ghmc commissioner
-
GHMC Commissioner: రూలంటే .. రూలే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి.. తనను కలిసేందుకు వచ్చేవారికి నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే తన పేషీలో పోలీసులు.. జీహెచ్ఎంసీ రెండు ప్రధాన ద్వారాల వద్ద సందర్శకుల రాకపోకలు తెలిసేలా టీవీలు ఏర్పాటు చేసిన కమిషనర్.. సాధారణ సందర్శకులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చేవారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు సైతం ప్రత్యేక సమయం కేటాయించారు. ప్రజాప్రతినిధులు కలిసేందుకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకని పేర్కొంటూ కమిషనర్ పేషీలో అంటించారు. సాధారణ ప్రజలు నేరుగా రాకుండా తొలుత పేషీలోకి వెళ్లే ముందే కౌంటర్లో ఉండే కంప్యూటర్ ఆపరేటర్ వద్ద తమ పేరు, వివరాలు, ఎందుకొచ్చిందీ వంటి వివరాలు వెబ్పోర్టల్లో నమోదు చేయించుకోవాలి. నమోదు కాగానే వారి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని చూపించి కమిషనర్ను కలిసేలా ఏర్పాట్లు చేశారు. నిర్ణీత సమయంలోగా వచ్చి నమోదు చేయించుకున్న వారందరికీ.. తనను క లిసేందుకు అవకాశం ఇస్తున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. -
సార్ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
GHMC commissioner: వర్క్ ఫ్రమ్ ఝార్ఖండ్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇలంబర్తి దాదాపు గత పది రోజులుగా నగరంలో లేరు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆయనను ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన అక్కడి నుంచే ప్రతిరోజూ జీహెచ్ఎంసీ కార్యక్రమాలు చక్కపెడుతున్నారు. ప్రతిరోజూ అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్లు, సందర్భాన్ని బట్టి వెబినార్లు నిర్వహిస్తున్నారు. కుటుంబ సర్వేపైనా ఆరా.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కూడా ఇలంబర్తి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్ అధికారులతోనూ చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇంటింటికి స్టిక్కరింగ్ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ, పని త్వరితగతిన జరిగేందుకు అధికారులను పురమాయిస్తున్నారు. ఇన్చార్జ్ ఆఫీసర్లు ఈ నేపథ్యంలోనే గ్రేటర్లోని 30 సర్కిళ్లు, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి వెరసి.. 12 మంది ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఇన్చార్జులుగా నియమించారు. అడిషనల్ కమిషనర్లు ఎస్.సరోజ, ఎన్. యాదగిరిరావు, ఎస్.పంకజ, ఎన్. సామ్రాట్ అశోక్, గీతారాధిక, కె.సత్యనారాయణ, చంద్రకాంత్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, సీఎన్.రఘుప్రసాద్, నళినీ పద్మావతి, ఎస్టేట్ ఆఫీసర్ వై.శ్రీనివాస్రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్చంద్రలకు ఆయా సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. ఫైళ్ల క్లియరెన్స్ సైతం.. జీహెచ్ఎంసీకి సంబంధించి రోజూ పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఇలంబర్తి స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ప్రతికూల వార్తలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ పనుల గురించి తెలుసుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపైనా ఆదేశిస్తున్నారు. జీహెచ్ఎంసీ వాహనాల పెట్రోల్, డీజిల్ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన సందర్భంగా ప్రైవేటు బంకుల నుంచి కొనాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించినట్లు సమాచారం. డ్యూయల్ రోల్.. సాధారణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సెలవుపై వెళ్లినా, ఇతరత్రా సందర్భాల్లోనూ విధుల్లో లేకుంటే మరో ఉన్నతాధికారిని జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్గా నియమించడం ఆనవాయితీ. ఇలంబర్తి అదనపు బాధ్యతలతోనే కమిషనర్గా ఉన్నందున, వేరెవరినీ ఇన్చార్జిగా నియమించలేదని సమాచారం. -
గణేష్ శోభాయాత్ర.. భక్తులకు ఆమ్రపాలి విజ్ఞప్తి
-
ఇక బల్దియాపైనే ఆమ్రపాలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఇకనుంచి జీహెచ్ఎంసీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటి వరకు ఆమెకు జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఎండీగా, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగానూ అదనపు బాధ్యతలున్నాయి. దీంతో పూర్తిస్థాయిలో జీహెచ్ఎంసీపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారనే అభిప్రాయాలున్నాయి. తాజాగా ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమిస్తూ ఎంఆర్డీసీఎల్ ఎండీ, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా బాధ్యతల నుంచి రిలీవ్ చేయడంతో రెగ్యులర్ కమిషనర్గా ఇక బల్దియాపై పట్టు సాధించనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి దాకా పలు అంశాల్లో కొందరు అధికారులు ఆమ్రపాలిని తప్పుదారి పట్టించారనే ఆరోపణలు వెలువెత్తాయి. ఇటీవల కొన్ని విభాగాల్లో బదిలీలు, శేరిలింగంపల్లి జోన్లో ఇంజినీర్ల కొట్లాటలో ఒక్కరిపైనే చర్యలు, తదితరమైనవి అందుకు ఊతమిచ్చాయి. ఏళ్ల తరబడిగా సీట్లకు అంటుకుపోయిన వారు కదలకపోవడం.. పేరుకు బదిలీ తప్ప కొందరు అదే ప్రాంతంలో కొనసాగుతుండటం వంటివి అందుకు దృష్టాంతాలు. ఇతర విభాగాల బాధ్యతలున్నందున జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల, అన్ని స్థాయిల అధికారులకు తగినంత సమయమిచ్చేందుకు వీలు కాలేదని చెబుతున్నారు. -
ఆమ్రపాలి.. ఆన్ డ్యూటీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లకుంట శంకర్మఠ్ సమీపంలో ఆర్ఎఫ్సీ వాహన డ్రైవర్తో మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే దారిలో తనకు తారసపడిన ఓ విద్యార్థినితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేయాలని ఆ విద్యారి్థనికి చెప్పారు. నారాయణగూడ క్రాస్రోడ్స్ దగ్గర నిరి్మంచిన మార్కెట్ గదుల కేటాయింపులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్కు సూచించారు. కమిషనర్ వెంట తనిఖీలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. కాగా ఐఏఎస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కార్యాలయాలకే పరిమితం కారాదని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించడం తెలిసిందే. సమావేశానికి సిద్ధం కండి ఈ నెల 6న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఆయా విభాగాల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం తన చాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ, 6న జరగనున్న సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. -
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లేందుకు సెలవు పొందడంతో ఆయన స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలిని నియమించారు. ఈ నెల 8,9 తేదీలు, తిరిగి 23వ తేదీ సెలవు దినాలను వినియోగించుకునేందుకు అనుమతితో పాటు 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోనాల్డ్ రాస్కు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆమ్రపాలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వు జారీ చేశారు. -
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్పాస్లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్పాత్పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
చెరువు రక్షణకు 18 ఏళ్లు సరిపోలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘రామంతాపూర్ చెరువు రక్షణకు సంబంధించి మీరు 2016లో రెవెన్యూ విభాగానికి ఒక లేఖ రాశారు. దాని తర్వాత కూడా గుర్తు చేశారు. ఎప్పుడు లేఖ రాశార న్నది మీకు కచ్చితమైన తేదీ తెలియదు. మరో ఇద్దరు ముగ్గురు బిల్డర్లు చెరువు పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టా లని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి సమాధానా లిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. తీవ్ర అహసనంతో చెబుతు న్నాం.. మీ చట్టబద్ధమైన విధిని నిర్వర్తించనందుకు మీపై చర్య తీసు కోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. ఈ పిటిషన్ 2005 నుంచి పెండింగ్లో ఉంది. 18 ఏళ్లు గడిచినా చెరువు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్నాళ్లు సమయం కావాలి. మీ పనిని మరొకరిపై నెట్టి తప్పించుకో లేరు. భవిష్యత్ తరాలకు తాగునీటికి సంబంధించిన అంశంలోనూ ఇంత నిర్లక్ష్యమా? ఉన్న జలవనరులను రక్షించు కోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు’ అని జీహెచ్ఎంసీ కమిష నర్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రామంతాపూర్ పెద్దచెరువును రియల్టర్లు, అక్ర మార్కులు ఆక్రమించకుండా అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ కమిష నర్ రొనాల్డ్ రోస్ను ప్రశ్నించింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధి కారులకు 2016లోనే లేఖ రాశామని, వివ రాలు ఇంకా అందలేదని ఆయన చెప్పారు. దీంతో జీహెచ్ ఎంసీ కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసహ నం వ్యక్తం చేసింది. తదు పరి విచారణకు కూడా హాజరు కావా లని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్లో హెచ్ఎండీఏ కమిష నర్ ను ఇంప్లీడ్ చేయాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా వివరాలు అందజేయండి.. హైదరాబాద్లో 532 చెరువులు క్షీణిస్తున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, ఈ కారణంగా నీటికాలుష్యం పెరిగి దుర్వాసన వ్యాపిస్తోందని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ కెఎల్ వ్యాస్ 2005లో లేఖ రాశారు. చెరువు సమీపంలో చెత్త వేయడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నా యని, తద్వారా వాతావరణం కలుషితమై, దుర్వాసనతో, దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా జీహెచ్ఎంసీ అధికారు లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావా లని గత విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఆదేశించింది. దీనిలో భాగంగా మంగళవారం విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. అయితే ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంపై ప్రభుత్వ న్యాయవాది, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్పై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్లోని వివరాలను కమిషనర్కు వివరించడంలో వీరు విఫలమ య్యారని వ్యాఖ్యానించింది. ఇకపై న్యాయవాదులపై అధార పడకుండా, సబ్జెక్టుపై సిద్ధమై కోర్టుకు రావాలని ఆదేశించింది. రామంతాపూర్ పెద్దచెరువుకు కంచె ఎప్పుడు వేస్తారు.. చెత్తరహిత నీటి వనరుగా తీర్చిదిద్దడానికి, నీటి నిల్వ పెరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారు.. ఆక్రమణలను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు.. చెత్తను వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించడం.. చెరువు సరిహద్దులు రూపొందించడం.. మట్టి కోతను అరికట్టేందుకు పరీవాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టడం.. ఎఫ్టీఎల్ నిర్ధారణకు నోటిఫికేషన్ ఇవ్వడం.. వీటన్నింటిపై వివరాలు తెలుసుకుని అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
గడువులోగా ఆ పనులు పూర్తి చేయకుంటే ఉద్యోగం ఊస్టే!
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వేటు తప్పదని హెచ్చరించడంతో ఆమేరకు చర్యలకూ ప్రభుత్వం వెనుకాడబోదని భావిస్తున్న ఉన్నతాధికారులు.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సంబంధిత అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్హోళ్ల వంటి ప్రాంతాలతోపాటు రోడ్లు, ఫుట్పాత్ల మార్గాల్లో సైతం గోతులుండరాదని మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ మెమో జారీ చేసిన నేపథ్యంలో.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రాణాపాయం జరిగితే ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తుందని పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. నాలా సేఫ్టీలో భాగంగా చేపట్టాల్సిన పనులతో పాటు ఇతర ప్రాంతాల్లోని పనుల్ని సైతం వెంటనే పూర్తిచేయాలని, పూర్తయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో బారికేడింగ్స్తో పాటు ఇతరత్రా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారుల టీమ్స్కు నాలుగైదు రోజుల క్రితమే సర్క్యులర్లు జారీ చేశారు. సేఫ్టీ ఆడిట్లో భాగంగా పైపైనే చూస్తే సరిపోదని తాము సర్వేచేయాల్సిన ప్రాంతాల్లో అన్ని ప్రదేశాలకూ నడిచి వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితులు క్షుణ్నంగా పరిశీలించి, రక్షణ ఏర్పాట్లు నూరు శాతం ఉన్నట్లు నిర్ధారించుకొని ధ్రువీకరించాలని పేర్కొన్నారు. ఇవీ బాధ్యతలు.. ►మాన్సూన్ సేఫ్టీ ఆడిట్లో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన బృందాల్లో నియమించిన డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగంలోని ఎస్ఈ, ఈఈలు, డీఈఈలు, ఏఈలు, టౌన్ప్లానింగ్ విభాగంలోని సీపీ, జోనల్ ఏసీపీలు, సర్కిల్స్థాయిల్లోని ఏసీపీలు, ఎస్ఓలు, శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఏఎంఓహెచ్లు, డిప్యూటీఈఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు కిందివిధంగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ►తాము సర్వే చేయాల్సిన ప్రాంతంలోని ప్రతి రోడ్డు, లేన్, బైలేన్లు, డ్రెయిన్ల వెంబడి నడచుకుంటూ వెళ్లి చూడాలి. వాహనాల్లో అయితే సరిగ్గా తెలియదని నడవాలని పేర్కొన్నారు. గుంతలు, రోడ్కటింగ్లు ఉంటే సంబంధిత ఈఈ దృష్టికి తెచ్చి వెంటనే పూడ్పించాలి. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న అన్ని నాలాలకు ఫెన్సింగ్ ఉండాలి. అంతకంటేతక్కువ వెడల్పున్న నాలాలకు పైకప్పులుండాలి. అన్ని క్యాచ్పిట్లపై మూతలుండాలి. మూతలకు పగుళ్లు ఉండరాదు. అలాంటివాటిని మార్చాలి. ►అన్ని కల్వర్టుల వద్ద రక్షణ కంచెలుండాలి.అవసరమైన అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులుండాలి. ఈ పనులు పూర్తి చేశాక అన్ని ప్రాంతాల్లో నూరు శాతం సేఫ్టీ ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారి, డిప్యూటీ కమిషనర్, ఈఈలు ధ్రువీకరించాలి. నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించే పరిస్థితి లేదని, తీవ్రంగా పరిగణించడంతో పాటు తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని, మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయనున్నట్లు తీవ్రంగా హెచ్చరించారు. -
ఆరు నెలలైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి హిమాయత్సాగర్ మీదుగా హుస్సేన్సాగర్ వరకు వర్షపునీరు ప్రవహించే కాలువలన్నీ కూల్చిన భవనాల వ్యర్థాలు, అక్రమ కట్టడాలతో నిండిపోయాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని లేకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్షం నీరు ప్రవహించే కాలువలన్నీ వ్యర్థపదార్థాలతో పూడుకుపోవడంతో పాటు, అక్రమ నిర్మాణాల వల్ల నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందని, కాల్వల్లో నీరు ప్రవహించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. -
జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తన దగ్గరకు జీహెచ్ఎంసీ అధికారులను పంపకపోవడంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు. కాగా హైదరాబాద్లో వరదల్లో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను కిషన్ రెడ్డి బుధవారం సందర్శించారు. దోమల గూడలోని అరవింద్, సూరజ్ కాలనీలో పర్యటించి బాదిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో కిషన్రెడ్డి పర్యటన ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో కేంద్రంమంత్రి కిషన్రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతితో ఫోన్లో మాట్లాడారు. నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్కు సూచించారు. కిషన్రెడ్డి ముందే బీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు నిలదీశారు. -
షోకాజ్ నోటీస్లోనే తప్పుంటే ఎలా?
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమను మూసేయాలని నోటీసులిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేయొద్దని.. ఎందుకు మూసేయాలో నోటీసుల్లో జీహెచ్ఎంసీ పేర్కొనకపోవడం సరికాదని హైకోర్టు తప్పుపట్టింది. షోకాజ్ నోటీసే చట్ట ప్రకారం లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిం చింది. ఏవిధంగా చట్టాన్ని ఉల్లంఘించిందీ నోటీసుల్లో పేర్కొనకపోతే ఎలా అని నిలదీసిం ది. హైదరాబాద్లోని శాస్త్రిపురంలో ఒక పరిశ్రమను మూసివేతకు ఇచ్చిన నోటీసులో పేర్కొ న్న విషయానికి తమ ఎదుట చేస్తున్న వాదనలకు పొంతన లేదని వ్యాఖ్యానించింది. ఈ గందరగోళాన్ని నివృత్తి చేసేందుకు ఈ నెల 15న జరిగే విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరై వివరించాలని ఆదేశించిం ది. శాస్త్రిపురంలోని తన గోదాంను మూసేయాలని జీహెచ్ఎంసీ మార్చి 5న ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ మహమ్మద్ తౌఫీక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. నివాస ప్రాంతాల్లో పరిశ్రమల్ని ఏర్పాటు చేసి చట్టాన్ని ఉల్లంఘించారా లేక మాస్టర్ప్లాన్ను వ్యతిరేకించారా.. కాలుష్యానికి కారణం అవ్వడం వల్ల నోటీసు ఇచ్చారా.. ఏ చట్ట ప్రకారం నోటీసు ఇచ్చారో స్వయంగా విచారణకు హాజరై తెలియజేయాలని ఆదేశించింది. నోటీసులోనే తప్పుందని అభిప్రాయపడింది. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే నోటీసు ఇచ్చే అధికారం ఉన్న కమిషనర్ నోటీసు జారీకి ముందు చట్టాలను చదవాలని సూచించింది. మాస్టర్ప్లాన్ స్పష్టం చేస్తోంది.. ఇంతకు శాస్త్రిపురం నివాస ప్రాంతమా లేక పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతమా? నిబంధనల ప్రకారం భవనంలో పాత ఇనుము నిల్వ చేయకూడదు కదా.. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా చేయకూడదని తెలియదా..? అని పిటిషనర్ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నిం చింది. దీనిపై పిటిషనర్ న్యాయవాది పవన్కుమార్ అగర్వాల్ స్పందిస్తూ..ట్రేడింగ్ బిజినెస్ మాత్ర మే చేస్తున్నామని జవాబు చెప్పారు. ఇలా చేయకూడదని మాస్టర్ ప్లాన్ స్పష్టం చేస్తోందని, మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా చేయకూడదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్.. కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై ఇటీవల ప్రమాదం జరిగిందని తెలిపారు. లోకేశ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్పైకి మళ్లీ వాహనాలను అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. మరో పదిరోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తెరిచే అవకాశముందని తెలిపారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై హైస్పీడ్తో వాహనాలు నడిపిన 540 వాహనాలకు పెనాల్టీలు విధించామని, ఇకనుంచి కూడా పెనాల్టీలు కొనసాగుతాయని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని, ఫ్లై ఓవర్ డిజైన్లో ఎలాంటి లోపం లేదని నిపుణులు తమ నివేదికలో తేల్చారని వివరించారు. హైస్పీడ్ కారణంగానే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై ఇటీవల ప్రమాదం జరిగిందని నిపుణులు నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైతే శని, ఆదివారాల్లో ఈ ఫ్లైఓవర్ను పోలీసులతో చర్చించి మూసివేస్తామని తెలిపారు. చదవండి: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై దిద్దుబాటు చర్యలు బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరం -
త్వరలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు ప్రారంభం : జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు త్వరలో ప్రారంభం కానునట్లు జీహెజ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 10నుంచి 709 కి. మీ మేరకు పనులు మొదలు పెడతామన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను జనవరిలో ప్రారంభిస్తామన్నారు. ఫిబ్రవరి వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించే విధంగా పనులు చేపడుతున్నట్లు, దాదాపు తొమ్మిది వేల వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యామన్నాయ రోడ్ల కోసం భూసేకరణ చేస్తున్నామన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఓపెన్ స్పేస్లలో పార్క్లను అభివృద్ధి చేస్తామని, మీడియన్.. జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి జోన్లో స్కైవాక్ నిర్మించాలన్నారు. రోడ్డు మరమత్తు పనులు పూర్తి అవుతున్నాయని, చెత్త సేకరణ కోసం 60 ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించారు. సీ అండ్ డీ వేస్ట్ పరిశ్రయ త్వరలోనే మొదలు కానుందని, వీటిని కంపోస్ట్ అలాగే కరెంట్ ఉత్పాదన కోసం ఉపయోగిస్తామన్నారు. మూడు నెలల్లో 284 పనులకు అనుమతులిచ్చామని, వీడీసీసీ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. -
‘తెలంగాణలో 2400 డెంగ్యూ కేసులు నమోదు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రెండు మూడు వారాలుగా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలను ఎప్పటికపుడు వెబ్సైట్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 2400 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్ లో 845 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 86 వేల ఇళ్లలో స్ర్పే చేయించామని, పాఠశాలలను శుభ్రం చేసే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లో 410 అధిక ప్రమాదం గల ఏరియాలు ఉన్నాయని, డిసెంబర్ వరకు దోమల నివారణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో రెండు రోజులు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేస్తున్నామని వెల్లడించారు. దోమల నియంత్రణ కోసం 1040 మిషన్లు ఉన్నాయన్నారు. అసలు దోమలు ఎపుడు ప్రభావంగా ఉంటున్నాయన్న అంశంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం విష జ్వరాల ప్రభావం తగ్గిందని కమిషనర్ తెలిపారు. -
బాస్ సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: టౌన్ప్లానింగ్ విభాగంలో అక్రమాలు, నగరంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ సీరియస్ అయ్యారు. అక్రమ నిర్మాణం జరుగుతుందని తెలిసినప్పటికీ ఎందుకు అడ్డుకోవడంలేదని టౌన్ప్లానింగ్ ఉద్యోగులను ప్రశ్నించారు. పిల్లర్లు వేశాక శ్లాబ్ వేసేందుకు ఎంతో సమయం పడుతుందని, ఆలోగా ఎందుకు నిలువరించలేకపోతున్నారని నిలదీశారు. నిర్మాణం మొత్తం పూర్తయ్యేంతదాకా చోద్యం చూస్తూ మొక్కుబడి తంతుగా నోటీసులిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల వేళ.. అక్రమాల లీల’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన అక్రమ నిర్మాణాలపై ఆయన స్పందించారు. గురువారం టౌన్ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ సర్కిల్లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోవడాన్ని ప్రస్తావించారు. సంబంధిత సెక్షన్ ఆఫీసర్ కోర్టు పనులంటూ చెప్పడంతో ‘రోజంతా కోర్టులోనే ఉంటారా?’ అంటూ దానకిశోర్ ప్రశ్నించారు. అదనపు అంతస్తుకు పిల్లర్లు వేశాక శ్లాబ్ పూర్తయ్యేలోపునే అడ్డుకోనందుకు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయవద్దంటూ ప్రశ్నించారు. తొలి సమావేశం కావడంతో ప్రస్తుతానికి మెమో జారీ చేయాల్సిందిగా సీసీపీకి సూచించారు. ఇకపై ఎవరు నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని, అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత టౌన్ప్లానింగ్ విభాగానిదేనని స్పష్టం చేశారు. టౌన్ప్లానింగ్ విభాగం నుంచే తనకు అత్యధిక ఫిర్యాదుల వస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. రోజుకు తనకు 30 ఫిర్యాదులు అందితే, వాటిలో 27 టౌన్ప్లానింగ్వే నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అక్రమ నిర్మాణాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సిందే.. భవననిర్మాణ అనుమతులు జారీ కాగానే, నిర్ణీత వ్యవధుల్లోగా తనిఖీలు చేసేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని, తనిఖీలకు ఎప్పుడు వెళ్లాలనేది కూడా ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేయాలని దానకిశోర్ సిబ్బందికి సూచించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసుల జారీని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. తద్వారా ఎప్పుడు నోటీసులిచ్చారు.. తదుపరి ఏం చర్యలు తీసుకున్నారు.. అనే విషయాలు తెలుస్తాయన్నారు. మార్టిగేజ్ నిబంధనల్లేని 200 చ.మీ. లోపు నిర్మాణాల్లోనే అదనపు అంతస్తులు ఎక్కువగా వెలుస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. ఎన్నికల తరుణాన్ని ఆసరా చేసుకొని అక్రమనిర్మాణాలు జరుగకుండా తనిఖీ చేపట్టాలని, కూల్చివేతలకు వెనుకాడవద్దని స్పష్టం ఆయన చేశారు. అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ అస్త్రం ఇప్పటికే జరిగిన అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తుల వివరాలను ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగానికి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. టౌన్ప్లానింగ్ సిబ్బందితో కలిసి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అక్రమ నిర్మాణాలను తొలగిస్తాయని పేర్కొన్నారు. అయితే నిరుపేదలు, చిరు వ్యాపారుల జోలికి పోవద్దని స్పష్టం చేశారు. కొంతమంది టౌన్ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వల్లే సిటీలో అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని పత్రికల్లో వస్తుండటాన్ని ప్రస్తావించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సర్కిళ్ల వారీగా ఎన్ని అక్రమ నిర్మాణాలు, డీవియేషన్లు ఉన్నాయో, ఎన్నింటికి నోటీసులు జారీచేశారో, కోర్టు కేసులెన్ని ఉన్నాయో వివరాలను ఏరోజుకారోజు నమోదు చేసేందుకు సాఫ్ట్వేర్ రూపొందించి, ప్రతిరోజూ ఈ సమాచారం పొందుపరచాలన్నారు. సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్లు దేవేందర్రెడ్డి, శ్రీనివాసరావు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాలు ఓకే.. అమలు సంగతి? అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాలని దాదాపు ఏడాది క్రితమే నిర్ణయించారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు కూల్చివేసేందుకు సర్కిల్, జోన్ల స్థాయిలో టౌన్ప్లానింగ్, విజిలెన్స్, తదితర విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అమలుకు నోచుకోలేదు. -
స్మార్ట్ పాలన... ‘బిగ్’ ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ రాష్ట్రానికి గుండెలాంటి హైదరాబాద్ను ఇక్కడ సమృ ద్ధిగా ఉన్న వనరులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి, పారదర్శక సేవలకు అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తా. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్న బిగ్ డేటా అనలిటిక్స్తో సమస్య ఎక్కడ ఉందో సులభంగా గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా..’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అన్నారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న, వలసలతో పెరిగిపోతున్న హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు క్షేత్రస్థాయిలో తక్షణ సేవలందేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారంలో అవినీతికి అస్కారం లేకుండా చూడటం ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదంగా.. ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తనముందున్న పెద్దప్రాజెక్టులు కాగా, చెరువుల సుందరీకరణ, ప్లేగ్రౌండ్స్, పార్కుల్ని ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దడంపై శ్రద్ధ వహిస్తానన్నారు. రహదారులపై గుంతల సమస్యపైనా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఎంపిక చేసిన 23 చెరువుల సుందరీకరణకు ముంబైకి చెందిన కన్సల్టెంట్ నివేదిక అందాక పనులు చేపడతామన్నారు. టాయ్లెట్ల నిర్వహణలో సెల్ఫ్హెల్ప్ గ్రూప్లకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల్లో జాతీయస్థాయితో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. చెత్తను తడిపొడిగా వేరు చేయడం జాతీయస్థాయిలో దాదాపు 25 శాతం మాత్రమే ఉండగా, నగరంలో 50 శాతం ఉందన్నారు. ఈ–వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు, వరదకాలువలపై శ్రద్ధ చూపుతానని చెప్పారు. సహకరించే పాలకవర్గం, అనుభవజ్ఞులైన అధికారులు, యువ ఐఏఎస్ల సమన్వయం, సహకారాలతో తగిన ప్రణాళికతో మెరుగైన ఫలితాలు సాధించగలనన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ‘ప్రజావాణి’ ‘మైజీహెచ్ఎంసీ’ యాప్, తదితరమైన వాటిని మెరుగు పరుస్తానన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా అందే ప్రజాసేవల్లో గడచిన నాలుగేళ్లలో ఎంతో మార్పు వచ్చినప్పటికీ,మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తానన్నారు. గత కమిషనర్ జ నార్దన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తానని దానకిశోర్ పేర్కొన్నారు. థర్డ్పార్టీ ఫీడ్బ్యాక్.. వాటర్బోర్డులో మాదిరిగా సమస్య పరిష్కారమైందీ లేనిదీ, థర్డ్పార్టీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు. చదివే అలవాటు పెంచేందుకు కాఫీషాప్స్లో బుక్స్ ఏర్పాటుపై దృష్టిసారిస్తానని పేర్కొన్నారు. చెత్త సమస్యలు తీవ్రం.. ప్రతి నగరానికీ చెత్త సమస్య తీవ్రంగా ఉందంటూ, ప్రస్తుతం ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల చెత్త వెలువరిస్తుండగా, భవిష్యత్లో ఇది 1500 గ్రాములకు పెరగనుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ ఖాళీ ప్రదేశాల్లో చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తామన్నారు. -
అండాలమ్మా.. బాగున్నావా
సాక్షి, హైదరాబాద్: అది సచివాలయం సమీపంలోని అన్మోల్ హోటల్. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలి వద్ద సడన్గా ఇన్నోవా కారు ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు అధికారులు ఆమె పేరు, వివరాలు తెలుసుకున్నారు. నెలనెలా జీతం అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఆమెకు జీవిత భీమా సదుపాయం ఉందో లేదో తెలుసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నదీ లేనిదీ అడిగారు. తన పేరు అండాలమ్మ అని, ప్రతినెలా వేతనం సక్రమంగా అందుతోందని తెలిపిన ఆమె, ప్రతిరోజూ బయెమెట్రిక్ హాజరు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇంతకీ తామెవరో తెలుసా? అంటే తెలియదని సమాధానం ఇచ్చింది. తాను జీహెచ్ఎంసీ కమిషనర్నని, ఈమె ఆరోగ్యవిభాగం అదనపు కమిషనర్ శృతిఓజా అని బి.జనార్థన్రెడ్డి తెలిపారు. దాంతో ఆమెకు నోట మాటరాలేదు. ఆశ్యర్యం వ్యక్తం చేసింది. కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయిలోని ఉన్నతాధికారులు తనతో మాట్లాడటం ఇదే మొదటిసారి అని, తన యోగక్షేమాలు తెలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసింది. -
జీహెచ్ఎంసీ కమిషనర్కు ‘పీఎం ఎక్సలెన్సీ’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలనా విభాగంలో కేంద్రం అందజేసే ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రదానం చేశారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యున్నత ఫలితాలు సాధించిన 13 మంది ఐఏఎస్ అధికారులకు అవార్డులను అందజేశారు. దక్షిణ భారత దేశం మొత్తంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఈ అవార్డులు లభించగా, ఆ ఇద్దరూ తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. ప్రధానమంత్రి ఆవాస్యోజన కార్యక్రమం కింద జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సమర్థవంతంగా చేపట్టినందుకు గుర్తింపుగా జనార్దన్రెడ్డిని ఈ అవార్డు వరించింది. కార్యక్రమానికి జనార్దన్రెడ్డి సతీమణి సులోచన, కుమారుడు రాహుల్ కూడా హాజరయ్యారు. అవార్డుల బహూకరణకు ముందు హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ, లబ్ధిదారుల వివరాలతో కూడిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల విజయగాథలతో ప్రచురించిన ప్రత్యేక సావనీర్లో జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విజయప్రస్థానంపై ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించారు. స్వచ్ఛ నమస్కారానికి ప్రధాని అభినందన ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించేందుకు వేదికపైకి వెళ్లిన జనార్దన్రెడ్డి ప్రధానమంత్రిని ఉద్దేశించి ‘స్వచ్ఛ నమస్కారం’అంటూ అభివాదం చేశారు. స్వచ్ఛభారత్ స్పూర్తిని కలిగించేలా ఉన్న ఆ సంబోధన ప్రధానిని ఆకట్టుకుంది. దీంతో జనార్దన్రెడ్డిని మోదీ అభినందించారు. గురుశిష్యులకు అవార్డులు.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు పీఎం ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. జనార్దన్రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో సర్ఫరాజ్ అహ్మద్ శిక్షణ ఐఏఎస్ అధికారిగా విధుల్లో చేరారు. జనార్దన్రెడ్డి వద్ద శిక్షణ పొందిన సర్ఫరాజ్కు కూడా ఈ అవార్డు దక్కడంతో వీరిద్దరి అనుబంధాన్ని పలువురు అధికారులు ప్రస్తావించారు. మరింత ఉత్సాహం.. మరింత శక్తి: జనార్దన్రెడ్డి పైస్థాయి నుంచి అందే ఇలాంటి వాటివల్ల మరింత శక్తిసామర్థ్యాలతో సంతోషంగా పనిచేసే వీలు కలుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఉండాల్సిందేనని చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్, అవార్డు అందజేయడం ద్వారా నూతనోత్తేజాన్ని కలిగించిన ప్రధాని నరేంద్రమోదీ, జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. -
జీహెచ్ఎంసీ కమిషనర్కు హెచ్చార్సీ నోటీసులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ పరిధి కామాక్షి పురంలో వీధికుక్కల దాడిలో పిల్లలు తీవ్రంగా గాయపడిన విషయంపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. గాయపడిన విషయాన్ని బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్కి నోటీసులు జారీ చేస్తూ ఈ ఘటన పై జూన్ 19 లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది. -
జీహెచ్ఎంసీ కమిషనర్తో సాక్షి టీవీ ఫోన్ ఇన్
-
కుక్కలకూ కావాలొక ‘శ్రీమంతుడు’
నగరంలో వీధి కుక్కల దత్తత.. దేశంలోనే తొలిసారి సాక్షి, హైదరాబాద్: దత్తత కాన్సెప్టు ఇప్పుడు వీధి కుక్కల వరకూ చేరింది. వీధి కుక్కల బెడదను నివారించేందుకు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో ‘వీధి కుక్కల దత్తత’అనే వినూత్న కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఆదివారం నార్త్జోన్లో ‘స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్’కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. తొలిరోజు ఐదు కుక్కపిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. దత్తత ద్వారా వీధికుక్కల నియంత్రణకు మార్గం లభిస్తుందని బల్దియా భావిస్తోంది. మహానగరం పరిధిలో ప్రస్తుతం ఆరు లక్షల వీధికుక్కలు ఉన్నాయి. వీటిలో ఒక లక్ష కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలో ఉన్న వీధికుక్కలకు రేబిస్ నిరోధక టీకాలతోపాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నా, నగర శివార్లలోని గ్రామాలు, పట్టణాలలో ఈ విధమైన పద్ధతి లేనందున అక్కడి వీధికుక్కల సమస్య జీహెచ్ఎంసీకి తలనొప్పిగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి ఆదివారం అడిషనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ వెటర్నరీ అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఇతర వెటర్నరీ అధికారులతో సమావేశమై వీధి కుక్కల దత్తతపై చర్చించారు. దత్తతపై అవగాహన దత్తతపై స్వచ్ఛంద సంస్థలకు, జంతు ప్రేమికులకు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న కుక్కపిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, అవసరమైన వైద్య చికిత్సలను తామే చేపడతామని బల్దియా వెటర్నరీ అధికారులు భరోసా ఇస్తున్నారు. రెండు రోజులక్రితం నార్త్ జోన్ పరిధిలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు 20 మందికిపైగా స్వచ్ఛంద సంస్థల, జంతు ప్రేమికుల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వీధికుక్కలను దత్తత తీసుకునేవారు స్థానిక జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులను సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జంతు ప్రేమికులకు సూచించారు. -
‘ఫైన్ సిటీ’లక్ష్యం
జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి ప్రశ్న : ఈ ఉగాది లక్ష్యం..? కమిషనర్: వచ్చే ఉగాది నాటికి 20 లక్షల కుటుంబాల నుంచి ఇంటివద్దే చెత్త నూరు శాతం వేరు కావడం లక్ష్యం. మొత్తం చెత్తలో 30 శాతం పొడి చెత్త వల్ల (ప్లాస్టిక్ తదితర) ఎలాంటి దుర్వాసన రాదు. ఇంటివద్దనే దాన్ని వేరు చేయడం వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. గోద్రెజ్, ఐటీసీ వంటి సంస్థలు వీటిని రీసైక్లింగ్ చేస్తాయి. వీటిని వేరుచేసే చెత్త కార్మికులకు నెలకు అదనంగా రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆదాయం పెరుగుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, స్వచ్ఛ భారత్ లక్ష్యాల మేరకు ఈ కార్యక్రమాల్ని అందరి కంటే ముందే ప్రారంభించాం. ఉద్యమ రూపంలో ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నూరు శాతం చేయడం అంటే వాషింగ్టన్, బెర్లిన్, పారిస్ వంటి నగరాల సరసన చేరడమే. అతిశయోక్తిగా అనిపించినా ఇది వాస్తవం. ప్రశ్న: పారిశుధ్య కార్యక్రమాల అమలులో భాగంగా సింగపూర్ తరహాలో ఫైన్లు వేస్తారా..? కమిషనర్: ఫైన్లు వేయడం కంటే ‘ఫైన్ సిటీ’గా తీర్చిదిద్దడం లక్ష్యం.అన్నీ తెలిసిన విద్యాధికులే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటం, సామాజిక స్పృహ లేకపోవడం దౌర్భాగ్యం. తొలుతే ఫైన్లు వేయకుండా తగిన కౌన్సిలింగ్స్ నిర్వహిస్తాం. అప్పటికీ మారకపోతే డ్రంకెన్ డ్రైవ్ మాదిరిగా చలానా వేసే యోచన ఉంది. ప్రశ్న: దుకాణదారులపై ఎలాంటి చర్యలు చేపడతారు ? కమిషనర్: రోడ్లపై చెత్తవేయడమే కాక ఫుట్పాత్లను ఆక్రమించిన వ్యాపారులకు పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తాం. జరిమానాలకు వెరవకుండా మళ్లీమళ్లీ పాల్పడితే క్రిమినల్ చర్యలు చేపడతాం. ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాం. 210 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 90 మందికి జైలు శిక్షలు పడ్డాయి. ప్రశ్న: బహిరంగ మూత్ర విసర్జన చేసేవారికి ఎలాంటి జరిమానా వేస్తున్నారు?! కమిషనర్: గడచిన 60 ఏళ్లలో నగరంలో 500 ప్రదేశాల్లో మాత్రమే పబ్లిక్ టాయ్లెట్లు ఉండగా, కేవలం మూడు నెలల్లోనే 323 పెట్రోలు బంకుల్లోని టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునే అవకాశం కల్పించాం. ఆమేరకు వారు బోర్డులు కూడా పెట్టారు. హోటళ్లలోని టాయ్లెట్లనూ ప్రజలు వినియోగించుకునేందుకు హోటళ్ల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం. దీన్నో ఉద్యమంగా చేపడతాం. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో తగిన నిర్వహణతో ఉండేలా పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోగా వీటన్నింటినీ పూర్తిచేస్తాం. -
భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష
హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల నిమిత్తం నగరంలో 220 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. నీట మునిగిన కాలనీలు, బస్తీల్లో భోజన వసతి ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. పైప్లైన్ పగలడం వల్లే ఎన్టీఆర్ మార్గ్లో రోడ్డుపై గుంత ఏర్పడినట్లు ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా మ్యాన్హోల్స్ను ఎవరూ తెరవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామన్నారు. అలాగే పురాతన భవనాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్కు కేసీఆర్ ఫోన్
హైదరాబాద్: హైదరాబాద్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్కు కేసీఆర్ ఫోన్ చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో, నాలాల వెంట ప్రమాదాలను నివారించేందుకు ముందుజాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. -
మ్యాన్హోల్స్ తెరవవద్దు: జిహెచ్ఎమ్సి
-
గ్రేటర్లో వినాయక ఉత్సవాలపై సమావేశం
-
'గాలివాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయి'
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో శుక్రవారం సాయంత్రం 100 కి.మీ వేగంతో గాలులు వీచాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ... గాలి వాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకున్నామన్నారు. అలాగే ట్రాఫిక్ను పునరుద్ధరించామని తెలిపారు. ఈ గాలివానకు ఇద్దరు చనిపోయారని... మరికొందరికి గాయాలయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
హనుమాన్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
హైదరాబాద్ : గౌలిగూడలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా వందల కెమెరాలతో నిరంతర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి వెల్లడించారు. గురువారం గౌలిగూడలో రేపు జరగనున్న హనుమాన్ జయంతి ఊరేగింపు ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డితోపాటు మహేందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మహేందర్రెడ్డి వివరించారు. -
నగరంలో రెండు సర్వేలు..
♦ ఎన్యూమరేటర్లకు సహకరించండి ♦ నగర ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్ : భారత పౌరుల జాతీయ రిజిస్టరు తయారీలో మొదటి అంకమైన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)కోసం జరుగుతున్న ఇంటింటి సర్వేలో సిబ్బందికి తగిన విధంగా సహకరించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు కోరే వ్యక్తుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన స్థలం, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు, వృత్తి, జాతీయత, చిరునామా తదితర వివరాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు వరకు ఈ సర్వే జరుగనుంది. 19.71 లక్షల ఓటర్ల పునః పరిశీలన.. ఓటర్ల తుది జాబితా మే 31న విడుదల చేయనున్నందున స్పెషల్ సప్లిమెంటరీ రివిజన్ కింద ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో భాగంగా చిరునామా మారినవారు, మరణించిన వారు, డూప్లికేట్లను జాబితాలోంచి తొలగిస్తారు. మే 15 వరకు మార్పుచేర్పులతో కూడిన తుది జాబితాను రూపొందించి, 31వ తేదీన వెలువరిస్తారు. గతంలో జాబితాలోంచి తొలగించిన 19.71 లక్షలమంది ఓటర్లకు సంబంధించిన వివరాలను పునః పరిశీలిస్తారు. మృతులు, చిరునామా మారిన వారు, అనర్హులు తదితరులను గుర్తిస్తారు. అర్హులుంటే జాబితాలో చేరుస్తారు. ఇందుకుగాను బూత్లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. అనర్హులను తొలగించేందుకు ఏప్రిల్ 16 నుంచి 22 వరకు నోటీసులు జారీ చేస్తారు. మే 10లోగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులు, జాబితాలో పేరు స్పెల్లింగ్లలో పొరపాట్లు తదితరమైన వాటికి సంబంధించి అందిన దరఖాస్తులను పరిష్కరిస్తారు. 15వ తేదీలోగా అనర్హులను, చిరునామా మారినవారి పేర్లు తొలగిస్తారు. 18న అనుబంధ జాబితా రూపొందిస్తారు. 20 తేదీన జాబితాను ప్రచురిస్తారు. 21 వ తేదీనాటికి ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు. 23వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. మే 31న ఓటర్ల తుది జాబితాను వెలువరిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లకు వచ్చే బూత్లెవెల్ అధికారులకు సహకరించాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాబితా లో పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని, అర్హులైన వారు జాబితాలో పేర్లు లేకుంటే నమోదు చేయించుకోవాలని, చిరునామా మార్పులు, ఫొటోలు, పేర్లలో పొరపాట్లు దొర్లినా సవరించుకోవచ్చునని సూచించారు. -
ఆర్టీసీలో ఉమ్మడి పాలక మండలి
♦ తెలంగాణ బోర్డు ఏర్పాటుకు అనుమతించని కేంద్రం ♦ ఏపీ అధీనంలోని బోర్డులోకి తెలంగాణ సభ్యులు ♦ రవాణా, ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ జేఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు అవకాశం సాక్షి, హైదరాబాద్: పాలనాపరంగా తెలంగాణ, ఏపీ ఆర్టీసీలు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా... మరికొంతకాలం పాటు ఒకే ‘పాలక మండలి’ కింద పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్తులు, అప్పుల విభజన సహా సాంకేతికంగా విడిపోయే వరకూ కూడా ఒకే పాలకమండలి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతికంగా ఈ రెండు రవాణా సంస్థలు ఇప్పటికీ ఒకటిగానే కొనసాగుతున్నాయి. బస్సుల నిర్వహణ, ఆదాయ వ్యయాలు వేటికవేగా ఉన్నా... ఆస్తులు-అప్పుల విభజన పూర్తికాలేదు. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అయితే ఈ అంశం తేలకున్నా ఇప్పుడే విడివిడిగా పాలక మండళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ పరిధిలో ఉన్న పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రం సభ్యులను నియమించేందుకు సిద్ధమైంది. తెలంగాణ పక్షాన ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించబోతోంది. రవాణా శాఖ, ఆర్థిక శాఖ, కార్మిక ఉపాధి కల్పన శాఖల కార్యదర్శులు, టీఎస్ఆర్టీసీ జేఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక ఇప్పటివరకు పదిమంది సభ్యులు ఏపీ నుంచి ఉండగా ఆ సంఖ్య ఎనిమిదికి తగ్గనుంది. ఈ బోర్డుకు ఏపీ రవాణాసంస్థ ఎండీ చైర్మన్గా ఉంటారు. చైర్మన్ వస్తే ఎలా..? ప్రసుతం పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీకి కూడా చైర్మన్ను నియమించాలని భావిస్తోంది. మిగతా కార్పొరేషన్లతోపాటు ఆర్టీసీ చైర్మన్ పోస్టును భర్తీ చేస్తే కొత్త సమస్య రావటం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్ పాలకమండలికి నేతృత్వం వహిస్తారు. సాంకేతికంగా ఆర్టీసీ విడిపోనందున... తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఉమ్మడి బోర్డుకు నేతృత్వం వహించే అవకాశం ఉండదు. అప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ హోదాలో ఎండీ దాన్ని నిర్వహిస్తే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ దానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోమారు బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ 2014 అక్టోబరు తర్వాత బోర్డు సమావేశం కాలేదు. తెలంగాణ నేతలు, ఏపీ ఎండీ మధ్య అప్పట్లో తీవ్ర విభేదాలుండటంతో ఈ సమావేశాలు జరగలేదు. కానీ బోర్డు చేసిన ఓ తీర్మానం సమావేశాలు జరగకున్నా న్యాయపరమైన చిక్కులు లేకుండా చేసింది. చైర్మన్ లేని సమయంలో ఆర్టీసీ ఎండీ ఆ బాధ్యతను నిర్వహించేందుకు వెసులుబాటు కల్పిస్తూ తీర్మానించింది. ప్రస్తుతం కీలక నిర్ణయాలను కూడా బోర్డుతో సంబంధం లేకుండా ఎండీలే కానిచ్చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ఆర్టీసీకి ఎండీ లేనట్టే. సాంకేతికంగా ఏపీ ఎండీనే తెలంగాణ-ఆంధ్రలకు చైర్మన్గా వ్యవహరించాలి. కానీ టీఎస్ ఆర్టీసీ జేఎండీగా రమణారావును నియమించిన తరుణంలో ఆయనకు ఎండీ అధికారాలను కూడా కట్టబె ట్టడంతో ఆయన ఎండీ హోదాలో చైర్మన్తో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి బోర్డులో తెలంగాణ సభ్యులను నియమించబోతున్నందున బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. -
11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎలాంటి సమస్య లేకుండా, ప్రశాంతంగా జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల్లోపే 50 డివిజన్లలో ఫలితాలు వెల్లడి చేశామన్నారు. ఓట్ల లెక్కింపులో ఒకటి, రెండుచోట్ల కొద్దిపాటి అంతరాయం కలిగినా వెంటనే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. కేవలం జాంబాగ్లో మాత్రమే రెండుసార్లు కౌంటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. మరోవైపు పురానా పూల్లో కౌంటింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ కలెక్టర్ వ్యవహరిస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. -
సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాతే వెల్లడిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపు విషయమై ఆయన గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కౌంటింగ్ మొదలవుతుందని, మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. అయితే.. పురానాపూల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్ ఉన్నందున.. అది ముగిసిన తర్వాత మాత్రమే మొదటి ఫలితాన్ని వెల్లడిస్తారని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, అందువల్ల కేవలం పాస్లు ఉన్నవారు మాత్రమే కేంద్రాల వద్దకు రావాలని జనార్దన రెడ్డి చెప్పారు. పాస్లు లేనివాళ్లు అక్కడకు రావల్సిన అవసరం లేదని, ఎటూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఫలితాలను వెల్లడిస్తున్నందున ఆ కాంపౌండ్ వద్ద ఉన్నా, ఇంట్లో ఉన్నా తేడా ఏమీ ఉండబోదని చెప్పారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత కౌంటింగ్ దగ్గర వివాదాలు ఏమీ ఉండబోవని, కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తామని ఆయన అన్నారు. అలాగే, ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు ఏవీ నిర్వహించకూడదని కమిషనర్ చెప్పారు. -
నేటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఈ ఎన్నికల ప్రచారానికి తెరపడనుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 7, 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 3, 200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. అంధుల కోసం ప్రత్యేక బ్యాలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేటి సాయంత్రం 5.00 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచుతారని బి.జనార్దన్రెడ్డి చెప్పారు. -
చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ చీఫ్ సెక్రటరీపై అరెస్టు వారెంట్ జారీ అయింది. చందానగర్లోని రాజేంద్రరెడ్డి పార్క్ స్థలాన్ని కొందరు మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్నారని కసిరెడ్డి బాస్కర్రెడ్డి గతంలో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు చీఫ్ సెక్రటరీ హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది. విచారణకు రాకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని భావించిన చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
'గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ....గ్రేటర్ ఎన్నికల బరిలో మొత్తం 1333 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు. గ్రేటర్ పరిధిలో 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని... ఇప్పటి వరకు 13.87 లక్షల మంది ఓటర్లు స్లిప్పులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అత్యధికంగా జంగంమెట్ డివిజన్ నుంచి 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా 8 డివిజన్ల నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు జనార్థన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా(నన్ ఆఫ్ ది ఎబవ్) ఆప్షన్ ఎన్నుకునే విధానాన్ని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను అమలులోకి తెచ్చారు. -
గ్రేటర్లో తనిఖీలు ముమ్మరం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్లో గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 997 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు 2700 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహనాల తనిఖీల్లో రూ.32 లక్షల 36 వేలు, స్టాటిక్ సర్వే లైన్స్ సోదాల్లో కోటి రూపాయల వరకు నగదు పట్టుబడిందని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
గ్రేటర్లో మూడు లక్షలకుపైగా కొత్త ఓటర్లు
హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో 82,834 బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు తొలగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో జనార్దన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... గ్రేటర్లో 3,87,530 మంది కొత్తగా ఓటర్లు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 74,36,247 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అందులో 39,73,374 మంది మహిళ ఓటర్లు ఉండగా.... 34,61,919 మంది పురుష ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ జనార్దన్రెడ్డి చెప్పారు. -
'అందరి సమన్వయంతో నగరాభివృద్ధి'
హైదరాబాద్: హైదరాబాద్లాంటి మహానగరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ బి.జనార్దన్రెడ్డి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం పలువురు సీనియర్ అధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలకు మేలైన సదుపాయాలు అందించగలుగుతామని అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరంలో నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన అన్నారు. కమిషనర్ను కలిసినవారిలో ఐఏఎస్ అధికారులు సురేంద్రమోహన్, గౌరవ్ఉప్పల్, శివకుమార్ నాయుడు, హరిచందన, అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, రవికిరణ్, శంకరయ్య, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు ఉన్నారు. -
కుక్కలకు లైసెన్స్ తప్పని సరి
హైదరాబాద్ : ఇళ్లల్లో పెంచుకునే కుక్కలకు లైసెన్స్ తప్పని సరి అని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే లైసెన్స్ లేని కుక్కలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది. అందులోభాగంగా ఇళ్లలో పెంచుకునే కుక్కలకు లైసెన్స్లు తప్పని సరి చేయాలని కమిషనర్ నిర్ణయించారు. -
ప్రేమలోకమిషనర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ప్రేమ పాఠాలు బోధిస్తున్నారు. జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాలకూ ఆయన ప్రేమ పాఠాలు వెళ్తున్నాయి. ప్రేమతోనే ఏదైనా సాధ్యం అని చెబుతున్న ఆయన గతంలో వివిధ జిల్లాల్లో కలెక్టర్గా పని చేసినప్పుడే ప్రేమలో పడ్డానని... ఇంకా ఆ మైకం వదల్లేదని అంటున్నారు. అంతే కాదు.. ‘నాలాగే మీరూ ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమిస్తేనే ఎవరైనా దగ్గరకొస్తారు...’ అంటూ జీహెచ్ఎంసీ ఉద్యోగులతో పాటు ఇత రులకూ బోధిస్తున్నారు.‘సంశయం వద్దు.. సంకోచించ వద్దు.. ఇప్పుడే రంగంలోకి దిగండి (యాక్ట్ నౌ)’ అని చెబుతున్నారు. ఈ ప్రేమ పాఠాలకు స్పందన కనిపిస్తోందని అంటున్నారు. ఇంత లేటు వయసులో ఏమిటీ ఘాటు ప్రేమ అనుకుంటున్నారా..? ..ఇంతకీ కమిషనర్ ప్రేమించాలని చెబుతున్నది ఎవరినో తెలుసా? వృత్తిని... ‘ఐ లవ్ మై జాబ్’ అంటూ ఉద్యోగాన్ని ప్రేమించాలని అందరికీ హితబోధ చేస్తున్నారు. అప్పటికీ బుర్రల్లోకి ఎక్కుతుందో లేదోనని ఏకంగా స్టిక్కర్లు అచ్చు వేయించి జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగుల టేబుళ్ల కింద అద్దాల్లో పదిలపరుస్తున్నారు. గోడలపై అంటిస్తున్నారు. పదేపదే అవి కనిపించడం వల్ల ఉద్యోగంపై ప్రేమ భావం పెరుగుతుందని... వివిధ పనులపై వచ్చే ప్రజలకు ప్రేమతో కూడిన మంచి సేవలు అందించగలుగుతారన్నది ఆయన ఉద్దేశం. గతంలో వరంగల్ జిల్లాలో కలెక్టర్గా పని చేసినప్పుడు మొదలైన ఈ ప్రేమ ఉద్యమం మంచి ఫలితాలివ్వడంతో తాను పని చేసే ప్రతిచోటా దీన్ని ఆచరిస్తానంటున్నారు. ‘ఐ లవ్ మై జాబ్’తో పాటు ‘యాక్ట్ నౌ, ‘సేవ్ ఎనర్జీ’, ‘మర్యాదగా మాట్లాడుకుందాం’ అనే స్టిక్కర్లను కూడా తయారు చేయించారు. జీహెచ్ఎంసీ అన్ని కార్యాలయాలకూ వీటిని పంపిణీ చేస్తున్నారు. అన్నీ కలపి మొత్తం ఆరువేల స్టిక్కర్లు ముద్రించారు. ప్రతి వ్యక్తీ తన ఉద్యోగాన్ని ప్రేమించినప్పుడే ఉత్తమ సేవలందించగలరని భావిస్తున్న జనార్దన్రెడ్డి ఈ నినాదాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల్లో సానుకూల దృక్పథం అలవరచడం... వారు తమ వద్దకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం... కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా మాట్లాడటం... అవసరం లేనప్పుడు విద్యుత్ను వినియోగించకపోవడం వంటివి అలవరచేందుకు జీహెచ్ఎంసీలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు. -
సోమేశ్.. టీఆర్ఎస్ ఏజెంట్!
జీహెచ్ఎంసీ కమిషనర్పై కాంగ్రెస్ మండిపాటు * భన్వర్లాల్కు ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ‘‘జీహెచ్ఎంసీ కమిషనర్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ మాదిరిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని ఇతర పార్టీలకు చెందిన, టీఆర్ఎస్కు ఓటేసేందుకు ఇష్టపడని వారి ఓట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. గ్రేటర్లోని 42 లక్షల ఓటర్లలో ఇప్పటికే 17 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు’’ అంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్కు టీ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలనికోరారు. అన్యాయంగా ఎవరి ఓట్లనైనా అధికారులు తొలగించినట్టతే వాటిని తిరిగి జాబితాలో చేరుస్తామని వారికి భన్వర్లాల్ హామీ ఇచ్చారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గ్రేటర్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 30 నుంచి 40 శాతం ఓట్లను తొలగిస్తూ తద్వారా ఇతర పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సనత్నగర్లో 1.4 లక్షలు, ఎల్బీనగర్లో 1.38 లక్షల ఓట్లు తీసేశారని సుధీర్రెడ్డి చెప్పారు. ఎన్నికల అధికారిగా సోమేశ్ ఉంటే గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగబోవని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. ఆయన్ను ఏపీ క్యాడర్కు కేటాయించినందున తక్షణం పంపేయాలని, దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చే స్తామని చెప్పారు. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి గాంధీభవన్లో నేతల తో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసం సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. తాము చెప్పిన మేరకు ఓట్లు తొలగించాలంటూ ఎన్నికల సంఘంపై కూడాఒత్తిడి తె స్తున్నారన్నారు. దీనిపై భన్వర్లాల్ రెండు మూడు రోజుల్లో స్పందించకుంటే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ న్యాయం జగరకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. స్మారక స్టాంపుల రద్దు కుటల రాజకీయం... మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ స్మారక తపాల బిళ్లలను కేంద్రం కుటిల రాజకీయాలతో రద్దు చేయడం క్షమార్హం కాదని ఉత్తమ్, భట్టి ధ్వజమెత్తారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ పోరాటాల ఫలితంగా భూ సేకరణ ఆర్డినెన్స్ సవరణ చట్టాన్ని కేంద్రం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో 20న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఓటర్ల పేర్లు తొలగించడం లేదు
-
ఉప్పల్ డీసీపై ‘సమ్మె’ట వేటు!
* ప్రభుత్వానికి సరెండర్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ * బీజేపీ ఎమ్మెల్యే దీక్షకు ‘ఇస్కాన్’ నుంచి భోజనం అందించారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారం విషయంలో పంథాలు ఓ అధికారి కుర్చీకే ఎసరు పెట్టాయి! సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్(డీసీ)పై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ వేటు వేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు సమ్మెలో పాల్గొన్న 1,300 మంది కార్మికులను జీహెచ్ఎంసీ తొలగించిన విషయం తెలిసిందే. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు, వామపక్షాలతో పాటు బీజేపీ సైతం ఆందోళనలు చేస్తోంది. ఇదే కోవలో ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గత 24 నుంచి 31 వరకు ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. వారం పాటు కొనసాగించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళను విరమించారు. ధర్నాలో పాల్గొన్న వారికి ఒకరోజు ‘హరే రామ హరే కృష్ణ’ మఠం నిర్వాహకులు ఉచితంగా భోజనాన్ని సరఫరా చేశారు. జీహెచ్ఎంసీ రాయితీతో ‘హరే రామ హేరే కృష్ణ’ మఠం రూ.5కే భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారికి ఈ పథకం కింద భోజనం వడ్డించారని ఉన్నతాధికారులు భావించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శనివారం డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథ్ను వివరణ కోరారు. ఇందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయితే విశ్వనాథ్ను ఉప్పల్ సర్కిల్ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదం పంపాలని కోరా.. దీనిపై ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ వివరణ ఇస్తూ.. ధర్నాలో పాల్గొన్న వారికి తన కోరిక మేరకే ఇస్కాన్ మఠం వాళ్లు ప్రసాదం పంపించారని చెప్పారు. ‘ఏకాదశి నాడు చాలా మంది ఉపవాస దీక్ష చేశారు. ఆ మరుసటి రోజు ధర్నా చేయడంతో మఠం నుంచి ప్రసాదాన్ని తెప్పించాను. రూ.5కే భోజనం పథకంతో ఈ ప్రసాదానికి ఎలాంటి సంబంధం లేదు.’ అని తెలిపారు. -
'టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారు'
హైదరాబాద్:జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆరోపించారు. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దానం.. డివిజన్ల డీలిమిటేషన్ లో సోమేష్ కుమార్ టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారని విమర్శించారు. గత ఏడాది ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల ఆధారంగా.. ఆ పార్టీకి అనుకూలంగా డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా సోమేష్ కుమార్ ను తప్పించాలని.. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని దానం పేర్కొన్నారు. -
అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తాం
-
టాక్ ఆఫ్ది సిటీ: ఉంటారా.. వెళ్తారా?
సోమేష్కుమార్ బదిలీపై చర్చ హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్కుమార్ ఇక్కడే ఉంటారా.. లేక ఆంధ్రప్రదేశ్కు వెళ్తారా? అనే విషయం మరోమారు హాట్ టాపిక్కా మారింది. ఏఐఎస్ అధికారుల కేటాయింపుల తుదిజాబితా గురువారం విడుదలైంది. సోమేశ్కుమార్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమేశ్కుమార్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించినప్పటికీ మరికొంత కాలం ఆయన తెలంగాణలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారుల కేటాయింపులకు సంబంధించి ఆయన క్యాట్ను ఆశ్రయించడం.. క్యాట్ ఆయనకు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే . తీర్పు వచ్చే వరకూ ఆయన ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ క్యాట్ ఆయను వ్యతిరేకంగా తీర్పు ఇస్తే డెప్యూటేషన్పై ఇక్కడ ఉండేలా ప్రభుత్వం కేంద్రాన్ని కోరే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. నగరాన్ని విశ్వనగరంగా మార్చే తలంపులో ఉన్న తెలంగాణ ప్రభుత్వ విజన్ కనుగుణంగా ఎక్స్ప్రెస్వేలు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, అధునాతన షాపింగ్కాంప్లెక్స్లు.. ఇలా వివిధ ప్రాజెక్టుల్లో ఆయన ప్రమేయం ఉంది. వీటితో పాటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగానే కాక సవాల్గా కూడా తీసుకున్న హుస్సేన్సాగర్ ప్రక్షాళనలోనూ ఆయన తనవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా నగరంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం సోమేశ్కుమార్ను ఇక్కడ కొనసాగించేందుకే మొగ్గు చూపుతునట్టు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనులు వేరేవారికి ఇస్తే పనులు జాప్యం అవుతాయన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఐఏఎస్ల కేటాయింపుల సమయంలో సోమేశ్ను ఇక్కడే ఉంచాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. తొలుత తెలంగాణకు కేటాయించిన తనను.. తదుపరి ఆంధ్రప్రదేశ్కు మార్చారంటూ ఆయన క్యాట్ను ఆశ్రయించారు. క్యాట్ స్టే ఇచ్చింది. క్యాట్ తీర్పు అనుకూలంగా రాకపోతే ఆయన పైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారని తెలిసింది. సోమేశ్కుమార్ ఫిర్యాదుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా క్యాట్ సూచించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇంతవరకు దానిని దాఖలు చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సోమేశ్కుమార్ వ్యవహారంలో మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే సోమేశ్కుమార్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. ఇవన్నీ పక్కనబెడితే తాను మాత్రం తెలంగాణలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఔను.. ఆయన ప్రేమలో పడ్డారు!
సోమేశ్ కుమార్... జీహెచ్ఎంసీ కమిషనర్గా 14 నెలలుగా నగర ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్గా జీహెచ్ఎంసీ పాలక మండలి, స్టాండింగ్ కమిటీల బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. లక్ష్య సాధనలో భాగంగా తాను శ్రమిస్తూ... ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించే ఆయన సీరియస్ ఆఫీసర్గానే అందరికీ తెలుసు. ఇదంతా నాణేనికి ఒకవైపు అందరిలాగే ఆయనకూ హాబీలు... అలవాట్లు ఉన్నాయి. మరచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మనసును మెలిపెట్టిన బాధాకర ఘటనలు ఉన్నాయి. పత్రికలు చదవడమే కాదు...పుస్తకాలు రాసే అభిరుచి ఉంది. ఆరోగ్యం కోసం నడకతో పాటు సమాజ క్షేమానికి ఉపకరించే మొక్కలపైనా మక్కువ ఉంది. సినిమాలు.. షికార్లు.. ఇతరత్రా సరదాలు ఉన్నాయి. ఫ్లాష్బ్యాక్లో ఓ ప్రేమ కథ ఉంది. పెళ్లి దాకా వేచి చూసిన నిరీక్షణ ఉంది. ఇది నాణేనికి రెండోవైపు వ్యక్తిగత విషయాలతో పాటు ప్రజా జీవితానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకూ సమాధానాలిచ్చారు. తమ కుటుంబానికి చెందిన వివిధ అంశాలను తన సతీమణి డాక్టర్ జ్ఞాన్ ముద్రతో కలిసి ‘మార్నింగ్వాక్’లో సోమేశ్కుమార్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు.. ఈ ఆదివారం ప్రత్యేకం.. జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్కుమార్తో ‘మార్నింగ్ వాక్’ సిటీబ్యూరో: ప్రస్తుత డిజిటల్ రోజుల్లో ఏ దరఖాస్తు నింపాలన్నా ఫస్ట్ నేమ్, మిడిల్నేమ్, లాస్ట్నేమ్లు అవసరం. ఈ స్పెషలాఫీసర్కు మాత్రం ఫస్ట్ నేమ్ సోమేశ్... లాస్ట్ నేమ్ కుమార్. ఇంటి పేరు కనిపించదు. ప్రాథమిక విద్యలో ఉన్నంత కాలం పాఠశాల రిజిస్టర్లలో పేరుకు ముందు ఇంటి పేరు ఉన్నప్పటికీ. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ వచ్చేనాటికి పేరు మాత్రమే మిగిలింది. ఇంటి పేరు ఉంటే కులం, మతం వంటి వివరాలు తెలిసే వీలుంటుంది. అవేవీ అక్కరలేని సమానత్వమే కావాలనుకుంటున్న మిగతా విద్యార్థుల మాదిరిగానే ఇంటిపేరు లేకుండా పరీక్షల దరఖాస్తును నింపారు. సర్టిఫికెట్ అలాగే వచ్చింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఐఏఎస్ కల... తండ్రి డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేసే వారు. ఐఏఎస్లు సాధించిన వారు ఊళ్లోనే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో ప్రభావం చూపుతుండటంతో పెద్ద అధికారులైతే అలాంటి అవకాశం వస్తుందని సోమేశ్ కుమార్ భావించారు. చాలా మంది జీవితాలు మార్చేందుకు ఐఏఎస్ కావడమే మార్గమనుకున్నారు. దాన్ని పొందేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడయ్యారు. మొక్కలతో దోస్తీ చిన్నప్పటి నుంచీ మొక్కల పెంపకంపై సోమేశ్ కుమార్కు మక్కువ. కరువు జిల్లా అనంతపురం కలెక్టర్గా పని చేసినప్పుడు 60 ఎకరాల్లో చింతచెట్లు నాటించారు. పాడేరులో 40 వేల ఎకరాల్లో నాలుగు కోట్ల సిల్వర్ ఓక్ మొక్కల పెంపకం ఓ రికార్డు. వాటి నీడలో పెరిగే కాఫీ మొక్కలతో అక్కడి ప్రజలకు ఓ జీవనమార్గం చూపారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా గ్రీన్కర్టెన్లకు తెర తీశారు. రోడ్ల పక్కన ఫుట్ఫాత్లను ఆనుకుని ఉండే గోడలు కనిపించకుండా తీగల్లా పెరిగే మొక్కలు నాటడం.. ఫుట్పాత్లపై తక్కువ ఎత్తులోని మొక్కలతో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టారు. రాయడమంటే ఇష్టం... బాల్యం నుంచీ రాసే అల వాటు ఉంది. ఏడోతరగతిలో మోడల్ ప్రశ్నపత్రాలను రూపొందించి.. వా టికి సమాధానాలు కూడా చిన్న పేరాల్లా రాసి మిత్రులకు పంచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలంటీ భయపడే వారికి అవి ఉపయోగపడేవి. పెద్ద సమస్యలను సరళం చేయడం అలా అలవడింది. అదే ధోరణిలో జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను లెక్కింపును మూడు ముక్కలతో తేల్చిపారేశారు. నాయకత్వ లక్షణాలు.. ఢిల్లీ యూనివర్సిటీలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకునిగా ఉన్నారు. పీజీ సాయంత్రం తరగతుల విభాగానికి ఉపాధ్యక్షునిగా పని చేశారు. సినిమాలూ...నటులు సినిమాలంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు సినిమాలు చూస్తానంటారు.అంతకుముందు ఇంకా ఎక్కువే చూసేవారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లడం సంతోషాన్నిచ్చే చర్య. నచ్చిన సినిమాల్లో రెండు మూడు చెప్పమంటే చక్దే ఇండియా, బ్యాండ్బాజా భారత్, 3 ఇడియట్స్ .. అంటారు. నటుల్లో సల్మాన్ఖాన్, అమీర్ఖాన్ల నుంచి రవితేజ దాకా, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రాల నుంచి సోనాక్షిసిన్హా, విద్యాబాలన్ల దాకా వివిధ పేర్లు ప్రస్తావించారు. మరచిపోలేనిది: కుటుంబంతో కలసి సత్యసాయి వద్ద గడిపిన క్షణాలు. బాధ పడ్డ క్షణాలు.. ఐఏఎస్ కోసం రెండుసార్లు కష్టపడినా ఎంపిక కాలేదు. రెండోసారి అవకాశం ఒక్క అడుగు దూరంలోనే చేజారిపోయినప్పుడు.అనంతపురం జిల్లాలో పని చేసేటప్పుడు పల్స్పోలియో తరహాలో చిన్న పిల్లల్లో నట్టల నివారణకు 8 లక్షల డోసుల మందు వేశారు. జిల్లా మొత్తంలో ఒకరికి వాంతులయ్యాయి. మందు వల్లే జరిగిందనే వదంతులు కలచి వేశాయంటారు. నోరు లేని వారి కోసం.. డబ్బు, బలం ఉన్నవారు ఏదో ఒక విధంగా తమ పనులు చేసుకుంటారు. పేదలు, బలహీనులకు నోరు కూడా ఉండదు. న్యాయంగా అందాల్సిన పథకాలు దక్కకుండా పోతుంటాయి. అలాంటి వారిని దేవుడైనా ఆదుకోవాలి. ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ప్రభుత్వంలో మనమంటూ ఒక హోదాలో ఉన్నప్పుడు అలాంటి వారికి ఉపకరించే పనులు చే యడం కనీస ధర్మమంటారు సోమేశ్కుమార్. ఈ వరుసలోదే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం (డ్రైవర్లనే ఓనర్లుగా మార్చేందుకు బ్యాంకు రుణాలిప్పించే పథకం. )తొలిదశలో 105 మంది డ్రైవర్లు ఓనర్లయ్యారు. రెండో దశలో మరో 303 మందికి త్వరలోనే ఈ పథకం కింద కార్లు ఇవ్వనున్నారు. ప్రేమలో పడ్డారు.. ఐఏఎస్కు ఎంపిక కావడానికి ముందు అలహాబాద్లో సైంటిస్ట్గా పని చేస్తున్నప్పుడు డాక్టర్ జ్ఞాన్ముద్రతో ప్రేమలో పడ్డారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వారి మనసు మారేంత వరకూ వేచి ఉన్నారు. అలా ఒకటి కాదు...రెండు కాదు.. ఆరేడేళ్లు వేచి చూశారు. ప్రశ్న : స్పెషలాఫీసర్గా బాధ్యత మరింత పెరిగినట్లుంది..!? జ : అవును. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. జీహెచ్ఎంసీలో ఉదయం పని ప్రారంభిస్తే.. సాయంత్రానికే ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ దశలో స్పెషలాఫీసర్ కావడంతో బాధ్యత ఎన్నో రెట్లు పెరిగింది. ప్రశ్న : పెరిగిన బాధ్యతలతో ఏం చేయాలనుకుంటున్నారు? జ : పాలక మండలి లేదు. సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు మరోమారు చెప్పేందుకు వీలు లేకుండా నిర్ణీత వ్యవధిలో ఫిర్యాదులు వాటంతటవే పరిష్కారం కావాలనేది లక్ష్యం. అందుకు ప్రయత్నిస్తున్నాను. అవినీతి తగ్గాలి. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి రాజకీయ సంకల్పం కూడా ఉంది. రహదారులు బాగుండాలి. ఒక గమ్యం చేరేందుకు 20 నిమిషాలు పడుతుందనే అంచనా ఉంటే.. అందుకనుగుణంగా రహదారులు ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు. ఈ దిశగా ఆలోచిస్తున్నా. ప్రశ్న : టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి..? జ : ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పని నేను చేస్తాను. బాధ్యతలు నిర్వర్తిస్తాను. ముఖ్యమంత్రి వద్దకు వివిధ సమీక్ష సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పెద్ద కార్పొరేషనే కాక... ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా జీహెచ్ఎంసీ కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. సీఎం ఆలోచనల అమలుకు యత్నించాలి. ప్రజలకు ఆయన చెప్పినవి చేయాల్సి ఉంటుంది. అందుకు సమన్వయంతో పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన పనులూ చేయాలి. ఒక అధికారిగా వీరందరితో సమన్వయం అవసరం. దాన్ని మరోలా భావిస్తే ఏం చేయాలి? ప్రశ్న : మిమ్మల్ని చాలామంది మొండిఘటం అంటారు.. ? జ : నేను చెప్పేది..చేసేది ఒకటే. ఏదైనా నిజాయితీగా చేస్తాను. నన్ను విమర్శించే వారు సైతం నేను చేసేది కరక్టే అని ఒప్పుకుంటారు. అందువల్లే ఎవరేమనుకున్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనగలుగుతున్నాను. ప్రశ్న : ఉద్యోగులపై కోపం ప్రదర్శిస్తారని? జ : ఎవరి పనులు వారు చేయాలి. లక్షలాది ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలో ఎన్నో బాధ్యతలుంటాయి. వివిధ ఒత్తిళ్లుంటాయి. ఒక్కరి నిర్లక్ష్యం ఎంతోమందిపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్గా చెబుతాను. కచ్చితంగా చేయమంటాను. ఒకసారి, రె ండుసార్లు చె ప్పిచూస్తాను. అయినా వినిపించుకోకుంటే.. ఏం చేయాలి ? వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెబుతానే తప్ప ఇతరత్రా ఉండదు. తమ పనులు సరిగ్గా చేసేవారికి నాతో సమస్య ఉండదు. -
ఆయన స్టైలే వేరు
జీహెచ్ఎంసీ కమిషనర్గా సోమేశ్కుమార్.. ఈ పేరు విన్న ఎందరికోఆశ్చర్యం. అంతకుముందు పనిచేసిన కమిషనర్లతో పోలిస్తే ఇక్కడ ఏం తట్టుకోగలడు? అనే వ్యాఖ్యానాలు. ఇమడలేడు. కొరకరాని కొయ్య.. చండశాసనుడు.. అన్నీ కలబోసి ఆయనో సీతయ్య.. ఎవరు చెప్పినా వినడు. ఇదీ అంతిమంగా ఆయనకు వచ్చిన ప్రచారం. కానీ.. తోలుమందం చందంగా మారిపోయిన జీహెచ్ఎంసీలో ఆయన విధానాలే రోగగ్రస్త వ్యవస్థపై పనిచేసే ఔషధాలుగా మారాయి. సోమేశ్కుమార్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం... ► ఎవరికీ అంతుపట్టని సోమేశ్ కుమార్ ► పని నచ్చితే వెనుకడుగు లేదు ► జీహెచ్ఎంసీ కమిషనర్గా నేటితో ఏడాది పూర్తి సాక్షి, సిటీబ్యూరో: రూ.5కే భోజన పథకం... ..దీన్ని తలుచుకోగానే గుర్తొచ్చే పేరు సోమేశ్ కుమార్, ఐఏఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకముందే ఆ పథకాన్ని జీహెచ్ఎంసీలో అమలు చేసిన అధికారి. జీహెచ్ఎంసీ కమిషనర్ కాక ముందు సోమేశ్ కుమార్ అంటే తెలిసిన వారు తక్కువ. గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్గా, ఇతరత్రా హోదాల్లో పని చేసినా అంతగా ‘పేరు’ రాలేదు. ఎక్కువ కాలం వార్తల్లో కనిపిం చని పోస్టుల్లో.. ప్రచారాలకు దూరంగా విధానాల రూపకల్పనలో.. కార్యాలయ గదుల మధ్య, సుదీర్ఘ కాలం స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో గడిపిన ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ కాగానే తన ముద్ర చూపించేందుకు యత్నించారు. పని.. సమయం.. నిర్ణయించాక ఏది ఏమైనా పూర్తి కావాల్సిందే. ఉదయం 8 గంటలకు ఎస్ఎంఎస్ పంపి, 9.30 కల్లా రమ్మంటే ఎవరైనా రావాల్సిందే. అటెండరైనా.. జూనియర్ ఐఏఎస్ అయినా ఆయనకొకటే. ప్రారంభించిన పనులు పూర్తయ్యాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలన... సమీక్ష... ఏరోజుకారోజు.. ఏపూటకాపూట సమాచారం రావాల్సిందే. ఈ పనితీరే.. నిద్రపోనివ్వని తనమే జీహెచ్ఎంసీలో పనుల వేగానికి ఉపకరించింది. ప్రతి పనికీ లెక్క మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులుంటే చాలు... బోలెడు ఆదాయం. దీనికీ తీవ్ర వ్యతిరేకి. పది రూపాయల పని చేసినా.. నిజంగా అంత ఖర్చవుతుందో లేదో ఆలోచించాకే మంజూరు చేసే రకం. బిల్లులపై గుడ్డిగా సంతకం చేయకుండా ప్రశ్నించడం ఆయన నైజం. ఖజానాలో నిధులున్నా ఖర్చు చేయని ఆయన ఎందరి దృష్టిలోనో పిసినారి. ఈ తత్వమే ఎందరికో ఇబ్బందిగా మారింది. పని ఎక్కువ.. పై ఆదాయం లేదు. మరోవైపు పని తప్ప మానసిక స్థితిని పట్టించుకోని తత్వం కొందరికి కష్టమనిపించింది. కన్నీళ్లూ పెట్టించింది. అయినాసరే... ఎంత గిట్టనివారైనా ఒప్పుకోక తప్పని పనితనం. కనిపించని అవినీతి. అవే సోమేశ్కుమార్కు ఆయుధాలయ్యాయి. అవి షరా మామూలే.. పనిలో పరుగులు పెట్టించినా... ఎంత నిక్కచ్చిగా వ్యవహరించినా... అవినీతి జాఢ్యాన్ని అరికట్ట లేకపోయారు. అడపాదడపా దృష్టికొచ్చిన వాటిపైనా చర్యల్లేవు. కష్టపడేవాళ్లు కష్టపడుతూనే ఉన్నారు... దోచుకునేవాళ్లు దోచుకుంటూనే ఉన్నారనే అపప్రధ తప్పలేదు. దుబారా జరిగేచోట సాగుతూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ రంగు ఇవన్నీ ఒక ఎత్తయితే.. సర్కారు ఆజ్ఞలను శిరసావహించడంలో చూపిన చొరవతో కాబోలు ఆయనను ‘టీఆర్ఎస్ ప్రతినిధి’గా పిలుస్తారు. వేసుకున్న చొక్కా రంగుపైనా కబుర్లు. ఏ సీట్లో ఉన్నా చివరి నిమిషం వరకు అదే పనితీరు ఆయన నైజమని తెలిసిన వారు కొందరు కాగా.. పక్కా తెలంగాణవాది అన్నవారూ ఉన్నారు. స్వతహాగా బీహారీ అయినా.. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆయనను ఆంధ్రప్రదేశ్కు కేటాయించినా... తీరు మారలేదు. జీహెచ్ఎంసీలో స్పీడు తగ్గలేదు. ఎంత చనువుగా ఉన్నారనుకున్న వారికైనా పైరవీ జరుగుతుందనుకుంటే పొరపాటే. పేదలకు ఉపాధి, అన్నార్తులకు ఆహారం వంటి వాటికి వెనుకడుగు వేయరు. ఇదీ సోమేశ్కుమార్ తీరు. కొన్నాళ్లు ఇక్కడే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐఏఎస్ అధికారుల పంపకాలకు సర్వం సిద్ధమైనప్పటికీ, తాజా సమాచారం మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ఇక్కడే ఉంటారు. కేటాయింపులపై అభ్యంతరాలు..తదితరమైనవి పూర్తయ్యేందుకు ఇంకా సమయం పట్టనుంది. జీహెచ్ఎంసీ పునర్విభజనకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో అది పూర్తిచేసే బాధ్యత ప్రస్తుతం ఆయనపైనే ఉంది. ఏడాది కాలంలో కమిషనర్ చేపట్టిన కార్యక్రమాలు ► రూ. 5కే భోజనం ► డ్రైవర్ కమ్ ఓనర్ ► రోడ్డు డాక్టర్ ► ఈ-వ్యాన్ ► కాల్ సెంటర్ 040-21 11 11 11 ► సమగ్ర కుటుంబ సర్వే ► 9 రోజుల్లో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు ► సార్వత్రిక ఎన్నికలు.. సమ్మెల్లో పనుల నిర్వహణ ► పారిశుద్ధ్య కార్మికులు.. సహపంక్తి భోజనాలు ► వ్యర్థాల నిర్మూలనకు పెద్ద బ్యాగులు ► ఎంపిక చేసిన మార్గాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేటుకు ► ఎస్ఎంఎస్తో పోలింగ్ సెంటర్ చిరునామా ► బేగంపేట- బల్కంపేట రోడ్డు పూర్తి ► మైత్రివనం వద్ద నీరు నిలిచే ప్రదేశం మరమ్మతులు ► చార్మినార్ పాదచారుల పథకానికి ఆస్తుల సేకరణ ► ఫోన్ -ఇన్ ► నైట్షెల్టర్లు ► ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా ఆన్లైన్తో ఎఫ్ఎంఎస్(ఫైల్ మేనేజ్మెంట్ సిస్టం) ► ఫైలు పెండింగ్కు వీల్లేదు. ఆమోదమో.. తిరస్కారమో తెలియాల్సిందే. ► మెట్రోపొలిస్ నిర్వహణ పూర్తి కావాల్సినవి ► ఎపిక్.. ఆధార్ అనుసంధానం ► జాతీయ స్థాయి మాజీ క్రీడాకారులకు పెన్షన్లు ► ఎఫ్ఓబీల నిర్మాణం ► శ్మశాన వాటికల అభివృద్ధి ► సిటి-జెన్ (సెల్ ఫొటోతో సమస్య పరిష్కారం) ► వాట్సప్తో ఫిర్యాదు ► బెగ్గర్ ఫ్రీ సిటీ ► స్వాగత ద్వారాలు -
సర్వేకు అంతా సిద్ధం: సోమేష్కుమార్
-
సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రేపు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర సర్వేకు హైకోర్టు సోమవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సర్వేపై దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం స్పందిస్తూ ఇప్పటికిపుడు సమగ్ర సర్వేపై స్టే విధించలేమని పేర్కొంది. సర్వే మార్గదర్శకాలపై జీవో నంబర్ 50లో ప్రభుత్వం అన్ని వివరాలు స్పష్టంగా పేర్కొన్నదని వెల్లడించింది. కాగా సంక్షేమ పథకాలను కేవలం అర్హులకే అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ సర్వేలో దాదాపు కోటి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. సుమారు 3.76 లక్షల మంది ఎన్యూమరేటర్లు (సర్వే వివరాలు సేకరించేవారు) ఒకేరోజులో ఈ సర్వేను నిర్వహించనున్నారు. -
సర్వేలో జిరాక్సు కాపీలేవీ ఇవ్వక్కర్లేదు
సమగ్ర కుటుంబ సర్వేపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతమంది ఎన్యుమరేటర్లు ప్రతి కార్డుకు జిరాక్సు కాపీ కావాలని అడుగుతుండటంతో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు దీనిపై భారీ సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో కమిషనర్ సోమేష్ కుమార్ ఈ అంశంపై ఓ స్పష్టత ఇచ్చారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి జిరాక్సు కాపీలు ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పారు. కేవలం ఒరిజినల్ ఐడీ కార్డులు చూపెడితే సరిపోతుందని వివరించారు. అయితే కూకట్పల్లి లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతమంది ఎన్యుమరేటర్లు సోమవారమే వచ్చి సర్వే పత్రాలు పూర్తి చేసేసి ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్క కార్డుకు, డాక్యుమెంటుకు సంబంధించి జిరాక్సు కాపీలు కూడా తమకు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నట్లు 'సాక్షి' కార్యాలయానికి ఫోన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సోమేష్ కుమార్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎమర్జెన్సీ ఉద్యోగాలు చేసేవాళ్లు....
-
రాష్ట్ర డేటాబేస్ కోసమే ఈ సర్వే:సోమేష్కుమార్
-
కేసీఆర్ ఎదుటే పంచాయితీ పెట్టారు!
జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ల పంచాయితీ....ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. మేయర్ మాజిద్ హుస్సేన్, కమిషనర్ సోమేశ్ కుమార్లు నిన్న అసెంబ్లీలో కేసీఆర్ను కలిశారు. ఇటీవల మేయర్, కమిషనర్ల మధ్య విభేదాలపై పత్రికల్లో కథనాలు వెలువడిన నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు సీఎం వారిని పిలిపించారనే ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా మేయర్, కమిషనర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పైకి ఇద్దరు కలిసి పనిచేస్తున్నా.... ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. దాంతో వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన వారిద్దర్ని తన ఛాంబర్కు పిలిపించుకుని కలిసి పని చేసుకోవాలని హితవు పలికినట్లు తెలుస్తోంది. జంట నగరాల్లో కూల్చివేతలపై మేయర్ మాజిద్ హుస్సేన్ అలకబూనిన విషయం తెలిసిందే. కూల్చివేతల విషయంలో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు తలెత్తాయి. కాగా ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేసీఆర్ తన ఛాంబర్కు పిలిపించుకున్నారు. మేయర్ కేసీఆర్ వద్దకు వెళ్లిన సమయంలో కమిషనర్ సోమష్ కుమార్ అక్కడ ఉన్నారు. మేయర్ ఈ సందర్భంగా కూల్చివేతల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. కూల్చివేతల విషయంలో కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయాన్ని తమ దృష్టికి తేలేదని ఆయన తెలిపారు. దీనిపై సోమేష్ కుమార్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలోనే మరోసారి వారిద్దరూ వాగ్వివాదానికి దిగారు. దాంతో కెసిఆర్ కల్పించుకుని అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, పరస్పరం సహకరించుకోవాలని వారికి నచ్చజెప్పారు. అయితే ముఖ్యమంత్రి గోల్కొండ కోటను సందర్శించిన సందర్భంగా తాము ఇద్దరం అసెంబ్లీకి వెళ్లినట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పుకొచ్చారు. మరోవైపు తాను సీఎంకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మేయర్ మాజిద్ చెప్పటం విశేషం. -
బిచ్చగాళ్ల మాఫియా లేదు: కమిషనర్
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియాపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేష్కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. హైదరాబాద్లో బిచ్చగాళ్ల మాఫియా లేదని ఆయన అందులో తెలిపారు. వీధుల్లో, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బిచ్చం ఎత్తుకుంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అన్నారు. బిచ్చగాళ్లకు పునరావాసం కోసం కార్పొరేషన్ చేపడుతున్న చర్యలను కోర్టుకు తెలిపారు. 'గౌరవం' పేరుతో వారికి కేంద్రాలు ఏర్పాటుచేసి, జీవనోపాధి మార్గాలను కూడా అందజేస్తున్నామన్నారు. -
తెలంగాణ సీఎస్ తో పలు జిల్లా కలెక్టర్లు భేటీ
రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో చెత్త సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో చెత్త వేసేందుకు కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ అంశంపై చర్చించేందుకు మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్లు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగర శివారులలో నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై ఈ సందర్బంగా చర్చిస్తున్నారు. -
హౌసింగ్ స్కీమ్పై స్పెషల్ డ్రైవ్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో చేపట్టిన హౌసింగ్స్కీమ్ ప్రయోజనాల గురించి లబ్ధిదారులకు తెలిసేలా స్పెషల్డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ హైదరాబాద్ కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనా, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులకు సూచించారు. శనివారం తన చాంబర్లో హౌసింగ్ స్కీమ్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్స్కీమ్కు లబ్ధిదారులు చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ చెల్లించకపోవడం..రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం తదితర ఇబ్బందులున్నాయని అధికారులు తెలిపారు. అందుకు స్పందిస్తూ కమిషనర్ బ్యాంకర్ల జాబితా..రుణాల వివరాలతో నివేదిక రూపొందించాలని అన్నారు. అవసరమైతే ఆయా బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తే ముందుకొస్తారంటూ ఆస్తిపన్ను వసూళ్లకు ఇటీవల నిర్వహించిన ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రస్తావించారు. సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రేపే కౌంటింగ్
- ఉదయం 8 .30 నుంచి ఓట్ల లెక్కింపు - కంట్రోల్ రూమ్ ద్వారా కౌంటింగ్ వీక్షణం - మధ్యాహ్నం 3 గంట ల కల్లా ఫలితాలు - కేంద్రంలోకి వాహనాలకు అనుమతి నిల్ - జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్కుమార్ సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం.. కౌంటింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు తెరవేసే కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ తెలి పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లయిన ముఖేశ్కుమార్ మీనా, ఇ. శ్రీధర్లతో కలసి బుధవారం ఆయన జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సం బంధించిన ఓట్ల లెక్కింపు 18 హాళ్లలో జరుగుతుందన్నారు. సనత్నగర్, సికింద్రాబాద్, కం టోన్మెంట్ నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు వేర్వేరు హాళ్లలో జరుగుతాయన్నారు. మిగతా నియోజకవర్గాలవి రెండు నియోజకవర్గాల లెక్కింపు ఒకే హాల్లో జరుగుతాయన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఫలితం కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, సికింద్రాబాద్ పార్లమెంట్ ఫలితం యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల్లో వెల్లడిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తి ఫలితాలు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల కనుగుణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏర్పాటు చేస్తున్న టేబుళ్లు.. లెక్కింపు జరిగే రౌండ్ల ఆధారంగా జిల్లా పరిధిలో చార్మినార్ అసెంబ్లీ ఫలితం తొలుత.. యాకుత్పురా అసెంబ్లీ ఫలితం చివర వెలువడే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చార్మినార్ ఫలితం వెలువడేం దుకు దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టవచ్చనే అంచ నా ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడగలవని అంచనా వేస్తున్నామన్నారు. వివాదాల్లేకుండా సూపర్ చెక్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసే టేబుళ్లు కాక మరో రెండు టేబుళ్లు అదనంగా ఏర్పాటు చేసి.. అక్కడ ఈవీఎంలను ర్యాండమ్గా చెక్ చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు హెల్పర్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కిం పులో ఎలాంటి వివాదానికి తావులేకుండా మైక్రో అబ్జర్వర్లు, అబ్జర్వర్లు సూపర్ చెక్ చేస్తారన్నారు. ఏైదె నా ఈవీఎంలో సమస్యలు తలెత్తితే దాన్ని మాత్రం పక్కనపెట్టి కౌంటింగ్కు ఆటంకం లేకుండా మిగతా ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారన్నారు. వెయ్యిమంది కౌంటింగ్ సూపర్వైజ ర్లు.. మరో వెయ్యిమంది అసిస్టెంట్లు, కేంద్రం నుంచి వచ్చిన 500 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. కంట్రోల్రూమ్ ద్వారా.. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఫలితాలు ఒకేచోటు నుంచి తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్రూ మ్ పనిచేస్తుందన్నారు. వెబ్క్యామ్ల ద్వారా ఆయా కౌంటింగ్ కేం ద్రాల్లోని దృశ్యాలను కంట్రోల్రూమ్ నుంచి వీక్షించవచ్చన్నారు. సమస్యలు తలెత్తితే.. ఈవీఎంలలో ఏదైనా సమస్యల తలెత్తితే సదరు ఈవీఎంలలోని ఓట్లను ‘ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్ప్లే యూనిట్ (పాడు)’ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. అవసరమైతే రౌండ్ల వారీ ఓట్ల వివరాల ప్రింట్ను పొందవచ్చునని చెప్పారు. ఏదైనా ఈవీఎంలో సమస్యలు తలెత్తినప్పుడు.. సదరు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపుపైనే ఎవరు విజేతలో తెలిసే (ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్ల తేడా స్వల్పంగా మాత్రమే ఉన్నప్పుడు) పరిస్థితి ఉంటే.. ఎన్నికల సంఘానికి విషయాన్ని తెలియజేసి.. దాని ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక ఈవీఎంలోని ఓట్లు గెలుపోటములను నిర్దేశించే పరిస్థితి లేనప్పుడు ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. ఈవీఎంలలో సాంకేతితక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఇద్దరు ఈసీఐఎల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లున్నాయని చెప్పారు. పరిమిత సంఖ్యలో అధికారుల వాహనాలు తప్ప కౌంటింగ్ కేంద్రాల్లోకి ఇతరుల వాహనాలు అనుమతించరని స్పష్టం చేశారు. మీడియాకు రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు తెలిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 6.30 గంటలకు స్ట్రాంగ్రూమ్లు తెరుస్తారని.. రాజకీయపార్టీల ఏజెంట్లు 6 గంటలకల్లా అక్కడకు చేరుకోవాలని సూచించారు. ప్రతి రౌండ్లో వచ్చిన ఓట్ల వివరాలను సదరు టేబుల్ వద్ద ప్రదర్శిండంతోపాటు మైకు ద్వారా తెలియజేస్తారన్నారు. హాలు ఆవరణలో కూడా బోర్డుపై వివరాలు వెల్లడిస్తారన్నారు. నిర్వహణ వ్యయం ఇలా.. ఎన్నికల నిర్వహణకోసం ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ద్వారా రూ. 17 కోట్లు మంజూరు కాగా, మరో రూ. 6 కోట్ల కావాల్సిందిగా కోరామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అందరికీ రిటర్నింగ్ అధికారుల ద్వారా వేతనాలందజేస్తామని తెలిపారు. ఈనెల 28 వరకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించాక ఎన్నికల సంఘం కోడ్ను ఎత్తివేస్తుందని ముఖేశ్కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కౌంటింగ్.. కసరత్తు
- 16 మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాలు - ఓట్ల లెక్కింపు కోసం 12+12 టేబుళ్లు - అనుమతించిన ఎన్నికల సంఘం - కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు - 14 నాటికే ఏర్పాట్లు పూర్తి - జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్కుమార్ సాక్షి, సిటీబ్యూరో: హోరాహోరీ ప్రచార హోరు.. పోటాపోటీ పబ్లిసిటీలతో సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉంది. ప్రజాతీర్పు ఎలా ఉందో తెలుసుకునేందుకు అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు సిటీజనులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో తుదిఘట్టమైన కౌంటింగ్ ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో ఇందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ తెలిపారు. కౌంటింగ్ జరిగేంత వరకు ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు.. కౌంటింగ్ రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు 7+7 కౌంటింగ్ టేబుళ్ల స్థానే, 12+12 టేబుళ్ల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ అనుమతించిందని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లకు అనుగుణంగా కొన్నింటికి 14+14 టేబుళ్లు, మరికొన్నింటికి 15+15 టేబుళ్ల వంతున ఏర్పాటు చేసేందుకు అనుమతించే అవకాశం కూడా ఉందన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు.. ఎన్ని గంటల్లోగా ఫలితం వెలువడవచ్చు.. ఏ నియోజకవర్గ ఫలితం తొలుత వెలువడేందుకు అవకాశం ఉంది.. తదితర అంశాలపై కమిషనర్ ‘సాక్షికి వెల్లడించిన అంశాలివీ... పటిష్ట భద్రతా ఏర్పాట్లు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సోమేశ్కుమార్ చెప్పారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయపార్టీల పోలింగ్ ఏజెంట్ల కోసం అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు తావు లేకుండా ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు కేంద్రం నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ఎన్నికల సంఘం తొలుత ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్లు.. పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్ల వంతున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 7+7 టేబుళ్లకే అనుమతించిందన్నారు. ఇలాగైతే ఎక్కువ సమయం పట్టే అవకాశాన్ని తెలియజేస్తూ తాను టేబుళ్ల సంఖ్యను పెంచాల్సిందిగా కోరగా, 12+12 టేబుళ్ల ఏర్పాటుకు అనుమతించిందన్నారు. ఒకట్రెండు నియోజకవర్గాలకు 15+15 టేబుళ్లు అవసరం కావచ్చని.. అందుకు కూడా ఎన్నికల సంఘం అనుమతించగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తొలి ఫలితం చార్మినార్దే..? ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి ఫలితాల సమయం ఆధారపడుతుందన్నారు. తక్కువ పోలింగ్ స్టేషన్లున్న నియోజకవర్గ ఫలితం త్వరితంగా వెలువడుతుందని, ఎక్కువ పోలింగ్ స్టేషన్లున్న నియోజకవర్గ ఫలితానికి ఆ మేరకు సమయం పడుతుందన్నారు. ఈ లెక్కన చార్మినార్, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం తొలుత వెలువడే అవకాశం ఉంది. చార్మినార్లో 179, సనత్నగర్లో 189 పోలింగ్ కేంద్రాలున్నాయి. జూబ్లీహిల్స్, కార్వాన్ నియోజకవర్గాల ఫలితానికి ఎక్కువ సమయం పట్టే వీలుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 271 పోలింగ్ కేంద్రాలుండగా, కార్వాన్లో 254 పోలింగ్ కేంద్రాలున్నాయి. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి దాదాపు ఆరేడు గంటల్లోగా ఫలితాలొస్తాయన్నారు. ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ఫలితాలు వెలువడగలవని అంచనా. కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కమిషనర్ మాసబ్ట్యాంక్లోని పాలిటెక్నిక్ కళాశాల, నిజాం కాలేజీ, ఎల్బీ స్టేడియంలలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్రూంలను జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళం.. ఇబ్బందులకు తావు లేకుండా కౌంటింగ్ సూపర్వైజర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కూడా సోమవారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 14వ తేదీ నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తామని చెప్పారు. కౌంటింగ్ పారదర్శకంగా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని స్ట్రాంగ్రూమ్లను తాను తనిఖీ చేశానని, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సైతం ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ కమిషనర్ సహకారం తీసుకుంటున్నామన్నారు -
చెత్త తొలగించకపోతే సస్పెన్షన్
- అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిక సాక్షి, సిటీబ్యూరో: నగర రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలు.. ఇతర త్రావ్యర్థాలను రెండు రోజుల్లోగా తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ సంబంధిత అధికారులకు హుకుం జారీ చేశారు. తొలగించడంలో విఫలమైన వారిని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నగరంలోని ప్రధాన రోడ్లపై సైతం గుట్టలు.. గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో ఆగ్రహం చెందిన క మిషనర్.. సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నా సరే జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు తమ ప్రధాన విధి అయిన చెత్త తరలింపు పనులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ స్థాయిల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లంతా ఇకనుంచి ప్రతి ఉదయం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. చెత్త తరలింపు పనులకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాలన్నారు. రహదారులు ఊడ్చే పనులు కూడా మెరుగుపడాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్లపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందినప్పటి నుంచీ వసూలు చేయాలని, ఆస్తిపన్నుకు సంబంధించిన డేటాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్కిల్ స్థాయిలో టాప్ 250 డిఫాల్టర్లు, కోర్టు వివాదాలు, డబుల్ ఎంట్రీలు, రివిజన్ పిటిషన్లు, జీరో అసెస్మెంట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డిమాండ్ బిల్స్ 15 రోజుల్లోగా పంపిణీ చేసే బిల్కలెక్టర్లకు బిల్కు రూ. 5లు వంతున, ఆ తర్వాత పంపిణీ చేసే వాటికి రూ. 3 లు వంతున చెల్లిస్తామన్నారు. హోర్డింగులపైనా ఆస్తిపన్ను వసూలు చేయాలని, సెల్ టవర్లకు ఆస్తిపన్ను వసూలు చేసేందుకు తగిన నిబంధనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
ట్రా‘ఫికర్’ లేకుండా చూడండి
గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ సాక్షి,సిటీబ్యూరో: నగరంలో జరుగుతున్న ఎలివేటెడ్ మెట్రో రైలు పనుల వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్.. హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ, ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. మెట్రో కారిడార్లలో దెబ్బతిన్న రహదారులకు జూన్లోగా మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. మెట్రో పనులు జరుగుతున్న బేగంపేట్, ఉప్పల్ ప్రాంతాలను మంగళవారం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. బేగంపేట్ ఓవర్ బ్రిడ్జి నాలా ప్రాంతంలో నూతన పిల్లర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఇక్కడ ప్రత్యామ్నాయ రహదారిలో ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్, డిపో పనులను పరిశీలించారు. మెట్రో పిల్లర్ల పనులు పూర్తయిన ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థల ఉన్నతాధికారులు ఉన్నారు. -
చెల్లింపునకు నేడే ఆఖరి గడువు
బంజారాహిల్స్, న్యూస్లైన్: ఆస్తిపన్ను చెల్లింపునకు ఈ నెల 31వ తేదీయే ఆఖరి గడువని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్లోని జీహెచ్ఎంసీ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (రెవెన్యూ) హరికృష్ణ, అదనపు కమిషనర్ (ప్లానింగ్) వెంకట్రామిరెడ్డి, సెంట్రల్ జోనల్ కమిషనర్ రోనాల్డ్రాస్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడువు ముగిసే సమయానికి రూ. 1100 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ. 895 కోట్ల పన్ను వసూలు చేశామన్నారు. ఉగాది రోజున సోమవారం రాత్రి 8 గంటల వరకు కూడా పన్ను చెల్లించవచ్చని, ఆన్లైన్లో కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు. సమావేశంలో సర్కిల్-10 డీఎంసీ సోమరాజు తదితరులు పాల్గొన్నారు. -
'కార్మికుల వేతనాల పెంపు ప్రభుత్వం దృష్టికి'
హైదరాబాద్ : పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. కార్మికులకు సంబంధించిన మిగతా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ వెల్లడించారు. ఇంజినీర్ల సామూహిక సెలవుల అంశం పరిష్కారమైనట్లేనని సోమేష్ కుమార్ తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు గత అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. -
జోరుగా కొనసాగుతున్న నిమజ్జనం
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని జీహెచ్ఎంసీ కృష్ణబాబు తెలిపారు. ఈ ఏడాది 75వేలకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కృష్ణబాబు తెలిపారు.న హుస్సేన్ సాగర్తో పాటు నగరంలోని పలుచోట్ల నిమజ్జనం వేగవంతం చేసినట్లు చెప్పారు. నిమజ్జనం అనంతరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు 2300 మంది కార్మికులను ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆయన బుధవారం నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనానికి 59 పెద్ద క్రేన్లు, 79 మొబైల్ క్రేన్లతో పాటు 85మంది గజ ఈతగాళ్లను నియమించినట్లు కృష్ణబాబు తెలిపారు.