వామి అయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్ సెల్ 2018 ఫిబ్రవరిలో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. 2006లో మాక్సిస్ బెర్హాద్ 74 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ సెల్ ను స్వాధీనం చేసుకుంది. 2011లో తన వాటాను మ్యాక్సిస్ బెర్హాద్ కు విక్రయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చిన్నకన్నన్ శివశంకరన్ ఆరోపించారు. -
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
సాధారణంగా కంపెనీల సీఈవో వేతనం రూ.కోట్లలో ఉంటుంది. కానీ ఈ ఫిన్టెక్ యూనికార్న్ సీఈవో వార్షిక జీతం కేవలం 12 రూపాయలే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ కథనం చదవండి.ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ యూనికార్న్ వ్యవస్థాపకుల మధ్యస్త, సగటు వేతన అంతరాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఫిన్టెక్ యూనికార్న్ స్లైస్ ఫౌండర్, సీఈవో రాజన్ బజాజ్ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 వార్షిక వేతనం మాత్రమే తీసుకున్నారు.సీఈవో బజాజ్ జీతం నామమాత్రంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు, రుణ వ్యాపార కార్యకలాపాల నుంచి స్లైస్ రూ .847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ తన అప్పటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన ప్రీపెయిడ్ కార్డుపై రివాల్వింగ్ క్రెడిట్ లైన్ను రద్దు చేసినప్పటికీ కంపెనీ దీనిని సాధించగలిగింది. -
‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత
దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్క్రీమ్ను స్థాపించి ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్క్రీమ్ పుట్టింది. -
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
బంధన్ బ్యాంక్కు సీఈవో గుడ్బై
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో సీఎస్ ఘోష్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుత సర్వీసు 2024 జూలై9తో ముగియనుండటంతో పదవీవిరమణ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. వరుసగా మూడుసార్లు ఎండీ, సీఈవోగా దాదాపు దశాబ్ద కాలం బ్యాంకుకు నాయకత్వం వహించిన తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బోర్డుకు రాసిన లేఖలో ఘోష్ పేర్కొన్నారు. -
‘‘పేటీఎంపై సీబీఐ, ఈడీల మౌనం అందుకేనా’’
న్యూఢిల్లీ: పేటీఎం సబ్సిడరీ కంపెనీ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై మనీలాండరింగ్ ఆరోపణల తర్వాత కూడా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేసింది. ‘పేటిఎం వ్యవస్థాపకుడు ప్రధాని మోదీ భక్తుడు. ప్రధానితో సెల్ఫీలు దిగడమే కాకుండా ప్రధానికి అనుకూలంగా ప్రకటనలు కూడా ఇచ్చాడు. ఎన్నికల ర్యాలీల్లోనూ పేటీఎంకు అనుకూలంగా మోదీ మాట్లాడారు. ఏడేళ్లుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సహకారం అందింది. ఇప్పుడు కంపెనీపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పేమెంట్ బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నాయని ఆర్బీఐ ఆంక్షలు విధించిన తర్వాత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు మౌనంగా ఉంది. పీఎం మోదీకి సంబంధించిన వాళ్లపై దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా షినేట్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. నిబంధనలు పాటించడం లేదన్న కారణంగా ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంకు ఎలాంటి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని, వాలెట్లలో డబ్బు రీఫిల్ చేయడం కుదరదని ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం షేరు స్టాక్మార్కెట్లలో కుప్పకూలుతూ వస్తోంది. ఈ నాలుగైదు రోజుల్లో ఆ షేరు సుమారు 50 శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. #WATCH | On RBI's restrictions on Paytm Payments Bank, Congress leader Supriya Shrinate says, "RBI has restricted Paytm payments bank & there will be no existence of it after 29 February...There are very serious charges levelled by the RBI. The irregularities started in… pic.twitter.com/VFJph2tU2s — ANI (@ANI) February 5, 2024 ఇదీచదవండి.. భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్ -
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్కు ఫైనాన్షియల్ మార్కెట్స్కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్షాప్లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
చైనా నుంచి నిధులు.. న్యూస్క్లిక్ ఫౌండర్కు రిమాండ్
ఢిల్లీ: ఊపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత) చట్టం కింద అరెస్టైన న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. న్యూస్క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. న్యూస్క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్లను దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ప్రత్యేక సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. అనంతరం న్యూస్క్లీక్తో సంబంధాలు ఉన్న జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. ల్యాప్ట్యాప్లు, మొబైల్స్తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 30 స్థావరాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చైనా నిధులు.. న్యూస్క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్వర్క్లో భాగంగానే న్యూస్క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్క్లిక్పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. భారీగా విదేశీ నిధులు న్యూస్ క్లిక్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు -
లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్!
నితిన్ సలూజా.. టీ కేఫ్ చైన్ ‘చాయోస్’ వ్యవస్థాపకుడు. నితిన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థి. చదువు పూర్తయ్యాక అమెరికా చేరుకున్నాడు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. లక్షల్లో ప్యాకేజీ అందుకున్నాడు. అయినా నితిన్ సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా చేయాలని భావించి, ఇండియా వచ్చాడు. నితిన్ తన ఆలోచనలను అమలు చేసే పనిలో పడ్డాడు. అనతికాలంలోనే అతని కంపెనీ కోట్లకు పడగలెత్తింది. నితిన్ సలూజా ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గట్టి పట్టుదల, సంకల్పబలంతో.. నితిన్ తన స్టార్టప్ బిజినెస్లో మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. గట్టి పట్టుదల, సంకల్పబలంతో తన సంస్థను విజయ శిఖరాలకు తీసుకెళ్లాడు. స్టార్బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా లాంటి కాఫీ షాపుల ఆధిపత్యం ఉన్న మనదేశంలో ‘కెయోస్’ తనకంటూ ఒక పేరు తెచ్చుకునేలా నితిన్ నిరంతర కృషి చేశాడు. ఇది భారతదేశంలోని ప్రముఖ టీ కేఫ్ కంపెనీగా అవతరించింది. నితిన్ సలుజా స్థాపించిన ‘కెయోస్’ అనతికాలంలోనే రూ. 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీగా నిలిచింది. ఉద్యోగం వదిలేసి ఇండియాకు.. నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యాక ఆయన ఒక అమెరికన్ కంపెనీకి కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశారు. అమెరికా కంపెనీలో నితిన్ జీతం లక్షల్లో ఉండేది. నితిన్, అతని భార్యకు అమెరికాలో టీ అమ్మే వారెవరూ కనిపించలేదు. దీంతో నితిన్ కేఫ్ను తెరవాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చాడు. సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో పని చేయడం మొదలుపెట్టాడు. గురుగ్రామ్లో మొదటి కేఫ్ భారతదేశంలో కాఫీ అందించే అనేక కేఫ్లు ఉన్నాయని, అయితే అవి టీ అందించడం లేదని అతను భావించాడు. భారతదేశంలో టీ తాగే ప్రత్యేక సంస్కృతి ఉంది. ప్రజలు అనేక రకాల టీలను ఆస్వాదిస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకున్న నితిన్ భారతదేశంలోని టీ తాగేవారి అవసరాలను తీర్చగల టీ కేఫ్ను ప్రారంభించాలని అనుకున్నాడు. 2012లో నితిన్, అతని స్నేహితుడు రాఘవ్ సంయుక్తంగా ‘చాయోస్’ని స్థాపించారు. వారు గురుగ్రామ్లో మొదటి కేఫ్ని ఏర్పాటు చేశారు. కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం ప్రారంభించారు. నితిన్ మొదట్లో తానే స్వయంగా ఆర్డర్లు తీసుకుని, టీ తయారుచేసి అందించేవాడు. 200కు మించిన ‘చాయోస్’ కేఫ్లు కోవిడ్ సమయంలో ‘చాయోస్’ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. 2020లో తిరిగి ట్రాక్లో పడింది. నితిన్ కష్టానికి సరైన ఫలితం దక్కింది. 2020లో కంపెనీ 100 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ముంబై, బెంగళూరు, చండీగఢ్, పూణేలలో నితిన్ చాయోస్ స్టోర్లు నెలకొల్పారు. నేడు భారతదేశం అంతటా 200కు మించిన చాయోస్ కేఫ్లు ఉన్నాయి. చాయోస్ మన దేశంలో ప్రీమియం టీని అందించే కేఫ్. ఇది భారతీయులు తాము కోరుకునే అన్ని రుచుల టీలను అందిస్తుంది. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? -
తీవ్ర విషాదం: సులభ్ ఫౌండర్ ఇకలేరు!
Sulabh founder Bindeshwar Pathak passed away సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు స్వచ్ఛ రైలు మిషన్కు బ్రాండ్ అంబాసిడర్ బిందేశ్వర్ పాఠక్ (80) ఇక లేరు. ఆగస్టు 15, మంగళవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూసారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం బిందేశ్వర్ పాఠక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోవడం విషాదాన్ని నింపింది. సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ను బిందేశ్వర్ పాఠక్ 1970లో స్థాపించారు. మాన్యువల్ స్కావెంజర్ల కష్టాలను తీర్చేందుకు బిందేశ్వర్ పాఠక్ విస్తృతంగా ప్రచారం చేశారు. మూడు దశాబ్దాల క్రితం తాను రూపొందించిన సులభ్ టాయిలెట్లను ఫెర్మెంటేషన్ ప్లాంట్లకు అనుసంధానం చేయడం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తిని వినూత్నంగా వినియోగించేందుకు నిర్ణయిచారు. అలాగే అప్పటి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ను స్వచ్ఛ రైలు మిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఎవరీ బిందేశ్వర్ పాఠక్ మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణ ,విద్య ద్వారా సామాజిక సంస్కరణల నిమిత్తం పనిచేసిన సామాజిక వేత్త. భారతదేశంలోని స్కావెంజర్లందరూ 13 మిలియన్ల బకెట్ ప్రైవీలను మాన్యువల్గా శుభ్రపరిచే పని నుండి విముక్తి పొందాలని భావించిన వ్యక్తి. మురికివాడల్లో పబ్లిక్, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలలో 7,500 కంటే ఎక్కువ పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా పే-అండ్ యూజ్ ప్రాతిపదికన వాటిని నిర్వహిస్తున్న భారతదేశంలో తొలి వ్యక్తి డాక్టర్ పాఠక్. ప్రతిరోజూ 10 మిలియన్లకు పైగా ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. బయోగ్యాస్ మానవ విసర్జనల ఆధారంగా 60 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఘనత బిందేశ్వర్ సొంతం. వీటిని హౌసింగ్ కాలనీలు, ఎత్తైన భవనాలు ,పబ్లిక్ టాయిలెట్లలో అమర్చవచ్చు. అలాంటి ప్రాంతాల్లో మురుగు కాలువలు లేకుంటే, టాయిలెట్లను సెప్టిక్ ట్యాంక్కు కాకుండా బయోగ్యాస్ డైజెస్టర్కు అనుసంధానించాలనే ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. బిందేశ్వర్ పాఠక్ 1964లో సోషియాలజీలో పట్టభద్రుడయ్యాడు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1980లో మాస్టర్స్ డిగ్రీని, 1985లో పీహెచ్డీని పొందారు. డాక్టర్ పాఠక్ మంచి రచయిత వక్త కూడా. ది రోడ్ టు ఫ్రీడమ్ సహా అనేక పుస్తకాలను రచించారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, సామాజిక పురోగతిపై జరిగే సమావేశాలలో తరచుగా పాల్గొనేవారు. 1991లో భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్లా ఫుట్పాత్పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్కుమార్. హైదరాబాద్కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్పాత్ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!
Headspace Founder Story: వాస్తవ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఒకటి గొప్ప వాణ్ణి చేస్తుంది.. లేదా పనికిరాకుండా పోయేలా కూడా చేస్తుంది. కన్నీటి సంద్రం నుంచి బయటపడి కోట్లు సంపాదనకు తెర లేపిన ఒక సన్యాసి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆత్మీయుల మరణం.. ఆండీ పూడికోంబే (Andy Puddicombe) అనే వ్యక్తి తాగి డ్రైవింగ్ చేసిన సంఘటనలో స్నేహితులను, సైక్లింగ్ ప్రమాదంలో అతని సోదరిని కోల్పోయి జీవితం మీద విరక్తి పొందాడు. దుఃఖంతో నిండిన యితడు కాలేజీకి స్వస్తి పలికి నేపాల్ చేరుకున్నాడు. బౌద్ధ సన్యాసం స్వీకరించి ఆసియా అంతటా ఒక దశాబ్దం పాటు సంపూర్ణత, ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హెడ్స్పేస్ మెడిటేషన్ యాప్.. ధ్యానంతో జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చనే సత్యాన్ని గ్రహించి అందరికి పంచాలనే ఉద్దేశ్యంతో 2005లో యూకే నుంచి తిరిగి వచ్చిన తరువాత లండన్లో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఎప్పుడూ బిజీ లైఫ్ గడిపే ఎంతోమందికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఆ తర్వాత రిచర్డ్ పియర్సన్తో కలిసి 2010లో 'హెడ్స్పేస్' (Headspace) అనే మెడిటేషన్ యాప్ స్థాపించారు. ఈ యాప్ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది ఎంతో మంది ప్రజలకు ధ్యానం ప్రయోజనాలను గురించి వెల్లడిస్తుంది. మానసిక ఆరోగ్యం పట్ల వైఖరిని మార్చడంలో హెడ్స్పేస్ విస్తృత ఆదరణ పొందింది. జీవితంలోని గందరగోళాల మధ్య ప్రశాంతమైన అభయారణ్యంగా మారింది, మానసిక క్షేమం కోరుకునే వినియోగదారులను ఎంతోమందిని ఈ యాప్ ఆకర్షిస్తుంది. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) వేల కోట్ల సామ్రాజ్యం.. ఆధునిక కాలంలో నేడు ఈ యాప్ 4,00,000 మంది సబ్స్క్రైబర్లను 50 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. కేవలం బౌద్ధ సన్యాసి అయినప్పటికీ 250 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 2040 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. కష్టతరమైన సమయాల్లో కూడా ఎలా విజయాలు అసాధించాలో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. మొత్తం మీద వ్యక్తిగత విషాదం అతన్ని వేల కోట్లకు అధిపతిని చేసింది. -
ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఎలా అంటే?
మనం ఇప్పటి వరకు చాలా సక్సెస్ స్టోరీలు చదువుకున్నాం. పేదరికం నుంచి కుబేరులైన వ్యక్తుల గురించి.. ఉన్నత చదువులు వదిలి సక్సెస్ సాధించినవారు గురించి ఇలా ఎన్నెన్నో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ కొడుకు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతడు సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించిన 'విజయ్ శేఖర్ శర్మ' (Vijay Shekhar Sharma) స్కూల్ టీచర్ అయిన 'సులోమ్ ప్రకాష్' మూడవ కుమారుడు. చిన్నప్పుడు అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న ప్రాంతంతో పాఠశాల విద్యను ప్రారంభించి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బిటెక్ పూర్తి చేసాడు. కంప్యూటర్ పట్ల ఆకర్షణ.. చదువుకునే రోజుల్లోనే విజయ్ను కంప్యూటర్ బాగా ఆకర్శించింది. దీంతో చాలా సమయం కంప్యూటర్లతోనే కాలం గడిపేవాడు. అయితే మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీ అతన్ని ఎంతగానో ఆకర్శించింది. ఇది అతన్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళ్లింది. తత్ఫలితంగా 'పేటీఎమ్' (Paytm) యాప్ సృష్టించి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభం.. అసాధారణ విజయాలన్నీ సాధారణ వ్యక్తుల నుంచి పుట్టుకొస్తాయనే మాట నిజం చేస్తూ.. విజయ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఎన్నెన్నో ఆటంకాలు, అపజయాలు చవి చూసిన తరువాత ఈ రోజు గొప్ప స్థాయికి చేరినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. చదువు పూర్తయిన తరువాత తన క్లాస్మేట్తో కలిసి ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తరువాత 'వన్97 కమ్యూనికేషన్' పోర్టల్ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఈ వెబ్సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా.. తీవ్ర నష్టాలను మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) రూ. 10 వేలకు ఉద్యోగం & పేటీఎమ్ స్థాపన.. అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయాల్సి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు రూ. 10 వేల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏ మాత్రం వదలకుండా 2011లో పేటీఎమ్ స్థాపించాడు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎమ్ వ్యాలెట్స్ క్రియేట్ అయ్యాయి. అంతే కాకుండా మొదటి సారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాప్కి మరింత గిరాకీ పెంచింది. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన హ్యుందాయ్ ఎక్స్టర్ - టాటా పంచ్ ప్రత్యర్థిగా నిలుస్తుందా?) కొన్ని నివేదికల ప్రకారం, భారతదేశంలో పేటీఎమ్ ఉపయోగిస్తున్న భారతీయులు సుమారు 30 కోట్లు కంటే ఎక్కువ. అంతే కాకుండా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్కు కూడా విపరీతమైన ఆధారణ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్లతో పేటీఎమ్ పోటీ పడుతోంది. ఈ యాప్ స్థాపించిన తరువాత విజయ్ ఆస్తులు విలువ రూ. 8,222 కోట్లకి చేరినట్లు, సంస్థ విలువ రూ. 55 వేల కోట్లు అని తెలుస్తోంది. -
రూ. 300 లక్షల కోట్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపకుడు ఈయనే..
భారతదేశ ఆర్థిక రాజధాని మొదటి వ్యాపార దిగ్గజాలలో ప్రేమ్చంద్ రాయ్చంద్ జైన్ ఒకరు. ఆయన్ను ముంబైలో (అప్పట్లో బొంబాయి) బిగ్ బుల్, బులియన్ కింగ్, కాటన్ కింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. జమ్సెట్జీ టాటా, డేవిడ్ సాసూన్, జమ్సెట్జీ జెజీబోయ్లతో పాటు నలుగురు బాంబే వ్యాపార యువరాజులలో ఒకరిగా పేరు పొందారు. ప్రేమ్చంద్ తన కాలంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపనతో అందరికీ గుర్తుండిపోయారు. అదే ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్గా మారింది. బీఎస్ఈ దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దాంట్లోని అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లకు మించి ఉంది. 1865లో దీనిని స్థాపించినప్పుడు, దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద 22 మంది బ్రోకర్లు, ఒక్కొక్కరి నుంచి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది. మొదటి స్టాక్ బ్రోకర్ రాయ్చంద్ 1832లో సూరత్లో రాయ్చంద్ డిప్చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం బొంబాయికి వచ్చేసింది. ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో రాయ్చంద్ విద్యాభ్యాసం సాగింది. అదే ఆయన ఇంగ్లిష్లో మాట్లాడగల, చదవగల, రాయగల మొదటి భారతీయ బ్రోకర్గా అవతరించడానికి సహాయపడింది. రాయ్చంద్ 1852లో ఓ విజయవంతమైన స్టాక్ బ్రోకర్కు సహాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. అసమాన్య జ్ఞాపకశక్తి అసమానమైన జ్ఞాపకశక్తి ప్రేమ్చంద్ సొంతం. ఆయన ఎప్పుడూ పెన్ను, పేపర్ వాడలేదు. రాసుకోవడానికి బదులు తన వ్యాపారాలన్నింటినీ కంఠస్థం చేసిన ఆయన కేవలం 6 సంవత్సరాలలో 1858 నాటికి దాదాపు రూ. 1 లక్ష సంపదను ఆర్జించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారత్ హాట్స్పాట్గా మారింది. దీన్ని ఆయన మరింత విస్తృతం చేశారు. దాతృత్వంలోనూ.. భారీ లాభాలను చవిచూసిన ప్రేమ్చంద్ రాయ్చంద్, అంతర్యుద్ధం ముగిశాక 1865లో పత్తి వ్యాపార ప్రాభవం తగ్గడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత తిరిగి పుంజుకుని దాతృత్వం వైపు నడిచారు. ఇందులో భాగంగా బాంబే విశ్వవిద్యాలయంలో రాజాబాయి క్లాక్ టవర్కు నిధులు అందించారు. బాలికా విద్యను ప్రోత్సహించారు. అవార్డులు, స్కాలర్షిప్లు అందించేందుకు ఆర్థికంగా సహకరించారు. ప్రేమ్చంద్ 1906లో మరణించారు. అతని కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్ సంస్థను నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే అయినా గొప్ప చరిత్ర దీనికి ఉంది. బైకుల్లాలోని ప్రేమ్చంద్ నివసించిన బంగ్లాను తరువాత అనాథాశ్రమం, పాఠశాలగా మార్చారు. -
ఒక శకం ముగిసింది: ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నుమూత
తొలి తరం వ్యవస్థాపకుడు, రసాయనాల తయారీ కంపెనీ దీపక్ నైట్రేట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ చిమన్లాల్ కె మెహతా (సీకె మెహతా) సోమవారం కన్నుమూశారు. మౌలిక్ మెహతా కంపెనీకి సీఈవోగా ఉన్నారు.దీంతో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర పరిశ్రమ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఒక శకం ముగిసింది అంటూ ఆయనకు నివాళులర్పించారు. 1972-73లో దీపక్ నైట్రేట్ తయారీని ప్రారంభించిన చిమన్లాల్ రెండేళ్లలోనే లాభాల బాట పట్టించారు. అనేక కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను ప్రారంభించడంలోనూ, దీపక్ ఫౌండేషన్ను స్థాపించడంలోమెహతాది కీలకపాత్ర. 1971లో దీపక్ నైట్రేట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వచ్చింది. ఈ సందర్భంగా 20 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ చేయడం విశేషం. దీపక్ నైట్రేట్ 1984లో మఫత్లాల్ ఇండస్ట్రీస్ నుండి సహ్యాద్రి డైస్టఫ్స్, కెమికల్స్ యూనిట్ను కొనుగోలు చేసింది. కంపెనీ 1995లో మహారాష్ట్రలోని తలోజాలో హైడ్రోజనేషన్ ప్లాంట్ను స్థాపించింది. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్లోని నందేసరి , దహేజ్, మహారాష్ట్రలోని తలోజా అండ్ రోహా తెలంగాణలోని హైదరాబాద్లో ప్లాంట్స్ ఉన్నాయి. దీపక్ నైట్రేట్ 100కి పైగా ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రసాయనాలు, రంగులు, రబ్బరు, ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ లాంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో కెమికల్స్లో ఆరో అతిపెద్ద సంస్థగా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా రెట్లు పెరిగి, పదేళ్ల నాటి 24వ స్థానంతో పోలిస్తే దీపక్ నైట్రేట్ అయిదో అతిపెద్ద లిస్టెడ్ కెమికల్ ప్లేయర్గా ఉంది. ఏప్రిల్, 2023 నాటికి రూ. 25,208 కోట్లు. -
బెలూన్ బొమ్మలమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ
భారతీయ స్టాక్మార్కెట్ చరిత్రలో ఆటోమొబైల్ టైర్ మేజర్ ఎంఆర్ఎఫ్ స్టాక్ మరో సారి తన ప్రత్యేకతను చాటుకుంది, టైర్ పరిశ్రమలో అగ్రస్థానంలోఉన్న ఎంఆర్ఎఫ్ షేరు (జూన్ 13, 2023)న తొలిసారి లక్ష మార్క్ను టచ్ చేసింది. ఈ ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్గా రికార్డు క్రియేట్ చేసింది. అసలు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫౌండర్ ఎవరు? ఈ కంపెనీ విజయ ప్రస్థానం ఏమిటి? ఒకసారి చూద్దాం. ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దేశంలోని అతిపెద్ద టైర్ కంపెని ఫౌండర్ కేఎం మామ్మెన్ మాప్పిళ్లై . ఆయన అంకితభావం, కృషి పట్టదలతో ఈ రోజు ఈ స్థాయికి ఎగిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946 సంవత్సరంలో, కేఎం మమ్మెన్ మాప్పిళ్ళై మద్రాసు వీధుల్లో బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు.తొమ్మిది మంది తోబుట్టువులతో, కేరళలో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మమ్మన్కు ఈ బెలూన్ల వ్యాపారమే తన విజయానికి సోపానమని ఊహించి ఉండరు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) మామెన్ తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. అయితే మామెన్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న సమయంలోస్వాతంత్ర్య పోరాటంలో తండ్రిని రెండేళ్లపాటు జైలులో ఉంచారు. 1946లో మామెన్ చిన్న తయారీ యూనిట్లో బొమ్మల బెలూన్లను తయారీతో పారిశ్రామిక జీవితాన్ని షురు చేశారు. ఇది సుమారు 6 సంవత్సరాల పాటు కొనసాగింది. 1952లో టైర్ రీట్రేడింగ్ ప్లాంట్కు ఒక విదేశీ కంపెనీ ట్రెడ్ రబ్బర్ సరఫరా చేస్తోందని గమనించడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా రబ్బరు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) గ్లోబల్ కంపెనీలు అవుట్ తర్వాత మద్రాసులోని చీటా స్ట్రీట్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. 1956 నాటికి రబ్బరు వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంది. నాలుగేళ్లలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంది. పలితంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత మర్కెట్నుంచి తప్పుకున్నాయి. అయితే మామెన్ ఇక్కడితో ఆగలేదు టైర్ల తయారీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రబ్బరు ఉత్పత్తులనుంచి టైర్ పరిశ్రమలోకి మారారు. 1960లో రబ్బర్, టైర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. అలా అమెరికాకు చెందిన మాన్స్ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్)గా ఆవిష్కరించింది. ట్రెడ్స్, ట్యూబ్లు, పెయింట్స్, బెల్ట్లు, బొమ్మలు వంటి అనేక ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. 1961లో మద్రాస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అమెరికాకు రబ్బరు ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఘనత 1967లో కంపెనీ అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో వివిధ ప్లాంట్లను ప్రారంభించింది. 1973 సంవత్సరంలో దేశంలో నైలాన్ ట్రావెల్ కారును వాణిజ్యపరంగా తయారు చేసి మార్కెట్ చేసిన తొలి కంపెనీగా అవతరించింది. అలా 1979 నాటికి కంపెనీ పేరు కంపెనీ పేరు విదేశాలకు ఎగబాకింది. ఆ తరువాత అమెరికన్ కంపెనీ మాన్స్ఫీల్డ్ సంస్థలో తన వాటాను విక్రయించడంతో ఎంఆర్ఎఫ్ లిమిటెడ్గా మారింది. ఇండియన్ రోడ్లకు సరిపోయే టైర్లు తయారు అంతా బాగానే ఉంది కానీ మాన్స్ఫీల్డ్ టెక్నాలజీ భారతీయ రహదారి పరిస్థితులకు తగినది కాదని మామెన్ గ్రహించాడు. మరోవైపు డన్లప్, ఫైర్స్టోన్,గుడ్ఇయర్ వంటి బహుళజాతి కంపెనీల ఆధిపత్యంతో నిలదొక్కుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సొంతంగా,భారతీయ రోడ్లకు అనుగుణం టైర్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన మామెన్ ప్రభుత్వ సాయంతో 1963లో తిరువొత్తియూర్లోని రబ్బరు పరిశోధనా కేంద్రం తిరువొత్తియూర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. మార్కెటింగ్పై దృష్టి, ఐకానిక్ మజిల్మేన్ ఆవిష్కారం అంతేకాదు మార్కెటింగ్పై దృష్టి పెట్టారు. అనేక పరిశోధనల తర్వాత, ధృఢమైన మన్నికైన టైర్లకు ప్రతిరూపంగా అలిక్ పదమ్సీ ఐకానిక్ పవర్ఫుల్ ఎంఆర్ఎఫ్ మజిల్ మేన్ చిత్రం వచ్చింది. భారతీయ ప్రకటనల ముఖచిత్రాన్ని మార్చివేసి 1964లో మజిల్మేన్ జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. టీవీ వాణిజ్య ప్రకటనలు, బిల్బోర్డ్లలో ఇలా ఎక్కడ చూసినా ఈ పిక్ దర్శనమిచ్చింది. వివిధ ట్రక్ డ్రైవర్ల సర్వే చేసి మరీ పదంశీ దీన్ని రూపొందించారు. అందుఆయనను రాక్స్టార్ లేదా గాడ్ ఆఫ్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించింది ఎంఆర్ఎఫ్. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా మొదలు విరాట్ కోహ్లీ వరకు పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. 80 ఏళ్ల వయసులో 2003లో మాప్పిళ్ళై కన్నుమూశారు. అనంతరం అతని కుమారులు వ్యాపారాన్ని చేపట్టారు. 1992లో మాప్పిళ్లై పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . అతని సోదరులు, KM చెరియన్, KM ఫిలిప్ , KM మాథ్యూ మేనల్లుడు మామెన్ మాథ్యూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలే. పెద్ద సోదరుడు కెఎమ్ చెరియన్ కూడా పద్మభూషణ్ గ్రహీతలు కావడం విశేషం. ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ. 23,261.17 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ. 19,633.71 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం రూ.768.96 కోట్లు నమోదైంది. ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.42,000 కోట్లు. -
స్టార్ హెల్త్ ఫౌండర్ జగన్నాథన్ రాజీనామా
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటసామి జగన్నాథన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు రాజీనామా చేశారు. జగన్నాథన్ కంపెనీ బోర్డు నుంచి తక్షణమే వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారని స్టార్ హెల్త్ జూన్ 10న రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. 79 ఏళ్ల జగన్నాథన్ నెల రోజుల కిందటే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆనంద్ రాయ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా జూన్ 10న కంపెనీ బోర్డుకు రాజీనామా చేసే వరకు జగన్నాథన్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్సూరెన్స్ పరిశ్రమలో విశేష అనుభవం ఇన్సూరెన్స్ పరిశ్రమలో జగన్నాథన్కు విశేష అనుభవముంది. ఆయన నాయకత్వంలో స్టార్ హెల్త్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 619 కోట్ల లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 1,041 కోట్ల నష్టాన్ని చవిచూసిన కంపెనీకి ఆయన తర్వాత సంవత్సరంలో ఏకంగా రూ. 619 కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టారు. స్టార్ హెల్త్ని ప్రారంభించే ముందు జగన్నాథన్ ప్రభుత్వ రంగ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో పని చేశారు. 2001లో నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థకు ఆయన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2004 నాటికి ఆటుపోట్లను తిప్పికొట్టి రూ. 450 కోట్ల లాభాన్ని సాధించగలిగారు. 2006లో జగన్నాథన్ స్థాపించిన స్టార్ హెల్త్ దేశంలోని ప్రముఖ స్టాండ్-అలోన్ మెడికల్ ఇన్సూరెన్స్లో ఒకటిగా అవతరించింది. -
వయసు 60, డీల్ చేసే వ్యాపారాలు 100, అట్లుంటది హైదరాబాదీ అంటే!
Kalaari Capital founder Vani Kola: భారతదేశంలో బిజినెస్ చేస్తూ గొప్ప సక్సెస్ సాధించిన అతి తక్కువ మందిలో 'వాణి కోలా' (Vani Kola) ఒకరు. అమెరికాలో చదివి, అక్కడే అనే సంవత్సరాలు విజయవంతమైన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత ఇండియా వచ్చి ఇప్పుడు 100 వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న 'వాణి కోలా' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్లో జన్మించిన వాణి 16 సంవత్సరాల వయస్సులో పోస్ట్-సెకండరీ విద్య, ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదవడానికి 1980 చివరలో అమెరికా వెళ్ళింది. యునైటెడ్ స్టేట్స్లోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. నిజానికి వాణి కోలా సిలికాన్ వ్యాలీలో 22 ఏళ్ల విజయవంతమైన కెరీర్ తర్వాత వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించేందుకు 2006లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత 'వెంచర్ కాపిటల్'లో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో 'కలారి కాపిటల్' అనే సంస్థను స్థాపించింది. (ఇదీ చదవండి: యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులు - విజన్ ప్రో, మాక్బుక్, ఐఓఎస్ 17 ఇంకా..) కలారి కాపిటల్ 2012లో 150 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అయితే ఆ తరువాత వాణి అధ్యక్షతన కేవలం నాలుగు సంవత్సరాల్లోనే.. అంటే 2017 నాటికి సంస్థ ఆదాయం 650 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ కామర్స్, మొబైల్ సర్వీసులు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఆ తరువాత డ్రీమ్11, ర్బన్ లాడర్తో సహా అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) వీటితో పాటు ఎంప్రోస్ అండ్ కంట్రోల్ డేటా కార్పొరేషన్ వంటి సంస్థలతో సాంకేతిక రంగంలో పనిచేయడం ప్రారంభించింది. ఈ రంగంలో సుమారు 12 సంవత్సరాల తరువాత రైట్వర్క్స్ను స్థాపించింది. నాలుగు సంవత్సరాలు సెర్టస్ సాఫ్ట్వేర్ సీఈఓగా కూడా ఉన్నారు. వాణి కోలా కేవలం వ్యాపారవేత్తగ మాత్రమే కాకుండా, ఆసక్తిగల పాఠకురాలు కూడా. ఈ కారణంగానే ఆమె ఆలోచనలను వ్రాయడం & పంచుకోవడం వంటివి చేసేదని చెబుతారు. -
రూ. 1000 కోట్ల సామ్రాజ్యం సృష్టించిన పేదవాడి సక్సెస్ స్టోరీ..!!
ఇది వరకు మనం చాలా సక్సెస్ స్టోరీలను గురించి తెలుసుకున్నాము. ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి రూ. 1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించిన 'విజయ్ సుబ్రమణియమ్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు 'రాయల్ ఓక్' (Royal Oak) ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్ చేశారు. కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు. బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు. (ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!) విజయ్ సుబ్రమణియమ్ 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్లెట్లో స్టోర్ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది. ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం. -
పాతవి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు
-
కేన్స్లో గర్ల్ఫ్రెండ్తో బెజోస్ గ్రాండ్ ఎంట్రీ.. వారు వచ్చిన బోట్ ఖరీదు తెలుసా?
బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కేన్స్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్తో కలిసి బెజోస్ 500 మిలియన్ డాలర్ల (రూ.4 వేల కోట్లకుపైనే) విలువైన సూపర్యాచ్ (బోట్)లో ఫ్రాన్స్కు దక్షిణాన ఉన్న కేన్స్కు చేరుకున్నారని పేజ్ సిక్స్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ నివేదించింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గ్లోబల్ సెలబ్రిటీలు ఈ రిసార్ట్ టౌన్కి చేరుకుంటున్నారు. కోరు అనే పేరుతో ఉన్న ఈ లగ్జరీ బోట్ను ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్గా చెబుతారు. దీని తయారీని 2018లో ప్రారంభించగా ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే పూర్తి చేశారు. గత ఏప్రిల్లోనే ఇది తన తొలి సముద్రయానం చేసింది. సూపర్యాచ్ ముందు భాగంలో లారెన్ శాంచెజ్ను పోలి ఉండే మత్స్యకన్య బొమ్మ ఉన్నట్లు ఆ మ్యాగజైన్ పేర్కొంది. ఈ సూపర్యాచ్ నిర్వహణ కోసం జెఫ్ బెజోస్కు సంవత్సరానికి 25 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని తెలిసింది. బెజోస్ కోరుతో పాటు తన మరో బోట్ అబియోనాను కూడా కేన్స్కు తీసుకువచ్చారు. కేన్స్లోని డు క్యాప్ ఈడెన్ రోక్ హోటల్లో జరిగిన మ్యాగజైన్ పార్టీలో అలాగే హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఇచ్చిన ప్రైవేట్ మాన్షన్ పార్టీలో బెజోస్ ఆయన గర్ల్ఫ్రెండ్ శాంచెజ్ కనిపించారు. ఇదీ చదవండి: Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా.. రెడ్ కార్పెట్పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్త! -
చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్
AKS Co-Founder and CEO Nidhi Yadav: జీవితంలో ఎదగాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. పది మందికి ఉద్యోగం కల్పించే పని ఏదైనా చేయవచ్చు. ఇలా ఆలోచించే వారి సంఖ్య గతంలో తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం పెరుగుతూనే ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఒకరు 'నిధి యాదవ్' (Nidhi Yadav). ఇంతకీ నిధి యాదవ్ ఎవరు? ఆమె చేస్తున్న బిజినెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. కరణ్ సింగ్ యాదవ్ & రాజ్బాల యాదవ్లకు జన్మించిన నిధి యాదవ్ 2004లో ఇండోర్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఇండోర్లోని జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బిటెక్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగానికి డెలాయిట్లో జాయిన్ అయ్యింది. అయితే ఆమెకు ఉద్యోగం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. కాబట్టి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో ఫ్లోరెన్స్లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సును పూర్తి చేసింది. ఇది పూర్తయిన తరువాత ఇటలీలో ఉద్యోగం వచ్చినా కుటుంబానికి దూరంగా ఉండలేక అది కూడా వద్దనుకుంది. సొంత కంపెనీ ప్రారంభం.. ఆ తరువాత 2014లో రూ. 3.5 లక్షల పెట్టుబడితో AKS పేరుతో కంపెనీ ప్రారంభించింది. ఇందులో సరసమైన ధరలకే అద్భుతమైన దుస్తులను 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారికి విక్రయించడం ప్రారభించింది. కంపెనీ స్థాపించడానికి కొంత సమయం పట్టినప్పటికీ కేవలం ఐదు సంవత్సరాల్లో టర్నోవర్ రూ. 100 కోట్లు (2019-2020 ఆర్థిక సంవత్సరం) దాటింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) నిజానికి ఆమె కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనను తన కుటుంబంతో చెప్పినప్పుడు ఒక్క సారిగా ఆశ్చర్యపోయినప్పటికీ తరువాత మద్దతుగా నిలిచారు. కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న దాదాపు అన్ని బ్రాండ్స్ గురించి ఏకంగా ఆరు నెలలు పరిశోధన చేసింది. సంస్థ మొదలైన మొదటి సంవత్సరమే ఆమె రూ. 1.60 కోట్లు సంపాదించింది. ఆ తరువాత ఏడాదికి అది రూ. 8.50 కోట్లకు చేరింది. 2018 నాటికి కంపెనీ ఆదాయం ఏకంగా 48 కోట్లకు చేరడం విశేషం. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిధి యాదవ్ AKS కంపెనీ ప్రధాన కార్యాలయం గుర్గావ్లో ఉంది. 2021 చివరినాటికి సంస్థ ఆదాయం రూ. 200 కోట్లకు చేరినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. కరోనా సమయంలో కంపెనీ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అలాగే అవకాశాలు కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే మాస్క్లు, పిపిఈ కిట్ల తయారీని మొదలుపెట్టారు. ఆ తరువాత పిల్లలకు కూడా దుస్తులు తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. 2023-2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 500 కోట్లకు పెంచాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. -
లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!
'చదువుకున్న వెంటనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, స్థిరపడాలి' ఇది చదువుకున్న చాలా మంది ఆలోచన. అయితే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు అద్భుతాలు సృష్టించడానికని కొంత మంది నిరూపిస్తున్నారు. ఆలాంటి వ్యక్తిత్వం ఉన్న వారిలో ఒకరు 'అరుషి అగర్వాల్'. ఇంతకీ అరుషి అగర్వాల్ ఎవరు? ఈ సాధించిన ఆ అద్భుతం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఘజియాబాద్లోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, యువ పారిశ్రామిక వేత్తగా.. కేవలం మూడు సంవత్సరాల్లో రూ. 50 కోట్ల కంపెనీ నిర్మించేలా చేసింది. ఇది నిజంగానే గొప్ప అద్భుతం అనే చెప్పాలి. కేవలం మూడేళ్ళలో ఒక అమ్మాయి అనుకున్నది సాధించి సక్సెస్ సాధించింది. నిజానికి అరుషి అగర్వాల్ స్వస్థలం మొరాదాబాద్. ఈమె జెపి ఇన్స్టిట్యూట్ నుంచి బి-టెక్ అండ్ ఎమ్-టెక్ పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీ ఐఐటీలో ఇంటర్న్షిప్ చేసింది. ఈ సమయంలోనే రెండు సార్లు కోటి రూపాయల భారీ జీతం ఆఫర్ పొందింది. అయితే ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. భారీ శాలరీ ప్యాకేజి వద్దనుకుని తానే సొంతంగా కంపెనీ ప్రారంభించాలని TalentDecrypt అనే సంస్థను ప్రారంభించింది. దీని కోసం కోడింగ్ నేర్చుకుంది. అంతే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ పొందని వారికి సహాయం చేయడానికి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. మొత్తానికి అనుకున్న విధంగానే రూ. లక్ష పెట్టుబడితో కంపెనీ మొదలుపెట్టింది. (ఇదీ చదవండి: టీ షర్ట్ రూ. 2 లక్షలు, మొబైల్ కవర్ రూ. 25వేలు.. అన్ని బ్రాండెడ్ వస్తువులే!) కంపెనీ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో ఆమె సాఫ్ట్వేర్ సహాయంతో 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. అంతే కాకూండా వారు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, సింగపూర్, యుఎఇ, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్లోని 380 కంపెనీలకు సహాయం చేశారు. ఈ సాఫ్ట్వేర్ కింద, ఉద్యోగం పొందాలనుకునే వారు హ్యాకథాన్ (Hackathon) ద్వారా వర్చువల్ స్కిల్ టెస్ట్ చేస్తారు. దీని తరువాత నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలలో హాజరు కావచ్చు. (ఇదీ చదవండి: టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుందా? ఇదిగో సాక్ష్యం..!) ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉద్యోగం పొందటానికి వీలు కల్పిస్తుంది. అరుషి అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా భారత ప్రభుత్వంచే పురస్కారం పొందింది. ఆమె తన తాత 'ఓం ప్రకాష్ గుప్తా'ను తన ఆరాధ్యదైవంగా భావిస్తుంది. ఆమె తండ్రి అజయ్ గుప్తా వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. ప్రస్తుతం ఆమె నోయిడా కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. -
21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!
మనం ఇప్పటి వరకు ఎంతో మంది విజయ గాథలను (సక్సెస్ స్టోరీస్) గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 'నిర్మిత్ పారిఖ్' గురించి తెలుసుకుందాం. నిర్మిత్ పారిఖ్ ఎవరు? అయన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.. ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన ఆపిల్ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదులుకుని భారతదేశానికి వచ్చి అతి తక్కువ కాలంలోనే కుబేరుడయ్యాడు. కరోనా మహమ్మారి వ్యాప్తికంటే ముందు స్వదేశానికి వచ్చి ఏదైనా సొంతంగా చేయాలనే పట్టుదలతో జాబ్స్ ప్లాట్ఫామ్ 'అప్నా' (Apna) ప్రారంభించి ఎన్నో కంపెనీలకు మార్గదర్శిగా నిలిచాడు. ఈ యాప్ ప్రారభించిన కేవలం 21 నెలల్లో ధనవంతుల జాబితాలో ఒకడయ్యాడు. నిర్మిత్ పారిఖ్ మొదలు పెట్టిన ఈ జాబ్ ప్లాట్ఫామ్ షాడోఫాక్స్, జొమాటో, ఢిల్లీవేరీ, G4S గ్లోబల్, బర్గర్ కింగ్ వంటి ఎన్నో కంపెనీలు ఉపయోగించుకున్నాయి. టెక్నాలజీలో మార్పు తీసుకురావడమే కాకుండా ఎంతో మందికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ యాప్ అతన్ని కోట్లకు అధిపతిని చేసింది. (ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి.. లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!) నిర్మిత్ పారిఖ్ 2023 మే నాటికి 1.1 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడయ్యాడు. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ. ఒక్క ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది, అతి తక్కువ కాలంలోనే అతని ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. అప్నా యాప్ 10 కోట్లకు పైగా ఇంటర్వ్యూలను, ఒక కోటికి పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది. నిర్మిత్ నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అండ్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఫర్ బిజినెస్ నుంచి MBA చదివారు. ఈయన కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఇన్కోన్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తరువాత అనేక సంస్థలలో ఉన్నతమైన పదవుల్లో పనిచేసి తరువాత ఒక యాప్ ద్వారా గొప్ప సక్సెస్ సాధించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికిఇ సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ప్రపంచంలో అత్యంత సంపన్నుడు.. మరీ ఇంత చవక షర్ట్ ఏంటి?
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు జెఫ్ బెజోస్. ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టవల్కు ఆయన గర్ల్ఫ్రెండ్ లారెన్ శాంచెజ్తోపాటు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన ధరించిన షర్ట్ చర్చనీయాశంగా మారింది. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఏప్రిల్ 21 రాత్రి జరిగిన రాపర్ బాడ్ బన్నీ సంగీత కార్యక్రమానికి బెజోస్ హాజరైనట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇందులో బెజోస్ బ్లూ కలర్ బటర్ఫ్లై ప్రింట్ ఉన్న షర్ట్ను ధరించారు. ఈ వీడియోలో బెజోస్ ధరించిన దుస్తుల వివరాలను నెటిజన్లు తవ్వితీశారు. అమెజాన్లో బెజోస్ ధరించిన షర్ట్ ధర 12 డాలర్లు (సుమారు రూ.980) కంటే తక్కువని తెలుసుకుని షాక్ అయ్యారు. అత్యంత సంపన్నుడు మరీ ఇంత చవకైన చొక్కా ధరించాడేంటని ఆశ్చర్యపోతున్నారు. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్లా? జుకర్బర్గ్ను నిలదీసిన ఉద్యోగులు బెజోస్ ధరించిన షర్ట్ ధర తక్కువే అని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం బెజోస్ ధరించింది డిజైనర్ షర్ట్ అని, అమెజాన్లో ఉన్న తక్కువ ధరకు ఉన్న ఆ షర్ట్లు ఖరీదైన డిజైనర్ బ్రాండ్కు డూప్లికేట్ అని పేర్కొంటున్నారు. Kendall Jenner, Kris Jenner and Jeff Bezos during the second weekend of the Coachella Valley Music & Arts Festival. pic.twitter.com/OaX7ZjgkJz — @21metgala (@21metgala) April 22, 2023 Absolutely love that Bezos went to Coachella and did the same thing I would do - wore a $15 Hawaiian shirt from Amazon.https://t.co/CcQIDK2uGV pic.twitter.com/x8zGzWs5S9 — Sheel Mohnot (@pitdesi) April 24, 2023 -
జీవితంలో ఎదగాలంటే? ఓయో ఫౌండర్ 'రితేశ్ అగర్వాల్' మాటల్లో..
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అన్న మాటలు అక్షర సత్యం. అయితే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా కొంత మంది అనుభవాలు చాలా అవసరం. అవి తప్పకుండా మనిషిలో మంచి స్ఫూర్తిని నింపుతాయి. దీనికి నిదర్శనం మా అమ్మ చెప్పిన మాటలు అంటూ ఓయో సంస్థ సీఈఓ 'రితేశ్ అగర్వాల్' ఇటీవల వెల్లడించారు. ఇటీవల ఐఐటీ నాగ్పూర్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను విద్యార్థులతో పంచుకునే అవకాశం ఇప్పుడు దక్కిందని ''మీరు గొప్పస్థాయికి చేరుకునే క్రమంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించే మార్గంలో మీరు మీ మూలాలు ఎప్పటికీ మర్చిపోవద్దని, జీవితంలో ఎంత పైకి ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మ దగ్గర విన్నానని'' చెప్పాడు. మీరు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారనే సంగతి మర్చిపోకూడదని అన్నారు. జీవితంలో గొప్ప వ్యాపారాలను సాధించాలనే తపనను విడనాడకుండా ఉన్న మాదిరిగానే మీ మూలాలను ఎప్పటికి విడిచిపెట్టకూడదన్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది మీ మాటలతో ఏకీభవిస్తున్నామని.. మీ కథ అందరికీ ఆదర్శమని కామెంట్స్ పెటుతున్నారు. (ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె) సుమారు రూ. 7,253 కోట్లకు అధిపతి అయిన ఓయో ఫౌండర్ రితేశ్ ఒడిశాలోని రాయ్గఢ్లో జన్మించాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే హోటల్ వసతి కల్పించే ఓయో రూమ్స్ ప్రారభించి అతి తక్కువ కాలంలోనే విజయవంతమయ్యాడు. ప్రస్తుతం 'ఓయో'కున్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “Jo ped sabse bade hote hain, woh sabse zyada jhuke huye hote hain.” (The more successful you become in life, the more rooted you should be.) I recently got the opportunity to share some of my stories, experiences and lessons with the amazing students of @IIMNagpurIndia. This… pic.twitter.com/Dhs6BsD5Y7 — Ritesh Agarwal (@riteshagar) April 18, 2023 తక్కువ వ్యవధిలోనే భారతదేశంలో బిలియనీర్గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రితేశ్ అగర్వాల్ ఓయో సంస్థను 800 నరగరాలకు పైగా విస్తరించాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆయన ఈ సంస్థను ఇతర దేశాలలో కూడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు. -
స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం
సాక్షి, ముంబై: భారత్పే వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా మాజీ ఇన్వెస్టర్అష్నీర్ గ్రోవర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అశోక్ గ్రోవర్ (69)బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అష్నీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన తండ్రికి వీడ్కోలు పలుకుతూ ‘‘బై పాపా.. లవ్ యూ...నాన్నను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యులు (తాతయ్య నానమ్మ, పెద్దమ్మ) ను కోరుతూ ఇన్స్టాలో ఒక ఫోటో షేర్ చేశారు. (ఇదీ చదవండి: ‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్ లవర్ ఫిర్యాదు వైరల్) అశోక్ గ్రోవర్ కన్నుమూతపైకమెడియన్ సునీల్ గ్రోవర్ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు. ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసిన అశోక్కు కుమారుడు అష్నీర్తోపాటు కూతురు ఆషిమా ఉన్నారు. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) View this post on Instagram A post shared by Ashneer Grover (@ashneer.grover) -
డాక్టర్ అంజిరెడ్డి తొలి స్మారకోపన్యాసం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) తమ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. అంజిరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా తొలి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత .. ఇజ్రాయెల్కు చెందిన ప్రొఫెసర్ అడా ఇ. యోనత్, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు కె. విజయ రాఘవన్, ఇగ్నైట్ లైఫ్ సైన్స్ ఫౌండేషన్ సీఈవో స్వామి సుబ్రమణియన్, కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఎండీ గురు ఎన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఔషధాలను చౌకగా అందుబాటులోకి తేవాలన్నది అంజి రెడ్డి విజన్ అని డాక్టర్ రెడ్డీస్ సహ చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. శాస్త్రీయ, సామాజిక అంశాలపై పెద్ద స్థాయిలో చర్చలు జరగడం అంజి రెడ్డికి నిజమైన నివాళి కాగలదని కంపెనీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. తదుపరి తరం యాంటీబయోటిక్స్ రూపకల్పనలో తన పరిశోధనలు ఏ విధంగా తోడ్పడగలవన్నది యోనత్ ఈ సందర్భంగా వివరించారు. -
నిన్నగాక మొన్న పెళ్లి: ఓయో ఫౌండర్ ఇంట తీవ్ర విషాదం
న్యూఢిల్లీ: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిన్నగాక మొన్న రితేష్ అగర్వాల్ వివాహం వైభవంగా జరిగింది. కుటుంబమంతా ఈ సంతోషంలో ఉండగానే రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ దుర్మరణం విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్తను రితేష్ స్వయంగా వెల్లడించారు. “మా కుటుంబం, నేను బరువైన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. మా తండ్రి రమేష్ అగర్వాల్ (మార్చి 10 శుక్రవారం) మరణించారు. నిండైన జీవితాన్ని గడిపిన ఆయన నాతోపాటు మనలో చాలామందికి స్ఫూర్తి. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన స్ఫూర్తి ఎల్లపుడూ మా వెన్నంటే ఉంటుంది. ఈ దుఃఖ సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం’’ అంటూ రితేష్ అగర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఎత్తైన భవనంపై నుండి రమేష్ పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్లోని సెక్టార్ 54లో DLF ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్తు నుండి పడిపోయారని సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అంచారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పోస్ట్మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రితేష్ అగర్వాల్ ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్షా సూద్ను న్యూఢిల్లీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చిన రిసెప్షన్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషి సన్తో సహా పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. -
‘రస్నా’ ఫౌండర్ కన్నుమూత, ‘మిస్ యూ’ అంటున్న అభిమానులు
సాక్షి, ముంబై: గ్లోబల్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన దేశీయ శీతల పానీయం ‘రస్నా’ వ్యవస్థాపకుడు అరిజ్ పిరోజ్షా ఖంబట్టా కన్నుమూశారు. 85 సంవత్సరాల వయస్సులో శనివారం మరణించినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో అహ్మదాబాద్లో మరణించినట్లు ప్రకటించింది. అరిజ్ ఖంబట్టా బెనివలెంట్ ట్రస్ట్, రస్నా ఫౌండేషన్కు ఛైర్మన్గా కూడా ఉన్నారు. పలువురు వ్యాపార దిగ్గజాలు ఖంబట్టా మృతిపై సంతాపం ప్రకటించారు.ఐకానిక్ డ్రింక్ను ప్రపంచానికి పరిచయం చేసిన మిమ్మల్ని మరువలేం.. మిస్ యూ సార్ అంటూ అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. 1980-90లలో ఏ నోట విన్నా ‘ఐ లవ్ యూ రస్నా’ అన్న మాట వినబడేది. ఫంక్షన్ ఏదైనా, సందర్భంగా ఏదైనా రస్నా నాలేని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. మ్యాంగో, ఆరెంజ్, నింబూ ఇలా పలు ఫ్లేవర్లలో ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో పాపులర్ అయిన డ్రింక్ రస్నా మార్కెట్ లీడర్గా ఉంది. 1970 లలో అధిక ధరలకు విక్రయించే శీతల పానీయాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా రస్నా బహుళ ప్రజాదరణ పొందింది. దేశంలోని 18 లక్షల రిటైల్ ఔట్లెట్లలో సామాన్యులకు సైతం అందుబాటులో ధరలో పాపులర్ బ్రాండ్గా నిలిచింది. అరిజ్ కు భార్య పెర్సిస్ , పిల్లలు పిరుజ్, డెల్నా రుజాన్, కోడలు బినైషా , మనవళ్లు అర్జీన్, అర్జాద్, అవన్, అరీజ్, ఫిరోజా, అర్నావాజ్ ఉన్నారు. దశాబ్దాల క్రితం అరిజ్ తండ్రి ఫిరోజా ఖంబట్టా నిరాడంబరమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. దీని వ్యవస్థాపక ఛైర్మన్ అరీజ్నేతృత్వంలో రస్నా ది ఇంటర్నేషనల్ టేస్ట్ అండ్ క్వాలిటీ ఇన్స్టిట్యూట్, బెల్జియం కేన్స్ లయన్స్ లండన్, మోండే సెలక్షన్ అవార్డు, మాస్టర్ బ్రాండ్ ది వరల్డ్ బ్రాండ్ కాంగ్రెస్ అవార్డు, ITQI సుపీరియర్ టేస్ట్ అండ్ క్వాలిటీ అవార్డుతో సహా ప్రతిష్టాత్మకమైన సుపీరియర్ టేస్ట్ అవార్డ్ 2008తో సహా పలు అవార్డులను గెలుచుకుంది. -
Taliban: ఎట్టకేలకు ఆ సమాధి వెలుగులోకి!
ముల్లా ఒమర్.. ప్రపంచం మొత్తం చర్చించుకున్న.. చర్చిస్తున్న ఇస్లామిక్ రెబల్ గ్రూప్ ‘తాలిబన్’ అలియాస్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ వ్యవస్థాపకుడు. అయితే.. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల మోహరింపు తర్వాత ఆయన ఏమయ్యాడనే మిస్టరీ చాలా ఏళ్లు ఒక ప్రశ్నగా ఉండిపోయింది. చివరికి ఆయన సమాధి తొమ్మిదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. తాలిబన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ముల్లా ఒమర్.. 2001 దాకా ఆ సంస్థకు ఎమిర్(అధినేత)గా వ్యవహరించారు. అయితే అదే ఏడాది అఫ్గన్లో అమెరికా-నాటో దళాల మోహరింపు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2013 ఏప్రిల్లో ఆయన అనారోగ్యం పాలై మరణించినట్లు.. రెండేళ్ల తర్వాత తాలిబన్ సంస్థ ప్రకటించింది. అయితే ఆయన్ని ఎక్కడ ఖననం చేశారు? ఆ సమాధి ఎక్కడుందనే విషయాలపై తాలిబన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా పోయింది. ఈ తరుణంలో.. జబుల్ ప్రావిన్స్లోని సూరి జిల్లా దగ్గర ఒమర్జోలో ఆయన్ని ఖననం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యే ఆయన సమాధి వద్ద ఓ కార్యక్రమం నిర్వహించగా.. ఆదివారం తాలిబన్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని అధికారికంగా వెల్డించారు. సమాధిని ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో.. ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తాలిబన్ గ్రూప్. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకపోవడంతో విషయాన్ని బయటికి వెల్లడించారు. కాందహార్లో పుట్టి పెరిగిన ఒమర్.. ఉన్నత చదువులతో అపర మేధావిగా గుర్తింపు పొందాడు. అయితే.. 1993లో అఫ్గనిస్థాన్ అంతర్యుద్ధం కారణంగా తాలిబన్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు. తనను తాను స్వాతంత్ర సమరయోధుడిగా ప్రకటించుకున్న ఒమర్.. పాశ్చాత్య దేశాల తీరుపై విరుచుకుపడుతూ ఉండేవాడు. ఆయన హయాంలోనే తీవ్రవాద సంస్థగా ఎదిగిన తాలిబన్.. మహిళలపై కఠిన ఆంక్షలతో నరకరం చూపించింది. -
Ela Bhatt: పద్మభూషణ్ ఇలా భట్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, గాంధేయవాది ఇలా భట్( 89) ఇక లేరు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం గుజరాత్ అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. 1933లో జన్మించిన ఇలా భట్.. సూరత్లోని సర్వజనిక్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఎంటీబీ ఆర్ట్స్ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 1955లో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ (TLA) అని పిలువబడే టెక్స్టైల్ కార్మికుల పూర్వ యూనియన్లో న్యాయ విభాగంలో చేరారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (SEWA) వ్యవస్థాపకురాలిగా ఇలా భట్ పేరొందారు. అంతేకాదు.. మహిళల ఆర్థిక సంక్షేమం కోసం మొట్టమొదటి మహిళా బ్యాంకును సైతం ఆమె ఏర్పాటు చేశారు. 1977లో కమ్యూనిటీ లీడర్ షిప్ కేటగిరీ కింద.. ఆమె రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. అంతేకాదు.. 1979లో ఏర్పాటైన మహిళల ప్రపంచ బ్యాంకుకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆపై దానికి ఆమె చైర్పర్సన్గానూ వ్యవహరించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 1985లో పద్మశ్రీ, ఆ మరుసటి ఏడాదికే పద్మ భూషణ్ ప్రకటించింది భారత ప్రభుత్వం. 2011లో గాంధీ శాంతి బహుమతి సైతం ఆమె అందుకున్నారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు సలహాదారుగా పని చేశారు. గాంధీజీ ప్రేరణతో, భట్ సేవా (SEWA)ను స్థాపించారు. రాజ్యసభ సభ్యురాలిగానూ ఆమె 1989 వరకు పనిచేశారు. 2007లో ఆమె మానవ హక్కులు, శాంతిని పెంపొందించడానికి నెల్సన్ మండేలా స్థాపించిన ఎల్డర్స్ అనే గ్రూప్లో చేరారు. కాగా, ఇలా భట్ మృతిపట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Saddened by the demise of noted activist and Padma Bhushan awardee, Smt. Ela Bhatt. She devoted her life to Gandhian ideals and transformed the lives of millions of women, by empowering them. My heartfelt condolences to her near & dear ones, and her many admirers. — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2022 -
రెడ్బుల్ కో- ఫౌండర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ రెడ్ బుల్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్, డైట్రిచ్ మాటెస్చిట్జ్ (78) కన్నుమూశారు. రెడ్ బుల్ ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ వ్యవస్థాపకుడు కూడా అయిన డైట్రిచ్ మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. రెడ్ బుల్ పశ్చిమ దేశాల్లో సైతం సక్సెస్ఫుల్ బ్రాండ్గా నిలపడలో చాలా కృషి చేశారు. ఆస్ట్రియన్ పారిశ్రామికవేత్త డైట్రిచ్ ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ యజమానిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ డ్రింక్ రెడ్బల్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా, మోటార్ స్పోర్ట్స్, మీడియా, రియల్ ఎస్టేట్, గ్యాస్ట్రోనమీ రంగాలకు విస్తరించారు. ఫుట్బాల్ క్లబ్లు, హాకీ, రేసింగ్ జట్లను నిర్వహిస్తోంది రెడ్బుల్. ముఖ్యంగా.ఎయిర్ అక్రోబాటిక్స్ క్లిఫ్ డైవింగ్ వంటి ఈవెంట్లను స్పాన్సర్ చేస్తుంది రెడ్బుల్. రెడ్ బుల్ ఫార్ములా వన్ జట్టు హెడ్ క్రిస్టియన్ హార్నర్ డైట్రిచ్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. రెండు వారాల క్రితం జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ను గెలుచుకుని వెర్స్టాపెన్ వరుసగా రెండో టైటిల్ను సాధించేవరకు మాటెస్చిట్జ్ జీవించి ఉండటం అదృష్టమన్నారు. అన్నివిషయాల్లోనూ తమకు ఆయన ఎన్నెముకలా నిలిచారని పేర్కొన్నారు. ఫార్ములా వన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానో డొమెనికాలి ఫార్ములా వన్ కుటుంబంలో అత్యంత గౌరవనీయమైన , అత్యంత ప్రీతిపాత్రమైన సభ్యుడుగా అభివర్ణించారు. కాగా పానీయాల డెవలపర్ థాయ్ వ్యాపారవేత్త చాలీయో యోవిధ్య మరో ఇద్దరితో కలిసి 1984లో రెడ్ బుల్ని స్థాపించారు. గ్లోబల్గా సూపర్ క్రేజ్ పొందిన రెడ్ బుల్ గత ఏడాది 172 దేశాల్లో ఏకంగా 100 కోట్ల క్యాన్లను విక్రయించడం విశేషం. దీంతో 2022లో 27.4 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ ఆస్ట్రియా అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు డైట్రిచ్. -
గూగుల్, ఆపిల్ కంపెనీలపై మండిపడ్డ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు..!
ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్ఓ ‘పెగాసస్’ స్పైవేర్తో ప్రముఖ జర్నలిస్టులు, పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షనేతలు, మరి కొందరిపై గూఢాచర్యం చేస్తున్నట్లు వార్త కథనాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేశాయి. తాజాగా పెగాసస్ వ్యవహారంపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్పందించాడు. 2011 నుంచి రష్యాలో ఉన్నప్పటీ నుంచి నిఘా నీడలో బతకడం అలవాటు చేసుకున్నానని పేర్కొన్నారు. పెగాసస్ స్పైవేర్తో 2018 నుంచి తనపై గూఢాచర్యం నిర్వహిస్తుందని వెల్లడించాడు. తనపై గూఢచర్యం నిర్వహిస్తున్నారనే వార్త తనను పెద్దగా ఆశ్చర్యపర్చలేదని దురోవ్ పేర్కొన్నాడు. తాజాగా గూగుల్, ఆపిల్ దిగ్గజ ఐటీ కంపెనీల ద్వంద్వ వైఖరిపై పావెల్ దురోవ్ మండిపడ్డారు. గూగుల్, ఆపిల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెటును కల్గి ఉందని పేర్కొన్నాడు. ఈ కంపెనీలు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలకు, ఇతర నియంత్రణ సంస్థలపై మోకారిల్లుతాయని పేర్కొన్నారు. పలు యూజర్ల డేటాను ఈ కంపెనీలు బ్యాక్డోర్ ద్వారా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థల చేతిలో ఉంచుతాయని తెలిపారు. దీంతో యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాక్డోర్ ద్వారా యూజర్ల డేటాను ప్రభుత్వాలు , నియంత్రణ సంస్థలకు అందించే సమయంలో థర్డ్ పార్టీ సంస్థలు యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి పెగాసస్ స్పైవేర్ చక్కని ఉదాహరణ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు కేవలం రెండు రకాల ప్లాట్ఫాంలు అందుబాటులో ఉండడంతో తప్పని సరిగా గూగుల్, ఆపిల్ కంపెనీలపై యూజర్లు ఆధారపడవలసి వస్తోందని పేర్కొన్నారు. గూగుల్, ఆపిల్ కంపెనీలకు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్లను ఉపయోగించకుండా మరిన్ని వోఎస్లు ఉన్న పోటీ వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు. దురోవ్ పావెల్ గతంలో గూగుల్, ఆపిల్ కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అన్ని డిజిటల్ వస్తువులపై గూగుల్, ఆపిల్ కంపెనీలు 30 శాతం పైగా సేల్స్ టాక్స్ను విధించినందుకు తప్పుబట్టారు. -
జొమాటో ఐపీవో షురూ, ఫౌండర్ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఐపీవో ప్రారంభం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్వీట్ వైరల్గా మారింది. ఐపీవో ఒత్తిడిలో మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశానంటూ గోయల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన పలువురు పరిశ్రమ పెద్దలు గోయల్కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "జొమాటోలో ట్రిపుల్ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశా.. స్ట్రెస్ ఈటింగ్’’ అంటూ గోయల్ ట్వీట్ చేశారు. దీనిపై మరో వ్యాపారవేత్త, ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. సూపర్ లిస్టింగ్ మేన్.. శుభాకాంక్షలు దీపి అంటూ ఆయన ట్వీట్ చేశారు. పేటీఎం కూడా త్వరలోనే ఐపీవోకు రానుంది. అలాగే గోయల్కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ కామ్వివా మొబైల్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా జసుజా , ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సీఈఓ రాధిక గుప్తా ట్వీట్ చేశారు. దీంతోపాటు నా క్కూడా ధక్ ధక్ మంటోంది అంటూ జొమాటో అధికార ట్విటర్ ఖాతా కూడా ట్వీట్ చేయడం విశేషం. కాగా దేశంలో ఒక ఫుడ్ టెక్ కంపెనీ ఐపీవోకు రావడం ఇదే తొలిసారి. రూ. 9,375 కోట్ల సేకరించే లక్క్ష్యంతో పప్రారంభమైన జొమాటో ఐపీవో ఈనెల 16న ముగియనుంది. జొమాటో ఇష్యూ ప్రైస్బాండ్ ఒక్కో షేరుకు రూ.72-76గా కంపెనీ నిర్ణయించింది. సుమారు186 యాంకర్ పెట్టుబడిదారుల నుండి, ఇప్పటికే 4,196.51 కోట్ల రూపాయలను జొమాటో సేకరించిన సంగతి తెలిసిందే. Feeling better after the breakfast and all the love. Topping up the breakfast with chai from @Chaayos ❤️ pic.twitter.com/U9025BexVC — Deepinder Goyal (@deepigoyal) July 14, 2021 😬 — Deepinder Goyal (@deepigoyal) July 14, 2021 Make it large Deepi ! Best wishes for superb listing. Rooting for you man 🚀🚀#ZomatoIPO https://t.co/ip11uQe6Ic — Vijay Shekhar Sharma (@vijayshekhar) July 14, 2021 -
ప్రముఖ విద్యావేత్త గ్రేగరి రెడ్డి కన్నుమూత
హిమాయత్నగర్ (హైదరాబాద్): సెయింట్ ఆంథోనీస్, సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఉడుముల గ్రేగరి రెడ్డి(88) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా చికిత్స పొందుతూ దోమలగూడలోని ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గ్రేగరి రెడ్డికి భార్య, 9 మంది పిల్లలు ఉన్నారు. భార్య ఇటీవలే చనిపోయారు. గ్రేగరి రెడ్డి 1971వ సంవత్సరంలో సెయింట్ ఆంథోనీస్ పేరుతో కింగ్కోఠిలో స్కూల్ను స్థాపించారు. ఆ తర్వాత పదేళ్లకు 1981లో ఇదే ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో హబ్సిగూడ, అస్మన్ఘట్ ప్రాంతాల్లో సెయిం ట్ జోసెఫ్ పేరుతో మరో రెండు స్కూల్స్ను ప్రారంభించారు. ఐసీఎస్సీ బోర్డు మెంబర్గా గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తూ ఇంగ్లిష్ మీడియంలో సమూలమైన మార్పుల కోసం ఆయన కృషి చేశారు. గ్రేగరి రెడ్డి భౌతిక కాయాన్ని బంధువులు, స్నేహితుల సందర్శన కోసం గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కింగ్కోఠి సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఉంచనున్నారు. అనంతరం 3 గంటలకు నారాయణగూడ సిమెంట్రీలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
విషాదం.. జైల్లోనే ‘మెక్అఫీ’ ఆత్మహత్య!
మరో మేధావి జీవితం విషాదంగా ముగిసింది. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలో పన్నుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మెక్అఫీ.. కిందటి ఏడాది అక్టోబర్ నుంచిస్పెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం ఆయన తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బార్సిలోనా: డెబ్భై ఐదేళ్ల మెక్అఫీ.. అమెరికన్ టెక్నాలజీ ఎంట్రెప్రెన్యూర్గా పేరుగాంచాడు. 80వ దశకంలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మెక్ అఫీని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడాయన. అయితే టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.ఈ ఆరోపణల కేసులో అమెరికా నుంచి పారిపోయిన ఆయన్ని.. కిందటి ఏడాది అక్టోబర్లో స్పెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి బార్సిలోనా జైలుకి తరలించారు. ఇక పన్నుల ఎగవేత ఆరోపణల కేసులో మెక్అఫీని అమెరికాకు అప్పగించే స్పెయిన్ కోర్టు బుధవారం నాడే కీలక తీర్పు వెలువరించింది. ఆయన్ని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ పోలీసులను ఆదేశించింది. ఈ తరుణంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ‘అప్పీల్కు వెళ్లే అవకాశం ఉన్నా.. జైల్లో మగ్గేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. సొసైటీ ఆయన మీద పగ పట్టింది’ అని ఆయన తరపు లాయర్ జవెయిర్ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడాడు. 2011లో తన కంపెనీని ఇంటెల్కు అమ్మిన మెక్అఫీ.. ఆ తర్వాత వ్యాపారాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ వచ్చాడు. లోగడ తాను 48 మంది పిల్లలకు తండ్రి చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పన్నులు కట్టలేనని చెబుతూ.. కొన్ని ఏళ్లపాటు పన్నులు చెల్లించలేదు. ఒకానొక టైంలో క్యూబా సాయంతో అమెరికా అధ్యక్ష బరిలో పోటీ చేయాలనుకున్నా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక మేధావి జీవితం ఇలా విషాదంగా ముగియడంపై ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. చదవండి: ఒకప్పుడు విజేత.. ఇప్పుడు అవమానంతో వీడ్కోలు -
ఐపీఓ... వాటాదారుల అనుమతి బాటలో పేటీఎం
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న పేటీఎం తాజా ఈక్విటీ జారీకి వచ్చే నెలలో వాటాదారుల అనుమతిని కోరనుంది. తద్వారా రూ. 12,000 కోట్ల సమీకరణకు గ్రీన్సిగ్నల్ను పొందాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సర్వీసుల సంస్థ జులై 12న అసాధారణ సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈజీఎంలో భాగంగా విజయ్ శేఖర్కున్న ప్రమోటర్ గుర్తింపు రద్దు అంశాన్ని సైతం చేపట్టనుంది. శేఖర్ పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారు సంస్థలు సైతం ఐపీవోలో ఈక్విటీని విక్రయించేందుకు అనుమతిని కోరనున్నట్లు పేటీఎం తెలియజేసింది. పేటీఎంలో 29.71 శాతం వాటాతో యాంట్ గ్రూప్(అలీబాబా) అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ బాటలో సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ రూ. 19.63 శాతం, సైఫ్ పార్టనర్స్ 18.56 శాతం, విజయ్ శేఖర్ శర్మ 14.67% చొప్పున వాటాలు కలిగి ఉంది. -
అన్నమాచార్య ప్రాజెక్ట్ రూపకర్త కన్నుమూత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక సంచాలకులు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు, అన్నమాచార్య కీర్తనలపై విశేష పరిశోధనలు చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు తొలి సంచాలకులుగా కామిశెట్టి పని చేశారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ తొలి డైరెక్టర్గా కూడా కామిశెట్టి సేవలంధించారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో శ్రీ వెంకటేశ్వర పంచరత్న మాలికను కామిశెట్టి శ్రీనివాసులు రూపొందించారు. మరోవైపు అమెరికాలో అన్నమయ్య కీర్తనలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో కామిశెట్టి శ్రీనివాసులు ఎంతో కృషి చేశారు. -
ఎక్స్చేంజ్ ఫౌండర్ కన్నుమూత : వందల కోట్లు గోవిందా?
కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్ గెరాల్డ్ కాటన్ ఆకస్మిక మరణం లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫాంసంబంధించిన పాస్వర్డ్లు, రికవరీ కీ తదితర ముఖ్యమైన సమాచారం కేవలం గెరాల్డ్కు మాత్రమే య తెలుసు. కానీ గత ఏడాది డిసెంబరులో ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. పాస్వర్డ్, రికవరీ కీ మరెవ్వరికీ తెలియకపోవడంతో, దాదాపు 187 మిలియన్ల కెనడా డాలర్లు( రూ.982 కోట్లు) ఫ్రీజ్ అయిపోయాయి. దీనికి ఈ గండంనుంచి గట్టెక్కేందుకు టెక్ నిపుణులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో సంస్థలో ఇతర అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు గెరాల్డ్ ఎలా చనిపోయాడు? నిజంగా చనిపోయాడా లేదా కంపెనీ మోసం చేస్తోందా లాంటి పలు అనుమానాలు, ప్రశ్నలతో ఆన్లైన్ దుమారం రేగింది. అంతేకాదు గెరాల్డ్ భార్య జెన్నిఫర్ రాబర్ట్సన్కు వేధింపులు, బెదిరింపులు తీవ్ర మయ్యాయి. దీంతో వీటిని నుంచి తనకూ, కంపెనీకి రక్షణ కల్పించాల్సిందిగా ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో బిట్కాయిన్, లైట్కాయిన్, ఎథిరియం లాంటి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫాం క్వాడ్రిగా సీఎక్స్ ఎక్స్చేంజ్కు నోవా స్కోటియా ఉన్నత న్యాయస్థానం దివాలా రక్షణను మంజూరు చేసింది. ఈ వేదికపై కరెన్సీ ట్రేడింగ్ కూడా నిలిపివేసింది. కేవలం అతనికి మాత్రమే తెలిసిన పాస్వర్డ్లు ఎక్కడా రాసిపెట్టలేదని, దీంతో వాటిని కనుక్కోవడం చాలా కష్టంగా మారిందంటూ కంపెనీ తరపున జెన్నిఫర్ రాబర్ట్సన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే గెరాల్డ్ సెల్ ఫోన్లు, ఇతర కంప్యూటర్లలోని సమాచారం కోసం సంబంధిత ఎన్క్రిప్షన్లను ఛేదించడానికి నిపుణులతో ప్రయత్నిస్తున్నామనీ, కానీ ఫలితం లభించలేదన్నారు. క్వాడ్రిగాలో 363,000 యూజర్లు నమోదుగాకా, సుమారు లక్షా పదిహేను వేల మందియూజర్లకు 250 మిలియన్ల కెనడా డాలర్లు రుణపడి ఉన్నామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాబర్ట్సన్ పేర్కొన్నారు. అటు ఇన్వెస్టర్లు కూడా ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధ పడుతున్నారు. కాగా ఇండియాలో ఒక అనాధాశ్రయానికి సేవలందిస్తున్న క్రమంలో గెరాల్డ్ కాటన్ డిసంబరు 9న చనిపోయారని జనవరి 14న సోషల్ మీడియా ద్వారా కంపెనీ ప్రకటించింది. -
ప్రాక్టీస్ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్! ఇదో నానుడే కాదు. వ్యాపార సూత్రం కూడా. ఇంటర్వ్యూబడ్డీ చేసేదిదే!!. దేశ, విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల వైస్ ప్రెసిడెంట్స్, హెచ్ఆర్ ప్రతినిధులతో పాటూ రిటైర్డ్ ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకుంది. మన దేశంతో పాటూ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో మాక్ ఇంటర్వ్యూ సేవలందిస్తున్న ఇంటర్వ్యూ బడ్డీ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ ఉజ్వల్ సూరంపల్లి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది విశాఖపట్నం. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తయ్యాక.. జర్మనీలో మాస్టర్స్ కోసం వెళ్లా. చదువుకుంటూ జాబ్స్ కోసం ప్రయత్నించా. ప్రాక్టీస్ లేకపోవటంతో ఒకటిరెండు ఇంటర్వ్యూల్లో ఫెయిలయ్యా. అప్పుడే అనిపించింది. క్రీడలకు ఉన్నట్టే ఇంటర్వ్యూలకూ ప్రత్యక్షంగా ప్రాక్టీస్ ఉంటే బాగుండునని. అంతే! చదువును మధ్యలోనే ఆపేసి.. విశాఖపట్నం కేంద్రంగా జూలై 2017లో ఇంటర్వ్యూబడ్డీ.ఇన్ను ప్రారంభించాం. విద్యార్థులు, కంపెనీలకూ ఇంటర్వ్యూలు.. విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికలతో అకౌంట్ను నమోదు చేసుకున్నాక.. హెచ్ఆర్, టెక్నికల్, స్పెషలైజేషన్ విభాగాల్లో కావాల్సిన ఆప్షన్ను ఎంచుకుంటే చాలు ఇంటర్వ్యూ మొదలువుతుంది. ఇంటర్వ్యూబడ్డీతో ప్రెషర్స్కు ఇంటర్వ్యూలంటే ఉండే తొందరపాటు, ఒత్తిడి తగ్గుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రొఫైల్ ప్రిపరేషన్, వెబ్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూ వీడియోలతో పాటూ నైపుణ్య ప్రదర్శన, బలహీనతలతో కూడిన సమగ్ర నివేదికను అందిస్తాం. ఒక్క సెషన్ ప్రారంభ ధర రూ.1,099. ఇటీవలే కంపెనీల కోసం ప్రత్యేకంగా ‘ఇంటర్వ్యూ బడ్డీ వైట్ లేబుల్’ అనే వేదికను ప్రారంభించాం. ఇది.. కంపెనీలకు ఇంటర్వ్యూలను, అభ్యర్థుల జాబితా సేవలను అందిస్తుంది. ప్రస్తుతం అప్రాటిక్స్ వంటి మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే మరో 5 కంపెనీలను జోడించనున్నాం. అమెరికా, బ్రెజిల్లోనూ యూజర్లు.. 15 వేల మంది రిజిస్టర్ యూజర్లున్నారు. మన దేశంతో పాటూ అమెరికా, మెక్సికో, అర్జెంటీనా నుంచి కూడా యూజర్లున్నారు. ఇప్పటివరకు 5 వేల ఇంటర్వ్యూలను నిర్వహించాం. ప్రస్తుతం నెలకు 200 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఐటీ, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి అన్ని రంగాల్లో మాక్ ఇంటర్వ్యూలుంటాయి. ఆయా రంగాల్లో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న ఇండియా, అమెరికాలకు చెందిన 220 మంది ఇంటర్వ్యూ ప్యానెలిస్ట్లతో ఒప్పందం చేసుకున్నాం. వీరికి ప్రతి ఇంటర్వ్యూ మీద 25–75 శాతం వరకు కమీషన్ ఉంటుంది. వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం గతేడాది రూ.30 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఐదేళ్లలో 20 కోట్ల ఆదాయాన్ని, 15 లక్షల ఇంటర్వ్యూలను లకి‡్ష్యంచాం. జనవరి నుంచి ఉత్తర అమెరికాలో సేవలను ప్రారంభిస్తాం. స్థానికంగా ఉన్న పలు వర్సిటీల్లోని విద్యార్థులకు ప్రాక్టీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. మన దేశంలోని ఐఐటీ–రూర్కీ, ఎఫ్ఎంఎస్–ఢిల్లీ, ఐఐఎం–రూటక్, ఢిల్లీ–అంబేడ్కర్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రూ.15 కోట్ల నిధుల సమీకరణ ప్రస్తుతం 9 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే వైజాగ్కు చెందిన ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఆల్కోవ్ పార్టనర్స్ రూ.75 లక్షల పెట్టుబడి పెట్టింది. జనవరిలో సీడ్ ఫండింగ్లో భాగంగా యూపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఫిన్ల్యాండ్కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని ఉజ్వల్ వివరించారు. -
ఇంతకన్నా ఎవరైనా ఉంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిమ్స్... అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏఐఐఎంఎస్) ఆస్పత్రి. ధనవంతులకు, పేదవాళ్లకు ఎలాంటి తారతమ్యం లేకుండా సకల వైద్య సేవలు అందించే సంస్థ. ముఖ్యంగా ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించే ఆర్థిక స్థోమతలేని పేదల పాలిట కల్పవల్లి. 1956లో ఢిల్లీలో ఏర్పాటైన ఎయిమ్స్ 2012లో మొదటి సారి విస్తరించి దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఎయిమ్స్ ఆస్పత్రిని స్థాపించిన మహా వ్యక్తి, ఓ మహిళా శక్తి గురించి మనం కాల గమనంలో మర్చిపోయాం. ఆమెనే కపూర్తలా యువరాణి అమత్ కౌర్. మహారాజా కుటుంబానికి చెందిన యువరాణి అవడం వల్ల కోటలో ఉండే కోట్ల రాసుల్లో కొన్ని రాసులను కుమ్మరించి ఎయిమ్స్ ఆస్పత్రిని స్థాపించి ఉంటారులే అనుకుంటే పొరపాటే. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తికాగానే విదేశీ పాలకుల నుంచి భారత్ విముక్తి కోసం జాతీయ ఉద్యమంలో చేరి వీరోచిత పోరాటం సాగించిన మహిళామణి ఆమె. రాజకుటుంబ వారసత్వాన్ని వదులుకొని చివరి వరకు నిరాడంబరంగా జీవించడమే కాకుండా, పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేశం కోసం, మహళల హక్కుల కోసం, వారి సాధికారికత కోసం ధారపోసిన ధీరవనిత ఆమె. ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్లూహెచ్ఓ) పాలనా వ్యవహారాలు చూసే వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి అధ్యక్షులుగా (1950లో) ఆసియా ఖండం నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి, తొలి మహిళగా ఆమె రికార్డు సష్టించారు. భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో పనిచేసిన దేశ తొలి ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఆమెనే. ఆమె 1945లో లండన్లో జరిగిన యునెస్కో కాన్ఫరెన్స్కు భారత అధికారిక ప్రతినిధిగా హాజరయ్యారు. 1926లోనే ఆమె ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసమే కాకుండా బాల్య వివాహాలు, మహిళలను దాచేసే పరధా సంస్కతి, దేవదాసీల విధానానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం జరిపారు. ఆమె పోరాటం కారణంగానే భారత ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 14 నుంచి 18 ఏళ్లకు పెంచింది. మహిళల విద్యాభివద్ధి కోసం ఆమె ‘అఖిల బారత మహిళా విద్యా నిధి సంఘం’ను కూడా ఏర్పాటు చేశారు. బహు భార్యత్వం లాంటి మత సంప్రదాయాలకు వ్యతిరేకంగా కూడా పోరాడారు. ఆమె చిన్నతనంలోనే హాకీ, క్రికెట్ టీమ్లకు కెప్టెన్గా పనిచేశారు. పాటియాలలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. అమత్ కౌర్ 1889, ఫిబ్రవరి 2వ తేదీన కపుర్తలా రాజకుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రాజా హర్నామ్ సింగ్. ఆయన అప్పటి కపుర్తలా రాజుకు స్వయాన తమ్ముడు. ఒకప్పుడు స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న కపుర్తలా ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో కలిసింది. కౌర్ తండ్రికి ఏడుగురు సంతానం కాగా, ఒక్కరే అమ్మాయి. అమత్ కౌర్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా లక్నోలోనే సాగింది. మాధ్యమిక విద్యాభ్యాసం ఇంగ్లండ్లోని డోర్సెట్లో ‘షెర్బోర్న్ స్కూల్ ఫర్ గర్ల్స్’లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో పూర్తి చేశారు. 1918లో మాతదేశానికి తిరిగొచ్చారు. అదే సమయంలో అమత్సర్లో భారత పౌరులకు, బ్రిటీష్ సైనికులకు మధ్య వీధి పోరాటాలు జరగడంతో పంజాబ్ ప్రజలంతా బ్రిటీష్ పాలకులపై ఆగ్రహోదగ్రులై ఉన్నారు. వారిని అణచివేయడం కోసం బ్రిటీష్ పాలకులు రోలాట్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత 1919, ఏప్రిల్ నెలలో జరిగిన ‘జలియన్వాలాబాగ్’ ఊచకోత ఘటన ప్రజల్లో మండుతున్న అగ్నికి ఆజ్యం పోసింది. ఈ దశలో తన తండ్రికి స్నేహితుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడైన గోపాల్ కష్ణ గోఖలేను అమత్ కౌర్ కలుసుకున్నారు. అప్పుడు గోఖలే ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’ అనే సంస్థను ఏర్పాటు చేసి నిమ్నవర్గాల ప్రజల కోసం కృషి చేస్తున్నారు. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చూసి అమత్ కౌర్ స్ఫూర్తి పొందారు. వెంటనే దేశ జాతీయోద్యమంలో చేరారు. ‘విదేశీ పాలకుల చెర నుంచి నా భారత దేశం విముక్తిని చూడాలని నాలో ఉద్భవించిన భలమైన కోరిక ప్రజ్వరిల్లడానికి స్ఫూరినిచ్చిందీ ఆయనే’ అంటూ ఆ తర్వాత ఆమె గోఖలే గురించి రాసుకున్నారు. ఆయన ద్వారా జాతిపితి మహాత్మా గాంధీ గురించి తెలుసుకొని గాంధీజీ ఆశ్రయంలో పనిచేయాలనుకున్నారు. ఆ మేరకు గాంధీకి ఓ లేఖ కూడా రాశారు. అయితే ఇంతలో తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా ఆమె కపుర్తలా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉంటూ కూడా ఆమె పేదలు, బడుగు వర్గాలు, ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం కషి చేశారు. 1926లో ‘ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్’ను స్థాపించి మహిళల హక్కులు, సాధికారిత కోసం తన పోరాటాన్ని ఉధతం చేశారు. 1930లో ఆమె తల్లిదండ్రులు మరణించడంతో కౌర్ కపుర్తలాను పూర్తిగా విడిచేసి స్వాతంత్య్ర పోరాటంలో మహిళలకు నాయకత్వం వహించారు. మహాత్మాగాంధీ చేపట్టిన దండియాత్రలో, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె అంకితభావాన్ని అర్థం చేసుకున్న గాంధీజి 1936, అక్టోబర్లో ఆమెకో లేఖ రాశారు. ‘తన మిషన్ సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న ఓ మహిళ కోసం నేను వెతుకుతున్నాను. ఆలాంటి మహిళ మేరేనా, మేరేనా ఆ ఒక్కరు!’ అన్న గాంధీ పిలుపుకు స్పందించి ఆమె గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా చేరిపోయారు. దేశ తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానించే వరకు ఆమె గాంధీజీ కార్యదర్శిగానే ఉన్నారు. ఆమె ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘ట్యూబర్కులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్, ది సెంట్రల్ లెప్రసీ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, రాజ్కుమారి అమత్ కౌర్ కాలే జ్ ఆఫ్ నర్సింగ్’ ఏర్పాటు చేశారు. వివిధ అంతర్జాతీయ వేదికలను అడ్రెస్ చేసిన అనుభవంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఏర్పాటుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్, పశ్చిమ జర్మనీ, అమెరికా దేశాల నుంచి నిధులను సమీకరించారు. ఎయిమ్స్లో పనిచేసే డాక్టర్లు, నర్సుల ఉపశమనం కోసం తన పూర్వికుల నుంచి తనకు సంక్రమించిన సిమ్లాలోని ‘మనోర్విల్లీ’గా పిలిచే రాజభవనాన్ని కేటాయించారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ 150వ వార్షికోత్సవం సందర్భంగా 1961లో అమత్ కౌర్ స్థాపించిన ఎయిమ్స్ను ప్రపంచంలో పేరుపొందిన ఉన్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తించింది. ఆ తర్వాత కౌర్ తన పోరాటాన్ని ప్రధానంగా మలేరియా మహమ్మారి వైపు మళ్లించారు. అప్పటికే భారత దేశంలో ఏడాదికి పది లక్షల మంది ప్రజలు మలేరియా వల్ల మరణిస్తున్నారు. మలేరియాకు వ్యతిరేకంగా ఆమె గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన చర్యల వల్ల ఆమె దాదాపు నాలుగు లక్షల మంది ప్రజల ప్రాణాలను రక్షించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1964లో ఆమె తన 75వ ఏట ప్రశాంతంగా కన్నుమూశారు. సిమ్లాలోని మనోర్విల్లీ భవనం. అప్పటి గవర్నర్ జనరల్ సీ. రాజగోపాలాచారి, ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూలతో దేశ తొలి ఆరోగ్య శాఖా మంత్రిగా అమృత్ కౌర్. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ మహిళల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న కౌర్. మహాత్మా గాంధీతో అమృత్ కౌర్. మలేరియా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అమృత్ కౌర్. -
ఆరిన అంధుల దీపం
నరసాపురం : నరసాపురం అంధుల పాఠశాల వ్యవస్థాపకుడు బొండా ఇజ్రాయిల్ (84) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పట్టణంలో అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి అనేకమంది దివ్యాంగుల జీవితాల్లో ఇజ్రాయిల్ వెలుగులు నింపారు. ఇజ్రాయిల్ మృతిపై పలు రాజకీయపార్టీల నాయకులు, విద్యాసంస్థల ప్రతినిధులు, దళిత సంఘాలు సంతాపం తెలిపాయి. 1932 ఆగస్ట్ 4న చందపర్రులో జన్మించిన ఇజ్రాయిల్ ఉన్నత విద్యనభ్యసించారు. 1962లో పట్టణంలో ఆంధ్రా మోడల్ బ్లైండ్ స్కూల్ పేరుతో అంధుల పాఠశాలను నెలకొల్పారు. 2016 వరకూ పాఠశాల కరస్పాండెంట్గా వ్యవహరించారు. 1969లో ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్పు చేయడంలోనూ, 1972లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అంధులను పాఠశాల తరఫున హాజరుపర్చడంలోనూ కీలకపాత్ర పోషించారు. 1974లో అంధులకు వృత్తి శిక్షణా కేంద్రం, 1976లో పునరావాస కేంద్రం కూడా నెలకొల్పారు. ఇప్పటివరకూ అంధుల పాఠశాల నుంచి 500 మంది పైగా 10వ తరగతి పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అనేకమంది అంధులు ఈ పాఠశాలలో చదివిన వారే కావడం గమనార్హం ఎన్నో అవార్డులు, పురస్కారాలు ఇజ్రాయిల్కు లండన్ కు చెందిన వరల్డ్ బ్లైండ్ యూనియన్ లో శాశ్వత సభ్యత్వం ఉంది. ముంబైకి చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్లో కూడా శాశ్వత సభ్యత్వం ఉంది. న్యూఢిల్లీకి చెందిన ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అనే సంస్థ ఇజ్రాయిల్కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించింది. ఆంధ్రరత్నం, మధర్థెరిస్సా అవార్డులు కూడా లభించాయి. ఇవి కాక ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇజ్రాయిల్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయిల్ మృతికి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పీడీ రాజు, మునిసిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వైకేఎస్, బుడితి అనిల్, బుడితి దిలీప్, వంగలపూడి జక్కరయ్య, పాలంకి ప్రాసాద్ నివాళులరి్పంచారు. -
మీడియాపై విజయ్కాంత్ కస్సుబుస్సు
చెన్నై: సినీ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ మరోసారి మీడియా కస్సుబుస్సులాడారు. త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓ రెండు చానెళ్ల పోల్ సర్వే ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సర్వేలన్నీ తప్పుల తడకని, వాటిని ప్రజలు నమ్మాల్సిన పనిలేదని చెప్పారు. ఒక సర్వే ఏఐఏడీఎంకే విజయం సాధిస్తుందని, మరో సర్వే డీఎంకే విజయం సాధిస్తుందని తెలిపిందని, ఆ రెండు చానెళ్లు కావాలని ఒక వ్యూహం ప్రకారమే అలా ప్రచారం చేస్తున్నాయి తప్ప ఆ ఫలితాలు సరైనవి కావని అన్నారు. తన పార్టీ ఒకప్పుడు డీఎంకే ఫౌండర్ సీఎన్ అన్నాదురై సాధించినంతటి గొప్ప విజయం సాధిస్తుందని చెప్పారు. -
నవతెలంగాణ సమాజం ఫౌండర్తో చిట్ ఛాట్!