Goals
-
దృఢ సంకల్పమే మీ బలం
ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్నిప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లిపోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి.‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్నిప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
సరే సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం! కానీ..
‘‘అమ్మ సాక్షిగా చెబుతున్నా.. జాన్వరి ఫస్ట్ నుంచి మందు తాగను..’’ ఓ పెద్దాయన అనగానే ‘‘సూపర్ అసలు’’ అంటూ చప్పట్లు కొట్టే యాంకరమ్మ వీడియో ఒకటి ఎంతలా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. నిజంగా మీరు కొత్త ఏడాదిలో తీసుకున్న లక్ష్యాలను.. అదేనండీ న్యూఇయర్ రెజల్యూషన్స్ను ఎప్పుడైనా కచ్చితంగా అమలు చేశారా?. పోనీ చేసినా.. అసలు వాటిలో కచ్చితంగా పూర్తిస్థాయిలో పాటించినవి ఉన్నాయి?. అసలు ఆ తీర్మానాల విషయంలో ఎప్పుడైనా మీకు మీరు సమీక్షించుకున్నారా?.మనలో చాలా మందికి బాగా అలవాటైన పనేంటో తెలుసా? మూడు రోజులు చాలా చక్కగా న్యూ ఇయర్ హడావుడిలో అనుకున్న లక్ష్యం(Resolutions) కోసం పని చేస్తారు. నాలుగో రోజు యథావిధిగా మానేయడమో, ఏదో ఒక కారణం చెప్పి దాని నుంచి వైదోలగడమో చేస్తారు. ఇలా చేసే వారు 100లో సుమారు 92 మంది ఉన్నారట!. అంటే.. సిన్సీయర్గా తమ రెజల్యూషన్స్ కోసం పని చేసేది కేవలం 8 మందినేనా?. ఈ మాట మేం చెప్తోంది కాదు.. పలు అధ్యయనాలు ఇచ్చిన నివేదికలు సారాంశం ఇదే. పాజిటివీటీ.. టైం సెట్ గో.. మనలో చాలమంది ఈ కొత్త ఏడాదిలో ఏదైనా సాధించాలనో, లేదంటే ఫలానా పని చేయకుండా ఉండాలనో తీర్మానాలు చేసుకుంటారు. అది కెరీర్ పరంగా కావొచ్చు, ఆరోగ్యపరం(Health Resolution)గా అవ్వొచ్చు, డబ్బు సంబంధితమైనవి కావొచ్చు.. విషయం ఏదైనా చాలామంది ఏదో ఒక తీర్మానం మాత్రం చేసి తీరతారు. అయితే.. అంత ఈజీగా జరిగే పని కాదని వాళ్లకూ బాగా తెలుసు. చాలామంది సమయాన్ని అడ్డంకిగా చెప్పి తప్పించుకుంటారు. పట్టుదల ఉండాలే కానీ సమయం సరిపోదు అనే సమస్య ఉండదు.అలాగే.. మనం ఓ నిర్ణయం కానీ కమిట్మెంట్ కానీ తీసుకునేప్పుడే అది పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన లక్ష్యాన్ని సెట్ చేసుకోవటంలో ముందు ఇది ఉందో చూసుకోవడం మంచిది. ముందు నుంచే ‘‘ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు’’ అని ప్రిపేర్డ్గా ఉండకూడదు. అలాగే నెగటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది కూడా. అందుకు అవసరమైన రోడ్మ్యాప్ను ఫుల్ కమిట్మెంట్(Full Commitment)తో రూపొందించుకుని పక్కగా అమలయ్యేలా చిత్తశుద్ధి చూపాలి.వాస్తవాన్ని గుర్తించాలి!జీవితంలో ఒక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలంటారు పెద్దలు. ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో మనకు తెలియంది కాదు. అలాగే.. మార్పు ఓ చిన్న అడుగుతోనే మొదలువుతుంది. కాబట్టి స్టో అండ్ స్టడీ విన్ ది రేస్ బాటలోనే పయనించాలి. అలాంటప్పుడే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.సమస్య ఏమిటంటే.. చాలాసార్లు మనం అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటుంటాం. వాటి సాధన క్రమంలో తడబడుతుంటాం. అందుకే వాస్తవానికి దగ్గరగా, నిజం చేసుకునేందుకు వీలుగా ఉన్న నిర్ణయాలే తీసుకోవాలి. అలాగే చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చు. అలాగని.. ఇక్కడ ‘తగ్గడం’ ఎంతమాత్రం అవదు. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక లేదంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.రెగ్యులర్ వైఖరి వద్దు.. మనం చాలాసార్లు కొత్త ఏడాది వచ్చింది కదా అని.. ఏదో ఒక తీర్మానం చేసేస్తారు. కానీ, దాని అమలుకంటూ ఓ సరైన ప్రణాళిక వేసుకోరు. దాని వల్ల అంతా డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి పక్కాగా ఆలోచించాలి. నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆచరణలో పెట్టడమూ సలువవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.పంచుకుంటేనే ఫలితం!ఈ ఏడాది లక్ష్యసాధనలో.. మీతోపాటు తోడుగా ప్రయాణం చేసేందుకు మరికొందరిని వెతికి పట్టుకోగలిగితే మార్గం మరింత సుగమమం అయినట్లే. కలసికట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.రివ్యూ ఈజ్ ఫర్ బెటర్ రిజల్ట్ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. చిన్నపాటి విజయానికైనా సరే సంబరాలు చేసుకోవాలి. అది పట్టుదలను మరింతగా పెంచుతుంది. అలాగే.. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయి.కొత్తగా సాధించడం కాదు.. కోల్పోయింది తిరిగి తెచ్చుకోవడంలోనే మాంచి కిక్ దొరుకుతుంది! అలా పొందడంలో ఎక్కువ ప్రేరణ పొందగలుగుతారు. -
Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?..
ఇవాళ్టి నుంచి.. ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. .. జిమ్కు వెళ్లి బాడీని పెంచాలి.. సరైన డైట్ను మెయింటెన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. .. ఎలాగైనా డబ్బులను పొదుపు చేసి ఫలానాది కొనాలి. .. ఆఫీస్కు టైంకు వెళ్లాలి. ఇలా అన్నీ కూడా ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ ఫ్రెష్ జీవితం ప్రారంభించాలి. చేస్తారో.. చేయరో.. తెలియదు!. కానీ, కొత్త ఏడాది వచ్చిందంటే.. రెజల్యూషన్స్ పేరుతో ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చి హడావిడి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇందులోనూ హాస్యకోణం వెతుకుతూ.. ఇంటర్నెట్లో మీమ్స్(Resolutions Memes) వైరల్ అవుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడం మన వల్ల కాదా?..కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి.కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం!’.. అని పదిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్ తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. అంటే.. ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందన్నమాట. అయితే..ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. మన భాషలో మంచి పాజిటివ్ వైబ్ అన్నమాట. చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. వాటిలో కొన్నింటిని ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవి మాములువి కాదు.. పెద్ద పెద్ద టార్గెట్లే ఉండొచ్చు!. అలాంటి వాటిని ఒంటరిగా నెరవేర్చుకోవడం కొంచెం కష్టమే!. అందుకోసమైనా సరే ఈ లక్ష్యాలను నలుగురితో పంచుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి.కొత్త ఏడాది రెజల్యూషన్స్ చేసుకోవడంలో.. విద్యార్థులు, యువత ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు/సంరక్షకులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తేనే ఫలితం ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదంటే టైంకు హోంవర్క్ పూర్తి చేయాలనో, అదికాకుంటే మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో.. ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మాట్లాడుకోవాలి. భవిష్యత్లో పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. అయితే ఇది వాళ్లను ఒత్తిడి, ఆందోళనలకు గురి చేసేదిలా మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే ప్రొగ్రెస్ను రివ్యూ చేస్తూ.. వాళ్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప!.. ఇతరులతో పోల్చి నిందించడం.. ఆశించిన ఫలితం రాలేదని కోప్పడడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మానసిక ఆరోగ్యమే వాళ్ల విజయానికి తొలి మెట్టు అనేది గుర్తించి ముందుకు వెళ్లాలి.లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకునే వర్గం యువతే. అలాగే.. రెజల్యూషన్స్ను బ్రేక్ చేసేది కూడా ఈ వర్గమే. కెరీర్పరంగా స్థిరపడే క్రమంలో.. వీళ్లకు కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాడు కచ్చితంగా అవసరం ఉంటుంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణ.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకునేలా వాళ్లను సమాయత్తం చేయాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునేలా వాళ్లను ప్రొత్సహించాలి. ఆ దశలో అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం. అందుకు అవసరమైన సాయమూ అందించినప్పుడే వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోగలరని గుర్తించాలి.జీవితంలో ఎదుగుదల పొదుపు(Savings)తోనే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందైనా.. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలకుని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారైతేనేమి.. దీన్నొక భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తారు కూడా. అలాగే తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా ఎక్కువ అవసరం పడేది ఈ లక్ష్య సాధనలోనే!. కాబట్టి.. స్వీయ నియంత్రణతో పాటు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మరీ ముఖ్యంగా భాగస్వామి పాత్ర ఇంకాస్త ఎక్కువే!. నెలావారీ ఖర్చులతో పాటు ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందుగానే వేసుకోవడం, ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం లాంటివి చేయాలి.కొత్త సంవత్సరం తొలిరోజు మాత్రమే కాదు.. వచ్చే ఏడాదిలో ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఆరోగ్యంగా ఉండడం అవసరం. న్యూఇయర్ రెజల్యూషన్స్(NewYear's Resolutions)లో.. వయసుతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్య ప్రణాళికను చాలామంది నిర్దేశించుకుంటారు. అయితే ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని.. ఉల్లంఘించేవాళ్లు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఇందుకు బద్ధకం సహా రకరకరాల కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ తీర్మానాన్ని సమిష్టిదిగా ఆ కుటుంబం భావించాలి. తద్వారా మానసిక, శారీరక సమస్యలనూ దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది.న్యూ ఇయర్ రిజల్యూషన్లు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ, పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు గట్టి సపోర్ట్ అవసరం అంటారు నిపుణులు. ఇది ఒంటరి ప్రయాణం ఎంతమాత్రం కాదు. ఒకరకంగా ఇది ఆఫీసుల్లో టీం వర్క్ లాంటిదన్నమాట. అందుకే తీసుకునే నిర్ణయాన్ని నలుగురికి చెప్పాలి.. వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే చర్చ జరగాలి. ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అప్పుడే ఏడాది పొడవునా.. అనుకున్న మేర ఫలితాలు అందుకోగలరు. -
ఇజ్రాయెల్ కొత్త యుద్ధ లక్ష్యాల ప్రకటన
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంగళవారం నూతన యుద్ధ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ప్రకటిటిచారు. ‘‘రాజకీయ భద్రతా కేబినెట్ యుద్ధం లక్ష్యాలను నవీకరించింది. క్రాస్ బార్డర్లో హమాస్ అనుకూల మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాతో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పారిపోయిన ఉత్తరాది నివాసితులను సురక్షితంగా తిరిగి ఇజ్రాయెల్లోకి తీసుకొస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కట్టుబడి ఉంటామని హిజ్బుల్లా ప్రతినిధులు తెలిపారు. అయితే లెబనాన్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో మిలిటెంట్లను తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ దాడుల్లో లెబనాన్కు చెందిన వందల ఫైటర్లు, ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరులు, సైనికులు మరణించారు. ఈ దాడుల కారణంగా ఇరుదేశాలకు సంబంధించి సుమారు పదివేల మంది పౌరులు వలసవెళ్లారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఇజ్రాయెల్ను సందర్శించిన అమెరికా రాయబారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఉత్తర నివవాసితులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురావడానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం సైనిక చర్య మాత్రమేనని అన్నారు. రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.చదవండి: భారత్లో ముస్లింలు బాధలు పడుతున్నారు -
Euro Cup: ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన స్పెయిన్.. తొలి జట్టుగా
పుష్కర కాలం తర్వాత స్పెయిన్ జట్టు అంతర్జాతీయ ఫుట్బాల్ వేదికపై మళ్లీ మెరిసింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి చాంపియన్గా నిలిచింది. అంతేకాదు రెండు అత్యంత అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకుంది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఫైనల్లో అల్వారో మొరాటో సారథ్యంలోని స్పెయిన్ 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున నికో విలియమ్స్ (47వ ని.లో), మికెల్ ఒయర్జబాల్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు పాల్మెర్ (73వ ని.లో) ఏకైక గోల్ అందించాడు.ఆట 68వ నిమిషంలో కెప్టెన్ అల్వారో మొరాటో స్థానంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన ఒయర్జబాల్ సహచరుడు మార్క్ కుకురెల్లా క్రాస్ పాస్ను లక్ష్యానికి చేర్చి స్పెయిన్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 90వ నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ మార్క్ గుయెహి హెడర్ షాట్ను గోల్ పోస్ట్ ముందు స్పెయిన్ డిఫెండర్ డాని ఓల్మో హెడర్ షాట్తో అడ్డుకోవడం కొసమెరుపు.తొలి జట్టుగా చరిత్రఈ గెలుపుతో స్పెయిన్ జట్టు 66 ఏళ్ల టోర్నీ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో స్పెయిన్ 1964, 2008, 2012లలో యూరో టైటిల్ను సాధించింది.జర్మనీ జట్టు మూడుసార్లు (1972, 1980, 1996) విజేతగా నిలిచింది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టుకు వరుసగా రెండోసారి యూరో టోర్నీలో నిరాశ ఎదురైంది. 2021 యూరో ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడిన ఇంగ్లండ్కు ఈసారి స్పెయిన్ షాక్ ఇచ్చింది.బంతిని 63 శాతం తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేసింది. ఏకంగా 60 సార్లు ఇంగ్లండ్ గోల్పోస్ట్ వైపునకు వెళ్లిన స్పెయిన్ 15 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించింది. మరోవైపు హ్యారీ కేన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 31 సార్లు స్పెయిన్ గోల్పోస్ట్ వైపునకు వెళ్లి తొమ్మిదిసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు సంధించింది.విజేతకు రూ. 72 కోట్ల 89 లక్షలుస్పెయిన్ టీనేజ్ స్టార్, 17 ఏళ్ల లమీన్ యమాల్ ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... స్పెయిన్కే చెందిన రోడ్రి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. ఫైనల్ విజేత స్పెయిన్ జట్టుకు 80 లక్షల యూరోలు (రూ. 72 కోట్ల 89 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 50 లక్షల యూరోలు (రూ. 45 కోట్ల 56 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ఓవరాల్గా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్కు దక్కింది.స్పెయిన్ అరుదైన రికార్డులు ఇవే1. యూరో టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పింది. 2. ఒకే యూరో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా స్పెయిన్ గుర్తింపు పొందింది. ఫ్రాన్స్ (14 గోల్స్; 1984లో) పేరిట ఉన్న రికార్డును స్పెయిన్ తాజాగా తిరగరాసింది. 🔝 performance 🔝 tournament Nico Williams is the real deal 👏@Vivo_GLOBAL | #EUROPOTM pic.twitter.com/lPu38RWoX0— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్కేర్, వినీ కాస్మెటిక్స్లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
ఒకరు 6 సెకన్లలో... మరొకరు 7 సెకన్లలో....
బ్రాటిస్లావా (స్లొవేకియా): అంతర్జాతీయ ఫుట్బాల్లో ఆదివారం అద్భుతం జరిగింది. వేర్వేరు వేదికల్లో జరిగిన రెండు అధికారిక ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో రెండు ఫాస్టెస్ట్ గోల్స్ నమోదయ్యాయి. బ్రాటిస్లావాలో స్లొవేకియాతో జరిగిన మ్యాచ్లో ఆ్రస్టియా 2–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆట మొదలైన 6 సెకన్లకే ఆ్రస్టియా ప్లేయర్ క్రిస్టోఫ్ బామ్గార్ట్నర్ గోల్ చేశాడు. మిడ్ ఫీల్డ్ నుంచి క్షణాల్లో ముగ్గురు డిఫెండర్లను తప్పించుకొని ముందుకు దూసుకెళ్లిన క్రిస్టోఫ్ లాంగ్షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. మరోవైపు లియోన్లో ఫ్రాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో జర్మనీ జట్టు 2–0తో నెగ్గింది. ఈ మ్యాచ్లో ఆట మొదలైన 7 సెకన్లకే జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ విట్జ్ గోల్ చేశాడు. ఇన్నాళ్లూ అంతర్జాతీయ ఫుట్బాల్లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన రికార్డు లుకాస్ పొడోల్స్కీ పేరిట ఉంది. 2013లో ఈక్వెడార్తో జరిగిన మ్యాచ్లో పొడోల్స్కీ 9వ సెకనులో గోల్ సాధించాడు. పొడోల్స్కీ 11 ఏళ్ల రికార్డు ఒకేరోజు బద్దలు కావడం విశేషం. -
వైట్ హౌస్లో ఏపీ విద్యా ప్రభ
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ను సందర్శించారు. ఇప్పటి వరకు వైట్హౌస్ను బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు.. తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. విద్యార్థులను వైట్ హౌస్ భద్రత సిబ్బంది శ్వేత సౌధం మొత్తం తిప్పారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పని విధానాన్ని అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా భవనంలో కలియదిరిగారు. అక్కడి విభాగాలు, సిబ్బంది పనితీరు, సెక్యూరిటీ సిస్టం, అధ్యక్షుడు నివసించే భవనం, కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు.ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లబ్ధిపొందిన వారే చెప్పడం సమంజసమని భావించిన ప్రభుత్వం.. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇలా దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మన రాష్ట్రం నుంచే ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో యునైటెడ్ నేషన్స్లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ సమన్వయంతో, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పర్యవేక్షణలో విద్యార్థుల బృందం ఈనెల 14న అమెరికాకు వెళ్లింది. ఈ బృందంలో మాల శివలింగమ్మ, (తండ్రి సోమనాథ్ రైతు కూలీ, తల్లి గంగమ్మ), మోతుకూరి చంద్రలేఖ (ఏఎస్ఆర్ జిల్లా,తండ్రి రామారావు ఆటో డ్రైవర్), గుండుమోగుల గణేష్ అంజన సాయి (పశ్చిమ గోదావరి జిల్లా, తండ్రి గోపీ, కౌలు రైతు), దడాల జ్యోత్స్న (కాకినాడ జిల్లా, తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు), చాకలి రాజేశ్వరి (నంద్యాల జిల్లా, తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్), పసుపులేటి గాయత్రి (ఏలూరు జిల్లా, తండ్రి రమేష్, తల్లి కూలీలు), అల్లం రిషితారెడ్డి (విజయనగరం జిల్లా, తండ్రి రామకృష్ణారెడ్డి మెకానిక్), వంజివాకు యోగేశ్వర్ (తిరుపతి జిల్లా, తండ్రి నాగరాజు కేబుల్ ఆపరేటర్), షేక్ అమ్మాజన్(శ్రీ సత్యసాయి జిల్లా, తల్లి షేక్ ఫాతిమా వ్యవసాయ కూలీ), సామల మనస్విని (పార్వతీపురం మన్యం జిల్లా, తల్లి కృష్ణవేణి) ఉన్నారు. ఈ నెల 15 నుంచి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) సదస్సుతో పాటు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్లో రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’, విద్యా సంస్కరణలపై వీరు ప్రసంగించారు. న్యూయార్క్లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్లో నిర్వహించిన ఎస్డీఎస్ సర్విస్ సదస్సు, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో సైతం పాలుపంచుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్లో ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాలను సందర్శించి భారత్కు తిరుగుపయనమయ్యారు. సీఎంకు విద్యార్థుల కృతజ్ఞతలు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం రాష్ట్రం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైనందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తాము నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. పేద కుటుంబాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తమను ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్కుమార్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. -
ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇంటర్ మియామి క్లబ్లో మంచి ముహూర్తంలో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పటివరకు ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ మెస్సీ గోల్స్తో మెరిశాడు. అందులో రెండు మ్యాచ్ల్లో డబుల్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఓర్లాండో సిటీ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఇంటర్ మియామి 3-1తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ 95 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆలస్యమైనప్పటికి మెస్సీ మాత్రం గోల్ కొట్టడంలో పెద్దగా టైం తీసుకోలేదు. ఆట 7వ నిమిషంలోనే మెస్సీ తన జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే ఓర్లాండో సిటీ ఆట 11వ నిమిషంలో గోల్ కొట్టి సోర్కును సమం చేసింది. అక్కడి నుంచి తొలి హాఫ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో హాఫ్ మొదలైన కాసేపటికి ఆట 51వ నిమిషంలో జోసెఫ్ మార్టినేజ్ పెనాల్టీని గోల్గా మలిచాడు. ఇక ఆట 72వ నిమిషంలో మెస్సీ మరో గోల్ కొట్టి జట్టును 3-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఓర్లాండో మరో గోల్ కొట్టలేకపోవడంతో ఇంటర్ మియామి విజయాన్ని నమోదు చేసింది. కాగా మెస్సీ రెండు గోల్స్ కొట్టిన సందర్భంలో మ్యాచ్కు హాజరైన అతని భార్య ఆంటోనెలా రోకుజో స్టాండ్స్లో సెలబ్రేట్ చేసుకోవడం వైరల్గా మారింది. జెర్సీ అమ్మకాల్లో దిగ్గజాలను అధిగమించిన మెస్సీ.. కాగా మెస్సీ మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గోల్స్తో రికార్డులు కొట్టడమే కాదు తాజాగా మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు. 24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్లను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్ఏ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. MESSI X ROBERT TAYLOR BANGERS ONLY 🤯🤯 Taylor puts Messi in with the chip to give us the early lead over Orlando City.#MIAvORL | 📺#MLSSeasonPass on @AppleTV pic.twitter.com/kvb8Lmcccj — Inter Miami CF (@InterMiamiCF) August 3, 2023 చదవండి: క్రికెట్కు గుడ్బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ -
ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ధనవంతుడు కావాలని.. బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తరువాత ఇవన్నీ మనవల్ల అయ్యేపని కాదని మధ్యలోనే ఊరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు.. తప్పకుండా ధనవంతులవుతారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం. స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం.. ధనవంతుడు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఒక మంచి సులభమైన మార్గం స్టాక్ మార్కెట్ అనే చెప్పాలి. జీవితంలో డబ్బు పొదుపుచేయడం ఎంత ముఖ్యమో.. వాటిని ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు వస్తాయని భావించవచ్చు, కానీ సరైన అవగాహన ఉంటే అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. డైవర్సిఫికేషన్ చాలా అవసరం.. సంపాదించి కూడబెట్టిన డబ్బు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. అంటే మీదగ్గరున్న డబ్బు కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా.. గోల్డ్ లేదా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం వంటివాటిలో పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడు ఒక రంగంలో నష్టం వచ్చినా.. మరో రంగంలో తప్పకుండా లాభం వస్తుంది. దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు. అప్పులు చేయడం మానుకోవాలి.. సంపాదనకు తగిన ఖర్చులను మాత్రమే పెట్టుకోవాలి. విచ్చలవిడి ఖర్చులు చేస్తూ.. డబ్బు కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుందనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇదీ చదవండి: నకిలీ మందులకు చెక్.. ఒక్క క్యూఆర్ కోడ్తో మెడిసిన్ డీటెయిల్స్! గోల్ చాలా ముఖ్యం.. నువ్వు ధనవంతుడు కావాలంటే ముందుగా తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ఫైనాన్సియల్ గోల్స్ పెట్టుకోవాలి. మీ ప్రయాణాన్ని గోల్ వైపు సాగిస్తే తప్పకుండా అనుకున్నది సాదిస్తావు. ఇల్లు, కారు ఇతరత్రా ఏమి కొనాలనుకున్న ముందుగా ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి స్మార్ట్ ఇన్వెస్ట్ అవసరం.. ఇన్వెస్ట్ అంటే ఎదో ఒక రంగంలో గుడ్డిగా వెళ్లిపోవడం కాదు.. అలోచించి చాలా స్మార్ట్గా పెట్టుబడి పెట్టాలి. ట్యాక్స్ సేవింగ్స్, ఫండ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో అధిక వడ్డీ వచ్చే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం మరచిపోకూడదు. యువకుడుగా ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవాలి.. అప్పుడే సక్సెస్ పరుగెత్తుకుంటూ వస్తుంది. ధనవంతుడు కావాలనే కోరిక ఉంటే సరిపోదు.. దాని కోసం అహర్నిశలు ఆలోచించాలి, ఆ మార్గంలోనే ప్రయాణం కొనసాగించాలి. తెలియని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి, వీలైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెడుతున్నావో తెలియకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ రికార్డు రొనాల్డో పేరిటే ఉంది. ఇప్పటివరకు రొనాల్డో 838 గోల్స్ సాధించాడు. కొంతకాలంగా గోల్స్ కొట్టడంలో విఫలమవుతున్న రొనాల్డో తాజాగా మంగళవారం హెడర్ గోల్తో మెరిశాడు. అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అల్-నసర్, యూఎస్ మోనాస్టిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అల్-నసర్ 4-1 తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఆట 74వ నిమిషంలో రొనాల్డో సూపర్ హెడర్ గోల్తో మెరిశాడు. రొనాల్డో గోల్ కొట్టడానికి 8 నిమిషాల ముందు ప్రత్యర్థి జట్టు ఒక గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే రొనాల్డో 74వ నిమిషంలో హెడర్ గోల్తో తన జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ఫుట్బాల్లో అత్యధిక హెడర్ గోల్స్ కొట్టిన జాబితాలో జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్ను అధిగమించాడు. ఇప్పటివరకు ముల్లర్తో కలిసి 144 హెడర్ గోల్స్తో సంయుక్తంగా ఉన్న రొనాల్డో తాజా గోల్(145 హెడర్)తో ముల్లర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు తన కెరీర్లో 839వ గోల్ సాధించి అత్యధిక గోల్స్ విషయంలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 22 SEASONS IN A ROW CRISTIANO RONALDO IS ETERNAL 🍷🐐pic.twitter.com/mEPwV62rhn — aurora (@cr7stianos) July 31, 2023 Ronaldooooooo pic.twitter.com/rab2wPkZAQ — AlNassr FC (@AlNassrFC_EN) July 31, 2023 చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' -
మెస్సీనా మజాకా.. క్లబ్లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా
అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఏ క్లబ్కు ఆడినా తన జోరును చూపిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి క్లబ్ మ్యాచ్ దాకా గోల్స్ కొడుతూనే ఉన్నాడు. ఇటీవలే పీఎస్జీ నుంచి ఇంటర్ మియామి(Inter Miami FC)కి రికార్డు ధరకు వెళ్లిన మెస్సీ క్లబ్ తరపున ఆడిన తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. లీగ్స్ కప్ ప్లేలో భాగంగా డీఆర్వీ పీఎన్కే స్టేడియం వేదికగా శనివారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఇంటర్ మియామి, క్రజ్ అజుల్ మధ్య జరిగిన మ్యాచ్లో మెస్సీ గోల్తో మెరిశాడు. మ్యాచ్ అదనపు సమయం(ఆట 94వ నిమిషం)లో లభించిన ఫ్రీకిక్ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ బంతిని నేరుగా గోల్పోస్ట్లోకి పంపించాడు. దీంతో ఇంటర్ మియామి జట్టు క్రజ్ అజుల్పై 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్కు 22వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మెస్సీని చూడడానికే వచ్చిన అభిమానులకు ఆట ముగిసే సమయానికి నిరాశే మిగిలింది. మెస్సీ గోల్ చూడకుండానే వెళ్లిపోతామేమోనని ఫీలయ్యారు. కానీ 94వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్ను మెస్సీ గోల్గా మలచడంతో స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఒక క్లబ్ తరపున అరేంగేట్రం మ్యాచ్లో ఫ్రీకిక్ను గోల్గా మలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు మెస్సీ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. LIONEL ANDRÉS MESSI IS NOT HUMAN. pic.twitter.com/2mBDI41mLy — Major League Soccer (@MLS) July 22, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్గా #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
లియోకి ఎందుకంత క్రేజ్?
-
హ్యాట్రిక్ గోల్స్తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్బాల్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
హ్యాట్రిక్ గోల్స్తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అర్జెంటీనా తరపున వందో అంతర్జాతీయ గోల్ సాధించాడు. కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్ చేసి హ్యాట్రిక్తో పాటు వందో గోల్స్ సాధించాడు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్ల్లో 102 గోల్స్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్ల్లో 109 గోల్స్) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెస్సీ మూడు గోల్స్ చేయగా.. నికోలస్ గొంజాలెజ్(ఆట 23వ నిమిషం), ఎంజో ఫెర్నాండేజ్(ఆట 35వ నిమిషం), ఏంజెల్ డి మారియా(ఆట 78వ నిమిషం), గొంజాలో మాంటెల్(ఆట 87వ నిమిషం)లో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 7-0 తేడాతో కురాకోను చిత్తుగా ఓడించింది. కాగా మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్ కావడం విశేషం. MESSI WHAT A CRAZY HALF, ENJOY THE GOALS!!!! 🐐🐐🐐 pic.twitter.com/f9nwKcoUeS — mx ⭐️⭐️⭐️ (@MessiMX30iiii) March 29, 2023 -
సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్బాల్ స్టార్
ఫుట్బాల్లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్తో జరిగిన మ్యాచ్లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు. ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్పై తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0తో విజయం సాధించింది. ....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE — Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023 📈 Most International Goals: 🇵🇹 Cristiano Ronaldo 𝟭𝟮𝟬 🇮🇷 Ali Daei 𝟭𝟬𝟵 🇦🇷 Lionel Messi 𝟵𝟵 🇲🇾 Mokhtar Dahari 𝟴𝟵 🇮🇳 Sunil Chhetri 𝟴𝟱 🇭🇺 Ferenc Puskás 𝟴𝟰 Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. 🇮🇳🔥#IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz — IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023 చదవండి: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్ను మెస్సీ తనదైన శైలిలో గోల్గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్గా 800 గోల్స్తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్బాల్లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
వెల్త్.. హెల్త్! దక్షిణాది ప్రజల ఆలోచన ఇదే! సర్వేలో కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: కుటుంబ ఆర్థిక భద్రతకే దక్షిణాది రాష్ట్రాల పౌరులు అధికంగా మొగ్గుచూపుతున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ విషయంలో వారు మరింత జాగ్రత్తగా, ఆ లక్ష్యాల సాధన దిశగా కృషిచేస్తున్నారు. తమ జీవిత అత్యున్నత లక్ష్యాల్లో ‘కుటుంబ ఆర్థిక పరిపుష్టి’సాధన ముఖ్యమని 74 శాతం మంది భావిస్తున్నారు. అలాగే, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు వంటి వాటిని వీరు ఇతర ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ‘ఇండియాస్ లైఫ్ గోల్స్ ప్రిపేర్డ్నెస్–2023’పేరిట ఓ ప్రైవేట్ బీమా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని వారి జీవిత లక్ష్యాలు, వాటి సాధన ప్రాధాన్యతలపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 13 మెట్రోలు, ప్రథమ, ద్వితీయశ్రేణి నగరాల్లో 22–55 ఏళ్ల వయసు మధ్య వారితో ఈ సర్వే నిర్వహించింది. దక్షిణాదికి సంబంధించి.. గుంటూరు, మదురై, బెంగళూరు, చెన్నైల్లో ఈ అధ్యయనం చేశారు. సర్వేలో కీలకాంశాలు ♦ వయసు, లింగ భేదంతో సంబంధం లేకుండా అంతా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు ♦ ఇతర లక్ష్యాల కంటే కుటుంబ ఆర్థిక భద్రత తమ ప్రాధాన్యమన్న 74 శాతం మంది ♦ ఆరోగ్యపరిరక్షణ, సేవా కార్యక్రమాలు, ప్రయాణాలు ఇతర ప్రధాన లక్ష్యాలని అధికశాతం వెల్లడి ♦ ఆరోగ్యం, ఫిట్నెస్కు సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు 73 శాతం ♦ ప్రతీ ఇద్దరిలో ఒకరు శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉండాలనేది కోరిక ♦ తమను ప్రభావితం చేసే వాటిలో సోషల్ మీడియా పాత్ర పెరిగిందని ఎక్కువ మంది చెప్పారు ♦ సోషల్ మీడియా టాప్–3 లైఫ్గోల్స్ ఇన్ఫ్టుయెన్సర్లలో ఒకటిగా ఉంది ♦ కోవిడ్ అనంతర పరిస్థితుల్లో సామాజికసేవ, దాతృత్వం వైపు 61 శాతం మంది మొగ్గు ♦ ప్రతీ ముగ్గురిలో ఒకరు సామాజికంగా ప్రభావం చూపే వాటికి విరాళాలిచ్చేందుకు ఆసక్తి ♦ బాగా డబ్బు సంపాదించి ఉద్యోగాల నుంచి రిటైర్ కావాలనే భావనలో 30 శాతం ♦ లక్ష్యాల సాధనలో సందిగ్ధత వ్యక్తంచేసిన వారు 52 శాతం ♦ తమ జీవిత కాలంలో కనీసం ఐదు లక్ష్యాలనైనా చేరుకోవాలని ఆశిస్తున్నారు ♦ పిల్లలకు మంచి చదువు, సొంత ఇంటి కోసం ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు ♦ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారిలో ఈ ఆశలు, ఆశయాలు మరింత ఎక్కువగా కనిపించాయి ♦ నవయువతరం మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల సాధనకు ఆసక్తి చూపింది. హెల్త్, ఫిట్నెస్, విదేశీ ప్రయాణం వైపు మొగ్గు చూపింది. జీవిత బీమాలో పెట్టుబడులు ‘దక్షిణ భారత ప్రజల జీవిత లక్ష్యాలు, ఆశలు, లక్ష్యాల సాధనకు సంబంధించి 40 అంశాలపై పరిశీలన చేశాం. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కుటుంబ ఆర్థిక భద్రతకు దక్షిణాది వారు పెద్దపీట వేశారు. తమ జీవిత లక్ష్యాల సాధనకు జీవిత బీమాలో పెట్టుబడులు పెట్టడమే సరైన మార్గమని అధికశాతం అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి జీవితం, కెరీర్, ఆరోగ్యం, కుటుంబం పట్ల దృష్టికోణాన్ని మార్చింది. కుటుంబభద్రత, సామాజికంగా మంచి సంబంధాలు కలిగి ఉండటం, సామాజిక–ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలన్నింటిని కలిపి మొత్తంగా జీవితాన్ని ప్రతిబించించేలా ఆలోచనలు మారాయి’అని బీమా సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ చంద్రమోహన్ మెహ్రా చెప్పారు. -
2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’
న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు ఆధునిక సాంకేతికత దోహదపడతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ విప్లవ ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భారీస్థాయిలో ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ‘అన్లీషింగ్ ద పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’ పేరిట మంగళవారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని మోదీ మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలపై భారంగా మారిన నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీతో పేదలకు లబ్ధి అన్ని రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. 5జీ, కృత్రిమ మేధ(ఏఐ)పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోందన్నారు. సాంకేతికతతో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే రేషన్తోపాటు జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నెంబర్(జేఏఎం)కు టెక్నాలజీయే ఆధారమని అన్నారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తం చేశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏఐ ద్వారా పరిష్కరించగలిగిన పదింటిని గుర్తించాలని నిపుణులకు సూచించారు. 21వ శతాబ్దాన్ని టెక్నాలజీ ముందుకు నడిపిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి ప్రతి బడ్జెట్లోనూ పెద్దపీట వేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఒక అవరోధంగా పరిగణించవద్దని ప్రజలకు సూచించారు. -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. ఫుట్బాల్ క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువయ్యాడు. అల్ వెహ్దాతో గురువారం జరిగిన మ్యాచ్లో రొనాల్డో చెలరేగిపోయాడు. మునపటి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్లోకి పంపాడు. దాంతో, అల్-నసర్ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అతని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి. పోర్చుగల్లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొదట్లో అండోరిన్హా, నసియోనల్ వంటి స్థానిక క్లబ్స్కు ఆడాడు. ఆటలో నైపుణ్యం సాధించిన అతను 18 ఏళ్లకే సీనియర్ టీమ్కు ఆడాడు. అతను ఇప్పటి వరకు ఐదు క్లబ్స్కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 103 గోల్స్ చేశాడు. జువెంటస్ క్లబ్కు ఆడిన సమయంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబనాన్ క్లబ్ తరఫున మూడు, తాజాగా అల్ నసర్ క్లబ్ తరపున ఐదు గోల్స్ కొట్టాడు. ఓవరాల్గా పోర్చుగల్ తరపున అంతర్జాతీయ మ్యాచ్లు సహా అన్ని క్లబ్లు కలిపి 1100 మ్యాచ్లకు పైగా ఆడిన రొనాల్డో 820 గోల్స్ కొట్టాడు. Not bad for a 38yr-old… https://t.co/aFZJFwtlH1 — Piers Morgan (@piersmorgan) February 9, 2023 చదవండి: 135 మ్యాచ్ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
Lionel Messi: రొనాల్డో అరుదైన రికార్డు బద్దలు కొట్టిన మెస్సీ.. ఏకంగా..
Lionel Messi- Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో- లియోనల్ మెస్సీ.. ఈ ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాల మధ్య రికార్డుల పోటీ నువ్వా- నేనా అన్నట్లుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దకాలంగా సాకర్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్లో.. మెస్సీ ఫిఫా ప్రపంచకప్-2022 ట్రోఫీని ముద్దాడి ఓ మెట్టు పైన నిలిచాడు. మరోవైపు.. పోర్చుగల్ స్టార్ రొనాల్టోకు మాత్రం వరల్డ్కప్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఖతర్ టోర్నీలో అర్జెంటీనా సూపర్స్టార్ మెస్సీ అద్భుతాలు చేయగా.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. రొనాల్డో రికార్డు బద్దలు ఈ క్రమంలో రొనాల్డోకు సాధ్యం కాని పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న లియోనల్ మెస్సీ.. ఈ పోర్చుగల్ స్టార్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టాప్-5 యూరోపియన్ లీగ్లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 697 గోల్స్తో రొనాల్డోను అధిగమించాడు మెస్సీ. ఫ్రెంచ్ లీగ్లో భాగంగా పారిస్ సెయింట్ జర్మనీ(పీఎస్జీ), మాంట్పిల్లర్ మ్యాచ్ సందర్భంగా మెస్సీ ఈ ఫీట్ నమోదు చేశాడు. పీఎస్జీకి ప్రాతినిథ్యం వహించిన ఈ అర్జెంటీనా లెజెండ్.. ఈ మ్యాచ్లో గోల్ ద్వారా రొనాల్డోను వెనక్కినెట్టాడు. క్లబ్ కెరీర్లో మొత్తంగా 697 గోల్స్ చేసి టాప్లో నిలిచాడు. ఇక ఇందులో ఈ సీజన్లో పీఎస్జీ తరఫున చేసిన గోల్స్ 13. మరోవైపు.. రొనాల్డో ఇప్పటి వరకు రియల్ మాడ్రిడ్ తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 145, జువెంటస్ తరఫున 101 గోల్స్తో కలిపి మొత్తంగా 696 గోల్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. మాంట్పిల్లర్తో మ్యాచ్కు ముందు మెస్సీ మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. కోరుకున్నవన్నీ దక్కాయి.. ఇకపై ‘‘జాతీయ జట్టు తరఫున నేనైతే సాధించాలని అనుకున్నానో ఆ కల నెరవేరింది. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా నేను కోరుకున్నవన్నీ నాకు లభించాయి. శిఖరాగ్రంలో ఉన్నపుడే కెరీర్ను ముగించడమే మిగిలి ఉంది. నేను ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి దాకా వస్తానని అస్సలు ఊహించలేదు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. మేము 2021లో కోపా అమెరికా, 2022లో వరల్డ్కప్ గెలిచాము. ఇంతకంటే సాధించాల్సిందేమీ లేదు’’అని మెస్సీ అర్బన్ప్లేతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ఫుట్బాల్ క్లబ్ అల్ నసర్ మ్యాచ్లతో బిజీగా ఉన్నాడు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్కు సచిన్ రావాల్సిందే! IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ What a Goal by the World Champion Lionel Messi. 🔥🐐 pic.twitter.com/yPJmqUgZda — x3a6y 🇦🇪 (@x3a6y) February 1, 2023 -
పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్పై లుక్కేయాల్సిందే
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. పీలే తన అటాకింగ్ స్కిల్స్తో ఫిఫా ప్రపంచాన్ని ఊపేశారు. తన డ్రిబ్లింగ్ ట్యాలెంట్తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించేవాడు. గోల్ పోస్టునే టార్గెట్ చేస్తూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఇక ఫిఫా వరల్డ్కప్ మ్యాచుల్లో పీలే మొత్తం 12 గోల్స్ చేశాడు. పీలే కొట్టిన టాప్-10 అద్భుతమైన గోల్స్ను ఒకసారి చూసేయండి. ►17 ఏళ్ల వయసులో పీలే ఓ వండర్ చేశాడు. 1958లో బ్రెజిల్కు ఫిఫా వరల్డ్కప్ను అందించాడు. ఆ టైటిల్తో ఆగలేదతను. పీలేలో ఉన్న గోల్ స్కోరింగ్ సామర్థ్యం అందర్నీ స్టన్ చేసేది. ఆ ఏడాది ఫ్రాన్స్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో అతను హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. ► 1970వ సంవత్సరం పీలే కెరీర్లో ఓ మలుపురాయి లాంటింది. ఆ ఏడాది ఫిఫా వరల్డ్కప్ను కలర్లో టెలికాస్ట్ చేశారు. కొత్త టెక్నాలజీతో మ్యాచ్లను ప్రేక్షకులు వీక్షించారు. ఇక ఆ పీలే జోరును కూడా ప్రేక్షకులు కళ్లార్పకుండా చూశారు. యెల్లో జెర్సీలో పీలే చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ టోర్నీలో ఇటలీతో జరిగిన ఫైనల్లో బ్రెజిల్ 4-1 తేడాతో నెగ్గింది. ఆ విజయంలో పీలే కీలక పాత్ర పోషించాడు. ► 1982లో బ్రెజిల్ మళ్లీ టైటిల్ను గెలుచుకున్నది. ఆ జట్టులో పీలే ఉన్నాడు. కానీ ఆ టోర్నీలో అతను కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. గాయం వల్ల టోర్నీలోని మిగితా మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. 1966 టోర్నీలో బ్రెజిల్ గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయ్యింది. One of the greatest to ever play the game 🇧🇷⚽️ Join us in wishing the legendary @Pele a very Happy Birthday 🥳 pic.twitter.com/hwuU3d1Ufh — FIFA World Cup (@FIFAWorldCup) October 23, 2022 చదవండి: అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ -
FIFA World Cup: అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లెవరంటే?
మరో రెండు రోజుల్లో టి20 వరల్డ్కప్ ముగియనుంది. ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్లు కౌంట్ చేసిన నోటితోనే గోల్స్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. టి20 వరల్డ్కప్ ముగిసిన వారం రోజులకు మరో మెగా సమరం మొదలుకానుంది. క్రికెట్ కంటే కాస్త ఎక్కువే క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్బాల్. మాములు ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూనే అభిమానులకు పూనకాలు వస్తాయి. మరి అలాంటిది సాకర్ సమరానికి(ఫిఫా వరల్డ్కప్) సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు మనకు తెలిసిన స్టార్స్ను ఉమ్మడిగా వేర్వేరు జట్లలో చూస్తుంటాం. కానీ ఫిఫా వరల్డ్కప్ అనగానే దేశం తరపున ఆడడానికి ఆటగాళ్లు సిద్ధమవుతారు. మరి అంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్కప్ గురించి మాట్లాడుకుంటే.. 1930 నుంచి ఇప్పటి వరకూ 21 ఫుట్బాల్ వరల్డ్కప్ టోర్నీలు జరిగాయి. మరి ఇప్పటి వరకూ ఈ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ ఎవరనేది ఒకసారి పరిశీలిద్దాం. మిరొస్లావ్ క్లోజ్ ఫిఫా వరల్డ్కప్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా జర్మనీ స్ట్రైకర్ మిరొస్లావ్ క్లోజ్ నిలుస్తాడు. అతడు ఇప్పటి వరకూ వరల్డ్కప్లలో 24 మ్యాచ్లు ఆడాడు. అందులో 16 గోల్స్తో టాప్లో ఉన్నాడు. క్లోజ్ నాలుగు వరల్డ్కప్లు ఆడాడు. ఈ 24 మ్యాచ్లలో 63సార్లు అతడు గోల్డ్పోస్ట్పై దాడి చేసి 16 గోల్స్ చేయడం విశేషం. అంటే ప్రతి నాలుగు షాట్లలో ఒకదానిని అతడు గోల్గా మలిచాడు. రొనాల్డో లూయిస్ నజారియో డె లిమా మిరొస్లావ్ క్లోజ్కు ముందు అత్యధిక గోల్డ్స్ రికార్డు బ్రెజిల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో పేరిట ఉండేది. రొనాల్డో చివరిసారి 2002లో వరల్డ్కప్ గెలిచిన బ్రెజిల్ టీమ్లో సభ్యుడు. అతడు మూడు టోర్నీల్లో 19 మ్యాచ్లలోనే 15 గోల్స్ చేయడం విశేషం. 1998లో తాను ఆడిన తొలి వరల్డ్కప్లో నాలుగు గోల్స్ చేశాడు. ఇక 2002లో అయితే ఏడు మ్యాచ్లలోనే 8 గోల్స్ చేసిన గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. అతని ప్రదర్శనతోనే 2002లో బ్రెజిల్ ఖాతాలో ఐదో టైటిల్ వచ్చి చేరింది. గెర్డ్ ముల్లర్ జర్మనీ లెజెండరీ ప్లేయర్ గెర్డ్ ముల్లర్ 14 వరల్డ్కప్ గోల్స్ చేశాడు. కేవలం రెండు వరల్డ్కప్లలో అతడు ఇన్ని గోల్స్ చేయడం విశేషం. 1970 వరల్డ్ప్లో 10 గోల్స్తో గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. 1970 తర్వాత ముల్లర్ చేసినన్ని గోల్స్ మరే ఇతర వరల్డ్కప్లో ఏ ఆటగాడు కూడా చేయలేదు. జస్ట్ ఫాంటెయిన్ ఫ్రాన్స్ స్ట్రైకర్ ఫాంటెయిన్కు ఒక వరల్డ్కప్లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఉంది. అతడు 1958 వరల్డ్కప్లో ఏకంగా 13 గోల్స్ చేశాడు. అతడు ఆడిన ఏకైక వరల్డ్కప్ ఇదే కావడం గమనార్హం. పీలే బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ పీలే వరల్డ్కప్లలో 12 గోల్స్ చేశాడు. అతడు నాలుగు వరల్డ్కప్లు ఆడాడు. అతడు ఎప్పుడూ గోల్డెన్ బూట్ అవార్డు గెలవకపోయినా.. 1970లో బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టోర్నీలో నాలుగు గోల్స్ చేయడంతోపాటు ఆరు గోల్స్ కావడంలో సాయపడ్డాడు. ఇప్పుడు ఖతార్లో జరగబోయే వరల్డ్కప్లో అందరి కళ్లూ థామస్ ముల్లర్, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ సురెజ్, లియోనెల్ మెస్సీ, కరీమా బెంజెమా లపైనే ఉన్నాయి. ముల్లర్ ఖాతాలో 10 గోల్స్ ఉండగా.. రొనాల్డో 7, మెస్సీ 6 గోల్స్ చేశారు. -
ప్రతినెలా డేటా అప్లోడ్ చేయాలి: సీఎం జగన్
-
ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో.. లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ప్రతి అంశంలోకూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాంగానికి, సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ మాటల్లో.. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తీసుకొచ్చింది. అలాంటి సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా ముఖ్యమైన అంశం. లేకపోతే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. ప్రగతి అనేది కేవలం అందమైన అంకెల రూపంలో చూపడం కాదు, అవి వాస్తవాలుగా కనిపించాలని స్పష్టం చేశారాయన. ► ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయడంతోపాటు ... వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు.. రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. ఆడపడుచులకు సరైన ఆహారం అందుతుందా? లేదా? అనేదానిపై గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో వివిధ విభాగాల తరపున గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. తాము అనుకుంటున్న లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాలను చోదక శక్తిలా వాడుకుని అందులోని సిబ్బందిని పూర్తి స్ధాయిలో భాగస్వాములు చేయాలి. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్గా ఉండాలి. అలాగే.. ► సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలి. వీరు సచివాయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి ఎస్ఓపీలను రూపొందించుకోవాలి. ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏరకంగా పనిచేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఏ రకంగా పనిచేస్తున్నారు? అనేది పరిశీలన చేయాలి. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభించడంతో పాటు అవగాహన కల్పించగలుగుతారు. ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుంది. అంతేకాదు.. ► లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో కూడా తెలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. అంతేకాదు ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకుపడతాయి. దేశంలో రాష్ట్రం నంబర్ వన్గా నిలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఓనర్షిప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలి. వీలైనంత త్వరగా ఈ అధికారుల నియామకం కావాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్ఓపీలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయండి. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలి. కలెక్టర్లు, జేసీలు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో కూడా పరిశీలన చేయాలి. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడంలేదు. అందుకనే ఓనర్షిప్ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉంది. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూదు. డ్రాప్అవుట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాప్అవుట్ జరిగిన ఘటన తెలిస్తే.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలి. పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలి. పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్ఎంఎస్లు పంపాలి. ఇది కచ్చితంగా జరిగేలా చూడాలి. ► కళ్యాణమస్తుకోసం నిర్దేశించిన అర్హతలు బాల్యవివాహాల నివారణ, అక్షరాస్యత పెంపుకోసం తోడ్పాటు నందిస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదోతరగతిగా నిర్ణయించాం, అంతేకాదు పెళ్లికూతురు కనీస వయస్సు 18 ఏళ్లు, పెళ్లికొడుకు కనీస వయస్సు 21 సంవత్సరాలను పాటించాలని చెప్పాం. అలాగే.. ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రత అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, రక్షిత తాగునీరు అంశాలపైకూడా దృష్టిపెట్టాలి. విద్యారంగం సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు వలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ► విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు అన్నవి గొప్ప భవిష్యత్తు తరాలను అందిస్తాయి. ఇంగ్లిషుమీడియం సహా మనం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు అమలుద్వారా పరిస్థితులను మార్చాలన్న మహాయజ్ఞాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు అన్నవి..మంచి భవిష్యత్తు తరాలుగా సమాజానికి అందుతాయి. ఇంగ్లిషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిషుమీడియంలో చదుకోవాలి, పేదవాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదవకూడదన్న వారి వైఖరిని పదేపదే బయటపెడుతున్నారు. పేదవాళ్ల పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో చదువులు అందకూడదన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. దీనివల్ల చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పందనను మరింత మెరుగు పర్చండి ఇక వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ ‘స్పందన’కు మెరుగైన రూపంపై అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. వ్యక్తులకు సంబంధించిన సమస్యలతోపాటు, కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాం. ఒక నిర్ణీత సమయం పెట్టుకుని వాటిని శరవేగంగా పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచాం. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. స్పందనతోపాటు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టిపెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం. ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అనేదానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. స్పందన కార్యక్రమాన్ని మెరుపరిచేలా ఆలోచన చేయాలి. ► సమస్యల పరిష్కారంలో అంకితభావానికి నిదర్శనంగా మనం నిలవాలి: ప్రజల సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృతనిశ్చయంతో మనం ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశాం. మనం అంతా కలిసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సమస్యల పరిష్కారంకోసం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యం పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడం అనే అంవాలపై దృష్టిసారించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలనుకూడా పరిశీలించి అందులో ఎక్కడైనా స్వీకరించదగ్గవి ఉంటే… వాటిని కూడా స్వీకరించాలి. ► పథకాలు కావొచ్చు, రెవిన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావొచ్చు.. ఇలా ఏదైనా కావొచ్చు. కాని ఏ ఒక్కరూ కూడా అర్హులైన వారు మిగిలిపోకూడదు, అలాగే సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోవద్దు అన్నదే దీని ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? అన్నదానిపై ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి. సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో కూడిన అధికారయంత్రాంగ వ్యవస్థకు ప్రజలు చేర్చిన ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే ఉద్దేశంగా ఈ ఆలోచన. స్పందన కార్యక్రమంకన్నా మరింత మెరుగ్గా, సమర్థవంతంగా దీన్ని నిర్వహించాలన్నది ఉద్దేశం. అధికారులంతా కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటివరకూ అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మైక్రోస్థాయిలోకూడా పరిశీలనచేసి.. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. వినతుల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలి అని అధికారులతో సీఎం జగన్ చెప్పారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. -
సమయమే సంపద
కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది. ‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే. ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు. ‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు. జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. ‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్స్టాయ్. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!! ‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు. –వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో..
Cristiano Ronaldo Creates History By Scoring 10th International Hat Trick: పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా మంగళవారం లక్సెంబర్గ్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హ్యాట్రిక్ గోల్స్(10 సార్లు) సాధించిన తొలి ఫుట్బాలర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా రొనాల్డో తన కెరీర్లో 58 హ్యాట్రిక్లు సాధించి, సమకాలీన ఫుట్బాలర్స్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా, రొనాల్డో ఈ ఏడాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక మ్యాచ్లు(182), అత్యధిక గోల్స్(115), అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రక్స్(10) వంటి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
‘పది హ్యాట్రిక్కుల’ మొనగాడు.. అదిరిపోయే డీల్
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్బాల్ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. కనివిని ఎరుగని రీతిలో పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి సంచలనానికి తెర తీశాడు ఈ ఫుట్బాల్ మొనగాడు. యూరోపియన్ క్వాలిఫైయర్స్(UEFA Champions League) టోర్నీలో భాగంగా.. మంగళవారం పోర్చుగల్ తరపున రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో లగ్జెంబర్గ్ 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్తోనూ వార్తల్లోకెక్కాడు మరి. సింగపూర్ వ్యాపారదిగ్గజం, వాలెన్షియా(స్పెయిన్) ఫుట్బాల్ క్లబ్ ఓనర్ పీటర్ లీమ్కి రొనాల్డోకి చాలాకాలంగా దోస్తీ ఉంది. గతంలో లిమ్కు చెందిన మింట్ మీడియా ద్వారా రొనాల్డో చిత్రాల వ్యాపారం కూడా జోరుగా సాగించింది. ఈ తరుణంలో జూజూజీపీ అనే అనే ప్లాట్ఫామ్ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. ఫుట్బాల్, టెక్నాలజీ, కమ్యూనికేషన్.. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్లాట్ఫామ్ పని చేస్తుండడం విశేషం. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ (తన ఏడాది సంపాదనలో 30 శాతం విలువ చేసే రెమ్యునరేషన్!) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇకపై ఫుట్బాల్ని జనాలు చూసే విధానం మారుతుంది’ అంటూ ఓ స్టేట్మెంట్ను జాయింట్గా రిలీజ్ చేశారు రొనాల్డో-లీమ్. పోర్చ్గల్ కెప్టెన్ అయిన 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో.. ఈమధ్య కాలంలో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. కెరీర్ మొత్తంగా యాభై ఎనిమిదిసార్లు హ్యాట్రిక్ గోల్స్, పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఫిఫా లెక్కల ప్రకారం.. 182 మ్యాచ్ల్లో 115 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు సంపాదనలోనూ సమవుజ్జీగా భావించే అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీని దాటేసి.. 2021-22 సీజన్కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫుట్బాలర్గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. ఏడాదికి రొనాల్డో 922 కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ గణాంకాలు చెప్తున్నాయి. Unlucky 😢 What a bicycle kick 😭#CristianoRonaldo #CR7 #bicyclekick pic.twitter.com/18EVZ34BWo — Habibulla Sonet (@HabibullaSonet) October 12, 2021 చదవండి: ఐస్బాత్లో రొనాల్డొ చిందులు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు
రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్బాల్ మాంత్రికుడు సునీల్ ఛెత్రి. దోహా: సోమవారం 2022 ఫిఫా వరల్డ్కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత ఫుట్బాల్ జట్టు 2-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా సునీల్ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్బాల్ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి. ప్రస్తుతం ఈ లిస్ట్లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ(72)గోల్స్తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్కి చేరాడు. ఇక ఆల్టైం హయ్యెస్ట్ టాప్ 10 గోలర్స్ లిస్ట్లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75) సాధిస్తే సరిపోతుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్ అర్హత కోసం భారత్ ఫుట్బాల్ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్ లిస్ట్లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం. చదవండి: భారత్ పరాజయం Goals speak louder than words 🙏#IndianFootball #NationalTeam #JB6 #WCQualifiers pic.twitter.com/u4iOUzKwGa — Indian Football Team for World Cup (@IFTWC) June 7, 2021 -
పీలేను దాటిన క్రిస్టియానో రొనాల్డో...
ఫుట్బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ జట్టు కెప్టెన్, యువెంటస్ క్లబ్ (ఇటలీ) స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానానికి చేరుకున్నాడు. 757 గోల్స్తో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ దిగ్గజం పీలేను మూడో స్థానానికి నెట్టిన రొనాల్డో 758 గోల్స్తో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటలీ ప్రొఫెషనల్ లీగ్ సెరియె ‘ఎ’లో భాగంగా ట్యూరిన్లో యుడినెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో యువెంటస్ 4–1తో గెలిచింది. ఈ మ్యాచ్కు ముందు 756 గోల్స్తో మూడో స్థానంలో ఉన్న రొనాల్డో రెండు గోల్స్ చేసి పీలేను దాటి ముందుకెళ్లాడు. రొనాల్డో ప్రొఫెషనల్ లీగ్స్లో 656 గోల్స్... దేశం తరఫున ఆడుతూ 102 గోల్స్ చేశాడు. అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 759 గోల్స్తో జోసెఫ్ బికాన్ (చెక్ రిపబ్లిక్) టాప్ ర్యాంక్లో ఉన్నాడు. మరో రెండు గోల్స్ చేస్తే రొనాల్డో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా కొత్త రికార్డు లిఖిస్తాడు. -
2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..
కొత్త సంవత్సరం వస్తుందనగానే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మనలో చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు.. చేస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. న్యూఇయర్ రిజల్యూషన్ పెట్టుకోవడం అన్నది పరిపాటి. వీటిని కచ్చితంగా పాటించేవాళ్లు కొందరైతే.. 31న ఒట్టు పెట్టుకుని.. ఒకటో తేదీ సరికి దాన్ని గట్టు మీద పెట్టేసేవాళ్లు మరికొందరు.. మన సంగతి అలా ఉంచితే.. నిత్యం బిజీబిజీగా గడిపే ప్రముఖులు ఈసారి ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 2021లో స్వదేశీ వస్తువులకే ‘సై’ అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సొంతూళ్లో ఇల్లు కట్టుకోవడమే ఈ ఏడాది టార్గెట్ అన్న కామ్రేడ్ ఎవరు? హరీశ్రావు ఏం చేస్తానన్నారు? సీఎస్ ఏం రాస్తారన్నారు? ఇంతకీ కొత్త ఏడాదిలో డీజీపీ మహేందర్రెడ్డి టార్గెట్ ఏమిటి? లోకల్కేవోకల్.. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లోకల్–వోకల్ నినాదం ఇచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని 2021లో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయించా. రోజూ ఉదయం గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. సమతుల ఆహారం నేను తీసుకుంటుంటాను. కొత్త ఏడాదిలో ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాను. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. – రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటిదాక చదివా.. ఇక రాస్తా కొత్త సంవత్సరంలో బాగా పుస్తకాలు చదవడంతో పాటు పుస్తకాలు రాయడాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న. మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పేరుతో ఇప్పటికే రాసినా.. వాటిని గూగుల్లో ఎవరైనా చూడవచ్చు. ఈ ఏడాది అభివృద్ధి అనే అంశంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నా. అంతేకాదు.. ఆరోగ్యంపై మరింత ఫోకస్గా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యాయామం చేయడం ప్రారంభిస్తా. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హెల్త్ అండ్ ఫిట్నెస్పైనే.. శరీరం ఫిట్గా ఉంటే ఎలాంటి వ్యాధినైనా, విపత్తునైనా ఎదుర్కోగలుగుతాం. మానవాళిపై కరోనా వైరస్ విసిరిన పంజా మన ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పింది. అందుకే, కొత్త సంవత్సరంలో హెల్త్ అండ్ ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నాతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడతా. – డీజీపీ ఎం.మహేందర్రెడ్డి రెండు మూడు ఉన్నాయి.. నాకు రెండు, మూడు లక్ష్యాలు ఉన్నాయి. సహజసిద్ధమైన అడవులు, సుందర ప్రదేశాలతోపాటు నదుల వెంట పయనిస్తూ చేసే ప్రయాణం నాకెంతో ఇష్టం. అందుకే ప్రత్యేకమైన అటవీ, వృక్ష సంపదకు, సముద్ర జీవనానికి కేరాఫ్ అయిన అండమాన్, నికోబార్ దీవులను ఈ కొత్త సంవత్సరంలో తప్పక విజిట్ చేస్తాను. ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కల్పిత సాహిత్యం మరింత ఎక్కువ చదవాలనుకుంటున్నాను. – ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ సిక్స్ డేస్ ఏ వీక్.. ఈ ఏడాది తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నది నా లక్ష్యం. గతేడాది అనుకున్నా.. సాధ్యమవలేదు.. ఈసారి మాత్రం పక్కా.. శారీరక దృఢత్వంతోనే మానసిక సంకల్పం కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అంతేకాదు.. ఆత్మవిశ్వాసంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.. – స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నేను.. నా రెహాన్.. ఈ బిజీబిజీ పనుల్లో నేను గ్రహించనే లేదు.. నా కొడుకు రెహాన్ పెద్దవాడు అయిపోతున్నాడు. వాడికిప్పుడు 12 ఏళ్లు. ఈ కొత్త ఏడాది వాడికి బెస్ట్ ఫ్రెండ్గా మారాలని నిర్ణయించుకున్నా.. ఈ సంవత్సరం ఎలా ఉందో చూశాం. అందుకే 2021లో ఫిట్నెస్ మీద ఫోకస్ పెడతా. వ్యాయామానికి మరింత టైం కేటాయిస్తాను. – సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ ఎల్ఎల్ఎం పూర్తి చేయాలి 2015లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం కోసం అడ్మిషన్ తీసుకున్నా. అయితే పని ఒత్తిడి నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయా. 2021లో అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదును మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. – రాచకొండ సీపీ మహేష్ భగవత్ బోలెడు పుస్తకాలు చదవాలి ఇప్పటివరకు వీకెండ్లో ఒక పుస్తకం మాత్రమే చదివేవాడిని. 2021లో మాత్రం ప్రతీ వీకెండ్లో బోలెడన్ని పుస్తకాలు చదవాలని డిసైడ్ అయ్యా. బోలెడన్ని అంటే కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా చదవాలి. గతంలో మూడు నెలలకోసారి సెలవులపై దేశ విదేశాలకు టూర్ వెళ్లేవాడిని. కొత్త సంవత్సరంలో మాత్రం కనీసం రెండు నెలలకోసారి వారం రోజులపాటు సెలవులపై వెళ్లాల్సిందే. – సన్షైన్ ఎండీ డా. గురువారెడ్డి లాస్ట్ ఇయర్లా చేయను.. అందరూ తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని కోవిడ్ పరిస్థితులు నొక్కి చెప్పాయి. నేను చాలా కాలంగా యోగా చేస్తున్నా.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వల్ల నాలుగు నెలల నుంచి చేయడం లేదు. ఈమారు గత ఏడాదిలా కాదు.. యోగాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అలాగే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. – మంత్రి టి.హరీశ్రావు ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటారు. అందుకేవ్యక్తిగత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నా. అలాగే నా జీవితంలో గ్రీన్ ఇండియా చాలెంజ్కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో లెఫ్టిజమ్, రైటిజం అంటూ అనేక ఇజాలు వింటూ వచ్చాం. కానీ రాబోయే రోజుల్లో అంతా గ్రీనిజమే. – ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 5 కి.మీ. వాకింగ్ మస్ట్.. నాకు వాకింగ్ చేసే అలవాటు ఉంది. అయితే.. రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలా చేయను. 2021లో శరీర దారుఢ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక నడక మానే ప్రసక్తే లేదు. రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 5 కిలోమీటర్లు తగ్గకుండా నడుస్తా.. వ్యక్తిగతంగా కొత్త సంవత్సరంలో నేను నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇదే.. – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఊర్లో ఓ ఇల్లు ఈ మధ్య చలో సొంతూరు నినాదం పెరుగుతోంది. నాక్కూడా సొంతూళ్లో ఇల్లుండాలనే కోర్కె బలంగా ఉంది. అమెరికాలో వున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి.. మన పద్ధతులు చూడకుంటే.. మనతో మమేకం కాలేరు.. అందుకే మేం కూడా ఊర్లో ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక అభ్యుదయ సంగీతం , అన్నమయ్య కీర్తనలు , ఫ్లూట్ మ్యూజిక్ నాకిష్టం.. అవి వింటూ.. అలా మనవళ్లతో కాలక్షేపం చేయాలని ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ -
ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!
వాషింగ్టన్: అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిౖకైన కమల హ్యారిస్ పనిచేయాలనుకుంటున్నారని ఆయన బృందం వెల్లడించింది. కోవిడ్–19 నియంత్రణ, మళ్లీ అభివృద్ధి పట్టాల పైకి ఆర్థిక రంగం, వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల అంతం, వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం.. ఇవే బైడెన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించింది. అధికార మార్పిడి విధుల్లో ఉన్న బైడెన్ బృందం ఈ విషయాన్ని తమ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సమగ్ర వ్యూహంతో ఈ లక్ష్యాలను సాధించాలని బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించడం తక్షణ విధిగా బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. వైరస్ వల్ల కుదేలైన కుటుంబాలను, చిన్న వ్యాపారాలను, బాధితులను, కోవిడ్–19పై పోరాడుతున్న యోధులను పరిరక్షించడానికి ప్రాథాన్యం ఇస్తున్నట్లు వివరించింది. కరోనా నియంత్రణ తరువాత.. మంచి వేతనాలు లభించే లక్షలాది ఉద్యోగాల కల్పన బైడెన్ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపింది. అత్యుత్తమ అమెరికాను నిర్మించే దిశగా దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు అవసరమైన అన్ని హక్కులు, సదుపాయాలను కల్పించాలని సంకల్పించినట్లు వెల్లడించింది. ఒకవైపు కరోనాను నియంత్రిస్తూనే, మరోవైపు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం జరిగేలా, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల తొలగింపు బైడెన్ ప్రభుత్వ మూడో లక్ష్యమని వివరించింది. అమెరికా సమాజంలో భాగమైన బ్లాక్స్, బ్రౌన్స్ సంక్షేమం, వారి అభివృద్ధి కేంద్రంగా ఆర్థిక వృద్ధి సాగాలనేది నూతన ప్రభుత్వ ఆలోచన అని పేర్కొంది. దేశంలోని అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేసింది. బైడెన్కు ఇప్పుడే ‘విషెస్’ చెప్పం! మాస్కో/బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడేవరకు జో బైడెన్కు శుభాకాంక్షలు తెలపకూడదని రష్యా, చైనా నిర్ణయించాయి. అమెరికా చట్టాలు, నిబంధనల ప్రకారం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు స్పష్టమైన తరువాతే తాము స్పందిస్తామని తెలిపాయి. ఎన్నికలపై తలెత్తిన న్యాయ వివాదాలు పరిష్కారమై, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాతే బైడెన్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందిస్తారని సోమవారం రష్యా ప్రకటించింది. బైడెన్ విజయం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలపని దేశాల్లో చైనా, రష్యాతోపాటు బ్రెజిల్, టర్కీ, మెక్సికో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ఎన్నిక కావడంపై చైనా అధికారికంగా స్పందించలేదు ఈ విషయంలో అంతర్జాతీయ సంప్రదాయాలను పాటిస్తామంది. అక్కడి మీడియా మాత్రం వారి ఎన్నికను నిర్ధారిస్తూ పలు విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది. -
జపాన్ ఫుట్బాల్ లీగ్లో ‘విజిల్’ క్లైమాక్స్
తమిళ సూపర్స్టార్ విజయ్ నటించిన బిగిల్ చిత్రం తెలుగులో విజిల్ అనే పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. ఫుట్బాల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను తెగఆకట్టుకుంటోంది. విజిల్ మూవీ క్లైమాక్స్లో భాగంగా జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో హీరో విజయ్ టీమ్ ప్లేయర్స్ చేసే గోల్స్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అయితే ప్రస్తుతం ‘విజిల్’ క్లైమాక్స్ లోని కొన్ని సీన్స్ జపాన్లో జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్లో కనపడ్డాయి. మంగళవారం జపాన్ ఫుట్బాల్ లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇది కాస్త అటు ఇటుగా విజిల్ సినిమా క్లైమాక్స్ను తలపించింది. మైదానం సెంటర్ పాయింట్ నుంచి ఏకంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడి చేసి ఓ ప్లేయర్ గోల్ సాధించాడు. ఈ షాక్ నుంచి ప్రత్యర్థి జట్టు కోలుకునేలోపే సేమ్ సీన్ రిపీటయింది. కేవలం 90 సెకన్ల వ్యవధిలో ఎవరూ ఊహించని విధంగా గోల్స్ సమర్పించుకోవడంతో ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్పై అభిమానులు మండిపడుతున్నారు. కాగా, కేవలం 90 సెకన్ల వ్యవధిలో రెండు షాకింగ్ గోల్స్ చేసిన ఆ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ‘ఆడు మగాడ్రా బజ్జి.. 90 సెకన్లలో రెండు గోల్స్ చేశాడు’, ‘ఆ గోల్ పోస్టులను ఇంకొంచెం దూరం పెట్టండి లేకుంటే కష్టం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
చేయగలిగిన వాటినే లక్ష్యంగా పెట్టుకోండి...
అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని సాధించలేకపోయామని బాధపడేకంటే జీవితంలో వాస్తవికతకు దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పర్చుకోవడమే చీకూ చింతాలేని, ఆరోగ్యకరమైన ఆనందమయమైన జీవితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా ఆచరణయోగ్యమైన లక్ష్యాలను ఏర్పర్చుకున్న వారే ఆనందంగా ఉండగలుగుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్ మానసిక శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. సంపద, ఆరోగ్యం, అర్థవంతమైన పని, కమ్యూనిటీ, జీవిత లక్ష్యాలు, ఆవ్యక్తిని నడిపించేవారిని బట్టి ఆ వ్యక్తి స్వభావం ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చి చెప్పింది. ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? లేదా అనుకున్నవి సాధించలేనప్పుడు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనే విషయాలు వారు పెట్టుకున్న లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. స్విట్జర్లాండ్లోని జెర్మన్ భాష మాట్లాడే ప్రాంతాల్లోని 18 ఏళ్ళ నుంచి 92 ఏళ్ళ మధ్య వయస్సులో ఉన్న 973 మందిపై చేసిన ఈ సర్వే వివరాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ లో ప్రచురించారు. అధ్యయనంలో పాల్గొన్న సగానికిపైగా మందిని రెండు, మూడేళ్ళ తరువాత కూడా మళ్ళీ సర్వే చేసారు. ఆరోగ్యం, కమ్యూనిటీ, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక సంబంధాలూ, సంపద, కీర్తి ప్రతిష్ట, కుటుంబమూ, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత, అర్థవంతమైన పని తదితర పది అంశాలపై ఈ అధ్యయనం జరిపారు. ఒక వ్యక్తి ఏర్పర్చుకున్న సాధించగలిగే వ్యక్తిగత లక్ష్యాలు ఆ వ్యక్తి శ్రేయస్సుపైనా, భవిష్యత్ ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనుషులు దేనిమీదైనా నియంత్రణ కలిగి ఉన్నప్పుడు, దేన్నైనా సాధించినప్పుడు ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నట్టు, వాళ్ళు ఊహించిన దానికన్నా మంచి జీవితాన్ని అనుభవించినట్టు తేలింది. సామాజిక సంబంధాలకు సంబంధించిన లక్ష్యాలూ, ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు వారి వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోనూ, సామాజిక సంబంధాల విషయంలోనూ సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీవిత లక్ష్యాలూ, వ్యక్తి శ్రేయస్సూ వారి వారి వయస్సుని బట్టి ఆధారపడి ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆయా సందర్భాన్నీ, పరిస్థితిని బట్టీ ప్రజలు తాము సాధించాలనుకునే లక్ష్యాలు ఆధారపడి ఉంటాయి. యువతరం తమ వ్యక్తిగత అభివృద్ధీ, హోదా, ఉద్యోగం, సామాజిక సంబంధాలను ప్రథమ లక్ష్యాలుగా భావిస్తుంటే, వయోజనులు మాత్రం సామాజిక సంబంధాలూ, ఆరోగ్యం తమకు ప్రథమ ప్రాధాన్యత అని అభిప్రాయపడుతున్నారు. -
ఫిఫా 2018: తొలి విజయం రష్యాదే
మాస్కో: తొలి సాకర్ సమరంలో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ ఆరేబియాపై 5-0తో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన రష్యా ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బంతిని పూర్తిగా రష్యా నియంత్రణలో ఉంచుకొని వీలు చిక్కినప్పుడల్లా గోల్స్ చేస్తూ ప్రత్యర్ధి జట్టుపై ఒత్తిడి పెంచింది. ఆట ప్రారంభమైన 11వ నిమిషంలో యూరి గాజీన్స్యీ ఫిఫా ప్రపంచ కప్లో తొలి గోల్ సాధించాడు. అనంతరం 42 వ నిమిషంలో డెనిస్ చెరిషెవ్ మరో గోల్ సాధించాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సరికి 2-0తో రష్యా ఆధిపత్యంలో ఉంది. విరామం అనంతరం రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఇరుజట్లు మరో గోల్ సాధించడనికి చాలా సమయం పట్టింది. అర్టెమ్ డజిబా 70వ నిమిషంలో రష్యాకు మూడో గోల్ అందించాడు. విజయం ఖాయం కావడంతో చివర్లో రష్యా ఆటగాళ్లు చెలరేగారు. డెనిస్ చెరిషెవ్, అలెగ్జాండర్ గోలవిన్లు చెరో గోల్ సాధించడంతో రష్యా ఎనిమిది నెలల తర్వాత విజయాన్ని సాధించింది. దీంతో మ్యాచ్కు ముందు చెవిటి పిల్లి అచిల్లె చెప్పిన జోస్యం నిజమైంది. -
రైతు శ్రేయస్సే ధ్యేయం
బోనకల్ : రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండంలోని లక్ష్మీపురం సహకారం సంఘంలో ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు. బోనకల్ మండలంలో గతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైతుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీపురం సహకార సంఘంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రైతులు ప్రభుత్వ మద్దతుధర క్వింటాకు రూ.1425 నిర్ణయించామన్నారు. దళారుల మాటలు విని మోసపోవద్దన్నారు. అనంతరం ఎంపీ పొంగులేటి మొక్కజొన్న కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబి చైర్మన్ మువ్వా విజయ్బాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మండలాధ్యక్షుడు ఏమూరి ప్రపాద్, జెడ్పీటీసీ బాణోతు కొండ, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య, టీఆర్ఎస్జిల్లా నాయకులు లింగాల కమల్రాజు, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రాంమూర్తి, పార్టీ మండలాధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, ఉమ్మనేని కృష్ణ, యనిగండ్ల మురళి, తమ్మారపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మీ గోల్.. హిట్ అవుతుందా?
లక్ష్యం లేకుండా ఇన్వెస్ట్ చేసేవారు.. గమ్యం లేని ప్రయాణీకులు ఒకటేనట!! అలాగని లక్ష్యాలు నిర్దేశించుకోవడం అంత ఈజీ కాదు. దీనికంటూ ఓ ప్రక్రియ ఉంది. ఏంటా ప్రక్రియ? స్మార్ట్గా ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకోవడం ఎలా? ఒకసారి చూద్దాం... మీ స్నేహితుడో, సహోద్యోగో సడన్గా మిమ్మల్ని ఓ ప్రశ్నడిగాడనుకోండి!! ‘‘భవిష్యత్తులో ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించాడనుకోండి. మీరేం చెబుతారు? మీరేకాదు... చాలామంది చెప్పే జవాబు ఒక్కటే. ‘సంపన్నులుగా ఉండాలనుకుంటున్నాం’ అని. కానీ సంపదంటే ఎంత? ఆస్తులపరంగానా లేక నగదు రూపంలో సంపద సమకూర్చుకోవాలని అనుకుంటున్నారా? ఓ రెండు మూడు ఇళ్లో.. లేదా ఓ పెద్ద ఫాంహౌస్ లాంటిది సంపాదించడమా... లేదా రిటైర్మెంట్ నాటికి రెండు మూడు కోట్లు దగ్గరపెట్టుకోవడమా... లేదా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేరో రూ.50 లక్షలు దాచిపెట్టడమా? మన ఆర్థిక లక్ష్యాలపై మనకు సరైన అవగాహన లేకపోతే.. ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతాయి. కాబట్టే ముందుగా ఆర్థిక లక్ష్యాలు ప్లాన్ చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలి. అప్పుడే సాధించే మార్గాన్ని రూపొందించుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రణాళికను వేసుకోవడానికి కొన్ని స్మార్ట్ సూచనలున్నాయి. అసలు ఆర్థికపరమైనవే కాదు... ఇతరత్రా ఏ లక్ష్యాలకైనా సరే! ఈ అంశాలు జోడిస్తే.. స్మార్ట్ లక్ష్యంగా మారుతుంది. నిర్ధిష్ట సమయమూ ముఖ్యమే... సంపన్నులం కావాలనుకోవడం కూడా లక్ష్యమే కానీ.. కచ్చితమైన స్మార్ట్ గోల్ కాదు. ‘నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను‘ అంటూ ఒక కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కీలకం. ఇక్కడ సంపన్నులుగా కావాలనుకోవడంతో పాటు నిర్ధిష్ట సమయాన్ని కూడా నిర్దేశించుకున్నాం. దీనికి మరికొన్ని అంశాలు కూడా జోడిస్తే స్మార్ట్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లే. అంకెల్లోకి మార్చుకోవాల్సిందే... కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు దానికంటూ ఒక సంఖ్యాపరంగా ఒక అంకెను కేటాయించుకోవాలి. ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను! అనే లక్ష్యానికి అందుకోసం ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారన్నది నిర్దేశించుకోవాలి. అఫ్కోర్స్!! ఇదేమీ చెప్పినంత సులువైన వ్యవహారమేమీ కాదు. భవిష్యత్లో తలెత్తే ఖర్చులను అంచనా వేసుకుని ఎంత మొత్తం అవసరం అవుతుందనేది లెక్కించుకోవడం కష్టమైన వ్యవహారమే. అయితే, దీనికో మార్గం ఉంది. ధరలు పెరుగుతున్న తీరు, వడ్డీ రేట్లు మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ ధరల పెరుగుదల అనేది కూడా ఒకో అంశంలో ఒకో రకంగా ఉంటుంది. ఉదాహరణకు కార్ల రేట్ల పెరుగుదల కన్నా విద్యా వ్యయంలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి భవిష్యత్ ఆర్థిక అవసరాలకు ఎంత మొత్తం కావాల్సి ఉంటుందనేది ఆయా అంశాలను బట్టి లెక్కేసుకోవాలి. కావాలంటే నిపుణుల సలహాను తీసుకోవచ్చు. ఉదాహరణకు మన ఆర్థిక లక్ష్యాలు ఓ రూ.10 లక్షలు పెట్టి కొత్త కారు, రూ.50 లక్షలు పెట్టి సిటీలో ఓ ఇల్లు కొనుక్కోవటం అనుకుందాం. అంటే దేని కోసం ఎంత కావాలి అనేదానిపై ఒక స్పష్టత వచ్చినట్లవుతుంది. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..? స్మార్ట్ ఆర్థిక లక్ష్యాలకు సంబంధించి ఎవరికి వారు వేసుకోవాల్సినవి ఓ మూడు ప్రశ్నలున్నాయి. అవి... ♦ ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకున్నామా? ♦ అవి స్మార్ట్ లక్ష్యాలేనా? ♦ ఆర్థిక లక్ష్యాల ప్రాధాన్య క్రమంలో తగు ప్రణాళికను అమలు చేస్తున్నామా లేదా? ఒకవేళ ఈ మూడింటిలో దేనికైనా సరే సమాధానం ‘లేదు‘ అని గానీ వస్తే.. తక్షణమే ఓ పెన్నూ, పేపరు పట్టుకుని కూర్చోండి. లక్ష్యాలను, గడువును, సాధించేందుకు పాటించాలనుకుంటున్న ప్రణాళికలను రాసి పెట్టుకోండి. నిరంతరం మీ లక్ష్యాలను గుర్తు చేస్తుండేలా సదరు షీట్ ఎదురుగా ఉండేలా చూసుకోండి. క్రమశిక్షణతో పొదుపు, పెట్టుబడులు చేస్తూ అంచెలంచెలుగా లక్ష్యాల సాధన దిశగా ముందడుగు వేయండి. సాధించగలిగేవిగా ఉండాలి.. ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకుంటే సరిపోతుందా? లేదు! లక్ష్యాలు గాల్లో మేడల్లాగా ఉండకూడదు. ఆచరణ సాధ్యమయ్యేవిగా, సాధించగలిగేవిగా కూడా ఉండాలి. ♦ ఆయా ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే నిర్ధిష్ట సమయం కూడా కచ్చితంగా నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు అయిదేళ్లలో కారు కొనుక్కోవాలనుకుంటున్నాను అనో లేదా పదేళ్లలో సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాననో.. ఇలా కొంత గడువు పెట్టుకోవాలి. ♦ మరోవైపు లక్ష్యాల్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక క్రమంలో ఆయా లక్ష్యాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది కూడా నిర్దేశించుకోవాలి. స్వల్పకాలిక లక్ష్యాలు.. ♦ కుటుంబానికి అత్యవసర నిధి ఏర్పాటు ♦ స్కూల్ అడ్మిషన్ సంబంధ ఖర్చులు ♦ ఏదైనా గృహోపకరణం కొనటం... లేదా ఇతరత్రా చికిత్స వ్యయాలు ♦ జీవిత బీమా ప్రీమియంల చెల్లింపు ♦పన్నులపరమైన ప్రణాళికలో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ మధ్యకాలిక లక్ష్యాలు.. ♦ రుణభారం తగ్గించుకోవడం ♦ కుటుంబంతో విహారయాత్రకు వెళ్లటం ♦ మంచి కాలేజీల్లో పిల్లల చదువులు ♦ పెరిగే కుటుంబ అవసరాలు ♦ కొత్త వాహనం కొనుక్కోవడం ♦ ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు దీర్ఘకాలిక లక్ష్యాలు ♦ రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడం (వైద్య ఖర్చులు కూడా కలిపి) ♦ వారసులకు కొంత ఆస్తిని వారసత్వంగా ఇవ్వటం ♦ కుమార్తెల పెళ్లిళ్లు ♦ విశ్రాంత జీవనానికి ఇల్లు లేదా ఫాంహౌస్ లాంటివి కొనటం -
భారత్ 0 దక్షిణ కొరియా 10
ప్యాంగ్యాంగ్ (ఉత్తర కొరియా): ఆసియా కప్ మహిళల క్వాలిఫయింగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు రెండో ఘోర పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 0–10 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. దక్షిణ కొరియా తరఫున లీ జెయుమ్ మిన్ మూడు గోల్స్, జీ సు యున్ రెండు గోల్స్ చేయగా... కాంగ్ యు మి, లీ మిన్ ఎ, లీ యున్ మి, యూ యుంగా, లీ సో డామ్ ఒక్కో గోల్ సాధించారు. ఇదే టోర్నీ తొలి లీగ్ మ్యాచ్లో ఆతిథ్య ఉత్తర కొరియా చేతిలో టీమిండియా 0–8 గోల్స్ తేడాతో ఓడింది. -
లక్ష్యసాధనకు సత్ప్రవర్తన అవసరం
రాజాం: సత్ప్రవర్తనతో మెలిగినప్పుడే జీవితాశయాలు నెర వేరుతాయని విజయవాడకు చెందిన ఆల్ట్రాటెక్ సిమెంట్ జనర ల్ మేనేజర్ కె.వెంకటరామన్ అన్నారు. శుక్రవారం రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో అచీవర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడానికి జీఎంఆర్ ఐటీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. తిరుమల ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్(రాజమండ్రి) డైరెక్టర్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులకు కఠోరదీక్ష, నిరంతర ప్రయత్నాలు ఎంతో అవసరమన్నారు. అనంతరం దేశంలోని ప్రముఖ కళాశాలలు, యూనివర్సిటీలలో పేపర్ ప్రెజెంటేషన్, ప్రోజెక్టు డిజైన్ పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన 110 మంది విద్యార్థులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.రాజామురుగుదాస్, జీఎంఆర్ ఐటీ గవర్నింగ్ కౌన్సిలర్ మెంబర్ డాక్టర్ పీఆర్ దహియా, కన్వీనర్ డాక్టర్ జి.శశికుమార్, డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మా జోరు కొనసాగుతుంది
లియోరి సానే ఇంటర్వూ్య గతేడాది జర్మనీ క్లబ్ షాల్క్ నుంచి 37 మిలియన్ డాలర్లకు మాంచెస్టర్ సిటీ లియోరి సానేను కొనుగోలు చేసింది. తన విలువకు తగ్గట్టుగా ఈ 21 ఏళ్ల మిడ్ ఫీల్డర్ వరుసగా అర్సెనల్, టాటెన్హమ్ జట్లపై గోల్స్ చేసి జట్టును పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేర్చాడు. ఇప్పుడు టాప్లో ఉన్న చెల్సీకన్నా 12 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో వెస్ట్ హామ్తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో యువ సంచలనం సానేపై జట్టు మరోసారి ఆశలు పెట్టుకుంది. జర్మనీ క్లబ్ నుంచి వచ్చాక కీలక సమయంలో ఫామ్లోకి వచ్చినట్టనిపిస్తుంది. ఎట్టకేలకు సరైన ట్రాక్లో పడినట్టు భావిస్తున్నారా? అవును. గాయాల కారణంగా జట్టులోకి రావడం, పోవడం జరిగింది. కానీ ప్రస్తుతం అంతా సజావుగానే ఉంది. మాంచెస్టర్ను సొంత ఇంటిలా భావిస్తున్నాను. రాబోయే నెలల్లో కూడా అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. కొత్త క్లబ్ తరఫున ఆడుతూ గాయాల బారిన పడటం కొంచెం ఇబ్బందే. తొడ కండరాల సమస్య కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి ఫామ్ కోసం చాలా కష్టపడ్డాను. లీగ్లో ఇప్పటిదాకా సిటీ ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. గత వారం టాటెన్హామ్తో అద్భుతంగా ఆడినా చివరికి 2–2తో డ్రా చేసుకోవడం ఎలా అనిపించింది? అవును. ఆ ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా అనిపించింది. నిజానికి ఆ మ్యాచ్ మేమే గెలవాలి. కానీ చివరకు అలా జరగకపోవడం నిరాశపరిచింది. వెస్ట్ హామ్తో జరిగే మ్యాచ్పై ఆ ప్రభావం పడుతుందంటారా? ఫలితంతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. టాటెన్హామ్ మ్యాచ్లో మేం పూర్తి ఆధిపత్యం వహించాం. ప్రథమార్ధం చాలా బాగా ఆడాం. నా చివరి రెండు గేమ్స్లో గోల్స్ సాధించాను. నాతో పాటు మా జట్టు కూడా అదే ఊపును కొనసాగిస్తాం. మాంచెస్టర్ సిటీకి ఆడుతుండడం సంతోషాన్నిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఇంగ్లండ్ జీవితానికి అలవాటుపడ్డారా? అలాగే అనుకుంటున్నాను. మాంచెస్టర్లో నేను నా సొంత ఇంటికన్నా ఎక్కువ హాయిగా ఉన్నాననిపిస్తుంది. జట్టు ఆటగాళ్లు కూడా నాకు ఆ భావన కల్పిస్తున్నారు. ఇతర నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో కలిసి జట్టుకు మంచి విజయాలు అందించాలనే ఆలోచనలో ఉన్నాను. నాకు ఆ సామర్థ్యం ఉందని నమ్ముతున్నాను. టైటిల్ రేసులో ఇప్పటిదాకా మీ జట్టు ప్రయాణం ఎలా ఉందని అనుకుంటున్నారు? ప్రతీ జట్టు ఉత్తమ ఆటతీరుతో పాయింట్ల కోసం పోరాడుతోంది. అన్ని జట్లు మంచి పరిణతి సాధించాయి. సీజన్ ఆరంభంలో చాలా మంది మేం లీగ్ను గెలుచుకుంటామని చెప్పారు. ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొంటామనే విశ్వాసం ఉంది. -
కళింగ లాన్సర్స్కు రెండో విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో కళింగ లాన్సర్స్ 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. లాన్సర్స్ జట్టు తరఫున గ్లెన్ టర్నర్ నాలుగు గోల్స్ చేయడం విశేషం. రాంచీ రేస్ జట్టుకు సర్వన్జిత్ సింగ్ రెండు గోల్స్ అందించాడు. మంగళవారం జరిగే మ్యాచ్లో దబంగ్ ముంబై జట్టుతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ తలపడుతుంది. -
అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి
- అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి - దిశ చైర్మన్, ఎంపీ మురళీమోహన్ కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కల్పిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని దిశ కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు ఎం.మురళీమోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక కమిటీ (దిశ) సమావేశం కమిటీ చైర్మన్, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన జరిగింది. 17 శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలు, ప్రణాళికల పురోగతిని కమిటీ విస్తృతంగా సమీక్షించి ఆయా అంశాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు జారీ చేసింది. సమావేశంలో తొలుత గ్రామీణ నీటి సరఫరాపై జరిగిన చర్చలో జిల్లాలో దశాబ్దాల క్రితం నిర్మించిన తాగునీటి పథకాల పైపులైన్ల స్థానంలో కొత్తవాటిని చేపట్టాలని, పెరిగిన జనాభా, ఆవాసాలకు అనుగుణంగా ఓవర్హెడ్ ట్యాంకులు ప్రతిపాదించాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కోరారు. విద్యాశాఖ సమీక్షలో మధ్యాహ్న భోజన పథకం కింద పోషక విలువలు లేని చిన్న గుడ్లు సరఫరా అవుతున్నాయని, 50 నుంచి 60 గ్రాములు ఉండే నాణ్యమైన గుడ్లు సరఫరా జరిగేలా చూడాలని రాజహహేంద్రవరం మున్సిపల్ చైర్పర్సన్ పంతం రజనీ శేషసాయి కోరారు. నిధుల కేటాయింపున్నా పాఠశాల వంట షెడ్ల నిర్మాణాలు జరగకపోవడం పట్ల ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని పనులు తనకు అప్పగిస్తే కేటాయించిన నిధులతోనే షెడ్లు కట్టి చూపిస్తానన్నారు. విపక్షాల గళం... పాఠశాలలో స్వీపర్లను నియమిచారు కాని గడిచిన మూడు నెలల జీతాల చెల్లింపులు లేవని, దీంతో వారు పనిచేయడం మానివేశారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.రూరల్ హెల్త్ మిషన్ పరంగా గ్రామాల్లో చేపడుతున్న శానిటేషన్పై పర్యవేక్షణ కొరవడిందని ఎమ్మెల్యే చిర్ల పేర్కొన్నారు. ఏజెన్సీ పరిధిలో ఆరోగ్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. ముంపు మండలాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ సమీక్షలో వ్యవసాయ యాంత్రీకరణ కింద గిరిజన రైతులకు పవర్ టిల్లర్లకు బదులు పెద్ద ట్రాక్టర్లు సరఫరా చేయాలని సూచించారు. పంచాయతీ శాఖ సమీక్షలో పన్నుల రిజవిజన్ పై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలోను, కార్పొరేట్ కళాశాలల నుంచి పన్నులు వసూలు చేయడంలోను అధికారుల వైఫల్యాన్ని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యకం చేశారు. విద్యుత్తు శాఖ సమీక్షలో ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం అందించడంలో ఆ శాఖాధికారులు వైఫల్యంపై ఎంపీ తోట నరసింహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, పులవర్తి నారాయణమూర్తి, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 80 శాతం సభ్యులు గైర్హాజర్... కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై సమగ్ర చర్చ జరిగే సమావేశానికి సుమారు 80 శాతం మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి పది మందే హాజరయ్యరు. ఇతర ప్రజాప్రతినిధుల హాజరు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. పది గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.45 గంటలకు ప్రారంభమయింది. సుమారు 45 నిమిషాలపాటు సభ్యుల రాక కోసం కమిటీ చైర్మన్ వేచి ఉన్నారు. -
మన అమ్మాయిలదే ‘దక్షిణాసియా’
నాలుగోసారి ‘శాఫ్’ ఫుట్బాల్ టైటిల్ నెగ్గిన భారత్ సిలిగురి: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత అమ్మాయిలు నాలుగోసారి దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) టైటిల్ను సొంతం చేసుకున్నారు. బంగ్లాదేశ్తో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 12వ నిమిషంలో దాంగ్మీ గ్రేస్ చేసిన గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అయితే 40వ నిమిషంలో సిరాత్ జహాన్ గోల్తో బంగ్లాదేశ్ స్కోరును 1–1తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో భారత అమ్మాయిలు జోరు పెంచారు. 60వ నిమిషంలో సస్మితా మలిక్ గోల్తో టీమిండియా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 67వ నిమిషంలో ఇందుమతి గోల్తో భారత్ 3–1తో ముందంజ వేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్ 2010, 2012, 2014లలో కూడా ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మొత్తానికి ఈ టోర్నీ చరిత్రలో భారత్ అజేయంగా నిలిచింది. 18 మ్యాచ్ల్లో గెలిచి, మరో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. -
రికార్డు విజయం ఖాయం
థియాబౌట్ ఇంటర్వూ్య ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) తాజా సీజన్లో చెల్సీ గోల్ కీపర్ థియాబౌట్ కౌర్టియస్ తన కెరీర్లోనే అత్యంత భీకర ఫామ్లో కొనసాగుతున్నాడు. ప్రత్యర్థుల గోల్స్ ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలవడంతోపాటు 13 వరుస విజయాల రికార్డును తమ జట్టు సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెల్సీ గురువారం టాటెన్హామ్తో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో చెల్సీకి మరో విజయం ఖాయమని కౌర్టియస్ భావిస్తున్నాడు. ఆరంభంలో కాస్త కష్టపడినా ప్రస్తుతం మీ జట్టు విజయపథంలో దూసుకెళుతోంది. ఈ అద్భుత ప్రయాణం ఎలా అనిపిస్తోంది? మేం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం అంతా బాగానే సాగుతోంది. పాయింట్ల పరంగానూ మేం టాప్లో ఉన్నాం. అయితే మేమింకా సహనంతో ఉండడంతో పాటు కష్టపడాల్సిందే. టాటెన్హామ్తో పోటీ అంత సులువేమీ కాదు. ఆ తర్వాత మా మ్యాచ్ లీస్టర్తో ఉంటుంది. రెండూ కఠిన జట్లే. కచ్చితంగా చెల్సీ అప్రమత్తంగా ఉండాల్సిందే. గతేడాదిలో మీ జట్టు ఈపీఎల్ టైటిల్ గెలవడం అందరికీ అసాధ్యంగా అనిపించింది. ఇప్పుడు మీరే ఫేవరెట్లుగా ఉన్నారు. దీన్ని ఎలా అంచనా వేస్తారు? 2015–16 సీజన్ మాకు నిరాశ కలిగించింది. అయితే తాజా విజయాలతో మేం ఇప్పుడు మెరుగ్గా ఉన్నాం. అప్పటి పాయింట్లతో పోలిస్తే ఇప్పుడు మేం చాలా సాధించి టాప్లో ఉన్నాం. కానీ ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా పోరాడాల్సి ఉంది. చెల్సీ వరుసగా 13 విజయాలతో దూసుకెళుతోంది. ఈ సమయంలో ప్రత్యర్థులకు మీరు నాలుగు గోల్స్ మాత్రమే ఇవ్వగలిగారు. ఎలా అనిపిస్తోంది? నిజంగా ఇది అద్భుతమే. శిక్షణ సమయంలో మేం పడిన కఠిన శ్రమకు ఫలితమిది. కచ్చితంగా మేం మరింత పటిష్టంగా ప్రత్యర్థి జట్లకు పోటీనిస్తాము. జట్టులో నెలకొన్న మంచి వాతావరణం వల్లే ఇది సాధ్యమైంది.. -
కష్టపడితే టైటిల్ గెలుస్తాం
జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ ఇంటర్వూ్య మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్. స్వీడన్కు చెందిన ఈ ఆటగాడు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో విశేషంగా రాణిస్తున్నాడు. 26 మ్యాచ్ల్లో 17 గోల్స్ చేసిన ఇబ్రహిమోవిచ్ వయస్సు 35 అయినా తన దూకుడుకు 20 ఏళ్లే అంటున్నాడు. తన దృష్టిలో వయస్సనేది కేవలం ఒక అంకెననీ... దాని గురించి బెంగే లేదన్నాడు. ఫిట్గా ఉంటే తను 50 ఏళ్లయినా ఆడగలనని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో 26 మ్యాచ్లాడిన మీరు కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి తీసుకోవచ్చుగా? నాకెందుకు విశ్రాంతి. నేనొచ్చిందే ఆడేందుకు. నేనిప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా తాజాగా మైదానంలోకి దిగుతున్నాను. ఈ ఫిట్నెస్నే ఇకముందు కొనసాగించాలని... మరిన్ని మ్యాచ్లాడాలని ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తున్నాను. గతేడాది (2016) మీ ప్రదర్శన బాగుంది. ఈపీఎల్ సహా ఇతర టోర్నీలు కలిపి చూస్తే ఇప్పటికే 50 గోల్స్ చేశారు. ఇదే జోరు కొనసాగిస్తారా? నిజమే. నా ఆటతీరుపట్ల సంతృప్తిగానే ఉంది. కానీ గోల్స్ ఒక్కటే నా లక్ష్యం కాదు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తాను. జట్టు ట్రోఫీ గెలిచేందుకు ఎలాంటి పాత్రయినా పోషిస్తాను. ఎందుకంటే ఒక ఆటగాడు గోల్స్పైనే దృష్టిపెట్టాడంటే తనొక్కడే ఫోకస్ కావాలని లక్ష్యం అందులో కనిపిస్తుంది. కానీ నేను మాత్రం అలా కాదు. కొత్త ఏడాదిలో మీరేమైనా లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? ఈ ఏడాది నేను మైదానంలో మరింత మెరుగైన సహాయక పాత్ర పోషించాలనుకుంటున్నాను. సహచరులు గోల్స్ చేసేందుకు చురుగ్గా స్పందించేందుకు కసరత్తు చేస్తున్నాను. గోల్పోస్టే లక్ష్యంగా బంతిని వేగంగా పాస్ చేయడం ద్వారా సహచరుల స్కోరింగ్ కూడా పెరుగుతుంది. మీరు టైటిల్ రేసులో ఉన్నారా? కష్టపడితే రేసులోకి వస్తాం. ముందుగా మేం బాగా ఆడాలి. అలాగే ప్రత్యర్థి జట్లు పొరపాట్లు చేస్తే వాటి నుంచి లబ్దిపొందే అవకాశాలను మెరుగుపర్చుకుంటేనే మళ్లీ గాడిన పడతాం. అంతిమంగా... నా జట్టుకు టైటిల్ అందించడమే నా లక్ష్యం. -
ఢిల్లీ డైనమోస్ ఘనవిజయం
న్యూఢిల్లీ: మార్సెలో పెరీరా మూడు గోల్స్, గాడ్జే రెండు గోల్స్ చేయడంతో... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ జట్టు 5-1 తేడాతో ఎఫ్సీ గోవాను మట్టికరిపించింది. 12 మ్యాచ్లాడిన ఢిల్లీ 20 పారుుంట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. -
భారత్కు తొలి గెలుపు
మెల్బోర్న్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్లో భారత పురుషుల హాకీ జట్టుకు తొలి విజయం దక్కింది. గురువారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్లో చివరి క్వార్టర్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు 4-2తో మలేసియాపై నెగ్గింది. నికిన్ తిమ్మయ్య (24, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... పెనాల్టీ కార్నర్ను రూపిందర్ పాల్ సింగ్ (31వ ని.) గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. చివర్లో ఆకాశ్దీప్ (56) చేసిన గోల్తో భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించింది. శనివారం జరిగే మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్తో తలపడుతుంది. తమ తొలి మ్యాచ్లో ఆసీస్ చేతిలో భారత్ 2-3 గోల్స్తో ఓడింది. గోవాపై కోల్కతా విజయం ఫటోర్డా: తమ చివరి మూడు మ్యాచ్లను డ్రాగా ముగించిన అట్లెటికో డి కోల్కతా జట్టు గురువారం జరిగిన మ్యాచ్లో ఎఫ్సీ గోవాపై 2-1తో విజయం సాధించింది. కోల్కతా నుంచి బెలెన్కోసో (28), పియర్సన్ (90) గోల్స్ చేయగా గోవా నుంచి మందర్ దేశాయ్ (80) ఏకై క గోల్ సాధించాడు. -
అగ్రస్థానంలో ఢిల్లీ డైనమోస్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పారుుంట్ల పట్టికలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ జట్టు అగ్రస్థానానికి చేరింది. శుక్రవారం కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 2-0తో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నుంచి లూరుుస్ (56వ నిమిషంలో), పెరీరా (60) గోల్స్ చేశారు. ప్రథమార్ధంలో ఇరు జట్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో గోల్స్ నమోదు కాలేదు. అరుుతే ద్వితీయార్ధం మాత్రం స్థానిక అభిమానుల మద్దతుతో ఢిల్లీ చెలరేగింది. నాలుగు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. -
భారత్, పాక్ చరిత్రను కుదించారు
ఎఫ్ఐహెచ్ నిర్వాకం కౌంటన్ (మలేసియా): భారత్, పాకిస్తాన్కు సంబంధించి ఎలాంటి క్రీడ అరుునా నరాలు తెగే ఉత్కంఠ రేగడం ఖాయం. హాకీ మ్యాచ్లు కూడా ఇందుకు మినహారుుంపు కాదు. గత ఆరు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య 166 మ్యాచ్లు జరగారుు. అరుుతే ఘనచరిత్ర ఉన్న రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ల సంఖ్యను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తక్కువ చేసి చూపింది. ఎఫ్ఐహెచ్కు చెందిన టోర్నమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డాటా ప్రకారం ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లు 47 మాత్రమేనట. ఆసియా చాంపియన్స ట్రోఫీ నిర్వాహకులు తాజా జాబితాను జట్లకు పంపి ణీ చేశారు. ఓవరాల్గా భారత్ 321 గోల్స్ చేయగా దీంట్లో మాత్రం 98 మాత్రమే చేసినట్లు చూపారు. -
బెంగళూరు ఎఫ్సీ సంచలనం
బెంగళూరు: ఏఎఫ్సీ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత్కు చెందిన బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి భారత క్లబ్గా బెంగళూరు ఎఫ్సీ రికార్డు సృష్టించింది. బుధవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్లో (రెండో రౌండ్) బెంగళూరు 3-1 తేడాతో మలేసియా జట్టు, డిఫెండింగ్ చాంపియన్ జొహొర్ దారుల్ తక్జీమ్పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ సెమీస్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దాంతో ఓవరాల్ స్కోరింగ్లో బెంగళూరు 4-2తో ఆధిక్యం ప్రదర్శించి తుది పోరుకు అర్హత సాధించింది. జట్టు తరఫున సునీల్ ఛెత్రి (41, 66వ ని.)రెండు గోల్స్ చేయగా, జువానన్ (75వ నిమిషం) మరో గోల్ సాధించాడు. జొహొర్ జట్టు ఆటగాడు సఫీఖ్ రహమాన్ (11వ నిమిషం) ఏకై క గోల్ నమోదు చేశాడు. ఫైనల్లో బెంగళూరు ఎఫ్సీ...అల్ ఖువా అల్ జవియా (ఇరాక్ ఎరుుర్ఫోర్స్ క్లబ్) జట్టుతో తలపడుతుంది. -
లక్ష్యాలు సాధించకుంటే చర్యలు!
డ్వామా సిబ్బందికి కలెక్టర్ హెచ్చరిక గుంటూరు వెస్ట్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, లేకుంటే విధుల నుంచి తొలగించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే డ్వామా సిబ్బందిని హెచ్చరించారు. పనితీరు మెరుగుపర్చుకుని ప్రజల అభివృద్ధిని కాంక్షించేలా విధులు నిర్వహించాలని ఎంపీడీవోలకు సూచించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులు, నీటికుంటలు, ఇంకుడు గుంతలు, వర్మీ కంపోస్టు యూనిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్టీఆర్ జలసిరి, అంగన్వాడీ భవనాల నిర్మాణం, సామాజిక మొక్కల పెంపకం తదితర అంశాలపై జిల్లాపరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. పల్నాడు ప్రాంతంలోని అనేక మండలాలు ఉపాధి హామీ పనులు చేపట్టడంలో వెనుకబడి ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని వాటిని సాధించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో చుండూరు మండలం వెనుకబడి ఉండటానికి కారణమైన ఏవో వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ పులి శ్రీనివాసులును కలెక్టర్ ఆదేశించారు. వర్మీకంపోస్టు యూనిట్లు రానున్న 15 రోజుల్లో మండలానికి కనీసం 150 చొప్పున పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య, డీపీవో కె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు తక్షణం నగదు జమ చేయాలి.. జిల్లా పరిషత్ ద్వారా సుమారు రూ.75 లక్షలు ఎస్సీ కార్పొరేషన్కు జమ కావాల్సి ఉందని, అందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జెడ్పీ ఇన్చార్జి సీఈఓ వెంకటసుబ్బయ్యను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని సంక్షేమ భవన్లో జరిగిన ఎస్సీ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డు సభ్యులైన ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ ద్వారా మంజూరైన వివిధ పథకాలు, లబ్ధిదారుల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి రుణాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘డ్రా’తో గట్టెక్కిన భారత్
హాకీ రియో డి జనీరో: తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న కెనడా జట్టుతో జరిగిన మ్యాచ్ను భారత పురుషుల హాకీ జట్టు 2-2 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ (33వ నిమిషంలో), రమణ్దీప్ సింగ్ (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కెనడా జట్టుకు స్కాట్ టప్పర్ (33వ నిమిషంలో, 52వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. భారత్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లు పూర్తయ్యాయి. మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన భారత్ రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’గా ముగించి ఏడు పాయింట్లతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ను సంపాదించింది. మరోవైపు జర్మనీ తమ చివరి మ్యాచ్లో 2-1తో నెదర్లాండ్స్ను ఓడించి మొత్తం 13 పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్గా నిలిచింది. నెదర్లాండ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అర్జెంటీనా, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్లో అర్జెంటీనా గెలిస్తే... భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. అర్జెంటీనా ఓడిపోతే భారత్ మూడో స్థానంలో, ఐర్లాండ్ నాలుగో స్థానంలో నిలుస్తాయి. మరోవైపు మహిళల హాకీలో భారత జట్టు 0-3తో అమెరికా చేతిలో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. -
క్వార్టర్స్లో చిలీ
* గ్రూప్-డి టాపర్గా అర్జెంటీనా * కోపా అమెరికా కప్ ఫిలడెల్ఫియా: ఆరంభంలోనే ప్రత్యర్థులు గోల్తో ఒత్తిడి పెంచినా... మ్యాచ్ మధ్యలో తమదైన శైలిలో చెలరేగిన డిఫెండింగ్ చాంపియన్ చిలీ జట్టు.. కోపా అమెరికా కప్లో క్వార్టర్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-డి ఆఖరి లీగ్ మ్యాచ్లో చిలీ 4-2తో పనామాపై నెగ్గింది. చిలీ తరఫున ఎడ్వర్డో వర్గాస్ (15, 43వ ని.), అలెక్సిస్ సాంచేజ్ (50, 89వ సె.) చెరో రెండు గోల్స్ చేశారు. మిగుయెల్ కామర్గో (5వ ని.), అబ్డెల్ అరోయ్ (75వ ని.) పనామాకు గోల్స్ అందించారు. ఆట ప్రారంభంలోనే పనామా మిడ్ఫీల్డర్ కామర్గో గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన గోల్ చేశాడు. అయితే మరో పది నిమిషాల్లోనే సాంచేజ్ ఇచ్చిన చక్కని పాస్ను వర్గాస్ చాలా దగ్గర్నించి నెట్లోకి ట్యాప్ చేసి స్కోరును సమం చేశాడు. బ్రేక్కు రెండు నిమిషాల ముందు లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి వర్గాస్ కొట్టిన బంతి; బ్రేక్ తర్వాత ఐదు నిమిషాలకు పెనాల్టీ ఏరియా నుంచి సాంచేజ్ కొట్టిన లాఫ్టెడ్ పాస్లు పనామా గోల్ పోస్ట్ను ఛేదించాయి. 25 నిమిషాల తర్వాత అరోయ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా సాంచేజ్ రెండో గోల్తో చిలీ ఘన విజయం సాధించింది. బొలీవియాపై అర్జెంటీనా విజయం మరో మ్యాచ్లో అర్జెంటీనా 3-0తో బొలీవియాపై గెలిచింది. దీంతో తొమ్మిది పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. ఎరిక్ లామెల్లా (13వ ని.), జీక్వెల్ లావెజ్జి (15వ ని.), విక్టర్ క్యుయేస్టా (32వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఫార్వర్డ్ లియోనల్ మెస్సీ రెండో అర్ధభాగం ఆరంభంలో బరిలోకి దిగాడు. క్వార్టర్ఫైనల్స్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం) 1. అమెరికా X ఈక్వెడార్ శుక్రవారం ఉ. గం 7 నుంచి 2. పెరూ X కొలంబియా శనివారం ఉ. గం 5.30 నుంచి 3. అర్జెంటీనా X వెనిజులా ఆదివారం ఉ. గం 4.30 నుంచి 4. మెక్సికో X చిలీ ఆదివారం ఉ. గం 7.30 నుంచి -
వారియర్స్ను గెలిపించిన జాకబ్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టుకు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ వారియర్స్ 2-0 గోల్స్ తేడాతో రాంచీ రేస్ జట్టును ఓడించింది. ఆట రెండో నిమిషంలోనే జాకబ్ వెటన్ ఫీల్డ్ గోల్ చేశాడు. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్ చేస్తే దానిని రెండు గోల్స్గా పరిగణిస్తారు. దాంతో ఆరంభంలోనే వారియర్స్ జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ను చేయడంలో విఫలమయ్యాయి. బుధవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ వేవ్రైడర్స్తో పంజాబ్ వారియర్స్ తలపడుతుంది. -
భారత్ హ్యాట్రిక్
కాంటన్ (మలేసియా): జూనియర్ పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా మూడో విజయం దక్కింది. చైనాతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో టీమిండియా 4-1తో ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన భారత్ గురువారం జరిగే క్వార్టర్స్లో పూల్ ‘బి’ చివరి స్థానంలో నిలిచిన ఒమన్తో ఆడనుంది. భారత్ తరఫున మన్ప్రీత్ సింగ్ జూని యర్ రెండు గోల్స్ చేయగా, హర్మన్ప్రీత్ సింగ్, అజిత్ పాండే మిగతా గోల్స్ చేశారు. -
వారియర్స్ ‘హ్యాట్రిక్’
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్రైడర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో వారియర్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో నెగ్గింది. పంజాబ్ తరఫున సిరియెల్లో, సునీల్, యూసుఫ్ ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీకి సిమోన్ చైల్డ్ ఏకైక గోల్ అందించాడు. పంజాబ్ 17 పాయింట్లతో లీగ్లో అగ్రస్థానంలో ఉంది. -
‘కళింగ’ శుభారంభం
హాకీ ఇండియా లీగ్ భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) - 2015లో కళింగ లాన్సర్స్ జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై గురువారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్లో లాన్సర్స్ 6-3 గోల్స్ తేడాతో రాంచీ రేస్ను చిత్తు చేసింది. తొలి క్వార్టర్లో కళింగ తరఫున ల్యూకాస్ విలా (9వ నిమిషం), రేస్ తరఫున బారీ మిడిల్టన్ (15వ నిమిషం)లో గోల్స్ చేశారు. అయితే రెండు, మూడు క్వార్టర్స్లో దూకుడుగా ఆడిన కళింగ వరుసగా గోల్స్ చేసింది. ర్యాన్ ఆర్కిబాల్డ్ (17), విక్రమ్ కాంత్ (18), గుర్జీందర్ సింగ్ (37), మన్దీప్ అంటిల్ (58), మొహమ్మద్ ఖాన్ (60) ఈ గోల్స్ చేశారు. మరో వైపు రాంచీ ఆటగాళ్లలో కెప్టెన్ యాష్లే జాక్సన్ (36, 50) ఒక్కడే రెండు గోల్స్ చేశాడు. శుక్రవారం జరిగే మ్యాచ్లలో యూపీ, ఢిల్లీతో... ముంబై, పంజాబ్తో తలపడతాయి. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
నెదర్లాండ్స్పై భారత్ సంచలన విజయం 18 ఏళ్ల తర్వాత తొలి గెలుపు రేపు క్వార్టర్స్లో బెల్జియంతో ‘ఢీ’ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ భువనేశ్వర్: తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన కసినంతా నెదర్లాండ్స్పై తీర్చుకున్న భారత జట్టు సంచలనం సృష్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రపంచ రెండో ర్యాంకర్ నెదర్లాండ్స్తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 3-2 గోల్స్ తేడాతో అద్వితీయ విజయం సాధించింది. నెదర్లాండ్స్పై 18 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి నెగ్గింది. భారత్ తరఫున సునీల్ (33వ నిమిషంలో), మన్ప్రీత్ సింగ్ (47వ నిమిషంలో), రూపిందర్ సింగ్ (49వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు వాన్ డెర్ వీర్డెన్ మింక్ (36వ, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు.మన్ప్రీత్ సింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. చివరిసారి 1996లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ను ఓడించిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆ జట్టుపై 1986 తర్వాత తొలిసారి గెలిచింది. నెదర్లాండ్స్పై విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో మూడు పాయింట్లతో జర్మనీతో సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఈ గ్రూప్లో భారత్కు మూడో స్థానం (-2 గోల్స్) దక్కగా... జర్మనీ (-5 గోల్స్) నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో అర్జెంటీనా 3-0తో జర్మనీపై; ఆస్ట్రేలియా 3-0తో పాకిస్తాన్పై గెలుపొందగా... ఇంగ్లండ్, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ 1-1 వద్ద ‘డ్రా’గా ముగిసింది. -
ఐఎస్ఎల్: రెండు మ్యాచ్లూ ‘డ్రా’లే
మార్గో: ఇండియన్ సూపర్ లీగ్లో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గానే ముగిసాయి. ముంబయి-గోవా, కేరళ-ఢిల్లీల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. విజయాలతో ఊపుమీదున్న ముంబయి సిటీ ఎఫ్సీ జట్టుకు... ఎఫ్సీ గోవా జట్టు ఈ మ్యాచ్లో బ్రేకులు వేసింది. గోవాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్స్ చేసే అవకాశం వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. టోర్నీ ఆరంభం నుంచి సత్తా చాటలేకపోతున్న కేరళ బ్లాస్టర్స్, ఢిల్లీ డైనమోస్ మధ్య కొచ్చిలో జరిగిన మ్యాచ్ కూడా నిరాశజనకంగానే ముగిసింది. గోల్స్ సాధించడంలో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఐఎస్ఎల్లో సోమవారం మ్యాచ్లు లేవు. -
భారత్ గోల్స్ వర్షం
ఇంచియూన్: అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడో ఒకసారి ఆడే అవకాశం లభించే భారత మహిళల ఫుట్బాల్ జట్టు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆసియూ క్రీడల్లో తమ తొలి మ్యాచ్నే అదిరిపోయే స్థాయిలో మొదలుపెట్టింది. సస్మితా వూలిక్, మిడ్ఫీల్డర్ కవులాదేవి ఐదేసి గోల్స్తో చెలరేగడంతో ఆదివారం ఇంచియూన్లో జరిగిన గ్రూప్ ‘ఎ’ వ్యూచ్లో భారత్ 15-0 గోల్స్ తేడాతో వూల్దీవులపై ఘన విజయుం సాధించింది. వ్యూచ్ ఆరంభమైన ఐదు నిమిషాలకే భారత జట్టు ఖాతా తెరిచింది. అక్కడి నుంచి భారత్కు ఎదురే లేకుండా పోరుుంది. బాలా దేవి రెండు గోల్స్ చేయగా... బెంబెమ్ దేవి, ప్రమేశ్వొరీ దేవి, ఆశాలత దేవి ఒక్కో గోల్ సాధించారు. ఈ విజయుంతో భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్తును దాదాపుగా ఖాయుం చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’ నుంచి వుూడు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తారుు. ఇక భారత్ తన తదుపరి వ్యూచ్ను 17న ఆతిథ్య దక్షిణ కొరియూతో ఆడుతుంది. 19న థాయ్లాండ్తో తలపడుతుంది. ఆసియూ క్రీడలు ఈ నెల 19న అధికారికంగా ప్రారంభం కానున్నప్పటికీ.. ఫుట్బాల్ వ్యూచ్లు ఐదు రోజుల వుుందే మొదలయ్యూరుు. -
మహిళలు.. మనీ రాణులు
మహిళలు వంటింటికే పరిమితమన్న మాటలకు కాలం చెల్లి చాలా రోజులయ్యింది. ఆర్థిక రంగం నుంచి అంతరిక్షం దాకా అన్నింటిలోనూ వారు దూసుకెళ్లిపోతున్నారు. ప్రపంచస్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో వన్ మ్యాన్ షో .. సారీ.. వన్ ఉమన్ షో నడిపించేస్తున్నారు. పురుషాధిక్య రంగాల్లో కూడా ఆధిపత్యాన్ని చాటుతున్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ (అరుంధతి భట్టాచార్య), ఐసీఐసీఐ బ్యాంకు (చందా కొచర్), యాక్సిస్ (శిఖా శర్మ) బ్యాంకులకు సారథ్యం వహిస్తున్నది మహిళలే. అంతర్జాతీయంగా సాఫ్ట్డ్రింక్స్ దిగ్గజం పెప్సీకి (ఇంద్రా నూయి), ఇంటర్నెట్ దిగ్గజం యాహూకి (మెరిస్సా మెయర్) నేతృత్వం వహిస్తున్నది వారే. వీరికి ఇంతటి విజయాలెలా సాధ్యమయ్యాయి.. వీటి వెనుక రహస్యాలేమిటి.. మనీ మ్యాటర్స్లో పురుషాధిక్యతను అధిగమించగలగడంలో మహిళల ప్రత్యేకతలేమిటీ? వీటిపైనే ఈ వారం ధనం కథనం. టైమ్ కావొచ్చు, మనీ కావొచ్చు.. మేనేజ్మెంట్ విషయంలో మహిళలే నంబర్వన్. అందుకే, మిగతా విషయాలెలా ఉన్నా ఇంటి ఖర్చుల మేనేజ్మెంటు బాధ్యతలు వారికి అప్పగిస్తుంటారు. పెద్దగా దృష్టి పెట్టం గానీ.. రిస్కులు తీసుకోవడం నుంచి లక్ష్యాలు సాధించడం దాకా మహిళల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని.. లక్ష్యం నిర్దేశించుకోవడం.. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, సాధించడంలో మహిళలు మేటి. అత్యధిక శాతం మహిళలు ఇంటిలోనైనా ఆఫీసులోనైనా.. ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంపైనా, సాధించడంపైనా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే, స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా టాపర్స్లో ఎక్కువశాతం వారే. లక్ష్య సాధనపై దృష్టి కారణంగానే కెరియర్లో కూడా మగవారి కన్నా కాస్త వేగంగా ముందుకెళ్లగలుగుతారు. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమనేది విజయంతో పాటు కాస్త సమయం ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. విద్య ఎంపికలో.. చదువుకు సంబంధించి కోర్సులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు అనుకూలమైనవి, తాము అన్ని విధాలా రాణించేందుకు అవకాశాలు ఉన్న రంగాలను ఎంచుకుంటూ ఉంటారు. మేనేజ్మెంట్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు వారికి ఆల్టైమ్ ఫేవరెట్స్గా ఉంటుంటాయి. ఒక టి, రెండు మార్కులు పోయినా పర్లేదులే అని అబ్బాయిలు లైట్గా తీసుకున్నా.. అమ్మాయిలు మాత్రం ఆ ఒక్క మార్కు కూడా పోకూడదని సీరియస్గానే తీసుకుంటుంటారు. సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. సెల్ఫ్-హెల్ప్.. ఇంటి పనుల విషయంలో చూడండి. పిల్లల డైపర్లు మార్చడం నుంచి నిత్యావసరాలు కొనుక్కుని తెచ్చుకోవడం, బిల్లులు కట్టేసేయడం దాకా అన్ని విషయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వంతంగానే చక్కబెట్టుకుంటుంటారు మహిళలు. వారు సెల్ఫ్-హెల్ప్కి ప్రాధాన్యమిస్తారు. భర్తకో, కుటుంబ సభ్యులకో, స్నేహితులకో పని అప్పజెప్పి.. వారు చేసే దాకా ఎదురుచూస్తూ కూర్చుని సమయం వృదా చేసుకోవడం కన్నా సొంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులకు అప్పజెబితే తమలాగా శ్రద్ధగా చేస్తారో లేదోనన్న సందేహం కూడా దీనికి కొంత కారణం. ఎందుకంటే..మహిళలు పర్ఫెక్షనిస్టులు కూడా. రోజువారీ రికార్డు.. ఆర్థిక విషయాలు ఇంటికి సంబంధించినవైనా.. ఆఫీసుకు సంబంధించినవైనా.. మహిళలు రికార్డు పాటించడంలో పక్కాగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రతీ పైసాకి వారి దగ్గర లెక్క ఉంటుంది. ఇది మగవారికి కాస్త చాదస్తంగా అనిపించినా.. నెల తిరిగేసరికి జమాఖర్చుల పక్కా రికార్డు చూస్తే మరి మాట్లాడటానికి ఉండదు. నేర్చుకోవడానికి ప్రాధాన్యం.. మహిళలు సాధ్యమైనంత వరకూ తప్పులకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ చేసినా దాన్నుంచి నేర్చు కుంటారు. ఒకసారి చేసిన మిస్టేక్ను మరోసారి చేయరు. ఏదైనా డీల్తో లాభం వచ్చిందంటే.. మరింత అధిక టార్గెట్లతో మరోసారి ప్రయత్నిస్తారు. అదే నష్టం వస్తే.. దాన్ని పాఠంగా తీసుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతారు. ప్లాన్ బీ.. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. మరొకటి..ఇలా ప్రతిదానికీ మహిళల దగ్గర ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సరిగ్గా లేకపోయినా.. నచ్చినవి కొనేందుకు సరిపడేంత డబ్బు చేతిలో లేకపోయినా.. అప్పటికప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసేయగలరు వారు. సందర్భం ఏదైనా సరే వారి దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు, చేర్పులను సమర్థంగా చేయగలరు. అప్పులు.. సాధ్యమైనంత వరకూ అప్పు ఊసే ఉండకుండా చూసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతుంటారు. కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని కొనుక్కోవడం కన్నా.. చేతిలో ఉన్నప్పుడే కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే మహిళలు అప్పుల బారిన పడటం కూడా చాలా తక్కువే. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేసేయగల పుష్కలమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ఆఖరు నిమిషంలో కూడా దేన్నయినా సెట్ రైట్ చేయగలిగే సామర్థ్యాలు ఉండటమే ఇందుకు కారణం. రిస్కుకి రెడీ.. మిగతావారు మనకి రిస్కు ఎందుకులే అనుకున్న వాటిని కూడా జంకకుండా చేపట్టగలిగే ధైర్యం మహిళల సొంతం. రిస్కు తీసుకున్నా.. విజయాలు సాధించిన వారి ఉదంతాలు కోకొల్లలు. నష్టపోవాల్సి వస్తుందన్న భయం కన్నా.. విజయంపై ఆశావహంగా ఉండగలగడం, నేర్పుగా వ్యవహరించగలగడం ఇందుకు కారణం. పైగా.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమర్థత కలిగి ఉండటం మరో కారణం. మనీ మేనేజ్మెంట్.. కీలకమైన డబ్బు సంగతికొస్తే.. ఎక్కడ, దేనిపై, ఎంత ఖర్చు చేయాలన్న దానిపై మహిళలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం కన్నా.. దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చుల లిస్టు తక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి విషయంలోనైనా ఆఫీసు విషయంలోనైనా అవసరమనుకున్న వాటిపై తప్ప మిగతా వాటిపై ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. మనీ మేనేజ్మెంట్లో వారి సామర్థ్యం ఇందుకు ఉపయోగపడుతుంది. -
పక్కా వ్యూహంతో లాభాల గోల్స్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రేమికులను నెల రోజుల పాటు అలరించిన ప్రపంచ కప్ తుది దశకి చేరుకుంది. ఈ నెల రోజుల్లోనూ దాదాపు ప్రతి జట్టూ పోటీలో నిల్చేందుకు.. కప్ దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరాడినా కొన్ని సార్లు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నిష్ర్కమించగా.. వరల్డ్ కప్కి ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్పై సెమీ ఫైన ల్స్లో జర్మనీ ఘనంగా గెలిచింది. ఇలాంటి పరిణామాలకు ఆయా టీమ్స్ వ్యూహాలే కారణం. ఎందుకంటే.. మ్యాచ్ జరిగే గంటన్నర సమయంలో సత్తా చాటాలి. గోల్స్ చేయాలి. ప్రత్యర్థిపై గెలుపొందాలి. పటిష్టమైన వ్యూహాలతోనే ఇదంతా సాధ్యపడుతుంది. అలాగే పొదుపు.. పెట్టుబడులైనా పక్కా ప్రణాళిక ఉంటేనే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ దూసుకెడితేనే లక్ష్యాలను (గోల్స్) సాధించగలిగేది. ఇందుకోసం ఫుట్బాల్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అలాంటివే కొన్ని... ఫుట్బాల్ టీమ్లో ఉండే 11 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తుంటారు. ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దూసుకెళ్లే బాధ్యత కొందరిదైతే.. వారికి సహాయం అందించే బాధ్యత మరికొందరిది. గోల్పోస్ట్ను కాపాడుకునే బాధ్యత గోల్కీపర్ది. విజయ సాధనలో వీరందరూ కీలకమే. ఇలా ప్రత్యేకమైన కూర్పుతో.. ప్రత్యర్థి జట్టుపై గెలుపు సాధించేందుకు ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క వ్యూహం ప్రకారం ముందుకెడుతుంది. కొన్నిసార్లు దూకుడుగాను.. మరికొన్ని సార్లు రక్షణాత్మకంగాను ఆడుతూ పరిస్థితికి తగ్గట్లు వ్యూహం మార్చుకుంటూ ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక సాధన కూడా ఇలాంటిదే. ఫుట్బాల్ టీమ్లో రకరకాల ప్లేయర్స్ ఉన్నట్లుగానే మన పెట్టుబడుల పోర్ట్ఫోలియో కూర్పులో కూడా వైవిధ్యం ఉండాలి. పెట్టుబడులకు సంబంధించి ఫిక్సిడ్ డిపాజిట్లనీ, షేర్లనీ, రియల్ ఎస్టేట్ అనీ వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్డీల్లాంటివి రక్షణాత్మకమైనవి కాగా షేర్లులాంటివి కాస్త రిస్కీ సాధనాలు. లక్ష్యాలను సాధించడంలో ఇవన్నీ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. దేనికదే ప్రత్యేకం. అలాగని పోర్ట్ఫోలియోను మరీ షేర్లతో నింపేసినా.. లేదా పూర్తిగా ఎఫ్డీలపైనే ఆధారపడినా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేం. కాబట్టి..ఫుట్బాల్ టీమ్లాగానే పోర్ట్ఫోలియో కూర్పు ముఖ్యం. ఎంత మేర రిస్కు భరించగలం అన్నదాని ఆధారంగా ఏయే సాధనాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆధారపడి ఉంటుంది. సమయం కీలకం.. ఫుట్బాల్ మ్యాచ్ గంటన్నరలో అయిపోతుంది. ఆ గంటన్నరలో ఫలితం తేలకపోతే.. మరికాస్త సమయం మాత్రమే ఉంటుంది. మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంటు ఒక నెలరోజుల్లో ముగిసిపోతుంది. కానీ, ఈ టోర్నమెంటు కోసం టీమ్స్ ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తాయి. ఎన్నెన్నో వ్యూహాలు రూపొందించుకుంటాయి. పెట్టుబడుల తీరు కూడా ఇలాంటిదే. ఉన్న కాస్త సమయంలోనూ రిటైర్మెంట్ వంటి అవసరాలకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవాలంటే దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ధరల పెరుగుదలను మించి సంపదను వృద్ధి చేసే పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. ఇందుకోసం పోర్ట్ఫోలియోలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటికి కొంతైనా చోటు కల్పించాలన్నది నిపుణుల సూచన. అయితే, ఎవరో చెప్పారని గుడ్డిగా పోకుండా వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు కాస్తంత కసరత్తు చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అనుకోని పరిస్థితులకు సంసిద్ధంగా.. ఎంత కసరత్తు చేసి, ఎంతగా సిద్ధం అయినా.. కొన్ని సార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తగ ్గట్లుగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కోస్టారికా జట్టుతో జరిగిన పోటీలో నెదర్లాండ్స్ కోచ్ చేసినదిదే. నిర్ణీత సమయంలో ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటవుట్ తప్పనిసరైంది. ప్రత్యర్థి దాడుల నుంచి గోల్పోస్ట్ను రక్షించుకునే క్రమంలో ప్రధాన గోల్కీపర్ని పక్కనపెట్టి రెండో గోల్కీపర్ క్రూల్ను రంగంలోకి దింపాడు నెదర్లాండ్స్ కోచ్. ప్రధాన గోల్కీపర్ కన్నా క్రూల్ ఎత్తు రెండంగుళాలు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఇదే మ్యాచ్లో టర్నింగ్పాయింట్ అయింది. ఏకంగా 2 గోల్స్ని ఆపి నెదర్లాండ్స్ను సెమీఫైనల్స్కి చేర్చడంలో క్రూల్ కీలకపాత్ర పోషించాడు. పెట్టుబడుల తీరూ అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చేతిలో లేని అంశాల కారణంగా కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు. కాబట్టి, ఎప్పుడైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అప్పటిదాకా అమలు చేసిన ప్రణాళికను సవరించుకుని, కొత్త వ్యూహం అమలు చేయగలిగేలా సంసిద్ధంగా ఉండాలి. పోర్ట్ఫోలియోలు ఇలా.. ఫుట్బాల్ టీమ్లో స్ట్రైకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్ అని ప్లేయర్స్ ఉంటారు. టీమ్లు ఎటాకింగ్ అనీ డిఫెండింగ్ అనీ రకరకాల వ్యూహాలు పాటిస్తుంటాయి. పెట్టుబడుల పోర్ట్ఫోలియోకి దీన్ని అన్వయించుకుంటే.. యుక్తవయస్సులో వారికి ఒకలాగా .. మధ్యవయస్కులకు ఒకలాగా .. రిటైర్మెంట్కి దగ్గర్లో ఉన్న వారికి ఒకలాగా ఉంటుంది. వయస్సు, ఎంత రిస్కు తీసుకోగలం అన్న దాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్ఫోలియో ఆధారపడి ఉంటుంది. యుక్తవయస్సులో ఉన్న వారు కాస్తంత ఎక్కువ రిస్కు తీసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా, మళ్లీ తేరుకుని నిలదొక్కుకునేందుకు వారికి సమయం ఉంటుంది. కాబట్టి యుక్తవయస్సులో ఉన్నవారు.. ఎటాకింగ్ ధోరణిలో తమ పోర్ట్ఫోలియోలో సింహభాగం షేర్లు, ఫండ్స్ లాంటి వాటికి కేటాయించవచ్చు. వాటికి ఊతంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని సురక్షితమైన సాధనాలకు కేటాయించవచ్చు. అదే మధ్యవయస్కులూ.. మరీ ఎక్కువ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడని వారూ పోర్ట్ఫోలియో సమతూకంగా ఉండేలా చూసుకోవచ్చు. షేర్లూ, బాండ్లూ, ప్రావిడెంట్ ఫండ్ లాంటివాటికి తలా కాస్త నిధులు కేటాయించవచ్చు. ఇక రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారు, రిస్కును అస్సలు ఇష్టపడని వారు సురక్షితమైన సాధనాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు. దీని వల్ల పెట్టుబడులకు పెద్దగా నష్టం ఉండదు. అలాగని భారీ రాబడులూ ఉండవు. -
బంతుల్లోనూ కెమెరాలు
రియో: ఈసారి ప్రపంచకప్లో టెక్నాలజీని విసృ్తతంగా వాడుకోబోతున్నారు. గోల్స్ విషయంలో రిఫరీలు తీసుకునే నిర్ణయాలు వివాదం కాకుండా ఉండటం కోసం ఫిఫా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దీని కోసం గోల్లైన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. దీని కోసం ప్రతీ స్టేడియంలో అదనంగా 14 హైస్పీడ్ కెమెరాలను వినియోగించనున్నారు. 7 కెమెరాలను ఒక గోల్పోస్ట్ వైపు, మిగిలిన 7 కెమెరాలను మరో గోల్పోస్ట్ వైపు ఫోకస్ చేస్తారు. వీటిని ప్రధాన కంప్యూటర్కు అనుసంధానిస్తారు. బంతి గోల్లైన్ను దాటిన సెకనులోపే కంప్యూటర్ నుంచి గోల్ అనే సంకేతం వస్తుంది. రిఫరీ ధరించిన ప్రత్యేక వాచ్కు మాత్రమే గోల్ సంకేతం అందుతుంది. అప్పుడు రిఫరీ దాన్ని గోల్గా ప్రకటిస్తాడు. గత ఏడాది బ్రెజిల్లో జరిగిన కాన్ఫెడరేషన్ కప్ సందర్భంగా గోల్లైన్ టెక్నాలజీని వినియోగించారు. ఇక ఈ ప్రపంచకప్లో ఉపయోగిస్తున్న బ్రజూకా బంతుల్లో కూడా కెమెరాలను నిక్షిప్తం చేశారు. సాకర్ బంతుల్లో ఉపయోగిస్తున్న ఈ కెమెరాల ద్వారా కూడా బంతి గోల్ లైన్ దాటిందా లేదా అన్నది తెలిసే అవకాశాలున్నాయి. -
వివాదాలలోనూ మేటి
విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్బాల్లో అందరి మదినీ దోచిన అద్భుత విజయాలెన్నో. ఆటగాళ్ల కళ్లు చెదిరే గోల్స్తో పాటు, గోల్ కీపర్ల విన్యాసాలనెన్నో ఈ మెగా టోర్నీలలో చూశాం. మున్ముందూ చూస్తాం. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు ఈ టోర్నీ వివాదాలకు అతీతంకాదు. ఎన్నో మ్యాచ్లు వివాదాస్పదమయ్యాయి. ఆటగాళ్లు ఫైటర్స్గా మారిన సందర్భాలు ఉన్నాయి. రిఫరీలు చక్రం తిప్పిన సంఘటనలున్నాయి. క్రీడాస్ఫూర్తికి తూట్లు పొడిచిన వారూ ఉన్నారు. మొత్తానికి 84 ఏళ్ల ప్రపంచకప్ ఫుట్బాల్ చరిత్రలో టాప్-5గా పరిగణించే అత్యంత వివాదాస్పద సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. - సాక్షి క్రీడావిభాగం ‘గోల్ కాని గోల్’తో ప్రపంచకప్ (ఇంగ్లండ్ * పశ్చిమ జర్మనీ, 1966) ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటన ఈ ఫైనల్లో నెలకొంది. నిర్ణీత సమయంలో మ్యాచ్ 2-2 గోల్స్తో సమం కాగా, అదనపు సమయానికి అనుమతించారు. 12వ నిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు హర్స్ట్ షాట్ కొట్టగా... బంతి నేరుగా గోల్ పోస్ట్ క్రాస్ బార్ లోపలి వైపు తగిలి లైన్ బయటపడింది. అయితే ఆ బంతి లైన్ క్రాస్ అయిందీ.. లేనిదీ రిఫరీకి అంతుపట్టలేదు. స్పష్టత కోసం రష్యాకు చెందిన లైన్స్మ్యాన్ తోఫిక్ను సంప్రదించగా దాన్ని ఆయన గోల్గా ప్రకటించారు. దీంతో జర్మనీ ఆటగాళ్లు షాక్కు గురయ్యారు. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్ జట్టు 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో గోల్తో విజయాన్ని ఖాయం చేసుకొని తొలిసారిగా ప్రపంచకప్ను అందుకుంది. ఆ బంతి లైన్ క్రాస్ అయిన విషయంపై తోఫిక్ను చివరి దశలో అడిగినప్పుడు ఆయన ‘స్టాలిన్ గ్రాడ్’ అని బదులివ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఎందుకంటే అక్కడ జర్మనీకి చెందిన నాజీల చేతిలో 75 వేల మంది రష్యన్లు ఊచకోతకు గురయ్యారు. జర్మనీ పట్ల వ్యతిరేకతతోనే అతను అలా వ్యవహరించాడని ఆ తర్వాత ప్రచారం జరిగింది. సాంటియాగో యుద్ధం (ఇటలీ * చిలీ, 1962) 1962 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను అత్యంత హింసాత్మక మ్యాచ్ల్లో ఒకటిగా పేర్కొంటారు. ప్రారంభమైన 12వ సెకన్లలోనే తొలి ఫౌల్... 12వ నిమిషంలో ఇటలీ మిడ్ ఫీల్డర్ ఫెర్రినీకి రెడ్ కార్డు... ఒకరి ముఖాలపై మరొకరు పంచ్లు... మధ్యలో పోలీసుల రంగప్రవేశం... ఇలా ఒకటి రెండు సార్లుకాదు మ్యాచ్ జరిగిన 90 నిమిషాలూ ఇదే తంతు. ఓ రకంగా మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్న ఆటగాళ్లుగా కాకుండా వీరంతా తమ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రేక్షకులకు ప్రదర్శిస్తున్నట్టు కనిపించింది. జిదాన్ ‘కుమ్ము’లాట (ఫ్రాన్స్ * ఇటలీ, 2006) ఈ ప్రపంచకప్లో ఫ్రాన్స్ స్ట్రయికర్ జినెదిన్ జిదాన్ మెరుపులు అసామాన్యం. కేవలం అతని ఆటతీరుతోనే ఫ్రాన్స్ ఫైనల్ వరకు వచ్చింది. తుది పోరులోనూ ఇటలీపై కళ్లుచెదిరే గోల్తో జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఇక ఎక్స్ట్రా టైమ్లోనూ దాదాపు రెండో గోల్ చే స్తాడనుకున్న సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఇటలీకి చెందిన మార్కో మాటెరాజ్జీ ఛాతీపై జిదాన్ తన తలతో గట్టిగా కుమ్మాడు. దీంతో రెడ్ కార్డుకు గురై మైదానం వీడడంతో చివరి పది నిమిషాలు ఫ్రాన్స్ జట్టు పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత పెనాల్టీ షూట్అవుట్లోనూ జిదాన్కు అవకాశం రాకపోవడంతో ఫ్రాన్స్ 3-5తో ఇటలీ చేతిలో ఓడింది. అప్పటిదాకా హీరోగా ఉన్న జిదాన్ ఈ ఒక్క మ్యాచ్తో జీరోగా మారిపోయాడు. తన తల్లి, సోదరిలను మాటెరాజ్జీ అసభ్యపదజాలంతో దూషించినందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని ఆ తర్వాత జిదాన్ పేర్కొన్నాడు. మారడోనా ‘దైవహస్తం’ గోల్ (అర్జెంటీనా * ఇంగ్లండ్, 1986) ఫుట్బాల్ చరిత్రలో అత్యద్భుత ఆటగాడే కాకుండా అత్యంత వివాదాస్పదుడిగానూ అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా పేరు తెచ్చుకున్నాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్లో ఇంగ్లండ్తో అర్జెంటీనా ఆడింది. ద్వితీయార ్ధం ఆరో నిమిషంలో బంతి ఇంగ్లండ్ గోల్ కీపర్ షిల్టన్, మారడోనా మధ్య దోబూచులాడింది. షిల్టన్ కన్నా ఎనిమిది అంగుళాల తక్కువ ఎత్తు ఉన్న మారడోనా కొద్దిసేపు ‘ఆజానుబాహుడు’ అయ్యాడు. ఎందుకంటే పైకి లేచిన బంతిని ఏకంగా చేతితోనే గోల్ పోస్ట్లోకి నెట్టాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఈ మ్యాచ్ను గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం ఆ గోల్ గురించి మారడోనాను అడిగితే ‘కొంచెం మారడోనా తల, మరికొంచెం దేవుడి చేయి కలిసి చేసిన గోల్ అది’ అని జవాబిచ్చాడు. అయితే ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్కు సంబంధించిన ఫొటోలు పరిశీలిస్తే మారడోనా తల చేసిందేమీ లేదని స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ విజయం ద్వారా ఫైనల్కు చేరిన అర్జెంటీనా అంతిమ సమరంలో పశ్చిమ జర్మనీని ఓడించి కప్ దక్కించుకుంది. కొరియా నాకౌట్కు రిఫరీ సహాయం (దక్షిణ కొరియా * ఇటలీ, 2002) తమ ప్రపంచకప్ చరిత్రలో ఈ టోర్నీలో దక్షిణ కొరియా తమ ‘సూపర్’ ఆటతీరుతో దూసుకుపోయింది. తొలిసారిగా సెమీస్కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వీరి ఈ దూకుడు వెనుక రిఫరీల సహాయం కూడా ఉంది. ఇటలీతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ఎక్స్ట్రా సమయంలో తమ కచ్చితమైన గోల్ను రిఫరీ బైరన్ మోరెనో ఆఫ్సైడ్ గోల్గా ప్రకటించి కొరియాకు మేలు చేశారు. అలాగే డైవింగ్ కారణంగా ఇటలీ స్టార్ ఆటగాడు ఫ్రాన్సెస్కో టొట్టిని బయటకు పంపడం వివాదమైంది. ఈ మ్యాచ్ను కొరియా 2-1తో నెగ్గి క్వార్టర్స్లో ప్రవేశించింది. ఇక్కడ కూడా వీరికి అదృష్టం కలిసి వచ్చింది. స్పెయిన్తో జరిగిన ఈ మ్యాచ్లోనూ రెండు గోల్స్ను ఆఫ్సైడ్ కారణంతో రిఫరీ గమాల్ తోసిపుచ్చాడు. చివరికి ‘పెనాల్టీ షూట్అవుట్’లో కొరియా 5-3 స్కోరుతో నెగ్గి సెమీస్కు చేరి సంబరాలు చేసుకుంది. కానీ ‘ఫిఫా’ ఒత్తిడి చేయడంతో ఆ ఇద్దరు రిఫరీలు రిటైర్మెంట్ ప్రకటించారు. మోరెనో మీద ఫిక్సింగ్ ఆరోపణలు రాగా గమాల్కు కొత్త కారు బహుమానంగా లభించింది. -
ఇన్వెస్ట్ ఇట్ లైక్ బెక్హాం..
కుప్పతెప్పలుగా గోల్స్.. గోల్డెన్ బాల్స్ నిక్నేమ్తో పేరొందాడు ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హాం. ఫుట్బాల్ మైదానంలోనే కాదు వ్యాపారం, పెట్టుబడుల బరిలోనూ అదే మెళకువలు పాటిస్తూ, రాణిస్తున్నాడు. బెక్హాం సంపద విలువ సుమారు 300 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 38 ఏళ్ల వయస్సులో ఇటీవలే రిటైరయిన బెక్హాం ఒకవైపు ఫుట్బాలర్గా సంపాదిస్తూనే మరోవైపు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ సంపద విలువను మరింత పెంచుకుంటున్నాడు. ఉదాహరణకు.. ఎప్పుడో 1999లో 3.2 మిలియన్ డాలర్లు పెట్టి బెక్హాం కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు ఏకంగా 29.3 మిలియన్ డాలర్లు పలుకుతోంది. రిటైర్ అయినప్పటికీ.. ఫ్యాషన్, కాస్మెటిక్స్ కంపెనీలు బెక్హాంను విడిచిపెట్టేయలేదు. అతనికి ఇప్పటికీ సింహభాగం ఆదాయం వీటి నుంచే వస్తోంది. తన పేరు మీద బెక్హాం ఇన్స్టింక్ట్ పేరిట ఈ మధ్యే అమెరికాలో ఒక ఆఫ్టర్షేవ్ను ప్రవేశపెట్టేందుకు 13.7 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ల జోరు మరికాస్త పెంచాడు. ఒక సాకర్ ఫ్రాంచైజీని కొంటున్నాడు. మరోవైపు, కరీబియన్ దీవుల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్పై దృష్టి పెట్టాడు. హైతీలో పెద్ద ఎత్తున స్థలం కొనబోతున్నాడు. బెక్హాంతో స్ఫూర్తి పొందిన మన దేశీ డెరైక్టర్ ఒకరు బెండ్ ఇట్ లైక్ బెక్హాం అనే సినిమా కూడా తీశారు. బెక్హాం తరహాలోనే మరో ఫుట్బాలర్ లీ జాన్సన్ కూడా పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తాడు. అయిదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ధైర్యం చేసి 1.5 మిలియన్ డాలర్లకు ఓ ఇంటిని కొన్నాడు. దానికి మరికొన్ని హంగులు అద్ది.. పరిస్థితులు కాస్త మెరుగుపడగానే 2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. మాంద్యం సమయంలో కూడా అర మిలియన్ డాలర్ల లాభం జేబులో వేసుకున్నాడు. ఇదే ఊపుమీద మరో ఇరవై ప్రాపర్టీలు కొనేసేందుకు సిద్ధమవుతున్నాడు. -
శిఖరస్వారీమణులు!
శిఖరాన్ని లొంగదీసుకోవడం అంటే... వెయ్యి గుర్రాల్ని ఒకేసారి అదిలించడం! ఎవరి వల్ల అవుతుంది? వీరులు? కష్టం. శూరులు? కష్టం. అరివీర భయంకరులు? కష్టం. దృఢకాయులైన కింకరులు? కష్టం. ఇంకెవరి వల్ల అవుతుంది? విల్ పవర్ ఉండాలి... డేర్ డెవిల్స్లా ఉండాలి. ఉంటే? నారీమణులు సైతం శిఖరాన్ని అధిరోహిస్తారు. ఓపన్ గంగ్నమ్ స్టెయిల్లో దౌడు తీయిస్తారు. ఈ నలుగుర్నీ చూడండి. శిఖరాలు ఎంత చిన్నవై కనిపిస్తాయో! సాహస యాత్రలు చేస్తున్నవారిలో సాధారణ గృహిణుల దగ్గర్నుంచి చిరుద్యోగినుల దాకా ఉన్నారు. వడ్డించిన విస్తరి లాంటి జీవితమున్నా... కేవలం తమను తాము నిరూపించుకోవడం కోసం, రేపటి భవిష్యత్తును మరింత సమర్థవంతంగా మలచుకోవడం కోసం వీరు అడ్వంచరస్గా మారుతున్నారు. వ్యయప్రయాసలను ఎదుర్కొని మరీ సంక్లిష్టమైన సాహసాల కలలను సాకారం చేసుకుంటున్నారు. ఆ మహిళలతో మాట్లాడితే... కొండలు పిండి చేసే వాళ్లెక్కడి నుంచో ఊడిపడలేదని అవగతమవుతుంది. ప్రయత్నం చేస్తే, మన కాలక్షేపపు అభిరుచులనే అడ్వెంచరస్గా మారిస్తే... జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చునని అర్థమవుతుంది. 138: ‘‘లక్ష్యాలు ఉన్నతంగా ఉంటే మనం పెద్దవిగా భావించే చాలా సమస్యలు అసలు సమస్యలే కావని అర్థం అవుతాయి’’ అని కిరణ్మయి అంటారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కిరణ్మయి...ఇటీవలే దక్షిణాఫ్రికా వెళ్లొచ్చారు. అందులో విశేషం ఏమీలేదు. డబ్బుంటే ఎవరైనా వెళ్లిరావచ్చు. కాని అక్కడి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలంటే మాత్రం ధైర్యం ఉండాలి. అది ఉంది కాబట్టే కిరణ్మయి కిలిమంజారో పర్వతారోహణ చేసిన తొలి తెలుగు వనిత అయ్యారు. ‘‘పెళ్లయి, పిల్లలు పెద్దయ్యాక, వాళ్ల భవిష్యత్తు వాళ్లు చూసుకోగల సత్తా వారికి అందించాక... అప్పుడు నా గురించి నేను ఆలోచించుకున్నాను. చిన్నప్పుడు సరదాగా కొండకోనల్లో తిరిగిన రోజులు గుర్తు చేసుకున్నాను. సహజమైన, సాహసోపేతమైన అనుభవాల్ని రుచి చూడాలనుకున్నాను’’ అని చెప్పారామె. అనుకోవడమే తడవు ‘గ్రేట్ హైదరాబాద్ అడ్వంచరస్ క్లబ్’ లో చేరడం ద్వారా తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఒకటొకటిగా పర్వతాలను అధిరోహిస్తూ ఇప్పటికి 138 ట్రెక్స్ పూర్తి చేశారు. వీటన్నింటిలోకి కిలిమంజారో అత్యంత ప్రమాదకరమైన అనుభవం అంటారామె. ‘‘కిలీ మంజోరా పర్వతప్రాంతంలో రాత్రి 12గంటలకు ప్రారంభమై ఉదయం 5గంటల లోపు ట్రెక్ పూర్తవ్వాలి. నేను వెళ్లినప్పుడు వెదర్ చాలా బ్యాడ్గా ఉంది. ఎక్కేటప్పుడు పాములు, తేళ్లూ, తీవ్రమైన విషం చిమ్మే జైలు... వరుస కట్టాయి. హఠాత్తుగా వడగళ్ల వాన పడడం మొదలైంది. ఏమాత్రం తేడా వచ్చినా కోమాలోకి వెళ్లాల్సి వచ్చేది. పరుగు తీయడం ఆపేస్తే కండరాలు బిగుసుకుపోతాయి. అంతటి చలి’’ తన అనుభవాన్ని వివరిస్తున్నపుడు ఆమెలో ఆ జ్ఞాపకం తాలూకు ఉద్వేగం కనపడింది. రన్నింగ్, సైక్లింగ్... వీటన్నింటిలోనూ కిరణ్మయి రాణిస్తున్నారు. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్, కోయంబత్తూర్లో జరిగిన మారథాన్లో 2గంటల 20నిమిషాల్లో 21.1 కి.మీ పరుగు పూర్తి చేసి 10వ స్థానం సాధించారు. స్విమ్మింగ్లోనూ రాణిస్తున్నారు. ఇటీవలే జుకాడో అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ ఫార్టీ ప్లస్ టీచర్... ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఫిట్నెస్ అన్నీ సాహసయాత్రల ద్వారా పొందగలిగానని చెప్పారు. 127: ‘‘మహారాష్ట్రలోని కోకన్కొడా ప్రాంతంలో చేసిన 1800 అడుగుల దూరం రోప్లింగ్ (తాడుతో వేళ్లాడుతూ పర్వతాలు, లోయల నడుమ చేసే సాహసం) అద్భుతమైన అనుభవం’’ అని గుర్తు చేసుకున్న ఫరీదా... ఇటు కుటుంబ బాధ్యతల్ని, అటు ఉద్యోగ బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూనే తన సాహసయాత్రల్ని కొనసాగిస్తున్నారు. ‘‘ఇప్పటికి దాదాపు 127 ట్రెక్స్ పూర్తి చేశాను’’ అని ఉత్సాహంగా చెప్పారు ఫరీదా. చిన్నప్పుడు చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగిన హాబీ వల్ల ఏమో రోప్లింగ్ తన అభిమాన సాహసక్రీడగా మారిపోయిందని చెప్పే ఫరీదా మహారాష్ట్రలోని కార్జత్ జలపాతాల మీదుగా చేసిన రోప్లింగ్ను ఎప్పటికీ మరచిపోలేనంటారు. సినిమాలు, టీవీల ముందు వృథా చేసే సమయాన్ని ఇలా మళ్లిస్తే... ఆత్మవిశ్వాసం పెరగడం లాంటి లాభాలెన్నో కలుగుతాయని ఆమె మహిళలకు సూచిస్తున్నారు. 112: ‘‘పర్వతాన్ని అధిరోహించిన తర్వాత అక్కడ నుంచి నక్షత్రాల్ని చూడడం ఎంత బాగుంటుందో’’ అంటున్న పద్మజలో గొప్ప భావుకురాలు కనిపిస్తుంది. ఇప్పటికి 112 పర్వతాలను అధిరోహించానని ఆమె చెప్పినప్పుడు బాప్రే...అనిపిస్తుంది. ‘‘పెళ్లికాకపోవడం సాహసయాత్రలకు సంబంధించి నాకున్న అదనపు అర్హత’’ అంటూ నవ్వేస్తారు పద్మజ. ప్రస్తుతం హైదరాబాద్లో ఎస్ఎపి కన్సల్టెంట్గా పనిచేస్తున్న పద్మజ పశ్చిమకనుమలలోని సహ్యాద్రి రేంజ్లో హరిశ్చంద్రఘాట్ తన అభిమాన ట్రెక్ అని పేర్కొన్నారు. 71: అడ్వంచరస్ క్లబ్లో సభ్యురాలిగా మూడేళ్ల వయసున్న స్వాతి... సాహస యాత్రికురాలిగా మారకముందు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు స్వంతంగా ఆన్లైన్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ‘‘ఈ అడ్వంచర్స్ వల్ల మన జీవితాన్ని మనమే శాసించుకునే తత్వం అలవడుతుంది’’ అని చెప్పే స్వాతి హైదరాబాద్లోని మౌలాలితో మొదలుపెట్టి తిరుపతిలోని నాగల్లపురం... ఇంకా అనేక ప్రాంతాల్లోని పర్వతాలను చుట్టేసి... ఇప్పటికి 71 ట్రెక్స్ పూర్తి చేశారు. ‘‘మొదట ఇంట్లో భయపడ్డారు. కాని ఇప్పుడు వారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు’’ అని చెప్పారీమె. - ఎస్. సత్యబాబు