fundraising
-
నిధుల సమీకరణలో 2025 జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ జోరందుకున్నట్లు సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి 21 శాతం ఎగసి రూ. 14.27 లక్షల కోట్లకు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది(2023–24)లో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 11.8 లక్షల కోట్లు మాత్రమే సమకూర్చుకున్నట్లు ప్రస్తావించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్ఎస్ఐఎం) నిర్వహించిన ఒక సదస్సులో బచ్ పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) కంపెనీలు ఈక్విటీల నుంచి రూ. 3.3 లక్షల కోట్లు, రుణ మార్గాల ద్వారా రూ. 7.3 లక్షల కోట్లు అందుకున్నట్లు తెలియజేశారు. వెరసి రూ. 10.7 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. ఇక చివరి త్రైమాసికాన్ని(జనవరి–మార్చి) కూడా పరిగణిస్తే ఈక్విటీ, డెట్ విభాగాల ద్వారా సుమారు రూ. 14.27 లక్షల కోట్లను అందుకునే వీలున్నట్లు బచ్ అంచనా వేశారు. ఇకపై ఇన్విట్స్ అదుర్స్ నిజానికి ఈ ఏడాది తొలి 9 నెలల్లో మునిసిపల్ బాండ్లుసహా రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (ఇన్విట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్విట్స్ ద్వారా సమీకరించిన నిధులు రూ. 10,000 కోట్లు మాత్రమేనని బచ్ వెల్లడించారు. అయితే వచ్చే దశాబ్దంలో వీ టిలో యాక్టివిటీ భారీగా పెరగనున్నట్లు అంచనా వే శారు. దీంతో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి సమీకరించే నిధులను అధిగమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్ఐఎంను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎంఈలకు దన్ను చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల బోర్డు ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బచ్ పేర్కొన్నారు. క్లియరింగ్లకు పడుతున్న సమయాన్ని కుదించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్రతిపాదనలను అనుమతించేందుకు సెబీ 3 నెలల గడువును తీసుకుంటున్నదని, బ్యాంకులైతే 15 నిముషాలలో ముందస్తు అనుమతులు మంజూరు చేస్తున్నాయని బచ్ వ్యాఖ్యానించారు. దీంతో అనుమతుల జారీలో మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఐపీవోల వరద ఇటీవల కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతుండటంతో అప్రమత్తత పెరిగినట్లు బచ్ తెలియజేశారు. పలు కంపెనీలు సెబీ తలుపు తడుతున్నప్పటికీ ఇతర మార్గాలకూ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లు, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లు, రైట్స్ ఇష్యూలు తదితరాలను ప్రస్తావించారు. రైట్స్ జారీలో వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు, ఇందుకు కంపెనీలు సైతం సన్నద్ధంకావలసి ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. మ్యూచువల్ ఫండ్ల కొత్త ఆఫర్లకు వేగవంత అనుమతులిస్తున్నామని, ఇకపై రూ. 250 కనీస పెట్టుబడులతో సిప్ పథకాలను అనుమతించనున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో దేశీయంగా పెట్టుబడులు పుంజుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు నమోదయ్యే ఆటుపోట్లు తగ్గినట్లు వివరించారు. -
రూ. 1.21 లక్షల కోట్లు.. క్విప్ ద్వారా రికార్డ్ నిధులు
న్యూఢిల్లీ: అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులను సమీకరించడంలో కంపెనీలు ఈ కేలండర్ ఏడాది(2024)లో కొత్త రికార్డ్కు తెరతీశాయి. జనవరి నుంచి నవంబర్వరకూ దేశీ కార్పొరేట్లు రూ. 1,21,321 కోట్లు అందుకున్నాయి.దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం, షేర్ల అధిక విలువలు ఇందుకు సహకరిస్తున్నాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం గతేడాది క్విప్ ద్వారా రూ. 52,350 కోట్లు మాత్రమే సమకూర్చుకున్నాయి. వెరసి రెట్టింపునకు మించి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. క్విప్ అంటే? లిస్టెడ్ కంపెనీలు సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా వేగంగా నిధులు సమీకరించేందుకు వీలు కల్పించేదే క్విప్. నవంబర్వరకూ 82 కంపెనీలు క్విప్ను చేపట్టాయి. గతేడాది కేవలం 35 కంపెనీలు రూ. 38,220 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది రికార్డుకు కారణమైన కంపెనీలలో ప్రధానంగా వేదాంతా గ్రూప్, జొమాటో, అదానీ ఎనర్జీ, వరుణ్ బెవరేజెస్ తదితరాలను ప్రస్తావించవచ్చు. వేదాంతా, జొమాటో విడిగా రూ. 8,500 కోట్లు చొప్పున అందుకున్నాయి. -
క్విప్.. కొత్త రికార్డ్!
ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల దూకుడుతో నిధుల సమీకరణ కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఒకపక్క పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) వరదతో కంపెనీలు లిస్టింగ్ గంట మోగిస్తుంటే... మరోపక్క, లిస్టెడ్ కంపెనీలు సైతం తగ్గేదేలే అంటున్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో వేల కోట్లను సమీకరించడం ద్వారా విస్తరణ, ఇతరత్రా అవసరాలను తీర్చుకుంటున్నాయి. ఈ ఏడాది క్విప్ ఇష్యూల బాట పడుతున్న లిస్టెడ్ కంపెనీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. నవంబర్ నాటికి దాదాపు 75 కంపెనీలు ఇప్పటికే రూ.1,0,2000 కోట్లను సమీకరించాయి. దీంతో 2020 నాటి రూ.80,800 కోట్ల సమీకరణ రికార్డును బ్రేక్ చేసింది. భారీగా సమీకరిస్తున్న ఈ నిధులను కార్పొరేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకోవడానికి, ప్లాంట్ల విస్తరణ తదితర అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రూ.8,500 కోట్లు, కేఈఐ ఇండస్ట్రీస్ రూ.2,000 కోట్లు చొప్పున తాజాగా సమీకరించాయి. సెప్టెంబర్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రూ.5,000 కోట్ల క్విప్ ఇష్యూను పూర్తి చేసింది. జూలైలో మెటల్–మైనింగ్ దిగ్గజం వేదాంత రూ.8,500 కోట్లను క్విప్ రూట్లో సమీకరించడం తెలిసిందే. వేదాంత ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడం కోసం వినియోగించుకుంది. అదే నెలలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.8,373 కోట్ల క్విప్ నిధులను దక్కించుకుంది. విద్యుత్ ట్రాన్స్మిషన్ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్ మీటరింగ్, రుణాల తిరిగి చెల్లింపు కోసం వీటిని వెచి్చంచనుంది. మరిన్ని కంపెనీలు క్విప్ బాటలో ఉండటంతో మొత్తంమీద ఈ ఏడాది క్విప్ సమీకరణ మరింత ఎగబాకే అవకాశాలున్నాయి.నిధులతో రెడీ... దేశీ కార్పొరేట్ దిగ్గజాలు కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా భారీగా విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాయి. తద్వారా పోటీ కంపెనీలతో తలపడేందుకు, మార్కెట్ వాటాను పెంచుకునేందుకు నిధులను సిద్ధం చేసుకుంటున్నాయని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కు చెందిన క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వి. జయశంకర్ పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ సెప్టెంబర్లో రూ.1,500 కోట్ల క్విప్ ఇష్యూకు రాగా, మరో రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టŠస్ క్విప్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. ఏప్రిల్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా విస్తరణ ప్రణాళికల కోసం రూ.5,000 కోట్ల క్విప్ నిధులను ఖాతాలో వేసుకుంది. ఇలా భారీ మొత్తాన్ని దక్కించుకున్న కంపెనీల్లో స్వాన్ ఎనర్జీ (రూ.3,319 కోట్లు), మాక్రోటెక్ డెవలపర్స్ (రూ.3,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ (రూ.3,000 కోట్లు), కోఫోర్జ్ (రూ.2,240 కోట్లు) కొన్ని. ‘వేల్యుయేషన్స్ సానుకూలంగా ఉండటం, పటిష్టమైన సెకండరీ మార్కెట్లతో పాటు పెట్టుబడులకు ఇన్వెస్టర్లు క్యూ కడుతుండటం వంటి అంశాలు లిస్టెడ్ కంపెనీల క్విప్ జోరుకు ప్రధాన కారణం. కొత్త ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నాయి. మూలధన అవసరాల కోసం చాలా లిస్టెడ్ కంపెనీలు ఇదే రూట్ను ఆశ్రయిస్తున్నాయి’ అని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్కు చెందిన ఈక్విటీ విభాగం హెడ్ దీపక్ కౌశిక్ చెప్పారు. ఏంజెల్ వన్, శ్యామ్ మెటాలిక్స్, టెక్నో ఎలక్ట్రిక్, లాయిడ్స్ మెటల్స్, క్రాఫ్టŠస్మన్ ఆటోమేషన్, చాలెట్ హోల్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్ వంటివి కంపెనీలు గడిచిన కొద్ది నెలల్లో రూ.1,000–1,500 కోట్ల స్థాయిలో క్విప్ నిధులను సమీకరించాయి.క్విప్ అంటే... ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు నిధులను సమీకరించే సాధనాల్లో క్విప్ కూడా ఒకటి. అర్హతగల సంస్థాగత బయ్యర్లకు (క్యూఐబీ) ఈక్విటీ షేర్లను, పూర్తిగా–పాక్షికంగా షేర్లుగా మార్చుకోగల డిబెంచర్లు లేదా ఇతరత్రా సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులను సమకూర్చుకోవడానికి ‘క్విప్’ వీలు కలి్పస్తుంది. క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడుల్లో విశేష అనుభవం గల, ఆరి్థకంగా బలమైన సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ క్యూఐబీలుగా నిర్దేశించింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్పైస్జెట్ ఫ్లోర్ ధర రూ. 64.79
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్జెట్ అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి నిధుల సమీకరణకు తెరతీసింది. ఇందుకు తాజాగా షేర్ల జారీ(ఫ్లోర్) ధరను ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 64.79 చొప్పున సెక్యూరిటీలను విక్రయించనుంది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. క్విబ్ ద్వారా రూ. 3,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత వారం వాటాదారుల నుంచి స్పైస్జెట్ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా.. వాటాదారుల అనుమతిమేరకు ఫ్లోర్ ధరపై 5 శాతానికి మించకుండా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆర్థిక సవాళ్లు, న్యాయ వివాదాలు, విమాన సరీ్వసులు నిలిచిపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడింది. బీఎస్ఈలో స్పైస్జెట్ షేరు 5.25 శాతం పతనమై రూ. 73.72 వద్ద ముగిసింది. -
సెప్టెంబర్ మాసం... ఐపీఓల వర్షం!
స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇష్యూల వర్షం కురవనుంది. 2010 సెప్టెంబర్లో అత్యధికంగా 15 ఐపీఓలతో రికార్డు నమోదైంది. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్లో జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆ 14 ఏళ్ల రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.వరుస ఐపీఓలతో సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ కళకళలాడనుంది. ఇప్పటికే గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్, బాజార్ స్టయిల్ రిటైల్ ఇష్యూలు పూర్తయ్యాయి. ఇంకా అనేక ఇష్యూలు నిధుల సమీకరణ బాటలో ఉన్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్తో పాటు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, గరుడా కన్స్ట్రక్షన్స్, మన్బా ఫైనాన్స్ సహా అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూల మోత మోగించనున్నాయి. దీంతో 2010 సెప్టెంబర్ నెల 15 ఐపీఓల రికార్డు తుడిచిపెట్టుకుపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్కు సెకండరీ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తోడవడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓల బాట పట్టేందుకు దోహదం చేస్తోందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ‘వచ్చే కొన్ని వారాల్లో చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. ఇటీవలి ఐపీఓలకు బలమైన డిమాండ్తో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం తగినంతగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం‘. మరోపక్క తాజా ఇష్యూలు లిస్టింగ్లోనూ, ఆ తర్వాత కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచడం మార్కెట్లో మరింత జోష్ నింపుతోంది’ అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ వి. జయశంకర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో నిధుల వెల్లువ... ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.55,300 కోట్ల నిధులను ఐపీఓల్లో కుమ్మరించారు. మరోపక్క, సెకండరీ మార్కెట్లో రూ.2,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. రూ. 6,560 కోట్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ భారీ ఇష్యూ 9న మొదలవుతోంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.66–70. టోలిన్స్ టైర్స్ రూ.230 కోట్ల నిధుల కోసం 9న మార్కెట్ తలుపుతడుతోంది. ఇక పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.228–240 ధరల శ్రేణితో ఈ నెల 10న ఐపీఓకు వస్తోంది. గతేడాది సెప్టెంబర్లో వచ్చిన రూ.11,893 కోట్ల విలువైన 14 ఐపీఓలే ఇటీవలి కాలంలో అత్యధికంగా నిలుస్తున్నాయి. 2024 ఆగస్ట్లో 10 కంపెనీలు రూ.17,076 కోట్ల నిధులను సమీకరించాయి. ‘మెరుగైన వ్యాపారావకాశాల నేపథ్యంలో భారత కార్పొరేట్ సంస్థలు ప్లాంట్ల విస్తరణతో పాటు కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచాయి. మరోపక్క, పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల గడువు ఆరు నెలలు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్ల గడువు సెప్టెంబర్తో ముగియనుంది. ఈలోపు ఐపీఓ పూర్తి చేయకపోతే, మళ్లీ ఆడిట్ చేయడంతో పాటు ఐపీవో ముసాయిదా దర ఖాస్తు పత్రాలను మా ర్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్యూ జాప్యానికి దారితీస్తుంది. అందుకే కంపెనీలు వరుసకడుతున్నాయి’ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రవి శంకర్ చెప్పారు.ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. లిస్టింగ్లో అసాధారణ లాభాలిస్తుండటంతో ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఏ ఐపీఓ వచ్చినా రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడిపోతున్నారు. ఈ నెల 4న ముగిసిన రూ.168 కోట్ల గాలా ప్రెసిషన్ ఇష్యూ 201 రెట్లు అధికంగా సబ్్రస్కయిబ్ అయింది. బాజార్ స్టయిల్కు 41 రెట్ల స్పందన లభించింది. అంతక్రితం ఎకోస్ మొబిలిలిటీకి 64 రెట్లు సబ్్రస్కిప్షన్ లభించింది. అంతేకాదు, ఇది 32 శాతం ప్రీమియంతో లిస్టయింది కూడా. ప్రీమియర్ ఎనర్జీస్ 87 శాతం, ఓరియంట్ టెక్నాలజీస్ 48 శాతం చొప్పన లిస్టింగ్ లాభాలను పంచాయి. ఆగస్ట్లో లిస్టయిన 8 ఐపీఓల సగటు లాభం 36 శాతం కావడం గమనార్హం.మార్కెట్ రికార్డులు, ఐపీఓల వరదతో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్లో 41.4 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత కావడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.1 కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆల్టైమ్ రికార్డు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్వాతంత్ర దినోత్సవం స్పెషల్.. అకాన్ ఆహ్వానం ఇదే..
హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్ట్ 15) సందర్భంగా అకాన్ రెస్టారెంట్ ప్రత్యేకమైన ఫండ్ రైజింగ్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. నిరుపేదల శిశువులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రత్యేక విందులో పాల్గొనాలని ఆహ్వానించింది. ఇక్కడ మధ్యాహ్నం అందించే పసందైన భోజనంతో పాటు.. చెఫ్లు, కళాకారులు ఒక మరపురాని అనుభూతిని అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన ప్రతి రూపాయి.. ఎన్ఐసీయూ యూనిట్లలో నిరుపేద కుటుంబాలకు చెందిన నెలలు నిండని శిశువులకు మద్దతు ఇవ్వడానికి ఎక్స్ట్రామైల్ ఫౌండేషన్కు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు రుచికరమైన భోజనంతో పాటు, ఆహ్లాదకరమైన సితార్ ప్రదర్శన ఏర్పాటు చేసి అద్భుతమై అనుభవాన్ని అందిస్తాం.ఈవెంట్స్ వివరాలు.. అగ్రశ్రేణి చెఫ్లు రూపొందించిన మాస్టర్పీస్ వంటలో పాల్లొని ప్రత్యేకమైన డైనింగ్ అనుభవం పొందండి లైవ్ సితార్ ప్రదర్శనలో పాల్గొని సంగీతాన్ని ఎంజాయ్ చేయండి.ఇక్కడికి వచ్చిన వారు తమకు నచ్చిన విధంగా నిధులు చెల్లించవచ్చు.నెలలు నిండని శిశువుల జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ఓ గొప్ప సహాయక కార్యక్రమానికి మద్దతు ఇవ్వవచ్చు.వెరైటీ వంటకాలు రుచి చూడాలని, ఆనందంగా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి, సామాజిక బాధ్యత కలిగి ఉన్నవారంతా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాతో చేరండి.వివరాలు..తేదీ: స్వాతంత్ర దినోత్సవం( ఆగస్ట్ 15)సమయం: 12-4 PMవేదిక: అకాన్, హైదరాబాద్మరింత సమాచారం, రిజర్వేషన్ల కోసం సంప్రదించండి: 9649652222https://akanhyd.com/aahvaanam/ -
నిధుల సేకరణకు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మూలధన వ్యయంతో పాటు ఇతర అవసరాల కోసం రుణ మార్కెట్ నుంచి ప్రాథమికంగా రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ద్వారా రుణం తీసుకొనేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించింది. నిధుల సేకరణ బాధ్యతను రుణాలు ఇప్పించడంలో అనుభవంగల ‘మర్చంట్ బ్యాంకర్’కు అప్పగించాలని నిర్ణయించింది. మర్చంట్ బ్యాంకర్ ఎంపికకు గత నెల 23న జారీ చేసిన టెండర్ను రద్దు చేసిన టీజీఐఐసీ... తాజాగా మరో టెండర్ షెడ్యూ ల్ను విడుదల చేసింది. దీనిప్రకారం ఈ నెల 12లోగా ఫైనాన్షియల్ సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. అదేరోజు సాయంత్రం సాంకేతి క బిడ్లను తెరిచి అర్హతగల సంస్థలకు సమా చారం ఇస్తారు. 2019–24 మధ్య రుణ మార్కె ట్ నుంచి రూ. 20 వేల కోట్లకుపైగా సేకరించిన సంస్థలకు ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన బిడ్డర్ కనీసం రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. రుణం సేకరించి ఇచ్చే మర్చంట్ బ్యాంకర్కు కనీసం ఒక శాతం కమీషన్ లభించే అవకాశం ఉంది. టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్ బ్యాంకర్ నిధుల సేకరణకు అవసరమయ్యే అన్ని రకాల అనుమతులు, క్లియరెన్సులు, లైసెన్సులు తదితరాల బాధ్యతలు చూసుకోవాలి.రూ. 10 వేల కోట్లు సేకరణ లక్ష్యం..?టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్ బ్యాంకర్ కనీసం రూ. 5 వేల కోట్ల నిధులు సేకరించాలనే లక్ష్యాన్ని టీజీఐఐసీ విధించింది. అయితే ఒకరికంటే ఎక్కువ మంది మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసి మొత్తంగా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. టీజీఐఐసీ వద్ద ఉన్న పరిశ్రమల భూముల బ్యాంకు నుంచి కోకాపేట, రాయదుర్గం ప్రాంతంలోని 400 ఎకరాలకుపైగా భూమిని కుదువ పెట్టడం ద్వారా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విలువైన ప్రాంతంలో ఉన్న ఈ భూముల విలువను సగటున ఎకరాకు రూ. 50 కోట్లుగా లెక్కకట్టినట్లు సమా చారం. వీలైనంత త్వరగా నిధుల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని టీజీఐఐసీ భావిస్తోంది. రుణ మార్కెట్ నుంచి టీజీఐఐసీ రూ.10వేలు కోట్లు సేకరించేందుకు ప్రయత్నిస్తోందని శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘పరిశ్రమల భూములు తాకట్టు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమవడం తెలిసిందే. -
బడా ఐపీఓల బొనాంజా!
ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 77,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లిస్టింగ్వైపు చూపు... రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్ఎస్డీఎల్ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్ల, ఎమ్క్యూర్ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.ఎల్ఐసీ రికార్డుకు చెక్!దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. -
అభ్యర్థుల ఆస్తులపైనా కన్ను!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లిలో మైనింగ్పై కన్నేసి.. ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తులపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధుల కొరత ఉందంటూ.. వారికి నిధుల సమీకరణ పేరుతో వారి ఆస్తులను తాకట్టు పెట్టుకునేందుకు సీఎం రమేశ్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వంతు వాటా నిధులను తన టీమ్ సభ్యులకు చూపించాకే ఆయన తన వాటా నిధులను విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తమ వద్ద నిధులు లేవంటే.. వారి ఆస్తి పత్రాలు తీసుకుని అప్పులిప్పిస్తున్నట్టు చెబుతున్నారు. అది కూడా అధిక వడ్డీకి తన సన్నిహితుల వద్ద నుంచే సీఎం రమేశ్ అప్పులిప్పుస్తుండటం అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఫోర్జరీ వ్యవహారంలో ఆయనపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఈ వ్యవహారం తెలిసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తాజా పరిణామాలతో భయాందోళనకు గురవుతున్నారు. అధిక వడ్డీకి తీసుకున్న ఈ మొత్తాలను సకాలంలో చెల్లించలేదన్న సాకుతో తమ ఆస్తులను తీసేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆస్తుల చిట్టాతో భయపెడుతున్న వైనం వాస్తవానికి కొందరు తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులు ఎంపీ కోటా నుంచి వచ్చిన నిధులతోనే ఎన్నికలు కానిచ్చేదామనుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.13 కోట్ల మేర సీఎం రమేశ్ నిధులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోతాయని.. తమ వంతు వాటా నిధులు అవసరం లేదని ఎమ్మెల్యే అభ్యర్థులు భావించారు. అయితే, మీ వాటా నిధులు ఎక్కడున్నాయో చెప్పాలని.. తన టీమ్ పరిశీలిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం రమేశ్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మీ వంతుగా మీ వద్ద రూ.10 కోట్ల మేర ఉన్నాయని తన టీమ్ నిర్ధారించాకే తన కోటా రూ.13 కోట్లు విడుదల చేస్తానని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో చోడవరం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి తన వద్ద నిధులు లేవని.. తనకు పెద్దగా ఆస్తులు కూడా లేవని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తుల మొత్తం వివరాలను డాక్యుమెంట్స్తో సహా సీఎం రమేశ్ ఆయన ముందు ఉంచడంతో విస్తుపోవడం ఆ అభ్యర్థి వంతైందని చెబుతున్నారు. ఇందులో కొన్ని ఆస్తులను తాను అమ్మివేశానని.. ప్లాట్లుగా విభజించి విక్రయించినట్టు ఆ అభ్యర్థి చెప్పడంతో తాజా ఎన్కంబరెన్స్ సరి్టఫికెట్ (ఈసీ)ని కూడా సీఎం రమేశ్ ఆయనకు చూపించినట్టు తెలుస్తోంది. ఇంతగా తమ ఆస్తులు, వాటి పత్రాలను కూడా ఆయన సేకరించడం పట్ల అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.అధిక వడ్డీకి తాకట్టు.. అనకాపల్లి ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు చెందిన ఆస్తి పత్రాలన్నింటినీ సీఎం రమేశ్ సేకరించినట్టు చెబుతున్నారు. తమ వద్ద నిధులు లేవన్న అభ్యర్థులకు.. ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులిప్పించే ఏర్పాట్లను కూడా ఆయన చూసుకుంటున్నారు. ‘నీ ఆస్తి పత్రాలను తీసుకెళ్లి.. వైజాగ్లో ఫలానా వారిని కలిసి వడ్డీకి నిధులు తీసుకో’ అని వారిని ఆదేశిస్తున్నట్టు సమాచారం. తమ ఆస్తుల చిట్టాను సేకరించి.. వాటిని ఎక్కడ తాకట్టు పెట్టాలో కూడా సీఎం రమేశ్ చెబుతుండటంతో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తుల చిట్టాను ఎందుకు సేకరించారు? వాటిని తీసుకెళ్లి ఫలానా వారి వద్దనే తాకట్టు పెట్టాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న వారంతా సీఎం రమేశ్కు చెందినవారే కావడంతో వీరి అనుమానాలు రెట్టింపవుతున్నాయి. ఎన్నికల తర్వాత తమ ఆస్తులు తమకు దక్కుతాయా? ఈ అప్పు పేరుతో తీసుకున్న పత్రాలను తీసుకెళ్లి సొంతం చేసుకుంటారా అనే భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఆస్తుల చిట్టాను మొత్తం విప్పుతుండటంతో అభ్యర్థుల్లో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా నెలకొందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
Vodafone Idea: 6 నెలల్లో 5జీ సేవల విస్తరణ
ముంబై: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రతిపాదిత రూ. 18,000 కోట్ల ఎఫ్పీవో ద్వారా నిధులు సమీకరణ అనంతరం 6–9 నెలల్లోగా 5జీ సరీ్వసులు విస్తరించే యోచనలో ఉంది. నిధుల కొరత వల్లే ఇప్పటివరకు సర్వీసులను ప్రారంభించలేకపోయామని సంస్థ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. రాబోయే 24–30 నెలల్లో తమ మొత్తం ఆదాయంలో 5జీ వాటా 40 శాతం వరకు ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎఫ్పీవో ద్వారా సేకరించే నిధుల్లో రూ. 5,720 కోట్ల మొత్తాన్ని 5జీ సరీ్వసులకు వినియోగించనున్నట్లు ముంద్రా వివరించారు. వొడా–ఐడియా ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో) ఏప్రిల్ 18న ప్రారంభమై 22తో ముగియనుంది. ఇందుకోసం ధర శ్రేణిని షేరుకు రూ. 10–11గా నిర్ణయించారు. ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా సేకరించే రూ. 18,000 కోట్లలో రూ. 15,000 కోట్ల మొత్తాన్ని 5జీ సేవల విస్తరణ, ఇతరత్రా పెట్టుబడుల కోసం వినియోగించుకోనున్నట్లు ముంద్రా వివరించారు. ప్రధానంగా కస్టమర్లు చేజారి పోకుండా చూసుకోవడం, యూజరుపై సగటు ఆదాయాన్ని (ఆర్పూ) పెంచుకోవడం, నెట్వర్క్పై పెట్టుబడులు పెట్టడం తమకు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 2జీ యూజర్లు ఎక్కువగా ఉన్నందున తమ ఆర్పూ మొత్తం పరిశ్రమలోనే తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే, ప్రస్తుతం తమ 21.5 కోట్ల యూజర్లలో కేవలం 2జీనే వినియోగించే వారి సంఖ్య 42 శాతంగా ఉంటుందని, వీరంతా 4జీకి అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నందున ఆర్పూ మెరుగుపడేందుకు ఆస్కారం ఉందన్నారు. -
ఇన్వి ట్స్లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
న్యూ జెర్సీలో ఆటా బిజినెస్ సెమినార్, కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు. -
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
2023లో క్విప్ నిధుల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2023)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) జోరుమీదుంది. కంపెనీలు నిధుల సమీకరణకు క్విప్ను అత్యధికంగా ఆశ్రయిస్తున్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ క్విప్ ద్వారా రూ. 50,218 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది గతేడాది(2022) నమోదైన రూ. 8,196 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికంకావడం గమనార్హం! ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక రైట్స్, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలోనూ నిధుల సమీకరణ సైతం 2022తో పోలిస్తే భారీగా ఎగసింది. ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం 2023లో రైట్స్ ఇష్యూల ద్వారా రూ. 8,017 కోట్లు అందుకున్నాయి. గతేడాది ఇవి రూ. 3,646 కోట్లుకాగా.. ఓఎఫ్ఎస్ ద్వారా 44 శాతం అధికంగా రూ. 15,959 కోట్లు లభించాయి. 2022లో ఇవి రూ. 11,110 కోట్లు మాత్రమే. కారణాలివీ క్విప్ ద్వారా నిధుల సమీకరణ వృద్ధికి ప్రధానంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నంతకాలం ఇన్వెస్టర్లకు రిటర్నులు లభిస్తుంటాయని తెలియజేశారు. అందులోనూ వేగవంతంగా పెట్టుబడుల సమీకరణకు వీలుండటంతో కంపెనీలు క్విప్ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయని వివరించారు. లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి వ్యయాల కోసం, పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనల అమలు కోసం సాధారణంగా కంపెనీలు క్విప్నకు తెరతీస్తుంటాయని విశ్లేషకులు తెలియజేశారు. లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వీలున్న క్విప్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వేగంగా నిధులను అందుకునేందుకు వీలుండటం మరొక సానుకూల అంశమని తెలియజేశారు. దిగ్గజాలు సై ఈ ఏడాది క్విప్ ద్వారా ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ రూ. 8,800 కోట్లు అందుకుంది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్(యూబీఐ) రూ. 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రూ. 4,500 కోట్లు చొప్పున సమీకరించాయి. బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం క్విప్ ద్వారా రూ. 2,305 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! ఈ జాబితాలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేరాయి. రైట్స్, ఎఫ్పీవో తదితరాలతో పోలిస్తే.. తక్కువ సమయం, సులభ నిబంధనల కారణంగా క్విప్ చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
బ్యాంక్లపైనే ఆధారపడొద్దు
ముంబై: నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలని, బ్యాంక్లపై ఆధారపడడాన్ని పరిమితం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలకు) ఆర్బీఐ సూచించింది. బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లు పటిష్టం చేసుకుని, మోసాలు, డేటా చోరీల నుంచి రక్షణ కలి్పంచుకోవాలని కోరింది. దేశ బ్యాంకింగ్ రంగం, ఎన్బీఎఫ్సీలు బలంగా ఉన్నాయంటూ.. అధిక నగదు నిష్పత్తి, మెరుగుపడిన ఆస్తుల నాణ్యత, లాభాల్లో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. ఈ మేరకు బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య పరస్పర అనుసంధానత పెరిగిన నేపథ్యంలో.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలి. బ్యాంక్లపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. కస్టమర్లకు సేవల విషయంలో మరింత కృషి చేయాలి’’అని ఆర్బీఐ కోరింది. సైబర్ దాడుల రిస్క్ నూతన టెక్నాలజీల అమలు నేపథ్యంలో సైబర్ దాడులు, డేటా చోరీ, నిర్వహణ వైఫల్యాలు పెరిగినట్టు పేర్కొంది. మెరుగైన పాలన, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లను పటిష్టం చేసుకుని, పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలను చేరుకునే విధంగా ఉండాలని కోరింది. ‘‘ఈ విధమైన సాంకేతిక, సైబర్ భద్రతా రిస్క్లను గుర్తించి, వాటి ముప్పును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. బలమైన గవర్నెన్స్, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి’’అని సూచించింది. -
రికార్డు స్థాయిల్లో స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలకు చేరడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఇదే వారంలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘అధిక వాల్యుయేషన్లు, ఎల్నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 21,700 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,000 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లు స్థిరీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21500 – 21600 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచన, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు నేపథ్యంలో గతవారం సూచీలు 2.32% ర్యాలీ చేశాయి. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయం, యరోజోన్ నవంబర్ ద్రవ్యల్బోణ డేటా డిసెంబర్ 19న(మంగళవారం) విడుదల కానున్నాయి. అదే రోజున భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సలి్టంగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. జపాన్ నవంబర్ వాణిజ్య లోటు, బ్రిటన్ నవంబర్ ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ అక్టోబర్ కరెంట్ ఖాతా, అమెరికా నవంబర్ గృహ అమ్మకాలు బుధవారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రస్తుత సంవత్సరపు మూడో క్వార్టర్ జీడీపీ డేటా గురువారం వెలువడుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ ద్రవ్యోల్బణం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల అవుతాయి. కీలక ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించే వీలుంది. ప్రథమార్థంలో రూ.29,700 కోట్ల కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్ ప్రథమార్థంలో రూ.27,000 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘మూడు ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీ బీజేపీ గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే అంచనాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి, మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచనలు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీప్ హెడ్ విజయకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రా, పారిశ్రామిక రంగాల షేర్లను కొనుగోళ్లు చేశారు. రానున్న రోజుల్లో లాభాల స్వీకరణకు పాల్పడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 పబ్లిక్ ఇష్యూలు 8 లిస్టింగులు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు 12 కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్కు రానున్నాయి. ఇందులో ప్రధాన విభాగం(8 కంపెనీలు)తో పాటు చిన్న మధ్య తరహా స్థాయి(4 కంపెనీలు) విభాగానికి చెందినవి ఉన్నాయి. ముత్తూట్ మైక్రో ఫిన్, మోతీసన్స్ జ్యువెలర్స్, సురజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓలు సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి. హ్యాపి ఫోర్జ్, ఆర్బీజెడ్ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓలు డిసెంబర్ 19–21 మధ్య జరగునున్నాయి. అజాద్ ఇంజనీరింగ్స్ పబ్లిక్ ఇష్యూ 20–22 తేదీల్లో, ఇన్నోవా క్యాప్ట్యాబ్ ఐపీఓ 21–26 తేదీల్లో జరగనుంది. ఎస్ఎంఈ విభాగం నుంచి సహారా మారిటైం, శాంతి స్పిన్టెక్స్, ఎలక్ట్రో ఫోర్స్, ట్రిడెంట్ టెక్ల్యాబ్లు కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీల షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ గురువారం ఉంది. చిన్న మధ్య తరహా స్థాయి విభాగం నుంచి 5 కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. -
11న స్పైస్జెట్ బోర్డు సమావేశం
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్జెట్ నిధుల సమీకరణ బాట పట్టింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఇందుకు గల అవకాశాలపై చర్చించేందుకు ఈ నెల 11న బోర్డు సమావేశంకానున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. ఇటీవల 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 833 కోట్లు) సమకూర్చుకునేందుకు కంపెనీ ప్రమోటర్ అజయ్ సింగ్.. గ్లోబల్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్స్తో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో బోర్డు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఈక్విటీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకున్న అవకాశాలను పరిశీలించేందుకు బోర్డు సమావేశమవుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు స్పైస్జెట్ వెల్లడించింది. -
ఆపదలో చేయూత.. క్రౌడ్ ఫండింగ్
శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ చిన్నారుల ఆస్పత్రిలో చూపించారు. స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్ఎంఏ)తో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి ‘జోల్జెన్స్మా’ అనే ఇంజెక్షన్ను తీసుకొచ్చి ఇవ్వాలి. ఇందుకు సుమారు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలో బాబు తల్లిదండ్రులకు ‘ఇంపాక్ట్ గురూ’ ప్లాట్ఫామ్ సంజీవనిగా కనిపించింది. చిన్నారి ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ విరాళాలకు (ఫండ్ రైజింగ్) పిలుపునిచ్చారు. మూడున్నర నెలల్లో 65,000 మంది దాతల ఉదారంతో ఊహించనిది సాధ్యమైంది. విదేశాల నుంచి సదరు ఇంజెక్షన్ను తీసుకొచ్చి ఇవ్వడంతో బాబు కోలుకున్నాడు. వేణు నెట్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఓ బాలిక లివర్ సమస్యతో బాధపడుతుందన్న ‘కెట్టో’ ప్రకటన కనిపించింది. అది క్లిక్ చేయగా, ఆ సమస్య నుంచి బయటపడేందుకు రూ.30 లక్షలు అవుతుందని, దాతలు దయతలిస్తేనే తన కుమార్తె బయటపడుతుందంటూ చిన్నారి తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలకు వేణు చలించిపోయాడు. కానీ, కాలేయ చికిత్సకు భారీ మొత్తాన్ని పేర్కొనడంపై అతడిలో అనుమానం కలిగింది. సదరు ప్రకటన నిజమేనా..? అంత ఖర్చు అవుతుందా..? ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయవు? ఆస్పత్రులు అయినా బాధితుల విషయంలో కొంత లాభాపేక్ష తగ్గించుకుని చికిత్సలకు ముందుకు రావచ్చుగా..? ఇలాంటి ప్రశ్నలు మెదిలాయి. చివరికి తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రూ.500 అప్పటికప్పుడు డొనేట్ చేశాడు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచి్చనా, తమ వల్ల ఏమవుతుంది? అంటూ కుదేలు అయిపోవాల్సిన పని లేదని శాంతి దంపతుల కథనం ధైర్యాన్నిస్తోంది. ఆరోగ్య పరంగా ఎంత కష్టం వచి్చనా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో సంతోషానికి దారి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు కాస్తంత విచారించి, కథనం నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. వీటి సాయం పొందడమే కాకుండా, వీటి ద్వారా నలుగురికీ తోచినంత సాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. మనోళ్లకు దాన గుణం ఎక్కువే.. 2021 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ప్రకారం దానంలో భారత్ 14వ స్థానంలో ఉంది. అపరిచితులకు మన దేశంలో 61 శాతం మంది సాయం చేస్తున్నారు. కాకపోతే విశ్వసనీయత విషయంలో ఉండే సందేహాలు ఈ దాతృత్వాన్ని మరింత విస్తరించకుండా అడ్డుకుంటున్నాయని చెప్పుకో వచ్చు. బాధితులకు, దాతలకు మధ్య వేదికగా నిలిచే విశ్వసనీయ సంస్థలు వస్తున్న కొద్దీ, క్రౌడ్ ఫండింగ్ మరింత పరిడవిల్లుతూనే ఉంటుంది. మరింత మంది బాధితులకు చేయూత లభిస్తుంది. నిధుల సమీకరణ ఇలా..? ► చికిత్సలకు దాతల సాయం అవసరమైన వారు క్రౌండ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లను (ఇంపాక్ట్గురూ, మిలాప్, కెట్టో మొదలైనవి) సంప్రదించాలి. ► పాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ► వీటిని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ధ్రువీకరించుకుంటుంది. తగిన విచారణ అనంతరం బాధితుల కథనం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి. ► ఇక ఇక్కడి నుంచి నిధుల సమీకరణ మొదలవుతుంది. సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్ను తమ నెట్వర్క్లో షేర్ చేసుకోవాలి. తమ వంతు ప్రచారం కలి్పంచుకోవాలి. అలాగే, ప్లాట్ఫామ్లు సైతం ప్రచారానికి తమ వంతు సాయం అందిస్తాయి. ► సమీకరించే విరాళంలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు సైతం విస్తృత ప్రచారాన్ని చేపడతాయి. ► బాధితులు ఎదుర్కొంటున్న సమస్య, వైద్యులు చెబుతున్న వెర్షన్, చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ ఈ పేజీలో ఉంటాయి. దాతలు విరాళం చెల్లించేందుకు పేమెంట్ లింక్లు కూడా అక్కడ కనిపిస్తాయి. ► కనీసం 300–350 అంతకంటే ఎక్కువ విరాళాలనే అనుమతిస్తున్నాయి. ► దాతలు చేసే చెల్లింపులన్నీ కూడా ప్రత్యేక ఖాతాలో జమ అవుతాయి. ► కావాల్సిన మొత్తం వచి్చనా.. లేదంటే గడువు ముగిసినా లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ముగిసిపోతుంది. ► అనంతరం ఈ మొత్తం నుంచి కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హాస్పిటల్/బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి. ► విరాళం ఇచి్చన వారికి ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇవి అప్డేట్ చేస్తుంటాయి. విశ్వసించడం ఎలా..? సాయం అవసరమైన వారికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు మార్గాన్ని చూపిస్తున్నాయి. మరి విరాళం ఇచ్చే వారు ఈ కథనాలను విశ్వసించేది ఎలా..? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. మన దేశంలో విరాళాలకు సంబంధించి భౌతిక వేదికలే ఎక్కువ. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల సేవలు ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ విస్తరణ ఇందుకు వీలు కలి్పంచిందని చెప్పుకోవాలి. ఆన్లైన్ ప్రపంచంలో అన్నింటినీ నమ్మలేం. సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో, అన్నీ విచారించుకున్న తర్వాతే విరాళం ఇవ్వడం సురక్షితంగా ఉంటుంది. కోటక్ ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్ సీఈవో (ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ) లక్ష్మీ అయ్యర్ దీనిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నాకు రిఫరల్ ద్వారా వచ్చే వాటికే నేను దానం చేస్తాను. ఈ విషయంలో నా మార్గం చాలా స్పష్టం. సులభంగా డబ్బులు సంపాదించే మోసగాళ్లకు కొదవ లేదు’’అన్నది లక్ష్మీ అయ్యర్ అభిప్రాయంగా ఉంది. సన్సేరా ఇంజనీరింగ్ జాయింట్ ఎండీ ఎఫ్ఆర్ సింఘ్వి ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘చాలా వరకు విరాళాలు కోరుతున్న ఆన్లైన్ కేసులు వైద్య పరమైనవే ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి పేర్కొనే చికిత్సల వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నాకు ఒక ఆస్పత్రితో అనుబంధం ఉంది. కనుక చికిత్సల వ్యయాల గురించి తెలుసుకోగలను’’అని పేర్కొన్నారు. ఇలాంటిదే ఒక విరాళం కేసులో చికిత్సకు రూ.18–24 లక్షలు ఖర్చువుతుందన్న కొటేషన్ కనిపించగా, దీనిపై విచారించగా, తెలిసిన హాస్పిటల్లో రూ.5–6 లక్షలకే చేస్తున్నట్టు విని ఆశ్చర్యపోయినట్టు సింఘ్వి తెలిపారు. నిజానికి కొన్ని కేసుల్లో భారీ అంచనాలు పేర్కొంటున్న ఉదంతాలు లేకపోలేదు. హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న బాధితుల తరఫున నిధుల సమీకరణ కార్యక్రమాలు నడిపించే కొందరు మోసగాళ్ల ఉదంతాలు సైతం లోగడ వెలుగు చూశాయి. అలా అని కష్టాల్లో ఉన్న బాధితులకు విరాళాలు ఆగకూడదు కదా..? ముందస్తు పరిశీలన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చికిత్సల వ్యయాలను ముందుగానే నిర్ధారించుకుంటామని చెబుతున్నాయి. హాస్పిటల్ వ్యయ అంచనాలను, చారిత్రక గణాంకాలు, బీమా థర్డ్ పార్టీ అగ్రిగేటర్ సంస్థల డేటా ఆధారంగా పోల్చి చూస్తామని ఇంపాక్ట్గురూ సీఈవో జైన్ తెలిపారు. తమ ప్యానల్ డాక్టర్లతోనూ దీనిపై నిర్ధారించుకుంటామని చెప్పారు. నిధుల సమీకరణ నిజమైన కారణాలతో చేసినప్పటికీ, తర్వాత ఆ నిధులు దురి్వనియోగం కాకుండా ఉండేందుకు కూడా ఇవి చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘ఇంపాక్ట్ గురూ వేదికగా సమీకరించే నిధుల్లో 80 శాతానికి పైగా నేరుగా హాస్పిటల్స్కు బదిలీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ జాబితాలోనివే’’అని జైన్ తెలిపారు. తమ ప్లాట్ఫామ్పై లిస్ట్ చేసే వైద్య పరమైన కేసుల్లో విరాళాలను హాస్పిటల్ బ్యాంక్ ఖాతా ద్వారానే తీసుకోగలరని కెట్టో అంటోంది. ► బాధితుల కేవైసీ పత్రాలను ముందుగా ఇవి నిర్ధారించుకుంటాయి. ► వైద్య పరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వాటిని తనిఖీ చేస్తాయి. ► తమ ప్యానెల్ వైద్యులతో మాట్లాడి నిర్ధారణకు వస్తాయి. ► అవసరమైతే క్షేత్రస్థాయిలో హాస్పిటల్కు తమ ఉద్యోగిని పంపించి వాస్తవమా, కాదా అన్నది నిర్ధారించుకుంటాయి. ప్రచార మార్గం.. ఇంపాక్ట్ గురూ, కెట్టో, మిలాప్ ఇవన్నీ ప్రముఖ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు. ఆన్లైన్ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల తరఫున విరాళాల సమీకరణకు ఇవి ప్రచారం కలి్పస్తుంటాయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో వైద్య చికిత్సల కోసం సాయం కోరుతూ ఈ సంస్థలకు సంబంధించి ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిని క్లిక్ చేసి చూశారంటే, తర్వాత కూడా అలాంటి ప్రకటనలే మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ప్రకటనల్లో బాధితుల కథనానికి ఆధారంగా వైద్యులు జారీ చేసిన లెటర్, టెస్ట్ రిపోర్ట్లను ఉంచుతున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు, బాధితులు సైతం తమకు తెలిసిన వారికి ఈ లింక్లు పంపి సాయం కోరవచ్చు. ఒక్కసారి కావాల్సిన నిధులు లభించగానే, ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంస్థలు విరాళం ఇచి్చన వ్యక్తులను నెలవారీ స్కీమ్లతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి నెలా తోచినంత దానం ఇచ్చే విధంగా స్కీమ్లు తీసుకొచ్చాయి. విరాళాలకు సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తున్నాయి. బాధితుల అనుభవాలు.. లాహిరి సోదరికి బ్రెయిన్ టీబీ నిర్ధారణ కావడంతో 2019 డిసెంబర్లో నిధుల సమీకరణ కోసం మిలాప్ సంస్థను సంప్రదించారు. మిలాప్ ఆమె అభ్యర్థనకు చక్కగా స్పందించింది. ఫొటోగ్రాఫ్లు, డాక్యుమెంట్లు అడిగారు. అవన్నీ ఇవ్వడంతో, వాటి ఆధారంగా ఒక ప్రచార ప్రకటనను మిలాప్ రూపొందించింది. తెలిసిన వారి సాయంతో దీనికి మంచి ప్రచారం కలి్పంచుకోవాలని మిలాప్ సూచించింది. తాము ఆ ప్రచారాన్ని చేపట్టబోమని, బాధితులే సొంతంగా నిర్వహించడం వల్ల మరింత విశ్వసనీయత ఉంటుందనే సూచన వచ్చింది. దీంతో లాహిరి తనకు తెలిసిన వారికి షేర్ చేశారు. అలా రూ.45,000 విరాళాలు వచ్చాయి. ఇందులో మిలాప్ తన కమీషన్గా రూ.5,000 మినహాయించుకుని, రూ.40,000ను లాహిరి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెల్లించింది. కానీ, మిలాప్ ద్వారా చేసిన ప్రచారం లాహిరి బంధు మిత్రులకు తెలిసిపోవడంతో, వారి నుంచి ఆమెకు మరో రూ.12 లక్షలు విరాళాల రూపంలో నేరుగా వచ్చాయి. మిలాప్ రూపొందించిన ప్రచారమే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని లాహిరి అనుభవం చెబుతోంది. దురదృష్టవశాత్తూ లాహిరి సోదరి బ్రెయిన్ టీబీతో 2020 ఫిబ్రవరిలో మరణించారు. విజయం ఎంత? మీరా అనే వ్యక్తి సైతం, తన భర్త సర్జరీ కోసం కెట్టో ద్వారా నిధుల సమీకరణ చేయగా, మంచి ఆదరణే లభించింది. కెట్టో రిప్రజెంటేటివ్ ఎప్పటికప్పుడు ఆమెతో సంపద్రింపులు చేస్తూ సహకారం అందించడంతో, సర్జరీకి కావాల్సిన మొత్తం 48 గంటల్లోనే సమకూరింది. దేశ, విదేశాల్లోని స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని తెలిసినా, అందుకు వీలుగా కెట్టో ప్లాట్ఫామ్ సాయాన్ని ఆమె తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా కెట్టో ద్వారా విరాళం పంపడం సులభమని భావించి అలా చేసినట్టు చెప్పారు. అయితే, అందరికీ ఇదే తరహా అనుభవం లభిస్తుందా..? ప్రతి ఫండ్ రైజింగ్ విజయవంతం అవుతుందా? అంటే నూరు శాతం అవును అని చెప్పలేం. ఇదంతా తమకున్న పరిచయాలు, ఎంపిక చేసుకున్న ప్లాట్ఫామ్, రూపొందించిన ప్రకటన, ప్లాట్ఫామ్ నుంచి ప్రచారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్నేళ్ల క్రితం మేము సాయం కోసం ఇంపాక్ట్ గురూ ప్లాట్ఫామ్ను సంప్రదించాం. ఇంపాక్ట్ గురూ దాతల నెట్వర్క్ సాయంతో నిధులు సమకూర్చుతారని అనుకున్నాం. కానీ, ఇంపాక్ట్ గురూ అలా చేయలేదు. ప్రచార కార్యక్రమం పేజీని రూపొందించి, ఆ లింక్ను తమ పరిచయస్తులతో పంచుకోవాలని సూచించింది’’అని ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తమ ప్లాట్ఫామ్పై వేలాది ప్రచార కార్యక్రమాలు నమోదవుతున్నందున.. ప్రతీ ఒక్క ప్రచారాన్ని తామే సొంతంగా చేపట్టడం సాధ్యం కాదని ఇంపాక్ట్ గురూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూష్ జైన్ స్పష్టం చేశారు. దాతల కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తుందనుకుంటే, తాము తప్పకుండా ప్రమోట్ చేస్తుంటామని చెప్పారు. కొంచెం కమీషన్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ లు మొత్తం విరాళం నుంచి నిరీ్ణత మొత్తాన్ని కమీషన్/చార్జీ కింద మినహాయించుకుంటున్నాయి. ఇది ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. ‘‘అంతర్జాతీయంగా చూస్తే ప్రతీ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఎంతో కొంత స్వల్ప ఫీజును వసూలు చేస్తున్నాయి. తమ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగేందుకే ఇలా చేస్తున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు, సిబ్బంది, నిధుల సమీకరణ, ముందస్తు విచారణలకు సంబంధించి వ్యయాలు అవుతాయి. మేము నిలదొక్కుకున్నప్పుడే మా లక్ష్యాన్ని (ఫండ్ రైజింగ్) సాధించగలం’’ అని పీయూష్ జైన్ తెలిపారు. ఈ ప్లాట్ఫామ్లలో కొన్ని ప్రీమియం సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంపాక్ట్ గురూ అయితే 0 శాతం, 5 శాతం, 8 శాతం ఇలా మూడ్ స్కీమ్ల కింద ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. మోసాలుంటాయ్.. జాగ్రత్త అవగాహన, జాగ్రత్తలు లేకపోతే ఆన్లైన్ మోసాల బారిన పడే రిస్క్ ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా విరాళాలు కోరినా లేక విరాళం ఇచ్చినా సరే.. ఆ తర్వాత ఫోన్ కాల్ లేదా వాట్సాప్ మెస్సేజ్ లేదా మెయిల్ రావచ్చు. కష్టంలో ఉన్న బాధితులకు సంబంధించి అందులో సాయం కోరొచ్చు. లేదంటే అప్పటికే విరాళం ఇచ్చిన కేసుకు సంబంధించి అప్డేట్ అంటూ మోసగాళ్లు మెయిల్ పంపించొచ్చు. ఒక్కసారి విరాళం ఇస్తే, ఆ తర్వాత నుంచి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు ఇతర బాధితులకు సంబంధించిన వివరాలను మెయిల్స్, వాట్సాప్ మెస్సేజ్లు, కాల్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తుంటాయి. ఇదంతా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. చాలా మంది సాయం చేయాలని భావిస్తుంటారని, బాధితుల వివరాలను వారు మెయిల్ లేదా వాట్సాప్ సందేశాలు, కాల్స్ రూపంలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జైన్ తెలిపారు. ఇవి వద్దనుకునే వారు అన్సబ్స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు అన్నీ కూడా సురక్షిత చెల్లింపుల సాధనాలనే వినియోగిస్తున్నాయి. కానీ, వీటి పేరుతో సైబర్ నేరస్థులు ఆకర్షించే కథనాలు, మోసపూరిత పేమెంట్ లింక్లు పంపించి, బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే విరాళం ఇచ్చే ముందు సంబంధిత సంస్థల యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఎలక్టోరల్ బాండ్లపై విస్తృత ధర్మాసనం
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల నిధుల సమీకరణ కోసం చేసే ఎలక్టోరల్ బాండ్ల జారీ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనిపై దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో ధర్మాసనం తుది విచారణ జరపనుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సోమవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుందని తొలుత ధర్మాసనం పేర్కొనడం తెలిసిందే. ‘‘కానీ విషయ తీవ్రత, ప్రాధాన్యం దృష్ట్యా సుప్రీంకోర్టు కార్యకలాపాలను నియంత్రించే ఆరి్టకల్145(4) ప్రకారం కనీసం ఐదుగురు జడ్జిల ధర్మాసనం దీనిపై వాదనలు ఆలకిస్తుంది’’ అని తాజాగా వివరించింది. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల పథకం మళ్లీ తెరపైకి రాకముందే ఈ కేసును తేల్చేయాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అక్టోబర్ 10న ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. బాండ్ల ద్వారా ఇలాంటి అనామక నిధుల ప్రవాహం ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగి దేశం అవినీతిరహితంగా మారాలన్న ఆశయానికి తూట్లు పొడుస్తోందని ఆయన ఆరోపించారు. దాంతో ఈ పిటిషన్లపై విచారణను అక్టోబర్ 31న మొదలు పెట్టి నవంబర్ 1కల్లా ముగిస్తామని ధర్మాసనం ప్రకటించింది. 2018లో తెరపైకి... పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసమని 2018 జనవరి 2న కేంద్రం ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచి్చంది. దీని ప్రకారం పార్టీలు నగదుకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు స్వీకరిస్తాయి. భారత పౌరులు, సంస్థలు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ రూపంలో పార్టీలకు ఇప్పటిదాకా ఏకంగా రూ.12,000 కోట్లు అందాయని పిటిషన్దారుల్లో ఒకరు పేర్కొన్నారు. వీటిలో మూడింట రెండొంతుల మొత్తం ఒకే పార్టీకి చేరిందన్నారు! ఎలక్టోరల్ బాండ్ల సేకరణపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రెండు సార్లు తోసిపుచి్చంది. -
పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?
వాషింగ్టన్: అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వానికి కొత్త ఆర్ధిక సంవత్సరం ముందు షాక్ తగిలింది. అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించగా 232-198 తేడాతో ఆమోదానికి నోచుకోలేదు. దీనివలన వచ్చేనెల ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోనున్నాయి. మొదట్లో బెట్టు చేసినా చివరి నిమిషంలో రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదంటున్నాయి అమెరికా కాంగ్రెస్ వర్గాలు. షట్ డౌన్? ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికాలో ఆర్ధిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈనెలలో చివరి రోజైన శనివారం ఈ బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీనివలన 18 లక్షల మంది ఉద్యోగులున్న ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులు, ఆయా పథకాలకు నిధులతో పాటు సైనికుల జీతాలు కూడా స్తంభించిపోయే ప్రమాదముంది. ఎందుకు ఆగింది? సరిహద్దు భద్రత ఏజెన్సీ తోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనిని రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్కు నిధులివ్వాలనే బిల్లును తిరస్కరించనున్నారు. అమెరికా కాంగ్రెస్లోని ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదం కష్టసాధ్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ బిల్లును ఆమోదింపజేసి షట్ డౌన్ నివారించేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేశారు. చివరి రోజున కూడా ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని అంటున్నాయి యూఎస్ కాంగ్రెస్ వర్గాలు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే బిల్లులో నుంచి ఉక్రెయిన్ అంశాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని అంటున్నారు సెనేటర్ రాండ్ పాల్. Like Sen. McConnell said, nobody benefits from a government shutdown—it hurts our services, economy, and neighbors…and it doesn’t save money. It's our job to pass a budget. House Republicans need to put their partisan games aside & work with us to avoid a disastrous shutdown. pic.twitter.com/uhgtecLDpx — Rep. Morgan McGarvey (@RepMcGarvey) September 29, 2023 ఇది కూడా చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. -
ఎన్బీఎఫ్సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు జూన్లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్బీఎఫ్సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
ఐపీవో బూమ్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతోపాటు.. పటిష్ట లాభాలతో కదులుతుండటంతో ప్రైమరీ మార్కెట్ జోరందుకుంది. కొద్ది రోజులుగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు ఆసక్తి చూపుతున్నాయి. మే–జూలై మధ్య సుమారు 10 కంపెనీలు నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. వీటిలో ఐకియో లైటింగ్, సెన్కో గోల్డ్, గ్లోబల్ సర్ఫేస్, ఐడియాఫోర్జ్ టెక్, డివ్గీ టార్క్ట్రాన్స్ఫర్, మ్యాన్కైండ్ ఫార్మా, నెట్వెబ్ టెక్, ఉత్కర్‡్ష ఎస్ఎఫ్బీ తదితరాలను పేర్కొనవచ్చు. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. జాబితాలో సెల్లో బ్రాండ్ సంస్థ సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లెక్సిబుల్ హోస్ తయారీ కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 102–108 ధరల శ్రేణి నిర్ణయించింది. ఈ నెల 22–24 మధ్య చేపట్టనున్న ఇష్యూలో భాగంగా రూ. 162 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.75 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ శాట్ ఇండస్ట్రీస్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 351 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 21న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో 91 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇతర సంస్థల కొనుగోళ్లనూ చేపట్టనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 130 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 80 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీ తద్వారా 80 శాతం ఆదాయాన్ని అందుకుంటోంది. 2022–23లో రూ. 269 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెల్లో వరల్డ్ సెల్లో బ్రాండుతో హౌస్హోల్డ్, స్టేషనరీ ప్రొడక్టులను తయారు చేస్తున్న సెల్లో వరల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ. 1,750 కోట్లు సమీ కరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఈ క్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ముంబై కంపెనీ అర్హతగల తమ ఉద్యోగులకు రూ. 10 కోట్ల వి లువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ హౌస్వేర్, రైటింగ్, స్టేషనరీ ప్రొడక్టులతోపాటు.. మౌల్డెడ్ ఫరీ్నచర్, తత్సంబంధిత ఉత్పత్తులను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో గ్లాస్వేర్, ఒపల్ వేర్ ప్రొడక్టులను సై తం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. రాజస్టాన్లో గ్లాస్వేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. 2022–23లో రూ. 1,770 కోట్ల ఆదాయం, రూ. 285 కోట్ల నికర లాభం ఆర్జించింది. హ్యాపీ ఫోర్జింగ్స్ ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80.55 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా కంపెనీ మరో రూ. 500 కోట్ల విలువచేసే ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకు ముందుగా రూ. 100 కోట్ల విలువైన షేర్లను జారీ చేసే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 214 కోట్లు ప్లాంటు మెషినరీ, ఎక్విప్మెంట్ తదితరాలకు, రూ. 190 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులను వెచ్చించనుంది. వాణిజ్య, వ్యవసాయ, ఆఫ్రోడ్ వాహనాలకు విడిభాగాలను సమకూరుస్తోంది. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు తదితర దిగ్గజాలు క్లయింట్లుగా ఉన్నాయి. విదేశాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2022–23లో రూ. 1,197 కోట్ల ఆదాయం, రూ. 209 కోట్ల నికర లాభం ఆర్జించింది. 18 నుంచి బొండాడ ఇంజినీరింగ్ ఐపీవో టెలికం, సౌర విద్యుత్ రంగ సంస్థలకు మౌలిక సదుపాయాలపరమైన సేవలు అందించే బొండాడ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 42.72 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధరను రూ. 75గా నిర్ణయించారు. ఇష్యూ 18న ప్రారంభమై 22న ముగుస్తుందని సంస్థ సీఎఫ్వో బరతం సత్యనారాయణ తెలిపారు. కనీసం 1600 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై దీన్ని లిస్ట్ చేయనున్నామని వివరించారు. పూర్తిగా ఈక్విటీ జారీ రూపంలో ఈ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఐపీవో ద్వారా వచ్చే నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 1,150 కోట్ల ఆర్డరు లభించిందని, ప్రస్తుతం మొత్తం ఆర్డరు బుక్ విలువ రూ. 1,600 కోట్ల మేర ఉందని ఉందని వివరించారు. -
అదానీ గ్రీన్ నిధుల సమీకరణకు సై
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. షేర్ల విక్రయం ద్వారా రూ. 12,300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) మార్గంలో నిధులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇటీవల గ్రూప్లోని మరో రెండు కంపెనీలు సైతం నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. క్విప్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమకూర్చుకోనున్నట్లు ఇప్పటికే తెలియజేశాయి. ప్రధానంగా యూరప్, మధ్యప్రాచ్యం నుంచి ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నివేదిక వెలువడిన తదుపరి అదానీ గ్రూప్ కంపెనీలు పెట్టుబడుల సమీకరణ, కొత్త ప్రాజెక్టులతో విస్తరణకు తెరతీశాయి. హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచి్చన గ్రూప్ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు వీలుగా ముందస్తు రుణ చెల్లింపులకు ప్రాధాన్యమిస్తున్న విషయం విదితమే. -
అదానీలో జీక్యూజీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీలలో జీక్యూజీ పార్ట్నర్స్ తదితర పెట్టుబడి సంస్థలు తాజాగా బిలియన్ డాలర్లు(సుమారు రూ. 8,200 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. గ్రూప్లోని డైవర్సిఫైడ్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో 1.6 శాతం వాటాకు సమానమైన 1.8 కోట్ల షేర్లు కొనుగోలు చేశాయి. ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ 2.2 శాతం వాటాకు సమానమైన 3.52 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీల సమాచారంమేరకు రెండు కంపెనీలలో బ్లాక్ట్రేడ్స్ నమోదయ్యాయి. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల తదుపరి చైర్మన్ గౌతమ్ అదానీ.. గ్రూప్పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు ముందస్తు రుణ చెల్లింపులు, నిధుల సమీకరణ తదితర చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో జీక్యూజీ పార్ట్నర్స్.. అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూప్లోని నాలుగు కంపెనీలలో ప్రమోటర్లు 1.87 బిలియన్ డాలర్ల(రూ. 15,446 కోట్లు) విలువైన వాటాలను జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించారు. తదుపరి మే నెలలో మరో 40–50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను జీక్యూజీ కొనుగోలు చేసింది. బ్లాక్డీల్స్ ఇలా.. అదానీ ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో మంగళవారం ధర రూ. 2,281తో పోలిస్తే షేరుకి రూ. 2,300 ధరలో బుధవారం బీఎస్ఈలో లావాదేవీ నమోదైంది. అయితే అదానీ గ్రీన్లో ముందురోజు ధర రూ. 960తో పోలిస్తే రూ. 925–920 ధరలో బ్లాక్డీల్స్ జరిగాయి. తద్వారా రెండు కంపెనీలలోనూ విడిగా 50 కోట్ల డాలర్ల విలువైన ప్రమోటర్ల వాటాలు విదేశీ సంస్థలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 5.3 శాతం జంప్చేసి రూ. 2,404 వద్ద నిలవగా.. అదానీ గ్రీన్ స్వల్ప నష్టంతో రూ. 958 వద్ద ముగిసింది. తొలుత 7 శాతం పతనంకావడం గమనార్హం! మేలో నిర్వహించిన బోర్డు సమావేశాలలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ 2.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 21,000 కోట్లు) సమీకరణకు ఆమోదించాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయించాలని ప్రతిపాదించాయి. -
నిధుల సమీకరణకు హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ: మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నిధుల సమీకరణకు తెరతీసింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో పెట్టుబడులను సమీకరించనున్నట్లు పేర్కొంది. పదేళ్ల కాలావధితో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్సీడీలను కేటాయించనున్నట్లు తెలియజేసింది. వెరసి దీర్ఘకాలిక నిధులను అందుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. నిధులను గృహ రుణ బిజినెస్కు అవసరమయ్యే ఫైనాన్సింగ్, రీఫైనాన్సింగ్కు వినియోగించనున్నట్లు వివరించింది. నిధుల సమీకరణ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం నీరసించి రూ. 2,643 వద్ద ముగిసింది. -
ఐఐఎఫ్ఎల్ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగేతర సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రుణ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువైన సెక్యూర్డ్ రీడీమబుల్ ఎన్సీడీలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. వీటికి 9 శాతంవరకూ రిటర్నులను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 9న వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధులను వ్యాపారాభివృద్ధి, మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇష్యూకి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో రూ. 1,200 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం కేటాయించేందుకు గ్రీన్ షూ అప్షన్ను ఎంచుకున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. 60 నెలల కాలానికిగాను ఇన్వెస్టర్లకు 9 శాతం వరకూ రిటర్నులను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 24 నెలలు, 36 నెలల కాలావాధితోనూ బాండ్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. వడ్డీని వార్షికంగా లేదా నెలవారీ చెల్లించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఏప్రిల్లో 40 కోట్ల డాలర్ల విలువైన డాలర్ బాండ్లను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. వీటిని 2020 ఫిబ్రవరిలో జారీ చేసింది. -
ఐపీవోకి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను (డీఆర్హెచ్పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్డబ్ల్యూ గ్రూప్లో భాగమైన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఫోన్పేకు జనరల్ అట్లాంటిక్ నిధులు
న్యూఢిల్లీ: డెకాకర్న్ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ నుంచి 10 కోట్ల డాలర్లను(రూ. 820 కోట్లు) సమీకరించింది. ఇప్పటికే ప్రారంభించిన బిలియన్ డాలర్ల సమీకరణలో భాగంగా ప్రస్తుత పెట్టుబడులను సమకూర్చుకుంది. కంపెనీ 12 బిలియ న్ డాలర్ల విలువలో నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా రిటైల్ రంగ దిగ్గజం వాల్మార్ట్ గ్రూప్ కంపెనీ ఇప్పటివరకూ 75 కోట్ల డాలర్ల పెట్టుబడులను అందుకుంది. జనరల్ అట్లాంటిక్ 2023 జనవరిలో 35 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! వాల్మార్ట్ 20 కోట్ల డాలర్లు, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ 10 కోట్ల డాలర్లు చొప్పున ఫోన్పేలో ఇన్వెస్ట్ చేశాయి. -
4 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల నిధుల సమీకరణ ప్రణాళికలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సైయంట్ డీఎల్ఎం, రాశి పెరిఫెరల్స్, హెల్త్విస్టా ఇండియా, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ 2022 జూలై– 2023 జనవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. తద్వారా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు మార్చి 29–31 మధ్య అనుమతి పొందాయి. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు దారి ఏర్పడింది. ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించే రాశి పెరిఫెరల్స్ ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. పూర్తిగా షేర్ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 400 కోట్లను రుణ చెల్లింపులు, రూ. 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సైయంట్ డీఎల్ఎం సైతం రూ. 740 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీ జారీకి తెరతీయనుంది. ఈ నిధులను మూలధన అవసరాలు, విస్తరణ వ్యయాలు, రుణ చెల్లింపులు, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. హెల్త్కేర్ సేవలు పోర్టీ బ్రాండుతో ఆసుపత్రుల బయట ఆరోగ్య పరిరక్షణ సేవలందించే హెల్త్విస్టా ఇండియా ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 5.62 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ మెడీబిజ్ ఫార్మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు, మెడికల్ పరికరాల కొనుగోళ్లు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు వినియోగించనుంది. ఫైనాన్షియల్ సేవలు ఐపీవోలో భాగంగా ఫైనాన్షియల్ సేవలందించే ఫిన్టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1.05 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వినియోగదారులను పెంచుకోవడం, టెక్నాలజీ, ప్రొడక్టుల అభివృద్ధి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఖతార్ ఇన్వెస్ట్మెంట్కు సీసీఐ ఓకే
న్యూఢిల్లీ: సింగపూర్ నిధుల సమీకరణ సంస్థ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) ప్రతిపాదిత పెట్టుబడులకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. క్యూఐఏ ఖతార్కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్కాగా.. మర్డోక్ సంస్థ లుపా సిస్టమ్స్(జపాన్)తోపాటు, స్టార్, డిస్నీ ఇండియా మాజీ చైర్మన్ ఉదయ్ శంకర్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ వెంచర్ సంస్థే బీటీఎస్1. అయితే బీటీ ఎస్1లో క్యూఐఏ పెట్టుబడులు పెట్టనుంది. వయాకామ్18లో పెట్టుబడుల కోసం బీటీఎస్1 వివిధ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. క్యూఐఏ నుంచి 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు గతేడాది ఫిబ్రవరిలో మర్డోక్, ఉదయ్ శంకర్ బోధి ట్రీ సిస్టమ్స్(బీటీఎస్)ను ఏర్పాటు చేశారు. తదుపరి ఏప్రిల్లో బిలియనీర్ ముకేశ్ అంబానీతో భాగస్వా మ్యం ద్వారా బీటీఎస్.. వయాకామ్18లో రూ. 13,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ త్రిముఖ ఒప్పందం ద్వారా దేశీయంగా భారీస్థాయిలో టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆపై 2022 సెప్టెంబర్లో బీటీఎస్ ఇన్వెస్ట్మెంట్, రిలయన్స్ ప్రాజెక్ట్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పెట్టుబడుల నేపథ్యంలో జియో సినిమా, వయాకామ్18 మీడియా విలీనానికి సీసీఐ అనుమతించింది. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
గ్రీన్కో రూ. 5,700 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రీన్కో రూ.5,700 కోట్ల నిధులను సమీకరించింది. సింగపూర్కు చెందిన జీఐసీ, జపాన్ కంపెనీ ఓరిక్స్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు (ఏడీఐఏ) సంస్థ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేశ్ కొల్లి ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఈక్విటీ నిధులను 25 గిగావాట్ అవర్ కంటే అధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్లకు ఉపయోగిస్తామని గ్రీన్కో గ్రూప్ జేఎండీ మహేశ్ కొల్లి వెల్లడించారు. తాజాగా అందుకున్న పెట్టుబడిలో జీఐసీ 51 శాతం, ఓరిక్స్ 16, ఏడీఐఏ 14, వ్యవస్థాపకులు 13 శాతం సమకూర్చినట్టు తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటైన గ్రీన్కో గ్రూప్ ఖాతాలో భారత్లో 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్ల సామర్థ్యం గల సౌర, పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. ఫస్ట్మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, లోహియా కార్ప్ నిధుల సమీకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలు 2022 సెప్టెంబర్– 2023 జనవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. ఫస్ట్మెరిడియన్ సిబ్బంది నియామక(స్టాఫింగ్) సంస్థ ఫస్ట్మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్సహా ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా మరో రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ మ్యాన్పవర్ సొల్యూషన్స్ రూ. 615 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఐఆర్ఎం ఎనర్జీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 650–700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలలో బిజినెస్(సిటీ గ్యాస్ పంపిణీ) నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. పీఎన్జీ, సీఎన్జీ పంపిణీ చేసే కంపెనీ గుజరాత్, పంజాబ్లోనూ కార్యకలాపాలు విస్తరించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తికి వినియోగించే మెషినరీ తయారీ కంపెనీ లోహియా కార్ప్ ఐపీవోలో భాగంగా 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. 2022 మార్చి31కల్లా కంపెనీ 90 దేశాలలో 2,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, సేక్స్ తదితర టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి వినియోగించే మెషీనరీ, పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. -
ఫ్రెష్టుహోమ్ 104 మిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ: మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే స్టార్టప్ సంస్థ ఫ్రెష్టుహోమ్ తాజాగా రూ. 104 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 861 కోట్లు) సమీకరించింది. అమెజాన్ ఎస్ఎంభవ్ వెంచర్ ఫండ్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఈ నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించుకోనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో 100 భౌతిక రిటైల్ స్టోర్స్ను ప్రారంభించనుంది. 2015లో బెంగళూరు కేంద్రంగా ఫ్రెష్టుహోమ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశీయంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 160 పైగా నగరాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 250 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించినట్లు సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు షాన్ కడవిల్ తెలిపారు. ప్రస్తుతం 30 రిటైల్ స్టోర్స్ ఉండగా వచ్చే 12 నెలల్లో వీటిని 130కి పెంచుకోనున్నట్లు వివరించారు. అటు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనున్నట్లు తెలిపారు. 2025 ఆఖరు నాటికి ఐపీవోకి (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే యోచనలో ఉన్నట్లు కడవిల్ చెప్పారు. ప్రస్తుతం తమ వార్షికాదాయం దాదాపు రూ. 1,100 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. -
నిధుల వేటలో ధృవ స్పేస్
హైదరాబాద్: స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ధృవ స్పేస్ ఒకట్రెండేళ్లలో రూ.204 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. 100 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అభయ్ ఏగూర్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్లో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నామని, ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘ధృవ స్పేస్ ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు అవసరం లేదు. అయితే కంపెనీకి చెందిన ఇతర విభాగాలకు ఇది అవసరం కావచ్చు. పెద్ద శాటిలైట్ ప్లాట్ఫామ్స్ అభివృద్ధి వైపునకు కంపెనీ వెళుతోంది. ఇప్పటికే ప్రయోగించిన వాటి కంటే కొంచెం పెద్ద ఉపగ్రహాలను వచ్చే ఏడాది మధ్యలో లే దా చివరిలో కక్ష్యలో ప్రవేశపెట్టగలమని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు తగ్గ అభివృద్ధి పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ధృవ స్పేస్ రూపొందించిన నానో ఉపగ్రహాలు తైబోల్ట్–1, తైబోల్ట్–2 శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ54 ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా ఇస్రో నవంబర్ 26న విజయవంతంగా ప్రయోగించింది. వీటి విజయం తర్వాత సంస్థ ప్రస్తుతం పీ30 ప్లాట్ఫామ్లో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్ను విస్తృతంగా అందజేసే 30 కిలోల బరువున్న ఉపగ్రహంపై పని చేస్తోంది’ అని అభయ్ పేర్కొన్నారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడం మొదలైందని, ప్రస్తుతం కంపెనీ బృందం ఈ మిషన్ను కొనసాగించడంలో, ఉపగ్రహాలను నిర్వహించడంలో బిజీగా ఉందన్నారు. దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ధృవ స్పేస్ ఇప్పటి వరకు రూ.65 కోట్ల నిధులను అందుకుంది. -
రిషి, ద వెండర్!
మెడలో ట్రే వేలాడదీసుకుని పాపీస్ అమ్ముతున్నదెవరో గుర్తు పట్టారు కదూ! అవును. బ్రిటన్ ప్రధాని రిషియే. గురువారం ఉదయం పూట మంచి రష్ అవర్లో వెస్ట్మినిస్టర్ మెట్రో స్టేషన్లో ఇలా దర్శనమిచ్చి ప్రయాణికులను సర్ప్రైజ్ చేశారాయన. రాయల్ బ్రిటిష్ లెజియన్కు నిధుల సేకరణ కోసం సైనికులతో కలిసి ఇలా వెండర్ అవతారమెత్తారు. పేపర్తో చేసిన ఒక్కో పాపీని ఐదు పౌండ్లకు అమ్మారు! చాలామంది ఆయన నుంచి వాటిని కొనుగోలు చేస్తూ కన్పించారు. పలువురు రిషితో సెల్ఫీలు తీసుకుంటూ గడిపారు. రిషి చర్యను మెచ్చుకుంటూ, ఆయన వద్ద తాము పాపీస్ కొన్నామని పేర్కొంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. -
మళ్లీ ఐపీవోల హల్చల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇటీవల దేశీయంగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. ఇటీవలే నిధుల సమీకరణ చేపట్టిన హర్ష ఇంజినీర్స్ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో లిస్ట్కాగా.. ప్రభుత్వ రంగ కంపెనీ వ్యాప్కోస్ ఐపీవో బాట పట్టింది. మరోవైపు ఫ్లోట్ గ్యాస్ తయారీ కంపెనీ గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీ, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ యూనిపార్ట్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూలకు తాజాగా సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం.. గోల్డ్ ప్లస్ గ్లాస్.. ఈ ఏడాది ఏప్రిల్లో ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. దీంతో ఐపీవోలో భాగంగా ఫ్లోట్ గ్లాస్ తయారీ కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.28 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఫ్లోట్ గ్లాస్ తయారీలో కంపెనీ దేశీయంగా 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆటోమోటివ్, నిర్మాణం, పారిశ్రామిక రంగాలలో ప్రధానంగా కంపెనీ ప్రొడక్టులు వినియోగమవుతున్నాయి. యూనిపార్ట్స్ ఇండియా ఐపీవోకు వీలుగా ఈ ఏడాది ఏప్రిల్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన యూనిపార్ట్స్ ఇండియాకు సెబీ ఓకే చెప్పింది. దీంతో ఇష్యూలో భాగంగా 1.57 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. 2014 సెప్టెంబర్లో ఒకసారి, 2018 డిసెంబర్లో మరోసారి పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేసింది. ఈ రెండుసార్లూ సెబీ నుంచి అనుమతులు సైతం పొందింది. అయితే పరిస్థితులు అనుకూలించక వెనకడుగు వేసింది. కంపెనీ ప్రధానంగా ఆఫ్హైవే మార్కెట్కు అనుగుణమైన సిస్టమ్స్, విడిభాగాలను సరఫరా చేస్తోంది. వ్యవసాయం, కన్స్ట్రక్షన్, మైనింగ్ తదితర రంగాలకు సొల్యూషన్లు, ప్రొడక్టులు అందిస్తోంది. ఐపీవోకు వ్యాప్కోస్ నీటిపారుదల, విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాలలో కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సర్వీసులందించే పీఎస్యూ సంస్థ వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడుతోంది. ఇందుకు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 3.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్(కేంద్ర ప్రభుత్వం) విక్రయానికి ఉంచనుంది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కంపెనీ దక్షిణాసియా, ఆఫ్రికాలోనూ డ్యాములు, రిజర్వాయర్లకు సంబంధించిన ఇంజినీరింగ్, ఇరిగేషన్, వరద నియంత్రణ సర్వీసులను అందిస్తోంది. 30 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 455కుపైగా ప్రాజెక్టులు చేపట్టింది. గతేడాది(2021–22) ఆదాయం 11 శాతం బలపడి రూ. 2,798 కోట్లకు చేరగా.. నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 69 కోట్లను అధిగమించింది. కంపెనీ పనిచేస్తున్న విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఇతర సంస్థలలో ఇప్పటికే లిస్టయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీ సీసీ, వా టెక్ వాబాగ్లను ప్రస్తావించవచ్చు. -
మళ్లీ ఐపీవోల స్పీడ్
న్యూఢిల్లీ: ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు బలపడుతుండటంతో ప్రైమరీ మార్కెట్లకు మళ్లీ కళ వస్తోంది. తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నిధుల సమీకరణ చేపట్టనున్న జాబితాలో జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ సబ్సిస్టమ్స్, కేబుళ్ల(ఎలక్ట్రానిక్) తయారీ సంస్థ డీసీఎక్స్ సిస్టమ్స్, మాంసం(ఫ్రోజెన్) ఎగుమతుల కంపెనీ హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వీలుగా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ప్రాస్పెక్టస్ల ప్రకారం మూడు కంపెనీలూ ఉమ్మడిగా రూ. 1,605 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. సెన్కో గోల్డ్ ఐపీవోలో భాగంగా సెన్కో గోల్డ్ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ వాటాదారు సైఫ్ పార్టనర్స్ ఇండియా 4 లిమిటెడ్ మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 525 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 240 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ప్రస్తుతం కంపెనీ 127 షోరూమ్లను నిర్వహిస్తోంది. వీటిలో 70 సొంతంకాగా.. మరో 57 ఫ్రాంచైజీలు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా సైతం ప్రొడక్టులను విక్రయిస్తోంది. జ్యువెలరీని దుబాయ్, మలేసియా, సింగపూర్లకు ఎగుమతి చేస్తోంది. డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా డీసీఎక్స్ సిస్టమ్స్ రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థలు ఎన్సీబీజీ హోల్డింగ్స్, వీఎన్జీ టెక్నాలజీ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ ఇంటిగ్రేషన్తోపాటు వివిధ ఎలక్ట్రానిక్ కేబుళ్లు, అసెంబ్లీలను రూపొందిస్తోంది. హెచ్ఎంఏ ఆగ్రో ఐపీవో ద్వారా హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ. 480 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా రూ. 150 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 330 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో నిధుల్లో రూ. 135 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆగ్రా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఘనీభవించిన ఎద్దు మాంసంతో కూడిన ప్రొడక్టులను 40 దేశాలకుపైగా ఎగుమతి చేస్తోంది. అమ్మకాలలో 90 శాతం ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. -
ఐఓబీ రుణ రేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా పెంచింది. అన్ని కాలపరిమితులపై ఈ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. 10వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణ రేటుకు ప్రధానంగా ప్రామాణికంగా ఉండే ఏడాది రుణ రేటు 7.45% నుంచి 7.55%కి చేరింది. రెండు, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 7.55% కి చేరింది. ఓవర్నైట్ నుంచి ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 నుంచి 7.50% శ్రేణిలో ఉన్నాయి. -
రూ. 500 కోట్ల నిధుల సమీకరణ ప్లాన్స్: వోడాఫోన్ ఐడియా జూమ్
సాక్షి, ముంబై: ప్రముఖ టెల్కో వోడాఫోన్ ఐడియా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తరుణంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్లో వోడాఫోన్ షేర్ దాదాపు 3 శాతం లాభపడింది. వోడాఫోన్ గ్రూప్ సంస్థలకు ప్రాధాన్యత ఆధారంగా ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి బోర్డు బుధవారం సమావేశమవుతుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారంలో వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా గ్రూపు నుంచి రూ. 500 కోట్ల ఫండ్ ఇన్ఫ్యూషన్ ప్లాన్ను పరిశీలించేందుకు వోడాఫోన్ ఐడియా బోర్డు బుధవారం సమావేశం కానుంది. దీనికి బోర్డు ఆమోదం తె లిపితే రెండు నెలల్లో ఇది రెండవది కావడం విశేషం. మరోవైపు బోర్డు ఆమోదించిన రూ. 25,000 కోట్ల అదనపు పెట్టుబడులకు గాను ఇటీవలి రూ. 4,500 కోట్ల పెట్టుబడులకు తోడు తమకు ఇంకా రూ. 20,000 కోట్లు అవసరమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ ఇటీవల వెల్లడించారు. ఫండ్ ఇన్ఫ్యూషన్తో సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు, 5జీ పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఇద్దరు ప్రమోటర్ల రూ. 4,500 కోట్ల నిధుల సమీకరణను కంపెనీ బోర్దు ఆమోదించింది. వోడాఫోన్ ఐడియాలో వొడాఫోన్ గ్రూప్ దాదాపు రూ.3,375 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,125 కోట్లు పెట్టింది. అయితే, ఎయిర్టెల్, జియోలతో పోలిస్తే కంపెనీ ఇప్పటివరకు ఒక్క విదేశీ ఇన్వెస్టర్ పెట్టుబడులను సేకరించ లేకపోయింది. -
బాండ్ల జారీలో తగ్గిన కార్పొరేట్ స్పీడ్
న్యూఢిల్లీ: బాండ్ల జారీ ద్వారా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు కేవలం రూ.5.88 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో ఈ మార్గంలో నిధుల సమీకరణ ఇంత తక్కువ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. 2020–21లో ఈ విధానం ద్వారా కార్పొరేట్లు రూ.7.72 లక్షల కోట్ల నిధుల సమీకరించాయి. అంటే వార్షికంగా చూస్తే 24 శాతం తగ్గాయన్నమాట. ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరును కనబరచడం, బ్యాంకింగ్ తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల నేపథ్యంలో ఈ సాధనాల ద్వారానే నిధుల సమీకరణకు కార్పొరేట్లు మొగ్గు చూపినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. వడ్డీరేట్ల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మూలధన అవసరాలు పెరగడం వంటి పరిస్థితుల్లోనే తిరిగి కార్పొరేట్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ల వైపు దృష్టి సారించవని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ మళ్లీ డిఫాల్ట్ -
సొంత కాళ్లపై నిలబడేందుకు పోరాడుతున్నాడు.. సాయం అందించండి..
నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడంతో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అనే కంగారు నాలో మొదలైంది. రోజులు గడుస్తున్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చిట్టిచేతులతో ఆడుకోవడం చూసి ముచ్చటపడేదాన్ని. అయితే నెలల వయసొచ్చినా తోటి వారితో పోల్చితే కదలడం, గొంతు నుంచి శబ్ధాలు రావడంలో తేడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నేను భయపడినట్టే జరిగింది. అరుదగా వచ్చే జన్యు సంబంధమైన వ్యాధి కారణంగా నా బిడ్డ షాహిద్కి బ్రెయిన్, కండాలల్లో సమస్యలు తలెత్తుతున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని, అందిన కాడికి అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగాము. బ్రెయిన్కి అనేక ఆపరేషన్లు జరిగాయి. చివరకు షాహిద్ మాట్లాడుతుండటంతో మా కష్టాలు తొలగినట్టే భావించాం. కానీ ఇక్కడే మరో సమస్య ఎదురైంది. మాటలయితే వచ్చాయి కానీ కాళ్లు కదపలేని స్థితిలోనే ఉండిపోయాడు షాహిద్. ఇప్పుడు వాడికి పదమూడేళ్లు. ఇన్నేళ్లుగా లేచి నడవడటానికి అందరిలా ఉండటానికి వాడు చేయని ప్రయత్నం లేదు. బాధపడని క్షణం లేదు. అలా చేసే ప్రయత్నంలో దెబ్బలు తగలడం నొప్పితో విలవిలాడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. బిడ్డ కష్టాలు చూడలేక మళ్లీ ఆస్పత్రుల బాట పట్టాం. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రకరకాల పరీక్షలు చేశారు డాక్టర్లు. వరుసగా కొన్ని సర్జరీలు చేయడం ద్వారా షాహిద్ను నడిపించే వీలుందని చెప్పారు. అయితే ఈ ఆపరేషన్లకు రూ.3.20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. పదమూడేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఉన్నాం. నా భర్త గఫూర్ రోజువారి పనులకు వెళ్లి తెస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగించేది. నా కొడుక్కి వాడి కాళ్ల మీద వాడు నిలబడి, అందరిలా బతికేందుకు మీ సహకారం కావాలి. షాహిద్ సర్జరీకి అవసరమైన సొమ్ము సమకూర్చేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
బైజూస్ భారీగా నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. వీటిలో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ సగం పెట్టుబడులు అందించినట్లు బైజూస్ పేర్కొంది. తాజా రౌండ్లో 80 కోట్ల డాలర్లు(సుమారు రూ. 6,000 కోట్లు) సమకూర్చుకున్నట్లు తెలిపింది. నిధులు అందించిన కంపెనీల్లో సుమేరు వెంచర్స్, విట్రువియన్ పార్ట్నర్స్, బ్లాక్రాక్ ఉన్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా పెట్టుబడులను 22 బిలియన్ డాలర్ల విలువలో కంపెనీ సమీకరించింది. తాజా పెట్టుబడుల్లో బైజు రవీంద్రన్ 40 కోట్ల డాలర్లు సమకూర్చినట్లు, 9–12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ వెల్లడించింది. ఈ పెట్టుబడులతో రవీంద్రన్ వాటా 23% నుంచి 25%కి పెరిగినట్లు తెలియజేసింది. -
పసిపాప ప్రాణాలు దక్కాలంటే.. రూ.13 లక్షలు కావాలి
పిల్లలు కావాలంటూ ఆరేళ్లుగా నేను చేస్తున్న ప్రార్థనలు ఫలించాయి. 2021లో నేను గర్భం దాల్చినట్టు డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా అంటూ నేను నా భార్త ఎదురు చూడని రోజంటూ లేదు. నాకు ఆరో నెల ఉందనగా అకస్మాత్తుగా పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నా భర్త అమిత్ పని చేస్తున్న చోటు నుంచి వెంటనే ఆస్పత్రికి వచ్చాడు. (సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి) కళ్లు తెరిచి చూసేరికి నాకు ప్రసవం జరిగిందని, ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. నా బిడ్డ కోసం ఆ గది అంతటా చూస్తుండగా నా భర్త గదిలోకి వచ్చాడు. నెలలు నిండ కుండానే ప్రసవం కావడం వల్ల పాప ఆరోగ్యం పరిస్థితి బాగా లేదన్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి పాపకి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఒక్కసారి నా బిడ్డను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటానంటూ నా భర్తను కోరాను. ప్రీ మెచ్యూర్ బేబీ అవడం వల్ల శిశువు పరిస్థితి చాలా డెలికేట్గా ఉందని, మనం ముట్టుకున్నా సరే ఆమె తట్టుకోలేదంటూ డాక్టర్లు చెప్పారు. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఐసీయూలో ఉంచి రెండు నెలలకు పైగా చికిత్స అందివ్వాలన్నారు డాక్టర్లు. పాప చికిత్సకి రూ. 13.22 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. కారు వర్క్షాప్లో పని చేసే అమిత్ నెల సంపాదన మొత్తం రూ.10 వేలు దాటదు. అలాంటిది రూ.13 లక్షల రూపాయలు తేవడం మాకు అసాధ్యమైన పని. మా ఆర్థిక పరిస్థితి కారణంగా నా పసిపాప ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా బిడ్డ ఆరోగ్యం బాగుపడాలంటే ఖరీదైన వైద్యం చేయించక తప్పదు. పసిపాప ప్రాణాలు కాపాడేందుకు మీరు సహాయం కావాలి. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
పాక్లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
ఫ్యాబ్ ఇండియా బంపరాఫర్..వారికి 7 లక్షల షేర్లు ఉచితం..!
న్యూఢిల్లీ: లైఫ్స్టయిల్ రిటైల్ దుకాణాల సంస్థ ‘ఫ్యాబ్ ఇండియా’ కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వనుంది. త్వరలో ఈ సంస్థ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను చేపట్టనుంది. దీంతో 7 లక్షల షేర్లను కళాకారులకు (చేతి వృత్తుల వారు), రైతులకు ఉచితంగా ఇవ్వాల ని నిర్ణయించింది. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్హెచ్పీ) ఈ సంస్థ సెబీ వద్ద శనివారం దాఖలు చేసింది. రూ.500 కోట్ల తాజా ఇష్యూతోపాటు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్/ప్రస్తుత వాటాదారులు) రూపంలో 2,50,50,543 షేర్లను విక్రయించనుంది. ‘‘కంపెనీ, కంపెనీ అనుబంధ సంస్థలతో అనుబంధం కలిగిన కళాకారులు, రైతులను గౌరవించడంతోపాటు, వారికి ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్ ఇండియా ప్రమోటర్లు బిమ్లానంద బిస్సెల్ 4,00,000 షేర్లు, మధుకర్ ఖేరా 3,75,080 షేర్లను కళాకారులకు డీఆర్హెచ్పీ దాఖలు తర్వాత బదిలీ చేయనున్నారు’’ అంటూ కంపెనీ ప్రకటించింది. -
యూనికార్న్ల హవా!
ముంబై/న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాది(2022)లోనూ స్టార్టప్ల హవా కొనసాగనుంది. కనీసం 50 సంస్థలు యూనికార్న్ హోదాను పొందే వీలున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,500 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్లను యూనికార్న్గా పిలిచే విషయం విదితమే. ఇప్పటికే కనీసం 10 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ రీత్యా భవిష్యత్లో యూనికార్న్లుగా ఆవిర్భవించగల స్టార్టప్ల జాబితాను పీడబ్ల్యూసీ రూపొందించింది. ఈ జాబితాలో ఖాటాబుక్, వాట్ఫిక్స్, ప్రాక్టో, నింజాకార్ట్, ఇన్షార్ట్స్, ఈకామ్ ఎక్స్ప్రెస్, పెప్పర్ఫ్రై, లివ్స్పేస్ తదితర 50 స్టార్టప్లకు చోటు లభించింది. పెట్టుబడుల దూకుడు దేశీయంగా స్టార్టప్లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్లు ఆవిర్భవించాయి. ఫలితంగా దేశంలో యూనికార్న్ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్ యూనికార్న్ నివేదిక పేరుతో ఓరిస్ వెంచర్ పార్టనర్స్ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం.. టాప్–3 ర్యాంక్ గతేడాది బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్(బ్లింకిట్), అప్గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్లకు నిలయంకావడం ద్వారా భారత్ మూడోపెద్ద స్టార్టప్ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం! ఉపాధి సైతం భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. ఫిన్టెక్, ఈకామర్స్, ఎస్ఏఏఎస్(సాస్) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్టెక్, ఎడ్టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్ డాలర్లతో ఫ్లిప్కార్ట్ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జూలైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది. మహిళలూ.. యూనికార్న్ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్ ఇంజినీర్స్ కాగా.. దాదాపు 67 శాతం వరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులు ఉన్నట్లు ఓరిస్ వెంచర్స్ తాజా నివేదిక పేర్కొంది. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్(నైకా), గజల్ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్బిజినెస్), దివ్యా గోకుల్నాథ్(బైజూస్), ఘజల్ అలఘ్(మమాఎర్త్), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు. డెకాకార్న్లుగా.. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో డెకాకార్న్లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్లు ఐపీఓలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్లే! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్ డాలర్లు, ఫ్రెష్వర్క్స్ 6.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం! -
ఈ దీపికను ఆదుకోరూ..
నా మనవరాలి పేరు దీపిక. పేరుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న చీకటిని దగ్గరికి రానిచ్చేది కాదు. నెలల పాపగా ఉన్నప్పుడే అనారోగ్యంతో తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి నేను అమ్మమ్మగా కాకుండా ఓ తల్లిలా దీపికను పెంచుతూ వస్తున్నాను. ఎప్పుడైనా మా అమ్మ ఎలా ఉండేదని తను అడిగితే దుఃఖం కట్టలు తెంచుకునేది. నా బాధ చూడలేక అమ్మలేకపోతే నువ్వున్నాకు కదా అమ్మమ్మ అంటూ నన్ను ఓదార్చేది. దురదృష్టం మరోసారి దీపికను వెక్కిరించింది. నిండా పదేళ్లు కూడా నిండకముందే క్యాన్సర్ వ్యాధితో దీపిక తండ్రి కూడా కాలం చేశాడు. అప్పటి నుంచి తల్లిదండ్రి అన్నీ నేను అయి ఆమెను సాకుతున్నాను. వయసు మీద పడుతున్నా దీపిక భవిష్యత్తు కోసమే కాయకష్టం చేసి పెంచుకుంటున్నాను. కానీ ఇంతలోనే మరో కష్టం వచ్చి మా మీద పడింది. ఉన్నట్టుండి దీపికకు ఒంట్లో బాగుండటం తేదని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సివియర్ నిమోనియా హైపోటానిక్ క్వాడ్రిపెరాసిస్ పెరాసిస్ వచ్చిదంటూ చెప్పారు. నెమ్మదిగా కండరాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుందని డాక్టర్లు వివరించారు. ఆ సమస్య రాకుండా ఉండేందుకు వ్యాధి తగ్గేందుకు మందుకు రాసిచ్చారు. మందులు వాడినా రోగం తగ్గలేదు.. మరింతగా పెరిగింది. దీపిక నడవలేని, ఏమీ తినలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. మంచానికే పరిమితమైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చాను. కొన్ని రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నాను. కానీ ఈ రోగం నయం కావాలంటే నెలల తరబడి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. వైద్య చికిత్సకు రూ.6,00,000 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. నా భర్త ఎప్పుడో చనిపోయాడు. ఒక్కగానొక్క కూతురు కూడా చాన్నాళ్ల క్రితమే చనిపోయింది. కూలి పని చేసుకుంటూ నా మనవరాలిని చదివిస్తూ ఆమె భవిష్యత్తే లోకంగా బతుకున్నాను. కానీ ఇంతలో నా మనవరాలికే పెద్ద కష్టం వచ్చింది. ఆమె వైద్యానికి అయ్యే ఆరు లక్షల రూపాయాలను నేను ఎక్కడి నుంచి తేగలను. అప్పుడే ఆస్పత్రిలో మెడికల్ ఎమర్జెన్సీలో ఆదుకునే కెట్టో గురించి తెలిసింది. నా మనవరాలు దీపిక ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
2 నెలల్లో 30 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న ప్రైమరీ మార్కెట్ మరోసారి కళకళలాడనుంది. రానున్న రెండు నెలల్లో కనీసం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా రూ. 45,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశమున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే పైచేయిగా నిలవనున్నట్లు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో చేపట్టిన ఐపీవో విజయవంతంకావడంతో పలు టెక్నాలజీ సంబంధ కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. తొలుత పీఈ ఫండ్స్ జొమాటో తదితర ఆధునికతరం కంపెనీలు తొలుత ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల సెకండరీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. దీంతో టెక్ ఆధారిత నవతరం కంపెనీలకు ఐపీవోలు మరో మార్గాన్ని చూపుతున్నాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు క్యూ కడుతున్నట్లు ఏంజెల్ వన్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. కారణాలివీ. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోనుందన్న అంచనాలకుతోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్లకు జోష్నిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డ్ స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటం దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సెకండరీ మార్కెట్ బాటలో ప్రైమరీ మార్కెట్ సైతం సందడి చేస్తున్నట్లు వివరించారు. ఇకపైన ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదిపాటు మార్కెట్లు బుల్ జోరులో కదిలే వీలున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌశలేంద్ర జెరోధా, ట్రూ బీకన్ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం ఇందుకు దోహదం చేయనున్నట్లు అంచనా వేశారు. 40 కంపెనీలు ఈ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 64,217 కోట్లు సమీకరించాయి. బుధవారం నుంచీ ప్రారంభకానున్న ఐపీవో ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ. 2,778 కోట్లు సమకూర్చుకోనుంది. మరోవైపు వాటాల విక్రయం ద్వారా పవర్గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున నిధులను సమీకరించాయి. కాగా.. 2020లో 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు మాత్రమే సమకూర్చుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2017లో మాత్రమే 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను ఐపీవోల ద్వారా అందుకున్నాయి. జాబితా ఇలా.. అక్టోబర్–నవంబర్లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో పాలసీ బజార్ రూ. 6,017 కోట్లు, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 1,900 కోట్లు తదితరాలున్నాయి. జాబితాలో ఇంకా నార్థర్న్ ఆర్క్ క్యాపిటల్ రూ. 1,800 కోట్లు, శాఫైర్ ఫుడ్స్ రూ. 1,500 కోట్లు, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,330 కోట్లు, స్టెరిటైల్ పవర్ రూ. 1,250 కోట్లు, రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్సైన్స్ రూ. 1,200 కోట్లు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!
21 ఏళ్ల ధన్య సోజన్ వధువుగా నటించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ పర్సనాలిటీలతో మొదలు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ధన్య చావుతో పోరాడుతోంది. చావును గెలవాలనుకుంటోంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి, వెంట్రుకలు పూర్తిగా కోల్పోయిన స్థితి నుంచి అందమైన పెళ్లికూతురిగా మారడం ఇటీవలి గొప్ప కుతూహలపు కథ. 28 ఆగస్టు 2019లో ధన్య సోజన్ టొరెంటో (కెనడా)లో దిగింది. అక్కడ రెండేళ్లు పోస్ట్ డిప్లమో కోర్సు ఆమె చదవాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని తోడపుజ అనే చిన్న టౌన్ ఆమెది. తండ్రి జోసఫ్ మిల్క్బూత్ నడుపుతాడు. తల్లి శాంతి గృహిణి. హైస్కూల్లో చదివే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న ధన్య బాగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించుకుంది. కొన్ని నెలలు బాగా జరిగాయి. సెమిస్టర్లు రాసింది. కాని 2020 ఆగస్టు నాటికి ఆమె వూరికూరికే స్పృహ తప్పి పడిపోవడం మొదలెట్టింది. అక్కడి డాక్టర్లు చూసి మొదట నిమోనియా అనుకున్నారు. కాని రిపోర్టులు చూసి ఆమెకు ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ ఉందని తేల్చారు. ప్రమాదకరమైన గుండెజబ్బు. ఏ క్షణం ఏమైనా కావచ్చు. గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ధన్య. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ రోజులు 20 ఏళ్ల హుషారైన అమ్మాయి ధన్య. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. ఆమెకు ఆక్సిజన్ సరిగా అందడం లేదు. జుట్టు కొన్నాళ్లు నిలవదని చెప్పారు. ఉన్న జుట్టును పూర్తిగా తొలగించారు. ఆమె స్టూడెంట్ వీసా మీద రావడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకునే వీలు లేదు. అలాగని ఇంటినుంచి డబ్బు తెప్పించుకోలేదు. దారుణమైన పరిస్థితిలో పడింది ధన్య. అదృష్టం... ఆమె చేరిన హాస్పిటల్లో కేరళ నుంచి వచ్చిన నర్స్లు పని చేస్తున్నారు. వారు ధన్యను ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు. ధన్య పరిస్థితిని టొరెంటోలో ఉన్న మలయాళీ సంఘం ‘హృదయపూర్వం’కు తెలియచేశారు. హృదయపూర్వం వెంటనే ధన్య కోసం ఫండ్ రైజింగ్ మొదలెట్టింది. దాదాపు లక్షన్నర డాలర్లు (కోటి రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. హాస్పిటల్ బిల్ అందులో నుంచే కట్టారు. అయితే సమస్య అదుపులో ఉంది కాని ట్రీట్మెంట్ కొనసాగాల్సి ఉంది. ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. ఈలోపు హాస్పిటల్, యూనివర్సిటీ వాళ్ల సహకారం వల్ల హాస్పిటల్ నుంచి ఎగ్జామ్స్ రాసి పాసయ్యింది ధన్య. మార్చి వరకూ ఉంటే వర్క్ వీసాకు అర్హత వస్తుందని అప్పటి వరకూ అక్కడే ఉండి కొచ్చి చేరుకుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్కు వెళ్లి అడ్మిట్ అయ్యింది ధన్య. మెరుపు కలలు ధన్య ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా మెరుపు కలలు కనడం మానలేదు. ఆమెకు మోడలింగ్ చేయాలని కోరిక. అలాగే పాటలకు డాన్స్ చేయడం కూడా సరదా. హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ బోర్ పోయేందుకు కొన్ని సినిమా పాటలకు చేతులు కదిలించి డాన్స్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేసింది. అవి ఇన్స్టాంట్ హిట్ అయ్యాయి. మమ్ముట్టి, మోహన్లాల్ వంటి నటులు ఆమె స్థితిని తెలుసుకుని ఆ స్థితిలో కూడా అంత హుషారుగా ఉన్నందుకు మెచ్చుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మలుపుతిప్పిన ఘడియ కొచ్చి చేరుకుని వైద్యం తీసుకుంటున్న ధన్యకు ఇన్స్టాగ్రామ్లో ‘మలబార్ గోల్డ్’ వారి ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ యాడ్ కాంపెయిన్ ప్రకటన కనిపించింది. ‘మీకు పెళ్లికూతురిలా కనిపించాలని ఉందా’ అనే ప్రశ్నకు 7000 మంది యువతులు ‘అవును’ అని ఉత్సాహపడి సమాధానం ఇచ్చారు. ధన్య కూడా ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోయింది. కాని కొన్నాళ్లకు మలబార్ గోల్డ్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. తమ ప్రకటనల్లో కేరళ వధువుగా కనిపించమని వారు కోరారు. ధన్య సంతోషానికి అవధులు లేవు. కేరళ క్రిస్టియన్ వధువుగా తెల్లగౌన్లో కనిపించడానికి అందుకు తగ్గ షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మలబార్గోల్డ్ ఈ షూట్ కోసం అసలు సిసలు వజ్రాల నెక్లెస్ను వాడటానికి పంపింది. దానిని ధరించిన ధన్య ఎంతో ముచ్చటపడింది. ‘ఈరోజు నాకెంతో బాగుంది’ అని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. ఆమె స్వచ్ఛమైన నవ్వు వధువు పాత్రకు అందం తెచ్చింది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు ‘ఈరోజు మా అమ్మాయి పేషెంట్ అన్న సంగతే మర్చిపోయింది’ అని ఎంతో సంబరంగా ఆమెను చూశారు. నిరాశలో కూడా ఒక ఆశ చేతికి దొరుకుతుంది. అంతవరకూ ఓపిక పట్టమని ధన్య నవ్వు అందరికీ చెబుతోంది. విశేష స్పందన ‘స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా’గా మలబార్ గోల్డ్ వారు విడుదల చేసిన ధన్య యాడ్ విశేష స్పందన పొందింది. ఆ యాడ్లో ధన్య ఎంతో అందంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆమె నవ్వుకు ఎందరో ఫాన్స్ అయ్యారు. ఇవాళ ధన్య సెలబ్రిటీ అయ్యింది. తన అనారోగ్యాన్ని గెలిచి తీరగలననే ఆత్మవిశ్వాసం పొందింది. -
జుపీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: నైపుణ్యాల ఆధారిత ఆన్లైన్ గేమింగ్ సంస్థ జుపీ తాజాగా 30 మిలియన్ డాలర్లు సమీకరించింది. 500 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా, ఓరియోస్ వెంచర్ పార్ట్నర్స్, అమెరికాకు చెందిన వెస్ట్క్యాప్ గ్రూప్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ వివరించింది. ఈ నిధులను కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. 100 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో ఆరు నెలల క్రితమే నిధులు సమీకరించగా ప్రస్తుతం ఇది అయిదు రెట్లు పెరగడం గమనార్హం. మొత్తం మీద ఇప్పటిదాకా 49 మిలియన్ డాలర్లు అందుకున్నట్లు జుపీ తెలిపింది. ప్రస్తుతం 1 కోటి మంది పైగా యూజర్లు ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు దిల్షేర్ సింగ్ వివరించారు. -
స్టార్టప్లకు జోరుగా వెంచర్ క్యాపిటల్ నిధులు
న్యూఢిల్లీ: స్టార్టప్లకు (ఆరంభ దశలోని కంపెనీలు) వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు అండగా నిలుస్తున్నాయి. 2021లో ఇప్పటివరకు 16.9 బిలియన్ డాలర్ల (రూ.1.26 లక్షల కోట్లు సుమారు) నిధులను భారత స్టార్టప్లు సమీకరించాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ.. వీసీ ఇన్వెస్టర్లు భారత స్టార్టప్ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ‘గ్లోబల్ డేటా’ అనే డేటా అనలైటిక్స్ సంస్థ తెలిపింది. నిధుల సమీకరణలో భారత స్టార్టప్లు చైనా స్టార్టప్ల సరసనే నిలుస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను విడుదల చేసింది. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 828 వీసీ ఫండింగ్ (పెట్టుబడులు) ఒప్పందాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందాల విలువ 16.9 బిలియన్ డాలర్లు. వీటిల్లో ఫ్లిప్కార్ట్ 3.6 బిలియన్ డాలర్లు, మొహల్లా టెక్ (షేర్చాట్) 502 మిలియన్ డాలర్లు, జొమాటో 500 మిలియన్ డాలర్లు, థింక్ అండ్ లెర్న్ (బైజూస్) 460 మిలియన్ డాలర్ల సమీకరణ పెద్ద ఒప్పందాలుగా ఉన్నాయి. భారత్లో వీసీ ఫండింగ్ ఒప్పందాల సంఖ్య క్షీణించినా కానీ, విలువ పరంగా వృద్ధి నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. -
అయ్యో తరుణ్.. మూడేళ్లకే ఇంత కష్టమా..
బుడిబుడి అడుగులతో అల్లరి చేయాల్సిన తరుణ్ అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆటపాటలతో అల్లరి చేయాల్సిన వాడు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. పుట్టిన మూడేళ్లకే ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడ్డాడు. నవ్వుల తరుణ్ ప్రసవం జరిగింది మొదలు స్రవంతికి ఆమె కొడుకే ప్రాణంగా బతుకుతోంది. బిడ్డను వదిలి క్షణం కూడా ఉండలేకపోయేది. నిరంతరం పిల్లాడితే గడిపేయడంతో బాబుకి ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు చిరాకు పడుతున్నాడనే విషయాలను వెంటనే గుర్తించేది. అతడి బోసి నవ్వులు చూసి మురిసిపోయేది. ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా భర్త తెచ్చే సంపాదన అంతంత మాత్రమే. అయితే స్రవంతి ముద్దుల కొడుకు తరుణ్ అల్లరితో ఆ ఇంట్లో సుఖశాంతులకు లోటు లేకుండా పోయింది. క్యాన్సర్ ఎప్పుడు యాక్టివ్గా అల్లరి చేసే తరుణ్ కొంత కాలంగా నీరసంగా ఉండటం స్రవంతి గమనించింది. తరచి చూస్తే ఒళ్లు వేడిగా ఉంటున్నట్టు గుర్తించింది. వెంటనే తరుణ్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ నీరసం ఇంకా ఎక్కువైంది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్తే రకరకాల పరీక్షలు చేశారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తుండటంతో వ్యాధి నిర్థారణ కోసం హైదరాబాద్ వెళ్లాలంటూ సూచించారు. రూ. 20 లక్షలు కావాలి తరుణ్కి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు చెప్పిన విషయం విన్న స్రవంతికి గుండె ఆగినంత పనైంది. తన ముద్దుల కొడుక్కి ప్రాణాంతకమైన మైలోమియా లుకేమియా క్యాన్సర్ ఉన్నట్టుగా వైద్యులు తేల్చి చెప్పారు. వెంటనే కీమోథెరపీ చేయకపోతే బిడ్డ మృత్యువుకు చేరువ అవుతాడంటూ హెచ్చరించారు. సాధ్యమైనంత త్వరగా వైద్య చికిత్స కోసం రూ.20లక్షలు సర్థుబాటు చేసుకోవాలంటూ సూచించారు. సాయం చేద్దాం రండి రెక్కాడితే గానీ డొక్కాడని స్రవంతి కుటుంబానికి రూ.20 లక్షలు సర్థుబాటు చేయడం కలలో కూడా జరగని పని. అలా అని బిడ్డ మృత్యు ఓడికి చేరుతుంటే చూస్తూ ఊరుకోలేక పోతుంది. కళ్లలో నీళ్లు ఇంకేలా ఏడుస్తూనే ఉంది. చివరకు బిడ్డ వైద్య చికిత్స కోసం ఫండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మూడేళ్ల తరుణ్ ఈ లోకంలో అందాలను చూడాలంటే అతనికి భవష్యత్తును అందివ్వాలంటే మనమంతా తలా ఓ చేయి వేయాల్సిన అవసరం ఏర్పడింది. సాయం చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి -
Rakul Preet Singh: సాయం చేద్దాం: రకుల్
‘‘కోవిడ్ బాధితులకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి’’ అంటున్నారు రకుల్ప్రీత్ సింగ్. ఇందులో భాగంగా నేను సైతం అంటూ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారామె. ఈ విషయం గురించి రకుల్ ప్రీత్సింగ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితులు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఆక్సిజన్, బెడ్స్, వైద్య పరికరాల కొరత వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. గివ్ ఇండియా (ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ కోవిడ్ బాధితుల కోసం మొదలు పెట్టిన ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్) కోసం నేను విరాళాలు సేకరిస్తున్నాను. వీరు ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సంట్రేటర్స్, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్స్ను తిరిగి నింపడం వంటి కార్యక్రమాలను చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇవి ఎంతోమంది కోవిడ్ బాధితులకు ఉపయోగపడతాయి. మీరు (ప్రజలు) చేసేది వంద రూపాయల సాయమైనా కావొచ్చు.. అది ఈ క్లిష్ట సమయాల్లో ఎవరికో ఒకరికి మేలు చేస్తుంది. ఈ సంక్షోభ సమయంలో ఎవరికి వారు తోచినంత సహాయం చేసి, కోవిడ్ బాధితుల జీవితాలను కాపాడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
భారతదేశానికి హాలీవుడ్ సాయం
‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో హృదయవిదారక దృశ్యాలు కనిస్తున్నాయి. ఈ భయంకరమైన కరోనా వైరస్ మనల్ని కూడా ఇబ్బంది పెట్టి చాలా రోజులేం గడవలేదు. భారతదేశంలో ఉన్న మన అన్నదమ్ముల కోసం మీకు చేతనైనంత సాయం చేయండి. చేయూత చిన్నదైనా దాని ఫలితం మంచి చేస్తుంది’’ అని అమెరికన్ నటి మిండీ క్యాలింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే భారత దేశంలోని కోవిడ్ బాధితులకు సహాయం చేయాల్సిందిగా పలువురు హాలీవుడ్ ప్రముఖులు కోరుతున్నారు. జయ్ శెట్టి, రాధిక అంతర్జాతీయ రచయిత, పాడ్ క్యాస్టర్ జయ్ శెట్టి, అతని భార్య రాధికతో కలిసి ‘హెల్ప్ ఇండియా బ్రీత్’ అనే ఫండ్ రైజర్ను మొదలు పెట్టారు. ఒక మిలియన్ డాలర్ల (దాదాపు 7 కోట్లు) కనీస విరాళాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ నిధి విరాళ సేకరణను ప్రారంభించారు జయ్ శెట్టి దంపతులు. ఇందులో భాగంగా ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ స్మిత్ ఫ్యామిలీ, కెనడియన్ సింగర్–సాంగ్ రైటర్ షాన్ మెండెస్, అమెరికన్ వ్యాపారవేత్త రోహన్ ఓజా, రచయిత బ్రెండెన్ బుచార్డ్లు తలా 50 వేల డాలర్ల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఐటీ కాస్మోటిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జామీ కెర్న్ లిమా లక్ష డాలర్లను ప్రకటించారు. ఇక బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కలిసి కోవిడ్ బాధితుల కోసం ‘టుగెదర్ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పలువురు హాలీవుడ్ తారలు ఇండియాకి సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. -
కరోనా ఉన్నా... ఆల్టైమ్ హైకి.. ఈక్విటీ నిధుల సమీకరణ
ముంబై: కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులను అల్లకల్లోలం చేసింది. కానీ మన దేశంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ఈక్విటీ మార్గంలో నిధుల సమీకరణ జోరును ఆపలేకపోయింది. ఈక్విటీ మార్కెట్ ద్వారా వివిధ కంపెనీలు ఐపీఓ, ఓఎఫ్ఎస్, ఇతర మార్గాల్లో రూ.1.78 లక్షల కోట్లు సమీకరించాయి. ఇప్పటివరకూ ఇదే రికార్డ్ స్థాయి. గత ఏడాది సమీకరించిన నిధులు(రూ.82,241 కోట్లు)తో పోల్చితే ఇది 116 శాతం అధికం. 2017లో సమీకరించిన రూ. 1,60,032 కోట్ల నిధుల సమీకరణ రికార్డ్ ఈ ఏడాది బద్దలైంది. ప్రైమ్ డేటాబేస్ వెల్లడించిన వివరాల ప్రకారం... ► కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు)ల్లో రిటైల్ ఇన్వెస్టర్లు జోరుగా పాల్గొనడం, ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక్మార్కెట్ లిస్టింగ్లో భారీ లాభాలు సాధించడం, క్యూఐపీ, ఇన్విట్స్/రీట్స్ మార్గంలో కంపెనీలు రికార్డ్ స్థాయిలో నిధులు సమీకరించడం... ఈ ఏడాది చెప్పుకోదగ్గ విశేషాలు. ► ఈ ఏడాది ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ రూ.26,611 కోట్లుగా ఉంది. గత ఏడాది 16 కంపెనీలు ఐపీఓకు వచ్చి రూ.12,382 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది 15 కంపెనీలు ఐపీఓల ద్వారా 26,611 కోట్లు సమీకరించాయి. గత ఏడాది ఐపీఓ నిధులతో పోల్చితే ఇది 115 శాతం అధికం. ► నిధుల సమీకరణ–ఎఫ్పీఓల(ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.15,024 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ.21,458 కోట్లు, క్యూఐపీల ద్వారా రూ.84,501 కోట్లు, ఇన్విట్స్/రీట్స్ ద్వారా రూ.29,715 కోట్లుగా ఉన్నాయి. ► బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తం, రూ.7,485 కోట్లను కూడా కలుపుకుంటే ఈక్విటీ మార్కెట్ల ద్వారా కంపెనీలు రాబట్టిన మొత్తం నిధులు రూ.1,84,953 కోట్లకు పెరుగుతాయి. ఎస్బీఐ కార్డ్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించింది. ఈ ఏడాది ఇదే అతి పెద్ద ఐపీఓ. -
ట్రంప్కు మద్దతుగా విరాళాల వర్షం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ జోరుగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం సంయుక్తంగా 16.5 కోట్ల డాలర్లను అత్యధికంగా ఒక్క జూలై నెలలోనే విరాళంగా పొందారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తంగా 1.1 బిలియన్ డాలర్లు వారికి విరాళంగా వచ్చాయి. అందులో 30 కోట్ల డాలర్ల వరకు నగదు రూపంలో సిద్ధంగా ఉన్నాయని రిపబ్లికన్ నేషనల్ కమిటీ(ఆర్ఎన్సీ) ప్రకటించింది. ట్రంప్ ప్రచారం కోసం ఆర్ఎన్సీ 300 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను తాజాగా రిక్రూట్ చేసుకుంది. దాంతో ట్రంప్ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారి సంఖ్య 1,500కు చేరింది. ఫేస్బుక్ నుంచి ట్రంప్ వ్యాఖ్యలు తొలగింపు ‘చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు’ అని ట్రంప్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ని ఫేస్బుక్ తొలగించింది. కరోనా వైరస్కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేదిగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది తమ విధానానికి విరుద్ధమని, అందుకే దీన్ని తొలగిస్తున్నట్టు ఫేస్బుక్ యాజమాన్యం ప్రకటించింది. -
చిన్నోడి సాయం ఘనం..
నెల్లూరు(పొగతోట): ఎదుటివారు కష్టాల్లో ఉంటే కొందరు తట్టుకోలేరు. ఏదో రకంగా వెంటనే సాయం చేస్తారు. తలపెట్టిన కార్యాన్ని నెరవేరుస్తారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఐదేళ్ల బాలుడు అనీశ్వర్. కోవిడ్ –19 రిలీఫ్ ఫండ్ సేకరణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. సైక్లింగ్ చేసి నిధులు సేకరించారు. బాలుడి తల్లి నెల్లూరు జిల్లా వాసి కావడం విశేషం. ♦కోవూరు మండలం యల్లాయపాళేనికి చెందిన వాల్మేటి శేషారెడ్డి, సుజాతమ్మ దంపతుల కూతురు వి.స్నేహ. శేషారెడ్డి ఆర్మీలో 24 ఏళ్లకుపైగా సేవలందించాడు. ఆయన రెండు సంవత్సరాల క్రితం మరణించారు. ♦స్నేహను చిత్తూరు నగరంలోని గిరింపేటకు చెందిన కుంచాల అనిల్కు ఇచ్చి వివాహం చేశారు. వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. బ్రిటన్లోని వారింగటన్ సిటీలో ఉంటున్నారు. వారి కుమారుడే అనీశ్వర్. ఏం చేశాడంటే.. ♦తొలుత అనీశ్వర్ క్రికెట్ ఛాలెంజ్ను స్వీకరించాడు. హల్ట న్ టీచింగ్ హాస్పిటల్ ఫౌండేషన్ తరఫున క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. ♦వెయ్యి హిట్లు కొట్టి రూ.3 లక్షలు సేకరించి ట్రస్ట్కు అందజేశాడు. ♦తర్వాత సైక్లింగ్పై దృష్టి పెట్టాడు. మే 27వ తేదీన ఐదురుగు స్నేహితులతో కలిసి బృందంగా ఏర్పడి ఇంటి పరిసరాలు, పార్కుల చుట్టూ సైక్లింగ్ చేయడం ప్రారంభించాడు. ♦దీనికి లిటిల్ ఫెడరల్స్ అనీష్ అండ్ ఫ్రెండ్స్ అని పేరు పెట్టారు. ♦నెలరోజులపాటు సాగిన ఈ ఛాలెంజ్లో 4,700 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. దీనిని గివ్ ఇండియా వెబ్సైట్ ద్వారా విరాళాల కోసం ప్రచారం చేశారు. ♦ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. రూ.7 లక్షల వరకు సేకరించారు. ♦రూ.3 లక్షలను యూకే ప్రభుత్వానికి, రూ.3.70 లక్షలను గివ్ ఇండియా వెబ్సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థకు అందజేశామని అనీశ్వర్ తల్లిదండ్రులు సాక్షికి తెలిపారు. నిధులను వైద్యుల రక్షణ కోసం వినియోగించాలని కోరామన్నారు. వీడియో చూసి.. ♦అనీశ్వర్ యూకేజీ చదువుతున్నాడు. ఓ రోజు టీవీలో సర్ థామస్ మూర్ (100) అనే వృద్ధుడి వీడియో చూశాడు. ♦కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు విరాళాలు సేకరించాలని మూర్ తన గార్డెన్ చుట్టూ సహాయకుడి సాయంతో వంద రౌండ్లు నడవడం చూశాడు. అనీశ్వర్ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ♦తాను కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం క్రికెట్, సైక్లింగ్లో పాల్గొంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ప్రోత్సహించారు. -
ఈ ఏడాదీ ‘షేర్ల’ పండుగే!
సాక్షి, బిజినెస్ విభాగం: ఈ ఏడాది కూడా ఐపీఓ మార్కెట్ జోరుగా ఉండనున్నది. రూ.50,000 కోట్లకు మించి ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు రానున్నాయి. తాజాగా ప్రకటించిన ఎల్ఐసీ ఐపీఓ కూడా ఈ ఏడాదే వస్తే... నిధుల సమీకరణ మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల కు ఎగబాకే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కార్డ్స్, యూటీఐ ఏఎమ్సీ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని, గత ఏడాది కంటే ఈ ఏడాదే ఐపీఓల జోరు బాగా ఉండగలదని నిపుణులంటున్నారు. 2019లో 16 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.12,300 కోట్ల మేర సమీకరించాయి.. ఇక ఈ ఏడాది కనీసం 20–30 కంపెనీలు ఐపీఓకు వస్తాయని, నిధుల సమీకరణ నాలుగు రెట్లకు పెరగవచ్చని విశ్లేషకులంటున్నారు. ఐపీఓ జోరు కొనసాగుతుందా ? గత ఏడాది స్టాక్ మార్కెట్ రికార్డ్ల మీద రికార్డ్లు సృష్టించింది. ఐపీఓకు వచ్చిన కంపెనీలు అదరగొట్టే లాభాలనివ్వడం, ప్రతి ఐపీఓ కూడా అనేక రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడంతో ఈ ఏడాది కూడా ఐపీఓ జోరు కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. ఈ ఏడాది కనీసం 40 కంపెనీల ఐపీఓలు మార్కెట్ను ముంచెత్తుతాయని అంచనా. అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు ఉదార ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలుండటంతో గ్లోబల్ లిక్విడిటీ మన మార్కెట్ను ముంచెత్తుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఆర్సీటీసీ, సీఎస్బీ బ్యాంక్ వంటి ఐపీఓలు గత ఏడాది ఊహించనంతగా విజయం కావడంతో కార్పొరేట్లలో విశ్వాసం పెరిగింది. ఇక గత ఏడాది ఐపీఓకు వచ్చిన షేర్లు ఇన్వెస్టర్లకు లిస్టింగ్లో మంచి లాభాలనే ఇచ్చాయి. సగటున ఐపీఓ షేర్ల రాబడి 40 శాతానికి పైగానే ఉండటం విశేషం. ఐఆర్సీటీసీ, ఆఫిల్ ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్లు ఇష్యూ ధర కంటే రెట్టింపునకు పైగా పెరిగాయి. 30కి పైగా కంపెనీలు... ఈ ఏడాది ఇప్పటివరకూ 10 కంపెనీలకు పైగా ఐపీఓలకు సెబీ అనుమతిచ్చింది. వీటి విలువ రూ.16,000 కోట్ల మేర ఉంది. సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య గత ఏడాది 28 ఉండగా, 2018లో 72, 2,017లో 46గా ఉన్నాయి. ఇక సెబీ ఆమోదం కోసం మరో 11 కంపెనీల ఐపీఓలు ఎదురు చూస్తున్నాయి. వీటి విలువ రూ.21,200 కోట్లమేర ఉంటుంది. సెబీ ఆమోదం పొందిన ఐపీఓల జాబితాలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (రూ.9,000 కోట్లు) మజగావ్ డాక్ షిప్బిల్డర్స్, రూట్ మొబైల్(ఇష్యూ సైజు–రూ.600 కోట్లు), సంహి హోటల్స్ (రూ.2,000 కోట్లు), ఐఆర్ఈడీఏ(రూ.750 కోట్లు), శ్యామ్ స్టీల్, బజాజ్ ఎనర్జీ(రూ.5,450 కోట్లు), సత్యశ్రీ ప్రెజర్, అన్నై ఇన్ఫ్రా డెవలపర్స్, బర్గర్ కింగ్ ఇండియా(రూ.1,000 కోట్లు), పురానిక్ బిల్డర్స్(రూ.1,000 కోట్లు), ఈజీ ట్రిప్ ప్లానర్స్(రూ.510 కోట్లు), మోంటొకార్లో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి కనీసం రూ. 40,000–50,000 కోట్ల రేంజ్లో నిధులు సమీకరించనున్నాయి. నిధుల సమీకరణ... ఐపీఓనే మేలు మార్గం గత ఐదేళ్లలో రానన్ని కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని శామ్కో సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ఉమేశ్ మెహతా అంచనా వేస్తున్నారు. నిధుల సమీకరణ విషయంలో కూడా ఈ ఏడాది అదరగొడుతుందని పేర్కొన్నారు. భారత్లో మూలధనానికి కొరత తీవ్రంగా ఉందని, దీర్ఘకాలిక మూలధన నిధుల సమీకరణకు ఐపీఓ మంచి మార్గమని వివరించారు. హెచ్డీబీ ఫైనాన్షియల్, ఎస్బీఐ కార్డ్స్, బర్గర్ కింగ్ తదితర ఐపీఓకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయన్నారు. కాగా ఇన్వెస్టర్లకు ప్రీమి యమ్ షేర్లు సమంజసమైన ధరలకే లభించే ఏకైక మార్గం ఐపీఓనే కావడం కంపెనీలకు కలసివచ్చే అంశం. ఎల్ఐసీ మెగా ఐపీఓ.. ఎవ్వరూ ఊహించని విధంగా ఎల్ఐసీని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత ఐపీఓకు వస్తామని ఎల్ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇష్యూ సైజు, ఎంత వాటా విక్రయిస్తారు అనేదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ఎల్ఐసీలో కనీసం 10% వాటాను ఐపీఓ ద్వారా విక్రయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇష్యూ సైజు రూ.90,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. భారత్లో ఇప్పటివరకూ అతిపెద్ద ఐపీఓ (రూ.15,000 కోట్లు)గా కోల్ ఇండియా రికార్డ్ను ఎల్ఐసీ బ్రేక్ చేయనుంది. ఈ ఏడాది రానున్న మరికొన్ని ఇష్యూలు శ్రీ భజరంగ్ పవర్, ఎన్సీడీఈఎక్స్, హిందుజా లేలాండ్ ఫైనాన్స్, టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధం), హెచ్డీబీ ఫైనాన్షియల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏఎమ్సీ, పీఎన్బీ మెట్లైఫ్, యాక్సిస్ బ్యాంక్ ఏఎమ్సీ, ఆదిత్య బిర్లా ఏఎమ్సీ, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్. ఇష్యూ ధర కీలకం... మార్కెట్ బలహీనంగా ఉంటే, ఐపీఓల జోరు తగ్గుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ పతన బాటలో ఉంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటుందని, దీంతో కంపెనీలు ఐపీఓలు వాయిదా వేసే అవకాశాలు అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఐపీఓ సక్సెస్ కావడానికి ఇష్యూ ధర కీలకమని షేర్ఖాన్ అనలిస్ట్ హేమంగ్ జని వ్యాఖ్యానించారు. మార్కెట్ స్థితిగతులూ కీలకమేనని, ఈ రెండూ బావుంటే గత ఏడాది కంటే అధికంగానే ఈ ఏడాది ఐపీఓలు వస్తాయని వివరించారు. -
ఇక చిన్న మదుపరికీ బాండ్లు!
న్యూఢిల్లీ: ఈక్విటీల మాదిరే కార్పొరేట్ బాండ్ మార్కెట్లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్ మార్కెట్ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని మంత్రి వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాండ్లకు డిమాండ్ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వరంగ సంస్థలకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్ కేలండర్ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్ బాండ్ ఈటీఎఫ్ను ప్రారంభించే అవకాశాలున్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలియజేశారు. బాండ్ ఈటీఎఫ్ విశేషాలు.. ► భారత్– 22 ఈటీఎఫ్ మాదిరే ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ► ఒక్కో యూనిట్ విలువ రూ.1,000. ఈ లెక్కన ఇన్వెస్టర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ► క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లా... మూడేళ్లు, పదేళ్ల స్థిర కాల వ్యవధితో భారత్ బాండ్ ఈటీఎఫ్ను జారీ చేస్తారు. వాటి కాలవ్యవధి వరసగా 2023లో, 2030లో ముగుస్తుంది. ► గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఉండదు. ► రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంటాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్తో (ప్రస్తుతం 6.47 శాతం) పోలిస్తే 0.50–1.40% అధికంగా ఉండొచ్చని అంచనా. ► బాండ్ ఈటీఎఫ్లో పెట్టుబడులపై వచ్చిన మూలధన లాభాల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్ లాభం) మినహాయిస్తారు. ఆ తరవాతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది కనక పన్ను చాలావరకూ తగ్గుతుంది. ► ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఉంటుంది. ఇందుకోసం ఎన్ఎస్ఈ ఒక ఇండెక్స్ను రూపొందిస్తుంది. ► ఈటీఎఫ్ అన్నది పలు బాండ్ల సమూహం. ఏదైనా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ తన నిధుల కోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ కింద బాండ్లను జారీ చేయవచ్చు. ► ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్వహణ బాధ్యతలను ఎడెల్వీజ్ ఏఎంసీ చూస్తుంది. రిస్క్ చాలా తక్కువ... ఐఎల్అండ్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, ఎస్సెల్ గ్రూపులు.. రుణపత్రాలపై తీసుకున్న బకాయిల్ని చెల్లించటంలో విఫలమవ్వడాన్ని ఇటీవల చూశాం. వీటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్ చేసినా, లేక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా డిఫాల్ట్ రిస్క్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇలాంటి పరిస్థితి ఉం డదు. ఎందుకంటే ఈ ఈటీఎఫ్ కింద బాండ్ల రూపంలో నిధులు సమీకరించేవన్నీ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలే. ప్రభుత్వ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలం కావడం ఇప్పటివరకు అరుదే. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం ఉంటుంది. లిక్విడిటీతో కూడిన, నాణ్యమైన ప్రభుత్వరంగ బాండ్లలో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరింత మంది ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యానికి ఇది వీలు కల్పిస్తుంది. – ఎన్ఎస్ వెంకటేశ్, సీఈవో, యాంఫి ప్రభుత్వరంగ సంస్థలకు నిధుల సమీకరణకు ఇదొక కొత్త మార్గంగా సాయపడుతుంది. ప్రారంభంలో 3 ఏళ్లు, 10 ఏళ్ల మెచ్యూరిటీతో భారత్ బాండ్ ఈటీఎఫ్ ఉంటుంది. – రాధికా గుప్తా, సీఈవో, ఎడెల్వీజ్ ఏఎంసీ బాండ్ ఈటీఎఫ్లో కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండటం రిటైల్ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. వారు తక్కువ రిస్క్తో కూడిన కార్పొరేట్ బాండ్లలో పాల్గొనేందుకు ఇదో మంచి అవకాశం. – అనిల్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్, ఇక్రా -
సెబీ ‘స్మార్ట్’ నిర్ణయాలు
ముంబై: స్టార్టప్లకు జోష్నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్ సిటీస్కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్ ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ విభాగాలు కలిగిన కంపెనీలకు షేర్ల బైబ్యాక్కు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది. రుణ చెల్లింపుల విఫలానికి సంబంధించిన వివరాలను రేటింగ్ ఏజెన్సీలకు లిస్టెడ్ కంపెనీలు వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. మ్యూచువల్ ఫండ్స్కు కూడా కఠిన నిబంధనలను జారీ చేసింది. బుధవారం సమావేశమైన సెబీ డైరెక్టర్ల బోర్డ్ పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలు.. ► ఎఫ్పీఐల నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబం ధనలు మరింత సరళతరమయ్యాయి. ► స్మార్ట్ సిటీలు, సిటీ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాల్లో నమోదైన సంస్థలు మునిసిపల్ బాండ్లతో నిధులు సమీకరించవచ్చు. ► ప్రస్తుతం స్టాక్ ఎక్సే్చంజ్ల ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫార్మ్పై నమోదైన స్టార్టప్లు ఇక నుంచి స్టాక్ సూచీలకు మారవచ్చు. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ► ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి సమాచారమందించే వ్యక్తులు, సంస్థలకు (విజిల్ బ్లోయర్స్) రూ.కోటి దాకా నజరానా ఇవ్వనున్నారు. కంపెనీ ఆడిటర్లు దీనికి అనర్హులు. ► కంపెనీ చెల్లించిన మూలధనం, రిజర్వ్ల్లో 25%కి మించకుండా బైబ్యాక్ ఆఫర్ ఉండాలి. ఈ ఆఫర్ 10%కి మించినట్లయితే, ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్కు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ► లిస్టింగైన లేదా లిస్టింగ్ కాబోతున్న ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అంతేకాకుండా రేటింగ్ లేని డెట్ సాధనాల్లో ప్రస్తుతం 25 శాతంగా ఉండే పెట్టుబడులను 5 శాతానికే పరిమితం చేయాలని కూడా సూచించింది. ► డెట్ పోర్ట్ఫోలియో స్కీమ్లు లిస్టింగ్ కాని ఎన్సీడీల్లో గరిష్టంగా 10 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ప్రతిపాదిత పరిమితులపై కాలానుగుణంగా సమీక్షించి, అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు. ► రేటింగ్ లేని డెట్ సాధనాల్లో డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, రెపో ఆన్ జీ–సెక్, ట్రెజరీ బిల్లులను మినహాయిస్తే, కొన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్కు మిగులుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బిల్స్ రీ–డిస్కౌంటింగ్(బీఆర్డీఎస్), మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, రెపో ఆన్ కార్పొరేట్ బాండ్స్, రీట్స్/ఇన్విట్స్ యూనిట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► లిస్టైన కంపెనీల్లో ప్రజలకు ఉండాల్సిన కనీస వాటాను 25% నుంచి 35%కి పెంచాలన్న ప్రతిపాదనకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉందని సెబీ పేర్కొంది. అయితే లిస్టైన ప్రభుత్వ రంగ సంస్థల్లో 45 శాతం వరకూ ఇప్పటికీ, 25 శాతం నిబంధనను అందుకోలేకపోయాయి. అందుకని 35 శాతం పబ్లిక్ హోల్డింగ్కు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని మరింతగా మదింపు చేయాల్సి ఉందని సెబీ పేర్కొంది. -
ఎన్బీఎఫ్సీలకు కష్టకాలం..
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్ త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆటో మొబైల్, రియల్ ఎస్టేట్, నాన్–రిటైల్ రంగాల్లో డిమాండ్ మందగించడం కొన్ని ఎన్బీఎఫ్సీలపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం చూపించిందన్న అంచనాలు ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం మీద పరిశ్రమ రుణ వృద్ధి 15 శాతమే ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. 2017 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి. ‘అంతటా మందగమనం కనిపిస్తోంది. నిధులపరమైన కొరతే కాకుండా రుణాలు తీసుకునే విభాగాల్లో కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, రియల్టీ రంగాల్లో మందగమనం ఎన్బీఎఫ్సీ రుణ వృద్ధిపై ప్రతికూలంగా ఉండొచ్చు‘ అని మోతీలాల్ ఓస్వాల్ సంస్థలో ఎన్బీఎఫ్సీ విశ్లేషకుడు అల్పేష్ మెహతా చెప్పారు. గతేడాది సెప్టెంబర్ నుంచి వాహన దిగ్గజాల అమ్మకాలు మందగించాయి. ఈ ఏడాది మేలో మారుతీ సుజుకీ ఉత్పత్తిని సుమారు 18% తగ్గించుకుంది. డిమాండ్ బలహీనంగా ఉండటంతో ఉత్పత్తిలో కోత విధించుకోవడం వరుసగా ఇది 4వ నెల. కొన్నే మెరుగ్గా.. అయితే హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి బలమైన మాతృసంస్థలున్న ఎన్బీఎఫ్సీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గానే ఉండొచ్చని అంచనా. మిగతా ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే వీటికి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి పుష్కలంగా నిధుల లభ్యత ఉండటమే ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఎంఏఎస్ ఫైనాన్షియల్, పీఎన్బీ హౌసింగ్ సంస్థల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని, మరోవైపు ఎల్అండ్టీ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. తొలి త్రైమాసికం అంతంత మాత్రమే.. సాధారణంగా తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ ఫైనాన్స్ సంస్థల పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక ఎన్నికలు ఆపై మందగమనం తదితర కారణాల వల్ల ఆ సంస్థల రుణాల పోర్ట్ఫోలియోల విశేషాలను త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ‘ఆటో, హౌసింగ్ లోన్స్ సంస్థలకు తొలి త్రైమాసికం కాస్త బలహీనంగా ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికల ప్రభావం తోడైంది. రిటైల్ రుణాల్లో మందగమనం, డెవలపర్లు సమస్యల్లో ఉండటం వంటి అంశాలు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు‘ అని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఇక, సాధారణంగా గృహ రుణాల మెచ్యూరిటీ గడువు అనేక సంవత్సరాల పాటు, కొన్ని సార్లు కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. దీంతో ఎన్బీఎఫ్సీలకు ఆస్తులు, అప్పుల మధ్య సమన్వయం పాటించడం కష్టతరంగా మారుతోంది. ఈ సంస్థలు స్వల్పకాలిక రుణాలు తీసుకొచ్చుకుని.. దీర్ఘకాలిక ప్రాతిపదికన రిటైల్ రుణాలు ఇస్తున్నాయి. అయితే, ఇన్ఫ్రా రుణాల దిగ్గజం ఐఎల్అండ్ఎఫ్ఎస్ గతేడాది సెప్టెంబర్లో డిఫాల్ట్ అయినప్పట్నుంచి ఎన్బీఎఫ్సీలకు నిధులు దొరకడమే గగనంగా మారింది. డీహెచ్ఎఫ్ఎల్ విషయమే తీసుకుంటే భారీ ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం, రుణ వితరణ తగ్గడంతో మార్చి త్రైమాసికంలో రూ. 2,223 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. ఎన్బీఎఫ్సీలకు మరిన్ని రుణాలతో బ్యాంకులకు సమస్యలు ఆర్బీఐ ప్రతిపాదనలపై ఫిచ్ హెచ్చరిక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), రిటైల్ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. గతేడాది ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ఎన్బీఎఫ్సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్ రుణాల రిస్క్ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్బీఎఫ్సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్బీఎఫ్సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది. -
దిగ్గజ స్టార్టప్కు ప్రేమ్జీ ఊతం
బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్ సంస్థ బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ స్థాయికి చేరింది. క్లౌడ్ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే ఐసెర్టిస్ సంస్థలో అజీం ప్రేమ్జీ కుటుంబానికి చెందిన ప్రేమ్జీ ఇన్వెస్ట్ ఫండ్, గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు 115 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన బి క్యాపిటల్ గ్రూప్, ఎయిట్ రోడ్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్ సంస్థ మొత్తం 211 మిలియన్ డాలర్లు సమీకరించినట్లయింది. ఈ విడత నిధుల సమీకరణతో సంస్థ విలువ 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లవుతుందని ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ బోదాస్ తెలిపారు. నెలకొల్పింది మనోళ్లే.. 2009లో సమీర్, ఆయన మిత్రుడు మనీష్ దర్దా కలిసి ఐసెర్టిస్ను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 850 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 600 మంది పుణే కేంద్రంలో పనిచేస్తున్నారు. సరుకుల కొనుగోళ్ల నుంచి ఉద్యోగులతో ఒప్పందాలు దాకా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్లయింట్లకు 57 లక్షల పైగా కాంట్రాక్టుల నిర్వహణకు సేవలు అందిస్తున్నట్లు సమీర్ వివరించారు. వీటి మొత్తం విలువ 1 లక్ష కోట్ల డాలర్ల పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలపై కంపెనీలు 2018–2022 మధ్య కాలంలో దాదాపు 20 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించనున్నట్లు పరిశ్రమవర్గాల అంచనా. -
‘ఈక్విటీ’ నిధులు @ రూ.63,744 కోట్లు
న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఈ ఏడాది వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా రూ.63,744 కోట్లు సమీకరించాయి. గత ఏడాది సమీకరించిన రూ.1.6 లక్షల కోట్ల నిధులతో పోలిస్తే ఇది 60 శాతం తక్కువని డేటా ఎనలిటిక్స్ సంస్థ, ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ► ఈక్విటీ ద్వారా కాకుండా బాండ్ల ద్వారా కంపెనీలు మరో రూ.29,944 కోట్లు సమీకరించాయి. ► ఈ ఏడాది నిధుల సమీకరణ జరిగిన వివిధ ఈక్విటీ మార్గాల్లో అత్యధిక నిధులు ఐపీఓ మార్గంలో వచ్చాయి. ఈ మార్గంలో 24 కంపెనీలు రూ.33,244 కోట్లు సమీకరించాయి. గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు సగం. గత ఏడాది మొత్తం 36 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లు సమీకరించాయి. ► కంపెనీలు ఈ ఏడాది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా రూ.16,077 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.10,678 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) ద్వారా రూ.3,145 కోట్లు సేకరించాయి. ► గత ఏడాది ఓఎఫ్ఎస్ మార్గంలో సమీకరించిన నిధులు రూ.18,094 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది ఇది రూ.10,678 కోట్లకు తగ్గింది. ► ఈ ఏడాది అతి పెద్ద ఓఎఫ్ఎస్గా కోల్ ఇండియా ఇష్యూ(రూ.5,274 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.1,848 కోట్లతో లార్సెన్ అండ్ టుబ్రో ఇష్యూ నిలిచింది. ► క్యూఐపీ నిధుల సమీకరణ కూడా 73 శాతం తగ్గింది. గత ఏడాది ఈ విధానంలో రూ.61,148 కోట్లు రాగా, ఈ ఏడాది 73 శాతం తగ్గి రూ.16,677 కోట్లు మాత్రమే వచ్చాయి. అతి పెద్ద క్యూఐపీగా రూ.3,500 కోట్ల ఐడియా క్యూఐపీ నిలిచింది. ► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా రూ.4,473 కోట్ల బంధన్బ్యాంక్ ఐపీఓ నిలిచింది. ► ఈ ఏడాది ఎస్ఎమ్ఈల (స్మాల్, మీడియమ్ ఎంటర్ప్రైజ్) కార్యకలాపాలు గత ఏడాది కంటే జోరుగా ఉన్నాయి. ఈ ఏడాది ఎస్ఎమ్ఈలు ఐపీఓ విధానంలో రూ.2,254 కోట్లు సమీకరించగా, గత ఏడాది ఈ సమీకరణ రూ.1,679 కోట్లుగా మాత్రమే ఉంది. 161 ఐపీఓలు @ 552 కోట్ల డాలర్లు: ఈవై కాగా, ఈ ఏడాది అత్యధిక ఐపీఓలు వచ్చిన స్టాక్ ఎక్సే్చంజ్లుగా భారత స్టాక్ ఎక్సే్చంజ్లు రెండో స్థానంలో నిలిచాయని ఈవై తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో నవంబర్ నెల చివరి వరకూ మొత్తం 161 ఐపీఓలు వచ్చాయని, ఈ ఐపీఓలు 552 కోట్ల డాలర్లను సమీకరించాయని ఈవై ఇండియా ఐపీఓ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ క్యూ3లో 9 ఐపీఓలు రాగా, ఈ క్యూ4లో రెండు ఐపీఓలు మాత్రమే వచ్చాయని వివరించింది. ఎస్ఎమ్ఈ ఐపీఓల్లో కూడా ఇదే ధోరణి చోటు చేసుకుంది. ఈ క్యూ3లో 42గా ఉన్న ఎస్ఎమ్ఈ ఐపీఓలు ఈ క్యూ4లో ఎనిమిదికి తగ్గాయని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికాలో 261 ఐపీఓలు 6,000 కోట్ల డాలర్లు సమీకరించాయి. -
‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్లకు కమిటీలో చోటు కల్పించారు. -
కేరళ కోసం జడ్జీల గానం
న్యూఢిల్లీ: సంక్షోభ సమయాల్లో మానవీయంగా స్పందించగలమని, అందుకు అవసరమైతే మైక్ పట్టుకుని పాటలు కూడా పాడగలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరూపించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం సోమవారం సుప్రీంకోర్టు జర్నలిస్ట్లు చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ గాత్ర ప్రావీణ్యాన్ని చూపారు. ఈ ఇద్దరు జడ్జీలు కేరళకే చెందినవారు కావడం గమనార్హం. మలయాళ క్లాసిక్ సినిమా ‘అమరం’లోని మత్స్యకారుల జీవనాన్ని వర్ణించే ఓ పాటను కేఎం జోసెఫ్ పాడారు. ‘కేరళలో వరద బాధితుల సహాయానికి ముందు స్పందించింది మత్స్యకారులే. అందుకే వారి కోసం ఈ పాట’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గాయకుడు మోహిత్ చౌహాన్తో కలిసి ‘వి షల్ ఓవర్కమ్ సమ్డే’ అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆలపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, పలువురు ఇతర జడ్జీలు, జర్నలిస్ట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 లక్షలకు పైగా విరాళాలు వసూలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరూ రూ. 25 వేల చొప్పున, కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. -
రూ. 50వేల కోట్లకుపైగా పీఎస్బీల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50,000కోట్లకు పైగా నిధుల సమీకరణ ప్రణాళికలతో ఉన్నాయి. వ్యాపార వృద్ధికితోడు, నియంత్రణల పరంగా అంతర్జాతీయ నిబంధనలను చేరుకునేందుకు నిధుల సమీకరణ తలపెట్టాయి. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడంతో వ్యాపార అవసరాలకు బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 21 పీఎస్బీల్లో 13బ్యాంకుల బోర్డులు ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణకు ఆమోదం తీసుకున్నాయి. ఈ బ్యాంకుల ఉమ్మడి నిధుల సమీకరణ రూ.50వేల కోట్లకుపైగా ఉంది. సెంట్రల్ బ్యాంకు రూ.8,000 కోట్లు, కెనరా బ్యాంకు రూ.7,000 కోట్లు, బీఓబీ రూ.6,000 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.5,000 కోట్ల మేర నిధులను సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఓబీసీ, కార్పొరేషన్ బ్యాంకు, దేనా, యూకో అలహాబాద్ బ్యాంకు కూడా ఉన్నాయి. -
వొడాఫోన్-ఐడియా డీల్: భారీ నిధుల సేకరణ
సాక్షి,ముంబై: భారత్లో మూడవ అతిపెద్ద మొబైల్ సేవల ఆపరేటర్ ఐడియా సెల్యులర్ లిమిటెడ్ గురువారం భారీ నిధుల సేకరణ ప్రణాళను విడుదల చేసింది. వొడాఫోన్ విలీనానికి ముందు ఈ ఫండ్ రైజింగ్ ప్లాన్ను రివీల్ చేసింది. రూ.6750 కోట్ల నిధుల సేకరణ ప్రణాళికను గురువాం వెల్లడించింది. ముఖ్యంగా షేర్ల విక్రయం ద్వారా 35 బిలియన్ రూపాయలు సేకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా ఐడియా 326.6 మిలియన్ల షేర్ల అమ్మకం ద్వారా 32.5 బిలియన్ల రూపాయలను సమకూర్చుకోనుంది. ప్రిఫరెన్షియల్ బేసిస్ కింద షేరుకు రూ.99.5చొప్పున మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ కు విక్రయించనుంది. దీంతో ఆదిత్యా బిర్లా వాటా 42.4 శాతంనుంచి 47.2 శాతానికి పెరగనుంది. గత ఏడాది మార్చిలో వోడాఫోన్ తో ఈ విలీనాన్ని ప్రకటించింది. అతిపెద్ద భారత ఫోన్ క్యారియర్ సృష్టించేందుకు చేసుకున్న ఈ ఒప్పందం ఈ ఏడాది చివరకు ముగియనుంది. ఈ వార్తలతో ఇవాల్టి ట్రేడింగ్లో ఐడియా షేరు 3శాతం లాభపడింది. -
రూ.24,000 కోట్లు సమీకరించనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.24,000 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధుల సమీకరణకు గాను బుధవారం జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. హెచ్డీఎఫ్సీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ చేయడం ద్వారా రూ.8,500 కోట్లు సమీకరిస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మిగిలిన రూ.15,500 కోట్లను షేర్ల జారీ లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీలు, క్యూఐపీ, ఏడీఆర్/జీడీఆర్ల ద్వారా సమీకస్తామని వివరించింది. వచ్చే నెల 19న జరిగే అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరతామని తెలిపింది. -
‘ఆఫ్ బిజినెస్’తో చిన్న సంస్థలు ఆన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ)లకు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, విస్తరించాలన్నా ప్రధానంగా ఎదురయ్యే సమస్య నిధులే!! పోనీ, నిధులు సమకూరాయనుకుంటే ఆయా పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను కొనుగోలు చేయటం మరో సమస్య. ఈ రెండింటికీ ఒకే వేదికగా పరిష్కారం చూపిస్తోంది ‘ఆఫ్ బిజినెస్.కామ్’! అవునండి.. ఎస్ఎంఈలకు కేవలం నిధులను అందించడమే కాకుండా.. అవే నిధులతో అవసరమైన ముడిసరుకుల కొనుగోలు చేసే వీలు కల్పించడమే దీని ప్రత్యేకత. నిధుల కోసం పెట్టుబడిదారులతో.. ముడి పదార్థాల కోసం తయారీ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకుంది. మరిన్ని వివరాలు ఆఫ్ బిజినెస్.కామ్ సీఈవో ఆశిష్ మోహపత్రా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆఫ్బిజినెస్.కామ్ ప్రారంభానికి కారణం నాతో పాటు ఉన్న కో–ఫౌండర్లు పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో పని చేయడమే. బడా కంపెనీలకు రుణాలు, పెట్టుబడులు పొందడం పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ, ఎస్ఎంఈల పరిస్థితికొస్తే? ఇదే ఆలోచన ఆఫ్ బిజినెస్.కామ్కు పునాది వేసింది. నిధుల పంపిణీతోనే సరిపెట్టకుండా ఎస్ఎంఈలకు ముడి పదార్ధాల కొనుగోలులోనూ సేవలందించాలని నిర్ణయించుకొని రూ.32 కోట్ల పెట్టుబడులతో 2015 ఆగస్టులో గుర్గావ్ కేంద్రంగా ఆఫ్బిజినెస్.కామ్ను ప్రారంభించాం. నాతో పాటూ రుచి కర్లా, భువన్ గుప్తా, చంద్రాన్షు, నితిన్ జైన్, వసంత్ శ్రీధర్, బిస్వజిత్, ధావల్ రాడియా కో–ఫౌండర్లుగా ఉన్నారు. ఆఫ్ బిజినెస్.కామ్ షరతేంటంటే.. ఎస్ఎంఈలు నిధులతో పాటూ ముడి పదార్థాలను కూడా విక్రయ సంస్థల వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 1,200 ఎస్ఎంఈలు; రూ.800 కోట్ల నిధులు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 1,200 ఎస్ఎంఈలు మా కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 110 ఎస్ఎంఈలు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ప్రారంభించిన 16 నెలల్లో రూ.800 కోట్లను అందించాం. ఎస్ఎంఈని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ అందిస్తాం. నెలకు రూ.50 కోట్ల నిధుల వితరణ చేస్తుంటాం. వడ్డీ రేటు సెక్యూర్డ్ అయితే ఏడాదికి 12 శాతం, అన్సెక్యూర్డ్ 18 శాతంగా ఉంది. త్వరలోనే రసాయనాలు, గార్మెట్ కొనుగోలు కూడా.. ప్రస్తుతం మా సంస్థ నుంచి ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్, పేపర్ ప్యాకేజ్, సిమెంట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి మెటీరియల్స్ను కొనుగోలు చేయవచ్చు. ఆయా ఉత్పత్తుల కొనుగోలు కోసం సెయిల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, జిందాల్, వైజాగ్, రాఠి వంటి 500లకు పైగా తయారీ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో ధరలు 8 శాతం వరకు తక్కువగా ఉంటాయి. నెల రోజుల్లో పారిశ్రామిక రసాయనాలు, గార్మెట్ ముడిసరకులనూ చేర్చనున్నాం. రూ.150 కోట్ల నిధుల సమీకరణ.. ఎస్ఎంఈ కస్టమర్ నుంచి వడ్డీ, డిస్ట్రిబ్యూటర్ నుంచి కమీషన్ 2 శాతం తీసుకుంటాం. ఇదే మా వ్యాపార విధానం. గతేడాది రూ.220 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. ఇందులో 18 శాతం వాటా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలది ఉంటుంది. ఈ ఏడాది రూ.900 కోట్ల వ్యాపారాన్ని జనవరి నుంచి మహారాష్ట్రలోని ఎస్ఎంఈలకూ మా సేవలను అందించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 180 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.120 కోట్ల నిధులను సమీకరించాం. మ్యాట్రిక్స్ పార్టనర్స్, జోడియస్ టెక్నాలజీస్తో పలు టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ పెట్టుబడులు పెట్టారు. ‘‘వచ్చే 6 నెలల్లో రూ.150 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఈ రౌండ్లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ పాల్గొంటారని’’ ఆశిష్ వివరించారు. -
రుణం వైపు కాదు... స్టాక్ మార్కెట్ వంక చూడాలి!
నిధుల సమీకరణపై చిన్న పరిశ్రమలకు ఎస్బీఐ చీఫ్ సూచన న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ) తమకు అవసరమైన నిధుల సమీకరణ కోసం స్టాక్ మార్కెట్లకు వెళ్లాలి తప్ప, రుణ ఆధారితాలు కారాదని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య సూచించారు. ఆయా సంస్థలు తమ వ్యాపారాన్ని ఆరోగ్యవంతమైన రీతిన నిర్వహించుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ⇒ చిన్న తరహా పరిశ్రమలు తమ వ్యాపార తొలి దశల్లో నిధుల అవసరాలకు రుణాలపై ఆధారపడుతున్నాయి. ఇది ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్లపై ప్రభావం చూపుతోంది. ⇒ మన దేశానికి సంబంధించినంతవరకూ చిన్న పరిశ్రమలు తమ నిధుల అవసరాలకు స్టాక్ మార్కెట్ వైపు చూడవు. ఈక్విటీ ఆధారిత మూలధనం సమకూర్చుకునే అంశం పూర్తి నిర్లక్ష్యానికి గురవుతోంది. ⇒ టెక్నాలజీ సంస్థల నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. వాటి వ్యాపార అవసరాలకు కావాల్సిన మొత్తంలో అధిక భాగాన్ని ఆయా సంస్థలు ఈక్విటీ విధానం ద్వారానే సమీకరించుకుంటాయి. ⇒ మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీలనూ చూడొచ్చు. ఈక్విటీతో ఆయా కంపెనీలు అద్భుతాలను సృష్టించాయి. ⇒ చిన్న తరహా పరిశ్రమలకు ఈక్విటీ సాయాన్ని అందించగలిగిన పెట్టుబడిదారులు ఉన్నారు. మీ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభం వస్తుందన్న విశ్వాసాన్ని కల్పించడం ముఖ్యం. ⇒ చాలా మంది చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులు తొలుత తన కుటుంబం, స్నేహితులు, బంధువుల నుంచి సమీకరించిన నిధులతో తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. తరువాత, బ్యాంకులపై ఆధారపడతారు తప్ప, ఈక్విటీవైపు మాత్రం చూడరు. చిన్న పరిశ్రమలకు దివాలా ఫ్రేమ్వర్క్: సాహూ కాగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి త్వరలో ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్ను తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ దాదాపు కార్పొరేట్ దివాలా వ్యవహారాలను చక్కదిద్దడానికి ఉద్దేశించినది ఉందన్నారు. అందువల్ల చిన్న తరహా పరిశ్రమలకు రెండు దశల్లో సమగ్ర దివాలా పక్రియ విధివిధానాలను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
మహిళలుకు ఆత్మవిశ్వామే ఆయుధం
-
యస్ బ్యాంకు క్విప్ వాయిదా..
న్యూఢిల్లీ: బిలియన్ డాలర్ల నిధుల సేకరణ ప్రతిపాదనను యస్ బ్యాంకు అనూహ్యంగా వాయిదా వేసుకుంది. ‘క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) కొత్త మార్గదర్శకాలను అపార్థం చేసుకోవడం వల్ల గురువారం నాటి మార్కెట్ ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రతిపాదిత క్విప్ వాయిదా వేసుకోవాలని మర్చంట్ బ్యాంకర్లు సూచించారు’ అని యస్ బ్యాంకు తెలిపింది. గురువారం బీఎస్ఈలో యస్ బ్యాంకు షేరు 5.32 శాతం నష్టపోయి రూ.1,330 వద్ద క్లోజ్ అయింది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి క్విప్ విధానంలో బిలియన్ డాలర్లు సేకరించనున్నట్టు ఈ ఏడాది మేలో యస్ బ్యాంకు సీఈవో రాణాకపూర్ ప్రకటించారు. నిధుల సేకరణకు వీలుగా బ్యాంకులో విదేశీ ఇన్వెస్టర్ల వాటాను 74 శాతం వరకు పెంచుకునేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. -
నిధుల సమీకరణ ప్రతిపాదనలు పంపండి
పీఎస్బీలను కోరిన ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: మార్కెట్ నుంచి నిధుల సమీకరణపై ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ)ను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. పీఎస్బీలకు రూ.22,915కోట్ల నిధుల సాయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలి సిందే. దీంతో బ్యాంకుల ఆర్థిక సామర్థ్యం ఇనుమడిస్తుందని, దాంతో నిధుల సమీకరణకు వెసులుబాటు లభిస్తుందని ఆర్థిక శాఖ భావి స్తోంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు, ప్రాధాన్యేతర ఆస్తుల విక్రయం తదితర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు గల అవకాశాలపై ప్రణాళికలు పంపించాలని ఆర్థిక శాఖ కోరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఆర్థిక శాఖ రూపొందించిన ఇంద్రధనుష్ రోడ్ మ్యాపు ప్రకారం పీఎస్బీలకు నాలుగేళ్ల వ్యవధిలో కేంద్రం రూ.70వేల కోట్ల నిధుల సాయం అం దిస్తుంది. అదే సమయంలో బ్యాంకులు సైతం రూ.1.1 లక్షల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాలి. బాసెల్-3 నిబంధనల మేరకు బ్యాంకులకు ఈ మేరకు మూలధన నిధుల అవసరం ఉంటుంది. -
ఆ విషయంలో ట్రంప్ కంటే హిల్లరీ టాప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా దూసుకుపోతున్నారు. ఆరోపణలు, ఘాటైన విమర్శలు, మాటలయుద్ధంతో ప్రచారాన్ని వేడిక్కిస్తున్నారు. ఈ ఇద్దరిలో విజేత ఎవరన్నదానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికల ఖర్చుకు విరాళాలు సేకరించడంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీదే పైచేయి. ట్రంప్తో పోలిస్తే హిల్లరీకి భారీగా విరాళాలు వచ్చాయి. గత మేలో వెల్లడించిన ఆర్థిక నివేదిక ప్రకారం హిల్లరీ 133 కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. ఇక డెమొక్రటిక్ నేషనల్ కమిటీతో కలసి మరిన్ని నిధులు సేకరించారు. హిల్లరీ ప్రచార ఖర్చు కోసం మొత్తం 284 కోట్ల రూపాయల నగదు అందుబాటులో ఉంది. ఇక ట్రంప్ విషయానికొస్తే మేనాటికి దాదాపు 21 కోట్ల రూపాయలు మాత్రమే సేకరించగలిగారు. ఆర్థిక నివేదిక ప్రకారం ట్రంప్ వద్ద 9 కోట్ల రూపాయల నిధులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నామినేషన్ పొందాక విరాళాల సేకరణ కోసం ప్రత్యేక దృష్టిసారించారు. రిపబ్లికన్ నేషనల్ కమిటీతో కలసి రెండు రోజుల్లోనే 85 కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చినట్టు ఆయన మద్దతుదారులు చెప్పారు. ఇక రిపబ్లిక్ నేషనల్ కమిటీ మేలో 88 కోట్ల రూపాయలు సేకరించింది. ఏప్రిల్లో కూడా ఈ మేరకు విరాళాలు వచ్చాయి. అయితే ఈ విరాళాలకు సంబంధించి అధికారిక సమాచారం లేదు. -
స్మార్ట్ ప్రణాళిక రూ. 3025 కోట్లు
నగర అభివృద్ధిలో కేంద్ర పథకాల సమ్మిళితం పీపీపీ పద్ధతి ద్వారా పెట్టుబడుల సేకరణ రాష్ట్ర ప్రభుత్వానికీ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ హన్మకొండ : స్మార్ట్సిటీ ద్వారా రాబోయే ఐదేళ్లలో వరంగల్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సేకరణకు సంబంధించి ప్రాథమిక అంచనాలను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు రూపొందిం చారు. మొత్తంగా రూ.3025 కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ నివేదికను కేంద్రానికి పంపడం ద్వారా స్మార్ట్సిటీ పథకం రెండో అంచెలో పోటీ పడేందుకు గ్రేటర్ వరంగల్ రంగం సిద్ధం చేసుకున్నట్లరుుంది. ఎస్పీవీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్సిటీ పథకంలో వరంగల్ నగరం ఎంపికైంది. అంతకుముందే అమృత్, హృదయ్ పథకాలకు సైతం అర్హత సాధించింది. స్మార్ట్సిటీ పథకం ద్వారా నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో నేరుగా రూ.500 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులకు తోడు వివిధ మార్గాల ద్వారా మరిన్ని నిధులను జత చేసి నగరంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహరాలన్నీ నిర్వర్తించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేసే ఎస్పీవీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పోరేషన్ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. స్మార్ట్సిటీ పథకం ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టు/పథకాలకు సంబంధించిన ప్రణాళిక, అనుమతులు, నిధులు, రుణసేకరణ, నిధులను ఖర్చుచేయడం తదితర వ్యవహారాలను ఎస్పీవీ చేపడుతుంది. రూ. 3025 కోట్లతో.. వరంగల్ స్మార్ట్సిటీ ప్రణాళికకు సంబంధించి ఎస్పీవీ ద్వారా రూ.2022 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఇందులో స్మార్ట్సిటీ పథకం నుంచి రూ.500 కోట్లు, అమృత్ పథకం నుంచి రూ.41 కోట్లు, హృదయ్ నుంచి రూ.39 కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.104 కోట్లు, రహదారులు, భవనాల శాఖ నుంచి రూ.774 కోట్లు, రైల్వేశాఖ నుంచి రూ.47 కోట్లు ప్రధానంగా సేకరిస్తారు. మిగిలిన నిధులను పధ్నాలుగో ప్రణాళిక సంఘం నిధులతో పాటు, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సేకరిస్తారు. ఇవి కాకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో రూ.1003 కోట్లు సేకరిస్తారు. ఇలా ఎస్పీవీ, పీపీపీ పద్దతిలో సమకూరిన రూ.3025 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. స్మార్ట్సిటీ ద్వారా చేపట్టబోయే పనుల్లో రూ.1772 కోట్లను రెట్రో ఫిట్టింగ్(పూర్తిగా కొత్త ప్రాజెక్టు) పనులకు కేటాయిస్తారు. మిగిలిన రూ. 1253 కోట్లను ప్రస్తుతం నగరంలో ఉన్న వనరులు మరింత మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక ఆదాయ వనరులకు సంబంధించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామని కేంద్రానికి పంపిన నివేదికలో గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు. -
ఎయిర్కోస్టా నిధుల సేకరణకు బ్రేక్!
మంచి ధర కోసం బ్రాండ్ బిల్డింగ్పైనే దృష్టి కొత్త ఎయిర్లైన్ విధానం వచ్చాకే నిధుల సమీకరణ ఇండిగో ఐపీవో విజయవంతంతో పెరిగిన నమ్మకం దేశవ్యాప్త కార్యకలాపాలపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ విమానయాన సర్వీసుల సంస్థ ఎయిర్కోస్టా నిధుల సమీకరణ ప్రక్రియను తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా విడుదల చేసిన పౌర విమానయాన విధాన ముసాయిదా విదేశీ పెట్టుబడులను స్వీకరించడానికి అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా వాటాలను విక్రయించడం ద్వారా వ్యాపార విస్తరణకు నిధులు సేకరించాలని ఎయిర్కోస్టా చూస్తోంది. ఇప్పటికే చాలా దేశీ, విదేశీ సంస్థలతో చర్చలు జరిపినప్పటికీ ఆయా సంస్థలు ఆఫర్ చేస్తున్న ధర చాలా తక్కువగా ఉండటంతో ఈ చర్చలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే ఎయిర్కోస్టా ప్రాంతీయ విమానయాన సంస్థ నుంచి నేషనల్ కారియర్గా మారనుండటంతో తమ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందని, అప్పుడు అధిక ధర వస్తుందన్నది కంపెనీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో నేషనల్ కారియర్ అనుమతులు లభిస్తే, జనవరి నెలాఖరుకు ఢిల్లీ, భువనేశ్వర్కు విమాన సర్వీసులు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రస్తుతం ఉన్న 67 సీటర్ల ఈ-170 విమానాల స్థానంలో 112 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ-190 విమానాలను తీసుకురానున్నారు. దీనివల్ల కంపెనీ నిర్వహణ లాభం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రాండ్ బిల్డింగ్పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, వచ్చే ఏప్రిల్, మే తర్వాతనే నిధుల సేకరణ జరపాలని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉన్న కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్రాండ్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, మార్చిలోగా మొబైల్ యాప్ను కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. -
నాటాకు 39 కోట్ల విరాళాలు
నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) రికార్డుస్థాయిలో 2016 డల్లాస్ సదస్సు కోసం ఆరు లక్షల డాలర్ల (రూ. 39 కోట్లు) విరాళాలను సేకరించింది. మెమోరియల్ డే వీకెండ్ (మే 27-29, 2016) సందర్భంగా నిర్వహించే ఈ సదస్సు కోసం శుక్రవారం (అక్టోబర్ 9న) ఇర్వింగ్లోని ఎస్ఎల్పీఎస్ కేంద్రంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. డల్లాస్ తెలుగు కమ్యూనిటీ మద్దతు వల్లే ఈ విరాళాల సేకరణ కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైందని, ఇది వారి విజయమని నాటా 2016 కన్వీనర్ డీ రమణరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమ విజయానికి డల్లాస్ నాటా బృందానికి సంపూర్ణ మద్దతునిచ్చిన స్థానిక తెలుగు సంఘాలు, జాతీయ సంఘాలు తానా, ఆటా, నాట్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న ఈ సదస్సుకు దాదాపు 15వేలమంది తెలుగు సంతతి ప్రజలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా, కెనడా, భారత్లో ప్రముఖ టీవీచానెళ్లు లైవ్ ప్రసారం చేయనున్నాయని, ఈ కార్యక్రమం నిర్వహణకు నాటా సలహా మండలి చైర్ డాక్టర్ ప్రేమ్రెడ్డి, అధ్యక్షుడు మోహన్ మల్లం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాజేశ్వర్ గంగసాని రెడ్డి నిర్విరామంగా కృషిచేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. ఇక డల్లాస్లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ మల్లం, ప్రేమ్రెడ్డి, రిజినల్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా నాగిరెడ్డి, డాక్టర్ రమణరెడ్డి గుడూరు, రామసూర్య రెడ్డి, తారారెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కోర్సాపాటి, సురేశ్ మండువా, ఫాల్గుణ్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, రాఘవరెడ్డి ఘోసల, హరి వెల్కుర్, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, రామిరెడ్డి ఆళ్ల, డాక్టర్ స్టాన్లీరెడ్డి బుచిపూడి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ల, వెంకటరమణరెడ్డి మురారి, వెంటకరామిరెడ్డి సానివరపు, శ్రీని వంగిమళ్ల, బాబురావు సామల, చిన్నబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
రూ.500 కొట్టు మఫ్లర్మ్యాన్తో సెల్ఫీ పట్టు
పార్టీ నిధుల సేకరణకు అమ్ ఆద్మీ వినూత్న పంథా బెంగళూరు: అమ్ ఆద్మీ పార్టీ నిధుల సేకరణకు వినూత్న పంథా అనుసరించనుంది. ఆ పార్టీ కర్ణాటక శాఖ జనవరి 11న ‘సెల్ఫీ విత్ మఫ్లర్ మ్యాన్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో విరాళాల రూపంలో రూ.500 ఆ పై ఎక్కువ నిధులను పార్టీకి అందించిన వారిలో 25 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి అరవింద్ కేజ్రీవాల్తో సెల్ఫీ తీయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఒకరు రూ.500 కంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఇస్తే సదరు వ్యక్తి పేరును డ్రా తీయడానికి ముందు ఒకటి కంటే ఎక్కువ సార్లు చేరుస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.2,000 విరాళంగా అందిస్తే అతని పేరును నాలుగుసార్లు (రూ.500గీ4) డ్రాలో చేరుస్తారు. విరాళాలు అందజేయడం, డ్రా తీయడం విధానం అంతా ఆన్లైన్లో జరగనుంది.. విరాళాలు అందించడానికి వచ్చే నెల7 వరకూ అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమకూరిన నిధులను పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకు ఎక్కువ నిధులు కర్ణాటక నుంచే సమకూరిన విషయం గమనార్హం. కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ రోజున కేజ్రీవాల్ బెంగళూరుకు వస్తారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ ఎక్కువ సమయం మెడలో మఫ్లర్తో కనిపిస్తూ ఉండటం, ప్రజ లకు త్వరగా విషయాన్ని చేర్చడానికి వీలుగా సెఫ్లీ విత్ మఫ్లర్మ్యాన్ అనే పేరును ఆ పార్టీ నాయకులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పాల్గొనే విషయంపై కూడా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కర్ణాటక శాఖ నాయకులతో చర్చించే అవకాశం ఉంది. -
రెండు రాష్ట్రాల కోసం తానా నిధుల సేకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం, అలాగే తెలంగాణ అభివృద్ధి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రత్యేకంగా నిధుల సేకరణ మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి నిధి, తెలంగాణ అభివృద్ధి నిధి పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. పలువురు సభ్యులు ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను ఎలా సద్వినియోగం చేయాలో, ఎలా పంచాలో అన్న విషయమై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తానా సంప్రదిస్తుందని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. బోర్డు సభ్యుడు కోమటి జయరాం, కార్యదర్శి వేమన సతీష్ ఇద్దరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తూ ప్రాజెక్టులు, అవసరాలను తెలుసుకుంటున్నారు. మాతృభూమి అభివృద్ధి విషయంలో ఉత్తర అమెరికా తెలుగువారు చాలా ఉత్సాహంగా ఉన్నారని మోహన్ నన్నపనేని తెలిపారు. వీళ్లు రాష్ట్రాల అభివృద్ధికి తమ ఆలోచనలను, నిధులను అందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా రెండు రాష్ట్రాలకు ఇచ్చే విరాళాల సొమ్ము మొత్తం అమెరికాలో పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ఆయన చెప్పారు. ఒక రాష్ట్రానికి లేదా రెండు రాష్ట్రాలకు కూడా విరాళాలు ఇవ్వచ్చని వివరించారు.