Godavari Districts
-
మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేల
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలివస్తున్న మహా కుంభమేళా (Maha Kubh Mela) గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్కు (Coconut Market) పెద్ద వరమే అయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(Prayagraj) కేంద్రంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తయ్యే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. మహా కుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్కు కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట (Ambajipeta) కొబ్బరి మార్కెట్లో కురిడీ కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. పాతకాయలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.20 వేలు వరకు పలుకుతోంది. దీనిలో గటగట రకం రూ.17,500 వరకూ ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం వెయ్యి కాయలకు రూ.20 వేల ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన రూ.18 వేలు మాత్రమే ఇప్పటి వరకూ గరిష్ట ధరగా ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు కురిడీ కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గింది. ఈ రెండు కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడీ ఎగుమతి పెరిగింది. రోజుకు రూ.8 లక్షలు విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడం కురిడీ ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్వర్గాలు చెబుతున్నాయి.ఎనిమిదేళ్ల తరువాత మంచి ధర2016లో గండేరా రకానికి రూ.18 వేల ధర వచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీకి రూ.20 వేలు వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడీ ఎగుమతులు తగ్గడం, కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడీకి మార్కెట్లో ఊహించని ధర వచ్చింది.– అప్పన శ్యామ్, కురిడీ వ్యాపారి, అంబాజీపేట -
Sankranti: ఆతిథ్యంలో గోదారోళ్లది అందెవేసిన చెయ్యి
సాక్షి, భీమవరం: సినిమా షూటింగ్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) వచ్చిన ప్రముఖ సినీనటుడు వీరమాచనేని జగపతిబాబు ఇక్కడి ఆతిథ్యం గురించి పోస్టు చేసిన వీడియో చాలానే వైరల్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నన్నాళ్లూ ఓ అభిమాని ప్రతిరోజూ రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తనకు విందు భోజనం పంపారని చెప్పుకొచ్చారు. వాటిని చూపిస్తూ ‘బకాసురుడిలా తింటాను.. కుంభకర్ణుడిలా పడుకుంటా’నంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు గోదావరి జిల్లాల(Godavari Districts) ఆతిథ్యాన్ని ఎన్నో వేదికలపై గుర్తుచేసుకున్న సందర్భాలెన్నో.. ఆయ్.. అండి.. రండీభాషలో ‘ఆయ్..’ అనే యాస ఉన్నా.. మాటనిండా మమకారమే దాగి ఉంటుంది. దారి చెప్పమంటే నేరుగా ఇంటికే తీసుకెళ్లేంత మర్యాద ఉంటుంది. తిండి పెట్టి చంపేస్తారన్నది నానుడైతే.. పెట్టుపోతలతో మైమరచిపోయేలా చేయడం వీరి నైజం. అడుగడుగునా వెటకారమే అనిపించినా.. అణువణువునా ఆప్యాయతే కనిపిస్తుంది. అరమరికలు లేని వ్యక్తిత్వాలు.. అబ్బురపరిచే సంప్రదాయాలు.. గోదావరి వాసుల పడికట్లు. అందుకే.. గోదారోళ్ల పిల్లను చేసుకోవడానికి ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. గోదారోళ్ల ఆతిథ్యం చూడాలంటే వారి ఇంటి అమ్మాయిని వివాహమాడాల్సిందే. పెళ్లిచూపులు లగాయితు అప్పగింతల వరకు అడుగడుగునా వారి అతిథి మర్యాదలు, సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి.సంక్రాంతి వస్తోందంటేసంక్రాంతి(Sankranti Festival) వస్తోందంటే గోదావరి మర్యాదలే గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో ఉన్న బంధువులను పండక్కి వారం ముందే రమ్మని పిలిచి.. ఉన్నన్ని రోజులూ వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు గుమ్మం వద్దే చెంబులతో చేతికి నీళ్లందించి కాళ్లు కడుక్కోమని మర్యాదలు చేస్తారు. చేతులు తుడుచుకోవడానికి భుజాలపై తుండు (టవల్) అందిస్తారు. ప్రయాణం బాగా సాగిందా అంటూ మనసు నిండా అభిమానంతో స్వాగతం పలుకుతారు. కోడి పందేలు, జాతరలు, సినిమాలు, పల్లె అందాలను తిప్పి చూపిస్తుంటారు. సరదా పడాలే గానీ తాటికల్లు రుచి చూపిస్తారు. ఉన్నన్ని రోజులూ నచ్చిన వంటకాలను వండి వారుస్తుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే అరిటాకులో విందు భోజనం చేస్తుంటారు.అత్తల హడావుడి అంతాఇంతా కాదుకొత్త అల్లుడు మొదటిసారిగా పండుగకు ఇంటికి వచ్చే అల్లుళ్ల కోసం పల్లెల్లో అత్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, పోకుండలు, గోరుమిటీలు వంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. తలుపు చాటున నిల్చుని అల్లుడు గారికి అవి పెట్టు.. ఇవి పెట్టు అంటూ కూతురికి చెబుతూ అత్తలు సంబరపడిపోయే దృశ్యాలు అనేకం. తామేమీ తక్కువ కాదన్నట్టు కొంటె మరదళ్లు గాజులతో గారెలు.. గోళీలతో పొంగడాలు.. ఘాటైన మిరపకాయలతో బజ్జీలు చేసి బావలను ఆట పట్టించడం ఇక్కడ షరా మామూలే.వియ్యపురాలా.. నీవొచ్చెవేళకొందరు అల్లుడితో పాటు వియ్యపురాలిని సైతం ఇంటికి ఆహ్వానించి కానుకలు, కొత్త దుస్తులు అందిస్తారు. వియ్యపురాలు సైతం వస్తూవస్తూ ఇంటిల్లిపాదికీ కొత్త దుస్తులు తెచ్చి ఇవ్వడం ఇక్కడి ఆచారం. తద్వారా ఇరు కుటుంబాల మధ్య బంధాలు బలపడతాయని గోదారోళ్ల నమ్మకం. పండుగలు ముగిసి స్వస్థలాలకు తిరిగి వెళ్లే బంధువులకు ఇంటిలో చేసిన పిండివంటలను ప్యాక్ చేసి ఇస్తారు. బరువెక్కిన గుండెలతో వీధి చివరి దాకా వచ్చి వీడ్కోలు చెబుతూ వచ్చే ఏడాది ముందుగానే రావాలంటూ మాట తీసుకుని మరీ సాగనంపడం గోదారోళ్ల ప్రత్యేకత.కొత్త అల్లుడికి గుర్తుండిపోయేలా..సంక్రాంతి వస్తోందంటే కొత్తగా పెళ్లయిన ఇళ్లల్లో సందడికి అంతే ఉండదు. తమ స్తోమతకు తగ్గట్టుగా అల్లుడికి తొలి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా అత్తింటి వారు మర్యాదలు చేస్తారు. వినూత్న రీతిలో అల్లుడికి స్వాగతం పలుకుతారు. విందులో ఎన్నెన్నో (కొందరైతే వందకు పైగా) వంటకాలను వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. గత ఏడాది భీమవరానికి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబం తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరో కుటుంబం వారు తమకు కాబోయే అల్లుడికి వంద రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. పండక్కి మొదటిసారి వస్తున్న అల్లుడిని భీమవరానికి చెందిన అత్తింటివారు డోలు, సన్నాయి మేళంతో ఎడ్ల బండిపై ఊరేగిస్తూ ఇంటికి ఆహ్వానించారు. భారతదేశం మ్యాప్పై దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 29 వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. -
కొబ్బరి రైతుకు ఊరట
సాక్షి, అమలాపురం: అంబాజీపేట కొబ్బరి మార్కెట్కు సం‘క్రాంతి’ వెలుగులొచ్చాయి. గడచిన వారం రోజులుగా పచ్చికొబ్బరి, కురిడీ కొబ్బరి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు జోరందుకున్నాయి. ఉత్తరాదికి ఎగుమతులు పెరగడం.. తమిళనాడులో దిగుబడులు తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో 1.77 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మార్కెట్లో కొబ్బరి లావాదేవీలు అంబాజీపేట మార్కెట్లో ధరల ఆధారంగా సాగుతుంటాయి. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్లో పచ్చి కొబ్బరి, వెయ్యికాయల ధర రూ.14,500 నుంచి రూ.15 వేలకు చేరింది.రోజుకు 70 నుంచి 100 లారీల ఎగుమతిగతేడాది అక్టోబర్ నుంచి నవంబర్ వరకూ పచి్చకొబ్బరి వెయ్యి కాయల ధర రికార్డు స్థాయిలో రూ.18,500 వరకు పలికింది. తర్వాత ధర తగ్గినా రూ.14 వేల వద్ద స్థిరంగా ఉంది. వారం రోజుల నుంచి ధర పెరుగుతూ వస్తోంది. దీంతోపాటు కురిడీ కొబ్బరి ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం పాత కాయలలో కురిడీ కొబ్బరి వేయింటికి గండేరా రూ.15 వేలు, గటగట రూ.13,500, కొత్త కాయలలో గండేరా రూ.14 వేలు, గటగట రూ.12,500 ఉండేవి. ఇప్పుడు వాటి ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో పాత కురిడీ కొబ్బరి వెయ్యింటికి గండేరా రూ.17,500, గటగట రూ.16,000, కొత్త గండేరా రూ.16,800, గటగటా రూ.15,000 వరకూ పెరిగాయి. ఆయా రకాలకు రూ.రెండు వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 నుంచి 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి అవుతోందని అంచనా. పెరిగిన వినియోగంసంక్రాంతికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొబ్బరి వినియోగం కొంత వరకూ పెరగడంతోపాటు స్థానికంగా దిగుబడి తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణం. ఈ సీజన్లో సగటు దిగుబడి ఎకరాకు 1,200 కాయలు కాగా, ప్రస్తుతం 400 కాయలు మాత్రమే దిగుబడిగా వస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకలో సైతం దిగుబడులు తగ్గడం కూడా రేటు పెరగడానికి కారణమైంది. మూడు నెలల నుంచి పచ్చికాయ ధర అధికంగా ఉండడం వల్ల కూడా కురిడీ కొబ్బరి ధర పెరుగుదలకు కారణమైంది. దిగుబడి తగ్గినా.. సంక్రాంతి సమయంలో కొబ్బరి ధరలు పెరగడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. -
పందెం కోడి.. పండక్కి రెడీ..
సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెల్లో సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అయితే ఈ హడావుడి ఓ రేంజ్లో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో చిన్నాపెద్దా, ఆడామగా తేడాలేకుండా పొలోమని వచ్చేస్తారు. కారణం.. అందరినీ ఆకర్షించే కోడిపందేలు. ఈ మూడ్రోజుల పండగ ప్రత్యేకత.. ప్రత్యేక ఆకర్షణ ఇదే. మరో నెలరోజుల్లో ఈ సందడి ప్రారంభం కానుంది. కాలు దువ్వడానికి కోళ్లు.. పందెం రాయుళ్లు రెడీ అయిపోతున్నారు.కైకలూరు : సంక్రాంతి పందేల బరిలో ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఢీకొట్టడానికి కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద పండుగ సమరానికి కసరత్తు మొదలైంది. పండ్ల తోటలు, చేపల చెరువు గట్లు, ఫాం హౌస్లు ఇలా చిన్నాపెద్దా కలిపి దాదాపు 450 పుంజుల పెంపక కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ నాయకులతో పాటు జనసేన నేతలు పందేల బరుల ఏర్పాటుకు పోటీపడుతున్నారు. బరుల స్థల సేకరణలో నిమగ్నమయ్యారు. గుండాట, పేకాట, మద్యం విక్రయాలు, వ్యాపార దుకాణాల కోసం ఆశావహులు కూటమి నేతల ప్రసన్నానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కో పుంజుకు రూ.30 వేల ఖర్చు.. ఇక పందేనికి సిద్ధంచేసే ఒక్కో పుంజుకు రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. జీడిపప్పు, బాదం, రాగులు, సజ్జలు, నువ్వులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్తో పాటు ఉడికించిన మటన్, గుడ్లు పెడుతున్నారు. ప్రతిరోజూ ప్రత్యేకంగా నీటిలో ఈత కొట్టిస్తూ, ప్రత్యేక పరికరాల ద్వారా నడిపిస్తారు. కొంతమంది థాయ్లాండ్, ఫిలిప్పీన్స్ నుంచి మేలు జాతి కోడిపుంజులను తెప్పించుకుంటున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా రైతులు ఆటోలలో వివిధ జాతుల పుంజులను తీసుకొచ్చి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే, కోడి పందేలలో ఎదుటి పుంజులు దాడి చేసినప్పుడు వాటిని తప్పించుకుని ఎలాంటి గాయాలు కాకుండా ప్రత్యర్థి పుంజును చంపిన పుంజులను రూ.3లక్షలకు కొనుగోలు చేస్తారు. ఇలాంటి వాటిని ఈ ప్రాంతంలో పందేల నిర్వాహకులు గుర్తిస్తారు. ఇక సంక్రాంతి నెలరోజుల్లో పుంజుల అమ్మకాల ద్వారా రూ.25 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. సుమారు ఏడువేలకు పైగా పుంజుల అమ్మకాలు ఇక్కడ జరుగుతాయని అంచనా.పొరుగు రాష్ట్రాల నుంచి అతిథులు రాకకోడిపందేల కోసం ఏడాది మొత్తం ఎదురుచూసే వారు.. ఈ సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయాన్ని గడించే వారు గోదావరి జిల్లాల్లో అనేకమంది ఉంటారు. ఈ ఏడాది జనవరిలో పండుగ మూడ్రోజులు ఒక్క ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలోనే రూ.500 కోట్లపైనే చేతులు మారాయి. ఇక వచ్చే నెలలో జరిగే కోడిపందేలు ఒక రేంజ్లో ఉంటాయని జూద విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ కోడిపందేలను తిలకించడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి విచ్చేసే అతిథుల కోసం హోటళ్లు, లాడ్జీల బుకింగ్లు మొదలయ్యాయి. ప్రధాన సెంటర్లలో అయితే ఇప్పటికే పూర్తయిపోయాయి. అలాగే, బరుల చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్లైట్లు, బౌన్సర్ల ఏర్పాటుతో పాటు ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లు, స్కూటీలను అందించాలనే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. కుక్కుట శాస్త్రంపై నమ్మకం..కోడి పందేల నిర్వాహకులు పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న కుక్కుట శా్రస్తాన్ని (కుక్కుట పురాణం) విశ్వసిస్తారు. కుక్కుటేశ్వరస్వామి నుంచి ఈ పురాణం వినుతికెక్కిందని అంచనా. బొబ్బిలి యుద్ధకాలం నుంచి ఈ శా్రస్తాన్ని పందెపు రాయుళ్లు అనుసరిస్తున్నారు. కోడిపుంజు జన్మనక్షత్రం, జాతకం, 27 నక్షత్ర, వారఫలాలు ఇందులో ఉన్నాయి. పందెం జరిగే తిథిని బట్టి కోడిపుంజు గెలుస్తుందో లేదో అంచనా వేసి మరీ లక్షల్లో పందేలు కడతారు. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. నెమలి, పూల, కాకి, డేగ, పింగళి, సేతు, మైల, పచ్చకాకి, గేరివా, తీతువా ఇలా అనేక జాతులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి పందేలలో అనుభవం కలిగిన గురువులను పెంపకందారులు నియమించుకున్నారు. పుంజుల పెంపకం హాబీ.. ఏటా వివిధ జాతుల కోడి పుంజులను పెంచడం ఒక హాబీ. చంటి పిల్లలను తల్లి ఏ విధంగా సాకుతుందో పుంజులనూ అలాగే పెంచుతాం. తల్లి, తండ్రి జీన్స్ను పరిగణనలోకి తీసుకుని 18 నెలల వయస్సులోనే పోరాట పటిమను గుర్తిస్తాం. వీటి సంరక్షణకు ప్రత్యేకమైన మందులు వినియోగిస్తాం. ఒక్కో పుంజు తయారీకి అన్నీ కలుపుకుని రూ.30 వేలు ఖర్చు చేస్తున్నాం. – దండు రంగరాజు, ఆక్వా రైతు, కైకలూరు -
టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు. -
‘గోదావరి’ జిల్లాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. దీంతో వారిద్దరి మధ్యనే పోరు కొనసాగింది.ఏలూరు జిల్లాలో 2,667 ఓట్లకు గాను 2,443 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 91.60 శాతంగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 3,729 మంది ఓటర్లకు గాను 3,478 మంది ఓటుహక్కును వినియోగించుకోవడంతో 93.27 శాతంగా నమోదైంది. కాకినాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏఆర్వో వెంకటరావు ఆధ్వర్యంలో ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మొత్తం ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఓటర్లకు 15,502 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.62% పోలింగ్ నమోదైందని కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. -
AP: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
Teachers MLC Election Updates..పోలింగ్ ప్రారంభం.. ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుజిల్లాలో మొత్తం ఓటర్లు..3,729పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
కొత్త అల్లుడికి ‘శత’ పిండి వంటల భోజనం
కిర్లంపూడి: ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం రానేవచ్చింది.. ఎక్కడ చూసినా కొత్త అల్లుళ్ల సందడే సందడి. అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదారోళ్ల (గోదావరి జిల్లాలు) తర్వాతే ఎవరైనా అంటారు పెద్దలు. ఈ నానుడికి అద్దం పట్టేలా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉద్దగిరి వెంకట రామారావు, రమణి దంపతులు కొత్త అల్లుడికి శనివారం ‘శత’ పిండి వంటల భోజనం స్వయంగా వడ్డించి తమ ప్రేమను చాటుకు న్నా రు. అత్తారింట్లో తమ కుమారుడికి లభించిన మర్యాదలను చూసి కాకినాడకు చెందిన బాదం సతీష్, కుమారి దంపతులు మురిసిపోయారు. -
కూటమికి 'గోదారి'లో ఎదురీతే!
అధికారమే లక్ష్యంగా జెండాలు జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల కేటాయింపుతో బొక్కబోర్లా పడ్డాయి. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాలపై గంపెడాశలు పెట్టుకున్న ఆ కూటమికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పొత్తులు, సీట్ల సిగపట్లతో బలహీనపడి అసలు ఉనికికే ముప్పు తెచ్చుకున్నాయి. ఈ జిల్లాల్లో కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలే రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ సామాజిక వర్గాలు కూటమి వెంట ఉంటాయని లెక్కలేసుకుని జనసేన, టీడీపీలు తమదే గెలుపంటూ బీరాలు పలికాయి. అదే సమయంలో సీట్ల పంపకాల్లో ఆ పార్టీలు తమకు ప్రాధాన్యమిస్తాయని ఆయా సామాజిక వర్గాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. తీరా టికెట్ల కేటాయింపులో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో వాటి నుంచి కూటమికి ఎదురు దెబ్బ తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడ శెట్టిబలిజలను విస్మరించిన జనసేన జనసేన బలం, బలహీనత గోదావరి జిల్లాలే అన్న ధీమా అన్నివర్గాల్లో ఉండేది. తీరా సీట్ల కేటాయింపులో ప్రధానమైన శెట్టిబలిజ సామాజికవర్గాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పూర్తిగా పక్కన పెట్టేసింది. ఉమ్మడి తూర్పులో ఒక్కటంటే ఒక్కటికూడా వారికి కేటాయించలేదు. ఈ జిల్లాలో జనసేన ఆరు అసెంబ్లీ, కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా పి.గన్నవరం, రాజోలు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు పోను నిడదవోలు, రాజానగరం, కాకినాడ రూరల్, పిఠాపురం టికెట్లను సొంత సామాజిక వర్గానికే పవన్కళ్యాణ్ ఇచ్చుకున్నారు. శెట్టిబలిజలను విస్మరించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ముమ్మిడివరంలో సొంత సొమ్ము తగలేసుకుని అహోరాత్రులు శ్రమిస్తున్న ఆ సామాజికవర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు సీటు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. బీసీల తోక కత్తిరిస్తానంటూ చిన్నచూపు చూసే చంద్రబాబుతో జతకట్టి శెట్టిబలిజలకు సీటు లేకుండా మోసం చేశారని ఆ సామాజికవర్గం పవన్పై నిప్పులు చెరుగుతోంది. ఈ అవమానాన్ని భరించలేకే బాలకృష్ణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్పై నమ్మకంతో శనివారం ఆ పార్టీలో చేరారు. సీట్ల కేటాయింపులో వివక్షను తట్టుకోలేక కాకినాడ మాజీ మేయర్ సరోజ సైతం జనసేనను వీడారు. టీడీపీకి తప్పని తిప్పలు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు మూడు పార్టీల కూటమితో బాగా బలపడ్డామని సంబరపడ్డారు. కానీ ఆయన అంచనాలు తూర్పులో తలకిందులయ్యాయి. ఓటమి సంకేతాలు అందిస్తున్నాయి. పొత్తులో సీట్లు కోల్పోయిన నిడదవోలు, రాజోలు, పి.గన్నవరం, పిఠాపురం, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు, అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వీటితో పాటు తుని, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అమలాపురం, కొవ్వూరు, గోపాలపురం స్థానాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పనిలో పనిగా పలువురు నేతలు టీడీపీకి దూరమవుతున్నారు. ఈ పరిణామాలను చక్కదిద్దలేక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. ఆ రెండు వర్గాలకు బీజేపీ మొండిచేయి ఈ జిల్లాలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు, శెట్టిబలిజలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఆ సామాజికవర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గం, అనపర్తి అసెంబ్లీ స్థానాలను సామాజికంగా బలం లేని వర్గాలకు కేటాయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నాయకుడు, కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం గానీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటైనా ఇవ్వాలని కోరారు. కానీ ఆయనకు కాదని స్థానికేతరురాలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమహేంద్రవరం లోక్సభ స్థానం కేటాయించారు. అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కూడా సామాజికంగా బలం లేని శివరామకృష్ణంరాజుకు కేటాయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. దాంతో వారు కూటమికి దూరమవుతున్నారు. వైఎస్సార్సీపీలో బీసీలకే పెద్దపీట వైఎస్సార్సీపీ మొదటినుంచీ బీసీలపై ఆదరణ చూపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం లోక్సభ స్థానాన్ని శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు, రాజమహేంద్రవరం రూరల్ను రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు, రామచంద్రపురాన్ని పిల్లి సూర్యప్రకాశ్కు కేటాయించింది. వీటితో పాటు బీసీల్లో గౌడ సామాజికవర్గం నుంచి ఎంపీ మార్గాని భరత్రామ్ను రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలోకి దింపింది. జనసేనలో తమకు జరిగిన అవమానాన్ని భరించలేక ఈ జిల్లాల్లోని శెట్టిబలిజలతో పాటు చేనేత, మత్స్యకార వర్గాలు రాజకీయంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కూడా వైఎస్సార్సీపీ సముచిత ప్రాధాన్యమే కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటితో పాటు సంప్రదాయంగా ఇస్తున్న కాకినాడ లోక్సభ స్థానాన్ని కూడా ఆ వర్గానికే కేటాయించింది. దీంతో ఆ సామాజికవర్గం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తోంది. -
టీడీపీ, జనసేనకు వరుస షాక్లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు మనస్తాపం చెందిన నాయకులంతా వరుసగా గుడ్బై చెబుతున్నారు. ఆయా పార్టీల్లో ఎన్నాళ్లుగానో ఉంటూ కోట్లు ఖర్చుచేసి పార్టీ పటిష్టత కోసం పనిచేసినా టిక్కెట్ దక్కకపోవడం, అవమానాలకు గురికావడంతో కూటమిని వీడుతున్నారు. జనసేన, టీడీపీలో డబ్బులే ప్రామాణికంగా తీసుకుని టిక్కెట్లు కేటాయించడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని)కు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, పైగా ఆయన్ను అవమానించేలా వ్యవహరించడంతో ఆయన ఆ పార్టీని వీడారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టికెట్ విషయంలో తనకు అన్యాయం చేయడంతో ఆయన కూడా టీడీపీనుంచి బయటకు వచ్చారు. అవసరానికి తనను వాడుకుని కోట్లాదిరూపాయల ఆస్తులు పార్టీకోసం వెచ్చించిన తనకు చివరి నిమిషంలో ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్యాదవ్ టీడీపీని వీడారు. ఇక జనసేన పార్టీకోసం అహర్నిశలు కృషి చేసి... పార్టీ పురోభివృద్ధికి కృషి చేసినప్పటికీ తమను పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలు అవలంబిస్తుండటంతో చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణ ఆ పార్టీకి రాంరాం చెప్పారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో శెట్టి గురునాథం ఆ పార్టీని వీడారు. తాజాగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కూడా శెట్టిబలిజలకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. వారంతా వైఎస్సార్సీపీలో చేరేందుకు క్యూ కట్టారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, ఆచంట, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరంలో ముఖ్య నేతలు ఇవే కారణాలతో నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో అయితే నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. బీసీలకు పట్టం కట్టడం, గడచిన ఐదేళ్లలో సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరడంతో పార్టీకి ఆకర్షితులై పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఈలి నానితో మొదలై.. తాడేపల్లిగూడెం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని) ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గంలో ఈలి కుటుంబానికి మంచి పేరుంది. ఆయన తండ్రి ఈలి ఆంజనేయులు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఆయన భార్య వరలక్ష్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆంజనేయులు ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నాని 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక పర్యాయం పనిచేశారు. రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పేరుంది. 2019లో టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పటికీ పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ♦ నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ పార్టీ టికెట్ విషయంలో పరాభవం చెందడంతో వైఎస్సార్సీపీలో చేరారు. ♦ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఆచంట ఇన్చార్జిగా పనిచేశారు. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, ఇతర కారణాలతో జనసేనను వీడి ఫ్యాన్ గూటికి చేరారు. ♦ ఉంగుటూరులో జెడ్పీటీసీగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన నౌడు వెంకటరమణ 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత రాజకీయంగా అక్కడ ప్రాధాన్యమివ్వకపోవడంతో ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ♦ జంగారెడ్డిగూడెంలో బలమైన కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉన్న జెట్టి గురునాథం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారు. ఆయన కూడా కాంగ్రెస్ విధానాలు నచ్చక వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్న గోపాల్ టీడీపీ ఎంపీ టిక్కెట్ ఆశావహి, ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్యాదవ్కు టీడీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. సింగపూర్లో వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ను పిలిచి మరీ టిక్కెట్ నీదే, ఖర్చుకు వెనుకాడకుండా పనిచేయమని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ చెప్పడంతో ఏడాది నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా పనిచేశారు. యువగళం మొదలుకొని, చంద్రబాబు బహిరంగ సభల వరకు అనేక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. చివరికి హ్యాండ్ ఇచ్చి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్కు టిక్కెట్ ఇచ్చారు. మనస్తాపానికి గురైన గోపాల్ యాదవ్ వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల వేళ కీలక నేతల రాకతో వైఎస్సార్సీపీ కేడర్లో కొత్త జోష్ నెలకొంది. టికెట్లు అమ్ముకున్న పవన్: పితాని ముమ్మిడివరం: జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో సానబోయిన మల్లికార్జునరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పార్టీని ఏర్పాటు చేశానని చెప్పి, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ టికెట్ ఇవ్వకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో శనివారం చేరనున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీ సర్వనాశనం అయిందన్నారు. సీఎం జగన్ మోహన్రెడ్డి ఆదేశిస్తే ముమ్మిడివరంలో పొన్నాడ సతీ‹Ùకుమార్తో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీచేస్తున్న బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పితాని తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడమే తన ధ్యేయమని చెప్పారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా నాదెండ్ల తీరుపై మండిపడ్డారు. -
పవన్ను నమ్ముకుంటే గోదారే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం: ఎన్నికలు నెలన్నర ఉందనగా జనసేనాని అస్త్రసన్యాసంతో గోదావరి జిల్లాల్లో జనసైనికులు, నేతలు డీలా పడ్డారు. వారాహి యాత్రలో ఊగిపోయే ప్రసంగాలు చేసి తమను ఎన్నికల రణరంగంలోకి దూకమని చెప్పి ఇప్పుడు చంద్రబాబుకు దాసోహమని కాడి వదిలేయడంపై ఆ పార్టీ కేడర్ రగిలిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దున్నేస్తామంటూ హడావుడి చేసిన తమ అధినేత ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ నేతలను, కేడర్ను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, కార్యకర్తల్ని ప్రశ్నించవద్దంటూ ఆదేశించడాన్ని ఆ పార్టీ నాయకులు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఇప్పుడు పార్టీ శ్రేణులను అవమానించడంతో తమ మనసుల్లో ఆయన పట్ల ఉన్న ప్రతిష్టను దిగజార్చుకున్నారని స్పష్టం చేస్తున్నారు. జనసైనికులు, కార్యకర్తలు తీవ్ర నిస్పృహలో ఉంటే పవన్ మాత్రం హైదరాబాద్లో ఉండి తమాషా చూడడంపై ఆవేదనలో మునిగిపోయారు. తమ అధినేత తీరు ఇలాగే కొనసాగితే పార్టీని, తమను గోదాట్లోకి నెట్టేసినట్లేనని, ఆ పరిస్థితి రాకముందే తట్టాబుట్టా సర్దుకుని జాగ్రత్తపడడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన నేతలు పార్టీ మారుతుండగా.. మరికొందరు ఆ దారిలో ఉన్నారు. పవన్ ప్రసంగంతో పార్టీలో పెనుదుమారం ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెం వద్ద నిర్వహించిన జెండా సభలో పార్టీ శ్రేణులను చిన్నబుచ్చుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారాన్నే రేపాయి. ఆయన ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కేడర్ అయోమయంలో పడిపోయింది. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నా పార్టీ అధ్యక్షుడిగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో జన సైనికులకు ఎటూ పాలుపోవడం లేదు. 24 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్.. ఇంతవరకూ ఐదు స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు. ఇది జరిగి దాదాపు పదిరోజులవుతున్నా మిగిలిన 19 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించలేని దయనీయ స్థితిలో పవన్ ఉన్నారు. ఇలాగైతే టీడీపీ ఖాతాలోకి భీమవరం.. ఎన్నికల ప్రచారం మొదలైన తొలినాళ్లలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బలంగా వినిపించింది. తాజాగా పిఠాపురం పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఈ రెండింటిలో ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేది తేల్చుకోలేని పరిస్థితుల్లోకి పవన్కళ్యాణ్ను చంద్రబాబు నెట్టేశారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. భీమవరం నుంచి స్థానికేతరుడిగా ప్రతికూలత ఎదురవుతుందని పవన్ను బురిడీ కొట్టించిన చంద్రబాబు భీమవరాన్ని సైతం తన ఖాతాలో వేసుకునే ఎత్తుగడ వేశారని మండిపడుతున్నారు. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనసేనలోకి తీసుకుని పోటీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేరుకు జనసేన అయినా టీడీపీ నాయకుడినే పోటీ చేయించడం చంద్రబాబు వ్యూహమంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ అన్నదానిపై పవన్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోతే.. తమ పరిస్థితి ఏంటని వివిధ నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ముందుచూపుతో ఆ పార్టీలోని ముఖ్యమైన నేతలు ప్రత్యామ్నాయదారులు వెదుక్కుంటున్నారు. జనసేన ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని, పూర్తిస్థాయిలో సీట్ల ప్రకటన జరిగితే ఆ పార్టీకి మరిన్ని తలనొప్పులు తప్పవంటున్నారు. పార్టీలో నెంబర్ 3కే సీటు లేకపోతే ఎలా? రాజమహేంద్రవరం రూరల్ నుంచి పార్టీలో నెంబర్ 3గా ఉన్న దుర్గేష్కే సీటని ఇటీవల రాజమహేంద్రవరం పర్యటనలో పవన్ స్వయంగా ప్రకటించారు. చంద్రబాబు ట్రాప్లో పడి ఇప్పుడు దుర్గేష్ను నిడదవోలుకు సాగనంపి, రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ నేత గోరంట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ ఇలా చేస్తారనుకోలేదని దుర్గేష్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రరావు తన భార్యతో సహా ఆమరణ దీక్ష చేస్తే పవన్ నుంచి కనీస స్పందన రాలేదు. ఒక్క సీటూ ప్రకటించరా? పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను తణుకు, ఉండి, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలకు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ప్రకటించేయగా.. వారు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించేశారు. మిగిలిన మూడు సీట్లలో ఎన్ని జనసేనకు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. సొంత సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ మూడు స్థానాల్లో ఒక్క సీటు కూడా జనసేనాని ప్రకటించకపోవడం కేడర్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. పొత్తులో భాగంగా ఈసారి ఆ సీటును బీజేపీ అడిగే అవకాశం ఉందంటున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీట్లలో అవమానంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. తణుకులో టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచంద్రరావు, ఆయన వర్గీయులు తాడేపల్లిగూడెం బహిరంగ సభను బహిష్కరించారు. ఇంతవరకూ ఆయనతో ఎవరూ మాట్లాడలేదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో నరసాపురం జనసేనలో ముసలం రేగింది. నరసాపురం సీటు మత్స్యకార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్కు ఇస్తారని భావించగా.. ఆ సీటు తమదేనంటూ సుబ్బారాయుడు వర్గం ప్రచారం చేసుకుంటోంది. పవన్కు నాయకత్వ పటిమ లేదు సినిమా డైలాగులే తప్ప పవన్కళ్యాణ్ వల్ల ఏమీ కాదని అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటంతటి నాయకత్వ పటిమ, గుండెధైర్యం ఉన్నట్లు అనిపించడం లేదు. ముందు భీమవరం అన్నారు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. అక్కడి నుండి పోటీ చేస్తే మాత్రం పవన్కు పరాభవం తప్పదు. ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు పవన్ పోటీలో ఉంటారో లేదో కూడా అనుమానంగా ఉంది. అందుకే భీమవరంలో పులపర్తి అంజిబాబు ఇంటికి వెళ్లి నేను పోటీ చేయకపోతే మీరు చేస్తారా? అని పవన్ బతిమాలారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ నాయకత్వ పటిమ, గుండె ధైర్యం ఏపాటివో అర్థమవుతోంది. – చేగొండి సూర్యప్రకాష్, వైఎస్సార్ సీపీ నాయకుడు, పాలకొల్లు జాప్యంతో మరింత చిచ్చు పొత్తులో జనసేనకు టీడీపీ కేటాయించిన 24 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంలో పవన్కళ్యాణ్ జాప్యం చేయడం సరి కాదు. ఈ జాప్యం వల్లే పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు పెరిగిపోయి, కొందరు బయటకు పోతున్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించకుండా జాప్యం చేయడం మంచిది కాదు. ఓ కాపు నాయకుడిగా ఈ పరిణామాలు నన్ను కొంత బాధిస్తున్నాయి. – పత్తి దత్తుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, కాపు సంక్షేమ సేన, అంబాజీపేట -
పవన్కున్నాయ్.. ప్రత్యేక కారణాలు
సాక్షి, అమరావతి/సాక్షి, భీమవరం: హెలికాప్టర్ లాండింగ్కు అనుమతించలేదన్న కారణ0తో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా పార్టీ సమావేశాలను వాయిదా వేసుకుంటారా? కానే కాదు. దాని వెనుక సొంత పార్టీ కారణాలు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా వెనుక కూడా టీడీపీ–జనసేన కూటమి గొడవలు, ఇతరత్రా కారణాలు ఉన్నాయి. అవి బయటపడకుండా హెలికాప్టర్ లాండింగ్కు అనుకూలంగా లేదన్న అధికారుల సూచనను రాజకీయం చేసేసి, అన్ని సమావేశాల్ని మంగళగిరికి మార్చేసుకున్నారు పవన్. ఇదీ అసలు కారణం జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు పార్టీ ల నాయకుల మధ్య ఉప్పు– నిప్పుగా ఉంది. ఈ కారణంతోనే ఇటీవలి కాలంలో పవన్ జిల్లా పర్యటనలకు వెళ్లడం లేదు. వారాహి యాత్రా ఆగిపోయింది. చివరాఖరికి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు ఉపక్రమించారు. బుధవారం నుంచి ఈనెల 17 వరకు మూడు రోజులు భీమవరంలోనే మకాం ఉండి భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలలో జరిగే జనసేన, టీడీపీ ముఖ్య నాయకుల సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ వర్గాల మధ్య బొత్తిగా పొసగడంలేదు. టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మధ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. వీరి గ్రూపు రాజకీయాలు పవన్ పర్యటనకు చేటుచేస్తాయని జనసేన నేతలు భావించినట్టు సమాచారం. దీనికి తోడు పెళ్లిళ్ల ముహూర్తాల కారణంగా పవన్ మకాం చేసేందుకు భీమవరం పరిసర ప్రాంతాల్లో గెస్ట్ హౌస్లు, సమావేశాలకు ఫంక్షన్ హాళ్లు దొరకలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ పర్యటన వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వంపై నెపం వేసి.. టీడీపీ–జనసేన కూటమిలో విభేదాలు, వసతి దొరకలేదన్న కారణాన్ని బయటకు చెప్పలేక, హెలిప్యాడ్కు ప్రత్యామ్నాయం చూడాలన్న అధికారుల సూచనను రాజకీయం చేసి, పబ్బం గడిపేసుకుంటున్నారు పవన్. హెలికాప్టర్ లాండింగ్కు అనుమతులివ్వడంలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లేసి కార్యక్రమాలను మంగళగిరికి మార్చేసుకున్నారు. వాస్తవానికి పట్టణంలోని విష్ణు కళాశాలల వద్ద ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ను జనసేన నాయకులు ఎంచుకున్నారు. ఈ హెలీప్యాడ్ వినియోగించి చాలా కాలమైంది. ఆ ప్రాంతంలో కొత్తగా భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మించడం, చెట్లు పెరిగిపోవడంతో ల్యాండింగ్కు సురక్షితం కాదని అనుమతి ఇవ్వలేదని ఆర్ అండ్ బీ ఈఈ ఎస్ లోకేశ్వరరావు తెలిపారు. గత నెలలో సీఎం జగన్ భీమవరం పర్యటన సందర్భంగా విష్ణు కళాశాల హెలీప్యాడ్ అనుకూలంగా ఉండదని భావించడం వల్లే పట్టణంలోని లూథరన్ హైసూ్కల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. పవన్ హెలికాప్టర్ కోసం కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని జనసేన నేతలకు సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తదితరులు ఉండి సమీపంలోని ఫంక్షన్ హాలుకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయినా, అసలు కారణాలను కప్పిపుచ్చుతూ, పవన్కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్కు ఆర్ అండ్ బీ అధికారులు అనుమతులు మంజూరు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్న కారణంగా బుధవారం (14వ తేదీ) నుంచి జరగాల్సిన పర్యటన వాయిదా వేసుకున్నట్టు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆయా నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశాలు జరగనున్నట్లు తెలిపింది. ఇది కేవలం ఒక వంకేనని, అసలు కారణం టీడీపీ, జనసేన మధ్య విభేదాలేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఐదారు నెలల క్రితం బాబు అరెస్టు సమయంలో తన హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అప్పట్లో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చి, మధ్యలో రోడ్డుపైనే పడుకొని హడావుడి చేసిన పవన్.. ఇప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు రాలేరని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి కార్యాలయం నుంచి 150 కి.మీ. లోపే ఉన్న భీమవరానికి రోడ్డు మార్గంలో రావడం సులువైన పని అయినప్పటికీ, హెలికాప్టర్కు అడ్డంకుల పేరుతో పర్యటననే వాయిదా వేసుకోవడం విచిత్రంగానే ఉందని జనసేన నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. -
కొత్త అల్లుడికి వందల రకాల నోరూరించే వంటకాలు
-
బరిలో బౌన్సర్లు
సాక్షి, అమరావతి: సంక్రాంతి బరిలో పందెం కోళ్లతోపాటు బౌన్సర్లు సైతం దిగబోతున్నారు. సెలబ్రిటీలకు రక్షణ కవచంగా ఉండే బౌన్సర్లను షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో మాత్రమే బౌన్సర్లను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇకపై ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున సాగే కోడి పందాల జాతరలో ప్రైవేటు సైన్యంగా బౌన్సర్లు సైతం రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రధాన జిమ్ సెంటర్ల నిర్వాహకుల పర్యవేక్షణలో ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. శిక్షణ పొందిన బౌన్సర్లు సిద్ధంగా ఉన్నారని, కోడి పందాల నిర్వాహకులు అవసరమైతేనే తమను సంప్రదించాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరలేపారు. బలిష్టమైన శరీరాకృతి, ప్రత్యేక డ్రెస్ కోడ్తో బరుల్లో కలియ తిరిగే వారిని చూస్తే పందాల రాయుళ్లు సైతం గొడవలకు వెనుకడుగు వేస్తారు. వారి సహకారంతో బరుల్లో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా కోడి పందేలు నిర్వహిస్తారు. ప్రధానంగా భీమవరంలో 70 మంది, పాలకొల్లులో 20 మంది, రాజమండ్రిలో 300 మంది, విజయవాడలో 200 మంది, విశాఖపట్నంలో 300 మంది శిక్షణ పొందిన బౌన్సర్లు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి రోజువారీ వేతనాన్ని మాట్లాడుకుని బరిలో దించితే ఖరీదైన కోడి పందాల్లో సైతం గలీజు గొడవలకు అడ్డుకట్ట పడుతుంది. ఏడాదిపాటు కఠోర తర్ఫీదు సంక్రాంతి కోడి పందేల కోసం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పుంజుల పోరులో శాంతిభద్రతల సమస్య రాకుండా బౌన్సర్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం బౌన్సర్లకు కూడా ఏడాదిపాటు కఠోర శిక్షణ ఇస్తాం. వారికి ప్రత్యేకమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనం, తర్ఫీదులో కూడా అత్యంత శ్రద్ధ తీసుకుంటాం. – ఎస్కే ఖాసీం, కే12 జిమ్ అధినేత, భీమవరం స్టేటస్ సింబల్గా బౌన్సర్ సెలబ్రిటీ అయినా, ఎటువంటి ఈవెంట్ అయినా నలుగురు బౌన్సర్లు ఒకేచోట యూనిఫామ్తో క్రమశిక్షణతో నడిచి రావడం స్టేటస్ సింబల్గా మారిపోయింది. బాడీ బిల్డింగ్ పోటీల కోసం తర్ఫీదు పొందుతున్న యువత ఇప్పుడు కోడి పందాల బరుల్లో పహారా కాసేందుకు కూడా వెళ్తున్నారు. సంక్రాంతి మూడు రోజులు పందాల బరుల్లో గస్తీ కాస్తూ ఉపాధి పొందుతారు. – షేక్ నాగూర్, బౌన్సర్, ఉండి బరిలో బౌన్సర్లకు ఉపాధి బౌన్సర్ వృత్తిని యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 ఇస్తున్నారు. సెలబ్రిటీల రక్షణకు వెళితే రూ.2,500 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. తాజాగా కోడి పందాల బరుల్లో బౌన్సర్ల కోసం ఏజెన్సీలను సంప్రదించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వీటిలో చిన్న పందాల బరిలో రోజుకు రూ.1,500, భారీ పందాల్లో అయితే రూ.3 వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. – అడిదెల రిచీ, సీనియర్ కోచ్, భీమవరం -
ప్రాంతానికో ప్రత్యేకం
సాక్షి, అమరావతి: సంక్రాంతి సంబరాలను ఒక్కో ప్రాంత ప్రజలు ఒక్కో తరహాలో నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు.. కోనసీమలో ప్రభల తీర్థం.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు విన్యాసాలు.. కొన్నిచోట్ల పతంగులు ఎగురవేయడం వంటివి నిర్వహిస్తుంటారు. హోరాహోరీ తలపడే పందెం కోళ్లు సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర మొదలవుతాయి. భోగి రోజున మొదలై çసంక్రాంతి, కనుమ వరకు మూడు రోజులపాటు ఊరువాడా పెద్దఎత్తున జరిగే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. కోడి పందేల బరుల పక్కనే పేకాట, కోతాట, గుండాట వంటివి ఏర్పాటు చేయడంతో జూదాల జాతరను తలపిస్తాయి. ఏడాదిపాటు పహిల్వాన్ తరహాలో కోళ్లను మేపి.. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పందేల బరిలో దించుతారు. కోనసీమ ప్రభల తీర్థం సంక్రాంతి వేళ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కనుల పండువగా జరుగుతుంది. కోనసీమలో 80 వరకు ప్రభల తీర్థాలు నిర్వహిస్తుండగా.. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గతేడాది దేశ రాజధానిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లోనూ ఇక్కడ ప్రభలను ప్రదర్శించారు. బండ్ల లాగుడు.. పరుగు పందెంలో ఎడ్లు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలను రైతులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్ల జతకు బరువైన బండలు కట్టి నిర్దేశించిన ప్రాంతానికి ఏది ముందు చేరితే ఆ ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. దీంతోపాటు పలు విభాగాల్లో ఎడ్లను పరిగెట్టించి ముందుగా గమ్యానికి చేరుకున్న వాటిని విజేతగా ప్రకటిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడా ఈ పందేలు జరుగుతాయి. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోను ఈ తరహా పోటీలు భోగి రోజున ప్రారంభించి మార్చి వరకు కొనసాగిస్తారు. ‘జల్లికట్టు’తో పశువుల పండుగ తమిళనాడులోని జల్లికట్టు మాదిరిగా చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. రంకెలేస్తూ పరుగులు తీసే కోడె గిత్తలను పట్టుకోవడానికి యువత ఉత్సాహంగా ఉరకలేస్తుంటారు. ఆ సంస్కృతి చిత్తూరు జిల్లాలోనూ ఎక్కువగా కన్పిస్తుంది. తమిళనాడులో కనుమ రోజున జల్లికట్టు నిర్వహిస్తే.. మన రాష్ట్రంలో సంక్రాంతి ముందు నుంచి పశువుల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తోంది. -
ఉభయ గోదావరిలో చంద్ర-సేన సిగపట్లు!
‘పొత్తులతో పోటీ చేస్తే ఉభయ గోదావరులు మనవే’ అని గాలిలో ఈతలు కొడుతున్న టీడీపీ, జనసేన పా ర్టీలకు క్షేత్రస్థాయిలో సిగపట్లు మింగుడుపడడం లేదు. ఇరుపా ర్టీల అధిష్టానాల నుంచి ఎలాంటి సంకేతాలూ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. సీట్ల ప్రకటన వెలువడే సమయానికి ముదురు పాకాన పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల వ్యవహారాలతో కేడర్ అయోమయంలో పడుతోంది. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరుగుతున్నారు. తన సామాజికవర్గాన్ని గంపగుత్తగా చంద్రబాబు వద్ద మోకరిల్లేలా చేసి, త్యాగాలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేయడంపై జనసేన నేతలు, ఆశావహులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇరుపా ర్టీల్లో కనిపిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. –సాక్షి ప్రతినిధి, కాకినాడ/ఏలూరు ఉమ్మడి తూర్పుగోదావరి ♦ కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీలో సీనియర్గా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్రరావుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల టీడీపీ–జనసేన సమన్వయ సమావేశంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ఓడిస్తామంటూ సవాళ్లు – ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ♦ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం స్థానికేతరుడైన టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ టికెట్ రేసులో ఉన్నారు. స్థానికేతరుడైన అతడికి టికెట్ ఇస్తే ఓడిస్తామని స్థానిక జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పొత్తులో టీడీపీ ఈ సీటు కోల్పోవాల్సి వస్తే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే ఏర్పాట్లలో ఉన్నారు. ♦ కాకినాడ రూరల్ సీటు జనసేనకేనని ఆ పార్టీ నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా నిన్నమొన్నటి వరకూ పంతం నానాజీకి లైన్ క్లియర్ అయ్యిందని ప్రచారం జరగగా, మారిన రాజకీయ పరిణామాల్లో నానాజీకి కాకుండా ఆర్థికంగా స్థితిమంతుడైన నాయకుడికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారనే సమాచారంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేనకు కేటాయిస్తే స్వతంత్రంగా పోటీ చేస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మ, టీడీపీలో మరో వర్గం నుంచి జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్ కూడా బరిలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ♦ కాకినాడ సిటీ కోసం జనసేన ఇన్చార్జి ముత్తా శశిధర్, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టికెట్ ఆశిస్తున్నారు. కొండబాబుకు ఇస్తే పార్టీ నష్టపోతుందని మిగిలిన నాయకులు మోకాలడ్డుతున్నారు. జనసేన నుంచి కాకినాడ లోక్సభ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న పారిశ్రామికవేత్త సానా సతీష్ కూడా కొండబాబు అభ్యర్థి త్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ♦ తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ సీటు తమదంటే తమదేనని జనసేన నుంచి కందుల దుర్గేష్ ఒకపక్క, టీడీపీ నుంచిæ సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోపక్క ప్రచారం చేసుకుంటున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ పొత్తు చిత్తవ్వడం ఖాయమంటున్నారు. ♦రాజానగరం సెగ్మెంట్ కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దివంగత బొడ్డు భాస్కర రామారావు కుమారుడు వెంకట రమణ చౌదరి ప్రచారంలో ఉన్నారు. అయితే ఈ సీటు జనసేనకేనని, అభ్యర్థిని తానేనని అంటూ బత్తుల బలరామకృష్ణ చేస్తున్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. ♦ ఎస్సీలకు రిజర్వ్ చేసిన జనసేనకు బలమైన కేడర్ ఉన్న అమలాపురం సీటు తమకే ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇప్పటికే పోటీ పడుతూండగా, ఆయనను కాకుండా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెర మీదకు తీసుకువచ్చారు. దీంతో ఇరు వర్గాలూ నువ్వా నేనా అనే స్థాయిలో తలపడుతున్నాయి. ఈ రెండు పా ర్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ♦ గత ఎన్నికల్లో జనసేన గెలుపొందిన ఏకైక నియోజకవర్గం రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పట్టుబడుతున్నారు. ♦డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీకే ఖాయమైందని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రచారం చేసుకుంటూండగా.. ఆవిర్భావం నుంచీ లక్షల రూపాయలు తగలేసుకున్న తమను విస్మరించి, టీడీపీకి కేటాయిస్తే తమ సత్తా చాటుతామని జనసేన ఇన్చార్జి, బీసీ నాయకుడు పితాని బాలకృష్ణ వర్గం బాహాటంగానే చెబుతోంది. ♦ కొత్తపేట నియోజకవర్గంలో జనసేన–టీడీపీల మధ్య సీటు కోసం సిగపట్లు నడుస్తున్నాయి. టీడీపీ, జనసేన తరఫున అన్నదమ్ములైన బండారు సత్యానందరావు (టీడీపీ), బండారు శ్రీనివాస్ (జనసేన) పోటీ పడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. బండారు సత్యానందరావుకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యానికి కేటాయించాలని బీసీ సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి ♦ కొవ్వూరు కోసం టీడీపీ మాజీ మంత్రి జవహర్, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ♦ ఏలూరులో జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు 2019 నుంచి పని చేస్తూండగా, ప్రస్తుతం 2024 ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు అప్పలనాయుడుకి టికెట్ ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమే. కాపు సామాజిక వర్గానికి చెందిన, వ్యాపారవేత్త నారా శేషు, మామిళ్ళపల్లి జయప్రకాష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ (చంటి), ఇడా చైర్పర్సన్గా పని చేసిన మధ్యాహ్నపు ఈశ్వరి భర్త బలరాం టికెట్కు ప్రయత్నాలు సాగిస్తూ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. ♦ కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. జనసేన నుంచి బీవీ రావు ఒకపక్క, కొల్లి వరప్రసాద్ మరోపక్క పోటీ పడుతున్నారు. కొల్లి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు మద్దతు ఇస్తుంటే.. బీవీ రావు టీడీపీ నాయకులకు మద్దతుగా ఉన్నారు. జనసేన నాయకులను టీడీపీ నేతలు అసలు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి. ♦ ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన నుంచి పశ్చమట్ల ధర్మరాజుకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుండగా, టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు టికెట్ ఖాయమైందని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో రెండు పా ర్టీల మధ్య వైషమ్యాలు నేతలకు తలపోటుగా మారాయి. ♦ పోలవరం సీటు కోసం జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సిర్రా బాలరాజు మరోసారి టికెట్ ఆశిస్తుండగా, టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, ప్రగడపల్లి కార్యదర్శి కొవ్వాసి జగదీశ్వరి టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ కూడా సీట్ల సిగపట్లతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ♦ దెందులూరు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో టీడీపీ రాష్ట్ర సాధికారత చైర్మన్ అశోక్గౌడ్, ఈడ్పుగంటి శ్రీనివాస్ తలపడుతున్నారు. చింతమనేనికి వ్యతిరేకంగా ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి టికెట్ ఇవ్వవద్దని ఫిర్యాదులు చేశారు. ఆ సామాజికవర్గం నుంచి ఈడ్పుగంటి శ్రీనుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల వైషమ్యాలూ ఆ పార్టీని రోడ్డున పడేశాయి. ♦ పాలకొల్లు సీటు టీడీపీకి కేటాయించనున్నారని ప్రచారం చేసుకుంటున్న సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ టికెట్ తనదేని అంటున్నారు. ఈ స్థానం టీడీపీని కాదని జనసేనకు కేటాయిస్తే నిమ్మల ఇండిపెండెంట్గా వెళ్లడం తప్పదని చెబుతున్నారు. ♦నూజివీడులో జనసేన నుంచి బర్మా ఫణిబాబు, టీడీపీ నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. ♦ తణుకులో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రా«ధాకృష్ణ, జనసేన నుంచి విడివాడ రామచంద్రరావు టికెట్ ఆశిస్తున్నారు. రామచంద్రరావుకు ఈసారి న్యాయం చేస్తానని, ఇతనే అభ్యర్థని పవన్కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు బెబుతున్నారు. ఆమేరకు ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో టికెట్ వదలబోమని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హడావుడి చేస్తోంది. ♦ నర్సాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ప్రస్తుత ఇన్చార్జి పొత్తూరి రామరాజు, ఎన్నారై కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ పడుతున్నారు. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్కు టికెట్ ఖాయం అయ్యిందనే ప్రచారంతో టీడీపీ ఆశావహులు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ తాడేపల్లిగూడెంలో టీడీపీ నుంచి వలవల మల్లికార్జునరావు (బాబ్జీ) రేసులో ఉంటే మరోపక్క ఈలి నాని కూడా టికెట్ తనదే అని ప్రచారం గట్టిగా చేసుకుంటుండటంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ బలంగా ఉన్న జనసేనకే సీటు కేటాయించాలని ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ సత్తా చూపిస్తామంటున్న పరిస్థితులు రెండు పా ర్టీలకూ మింగుడుపడటం లేదు. ♦ భీమవరం టీడీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్చార్జి తోట సీతారామలక్షి్మపై కేడర్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా చేస్తున్న తోటను కాకుండా మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావును ప్రతిపాదిస్తున్న పరిస్థితులు.. పా ర్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డున పడేసే పరిస్థితి కనిపిçస్తోంది. ఇక్కడ జనసేన నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉండటంతో ఆశావహులు దిక్కుతోచని స్థితిలో ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. పవన్ కాకుంటే ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) కూడా రేసులో ఉన్నారు. జనసేన నుంచి ఎవరు బరిలోకి దిగినా మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ♦ఉండి సీటు కోసం జనసేన ఇన్చార్జి జుత్తిగ నాగరాజు గట్టిగా పట్టుబడుతుండగా.. టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు వర్గం ఎమ్మెల్యే రామరాజుతో విభేదిస్తోంది. ఇక్కడ జనసేన, టీడీపీ పైకి ఐక్యతగా కనిపిస్తున్నా.. అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓం ప్రథమం... ఎదురైంది దుశ్శకునం
మనకున్నది బలం కాదు వాపని తేల్చేసిన నాయకులు కాకినాడ సమీక్షలో పవన్ కు షాకిచ్చిన క్యాడర్ టీడీపీతో కలిసి పని చేయలేమని స్పష్టీకరణ మాకు బాగా పట్టున్న జిల్లాలివి.. ఇక్కడ ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడిని అయినా ఓడిస్తాం.. మేము దిగనంతవరకే.. దిగితే ఆట మారిపోతుందన్న భ్రమల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితి అవగతం అవుతోంది. వెక్కిరించేవాళ్ల ముందరే కాలు జారిపడిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభంజనం.. తుపాను రాబోతోంది.. మొత్తం ఈస్ట్.. వెస్ట్.. పవన్ ఈజ్ బెస్ట్ అన్నట్లుగా ఊదరగొట్టిన జనసైనికులు జనసేన ప్రధాన నాయకులుగా చెప్పుకున్నవాళ్లకు గత రెండు రోజులుగా వాస్తవాలు అర్థం అవుతున్నాయి. జనాన్ని పోగేసి సభలు.. మీటింగులు పెట్టడం వేరు.. జనాన్ని తనవెంట నడిపించి వాళ్లతో ఓట్లు వేయించడం వేరు అన్నది అర్థం అర్థం అవుతోంది. కాకినాడ జిల్లాతో నియోజకవర్గం రివ్యూలు మొదలు పెట్టిన పవన్కు మొదట్లోనే గొంతులో అడ్డం పడిపోయింది. క్యాడర్ నుంచి.. ఓ మోస్తరు నాయకులవరకూ చెబుతున్న ఫీడ్ బ్యాక్ చూసి దిమ్మెత్తిపోయింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ను చెడ్డీ మీద కొట్టుకుంటూ నడిపిస్తాను అని అప్పట్లో వార్ణింగ్ ఇవ్వడం ఐతే ఇచ్చారు కానీ అక్కడ జనసేనకు అభ్యర్థే లేరు. కాపులు మొత్తం చంద్రశేఖర్ వెంట ఉండడంతో పవన్ తరఫున పోటీ చేసి చేతులు కాల్చుకునేందుకు అభ్యర్థి కరువయ్యారు. రెండు జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో జనసేన దాదాపు పాతికపైగా సీట్లు గెలుస్తుంది అని భ్రమల్లో ఉంటూవచ్చిన వారికి ఇప్పుడు పట్టుమని పదిమంది అభ్యర్థులు కనిపించడం లేదు. ఎదురులేదని చెప్పుకున్న ఈస్ట్, వెస్ట్ గోదావరిలోనే ఇలా ఉంటె మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్నది పార్టీ పెద్దలకు అంతుపట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ రాదని తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జనసేనలో చేరారు. ఈ క్రమంలోనే పవన్తో సమీక్షకు హాజరయ్యారు. అయన కూడా గ్రామ స్థాయిలో పార్టీకి ఏమీ బలం లేదని.. ఉన్నదంతా వాపేనని తేల్చి చెప్పారు. దీంతోబాటు తెలుగుదేశం కోసం సీట్లు త్యాగం చేసే పరిస్థితి లేదని, అలాగని టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు కలవదని, నిలవదని ఓట్ల బదలాయింపు జరగదని తేల్చి చెప్పేసారు. రెండు పార్టీల పొత్తు పొసగదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా.. మండల కార్యవర్గాలను ఎందుకు వేయలేదని పవన్ ప్రశ్నించగా.. మీరెళ్ళి చంద్రబాబుకు ఊడిగం చేస్తుంటే మేము పార్టీని ఎలా మోస్తాం.. మేమెలా నిర్ణయాలు తీసుకుంటాం అని ఎదురు ప్రశ్నించడంతో పవన్ నోట మాట రాలేదని తెలిసింది. చిత్తూరులో నాయకుల చిటపట ఇదిలాఉంటే శనివారం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జనసేన జిల్లా సమావేశానికి హయారయ్యారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కష్టపడాలి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ చేసిన ప్రసంగం అక్కడ గలాటా రేపింది. కాసేపు ఉండి సమావేశం నుంచి చంద్రబాబు బయటకు వెళ్ళిపోగానే జనసైనికులు హరిప్రసాద్ మీద ప్రశ్నల దాడి చేశారు. చంద్రబాబుకు మనం ఎందుకు ఊడిగం చేయాలి.. మనం పవన్ కోసం కదా పని చేస్తున్నాం. మీరు అలా మాట్లాడితే ఎలా అంటూ కుప్పం జనసైనికులు ప్రశ్నించేసరికి హరిప్రసాద్ నిరుత్తరుడయ్యారు. అధికారంలో సైతం జనసేనకు వాటా ఇవ్వాల్సిందేనని, ఆలాగైతేనే పొత్తు ఉంటుందని జనసైనికులు తేల్చి చెప్పేసారు. - సిమ్మాదిరప్పన్న -
పుంజు భలే రంజుగా!
సాక్షి, భీమవరం: ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి దాదాపు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందడిని తెచ్చే కోడి పందేలకు అప్పుడే తెర లేచింది. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను పందెం బరిలో నిలపడానికి సిద్ధం చేస్తున్నారు. కోడి పుంజుల ఎంపిక, వాటికి ప్రత్యేక శిక్షణ, మంచి పౌష్టికాహారం, శారీరక పటుత్వానికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తూ పందెం బరిలో నిలపడానికి సై అంటున్నారు. మేత, శిక్షణ.. పెద్ద కసరత్తే ఏ వ్యక్తితో అయినా గొడవ పడి, కోపం వచ్చి నప్పుడు నిన్ను పందెం పుంజును మేపినట్టు మేపానని దెప్పడం గోదావరి జిల్లాల్లో సర్వసాధారణం. దీనినిబట్టి పందెం కోళ్లను ఇక్కడ ఏ విధంగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. పది నిమిషాల పాటు ఉండే పందెం బరిలో ప్రత్యర్థి పుంజును మట్టికరిపించేందుకు కోళ్ల పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే వాటికిచ్చే మేత, శిక్షణలో పెద్ద కసరత్తే చేస్తారు. పండుగ సమయంలో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. ఆ మూడు రోజులు కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే భారీ బరులు, గ్యాలరీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పందేలను చూడటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున వస్తుంటారు. వారితో ముందుగానే హోటళ్లు, లాడ్జిలు నిండిపోతాయి. మటన్ నుంచి డ్రైప్రూట్స్ వరకు.. శిక్షణలో పుంజుకు శక్తి, సామర్థ్యం పెంచేందుకు, దాని శరీరంలో కొవ్వు చేరకుండా సులువుగా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలపాటు ప్రత్యేక మేతను అందిస్తారు. కోడి పరిమాణాన్ని బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం పప్పులు, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు పెడతారు. సాయంత్రం.. చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని ఆహారంగా అందిస్తారు. పుంజుకు నొప్పులు తగ్గేందుకు ప్రత్యేక శిక్షణ.. పండుగ దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు. ఇందుకు వేప, జామాయిల్, కుంకుడు, వెదురు, వాయిల తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాల వాటిని నీటిలో వేసి గంటల కొద్దీ మరిగిస్తారు. ఈ ద్రావణాన్ని చిన్న తొట్టెలో కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చుతారు. ఆ తర్వాత అందులో పుంజును ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారం రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు చేయిస్తారు. చివరిగా శాఖల కోసం పొయ్యిపై మూకుడిని వేడి చేస్తూ.. అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దాన్ని కోడి శరీరమంతా అద్దుతారు. వారానికి ఒకసారి చొప్పున, కొందరు.. రెండు మూడుసార్లు కూడా ఈ శాఖలు చేయిస్తుంటారు. ఏ ప్రక్రియ అయినా కోడి సామర్థ్యాన్ని బట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా పందెం పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తారు. ఆయుర్వేద పద్ధతులను అనుసరించేవారూ ఉన్నారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. రూ.కోట్లలో వ్యాపారం మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు జీతాలుంటాయి. ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్లపోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఈ విధంగా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి. పండుగల కోసం రెండు వేలకు పైగా పందెం కోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పండుగకు నెలరోజులు మాత్రమే గడువుండటంతో ఇప్పటికే భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో పందెంకోళ్ల పెంపకం జోరుగా సాగుతోంది. పుంజుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ.. బరిలో ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందెంరాయుళ్లు పుంజుల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాల వద్ద పుంజులను పెంచితే అధిక శాతం మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను కొనుగోలు చేసి వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకు అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందుగానే అడ్వాన్స్లు చెల్లిస్తుండటం విశేషం. పందెం పుంజులకు ఉన్న డిమాండ్తో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150కి పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నట్టు అంచనా. కాకి, నెమలి, పచ్చకాకి, కేతువ, డేగ.. వివిధ రంగుల్లో కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు సిద్ధం చేస్తారు. ఎంపిక చేసుకున్న పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు అవలంబిస్తారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నది.. తమ పుంజు బలం, బలహీనత ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పందెం పుంజు దినచర్య ఇలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లల్లో పటుత్వానికి, ఆయాసం రాకుండా ఉండేందుకు, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు దాదాపు నెల పాటు రోజు విడిచి రోజు ఈత కొట్టిస్తారు. తదుపరి ప్రక్రియగా ‘వి’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగేలా బేటా (ని ర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ నడిచేలా చేస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేయిస్తారు. తర్వాత మేత పెట్టి ఉదయం 11 గంటల వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మారుస్తారు. -
తుపాను బాధితులకు అండగా ఉండాలి
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సాంకేతిక నిపుణుల బృందం గురువారం పర్యటించింది. బాపట్ల, పశ్చిమ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించి నమూనాలు సేకరించింది. శుక్రవారం మిగిలిన జిలా్లల్లో పర్యటన అనంతరం నమూనాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక పంపనుంది. పౌరసఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. కేంద్ర బృందం పరిశీలనలో వచ్చిన ఫలితాల ఆధారంగా ధాన్యం సేకరణలో ప్రత్యేక సడలింపులు కోరతామన్నారు. తద్వారా ధాన్యం రైతులకు ఎటువంటి తగ్గింపులు లేకుండా సంపూర్ణ మద్దతు ధర అందిస్తామన్నారు. ఆహార అవసరాలకు పనికిరాని ధాన్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి కోసం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరతామన్నారు. మిచాంగ్ తుపాను బాధితులకు అండగా ఉండాలంటూ గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వెలగపల్లి వరప్రసాద్రావు, కిలివేటి సంజీవయ్య కేంద్రబృందాన్ని కోరారు. గురువారం తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడాతో కూడిన బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది. రాష్ట్రం నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాకే‹Ùకుమార్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిశోర్, ఆర్డీఓలు కిరణ్కుమార్, చంద్రముని తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయాన్ని ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, భోజన వసతుల గురించి వివరించారు. ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి రూ.2500 ఇవ్వడమే కాకుండా నిత్యావసర సరకులను అందించామని వివరించారు. పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరిగినా, ప్రాణ నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. విద్యుత్, రోడ్లు, ఇరిగేషన్, మత్స్యశాఖ, పంచాయతీరాజ్లకు తీవ్రమైన నష్టం జరిగినట్లు తెలియజేశారు. స్థానిక రైతులు, అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పిన అన్ని అంశాలను కేంద్ర బృందం నమోదు చేసుకుంది. ఆ మేరకు కేంద్రానికి నష్టాల నివేదికను సమర్పించి అందరికి పూర్తిస్థాయిలో సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు గురువారం పర్యటించాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం, సంగాయగూడెం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి, కేఈ చిన్నయ్యపాలెం, కోటనందూరు, అల్లిపూడి, తొండంగి మండలం ఎ.కొత్తపల్లి, రావికంపాడు, పీఈ చిన్నాయపాలెం, ఏవీ నగరం, గొల్లప్రోలు మండలం మల్లవరం, కొత్తపల్లి మండలం రమణక్కపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామాల్లో తుపానుకు దెబ్బ తిన్న వరి, అరటి తదితర ఉద్యాన పంటలు, ఇళ్లను బృందం అధికారులు పరిశీలించారు. రైతులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నష్టాల వివరాలు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో ధాన్యం నమూనాలు సేకరించారు. తుపాను నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. -
తెరమరుగవుతున్న గోదారి
సాక్షి డెస్్క, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఏదో ఒకచోట తరచుగా సినిమా షూటింగులు జరుగుతుండేవి. ఆ పరిసరాల ప్రజలకు కొన్నాళ్ల పాటు ఇదే ముచ్చటగా ఉండేది. కమెడియన్ను చూశామనో.. విలన్ను పలకరించామనో.. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడిది గత వైభవంగా మిగిలిపోతోంది. వెండితెరపై నాడు విరిసిన జిల్లా అందాలు నేడు అంతగా కనిపించడం లేదు. సహజసిద్ధ స్టూడియోగా పేరు సంపాదించిన ఇక్కడి ప్రకృతి అందాలు ఇప్పుడు చిన్నబోతున్నాయి. వ్యయ ప్రయాసలకు భయపడి నిర్మాతలు ఔట్డోర్ షూటింగులకు చాప చుట్టేయడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఎందుకిలా అయిందంటే.. చాలా రంగాలను ప్రభావితం చేసిన ఆధునిక సాంకేతికత సినిమాను కూడా తాకింది. గతంలో మాదిరిగా ఆర్టిస్టులందరినీ లొకేషనుకు తీసుకువెళ్లే రోజులు పోయాయి. అందరినీ తీసుకుని వెళ్లాలంటే బస, రవాణా వంటి ఖర్చులతో చాలా బడ్జెట్ అయ్యేది. ఇప్పుడు నిర్మాతలు ఈ విషయంలో పొదుపు పాటిస్తున్నారు. పాత రోజుల్లో సినిమా తీస్తూంటే మొత్తం ఆరి్టస్టులందరూ వచ్చేవారు. ఈ వ్యయం నిర్మాతలకు చాలా భారమయ్యేది. దీనికి తోడు ఎక్కువ సినిమా కథల నేపథ్యం పట్టణాలతో, నగరాలతో ముడిపడి ఉంటోంది. పల్లె కథలు తగ్గిపోతున్నాయి. 90 ఏళ్ల క్రితమే స్టూడియో సుమారు 90 ఏళ్ల క్రితమే జిల్లాలో సినిమా షూటింగులకు స్టూడియో ఏర్పాటైంది. 1936లో నిడమర్తి దుర్గయ్య ధవళేశ్వరం వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో దుర్గా మూవీ టోన్ స్టూడియో నిర్మించారు. చల్మోహన్రంగా వంటి చిత్రాలు ఇక్కడ తీశారు. ఆరేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఇది మూత పడింది. కానీ జిల్లాలో షూటింగులు మాత్రం కొనసాగాయి. జిల్లా నుంచి ఎందరికో చాన్స్ జిల్లాలో సినిమా షూటింగుల ప్రభావం ఫలితంగా చాలామంది ఈ రంగానికి వెళ్లాలని ఉత్సాహపడేవారు. దర్శక నిర్మాతలు తరచూ వస్తూండటంతో ఉమ్మడి జిల్లాలోని ఎంతోమంది ఔత్సాహికులకు సినిమా చాన్సులు దక్కాయి. అంజలీదేవి, జయప్రద, సుకన్య, జరీనా వహాబ్, వహీదా రెహమాన్, లలితారాణి వంటి వారు హీరోయిన్లుగా వెలుగొందారు. ఈ జిల్లా నుంచే చెన్నై వెళ్లిన భానుప్రియ మీద కూడా జిల్లాలో జరిగిన సినిమా షూటింగుల ప్రభావమే ఉంది. బాల నటుడిగా ఆలీకి అవకాశమొస్తే ఇప్పుడు అగ్రశ్రేణి కామెడీ నటుడయ్యారు. ఆయనకు ముందు రాజబాబు కూడా కామెడీలో రాణించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పని చేసిన రంగనాథ్ ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆదుర్తి సుబ్బారావు, క్రాంతికుమార్, వంశీ, కాశీ విశ్వనాథ్, బాపు, శోభన్, ఎస్వీ కృష్ణారెడ్డి, సుకుమార్ నుంచి మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్కా వరకూ ఎందరో ఈ ప్రాంత వాసులు దర్శకులయ్యారు. నట వర్గం గురించి చెప్పుకుంటే జిల్లాకు చెందిన చాలామంది వెండితెరపై బలమైన ముద్ర వేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా షూటింగులు తగ్గిపోవడంతో సినిమాల్లో జిల్లా ప్రాతినిధ్యం కూడా పలుచబడిందనే చెప్పాలి. ఆదుర్తి నుంచి వంశీ వరకూ.. గోదావరి అందాలను పూర్తి స్థాయిలో వెండితెరకెక్కించిన ఘనత రాజమహేంద్రవరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు దక్కుతుంది. 1963లో ఆయన తీసిన మూగమనసులు గోదావరి నేపథ్యంలోనే సాగింది. ఈ సినిమా హిట్ కావడంతో తర్వాత ఏదో ఒక విధంగా వెండితెరపై గోదావరి కనువిందు చేస్తూ వచ్చింది. 1963లో దర్శకుడు బాపు సాక్షి సినిమాకు జిల్లాలో ఎక్కువ లొకేషన్లు ఎంపిక చేసుకున్నారు. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రమిది. 1969లో బుద్ధిమంతుడు, 1973లో అందాల రాముడు తీశారు. మూగమనసులు సినిమాతో గోదావరితో పరిచయమేర్పడిన కె.విశ్వనాథ్కు ఈ నదీ తీర ప్రాంతాల్లో షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. 1973లో శారద సినిమాను గోదావరి పరిసరాల్లోనే నిర్మించారు. అక్కడి నుంచి వరుసగా తన చిత్రాలన్నింటిలోనూ గోదావరి అందాలను విశ్వనాథ్ తెరకెక్కించారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, బాలచందర్ సహా ఎందరో దర్శకులు పోటీ పడి మరీ గోదావరి జిల్లాలో చిత్రాలను నిర్మించారు. దేశంలోని ఇతర భాషా చిత్రాల షూటింగులకు కూడా మన ఉమ్మడి జిల్లా వేదికగా నిలిచింది. వంశీ కేరాఫ్ గోదావరి రాయవరం మండలం పసలపూడికి చెందిన సుప్రసిద్ధ దర్శకుడు వంశీకి గోదావరి అంటే ప్రాణం. అందుకే ఆయన చిత్రాల్లో గోదావరి అందాలే కాదు భాష, యాస కూడా కనిపిస్తూ మనసును గిలిగింతలు పెడతాయి. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమా పూర్తిగా గోదావరి ప్రాంతంతో ముడిపడిన వినోదభరిత చిత్రం. గోదావరి లేకుండా ఆయన ఏ సినిమా తీయలేదేమో అనిపించేలా జిల్లా లొకేషన్లన్నీ చూపించారాయన. -
ధర వరించేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 3,500 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్బీకేల్లో ఈ–క్రాప్ సోషల్ ఆడిట్ పూర్తయిన వెంటనే షెడ్యూల్ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరించనుంది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలకు ఎటువంటి లక్ష్యం నిర్ధేశించకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లోనూ మంచి ధర ఖరీఫ్లో 67.43 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 50 శాతం వరకు ఏ–గ్రేడ్ (ఫైన్ వెరైటీలు) ఉండటం విశేషం. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పంజాబ్ రైస్–126 రకాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం దిగుబడుల్లో విత్తనాలకు, గృహ అవసరాలతోపాటు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా.. 50–60 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఫైన్ వెరైటీలతోపాటు సాధారణ ధాన్యం రకాలను కూడా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు ఆరి్థక భారాన్ని తగ్గిస్తూ రవాణా, హమాలీ, గన్నీ చార్జీల కింద టన్నుకు రూ.2,523 అందిస్తోంది. తద్వారా బయటి వ్యాపారులు తమకు కావాల్సిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పకడ్బందీగా రవాణా ఏర్పాట్లు రవాణా శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్ల సమన్వయంతో జాప్యం లేకుండా కళ్లాల్లోని ధాన్యాన్ని తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆర్బీకే పరిధిలో 10–15 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చి ధాన్యం రవాణాను పర్యవేక్షించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో నవంబర్ తొలి రెండు వారాల్లో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. మూడవ వారంలో ఎన్టీఆర్, నాలుగో వారంలో పార్వతీపురం మన్యం, చివరి వారంలో శ్రీకాకుళం, విజయనగరంలో పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో విశాఖపట్నం, అనకాపల్లితో పాటు డిసెంబర్ నెలాఖరు నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. చాలా ప్రాంతాల్లో లేట్ ఖరీఫ్తో కోతలు ఆలస్యం అవుతున్నాయి. దళారులతో పని లేకుండా.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థను రూపుమాపి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల ప్రమేయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. 21 రోజుల్లోనే మద్దతు ధర జమ చేసేలా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలను వివరిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది. రైతులు ఆర్బీకేలో ధాన్యం ఇచ్చిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీవో) వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అందులో ధాన్యం వివరాలు, ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర నమోదై ఉంటాయి. ఎఫ్టీవో జనరేట్ అయితే రైతుకు, ధాన్యానికి సంబంధం ఉండదు. పూర్తి మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రవాణా, దిగుమతి, మిల్లర్కు సరుకు వచ్చినట్టు ఇచ్చే క్లియరెన్స్ను మిల్లుల వద్ద ప్రభుత్వం నియమించే కస్టోడియన్ (డిప్యూటీ తహసీల్దార్ స్థాయి) అధికారులు చూసుకుంటారు. తేమ, ఇతర నాణ్యత విషయంలో ఆర్బీకేలో ధ్రువీకరించిన ప్రమాణాలను మిల్లరు ఫైనల్గా పరిగణించాల్సిందే. రైతులకు మిల్లర్ నుంచి ఎటువంటి ఒత్తిడి/డిమాండ్ వచ్చినా ప్రభుత్వ కాల్సెంటర్ 1967కు సంప్రదిస్తే వెంటనే చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొనుగోళ్లకు సిద్ధం గోదావరి జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. వచ్చే వారంలో 150 ఆర్బీకేల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట రైతులు పంటను ఆరబెడుతున్నారు. మార్కెట్లో ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. అందుకే గోదావరి జిల్లాల్లో ఫైన్ వెరైటీలతో పాటు సాధారణ రకాలను కూడా ప్రైవేటు వ్యాపారులు మంచి ధరకు కొంటున్నట్టు తెలుస్తోంది. రైతుకు పూర్తి మద్దతు ధర అంటే ఎక్కువ రేటు తీసుకురావడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పెద్ద మిల్లుల్లో ధాన్యం ఆరబోతకు డ్రయర్లు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాం. తొలుత వంద మిల్లుల్లో పెట్టాలని కోరాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత పంట ఉత్పత్తులు బాగుండటంతో మార్కెట్లో ధర కూడా బాగా పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చినా తీసుకుంటాం. రైతులు ఆర్బీకేల్లో ధాన్యం ఇచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా అవసరమైన సంచులను అందుబాటులో ఉంచాం. సీఎంఆర్ కేటాయించిన ప్రకారం మిల్లర్లు సంచులు అందిస్తారు. ధాన్యం రవాణా కోసం ముందస్తుగానే వాహనాలను రిజిస్ట్రేషన్ చేశాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ మద్దతు ధరల చెల్లింపు ఇలా.. ఏ–గ్రేడ్ ధాన్యం: రూ.2,203 (క్వింటాల్కు) రవాణా, హమాలీ, గన్నీ చార్జీలు:రూ.2,523 (టన్నుకు) సాధారణ రకాలకురూ.2,183 (క్వింటాల్కు) -
కొబ్బరికి మహర్దశ
సాక్షి అమలాపురం: ఒకవైపు పరిశ్రమల లోటు తీర్చడం.. మరోవైపు స్థానికంగా పండే పంటలను ఉప ఉత్పత్తులుగా తయారు చేస్తే రైతుకు లాభసాటి ధర వస్తుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరిజిల్లాల్లో వరి తరువాత అతి పెద్ద సాగు కొబ్బరి. దశాబ్దాల కాలం నుంచి సాగవుతున్నా.. వీటి విలువ ఆధారిత పరిశ్రమలు స్థానికంగా లేకపోవడంతో కొబ్బరి మార్కెట్ తరచు ఒడుదొడుకులకు లోనవుతోంది. రాష్ట్రంలో సుమారు మూడులక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.78 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. దీన్లో ఒక్క డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి జిల్లాలోనే ఏడాదికి 124.72 కోట్ల కాయల దిగుబడి వస్తున్నట్లు అంచనా. ఇంత పెద్ద దిగుబడి వస్తున్నా తరచు కొబ్బరి సంక్షోభంలో కూరుకుపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్)కు కొబ్బరిని ఎంపిక చేసింది. ఈ పథకం కింద జిల్లాలో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేదానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్ ఇండియా బృందం గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిలా్లలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. హరిప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం సభ్యులు ముమ్మిడివరం వద్ద ఉన్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూనిట్ను, పేరూరులో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీల) ఆధ్వర్యంలోని కొబ్బరి తాడు పరిశ్రమను, మామిడికుదురు మండలం పాశర్లపూడిలో క్వాయర్ బొమ్మల దుకాణం, క్వాయర్ మాట్ యూనిట్, చీపుర్ల యూనిట్, కోప్రా యూనిట్, చార్కోల్ యూనిట్లను సందర్శించనున్నారు. ఉద్యానశాఖతోపాటు జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్డీఏ, కేవీఐబీ, హ్యాండ్లూమ్ అధికారులు వారికి జిల్లాలో కొబ్బరి పరిశ్రమల అవసరాన్ని, అవకాశాలను వివరించనున్నారు. వందకుపైగా ఉప ఉత్పత్తులు కొబ్బరి నుంచి వందకుపైగా ఉప ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చెప్పుకొనే స్థాయిలో పెద్ద పరిశ్రమలు లేవు. ఒకటి రెండు ఉన్నా అవి కేవలం క్వాయర్ పరిశ్రమలు మాత్రమే. ఇక్కడ పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని ప్రణాళిక సిద్ధం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా యువతతోపాటు మహిళా స్వయంశక్తి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధికంగా మేలు జరుగుతుంది. కొబ్బరికి స్థానికంగా డిమాండ్ పెరిగి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. -
వలంటీర్లే ‘రక్షణ’ కవచాలు
సాక్షి అమలాపురం: తమ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సేవలతోనే వలంటీర్లు బదులిస్తున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి ఏటిగట్లు తెంచుకుని ఊళ్లపై పడిపోకుండా తీసుకునే రక్షణ చర్యల్లో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటిగట్లను రేయింబవళ్లు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నపుడు ఏటిగట్ల రక్షణ చాలా ముఖ్యం. ఆ ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించిన సందర్భాలు గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నో ఉన్నాయి. వరదల సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 534.73 కి.మీల పొడవునా ఉన్న ఏటిగట్ల పరిరక్షణ గతంలో ప్రభుత్వ యంత్రాంగానికి తలకుమించిన భారంగా ఉండేది. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో ఇంత పొడవున ఏటిగట్లను పర్యవేక్షించడం సాధ్యం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వందలాది మంది వలంటీర్లు ఏటిగట్లను పర్యవేక్షిస్తూ పైఅధికారులకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు. సమాచారం తక్షణం చేరవేత గత ఏడాది భారీ వరదలకు రాజోలులోని నున్నవారిబాడవ వద్ద గట్టు దాటి నీరు ప్రవహిస్తున్న విషయాన్ని తొలిసారిగా గుర్తించింది వలంటీర్లే. వారిచ్చిన సమాచారంతో అధికారులు వేగంగా రక్షణ చర్యలు చేపట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది కూడా ఏటిగట్ల పర్యవేక్షణ బాధ్యతలను 740 మంది వలంటీర్లకు అప్పగించారు. ప్రతి అర కిలో మీటర్కు ఒక వలంటీర్ను నియమించారు. వీరు ఏటిగట్ల వద్ద రేయింబవళ్లు కాపలాగా ఉంటూ వరద ఉద్ధృతి, గట్ల పటిష్టతకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం పైఅధికారులకు అందిస్తున్నారు. ముంపు గ్రామాల్లో సేవలు ఏటిగట్ల పర్యవేక్షణ ఒక్కటే కాకుండా వరద ముంపుబారిన పడిన లంక గ్రామాల్లో వలంటీర్లు పలు రకాల సేవలందిస్తున్నారు. ముంపు బాధితులను గుర్తించి, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో సహాయపడుతున్నారు. వారికి భోజన సదుపాయల కల్పన, నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో చొరవ చూపుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం, అయినవిల్లి వంటి వరద ప్రభావం అధికంగా ఉన్న మండలాల్లోని లంక గ్రామాల్లో వీరు చురుగ్గా సేవలందిస్తున్నారు. కష్టసమయంలో ఆసరాగా నిలబడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. నాడు తక్కువగా సిబ్బంది గతంలో గోదావరి వరద సమయంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తరువాత ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సహాయంగా ఉండేవారు. ఒక హెడ్వర్క్స్ ఏఈ తన పరిధిలో సుమారు 10 నుంచి 15 కి.మీ.ల పొడవున ఏటిగట్టు బాధ్యత చూసేవారు. వీరికి లష్కర్లు సహాయం అందించేవారు. ఇరిగేషన్ శాఖలో కొన్నేళ్లుగా లష్కర్ల కొరత ఉంది. అప్పట్లో ఏటిగట్లకు కన్నాలు పడినా, కుంగిపోయినా, గండ్లు పడే అత్యవసర సమయాల్లో సమాచారం ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యమయ్యేది. ఈ కారణంగానే 2006 గోదావరి వరదలకు అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడి స్థానికులు పెద్దఎత్తున నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నిరంతరం అప్రమత్తంగా.. గోదావరి ఏటిగట్ల వద్ద వలంటీర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వారి పరిధిలోని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. గతేడాది వారిచ్చిన సమాచారంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కూడా వారు పర్యవేక్షణ పనిలో నిమగ్నమయ్యారు. – పువ్వాడ విజయ్ థామస్, డీడీవో, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు
సాక్షి, అమరావతి: తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అంతా సిద్ధం తాడేపల్లి: గోదావరి వరద ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్ధ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ‘‘ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 13.63 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. గోదావరి వరద ప్రభావం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎఎస్ఆర్ , కోనసీమ, ఏలూరు జిల్లాలలో ఎక్కువగా ఉంది. అల్లూరి జిల్లాలో ఐదు మండలాలలో 155 గ్రామాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలలో 49 గ్రామాలు, కోనసీమలో 20 మండలాలలో 141 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలలో 47 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, 17 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం ఉంది. వరద ప్రభావిత సహాయ చర్యలకోసం సీఎం జగన్ రూ. 12 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరద ప్రభావిత మండలాలలో, జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రానికి భద్రాచలంలో గోదావర వరద పెరిగే అవకాశాలున్నాయి. ఈనెల 30 నుంచి గోదావరి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాం. వరద సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. వరద సహాయక చర్యల కోసం మూడు NDRF, నాలుగు SDRF బృందాలు పనిచేస్తున్నాయి అని వెల్లడించారాయన. -
కోనసీమ నుంచి తమిళ సీమకు.. అరటిపండ్లలో ఈ అరటి వేరయా..!
‘అరటిపండ్లలో ఎర్ర చక్కెరకేళి అరటి వేరయా..’ అంటారు పండించే రైతులు, వైద్యనిపుణులు. సాధారణ అరటి కన్నా మిన్నగా అరుదైన పోషకాలు ఉండే ఈ పండును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. పండించే రైతుకు నిలకడైన ఆదాయాన్ని అందించే ఈ రకం అరటికి చెన్నై మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గోదావరి లంకల్లో పండే ఈ రకం అరటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఎగుమతుల విలువ ఏటా కోట్లలో ఉంటోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎర్ర చక్కెరకేళి సాగు అధికం. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, అలమూరుతో పాటు అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ రకం పంటను సాగుచేస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో కూడా ఈ రకం అరటి సాగు ఎక్కువే. ఈ మూడు జిల్లాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. ఎకరాకు 700 నుంచి 800 చెట్ల వరకు పెంచుతారు. అధికంగా గోదావరి లంక భూముల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇక మైదాన ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా కూడా వేస్తారు. – సాక్షి, అమలాపురం ధర ఘనం ఎర్ర చక్కెరకేళి అరటిపండుకు మంచి డిమాండ్ ఉంది. దీని గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకు ఉంటోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో గెల సైజును బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ధర ఉంది. అప్పుడప్పుడు ధరలు నేల చూపులు చూసినా సీజన్లో ఢోకా ఉండదని చెబుతున్నారు. కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలతో పోలిస్తే ఎర్ర చక్కెరకేళీకి నిలకడైన ధర ఉంటోంది. రావులపాలెం కేంద్రంగా.. ఈ మూడు జిల్లాల్లో పండే అరటిపంటను రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఎర్ర చక్కెరకేళి అధికంగా తమిళనాడు, తక్కువ మొత్తంలో కేరళకు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో మొదలయ్యే సీజన్ ఆగస్ట్ వరకు ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 10 వ్యాన్ల గెలలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో వ్యాన్లో 350 వరకు గెలలుంటాయి. వీటివిలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఏటా రూ.52 కోట్ల మేర ఎర్ర చక్కెరకేళి ఎగుమతులు జరుగుతాయి. సీజన్లో యార్డు వద్దకు రాకుండా నేరుగా రైతు తోటల వద్ద నుంచే రవాణా చేస్తుంటారు. పోషకాలు అధికం ఎర్ర చక్కెరకేళి అరటిలో ఎక్కువగా ఉన్న పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి శరీరంలో క్యాల్షియం పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ అరటిపండ్లలో కన్నా దీన్లో పోషకాలు అధికం. ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల కన్నా బీటా కెరోటిన్ అధికం. ఇది గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. సాగులో ప్రతికూలతలు ఎర్ర చక్కెరకేళి సాగుకు కొన్ని ప్రతికూలతలున్నాయి. సాధారణ అరటి దిగుబడి ఎనిమిది నెలలకే మొదలవుతుంది. ఇది ఏడాదిన్నర సమయం పడుతుంది. కార్శి తోటగా సాగుచేయడం పెద్ద ప్రయోజనకరం కాదు. బలమైన పోషకాలున్న నేలలు అవసరం. ఇతర అరటి రకాల కన్నా ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగించాలి. పెట్టుబడి సైతం ఎకరాకు రూ.లక్ష అవుతుంది. చెట్టు ఎత్తు పెరుగుతున్నందున తుపాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ. తమిళనాడు ఎగుమతులపైనే వ్యాపారం రావులపాలెం మార్కెట్ యార్డ్కు వచ్చే అరటిగెలల్లో 10 శాతం ఎరుపు చక్కెరకేళి అరటి గెలలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తమిళనాడుకు, తక్కువగా కేరళకు ఎగుమతి అవుతాయి. స్థానికంగా కొనుగోలు చేయడం చాలా తక్కువ. తమిళనాడు మార్కెట్పైనే ఇక్కడ వ్యాపారం ఆధారపడి ఉంటోంది. కానీ దీనికి నిలకడైన ధర మాత్రం దక్కుతోంది. – కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, రావులపాలెం పెట్టుబడి అధికం ఎర్ర చక్కెరకేళి సాగులో పెట్టుబడి అధికం. ఇతర అరటి రకాల సాగు కన్నా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అధికం. పంటకాలం కూడా ఎక్కువ. ఒకసారి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. కార్శి పంట దిగుబడి పెద్దగా రానందున గిట్టుబాటు కాదు. కానీ ధర మాత్రం లాభసాటిగా ఉంటోంది. మంచి దిగుబడి వచి్చ, రికార్డుస్థాయి ధర ఉన్నప్పుడు మాత్రం ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం వస్తోంది. – పెదపూడి బాపిరాజు, రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం ఆరోగ్యానికి ఎంతో మేలు ఎరుపు రకం అరటిపండ్లలో చక్కెరకేళి రకంలో ఇతర రకాల అరటిపండ్ల కన్నా వైవిధ్యకరమైన పోషకాలున్నాయని గుర్తించారు. బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మిగిలిన పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అధికంగా పొటాషియం, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తపోటు, ఒబేసిటీ బాధితులకు ఇది మంచిది. – వడ్డాది సురేశ్, ఎండీ జనరల్, వడ్డాది ఆస్పత్రి, రాజమహేంద్రవరం -
నిస్తేజం.. గందరగోళం.. జనసేన శ్రేణుల్లో అయోమయం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దశ, దిశ నిర్దేశం లేకుండానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ముగిసింది. తూర్పు సెంటిమెంట్గా ఈ నెల 14న అన్నవరం సత్యదేవునికి పూజలు నిర్వహించి, పవన్ ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పార్టీ నిర్దిష్ట అజెండా గురించి తన నాయకుడు వివరిస్తారని భావించిన ఆయన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాకినాడ జిల్లా కత్తిపూడి మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆదివారం జరిగిన ముగింపు సభ వరకూ వరుసగా వివాదాలు మూటగట్టుకున్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇటువంటి యాత్రలు చేసేటప్పుడు పార్టీ విధానపరమైన ప్రణాళికలను ప్రజల ముందు ఉంచుతుంది. తమకు ఓటేస్తే ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో అర్థమయ్యేలా వివరిస్తూ.. వారి మనసు చూరగొనే ప్రయత్నం చేస్తుంది. పవన్ అభిమానులు, ఆ పార్టీ నేతలు ఆయన నుంచి ఇవే ఆశించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా వన్మేన్ ఆర్మీ మాదిరిగా ఉమ్మడి తూర్పు గోదావరిలో పవన్ తన యాత్రకు ముగింపు పలికారు. పార్టీకి ఒక అజెండా అంటూ లేకపోవడం జనసేన నేతలకు రుచించ లేదు. ద్వారంపూడి, ముద్రగడపై విమర్శలతో పెనుదుమారం వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. రెండవ సారి గెలుపొందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంటి నేతలే లక్ష్యంగా పవన్ ప్రసంగం సాగడం సొంత సామాజిక వర్గ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. అలాగే, కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేత ముద్రగడ పద్మనాభం లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేయడం రాష్ట్ర స్థాయిలో పెను దుమారాన్నే రేపింది. అటు ద్వారంపూడి, ఇటు ముద్రగడ సంధించిన అనేక ప్రశ్నలకు, వచ్చే ఎన్నికల్లో పోటీపై విసిరిన సవాళ్లకు పవన్ సమాధానం చెప్పకుండానే తోక ముడిచారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వచ్చింది. గుండె ధైర్యం ఎక్కువని పదేపదే చెప్పుకునే ఆయన.. వారి సవాళ్లకు సరైన సమాధానం చెబుతారని ఎదురు చూశామని, తీరా చివరకు తల దించుకునేలా చేశారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఒకపక్క జనసేనకు కులాల అంతరాలు లేవంటూనే మరోపక్క తన ప్రసంగాల్లో కులాల ప్రస్తావనతో యువతలో పవన్ భావోద్వేగాలు రెచ్చగొట్టిన తీరును మేధావి వర్గం తప్పు పడుతోంది. పవన్ వాడిన పదజాలంపై రాజకీయాల్లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత ‘రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఇదేనా మీరిచ్చే సందేశం’ అంటూ చురకలు అంటించడం గమనార్హం. అయినా.. మారలేదు రీల్ లైఫ్కు, రియల్ లైఫ్కు చాలా తేడా ఉంటుందని చెబుతూనే ప్రసంగాలు, హావభావాల్లో ఫక్తు సినిమా స్టైల్ను ప్రదర్శించడంలో పవన్ ఔచిత్యాన్ని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తాను సీఎం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని కత్తిపూడిలో చెప్పుకున్న పవన్.. పచ్చ మీడియా ఇంటర్వ్యూల్లో ఏదో అభిమానులు అలా అంటూంటే వారిని ఉత్సాహ పరిచేందుకు అలా మాట్లాడాననడం ఒక పార్టీకి నాయకత్వం వహించే నాయకుడి లక్షణమా అని వివిధ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మార్పు రావాలని గొంతెత్తిన జనసేనాని తాను మారలేదనే విషయాన్ని వారాహి యాత్ర ద్వారా చెప్పకనే చెప్పారని ఆ వర్గాలు అంటున్నాయి. గోదావరి నేలను వదిలేది లేదని, ఈ జిల్లాలు రాజకీయ మార్పునకు నాంది పలుకుతాయని చెప్పిన పవన్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై గత ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా పూటకో మాటతో అభిమానులను గందరగోళంలో పడేశారు. ఆ పార్టీ నేతలే పెదవి విరుపు మంగళగిరిలో తెలుగుదేశంతో పొత్తు అనగానే గోదావరి జిల్లాల్లో పవన్ గ్రాఫ్ పడిపోయింది. 80వ దశకంలో వంగవీటి మోహన్ రంగా హత్యోదంతం నుంచి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబం పైన, కాపు సామాజికవర్గం పైన చంద్రబాబు ప్రభుత్వం సాగించిన దమనకాండను గుర్తుకు తెచ్చుకుని.. సామాజిక మాధ్యమాల్లో పలువురు పవన్ తీరును ఏకి పారేశారు. ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకో లేక కాస్తో కూస్తో బలం ఉన్న గోదావరి జిల్లాల్లో బలప్రదర్శన ద్వారా పొత్తుల్లో సీట్లు పెంచుకునేందుకో వారాహి యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాత్రలో తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు పలువురు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పుష్కర కాలంగా పార్టీ కోసం లక్షల రూపాయలు తగలేసుకుంటున్న ఇన్చార్జిలకు సైతం వారాహిపై వేదిక పంచుకునే అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టడంపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ‘తూర్పు’న వారాహి యాత్ర అనేక వివాదాలు, అసంతృప్తులతో ఆ పార్టీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలి్చంది. -
కాలు దువ్విన కోడి పుంజులు
సాక్షి,అమరావతి/కాకినాడ/భీమవర/పెనమలూరు: సంక్రాంతి సంబరాల తొలి రోజునే కోడి పందేల జాతర మొదలైంది. భోగి రోజైన శనివారం మొదలైన ఈ పందేలు మూడు రోజులపాటు నిర్వహించేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూ వాడా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేకచోట్ల పందేలు మొదలయ్యాయి. ఈ సారి భారీ బరుల వద్ద కోడి పందేల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విశాలమైన మైదానాలు, తోటల్లో బరులను ఏర్పాటు చేశారు. భారీ టెంట్లు వేసి కూర్చునేందుకు వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను సైతం ఏర్పాటు చేశారు. రాత్రి వేళలోనూ పందేలు కొనసాగేలా బరుల వద్ద ఫ్లడ్ లైట్లను అమర్చారు. కేరవాన్లు.. స్పెషల్ పాస్లు కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని వలసపాకలో పందేలు వీక్షించేందుకు పాస్లు జారీ చేశారు. కొన్నిచోట్ల పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్ వాహనం, కారు బహుమతిగా ప్రకటించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో భారీ ఏర్పాట్లతో ఒక్కో కోడి పందెం రూ.లక్షల్లో నిర్వహించారు. పందేల్లో పాల్గొనే వారికి వీవీఐపీ పాస్ ధర రూ.60 వేలు.. వీఐపీ పాస్ రూ.40 వేలుగా నిర్ణయించారు. పందేల రాయుళ్ల కోసం క్యూఆర్ కోడ్ నగదు చెల్లింపుల సౌకర్యం కల్పించారు. కొన్నిచోట్ల వీవీఐపీల కోసం బరులకు సమీపంలో కేరవాన్లు (బస చేసే వాహనాలు) కూడా ఏర్పాటు చేశారు. అతిథి మర్యాదలకు లోటు లేకుండా.. పందేలను చూసేందుకు, పందేలు ఒడ్డేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి అభిలాషకు అనుగుణంగా పలుచోట్ల బరుల నిర్వాహకులు అతిథి మర్యాదలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా హోటళ్లు, అతిథి గృహాలు, చేపల చెరువులపై మకాంలను కేటాయించి ప్రత్యేకంగా మాంసాహార వంటకాలు, విదేశీ మద్యంతో అతిథి మర్యాదల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘పశ్చిమ’లో 270 బరులు పశ్చిమ గోదావరి, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చిన్నాపెద్దా అన్నీ కలిపి కోడి పందేల బరులు దాదాపు 270 వరకు ఏర్పాటయ్యాయి. ఉండి, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఎక్కువ కోడి పందేలు గెలిచిన వారికి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతిగా ప్రకటించారు. దుంపగడప బరిలో ఏలూరు జిల్లా తాడినాడకు చెందిన వ్యక్తి 9 పందేలకు గాను 5 పందేలు గెలిచి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతి అందుకున్నాడు. ఏలూరు జిల్లా పరిధిలోనూ సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఈడుపుగల్లులో కోడిపందేల బరి ‘తూర్పు’ పందేలు డీలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహించినప్పటికీ.. గుండాటలను పోలీసులు అడ్డుకోవడంతో జూదరులు డీలా పడ్డారు. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 300 చోట్ల కోడి పందేల బరులు వెలిశాయి. గత సంక్రాంతితో పోల్చితే ఈ సారి కోడి పందేలు సాధారణంగా జరిగాయే తప్ప భారీ ఎత్తున ఎక్కడా జరగలేదు. ప్రత్యేక వాహనాల్లో రాక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేల బరులను సిద్ధం చేశారు. పెనమలూరు, గన్నవరం, మచిలీపట్నం, పామర్రు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన బరుల్లో సంప్రదాయంగా, రైతువారీగా కోడిపందేలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. వారి కోసం బరుల నిర్వాహకులు ప్రత్యేక వసతి సదుపాయాలను సమకూర్చారు. -
ఉభయగోదావరి జిల్లావాసులకు గుడ్న్యూస్..
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి భవిష్యత్తులో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే 3,165 మాటర్ల పొడవున్న రన్వే, 11 పార్కింగ్ బేస్తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం ఉండటం సానుకూలత కలిగిన అంశం. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు ఉండటంతో విమానాశ్రయం సేవలను విస్తృతం చేసేందుకు భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్యా చర్యలు చేపడుతోంది. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. - విమాన ప్రయాణికుల రాకపోకల సందర్భంలో స్టే చేయడానికి ఉన్న టెర్మినల్ భవనం సామర్థ్యం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు ఉండేందుకు సరిపోతుంది. - భవిష్యత్ అవసరాల రీత్యా భవనాన్ని మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందకు కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకు రూ.280 కోట్లు వెచి్చంచనున్నారు. - ఒకేసారి 1,400 మంది ప్రయాణికులుండే సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఐదు - విమానాలు ఒకేసారి చేరినా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - విమానాల్లో రాక, పోకలు సాగించే ప్రయాణికుల లగేజీ తనిఖీ వ్యవస్థను వివిధ రకాల్లో ఆధునీకరించనున్నారు. - ఇన్లైన్ బ్యాగేజీ సిస్టం తీసుకురానున్నారు. - ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేస్తారు. కియోస్క్ ద్వారా ఆధునీకరణ పద్ధతుల్లో ప్రయాణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. 3 ఎయిరో బ్రిడ్జిలు ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ఎయిరోబ్రిడ్జిలు నిర్మిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జిల ద్వారా విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసులోకి ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఆలస్యం జరగదు. టెర్మినల్ భవనం నుంచి విమాన సర్వీసు వరకూ వెళ్లేందుకు సమయం వృథాకాదు. ప్రస్తుతం జరుగుతున్న విధానంతో ఆలస్యాన్ని నివారించే వీలుంది.ప్రస్తుతం ఉన్న 6 ఇండిగో విమానాల జాబితాలో మరో ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం చేరనుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్కు నడవనుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాయంత్రం 4.50 గంటల చేరుతుంది. తిరిగి హైదరాబాద్కు 5.20కు బయలు దేరుతుంది. ఉడాన్.. ఒక లైన్ కేంద్ర ప్రభుత్వం విమాన సేవల విస్తృతిలో భాగంగా ప్రవేశపెట్టిన ఉడాన్ రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, తిరిగి విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి మాత్రమే నడుస్తోంది. తక్కువ ధరకే టికెట్టు లభిస్తుండటంతో మంచి డిమాండ్ నెలకొంది. మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 6 విమానాలు 12 సరీ్వసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆధునీకరణకు కృషి విమానాశ్రయం ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే వారం హైదరాబాద్కు ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన మరో విమానం ప్రారంభం కానుంది. బోయింగ్ విమాన రాకపోకలకు అనువైన రన్వే, పార్కింగ్ ఉండటం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కు సానుకూలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు çకృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే టెరి్మనల్ విస్తరణ చేపడుతున్నాం. అత్యంత భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం అందిచాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాం. కార్గో విమానాలు లేకవడంతో బెల్లీ కార్గో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఒక విమాన సరీ్వసుకు 500 కేజీల లగేజీ అనుమతిస్తున్నాం. కార్గో విమానాలకు ప్రతిపాదనలున్నాయి. - ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
‘పులస’ ప్రియులకు ఈ ఏడాది నిరాశేనా?
ఏదీ ఆ రుచి? ఆ అమోఘమైన రుచి ఏమైనట్టు? అద్భుతమైన ఆ రుచి ఎటు పోయినట్టు? పుస్తెలు అమ్మైనా పులస తినాలంటారే.. అసలు ఈ ఏడాది పులసల జాడేది? అవి లేకుంటే జిహ్వ చాపల్యం తీరేదెలా? మైమరపించే ఆ రుచిపై మోజు తీరేదెలా? పులసమ్మా.. పులసమ్మా.. ఏమైతివే? ఎటు పోతివే? కాసింత కానరావే..! సాక్షిప్రతినిధి, కాకినాడ: గోదావరి వరద ఉధృతి పులసను ఓడించింది. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహానికి ఎదురీదలేక పులస తలవంచింది. సముద్రంలో ఇలసలు గోదావరికి ఎదురీదుతూ పులసలుగా మారతాయి. జూలై – ఆగస్టు నెలల మధ్య పులసల సీజన్. ఆగస్టు వచ్చి మూడు వారాలు గడచినా గోదావరి తీరంలో పులసల జాడ లేదు. మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఉసూరుమంటున్నారు. పులసల సీజన్లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్తాయి. అదే వరద ఒరవడి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో సముద్రంలోని ఇలసలు గోదావరికి ఎదురీదలేక వెనక్కి పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సముద్రంలో ఉండే ఇలస(హిల్స)చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి. లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటే.. సముద్రం వైపు నుంచి విలసలు గోదావరికి రాగలుగుతాయి. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి 20–8–2022 వరకు ఏ రోజూ 10 లక్షల క్యుసెక్కులకు తక్కువ కాకుండా మిగులు జలాల (వరద నీరు)ను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలా రోజూ లక్షల క్యుసెక్కుల నీరు సముద్రానికి చేరుతుంటే.. ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయి. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్(నదీ ముఖద్వారం వద్ద)లు మొగలు పూడుకుపోవడం కూడా పులస రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని మత్స్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విలసలు గోదావరి వైపు రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు తరలిపోతున్నాయి. ఆ రుచికి.. ఈ రుచికి అసలు పొంతనే లేదు గోదావరిలో పులసలు లభించకపోవడంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న విలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు. అరకిలో విలస రూ.1,000 నుంచి రూ.1,500 పలుకుతోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు అలా సర్దుకుపోతున్నారు. గోదావరిలో లభించే పులస రుచికి, ఈ విలస రుచికి అసలు పొంతనే లేదంటున్నారు. గత సీజన్లో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల పరిమాణంలో లభించేవి. ధర రూ.10 వేలకు పైనే పలికేది. ఎదురీదలేక.. గోదావరికి ఉధృతంగా వరదలు రావడంతో పులసలు ఎదురీదలేకపోతున్నాయి. దీంతో గోదావరిలో పులసలు కానరావడం లేదు. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికిన విలసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ, యానాం. విచక్షణ రహిత వేటతో పులసలకు ప్రమాదం విచక్షణ రహితంగా సాగుతున్న వేట కారణంగానే గోదావరిలో పులసల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. గతంలో దాదాపు ఆరు కిలో మీటర్ల మేర మాత్రమే సముద్రంలో వేట సాగేది. ప్రస్తుతం ఆధునిక బోట్లు, వలల కారణంగా వంద కిలో మీటర్లు కూడా వేట సాగుతోంది. ఫలితంగా పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయి. అందులో పులస జాతి కూడా ఉంది. – పీవీ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్, రాజమహేంద్రవరం -
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45–55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ., వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని, ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. -
ధాన్యాగారంలో జలసిరులు
సాక్షి, అమరావతి: సమృద్ధిగా ఉన్న సాగునీటితో వరి సాగులో ఉభయ గోదావరి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచి ధాన్యాగారంగా భాసిల్లుతుండగా అనంతపురం జిల్లాలో ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగును రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో వినియోగించుకుంటూనే అలాంటి అవకాశం లేని చోట్ల ఇతర పంటలను సాగు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. పండ్ల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కోసం అనంతపురం నుంచి దేశ రాజధానికి ప్రత్యేకంగా కిసాన్ రైలు ఇప్పటికే ప్రారంభమైంది. రైతన్నకు ఆదాయంతోపాటు అందరికీ ఆరోగ్యాన్ని పంచేలా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచేలా మిల్లెట్ బోర్డును ఏర్పాటు చేసింది. భారీగా పెరగనున్న సాగు విస్తీర్ణం.. కడలి వైపు కదిలిపోతున్న కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా జలాలను ఒడిసి పట్టడం ద్వారా ఈ ఖరీఫ్లో 1.11 కోట్ల ఎకరాలకు సాగు నీరందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఏపీఎస్ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) ఎత్తిపోతల పథకాల కింద ఇప్పటికే 52 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేశారు. నాగార్జునసాగర్కుడి, ఎడమ కాలువలు, రాయలసీమలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా, సోమశిల, కండలేరు ఆయకట్టులో పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరునాటికి సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని, నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీళ్లందిస్తామని జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి. రికార్డు స్థాయిలో సాగునీరు.. దిగుబడులు ► గతేడాది ఖరీఫ్లో 1,00,44,463 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్లో కోటి ఎకరాలకు నీళ్లందించడం అదే ప్రథమం. ప్రస్తుత ఖరీఫ్లో 1,11,41,471 ఎకరాలకు నీళ్లందించడం ద్వారా గత రికార్డును తిరగరాసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ► గతేడాది 171.37 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయడం సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రభుత్వం దేశానికి ధాన్యాగారంగా రాష్ట్రాన్ని మరోసారి నిలబెట్టింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా దిగుబడులు సాధించేలా అన్నదాతలను ప్రోత్సహించడం ద్వారా ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా రాష్ట్రానికి ఉన్న పేరును ఇనుమడింపజేయాలని నిర్ణయించింది. నిండుకుండలు... ► కృష్ణమ్మ పరవళ్లతో పరీవాహక ప్రాంతం (బేసిన్)లో ప్రాజెక్టులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో 561 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్లో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పెన్నా బేసిన్లో గండికోట, మైలవరం, వెలిగోడు, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో 115 టీఎంసీల మేర నిల్వ ఉన్నాయి. ► వంశధారలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూన్ 9న ఎత్తిన గొట్టా బ్యారేజీ గేట్లు ఇప్పటివరకూ దించలేదు. నాగావళి బేసిన్లో తోటపల్లి బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట గేట్లను కూడా దించలేదు. ► ఏలేరు బేసిన్ ఏలేరు ప్రాజెక్టులో 22.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఉభయ గోదావరుల్లో ధాన్యసిరి.. ► పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పటిదాకా 6,86,614 ఎకరాల ఆయకట్టులో వరి సాగుతో ప్రథమ స్థానంలో ఉండగా తూర్పుగోదావరి 6,77,224 ఎకరాల్లో వరి సాగుతో రెండో స్థానంలో ఉంది. ► కృష్ణా జిల్లా 6,08,973 ఎకరాల్లో వరి సాగుతో మూడో స్థానంలో నిలిచింది. 5,73,531 ఎకరాల్లో వరి సాగుతో శ్రీకాకుళం జిల్లా నాలుగో స్థానంలో ఉంది. ► మొత్తమ్మీద ఇప్పటిదాకా సుమారు 52 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో అన్నదాతలు వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి తదితర పంటల సాగు చేపట్టారు. మా రికార్డును మేమే అధిగమిస్తాం.. “దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వర్షాలు మళ్లీ సమృద్ధిగా కురుస్తున్నాయి. నదులు ఉరకలెత్తడంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. గతేడాది ఖరీఫ్లో కోటి ఎకరాలకు నీళ్లందించి రికార్డు నెలకొల్పాం. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించి ఆ రికార్డును తిరగరాస్తాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ – డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి. ఒక్క ఎకరాను ఎండనివ్వం.. “ఖరీఫ్లో 1.11 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాం. ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఆయకట్టు చివరి భూములకూ నీటిని సరఫరా చేస్తాం. నీటి యాజమాన్యంతో వృథాకు అడ్డుకట్ట వేసి మరింత ఆయకట్టుకు నీళ్లందేలా సహకరించాలని అన్నదాతలను కోరుతున్నాం’ – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ఇన్చీఫ్, జలవనరుల శాఖ. “అనంత’లో చిరుధాన్యాలకు ప్రోత్సాహం – అనంతపురం జిల్లాలో చిరుధాన్యాల సాగును 4 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65 వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయడంతోపాటు రుణ పరిమితి (స్కేల్ ఫైనాన్స్) పెంచుతూ చర్యలు చేపట్టింది. – జిల్లాలో 2.02 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సాగులో ఉండగా 54 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. పండ్ల ఉత్పత్తులను రైతులు ఢిల్లీకి తరలించి మంచి ధరలకు విక్రయించుకునేలా ఇప్పటికే అనంతపురం నుంచి దేశ రాజధానికి ప్రత్యేకగా కిసాన్ రైలును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 500 టన్నుల పండ్ల ఉత్పత్తులను ఈ రైలు ద్వారా తరలిస్తున్నారు. – ఎక్కువగా నీటి వనరులు, పెట్టుబడి వ్యయం అవసరమయ్యే వరి సాగుకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, కొర్రలు, అరికెలు, రాగులు, సామలు లాంటి పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
‘పులస’ ముక్క పంటికి తగిలితే..ఆహా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది అన్ని చేపల్లాంటిదీ కాదు. దాని రాక, పుట్టుక.. రుచి, ధర.. అన్నీ ప్రత్యేకమే. ఏడాదికోసారి మాత్రమే.. అదీ ఈ సీజన్లోనే.. అందునా వరద గోదావరిలోనే.. అది కూడా ధవళేశ్వరం బ్యారేజి నుంచి సాగరసంగమం వరకు ఉన్న పాయల్లోనే దొరికే చేప. పేరు ‘పులస’. ఆ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరుతూంటుంది. వండిన తరువాత ఆ ముక్క పంటికి తగిలితే.. ఆ రుచికి నాలుక వహ్వా అంటుంది. జీవితంలో ఒకసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకుని తినాలి్సందే.అత్యంత ఖరీదైన డిష్ ఈ పులస చేప. కిలో పులస కావాలంటే ఐదారు వేల రూపాయలు పెట్టాల్సిందే. అయినప్పటికీ ‘పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి్సందే’నని గోదావరి జిల్లాల్లోని మాంసాహార ప్రియులు అంటారు. ‘పులస’ నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పునరుత్పత్తి కోసం.. పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్ తదితర దేశాల సముద్ర జలా ల్లో జీవించే ఈ పులసను క్యుఫిడే కుటుంబానికి చెం దిన కార్డేటాగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. పులస ప్రజాతి హిల్సా. జాతి ఇల్సా. ఈ ‘ఇల్సా’ కాస్తా సముద్రంలో ఉన్నప్పుడు ‘విలస’గా.. గోదావరిలోకి ప్రవేశించాక ‘పులస’గా మారుతుంది. ఈ చేపలు పునరుత్పత్తి కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా.. సుమారు 11 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. ఇందుకోసం అవి 30 నుంచి 40 రోజుల పాటు జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ఆధారంగా ఏకధాటిగా ప్రయాణిస్తాయి. సైబీరియా పక్షులు, ఆలివ్ రిడ్లే తాబేళ్ల మాది రిగానే.. పులసలు కూడా పునరుత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా అధిగమించి.. ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరి నదికి ఎర్రనీరు (వరద) వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి. ఆడ, మగ పులసలు గోదావరిలో ఇసుక, గులక రాళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంగమించి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఒకటి రెండు రోజుల్లోనే చేప పిల్లలుగా ఎదుగుతాయి. పులస చేప పిల్లలను ‘జట్కా’ అని పిలుస్తారు. పునరుత్పత్తి పూర్తయ్యాక వచ్చిన సముద్ర మార్గంలోనే సంతానం(జట్కాలు)తో కలిసి తిరిగి వచ్చిన చోటకే వెళ్లిపోతాయి. ఇందుకు మరో నెల రోజులు సమయం పడుతుంది. వీటిల్లో కొన్ని గోదావరిలో వలలకు చిక్కి, మత్స్యకారులకు సిరులు కురిపిస్తాయి. ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో మాత్రమే లభిస్తాయి. 100 కి.మీ. వేగంతో.. ఏటికి ఎదురీదుతూ.. గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్ని సార్లు సెప్టెంబర్లో కూడా దొరుకుతాయి.. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురీదుకుంటూ రావాలి్సందే. మహోగ్ర వడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురీదడమంటే మాటలు కాదు. అందుకు తగినట్టుగానే పులసలు 100 కిలోమీటర్ల వేగంతో గోదావరికి ఎదురీదుతాయి. గోదావరి జిల్లాల్లో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంత దూరం అంత వేగంతో ఎదురీదడంతో ఈ చేపల్లో కెమికల్ రియాక్షన్ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. పులసలకు స్వేదగ్రంధులు ఉండవు. మామూలుగా చేపల్లో ఒమేగా–3 పేట్రియాసిడ్స్ (ఆమ్లాలు) ఉంటాయి. కానీ ఈ ఆమ్లాలు పులసల్లో మూడు రెట్లు అధికంగా ఉంటాయని, అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు. నకిలీల బెడద మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడి తినే ఈ పులసలకు కూడా నకిలీల బెడద తప్పడం లేదు. పులసలపై అవగాహన ఉన్న గోదావరి వాసులు నకిలీ పులసలను సులువుగా గుర్తిస్తున్నారు. గోదావరిలో దొరికే పులస దిగువన చర్మం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. అదే ఒడిశా నుంచి వచ్చే నకిలీ పులస చర్మం కొద్దిగా ఎరుపు రంగులో ఉన్నా మెరుపు ఉండదు. కేజీ బేసిన్లో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం జరుగుతున్న డ్రిల్లింగ్ కారణంగా జలకాలుష్యం పెరిగిపోవడం వలన గోదావరిలో పులసల రాక తగ్గుతోందని చెబుతున్నారు. సముద్ర గర్భంలో రిగ్గింగ్, బ్లాస్టింగ్ వంటి కార్యకలాపాల వల్ల ఈ చేపల వలసలు తగ్గాయని మత్స్యకారులు అంటున్నారు. ఆరోగ్యానికి మేలు కేవలం రుచే కాదు.. ఆరోగ్యానికి కూడా పులస ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా–3, ఒమేగా–6 ఫ్యా టీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరో గ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. గర్భిణులకు పులస ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతా రు. ఈ చేప తినడం గుండెకు మంచిదని అంటారు. సముద్ర ముఖద్వారం నుంచి బయలుదేరే పులస.. గోదావరిలో ఎంత దూరం ఎదురీదితే రుచి అంతగా ఉంటుంది. అందుకే సాగర సంగమ ప్రదేశాలైన యానాం, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో కంటే అఖండ గోదావరి (ధవళేశ్వరం బ్యారేజీ) వద్దకు వెళ్లే చేప రుచి, పరిమాణం ఎక్కువగా ఉంటాయి. దీనికి తగినట్టుగానే ధవళేశ్వరం, బొబ్బర్లంక, ఊబలంక తదితర ప్రాంతాల్లో లభించే చేపల ధర కూడా కిలో రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఉంటుంది. వరదల సీజన్లో మాత్రమే దొరికే అరుదైన పులసల కోసం ధరతో నిమిత్తం లేకుండా మరీ ఎదురు చూస్తారు. మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గర్భిణులకు ఎంతో మేలు ఆరోగ్యానికి పులస ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా అవసరమవుతాయి. ఇవి మిగిలిన జలచరాల కంటే పులస చేపలో ఎక్కువగా ఉంటాయి. గోదావరికి ఎదురీదటంతో సహజ సిద్ధంగా జనించే ఆమ్లాలు పులసలో రుచికి ప్రత్యేక కారణంగా చెప్పవచ్చు. వరద గోదావరిలో లభించే ప్రత్యేక ఆహారం కోసమే అవి ఇక్కడి వరకూ వస్తాయి. – చిట్టూరి గోపాలకృష్ణ,మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, అమలాపురం పులుసు అమోఘం పులసను పులుసుగానే ఎక్కువగా వండుతారు. ఇప్పటి తరం మహిళలు దీనిని వండినా అంత రుచి రాదనే అంటారు. పులస పులుసును ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే. పాత తరం అంటే ఇప్పుడు 60, 70 ఏళ్లు వయస్సున్న గ్రామీణ మహిళలు పులస పులుసు పెడితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మసాలా దట్టించి మట్టికుండలో చింతపండు పులుసుతో దీనిని వండుతారు. చింతనిప్పులు లేదా కట్టెల పొయ్యి లేదా పిడకల మంటపైనే దీనిని వారు వండుతారు. పొయ్యిపై కూర ఉడికేటప్పుడు బెండకాయలు, వంకాయలు, మిరపకాయలు కోయకుండా ఉన్నవి ఉన్నట్టుగా వేస్తారు. అలాగే ఆవకాయలో తేరిన ఎర్రటి నూనె, కొత్తివీుర వేస్తారు. కుండలో వండితేనే దీనికి అసలైన రుచి వస్తుంది. పులుసు వండడం పూర్తయ్యాక అదే కుండలో ఉంచి 24 గంటల తరువాత తింటే దాని రుచే వేరని పలువురు లొట్టలు వేసుకుని తింటారు. పులస చేపకు ముళ్లు ఎక్కువగా ఉండటంతో చాలా నేర్పుగా తినాల్సి ఉంటుంది. ఇందులో వేసిన బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి కూడా భలే రుచిగా ఉంటాయి. గోదావరి జిల్లాల వాసుల్లో పలువురు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లోని తమవారికి, ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఘుమఘుమలాడే పులస పులుసు తీసుకువెళుతుంటారు. ఎన్నో ప్రత్యేకతలు పులసకు ఉన్నంత రుచి, వాసన మరో చేపకు ఉండవు. దీంతో దీనిని అంతర్జాతీయంగా క్వీన్ ఆఫ్ ది ఫిష్ (చేపల రారాణి)గా పిలుస్తారు. పులస చేప కిలో నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. 3 కిలోల బరువున్న పులస 60 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని ఆయుష్షు గరిష్టంగా 3 సంవత్సరాలు. వలలో చిక్కిన వెంటనే పులసలు చనిపోతాయి. అయితే రక్తప్రసరణ ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల వరకు ఈ చేప పాడైపోకుండా ఉంటుంది.పులస ప్రపంచంలో మూడే మూడు ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. బంగ్లాదేశ్లోని పద్మా నది, పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది, మన రాష్ట్రంలోని గోదావరి నది. గోదావరిలో కూడా కేవలం మూడే మూడు ప్రాంతాల్లో లభించే పులస రుచి పసందుగా ఉంటుంది. ఆ ప్రాంతాలు తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతం, నర్సాపురం. బంగ్లాదేశ్లో పులస జాతీయ చేపగా గుర్తింపు పొందింది. అఖండ గోదావరి ధవళేశ్వరం దిగువన ఏడుపాయలుగా విడిపోతుంది. వీటినే ‘సప్త గోదావరులు’ అని పిలుస్తారు. అవి గౌతమి, వైనతేయ, వశిష్ట, తుల్య భాగ, భరద్వాజ, ఆత్రేయ, కశ్యప. ఈ ఏడు పాయలు చివరకు మూడు పాయలు(గౌతమి, వైనతేయ, వశిష్ట)గా సముద్రంలో కలుస్తాయి. అలా నదీపాయలు సముద్రంలో కలిసే సఖినేటిపల్లి మండలం అంతర్వేది అన్నాచెళ్లెళ్ల గట్టు, బోడసకుర్రు సమీపాన ఓడలరేవు – కరవాక మధ్య, కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం సమీపాన కొత్తపాలెం ప్రాంతాల్లో సముద్ర మొగ(సీ మౌత్)లు ఏర్పడ్డాయి. ఈ మూడుచోట్ల నుంచే పులసలు గోదావరిలోకి ప్రవేశిస్తాయి. -
సహాయక చర్యల్ని పర్యవేక్షించిన హోంమంత్రి
సాక్షి, గుంటూరు : ఎడతెరిపిలేని వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. తాగునీరు, కిరోసిన్, బియ్యం, కందిపప్పు అందిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు లేవని, ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. మొన్నటి వరకు రాజకీయ దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బాబు, ఇప్పుడు సంక్షేమం కుంటుపడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇస్తామన్న టీడీపీ అధ్యక్షుడు రెండు నెలలకే ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కోడెల కుటుంబ సభ్యులు తప్పుడు పనులు చేయకపోతే బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లు త్వరలో ప్రారంభవుతాయని వెల్లడించారు. -
గోదావరి వరద ఉధృతిపై సీఎం జగన్ ఆరా
-
గోదావరి వరద ఉధృతిపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి : గోదావరి వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమాచారం కోరారు. సీఎం కార్యాలయ అధికారులు.. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఉభయ గోదావరి ప్రాంత పరిస్థితులను వివరించారు. అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. సీఎం జగన్ ముంపు గ్రామాల్లో చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామాగ్రి అందించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
గోదావరి జిల్లాల్లో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు
-
యాండే.. పులసొచ్చిందండీ
నరసాపురం: ‘చేపలందు పులస చేప రుచే వేరండి’ అంటారు గోదావరి ప్రియులు. పుస్తెలమ్మి అయినా పులస తినాలనే నానుడి కూడా గోదావరి జిల్లాల్లో ఉంది. వీటిని చూస్తేనే మీన ప్రియులకు పులసంటే ఎంత మక్కువో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాది మళ్లీ గోదావరి ప్రజలకు పులస సీజన్ వచ్చేసింది. నది పాయల్లోకి ఈదుకుంటూ వస్తున్న పులసలను ఒడిసి పట్టుకోవడానికి మత్స్యకారులు ఒక పక్క శ్రమపడుతుంటే.. మరోపక్క చేపల్ని కొనడానికి స్థానికులు ఎగబడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గోదావరికి వరద వచ్చింది. ఆ ఎర్ర నీటిలో గుడ్లు పెట్టడానికి పులస చేపలు ఎదురు ఈదుకుంటూ వస్తున్నాయి. ఏటా వర్షాల సీజన్లో మాత్రమే పులస చేపలు గోదావరి పాయల్లోకి వస్తాయి. దీంతో కొన్ని రోజులుగా మత్స్యకారులు గోదావరి సముద్ర సంగమం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులస వేట కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది.. పులస నిజానికి సముద్ర చేప. దీని శాస్త్రీయ నామం హిల్సాహిల్సా. దీనినే ఇంగ్లిష్లో ఇలిష్ అని కూడా అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో సంచరిస్తుంది. సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి అంత దూరం నుంచి ఈదుకుంటూ గోదావరిలోకి వస్తుంది. ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. అందువల్లే ఈ చేపను చెరువుల్లో పెంచడానికి వీలుండదు. బంగ్లాదేశ్, ఒడిశా తీరాల్లో ఈ చేప దొరికినా.. గోదావరి చేపకున్న రుచి ఉండదని చెబుతారు. ‘ఇలస’ పులసయ్యేదిక్కడే సముద్రంలో పులసను ఇలసగా పిలుస్తారు. వర్షాలు పడి గోదావరిలోకి ఎర్రనీరు రాగానే సముద్రంలోని ఇలసలు ఈదుకుంటూ వస్తాయి. గోదావరిలోకి వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఇలస పులసగా మారుతుందని మత్స్యకారులు చెబుతారు. రుచిలో కూడా మార్పు వస్తుందంటారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్దనున్న వశిష్ట గోదావరి పాయలో పులసలు ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడికి పది కిలోమీటర్లు దూరంలో ఉన్న అంతర్వేది వద్ద గోదావరి, సముద్ర సంగమ ప్రాంతం నుంచి నదిలోకి ఈ చేపలు వస్తాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలైన రాజోలు, గన్నవరం, ఎదుర్లంకలలో పులసల వేట ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం నరసాపురం, అంతర్వేది మార్కెట్ల్లోనూ రావులపాలెం, సిద్ధాంతం, చించినాడ వంతెనల వద్ద పులసల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. తాము రుచి చూడటమే కాకుండా.. దూర ప్రాంతంలోని తమ వారికి పంపడానికి ఎంత ఖర్చయినా లెక్కచేయకుండా స్థానికులు పులసలను కొనుగోలు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలోనే వేట గోదావరిలో పులసల వేట సంప్రదాయ నాటు పడవలతోనే సాగుతుంది. పులసల వేట కోసం చెక్క నావలపై మత్స్యకారులు ప్రత్యేక వలలను ఉంచుతారు. వీటిని ‘రంగపొల’ వలలుగా పిలుస్తారు. 20 మీటర్లు పొడవు ఉండే ఈ చిన్నపాటి వలలకే పులసలు చిక్కుతాయని మత్స్యకారులు చెబుతారు. సముద్రంలో వేట సాగించే పెద్ద బోట్లు ద్వారా సాగించే వేటకు ఎక్కువ పులసలు లభించవు. మరో విషయం ఏమిటంటే ఈ చేపలు ఎక్కువగా వేకువజామునే వలలకు చిక్కుతాయి. దీంతో మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి వేట సాగిస్తారు. ఎగుమతులకు ఆస్కారం లేదు.. మిగిలిన చేపల్లా మూడేసి, నాలుగేసి కిలోల చొప్పున పులసలు బరువుండవు. అరకిలో నుంచి కిలోన్నర వరకే బరువు ఉంటాయి. సైజు, డిమాండ్ను బట్టి వీటి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు అమ్ముతున్నారు. పులసలకు పెద్దగా డిమాండ్ ఉన్నా ఎగుమతులకు ఆస్కారం లేదు. తక్కువ సంఖ్యలో పులసలు దొరకడమే ఇందుకు కారణం. అయితే పులస మనుగడపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృత వేట, గోదావరి నీరు కలుషితం కారణంగా ఈ చేప జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కోనసీమలో మారని కొబ్బరి రైతుల తలరాతలు
-
ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్
హైదరాబాద్: విజయవాడలో ఈ నెల 13న జరగాల్సిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం 14కు వాయిదా పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. 15న పశ్చిమ గోదావరి, 16న తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు. -
పందేల జాతర
-
తొలిరోజే రూ.100 కోట్లకు పైగా కోడిపందాలు
రాజమండ్రి/ఏలూరు: సంక్రాంతి వచ్చిందంటే భారీ ఎత్తున జూదానికి తెర తొలగిందన్నమాటే. సంకాంత్రి పండగ పర్వదినాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇష్టారాజ్యంగా కోడిపందాలు శ్రుతి మించిపోతున్నాయి. సంకాంత్రి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెలం, జీలుగుమిల్లిలో ఇప్పటికే కోడిపందాలు ప్రారంభమైయ్యాయి. గోదావరి జిల్లాల్లో తొలిరోజే 100 కోట్లకు పైగా పందాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోడిపందాలపై ఎలాంటి ఆంక్షలు, నియంత్రణ గానీ విధించినా వాతావరణం కనిపించటలేదు. దాంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గర ఉండి మరీ పందాలు ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. ఆ రెండు జిల్లాల్లో కోడిపందాలను నియంత్రణ చేయలేక ఆఖరికి పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఈ పందాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు యత్నించినప్పటికీ వీటిని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. -
తొలిరోజే రూ.100 కోట్లకు పైగా కోడిపందాలు
-
సమరానికి సై
కాలుదువ్వుతున్న పందెం కోళ్లు పెద్ద పండగకు సిద్ధం చేసుకుంటున్న పందెంరాయుళ్లు ఒక్కొక్కటి రూ.5 వేల నుంచి రూ.25 వేలకు కొనుగోలు రాయవరం/ఉప్పలగుప్తం : మరో మూడు వారాల్లో పెద్ద పండగ రానుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఇప్పటికే హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, జంగమదేవర్లు, పగటివేషగాళ్లు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అన్నిటికంటే ప్రధానమైనది సంక్రాంతిలో కోడిపందేలు. వీటి పై నిషేధం విధించినా.. చాటుమాటుగా పందెంరాయుళ్లు కోడిపందేలు నిర్వహిస్తూనే ఉంటారు. రెండేళ్లుగా ప్రభుత్వం దీనిని చూసీచూడనట్టు వ్యవహరించడంతో.. ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు ఉంటాయన్న ఉద్దేశంతో పందెంరాయుళ్లు సుమారు మూడు నెలల ముందుగానే పుంజులను కొనుగోలు చేసి, పందేలకు సిద్ధం చేస్తున్నారు. పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పందెం కోడిపుంజులు అనగానే వాటి పెంపకం తీరు ప్రత్యేకంగా ఉంటుంది. వాటి ఆరోగ్యం కోసం చెరువులో ఈత, వాకింగ్, ఎండలో కట్టి ఉంచడం వంటివి చేస్తారు. ఆహారంగా బాదం, పిస్తా, జీడిపప్పు, తాటిబెల్లం, నువ్వుల నూనెతో చేసిన ఉండలు, కోడిగుడ్లు, ఉడికించిన వేటమాంసంతో పాటు చోళ్లు, గంట్లు, వడ్లను తినిపిస్తారు. వారానికోకసారి టెర్రామైసిన్, రెవిటాల్ వంటి టాబ్లెట్లు వేస్తారు. ఇలా రోజుకు ఒక్కో కోడికి రూ.40 నుంచి రూ.100 వరకు ఖర్చు చేస్తారు. ఈ లెక్కన పందెంరాయుళ్లు ఒక్కోదానికి రూ.6 వేల వరకు కేవలం వాటి ఆహారానికే ఖర్చు చేస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైతే రూ.10 వేల వరకూ ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. పెద్దఎత్తున విక్రయాలు ఒక్కో వ్యక్తి రెండు నుంచి నాలుగు పుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. వాటిని విక్రయించే వారు సుమారు 20 పుంజుల వరకు పోషిస్తున్నారు. జిల్లాలోని మండపేట, రావులపాలెం, ఐ.పోలవరం, అమలాపురం, పెదపూడి, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో పందెంకోళ్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిసింది. జిల్లాలో సుమారు 50 వేల పందెం కోడిపుంజులను సిద్ధం చేస్తున్నట్టు అంచనా. ఒకొక్కటి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. గతేడాది పెద్ద పండగ మూడు రోజులు రూ.100 కోట్ల పైబడి పందేలు సాగినట్టు చెప్పుకొంటున్నారు. పందెంరాయుళ్లు కోడిపుంజుల కొనుగోలుకు వేలాది రూపాయలు వెచ్చిస్తుండడంతో గ్రామాల్లో అనేకమంది వీటిని పెంచుతూ, ఉపాధి పొందుతున్నారు. కోడిపుంజుల్లోరకాలు కోడి పుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను నిర్ణయిస్తారు. డేగ, కాకి, పూల, పర్ల, సేతువ, రసంగి, నెమలి, మసరకాకి, తెల్లచెవల, గేరువా డేగ, కాకినెమలి, కాకి డేగ, కోడి డేగ, నల్లచెవల, పెట్టమారు, అబ్రాస్ తదితర రకాల కోడిపుంజులున్నాయి.. -
గోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం: కేసీఆర్
హైదరాబాద్: ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్ పర్సన్, 13 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎంపీటీసీలు శనివారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి గిరిజన తండాలు, ఆదివాసి గూడెంలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విభజన ముందు ఖమ్మం జిల్లాలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లా రాజకీయాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. -
మమ్మల్ని పట్టించుకున్నవాడే లేదు
జగన్కు మొర పెట్టుకున్న రైతులు కొత్తపేట/రావులపాలెం : భారీ వర్షాలకు పంట నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం తరఫున పట్టించుకున్న నాథుడే లేడని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటల పరిశీలనకు శుక్రవారం వచ్చిన జగన్మోహన్రెడ్డి కొత్తపేట శివారు చినగూళ్ళపాలెం, పెదగూళ్ళపాలెం; రావులపాలెం మండలం దేవరపల్లి, ఈతకోట గ్రామాలను సందర్శించారు. నేలనంటిన వరి పంటను పరిశీలించారు. ఎక్కడిక్కడ రైతులతో మమేకమయ్యారు. ఇంతవరకూ ప్రభుత్వం తరఫున సరైన భరోసా పొందని రైతులు జగన్మోహన్రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత చినగూళ్ళపాలెంలో నేలనంటి మొలకవస్తున్న విత్తనాల రామకృష్ణకు చెందిన వరి చేనును జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. నీట మునిగి, మొలక వచ్చి, రంగు మారిన ధాన్యాన్ని ఆ రైతు చూపించారు. ఈ సందర్భంగా వారిమధ్య సంభాషణ ఇలా సాగింది. జగన్ : రామకృష్ణా! ఎన్నెకరాలు సాగు చేస్తున్నావు? సొంత భూమా? కౌలుకా? రామకృష్ణ : సార్, రెండెకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. చేతికొచ్చే సమయంలో మాయదారి తుపాను వచ్చి పంటను ముంచేసింది. కోయకుండానే నీటిలో ఇలా మొలక వచ్చింది. జగన్ : ఈ వరి కోసి మాసూళ్లు చేస్తే ఏమైనా దిగుబడి వస్తుందా? రామకృష్ణ : ఇప్పటికే పది రోజుల నుంచి నీటిలో నానుతోంది. మొలక కూడా వచ్చింది. ఇది ఎందుకూ పనికొచ్చే పరిస్థితి లేదు. కోసి మాసూళ్లు చేసినా కొంటారో కొనరో తెలియదు. జగన్ : ఎంత పెట్టుబడి అయింది? రామకృష్ణ : ఎకరానికి దాదాపు 20 వేలు పెట్టుబడి పెట్టామండి. ఇది కాకుండా 15 బస్తాల శిస్తు చెల్లించాలి. బొక్కా సత్యనారాయణ, కొప్పిశెట్టి గణపతి, సుబ్రహ్మణ్యం, కాండ్రేగుల బాబూరావు తదితర రైతులు : మొలకొచ్చిన, రంగు మారిన ధాన్యం గురించి పట్టించుకున్న నాథుడు లేడు. అసలు ఆ ధాన్యం కొంటారో లేదో తెలియదండి. కొనకపోతే తీవ్రంగా నష్ట పోతాం సార్! జగన్ : ప్రభుత్వం తరఫున ఎవరైనా వచ్చారా? హామీ ఇచ్చారా? రైతులు : మొన్న ఎవరో అధికారి వచ్చి, చూసి వెళ్లారు. ఏ హామీ ఇవ్వలేదండి. మా పరిస్థితి అంతా అయోమయంగా ఉంది సార్ ! మీరే వచ్చారు. మీరు దయతలచి పట్టించుకొంటే మా కష్టాలు తీరుతాయి. జగన్ : ఇంతవరకూ ప్రభుత్వం తరఫున ఎవ్వరూ రాకపోవడం చాలా దారుణం. మొలకొచ్చిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు హామీ ఇవ్వకపోవడం బాధాకరం. ఈ నియోజకవర్గంలో 37 వేల ఎకరాలు సాగవుతూ అత్యధిక శాతం పంట దెబ్బ తింటే అధికారులు మాత్రం కేవలం సుమారు 2 వేల ఎకరాలు దెబ్బతిన్నట్టు లెక్కలు చూపుతున్నారు. గతంలో నీలం, లైలా, పైలీన్ తదితర తుపాన్లు వచ్చాయి. పంటను దెబ్బ తీశాయి. ఆ పరిహారం కూడా ఇవ్వలేదు. సరే దీనిపై మీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పరిహారం ఎలా చెల్లించరో చూస్తాం. దేవరపల్లి శివారు బాలయోగిపేట వద్ద రైతులు బయ్యే పెద్దిరాజు, గుత్తుల సత్యనారాయణ, దంగేటి సత్యనారాయణ, దంగేటి రాముడు తదితరులు మొలకొచ్చిన వరిపనలను వైఎస్ జగన్మోహన్రెడ్డికి చూపి తమ కష్టాలు గట్టెక్కించాలని కోరారు. వారి సంభాషణ సాగిందిలా.. జగన్ : అధికారులు వచ్చారా? మీ పంట నష్టాలు నమోదు చేశారా? రైతులు : వచ్చారండి. అయితే ఇలా గట్టుకు తెచ్చుకోకూడదంట సార్! చేలోనే మునిగిపోవాలంట. చేలోనే మొలిచేయాలంట. అలా ఉంటేనే రాసుకుంటారంట సార్! వారికిష్టం వచ్చినచోట కూర్చొని, ఇష్టం వచ్చిన వారి పేర్లు రాసుకు వెళ్లారు. మా ఊరికి జేసీగారు వచ్చి అసలు మీ పంట నష్టపోలేదని చెప్పారు. జగన్ : ఇదేం దారుణం? ఉన్న పంటను కూడా ఒబ్బిడి చేసుకోనివ్వరా? ఇదేం ప్రభుత్వం? ఇదేం అధికారులు? వారి ఆటలు అలా సాగుతున్నాయి. పోనీ ఈ ధాన్యం ఎవరైనా కొంటారా? రైతులు : ఎవ్వరూ కొనే పరిస్థితి లేదు సార్! మిల్లర్లను అడిగితే అయిన కాడికి అడుగుతారు. బస్తా రూ.1057 ఉండగా రూ.600కు అడుగుతారు. వారు ఎక్కువకు అమ్ముకుంటారు. జగన్ : ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామని ప్రకటించింది. ఈ ధాన్యాన్ని పట్టుకుపోతే కొనరా? పోనీ మీ పంట రుణాలు మాఫీ అయ్యాయా? రైతులు : మాఫీ కాలేదండి. ఇళ్లు వేలం వేస్తామంటే వడ్డీకి అప్పులు తెచ్చి కట్టాం. జగన్ : రుణాలు మాఫీ కాకపోగా ఇళ్లు వేలం వేస్తామంటే వడ్డీకి తెచ్చి కట్టారా? రుణమాఫీ చేశామని గొప్పగా చెప్పుకున్నారు. కనీసం ముఖ్యమంత్రిగా చంద్ర బాబు ఏ హామీ ఇవ్వలేదు. మీ దగ్గరకొచ్చిందీ లేదు. ఇదీ ఆయన పాలన. రైతులు : ఏం పాలనండీ బాబూ! పేదలు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఇసుక రేటు బంగారంలా మారింది. లారీ రూ.25 వేలు అంటున్నారు. రుణామాఫీ అన్నాడు. ఏదో చేస్తాడని ఎదురు చూశాం. తీరా చేసిందేమీ లేకపోగా వేలకు వేలు వడ్డీలు కట్టాం. జగన్ : సరే ఈ సమస్యలపై మీ తరఫున ప్రభుత్వంతో పోరాడి రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కృషి చేస్తా. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా రాజమండ్రి రూరల్ : వీఆర్ఏల న్యాయ సమ్మతమైన సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వీఆర్ఏలు శుక్రవారం మధురపూడి విమానాశ్రయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ తమను ఫుల్టైమ్ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేలు మంజూరు చేయాలని కోరారు. రాజేష్, కుమార్, దార్ల ప్రసాద్, సుబ్బారెడ్డి, ఆర్.లావణ్య, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు రాకపోవడం దారుణం
-
'రైతుల వద్దకు చంద్రబాబు రాకపోవడం దారుణం'
కాకినాడ : భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతుల వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం చినగొళ్లపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడుతూ... జిల్లాలో లక్షన్నర ఎకరాలకుపైగా పంట నష్టపోతే... కేవలం 18 వేల ఎకరాలే పంట నష్టం జరిగినట్లు అధికారులు చూపుతున్నారని విమర్శించారు. చాలా చోట్ల నష్టపోయిన రైతుల వద్దకు అధికారులు వెల్లడంలేదని మండిపడ్డారు. గత తుపానులో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ఎంత పంట నష్టం జరిగిందో తెలిసినప్పుడు... రైతులకు ఒకే రకమైన పరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కానీ అలా జరగడం లేదన్నారు. ఒకే రకంగా పరిహారం ఇవ్వకుండా ఎందుకు వివక్ష చూపుతున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అప్పులు చేసి మరీ పంటలు వేశామని రైతులు వైఎస్ జగన్ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. దాంతో అన్ని విధాల అండగా ఉంటామంటూ రైతులకు వైఎస్ జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కొత్తపేట మండల బాలయోగిపేటలో వైఎస్ జగన్ పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక మీద పెట్టే దృష్టి రైతులపై చూపితే బాగుంటుందని అన్నారు. తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జల్లాల్లో ఇప్పటికే పర్యటించి... వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సంగతి తెలిసిందే. -
గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
పంట నష్టపోరుున రైతులకు పరామర్శ సాక్షి, కాకినాడ/ ఏలూరు: అకాల వర్షాలతో దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉభ య గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటల నష్టంతో కుదేలైన అన్నదాతలను ఆయన పరామర్శిస్తారు. జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రావులపాలెం మీదుగా దేవరపల్లి, ఈతకోట గ్రామాలకు వెళతారు. అక్కడ పంటల్ని పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకుంటారు. దువ్వ, వరిఘేడు, తిరుపతిపురం, బల్లిపాడు గ్రామాల్లో పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. పర్యటన అనంతరం శుక్రవారం సాయంత్రం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళతారు. -
గోదావరి జిల్లాల్లో సాగునీటి కష్టాలు
-
చిన్నారిపై సిరంజి సైకో దాడి!
- బైక్పై వచ్చి సూదితో గుచ్చి పరారీ - హైదరాబాద్ మల్కాజిగిరిలో ఘటన హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలను వణికిస్తున్న ‘సిరంజి’ సైకో తరహా దాడి హైదరాబాద్లోనూ చోటుచేసుకుంది! తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ అగంతకుడు ఇంజక్షన్ సూదితో గుచ్చి పరారైన ఘటన నగరంలోని మల్కాజిగిరిలో శనివారం ఉదయం జరిగింది. మల్కాజ్గిరి పరిధిలోని ఇందిరానెహ్రూ నగర్కు చెందిన యాదగిరి, లావణ్య దంపతుల కుమార్తె రమ్య (9). స్థానికంగా ఉన్న న్యూ లిల్లీ మోడల్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతుంది. శనివారం గురు పూజోత్సవం కావ డంతో ఉపాధ్యాయులకు గిఫ్ట్ కొనడానికి స్కూలుకు సమీపంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి స్కూల్కి వస్తుండగా ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రమ్య కుడి చేతికి ఇంజక్షన్ సూదితో గుచ్చి పారిపోయాడు. దీంతో నొప్పి అనిపించి బాలిక వెనక్కి తిరిగి చూడగా నల్లరంగు ప్యాంట్, ఆకుపచ్చ రంగు షర్ట్ వేసుకున్న సైకో అక్కడి నుంచి ఉడాయించాడు. విషయం టీచర్లకు తెలియడంతో ఆమెను చికిత్స కోసం స్థానిక ఎల్కే ఆస్పత్రికి తరలించారు. బాలికకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు స్పష్టం చేశారు. తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని, పాఠశాలల్లోని సీసీ ఫుటేజీలను మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ శేఖర్గౌడ్ పరిశీలించారు. ఫుటేజీల్లో ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదని, విద్యార్థిని విచారించగా పొంతన లేని సమాధానం చెబుతోందని తెలిపారు. బాలిక చేతికి గుచ్చింది ఇంజక్షన్ నీడిలా? లేక గుండు పిన్నా ? అనేది నిర్ధారించాల్సి ఉందన్నారు. -
ఉభయ గోదావరి జిల్లాల్లో చిరుజల్లులు
రాజమండ్రి : ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం పడుతుంది. చల్లటి గాలుల మధ్య పుష్కరాలకు వచ్చిన భక్తులు స్నానమాచరిస్తున్నారు. చెదురు మదురు జల్లులు పడటంతో భక్తులు తడిసి ముద్దయ్యారు. -
'పట్టిసీమతో ఉపయోగం శూన్యం'
ఏలూరు(పశ్చిమగోదావరి): పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ఎత్తిపోతలతో ఉభయగోదారి జిల్లాలు ఎడారిగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ కంటే పోలవరం పైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కొత్తపల్లి సూచించారు. పోలవరం పూర్తయ్యే వరకు వైఎస్ఆర్ సీపీ రైతాంగానికి అండగా ఉంటుందని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. -
కొడుకును ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప..
హైదరాబాద్ : ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న చైతన్య రాజు పనితీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా ఆయన కౌన్సిల్లో లేవనెత్తకోపోయారని మండిపడుతున్నారు. అధికార పక్షంతో అంటకాగి పదవుల కోసం పాకులాడారని చైతన్యరాజుపై టీచర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన కొడుకు రవికిరణ్ వర్మను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప...ప్రజలకేమీ చేయలేకపోయారని వారు ధ్వజమెత్తుతున్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు, టీడీపీ అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతిచ్చిన పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమొక్రెటిక్ ఫ్రంట్) అభ్యర్థి రాము సూర్యారావు.. తన సమీప టీడీపీ ప్రత్యర్థి చైతన్యరాజుపై విజయం సాధించారు. మరోవైపు టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) ఓటమి ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. -
గోదావరి జిల్లాలలో రాముసూర్యారావు విజయం
ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో యుటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో రాము సూర్యారావు గెలుపొందారు. టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ఓడిపోయారు. ఈ ఫలితం టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 9 నెలలకే టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ జిల్లాలలోని ఉద్యోగస్తులలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటున్న ఈ జిల్లాలలో ఓటమి ఆ పార్టీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఈ రోజు జరిగిన టీడీఎల్సీ సమావేశంలో ఈ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. ఇక్కడ అభ్యర్థి ఎంపికలో పొరపాటు జరిగినట్లు సమావేశం భావించినట్లు తెలుస్తోంది. -
గురువుల రుణం తీర్చుకోవాలనే మళ్లీ బరిలో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఒత్తిడి లేని విద్యావిధానం అమలే తన లక్ష్యమని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. ‘గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుచేశాననే సంతృప్తి ఉంది. మిగిలిన హామీలు, ఉపాధ్యాయులు ఆశిస్తున్న పలు సమస్యల పరిష్కారించేందుకు నిరంతరం శ్రమిస్తాను’ అన్నారు. గతంలో తన గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉపాధ్యాయవర్గాలకు ఈసారి కొత్తవారు తోడవడంతో మరింత సానుకూలపవనాలు వీస్తున్నాయన్నారు. గత ఎన్నికల హామీల అమలు, మరోసారి గెలిపిస్తే ఉపాధ్యాయులకు చేసే మేలు అనే దానిపై తన అంతరంగాన్ని ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. సాక్షి: రెండోసారి ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? చైతన్యరాజు: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించి ఉపాధ్యాయుల రుణం తీర్చుకోవాలని. సాక్షి: రాజకీయంగా ఎదుగుదలకు అనేక మార్గాలుండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలనే ఎందుకు ఎంచుకున్నట్టు? చైతన్యరాజు: ఒక ఉపాధ్యాయుడు వంద మంది విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తారు. అలాంటి వారు ఇచ్చే తీర్పు సమాజంలో మేలుకొలుపవుతుందనే విశ్వాసం. సాక్షి: బలమైన యూటీఎఫ్ బరిలో ఉండటంతో పోటీ ఎలా ఉంటుందనుకుంటున్నారు? చైతన్యరాజు: గత ఎన్నికల్లో ఆ సంఘంతో పాటు మిగిలిన సంఘాలు కూడా నాకు సపోర్టు చేయబట్టే ఎమ్మెల్సీ కాగలిగాను. చివరకు నా కుమార్డు రవికిరణ్ ఎమ్మెల్సీ అవడంలో వారి సహకారం చాలానే ఉంది. సాక్షి: పీఈటీ అసోసియేషన్ మీకు సహకరించడం లేదంటున్నారు? చైతన్యరాజు: అలాంటిదేమీ లేదు. అసోసియేషన్ ప్రతినిధులు ఎలా ఉన్నా పీఈటీలంతా నాకు మద్దతు ఇస్తున్నారు. నా వెంటే ఉన్నారు. సాక్షి: ఉపాధ్యాయులు మీకే ఎందుకు ఓటు వేస్తారనుకుంటున్నారు? చైతన్యరాజు: గత ఆరేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యలను శక్తివంచన లేకుండా పరిష్కరించడంతో ఆ నమ్మకం కలుగుతోంది. సాక్షి: మీ ఆరేళ్ల ప్రస్థానంలో ఉపాధ్యాయులకు ఏం చేశారో చెబుతారా? చైతన్యరాజు: జేఏసీ పిలుపు మేరకు చేసిన 13 రోజుల సమ్మె కాలానికి వేతనం మంజూరు చేయించి, సర్వీస్ నష్టపోకుండా ప్రభుత్వ ఉత్తర్వులకు కృషి చేశా. మున్సిపల్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలను ‘010’లో చెల్లింపులకు ఉత్తర్వులు జారీకి కృషి చేశాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉపాధ్యాయుల సమ్మె కాలానికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను. 2010 పీఆర్సీలో 2 శాతం హెచ్ఆర్ఏ పెంపుదలలో తోడ్పాటు అందించాను. 9వ వేతన సవరణ ద్వారా 39 శాతం ఫిట్మెంట్ కోసం జీఓ: 52 తెచ్చాము. అప్రెంటీస్ ఉపాధ్యాయులకు, మున్సిపల్, ఎయిడెడ్, గిరిజన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ల ఉత్తర్వులకు కృషి చేశాను. అప్రెంటీస్ ఉపాధ్యాయుల నియామకాలను నిలుపుదల చేస్తూ ఉత్వర్వుల జారీ సంతృప్తినిచ్చింది. సాక్షి: భవిష్యత్లో ఏమి చేయదలుచుకున్నారు? చైతన్యరాజు: 398 స్పెషల్ టీచర్స్కు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎయిడెడ్ అధ్యాపకులకు హెల్త్కార్డులు, 010లో జీతాలు, ఎయిడెడ్లో పనిచేసే అన్ఎయిడెడ్ వారికి కూడా హెల్త్కార్డులు ఇప్పిస్తాను. ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రతకు త్వరలో నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తాను. ఎంఈఓ, డీవైఈఓ, డైట్ లెక్చరర్లలో అర్హులైన వారికి పదోన్నతులు, కామన్ సర్వీసు రూల్స్, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న డీఐ, డీవైఈఓలకు పదోన్నతులు సాధిస్తాను. ఇందుకోసం వేసిన కమిటీల్లో నా కుమారుడు ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మతో పాటు నేను కూడా ఉన్నాను. సాక్షి:పేదలకు మీరు చేసిన సేవలేమైనా ఉన్నాయా? చైతన్యరాజు: 14 ఏళ్లుగా అమలాపురం కిమ్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలు, బెడ్చార్జీలు లేకుండా ఉచితంగా పేదలకు వైద్యం అందిస్తున్నాం. 270 గ్రామాల ప్రజలకు వైద్యం అందించేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఉచితంగా మందులు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. 36 వేల మంది గర్భిణులకు ఉచితంగా వైద్యం, ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటుచేశాం. కిమ్స్లో పురుడుపోసుకున్న బిడ్డకు ఏడేళ్లు వచ్చే వరకు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తున్నాం. 800 పడకలకు సరిపడా రోగులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉచితంగా భోజనం పెడుతున్నాం. ఏడాదికి 3500 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాం. ఇంతవరకు ఉచితంగా 40వేల మందిని చదివించాం. సాక్షి: గతంలో స్వతంత్రునిగా పోటీ చేసి ఇప్పుడెందుకు టీడీపీ మద్దతుతో బరిలో దిగారు? చైతన్యరాజు: అధికార పార్టీ సహకారం ఉంటే పెండింగ్లో ఉన్న, కొత్త హామీలను అమలు చేయవచ్చనే! -
పుష్కర ఏర్పాట్లపై సాధికార కమిటీ సమీక్ష
రాజమండ్రి: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సంయుక్త సమీక్షా సమావేశం శనివారం రాజమండ్రిలో జరిగింది. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో పుష్కర సాధికార కమిటీ కన్వీనర్ జె.మురళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, కమిటీ కో కన్వీనర్ కాటమనేని భాస్కర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పనులకు సాంకేతిక పరమైన అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతోందని అధికారులు వివరించారు. అలాగే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కూడా టెండర్లు పిలవలేదని అధికారులు చెప్పగా... కోడ్ పనులకు అడ్డంకి కాదని కన్వీనర్ మురళి, కో కన్వీనర్ కాటమనేని భాస్కర్ అధికారులకు స్పష్టం చేశారు. తదుపరి సమావేశం నాటికి పుష్కరాల పనుల టెండర్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ, రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖ, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 16 ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు. 23న పుష్కర కమిటీ తదుపరి సమావేశం జరగనుంది. -
కత్తి లేకుండానే.. కాయ్ రాజా కాయ్
సంక్రాంతి సందర్భంగా పందెంరాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. కోడిపందేల రూపంలో లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కత్తి కట్టకుండానే పందేలు నిర్వహించడం ఈసారి స్పెషాలిటీ. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, చాగల్లు మండలాల్లో కోడిపందేలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమవరంలో కోడిపందేల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటిని చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కత్తి కట్టకుండానే జరుపుతున్న కోడిపందేలను తిలకిస్తున్నారు. కత్తి కడితే జంతుహింస కిందకు వస్తుందన్న అనుమానంతోనే ఈసారి కత్తులు లేకుండా పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కత్తి కడితే నిమిషాల్లోనే పందెం అయిపోతుందని, లేకపోతేనే ఎక్కువ సేపు సాగి అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని కూడా అంటున్నారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో, తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలోనూ కోడిపందేల, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు రాకపోవడంతో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగుళ్లో మునిగి తేలుతున్నరు. కాకినాడ రూరల్లో కోడిపందేలపై పోలీసులు దాడులు జరిపారు. కొవ్వాడలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందేలపై ఇంద్రపాలెం పోలీసులు దాడి చేసి పందెం రాయుళ్లు, కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కోడిపందేల అనుమతుల విషయమై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ నేత కనుమూరి రామకృష్ణంరాజు భీమవరంలో లాంఛనంగా కోడిపందేలను ప్రారంభించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా కోళ్లను చేతబట్టుకొని పందేలకు సై అనిపించారు. -
గోదావరి జిల్లాల నుంచే ధాన్యం కొనుగోళ్లు ఎక్కువ
హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి జిల్లాల నుంచే అత్యధికంగా ధాన్యం కోనుగోలు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19.10 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏన్సీడీఎక్స్ ద్వారా జరిపిన కొనుగోళ్ల వల్ల రూ.34కోట్ల ఆదాయాన్ని సమకూర్చగలిగామన్నారు. -
గోదావరి జిల్లాలకు అన్యాయం చేయను: చంద్రబాబు
ఉభయ గోదావరి జిల్లాలకు తాను అన్యాయం చేయబోనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలస్యమైనా సరే.. పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమగోదావరిని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసైనా సరే ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. నరసాపురం తీరప్రాంతంలో మంచి పోర్టు నిర్మాణం చేపడతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సముద్రంలోకి వెళ్లే నీటిని మాత్రమే మళ్లిస్తామని, రైతులు ఈ విషయంలో అపోహలకు గురికావద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రతినెలా సమీక్ష చేస్తానని అన్నారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని, కొల్లేరు అభివృద్ధికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పశ్చిమగోదావరిని స్మార్ట్ జిల్లాగా మారుస్తామని, చాటపర్రు గ్రామాన్ని స్మార్ట్ విలేజిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. -
లిఫ్టులను అడ్డుకోకపోతే..డెల్టా ఎడారే...
సాక్షి, కాకినాడ :పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుం దనే సాకుతో గోదావరికి ఇరువైపులా ఒక్కొక్కటి రూ.2 వేల కోట్లతో ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ను అడ్డుకోకపోతే ‘గోదావరి జిల్లాలు’ ఏడారిగా మిగి లిపోతాయని శాసనసభ ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గోదావరిపై తెలంగాణలో 11 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తుదిదశకు చేరుకున్నాయని, ఇవి పూర్తయితే ఏకంగా 71 క్యూసెక్కుల నీటిని కోల్పోనున్నామన్నారు. ప్రస్తుతం గోదావరిపై మరో రెండు లిఫ్ట్లు తలపెడితే సెప్టెంబర్ నుంచి చుక్క నీరు కూడా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా రెండో పంటకు నీరుండదని హె చ్చరించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరిగేషన్, వ్యవసాయం, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హా మీ, గ్రామీణాభివృద్ధి శాఖలపై వాడీవేడిగా చర్చ సాగిం ది. నెహ్రూ మాట్లాడుతూ గోదావరిపై లిఫ్ట్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తీర్మానం చేయాలని పట్టుబట్ట గా, ఈ నెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, చర్చిద్దామని జెడ్పీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఇంకా పుష్క ర ఎత్తిపోతల పథకం 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదని నెహ్రూ అన్నారు. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడు గంటలు కూడా సరఫరా ఇవ్వడం లేద న్నారు. ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదన్నారు. ఈ సీజన్లో కేవలం 195 మి.మీ. మాత్రమే నమోదైందన్నారు. కనీవినీ ఎరుగని కరువును ఎదుర్కోబోతున్నామన్నారు. ముందస్తు కార్యాచరణ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే రై తులకు మేలు జరుగుతుందన్నారు. నూతన విత్తనాన్ని సరఫరా చేయడం, ఆరుతడి పంటలను ప్రోత్సహించ డం వంటి చర్యలు చేపట్టాలన్నారు. డెల్టా ఆధునికీకర ణ కోసం ఒక పంటకాలాన్ని త్యాగం చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్డీఏ పీడీ చంద్ర శేఖరరాజు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3.98 లక్షల మందికి సంబంధించి ఆధార్ లింకప్ పూర్తయిందన్నారు. ఇంకా 60 వేల మందిని అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. నెహ్రూ స్పందిస్తూ.. పరిశీలన లో అనర్హులెందరిని గుర్తించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల్లా అధికారులు ఉపన్యాసాలివ్వడం సరికాదన్నారు. రేషన్కార్డులను అనుసంధానం చేయడం ద్వారా ఏటా రూ.100 కోట్లకుపైగా ఆదా కానుందని కలెక్టర్ నీతూ ప్రసాద్ చెప్పగా, ఆ సొ మ్ముతో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాల ని సభ్యులు సూచించారు. డ్వామా పీడీ పి.భవాని మా ట్లాడుతూ ఉపాధిహామీ పనులపై గ్రామ సమాచార బో ర్డులు ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ స్టేట్ ఫస్ట్లో ఉన్నామంటూ గొప్పలకు పోకుండా ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. నాగరికతకు అద్దంపట్టే మ రుగుదొడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంతగదని ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత వారం మనమే రాష్ర్టంలో మొదటి స్థానంలో ఉండేవారమని, ఇప్పుడు ప్రకాశం ఉందన్నారు. సర్పంచ్లు భాగస్వాములైతే జిల్లాలో లక్ష మరుగుదొడ్లు నిర్మించ డం కష్టం కాదన్నారు. ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఉప ము ఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. జేడీఏ విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నమాట వాస్తవమేనన్నారు. 29 వేల హెక్టార్లలో ప్ర త్యామ్నాయ పంటలకు విత్తనాలు సిద్ధం చేశామన్నారు. రైతులకు రూ.4 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయ న్నారు. ఈ జీఓ 174లో తక్షణమే సవరణ చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రాక మరమ్మతులు కూడా చేపట్టలేదని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నందారావు చెప్పగా, ఏజెన్సీలో పర్యటించి పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. తమ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టడం లేదని ఖమ్మం నుంచి తూర్పు గోదావరిలో విలీనమైన చింతూరు, వీఆర్పురం, కూనవరం జెడ్పీటీసీలు సోయపు అరుణ, ముత్యాల కుసుమాంబ, ఎడవల్లి కన్యకాపరమేశ్వరి సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ రాగానే ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంపీ పండుల రవీంధ్రబాబు, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, డీసీఎంఎస్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లు బాబీ పాల్గొన్నారు. -
గోదారిలో టికెట్ల గోలగోల
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు తెగ మారిపోతున్నారు. ఎంతోకాలంగా ఒక పార్టీలో ఉండి, అవతలి పార్టీ అధినేతను, నాయకులను నోటికి వచ్చినట్లల్లా తిట్టి.. ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్లడానికి ఏమాత్రం మొహమాటపడటంలేదు. అయితే.. ఇన్నాళ్ల నుంచి ఆ పార్టీలో ఉండి, జెండాలు మోసి ఎప్పుడో అప్పుడు టికెట్ రాకపోతుందా అని ఆశించినవాళ్లు మాత్రం ఇప్పుడు తమకు మొండిచేయి ఎదురవడంతో తట్టుకోలేకపోతున్నారు. గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ జిల్లాకు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చినట్లు తిట్టారు. ఇప్పుడు మొహమాటం ఏమీ లేకుండా అదే పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీమంత్రి పితాని సత్యనారాయణ కూడా వచ్చారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పితాని అధికారికంగా ప్రకటించేశారు. అయితే.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టికెట్ల మీద ఆశలు పెట్టుకున్న నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఇప్పుడీ కొత్త నాయకుల రాకతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆచంట నియోజకవర్గానికి అక్కడి ఎస్వీకేపీ కాలేజి మాజీ ప్రిన్సిపల్ గుబ్బల తమ్మయ్యను అభ్యర్థిగా అనధికారికంగా ఎప్పుడో ప్రకటించేశారు. కానీ ఇప్పుడు పితాని సత్యనారాయణ అక్కడ టీడీపీలో చేరడంతో.. టికెట్ ఎవరికి దక్కుతుందనేది అనుమానంగా మారింది. తమ్మయ్య ఇప్పటికే ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. ఆయన పరిస్థితి అయోమయంగా మారింది. ఇక తాడేపల్లిగూడెం పరిస్థితీ అంతే. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఈలి నాని, కొట్టు సత్యనారాయణ ఇద్దరూ టీడీపీలో చేరిపోయారు. వాళ్లలో కొట్టుకు టికెట్ ఖాయమని అనుకుంటున్నారు. కానీ, ఆ టికెట్పై ఇప్పటికే ముళ్లపూడి బాపిరాజు, ఎర్రా నారాయణస్వామి మనవడు నవీన్ లాంటివాళ్లు ఆశ పెట్టుకున్నారు. వాళ్లకు మొండిచేయి చూపిన బాబు.. బాపిరాజుకు జడ్పీ చైర్మన్ పదవి ఆశపెట్టారు. ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో కూడా ఉంది. కృష్ణా జిల్లాలో తన తండ్రి హయాం నుంచి కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న మండలి బుద్ధప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన రాకను స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. -
గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు
-
గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు
పందేలకు రెట్టింపు స్థాయిలో పేకాట, గుండాట సంక్రాంతి ముసుగులో జూదం తొడగొట్టి మరీ పురివిప్పింది. గోదావరి జిల్లాల్లో మూడురోజుల నుంచి కోడి పందేలు అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతున్నాయి. ఆ బరుల వద్దే కోడి పందేలను తలదన్నే రీతిలో పేకాట, గుండాట, కోసాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ మూడు రోజుల నుంచి వందల ప్రాంతాల్లో జరిగిన పందేలు, జూదాల్లో రూ.500 కోట్లు చేతులు మారినట్లు అంచనా. కోడి పందేలకు పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.300 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ పందేల్లో అన్ని పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు కూడా పాల్గొనడం గమనార్హం. - న్యూస్లైన్ నెట్వర్క్ జూదం.. మద్యం.. కోడి పందేలు జరిగే బరుల వద్దే పేకాట, గుండాట, కోసాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వెంప, ఐ.భీమవరం, భీమవరం ప్రకృతి ఆశ్ర మం, కొప్పాక, ఫతేపురం తదితర చోట్ల 200కిపైగా గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పేకాట శిబిరాలు ఇక్కడ వెలిశాయి. కోడి పందేలకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇక్కడే మినీ బార్లు కూడా వెలిశాయి. టెంట్లు వేసి మద్యం అమ్మారు. బిర్యానీతోపాటు, బార్లలో దొరికే ఐటమ్లతో రెస్టారెంట్లూ ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేలు, ప్రముఖుల హడావుడి కోడి పందేలు జరిగే చోట్ల ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీప్రముఖుల హడావుడి ఎక్కువగా కనిపించింది. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పందేల్లో హల్చల్ చేశారు. టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొప్పాకలో కోడిపందేలను స్వయంగా నిర్వహించారు. వెంపలో బుధవారం కాంగ్రెస్కు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ప్రముఖ సినీ దర్శకుడు కోదండ రామిరెడ్డి పందేలు కాశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంతుషిండే, టీడీపీ నేత తలసాని శ్రీనివాస్యాదవ్ వెంపలో పందేలను వీక్షించారు. టీడీపీకి చెందిన ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కూడా పందేల్లో పాల్గొన్నారు. నిడదవోలులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ పందేలను వీక్షించారు. హైదరాబాద్తోపాటు తెలంగాణ జిల్లాలు, రాయలసీమ కోస్తా జిల్లాలేకాకుండా బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భీమవరం ప్రాంతాల్లో జరిగే పందేలకు రావడం విశేషం. బడ్జెట్ను బట్టి బరి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంపలో ఈసారి ఊహించని రీతిలో కోడి పందేలు జరిగాయి. ఇక్కడ రెండు లక్షలకుపైబడి పందేల కోసం ఒక బరి, లక్ష లోపు పందేలకు మరో బరిని ఏర్పాటు చేశారు. రెండు బరుల్లోనూ సగటున రోజుకు 100కుపైగా పందేలు జరిగాయి. బరిలో దిగేవాళ్లు రెండు లక్షలకు పందెం వేస్తే వీక్షించేవారు వాటిపై రూ.20 లక్షలనుంచి రూ.30 లక్షల వరకు పైపందేలు కాశారు. అంటే ఒక పందెం జరిగితే రూ.30 లక్షలు చేతులు మారుతున్నాయి. ఇలా పెద్ద బరిలోనే రోజుకు రూ.15 కోట్లు చొప్పున మూడురోజుల్లో రూ.45 కోట్ల పందేలు జరిగినట్లు తెలిసింది. లక్ష లోపు పందేల కోసం ఏర్పాటుచేసిన బరిలోనూ రూ.10 నుంచి రూ.20 లక్షల వరకూ చేతులు మారుతున్నాయి. ఇలా ఒక్క వెంపలోనే మూడు రోజుల్లో రూ.60 కోట్లకుపైగా పందేలు జరిగినట్లు సమాచారం. ఇక్కడ జరిగిన బరిలో బుధవారం హైదరాబాద్ నుంచి కుమారుడితో కలిసి వచ్చిన ఒక ప్రముఖుడు రూ.30 లక్షలు ఒకసారి, రూ.20 లక్షలు ఒకసారి పోగొట్టుకున్నారు. భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, ఆకివీడు మండలం ఐ.భీమవరంలోనూ ఇదేస్థాయిలో పందేలు జరిగాయి. భీమవరం, కొప్పాక, ఫత్తేపురం బరుల్లో లక్షలోపు పందేలు లేవంటే ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. ఇవిగాక జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లింగపాలెం, పోలవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు తదితర అన్ని ప్రాంతాల్లోనూ పందేలు ఇష్టానుసారం జరిగాయి. మొత్తంగా పశ్చిమగోదావరి జిల్లాలో రూ.300 కోట్లకుపైగా పందేలు జరిగినట్లు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం తాడిపూడి, మలికిపురం, ఐ.పోలవరం మండలంలోని కేశనకుర్రు, సామర్లకోట మం డలం మట్లపాలెంలో భారీ పందేలు జరిగాయి. ఈ పందేల విలువ రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మొత్తంగా గోదావరి జిల్లాల్లో రూ.400 కోట్ల మేర కోడి పందేలు జరిగినట్లు చెబుతున్నారు. రాజకీయ పందేరం ఈసారి కోడి పందేల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపించింది. అన్ని పార్టీలకు చెందిన నేతలు పందేల్లో పాల్గొనడంతోపాటు కొన్నిచోట్ల స్వయంగా బరులను నిర్వహించడం గమనార్హం. కోడి పందేల బరుల వద్ద ఆధిపత్యం కోసం పార్టీల నేతలు మోహరించారు. కొవ్వూరు మండలం వాడపల్లిలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు ఏకమై వైఎస్సార్ సీపీ నేతలపై కాలుదువ్వారు. దీంతో ఘర్షణ జరిగి పందేలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయి నేతలు, ఎంపీ స్థాయి నేతలు కూడా పందేల బరుల వద్ద ఆధిపత్యం కోసం ప్రయత్నించడం విశేషం. ఈ పందేల వద్ద ఆధిపత్యం కోల్పోతే ఆయా గ్రామాల్లో రాజకీయం కూడా తమ చేతుల్లోంచి జారిపోతుందనే ఆందోళనతో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది. జాతరను తలపించిన ప్రాంతాలు కోడి పందేల ప్రాంతాలు తిరునాళ్లను తలపిస్తున్నాయి. వందల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతాలకు వస్తున్నాయి. పార్కింగ్ కోసమే పందేల బరుల వద్ద ప్రత్యేకంగా 30 నుంచి 50 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేశారు. కొప్పాకలో ట్రాఫిక్ను నియంత్రించడానికి 14 మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోనూ కదనరంగం గోదావరి జిల్లాలను తలపించేలా... తెలంగాణలోనూ కోడి పందేలు ఊపందుకున్నాయి. రెండు ప్రాంతాలను రెండు కళ్ల సిద్ధాంతంలా భావించిన ‘తెలుగు తమ్ముడు..’ అన్నీ తానై దగ్గరుండి ఈ పందేలకు సారథ్యం వహించారు. స్వయానా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్వగ్రామం ఎలిగేడు మండలం శివపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జోరుగా సాగాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో పందెం రాయుళ్లు ఇక్కడి బరిలోకి దిగారు. స్వయానా ఎమ్మెల్యేతోపాటు అదే గ్రామానికి సర్పంచ్గా ఉన్న ఆయన సోదరుడు పోటీలకు సారథ్యం వహించడం గమనార్హం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం సున్నంబట్టిలో బహిరంగంగా రెండు బిర్రులు కట్టి అధికార పార్టీ నాయకులు కోడిపందేలు నిర్వహించారు. భద్రాచలం ఏజెన్సీలో కూడా పందేలు నడిచాయి. -
గోదావరి జిల్లాల్లో షూటింగ్
నాగబాబు తనయుడు వరుణ్తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందనున్న చిత్రానికి గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుకానుంది. గోదావరి జిల్లాల్లోనే దాదాపుగా చిత్రీకరణ జరగనుందని తెలిసింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం లొకేషన్ల ఎంపిక పనిలో ఉన్నారు. మిక్కీ జే.మేయర్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు. -
ఆయనలా.. ఈయనిలా!!
గోదావరి జిల్లాలపై ప్రకృతి పగబట్టింది. రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. నలభై రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు తుఫాన్లు వరుసపెట్టి వచ్చి, చేతిదాకా అందిన కూడును నోటి వరకు రాకుండా చేసేసరికి రైతు గుండె అల్లాడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అన్నదాతకు తానున్నానంటూ ధైర్యం చెప్పి, నాలుగు మాటలు మాట్లాడి భరోసా ఇవ్వాల్సినది నాయకులే. తుఫాను బాధిత రైతులను పరామర్శించి, పలకరించి, వారికి ప్రభుత్వపరంగా అందాల్సిన సాయం అందుతోందో లేదో తెలుసుకుని, అందకపోతే అందేలా చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు నాయకులు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. వారిలో ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాగా, మరొకరు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జన నాయకుడు అనేవాడు ప్రజల హృదయాల్లో ఎలా ఉంటాడో, ప్రజల కష్టాల్లో ఎలా పాలుపంచుకుంటాడో తెలియాలంటే ఈ ఇద్దరు నాయకుల పర్యటనలను ఒక్కసారి చూస్తే చాలు. అన్నదాతల బాధలు వింటుంటే గుండె తరుక్కుపోతోందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఆయన స్వయంగా పొలాల్లోకి దిగి, ఆ మట్టిలోనే నడుస్తూ రైతుల భుజాలపై చేతులు వేసి.. వారి గుండెల్లో కాసింత నిబ్బరం నింపడానికి శాయశక్తులా ప్రయత్నించారు. మరోవైపు పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం సమీపంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పర్యటించారు. బాధితులను పరామర్శించారు. పరామర్శించడానికి సీఎం రాకపోయినా తాను వచ్చానంటూ గొప్పలు చెప్పుకున్నారు. చేతికందిన పంటను కోల్పోయిన అన్నదాతను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు... కాలికి కనీసం మట్టికూడా అంటకుండా ఆకుపచ్చ తివాచీ మీద చామంతి పూలు పరిపించుకుని మరీ దానిమీద అత్యంత సుతారంగా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ నుంచే రైతులను 'ఓదార్చారు'. రాజకీయలబ్ధి కోసమే తప్ప... నిజంగా తమను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ రైతులు విమర్శిస్తున్నారు. -
గోదావరి జిల్లాల్లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు
మహబూబ్నగర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమైన నేపథ్యంలో పలు జిల్లాలలో రవాణ ఆధికారులు ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) శ్రీదేవి ఆధ్వర్యంలో గత అర్థరాత్రి నుంచి దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న13 బస్సులను సీజ్ చేశారు. ఏలూరు - 6,తణుకు -2, తాడేపల్లిగూడెం -3, భీమవరం-2 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ శ్రీదేవి వెల్లడించారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఐదుగురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
కుక్కునూరు, న్యూస్లైన్: నిన్నమొన్నటి వరకు వరద ముంపుతో బాధపడిన ఆ గ్రామస్తులు ఇప్పుడు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. గోదావరి వరద కారణంగా చేతి పంపు నీరు కలుషితమై ఆ రెండు గ్రామాలలో 50 మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో 30 మంది వరకు మంచాలకే పరిమితం కాగా మిగిలిన వారు కడుపు నింపుకునేందుకు తప్పని పరిస్థితుల్లో కూలి పనులకు వెళ్తున్నారు. బాధితుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుక్కునూరు మండల కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు లచ్చిగూడెం, చింతలగుంపు. ఇటీవల గోదావరికి వచ్చిన వరదల కారణంగా ఈ రెండు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆ రెండు గ్రామాల్లోని వంద కుటుంబాలకు తాగునీటిని అందించే చేతి పంపు కూడా ముంపునకు గురైంది. వరదలు తొలగిన తర్వాత ఆ చేతి పంపు నీటిని తాగిన సుమారు 50 మంది గిరిజనులు జలుబు, జ్వరాల బారిన పడ్డారు. వారిలో 30 మంది మంచంపై నుంచి కదలలేని స్థితిలో ఉన్నారు. మడకం శంకర్, కారం లక్ష్మయ్య కుటుంబాలకు చెందిన 10 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బాధితులే : లచ్చిగూడెం గ్రామంలో మూడేళ్ల వయసున్న చిన్నారుల నుంచి డెబ్బై సంవత్సరా వయసున్న వృద్ధుల వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. శంకర్, మారెమ్మ దంపతులు, వారి కుమారులు మూడేళ్ల వయసున్న మడకం కార్తీక్, నాలుగేళ్ల వయసున్న రామ్చరణ్లతో జ్వరాలతో బాధపడుతున్నారు. అదేగ్రామానికి బరపటి రమేశ్, వర్సా మల్లిక, బొద్దుల ప్రసాద్ జ్వరాలతో బాధపడుతున్నారు. మరోపక్క తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కారం వెంకన్నబాబు తప్పని పరిస్థితుల్లో గేదెలు కాయడానికి వెళ్తున్నాడు. మచ్చా భీమమ్మ, తెల్లం సూరమ్మలు కూలీపనులకు వెళ్తున్నారు. కాగా కారం అక్కమ్మతోపాటు ఆమె కుమార్తెలు మంజుల, కుమారిలకు వారం రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వేలేరుపాడు మండలంలోని భూదేవిపేట గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. అదేవిధంగా చింతలగుంపు గ్రామానికి చెందిన మడకం తూలయ్య, మంగరాజు, కన్నమ్మ, అచ్చమ్మలతోపాటు మరో ఇద్దరు కూడా విషజ్వరాలబారినపడ్డారు. తెల్ల, ఎర్రరంగు మాత్రలు ఇస్తున్నారు లచ్చిగూడెం, చింతలగుంపు గ్రామాలు కుక్కునూరు మండలంలోనివే అయినప్పటికీ మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో సమీపంలో ఉన్న వేలేరుపాడు మండల పీహెచ్సీకి కేటాయించారు. వేలేరుపాడు పీహెచ్సీకి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాలకు వచ్చే ఏఎన్ఎంలు ఎర్ర, తెల్లరంగు మాత్రలు మాత్రమే ఇచ్చి వెళ్తున్నారని, అవి వాడినా జ్వరాలు తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 50 మందిలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రక్త పరీక్షలు చేయలేదని, సెలైన్ బాటిళ్లు ఎక్కించి వెళ్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై వేలేరుపాడు పీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్ను వివరణ కోరగా ఆ రెండు గ్రామాల్లో జ్వరపీడితులు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. శనివరం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని అన్నారు.