Google Pay
-
గూగుల్ పేలో ఆటోపే.. సింపుల్గా క్యాన్సిల్ చేయండిలా
ఆన్లైన్ లావాదేవీలు వచ్చిన తరువాత.. దాదాపు చాలామంది గూగుల్ పే, ఫోన్ పే వంటివి విరివిగా ఉపయోగిస్తున్నారు. సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐ వంటివి చెల్లించడానికి వీటినే వాడేస్తున్నారు. దీనికోసం గూగుల్ పేలోని 'ఆటోపే' (Autopay) సెట్ చేసుకుంటారు. ఇది ఆటోమాటిక్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఆటోమాటిక్గా చెల్లించడానికి ఇష్టపడనప్పుడు 'ఆటోపే క్యాన్సిల్ చేసుకోవచ్చు.గూగుల్ పేలో ఆటోపే ఎలా నిలిపివేయాలంటే?➤గూగుల్ పే (Google Pay) యాప్ ఓపెన్ చేసిన తరువాత, ఎగువ భాగంలో కూడైవైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.➤ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తరువాత ఆటోపే ఆప్షన్స్ కనిపించే వరకు కిందికి స్క్రోల్ చేయాలి.➤ఆటోపే ఆప్షన్ కనిపించిన తరువాత.. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత లైవ్ ట్యాబ్ కింద యాక్టివ్ మ్యాండేట్ల జాబితా కనిపిస్తుంది. మీరు తీసివేయాలనుకుంటున్న ఆటోపే మ్యాండేట్పై క్లిక్ చేయండి.➤ఆటోపే క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు.. క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➤యూపీఐ ఎంటర్ చేయగానే ఆటోపే క్యాన్సిల్ అవుతుంది.మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే?➤గూగుల్ పేలో మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే.. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి.. ఆటోపే ఆప్షన్స్ ఎంచుకోవాలి.➤ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ కోసం ఆటోపే ఆదేశాన్ని సెటప్ చేసి, తరువాత దానిని రద్దు చేసి ఉంటే.. మీరు నెట్ఫ్లిక్స్లో చెల్లింపు పద్ధతిగా మీ యూపీఐ ఐడీని తిరిగి ఎంటర్ చేయాలి. ఆ తరువాత యధావిధిగా ఆటోపే యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరికఆటోపే వల్ల ఉపయోగాలుబిజీ జీవితంలో అన్నింటిని గుర్తుపెట్టుకోవడం కొంత కష్టమైన పని. ఏదైనా చెల్లింపులు లేదా ఈఎంఐ వంటి చెల్లించడంలో ఆలస్యమైతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి జరిమానాల నుంచి తప్పించుకోవడానికి, సమయానికి చెల్లింపులు పూర్తి చేసుకోవడానికి ఆటోపే అనేది బెస్ట్ ఆప్షన్. -
గూగుల్ పే, ఫోన్పేకి ఎన్పీసీఐ ఊరట
ఫోన్పే, గూగుల్ పేలాంటి యూపీఐ యాప్లకు ఊరటనిచ్చే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఏకీకృత చెల్లింపుల విధానం (UPI) యాప్ల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణంలో నిర్దిష్ట యాప్ల వాటా 30 శాతానికి మించరాదన్న ప్రతిపాదనను మరో రెండేళ్లు పెంచింది. 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే, ఫోన్పేలాంటి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాటా 80 శాతం స్థాయిలో ఉంటోంది. ఈ పరిమితిని క్రితం మూడు నెలల్లో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల ప్రాతిపదికన లెక్కిస్తారు. మరోవైపు, వాట్సాప్ పే యాప్ మరింత మంది యూజర్లను చేర్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఎన్పీసీఐ పరిమితిని తొలగించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో వాట్సాప్ పే ఇకపై దేశవ్యాప్తంగా తమకున్న యూజర్లందరికీ యూపీఐ సర్వీసులను అందించేందుకు వీలవుతుంది. గతంలో వాట్సాప్ పే దశలవారీగా యూపీఐ యూజర్లను పెంచుకునే విధంగా పరిమితి విధించింది. ఇది 10 కోట్ల యూజర్లుగా ఉండేది.ఆన్లైన్ చెల్లింపుల్లో కొన్ని థర్డ్పార్టీ యాప్లే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దాంతో కొన్ని లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.సానుకూల పరిణామాలుసులువుగా లావాదేవీలు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి కేవైసీతో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPI)ను థర్డ్ పార్టీ యుపీఐ యాప్స్కు అనుసంధానించడానికి అనుమతించింది. ఇది లావాదేవీలను మరింత అంతరాయం లేకుండా సౌకర్యవంతంగా చేస్తుంది.మరింత చేరువగా..ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్యాంకింగ్ లేని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా అందుబాటులోలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది.సౌలభ్యంగా..వినియోగదారులు తమ డిజిటల్ వాలెట్లను (పేటీఎం, ఫోన్ పే..) ఉపయోగించిన సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..ప్రతికూల పరిణామాలుమార్కెట్ ఆధిపత్యంకొన్ని థర్డ్ పార్టీ యాప్ల(ఫోన్ పే, గూగుల్ పే.. వంటివి) ఆధిపత్యం ద్వంద్వ ధోరణికి దారితీస్తుంది. ఇది డిజిటల్ పేమెంట్ మార్కెట్లో పోటీని, సృజనాత్మకతను తగ్గిస్తుంది.సాంకేతిక సవాళ్లుకొన్ని థర్డ్పార్టీ యాప్లనే అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక అవాంతరాలు జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.విదేశీ యాజమాన్యంఈ యాప్లు చాలా వరకు విదేశీ యాజమాన్యంలో ఉన్నాయి. వాల్మార్ట్ ఆధ్వర్యంలో ఫోన్పే, గూగుల్ - గూగుల్ పే.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. స్థానికంగా జరిగే డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలపై విదేశీ నియంత్రణకు సంబంధించి ఆందోళనలకు దారితీస్తుంది. -
జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్ఫ్రెండ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్ఫామ్ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది. గూగుల్పే యాప్లో ప్రతి నిమిషానికి రూ.1 పంపిస్తూ తనను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది.ఆయుషి అనే యువతి చేసిన ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘జీపే ద్వారా నిమిషానికి రూ.1 చొప్పన 30 రోజుల్లో 43,800 నిమిషాల్లో రూ.40,000 కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని మీరు వదిలించుకోవాలనుకున్నారు. సింపల్గా ఇగ్నోర్ చేయండి. కానీ మీ ఎక్స్ బాయ్ఫ్రెండ్ను గూగుల్పేలో బ్లాక్ చేయవద్దు. ఎందుకంటే మీరు దాని ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు కొంత డబ్బు సమకూర్చుకోండి. తర్వాత గూగుల్పేలో కూడా తనను బ్లాక్ చేయండి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!ఏదేమైనా ప్రతి రిలేషన్షిప్కు ఇద్దరి అంగీకారం అవసరం. అందుకు ఏ కారణంతోనైనా ఒకరికి ఇష్టం లేదంటే వేరొకరు దాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఏ విధమైన వేధింపులకు పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని మంచికే వినియోగించుకోవాలని చెబుతున్నారు. -
గూగుల్పేలో గోల్డ్ లోన్..
గూగుల్కు చెందిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్పే (google Pay) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్ను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ లోన్లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.దీంతో చిరు వ్యాపారులు, ఇతర కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు గూగుల్పే ద్వారా సులభంగా బంగారు ఆభరణాలపై రుణాలను పొందవచ్చు. గోల్డ్ లోన్ల కోసం మరో ఎన్బీఎఫ్సీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్తో కూడా గూగుల్పే జట్టు కట్టింది. గూగుల్పే అందిస్తున్న ఈ ఫీచర్తో వినియోగదారులు క్రెడిట్ రిపోర్ట్ లేదా విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది టైర్-2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. ఇక్రా ప్రకారం.. వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమిస్తుందని, 2027 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. -
జీపే ద్వారా ‘బంగారు’ రుణాలు
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా మొబైల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ జీపే బంగారు ఆభరణాలపై రుణాలు అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు ముత్తూట్ ఫైనాన్స్తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ను హిందీ భాషలో ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి దశలో మరో 8 ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలు లభ్యంకానున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 10వ సదస్సులో ఇంకా పలు విషయాలను తెలియజేసింది. వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు చౌక వడ్డీ రేట్లలో గోల్డ్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకొవచ్చు. ఇందుకు రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన అవకాశాలను కల్పిస్తోంది. మరోపక్క రుణదాతలకు సెక్యూరిటీని అందిస్తోంది. కాగా.. ప్రపంచ పసిడిలో ఇండియా వాటా 11 శాతమని గూగుల్ ఇండియా ఎండీ రోమ దత్త చోబే తెలియజేశారు. తెలుగులోనూ.. ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ యూజర్లలో 40శాతానికిపైగా వాయిస్ ద్వారానే సేవలను వినియోగించుకుంటున్నట్లు గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమ బూదరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ భాషలో జెమినీ లైవ్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగుసహా మలయాళం, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఏఐను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గూగుల్ సెర్చ్ లో జెన్–ఏఐ ఆధారిత ఏఐ ఓవర్వ్యూను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ గూగుల్ సెర్చ్ను తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో దేశీయంగా జెమినీ ఫ్లాష్ 1.5ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీంతో వివిధ సంస్థలు క్లౌడ్, ఏఐ సొల్యూషన్లను భద్రంగా అమలు చేయవచ్చని తెలిపింది. తద్వారా డేటాను భద్రపరచుకోవడంతోపాటు.. దేశవ్యాప్తంగా మెషీన్ లెరి్నంగ్ ప్రాసెస్కు తెరతీయవచ్చని వివరించింది. 2025లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. -
ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయం
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.ఎన్సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. -
పోటీలోకి మరో యూపీఐ యాప్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో యూపీఐ చెల్లింపులదే అగ్రస్థానం. ఇప్పటికే పలు యూపీఐ యాప్లు యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడీ పోటీలోకి మరో యాప్ వచ్చింది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించేలా ఫిన్టెక్ ప్లాట్ఫాం భారత్పే తాజాగా యూపీఐ టీపీఏపీని (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) ఆవిష్కరించింది.ఇందుకోసం యూనిటీ బ్యాంకుతో జట్టుకట్టినట్లు తెలిపింది. ఈ సేవల కోసం కస్టమర్లు భారత్పే యాప్లో @bpunity ఎక్స్టెన్షన్తో తమ యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుని ఇటు వ్యక్తులకు అటు వ్యాపార వర్గాలకు చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది. కంపెనీ ఇప్పటివరకు వ్యాపారవర్గాల మధ్య యూపీఐ చెల్లింపుల కోసం భారత్పే ఫర్ బిజినెస్ యాప్ను నిర్వహిస్తోంది.తాజాగా తమ బై–నౌ–పే–లేటర్ యాప్ ’పోస్ట్పే’ పేరును ’భారత్పే’గా మార్చి వినియోగదారుల చెల్లింపుల సేవల కోసం మరో యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ డివైజ్లకు సంబంధించిన యాప్స్టోర్లోనూ అందుబాటులోకి రానుంది. -
యూపీఐ పేమెంట్స్లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్పార్టీ యాప్ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్పార్టీ యాప్ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
గూగుల్ పే, ఫోన్ పే ఇక అవసరం లేదు..మీ అర చేయి చూపిస్తే చాలు !
-
'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ పేమెంట్స్ మరింత సులభతరం చేసేందుకు మూడు సరికొత్త ఫీచర్స్ పరిచయం చేసింది. అవి "రివార్డ్స్, బై నౌ పే లేటర్, సెక్యూరిటీ ఫీచర్.రివార్డ్లుప్రస్తుతం క్రెడిట్ కార్డ్ల వినియోగం పెరిగిపోయింది. అయితే కార్డులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కొన్ని ప్రయోజనాలను పొందుతారు. దీని కోసం తనిఖీ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గూగుల్ పే పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ ముందుగానే రివార్డ్లు గురించి చూపిస్తుంది.ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండిఇప్పుడు కొనండి.. మళ్ళీ చెల్లించండి అనే స్కీమ్ ఒకప్పుడు కొన్ని కార్ల కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. సరిగ్గా ఇలాంటి ఫీచర్ గూగుల్ పే పరిచయం చేసింది. వస్తువులను కొనుగోలు వినియోగదారు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా.. మళ్ళీ చెల్లించవచ్చు. లేదా వాయిదాల రూపంలో కూడా చెల్లించవచ్చు. దీని కోసం అమౌంట్ చెల్లించే సమయంలోనే.. ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో అందుబాటులో ఉంది. మన దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.సెక్యూరిటీ ఫీచర్ఆన్లైన్ పేమెంట్ చేసే సమయంలో మరింత సురక్షితమైన లావాదేలీల కోసం గూగుల్ పే ఆటోఫిల్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇది వేలిముద్ర, స్క్రీన్ లాక్ PIN లేదా ఫేస్ స్కాన్ ద్వారా సేవ్ చేసిన కార్డ్ వివరాలను ఆటోమేటిక్గా ఇన్పుట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. -
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
ఆన్లైన్ పేమెంట్ యాప్లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్తో రీప్లేస్ చేసినట్లు సమాచారం. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
న్యూఢిల్లీ: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ గూగుల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. గూగుల్ ఈ యాప్ను తొలిసారి 2022లో అమెరికాలో లాంచ్ చేసింది. రెండు సంవత్సరాల తర్వాత భారత్ వినియోగదారులకు పరిచయం చేసింది. గూగుల్ వాలెట్అంటే ఏమిటి?గూగుల్ వాలెట్ వివిధ డిజిటల్ ఆస్తులను ఒకే అనుకూలమైన ప్రదేశంలో స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. యాప్లో బోర్డింగ్ పాస్లు, లాయల్టీ కార్డ్లు, ఈవెంట్ టిక్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్లు, గిఫ్ట్ కార్డ్లు ఇతర డిజిటల్ డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు. గూగుల్పేపై ప్రభావం గూగుల్ వాలెట్ లాంచ్తో గూగుల్ పే యాప్ పనిచేస్తోందా? అనే అనుమానాలపై గూగుల్ స్పందించింది. గూగుల్ వాలెట్ వల్ల గూగుల్ పే వల్ల ఎలాంటి ప్రతి కూల ప్రభావం చూపదని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ పేకి, గూగుల్ వాలెట్కి మధ్య తేడా చెల్లింపు కార్డ్లను గూగుల్ వ్యాలెట్కు అనుసంధానిస్తే.. గూగుల్ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్లైన్లో చెల్లింపులు చేయొచ్చు. ప్రధాన కంపెనీలతో భాగస్వామ్యం పీవీఆర్ ఐనాక్స్, ఫ్లిప్కార్ట్, ఎయిర్ ఇండియా, షాపర్స్ స్టాప్, ఇక్సిగోతో పాటు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతదేశంలో గూగుల్ వాలెట్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ ప్రకటించింది.ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ వాలెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్లు, క్రెడిట్ కార్డ్లు, లాయల్టీ కార్డ్లు, గిఫ్ట్ కార్డ్లను ఒక అనుకూలమైన ప్లాట్ఫారమ్లో నిల్వ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు. -
ఎన్పీసీఐ సమావేశం..గూగుల్పే, ఫోన్పేకు లేని ఆహ్వానం!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి యూపీఐ థర్డ్పార్టీ చెల్లింపు యాప్లైన గూగుల్పే, ఫేన్పేను ఆహ్వానించలేదు. క్రెడ్, స్లైస్, ఫ్యామ్పే, జొమాటో, గ్రో, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది. ఈమేరకు వివరాలు ఉటంకిస్తూ టైక్స్ఆఫ్ఇండియాలో కథనం వెలువడింది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కొత్త సంస్థలకు ప్రోత్సాహం అందించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. పైన తెలిపిన కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకుని ఇంటర్నల్ యూపీఐ సర్వీస్లను అందించేలా చూడాలని ఎన్పీసీఐ చెప్పింది. అయితే సమావేశానికి గూగుల్పే, ఫోన్పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ చెల్లింపు యాప్ యాజమాన్యాలకు ఆహ్వానం అందలేదు. ఈ మూడు కంపెనీల యూపీఐ లావాదేవీల పరిమాణం ఇప్పటికే 90 శాతానికి చేరినట్లు తెలిసింది. దాంతో వీటిని సమావేశానికి ఆహ్వానించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా కొత్తగా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెడుతున్న కంపెనీలు, స్టార్టప్లకు ప్రోత్సాహం అందించడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిసింది. ఆయా కంపెనీల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా కొత్త సంస్థలు రూపేకార్డుల కోసం ప్రభుత్వం అందిస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వంటి సౌకర్యాన్ని తమకు కల్పించాలని ఎన్పీసీఐను కోరినట్లు తెలిసింది. ఇతర కార్డ్లతో పోల్చితే రూపేకార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. చిన్న సంస్థలు యూపీఐ చెల్లింపుల రంగంలోకి రావాలంటే ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. రెండు సంస్థలదే గుత్తాధిపత్యం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఫోన్పే, గూగుల్పేలకు ఆదరణ పెరిగింది. యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్పే, గూగుల్పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్టెక్ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఏడాదిలోపు ప్రముఖ యాప్లో 100 కోట్ల యూజర్లు యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. -
'గూగుల్ పే' సౌండ్పాడ్ వచ్చేస్తోంది..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో గూగుల్ సంస్థ గత ఏడాది కాలం నుంచి 'గూగుల్ పే' సౌండ్పాడ్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది ఎట్టకేలకు పూర్తి కావొస్తోంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. వ్యాపారులు చెక్అవుట్ సమయాన్ని తగ్గించడానికి గూగుల్ పే సెప్టెంబరు 2017లోనే భారత్లో ఆవిష్కరించింది. ఇది సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను జరుపుకోడానికి అనుమతిస్తుందని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ 'అంబరీష్ కెంఘే' ఫిబ్రవరి 22న ఒక బ్లాగ్ పోస్ట్లో రాశారు. గూగుల్ పే సౌండ్పాడ్ ఎలా పనిచేస్తుందంటే.. సౌండ్పాడ్ అనేది ఆడియో పరికరం, ఇది చెల్లింపు స్వీకరించబడినప్పుడు ఆడియో ద్వారా వెల్లడిస్తుంది. దీంతో వ్యాపారాలు ప్రత్యేకంగా అమౌంట్ వచ్చిందా? లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపు చేసే కస్టమర్ తప్పకుండా.. వ్యాపారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అమౌంట్ పంపిన వెంటనే సౌండ్పాడ్ సౌండ్ చేస్తుంది. ఇప్పటికే మనదేశంలో పేటీఎం, ఫోన్ పే వంటివి అందించే బాక్సులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పేటీఎం సంక్షోభంలో ఉన్న కారణంగా కస్టమర్లు గూగుల్ పే దిశగా అడుగులు వేస్తున్నారు. -
జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!
ఆన్లైన్ పేమెంట్ యాప్లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే 2024 జూన్ 4 నుంచి అమెరికాలో గూగుల్ పే సేవలు నిలిపివేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. అమెరికాలో ఎక్కువమంది గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ వాలెట్ ద్వారా పేమెంట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత షాపింగ్ లేదా ఇతరత్రా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్దతిలో పని సులభంగా పూర్తయిపోతుంది. కేవలం ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. ట్రాన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఐడీ కార్డ్స్ వంటి డాక్యుమెంట్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. ఈ కారణంగానే అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా గూగుల్ వాలెట్లో లభిస్తాయి. 2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి. ఇదీ చదవండి: జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే.. ఇండియా, సింగపూర్ వంటి దేశాల్లో గూగుల్ పే యధావిధిగా సేవలను అందిస్తుంది. అంతే కాకుండా ఆయా దేశాల్లోని యూజర్లకు కావలసిన మరిన్ని సేవలను అందించడానికి సంస్థ ఈ యాప్ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇండియాలోని గూగుల్ పే యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
పేటీఎంకు బైబై.. సంబరపడిపోతున్న ప్రత్యర్థులు!
పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు వ్యాపారం, ఇటు వినియోగదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఫలితంగా పేటీఎం వినియోగాన్ని తగ్గించి ప్రత్యర్ధి సంస్థల యాప్లను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 1న పేటీఎం యాప్ రోజువారి డౌన్లోడ్లు భారీగా తగ్గాయి. ఈ సమయంలో భీమ్ యూపీఐ యాప్ డౌన్లోడ్లు 49 శాతం పెరిగాయి. గూగుల్ పే యాప్ రోజువారీ డౌన్లోడ్లు 10.6 శాతం తగ్గాయి. న్యూయార్క్లోని మొబైల్ అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్ Appfigures షేర్ చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 1న 135,139గా ఉన్న పేటీఎం యాప్ డౌన్లోడ్లు ఫిబ్రవరి 19న 55 శాతం క్షీణించి 60,627కి పడిపోయాయి. ♦ భీమ్ యూపీఐ డౌన్లోడ్లు ఈ నెల మొదటి రోజున 222,439 నుండి ఫిబ్రవరి 19న 331,781కి పెరిగాయి. ♦ గూగుల్ పే రోజువారీ యాప్ డౌన్లోడ్లు 105,296 నుండి 94,163కి పడిపోయాయి. ♦ ఫోన్ పే డౌన్లోడ్లు ఫిబ్రవరి 1న 317,522 నుండి ఫిబ్రవరి 7న 503,436కి పెరిగాయి. ఫిబ్రవరి 19న 163,011కి తగ్గాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం వ్యాపారులు ఇతర యాప్లు, బ్యాంక్ అకౌంట్లకు మారడం ప్రారంభించారు. ఢిల్లీలోని బులియన్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ మాట్లాడుతూ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై వార్తలు వచ్చినప్పటి నుండి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్లకు మారారు. ‘ఈ చర్య కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై మాత్రమేనని, పేటీఎం యాప్పై ఎటువంటి ప్రభావం లేదని మాకు తెలుసు. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా మేము మా ఖాతాలను ఇతర చెల్లింపు అగ్రిగేటర్లకు తరలిస్తున్నాము. చూడండి, వ్యాపారంలో నమ్మకం అనేది అత్యంత ముఖ్యమైన విషయం’అని సింఘాల్ అన్నారు. ఈ సందర్భంగా ‘పేటీఎం యాప్ డౌన్లోడ్లలో క్షీణత వినియోగదారుల మధ్య అనిశ్చితి, నమ్మకం కోల్పోవడం ప్రతిధ్వనిస్తుంది’అని ఇండియా బ్లాక్చెయిన్ ఫోరమ్ కో-ఫౌండర్ శరత్ చంద్ర అన్నారు. -
సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్.. సరికొత్త ప్లాన్లో పేటీఎం!
సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం మూతపడుతుందని, ఇక తమకు తిరుగులేదని సంబరపడిపోతున్న ప్రత్యర్థి కంపెనీలకు పేటీఎం షాక్ ఇవ్వబోతోంది. తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ ఫిన్టెక్ సరికొత్త ప్లాన్ చేస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం (Paytm) మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తమ కస్టమర్లకు యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ - UPI ) సేవలు అందుబాటులో ఉండేలా థర్డ్-పార్టీ పేమెంట్ యాప్ (TPAP) మార్గంపై దృష్టి సారిస్తోంది. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు "పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చెల్లింపు సేవలను నిలిపివేస్తుంది కాబట్టి, ఇతర బ్యాంకుల ద్వారా యూపీఐని ఏకీకృతం చేస్తూ ముందుకు సాగే థర్డ్-పార్టీ యాప్గా మారుతుంది" అని పేటీఎంలో పరిణామాల గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. దేశంలో యూపీఐ వ్యవస్థను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మారనున్న వీపీఏ ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం యూజర్లు @paytmతో ముగిసే వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) కలిగి ఉన్నారు. అయితే, మార్చి 1 తర్వాత ఈ వీపీఏలు వేరే బ్యాంక్ హ్యాండిల్కి మారుతున్నాయి. పేటీఎం యూపీఐ సర్వీస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) కిందకు వస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోకుండా ఆర్బీఐ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని నిషేధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం తమ యూపీఐ కస్టమర్లకు కొత్త వీపీఏల కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకోనుందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. అమెజాన్ పే, గూగుల్ పే (Google Pay), ఫోన్పే (PhonePe)లతో సహా ఇప్పటికే 22 థర్డ్-పార్టీ పేమెంట్ యాప్లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు థర్డ్-పార్టీ రూట్ ద్వారా ఇలాంటి ఫిన్టెక్లకు సహకారం అందిస్తున్నాయి. సాధారణంగా వీపీఏను బ్యాంక్, ఫిన్టెక్ రెండింటి బ్రాండ్ పేర్లను కలిపి రూపొందిస్తారు. -
సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్..
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. దాని ప్రత్యర్థులు గణనీయమైన వృద్ధి పొందుతున్నాయి. దీంతో పేటీఎం యూజర్లు చాలామంది గూగుల్ పే, ఫోన్పే, BHIM యాప్ల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఫిబ్రవరి 3 వరకు ఫోన్పే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను పొందిందని యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒక నివేదికలో వెల్లడించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు 24.1 శాతం పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది. యూజర్లను ఆకర్శించడానికి ఫోన్పే కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. దీని ఫలితంగా భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఫ్రీ యాప్ విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. యాప్ ర్యాంకింగ్లలో కూడా ఈ యాప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఎక్కువ మంది యూజర్లు విరివిగా ఫోన్పే డౌన్లోడ్ చేసుకుంటున్న కారణంగా గూగుల్ ప్లేలో 188వ స్థానంలో ఉన్న కంపెనీ ఫిబ్రవరి 5 నాటికి 33వ స్థానానికి, యాప్ స్టోర్లలో 227వ స్థానం నుంచి 72వ స్థానానికి చేరింది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ కూడా ఫిబ్రవరి 3న 1.35 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను సాధించి, 21.5 శాతం వృద్ధి కైవసం చేసుకుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల్లో.. 50 శాతం పెరిగి 5.93 లక్షల డౌన్లోడ్స్ పొందింది. దీంతో 356వ స్థానంలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేలో 7వ స్థానానికి, యాప్ స్టోర్లలో 171 స్థానం నుంచి 40వ స్థానానికి చేరింది. ఇదీ చదవండి: భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ ధరలు - కారణం ఇదే.. గూగుల్ పే విషయానికి వస్తే.. ఈ యాప్ డౌన్లోడ్ల విషయంలో స్వల్ప వృద్ధిని సాధించింది. ఇది ఫిబ్రవరి 3న 1.09 లక్షల డౌన్లోడ్లను సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్స్ 8.4 శాతం పెరిగి 3.95 లక్షలకు చేరుకుంది. -
పేటీఎం, గూగుల్ పే నుండి అయోధ్య రాముడికి విరాళం..
-
గూగుల్పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే?
'గూగుల్పే' (Google Pay) తాజాగా 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (NPCI)కు చెందిన 'ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్'తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం వెలుపల ఉన్న భారతీయులు యూపీఐ చెల్లింపులు చెల్లించడానికి అనుకూలంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్పే ఇప్పుడు ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందం ఫలితంగా.. విదేశాలకు వెళ్లే ప్రజలు డబ్బు తీసుకెళ్లడం లేదా అంతర్జాతీయ గేట్వే చార్జీల భారం తగ్గిపోయింది. ఇది కేవలం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా.. సంస్థ తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన.. ఇతర దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడం వల్ల.. గూగుల్పే కస్టమర్లు అంతర్జాతీయ కరెన్సీ కోసం లేదా ఫారెక్స్ కార్డుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రెండు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుందని NPCL సీఈఓ రితేష్ శుక్లా పేర్కొన్నారు. -
యూపీఐ పేమెంట్స్లో కొత్త రూల్స్.. అవేంటో మీకు తెలుసా?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ పేమెంట్స్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ జనవరి 1, 2024 నుంచి యూపీఐ పేమెంట్ అకౌంట్ ఐడీల నిబంధనల్ని మార్చింది. వాటికి అనుగుణంగా లేని యూపీఐ పేమెంట్స్ అకౌంట్ ఐడీల రద్దుతో పాటు రోజూవారి లిమిట్ను పెంచింది. దీంతో పాటు కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకుందాం పదండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేతో పాటు ఇతర పేమెంట్ యాప్స్ ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టీవ్గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టీవ్టే చేయాలని బ్యాంకులను కోరింది. ఎన్పీసీఐ ప్రకారం..యూపీఐ లావాదేవీల రోజువారీ చెల్లింపు పరిమితి గరిష్టంగా 1 లక్ష వరకు చేసుకోవచ్చు. అయితే, డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేలా ఆర్బీఐ డిసెంబర్ 8, 2023 నుంచి ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. ఆన్లైన్ వాలెట్లను ఉపయోగించి రూ. 2,000 కంటే ఎక్కువ నగదు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై మాత్రమే 1.1 శాతం ఇంటర్చేంజ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ యూపీఐ వినియోగదారులకు వర్తించదు. యూపీఐ పేమెంట్స్ వినియోగం పెరిగే కొద్ది ఆర్ధిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు మీ ఫోన్పే నెంబర్ నుంచి తొలిసారిగా మరో కొత్త ఫోన్పే నెంబర్కు రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పంపిస్తే.. ఆ నగదు వెళ్లేందుకు 4 గంటల సమయం పట్టనుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మనం ఇప్పటి వరకు ఏదైనా కిరాణా స్టోర్లో యూపీఐ పేమెంట్స్ చేయాలంటే స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సాయంతో పేమెంట్ చేసుకునే సౌకర్యం కలగనుంది. అయితే ఇందుకోసం యూపీఐలలో ఎన్ఎఫ్సీ ఫీచర్ను తప్పని సరి త్వరలో మనం కొత్త రకం ఏటీఎంలను చూడబోతున్నాం. ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ డెబిట్ కార్డ్ను వినియోగించి ఏటీఎం మెషిన్ నుంచి డబ్బుల్ని డ్రా చేయడం సర్వసాధారణం. ఇకపై అలాగే ఫోన్లో యూపీఐ ఐడీని ఉపయోగించి యూపీఐ ఏటీఎంలో డబ్బుల్ని స్కాన్ చేసి డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ జపాన్ కంపెనీ హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో అందుబాటులోకి రానుంది. -
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు అలర్ట్!
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు వాడుతున్నారా..? ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్లు వినియోగిస్తున్నారా..? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 నుంచి పనిచేయవు. అవేంటి.. ఎందుకు పనిచేయవు.. ఇక్కడ తెలుసుకోండి.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. చిరు దుకాణాల దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకూ యూపీఐ చెల్లింపులే అత్యధికం ఉంటున్నాయి. ప్రస్తుతం ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటివాటితోపాటు ఇంకా మరికొన్ని యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా యాప్లు రకరకాల ఆఫర్లు, క్యాష్బ్యాక్లు వంటివి అందిస్తున్నాయి. దీంతో చాలా మంది వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యాప్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కోరింది. కారణం ఇదే.. బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసిన ఫోన్ నంబర్లను డీలింక్ చేయకుండా కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చినప్పుడు పాత నంబర్ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ లక్ష్యమని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాల ప్రకారం, 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్స్క్రైబర్లకు టెల్కోలు డియాక్టివేటెడ్ నంబర్లను జారీ చేస్తుంటాయి. బ్యాంక్తో లింక్ చేసిన పాత మొబైల్ నంబర్ను కస్టమర్ అప్డేట్ చేసుకోకపోతే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 2023 డిసెంబర్ 31 లోపు ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఎన్పీసీఐ కోరినట్లు సమాచారం. -
ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..!
సిబిల్ స్కోరు నివేదిక చూసి, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. బ్యాంకులూ కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు దీన్ని నిశితంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు 750 పాయింట్లకు మించి ఉందంటే ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. చాలా వెబ్సైట్లు, యాప్లు సిబిల్ స్కోర్ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే గూగుల్ పే ద్వారా ఈ స్కోర్ను ఎలా చెక్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్లో కోట్లాది మంది గూగుల్ పే యాప్ను వివిధ రకాల చెల్లింపుల కోసం వాడుతున్నారు. తొలుత దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం ఉండేది. దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లకూ దీన్ని విస్తరించారు. ఇటీవల సిబిల్ స్కోర్ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఎలా చెక్ చేసుకోవాలంటే.. గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్ వచ్చే వరకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ‘Your CIBIL score does not decrease after you check it. Google Pay does not share credit report data with any 3rd party’ అనే పాప్అప్ కనిపిస్తుంది. దాని కింద సబ్మిట్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేయాలి. క్షణాల్లో మీ సిబిల్ స్కోర్ తెరపై కింద కనిపిస్తుంది. ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..? సిబిల్ స్కోర్ అంటే.. సిబిల్ అంటే ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్’. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ హిస్టరీను అందించే సంస్థ. ఇది ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్.. వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్ స్కోర్ను తయారుచేస్తుంది. సిబిల్ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం ఇవ్వడం రిస్క్తో కూడుకున్న వ్యవహారం అని అర్థం. 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్గా పరిగణిస్తారు. -
గూగుల్పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..?
గూగుల్ ఆధ్వర్యంలోని పేమెంట్ యాప్ గూగుల్పే మొబైల్ రీఛార్జీలపై అదనంగా ఫీజు వసూలు చేయనుంది. ఏ విధానంలో పేమెంట్ చేసినా కన్వీనియన్స్ ఛార్జీల రూపంలో ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫోన్పే, పేటీఎం సంస్థలు ఇదే మాదిరి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా సేవలందించిన గూగుల్పే ప్రస్తుతం ఛార్జీలు వసూలు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే రూ.100లోపు రీఛార్జిపై గూగుల్పే ఎలాంటి ఫీజూ వసూలు చేయబోదని కొన్ని మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. రూ.100 నుంచి రూ.200 వరకు రీఛార్జిపై ఒక రూపాయి, రూ.200 నుంచి రూ.300 వరకు రూ.2, రూ.300 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ.3 చొప్పున కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు సమాచారం. కొత్తగా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు గూగుల్ నిబంధనలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
గూగుల్ పే యూజర్లకు గుడ్న్యూస్!
దేశంలో రోజువారి లెక్కన సరకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులకు లోన్లు కావాలంటే బ్యాంకులు, లేదంటే ఇతర ఫైనాన్స్ కంపెనీలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వ్యాపారస్తుల్ని గట్టెక్కించేలా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన యూపీఐ పేమెంట్స్ ఫ్లాట్ఫారమ్ గూగుల్ పే ద్వారా వారికి రుణాలు అందించేందుకు సిద్ధమైంది. భారత్లో గూగుల్ 9వ ఎడిషన్ ‘గూగుల్ ఫర్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం వినియోగదారుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది వివరించడంతో పాలు పలు ప్రొడక్ట్లు విడుదల, భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తుంది. చిరు వ్యాపారులకు శుభవార్త సెప్టెంబర్ 19 ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఈవెంట్లో చిరు వ్యాపారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. భారత్లోని చిరు వ్యాపారులకు చేయూతనందించేలా తన యూపీఐ పేమెంట్ ఫ్లాట్ఫారమ్ ‘గూగుల్ పే’ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే గూగుల్ పే ద్వారా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. Our experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options. To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA — Google India (@GoogleIndia) October 19, 2023 రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు రుణాలు చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్.. డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. దీంతో వ్యాపారులు గూగుల్ యూపీఐ నుంచి రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు లోన్లు అందిస్తుంది. వాటిని తిరిగి 7 నెలల నుంచి 12 వ్యవధిలోపు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ.111 అంతేకాదు, వ్యాపార నిమిత్తం అవసరమే నిధుల అవసరాల్ని తీర్చేలా క్రెడిట్లైన్ (credit line) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పద్దతిలో అతి తక్కువ రూ.15,000 తీసుకుంటే నెల ప్రారంభ ఈఎంఐ రూ.111 చెల్లించాలి. వ్యక్తిగత రుణాలు చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్తో, యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్స్ రుణాలు కోసం ఐసీఐసీఐ బ్యాంక్తో జతకట్టింది. చిరు వ్యాపారులకోసం ఏఐ సాయం భారత్లోని చిరు వ్యాపారుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. ఏఐ సాయంతో గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్(Google Merchant Center Next)లో వ్యాపారుల ప్రొడక్ట్ల వివరాల గురించి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందించనుంది. అయితే, ఉత్పత్తుల గురించి ఎలాంటి సమాచారాన్ని గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్లో ఇవ్వాలనే అంశం వ్యాపారుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. 100కి పైగా ప్రభుత్వ పథకాల సమాచారం త్వరలో, భారత్లోని వినియోగదారులకు 100కి పైగా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్నిఅందించేలా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా గూగుల్ భవిష్యత్ కార్యచరణను ప్రకటించింది. రూ.12,000 కోట్ల విలువైన మోసాలకు చెక్ గూగుల్లో పేలో రూ.12,000 కోట్ల విలువైన ఆర్ధిక మోసాలకు చెక్ పెట్టిన గూగుల్.. అందుకు సాయం చేసే 3,500 లోన్ యాప్లను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంది. -
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్! ఇకపై మరింత..
ముంబై: ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లలో యూపీఐ లైట్ ( UPI Lite ) వాలెట్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ( RBI ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి ఆఫ్లైన్ చెల్లింపు లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది. యూపీఐ ప్లాట్ఫామ్పై చిన్న మొత్తాల చెల్లింపును వేగవంతం చేసేందుకు 2022 సెప్టెంబర్లో యూపీఐ లైట్ను ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ అంతంత మాత్రంగా ఉండే ప్రాంతాలు, అలాగే అసలు నెట్ ఉండని ప్రదేశాల్లో కూడా రిటైల్ డిజిటల్ చెల్లింపు లావాదేవీల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే, బ్యాంకుల ప్రాసెసింగ్ వ్యవస్థలపై కూడా భారం తగ్గించడం వల్ల లావాదేవీలు విఫలమయ్యే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం దీని ద్వారా నెలకు 1 కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. -
భయపడుతున్న ఫోన్పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..
UPI Plugin: యూపీఐ చెల్లింపులు అమలులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బు పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఫోన్పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ రోజు మొబైల్ నెంబర్ టైప్ చేసి కూడా అమౌంట్ పంపించేస్తున్నాము. కాగా ఈ రెండు యాప్లకి ఓ కొత్త టెక్నాలజీ సవాళ్ళను విసురుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫోన్పే, గూగుల్ పే వంటి వాటికి సరైన ప్రత్యర్థిగా నిలువడానికి 'యూపీఐ ప్లగిన్' (UPI Plugin) అందుబాటులోకి రానుంది. దీనిని మర్చెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (SDK) అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే సులభంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ చెల్లించడానికి థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు మనం ఎప్పుడైనా జొమాటో లేదా స్విగ్గీ వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే అమౌంట్ చెల్లించడానికి యూపీఐ ఆప్సన్ ఎంచుకుంటాము. ఇలా చేసినప్పుడు కొన్ని సార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ప్లగిన్ దీనికి చెక్ పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే? పేటీఎమ్, రేజర్పే, జస్పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్ చేసుకొనేందుకు మర్చంట్స్కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా. ఇది అమలులోకి వచ్చిన తరువాత తప్పకుండా వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫోన్పే, గూగుల్ పే ఆదరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ప్రస్తుతం ఫోన్పే మార్కెట్ వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 33 శాతం వరకు ఉంది. అయితే స్విగ్గి, జొమాటో, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థలు ఈ కొత్త వ్యవస్థకు మారితే మిగిలిన యాప్స్ సంగతి అధోగతి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
‘ఎస్బీఐ యోనో’ ఇక అందరిది.. ఆ యూపీఐ యాప్లకు గట్టిపోటీ!
SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్ను ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్ను ఎస్బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్బీఐ యోనో యాప్లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్ను ఉపయోగించండిలా.. ఎస్బీఐ యోన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్ని ఎంచుకోండి ఎస్బీఐ పే కోసం రిజిస్ట్రేషన్ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్కు వస్తుంది అందించిన ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్ను సృష్టించండి లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్ను సెట్ చేసుకోండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు -
గూగుల్ పే నుంచి యూపీఐ లైట్ - ఇలా యాక్టివేట్ చేసుకోండి!
న్యూఢిల్లీ: పేమెంట్ యాప్ గూగుల్ పే తాజాగా స్వల్ప మొత్తాల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకు తమ ప్లాట్ఫాంపై యూపీఐ లైట్ సర్వీసును ఆవిష్కరించింది. దీనితో యూజర్లు రూ. 200 వరకు చిన్న మొత్తాలను యూపీఐ పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లించవచ్చు. తక్షణ లావాదేవీల కోసం ఒక రోజులో రూ. 4,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ గూగుల్ పే యాప్లోని ప్రొఫైల్ పేజ్లో 'యాక్టివేట్ యూపీఐ లైట్' ఆప్షన్ను ట్యాప్ చేయడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే పేటీఎం, ఫోన్పే, భీమ్ యాప్లతో పాటు 15 బ్యాంకులు ఈ తరహా సర్వీసును అందిస్తున్నాయి. -
ఆధార్తో యూపీఐ పేమెంట్: గూగుల్పేలో కొత్త ఫీచర్
Aadhaar-based UPI: గూగుల్పే (Google Pay) యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆధార్తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్పే యాప్లో నమోదు చేసుకోవచ్చు. డెబిట్ కార్డుతో పనిలేదు ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్బోర్డింగ్ విధానం ద్వారా గూగుల్పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. కోట్లాది మంది యూపీఐ చెల్లింపులను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇది చాలా మంది వినియోగదారులకు యూపీఐ ఐడీలను సెటప్ చేసుకునేందుకు, డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Retrieve Aadhaar card: ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి? ఆధార్తో యూపీఐ పేమెంట్ అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉండగా త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే ఆధార్, బ్యాంక్లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేసి ఉండాలి. నమోదు చేసుకోండిలా.. గూగుల్పే యాప్లో వినియోగదారులు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత యూపీఐ నమోదును ఎంపిక చేసుకోవచ్చు. ఆధార్ని ఎంచుకుంటే నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి వారి ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. ప్రామాణీకరణ దశను పూర్తి చేయడానికి ఆధార్ (UIDAI), బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీలను నమోదు చేయాలి. తర్వాత ప్రక్రియను బ్యాంక్ పూర్తి చేశాక యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్కే వస్తోందా? కస్టమర్లు లావాదేవీలు చేయడానికి లేదా బ్యాలెన్స్ని చెక్ చేయడానికి గూగుల్ యాప్ని ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేసిన తర్వాత, అది ధ్రువీకరణ కోసం NPCI ద్వారా UIDAIకి వెళ్తుంది. ఈ ప్రక్రియ వినియోగదారుల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గూగుల్పే ఆధార్ నంబర్ను స్టోర్ చేయదు. ధ్రువీకరణ కోసం NPCIతో ఆధార్ నంబర్ను భాగస్వామ్యం చేయడంలో కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే పనిచేస్తుంది. -
ఫోన్ పే గూగుల్ పే పేటియంల కొంపముంచిన జొమాాటో
-
ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్!
Zomato UPI: ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ సంస్థలకు షాక్ ఇస్తూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి పేమెంట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పడు ఇలా కాకుండా జొమాటోనే సొంతంగా యూపీఐ సర్వీస్ను తీసుకువచ్చింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! కస్టమర్లు చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడకుండా జొమాటో ఈ కొత్త సర్వీసును తీసుకువచ్చింది. దీని వల్ల కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్ ని ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి సులువుగా డబ్బులు చెల్లించొచ్చు. జొమాటో కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్తో భాగస్వామ్యంతో ఈ కొత్త యూపీఐ సర్వీస్ ని తీసుకువచ్చింది. జొమాటో యూజర్లు యూపీఐ సేవలని ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద జొమాటో ఈ యూపీఐ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అందువల్ల ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. త్వరలో ఈ యూపీఐ సర్వీస్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
గూగుల్పే యూజర్లకు సర్ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్
యూజర్లకు గూగుల్పే (Google pay) సర్ప్రైజ్ సర్వీస్ అందిస్తోంది. బ్యాంక్ లోన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కీలకమైన సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోరు (CIBIL Score)ను ఉచితంగా ఇస్తోంది. ఈ సిబిల్ స్కోరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ స్కోరు ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అనేక వెబ్సైట్లు, యాప్లు సిబిల్ స్కోర్ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పడు గూగుల్పే కూడా సిబిల్ స్కోరును ఉచితంగా ఇస్తోంది. (కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!) సిబిల్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా సిబిల్ స్కోరును తయారు చేస్తుంది. సిబిల్ స్కోర్ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా, 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్గా పరిగణిస్తారు. (ఫోన్పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ) గూగుల్ పే ద్వారా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ‘A good CIBIL score gets you better interest rates on loans. Wonder if you will have a good score?’ అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కింద కనిపించే మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని ‘Let’s check’ ట్యాబ్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్పై ఉన్న విధంగా పేరు నమోదు చేసి కంటిన్యూ ట్యాబ్పై క్లిక్ చేయగానే మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) -
జీపే యూజర్లకు భారీగా క్యాష్బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!
సాక్షి, ముంబై: ఆన్లైన్ చెల్లింపుల సంస్థ గూగుల్ పే ద్వారా కొంతమంది వినియోగదారులకు మనీ క్రెడిట్ అవ్వడం సంచలనంగా మారింది. కొంతమంది జీపే వినియోగదారుల ఖాతాల్లో అనూహ్యంగా ఏకంగా రూ. 88,000 వరకు జమ అవ్వడం కలకలం రేపింది. అయితే కంపెనీ వెంటనే లోపాన్ని గుర్తించి, క్రెడిట్ చేసిన మొత్తాలను సాధ్యమైన చోట వెనక్కి తీసుకుందిట. ఈ వార్త గుప్పుమనడంతో చాలామంది తమ ఖాతాలో ఏంత జమ అయిందా అని తెగ వెదికేశారట. అయితే ఇది అమెరికాలో జరిగిన పరిణామం మాత్రమే. భారతీయ వినియోగదారులకు ఇలాంటి క్రెడిట్స్ కు ఏ రకమైన సంబంధం లేదని గూగుల్ తెలిపింది. గూగుల్ పే యూజర్లకు స్క్రాచ్ కార్డ్స్ ద్వారా మహా అయితే రూ. 6 క్యాష్బ్యాక్ రివార్డ్స్ రావడమే గొప్ప. సాధారణంగా బెటర్ లక్ నెక్ట్స్ టైం అనే సందేశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటిది తాజాగా గూగుల్ పే యూజర్ల అకౌంట్లలోకి రూ.80 వేల వరకు ట్రాన్స్ఫర్ కావడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గూగుల్ పే లో సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా "డాగ్ఫుడింగ్" అనే ఫీచర్ పరీక్షిస్తున్న సమయంలో ఈ పొరబాటు దొర్లినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. కంపెనీ కొత్త ఫీచర్ టెస్టింగ్ సందర్భంగా తమ ఉద్యోగులకు చెల్లించే బదులు అనుకోకుండా నగదును కొంతమంది యూజర్లకు పంపించినట్టు సమాచారం. Uhhh, Google Pay seems to just be randomly giving users free money right now. I just opened Google Pay and saw that I have $46 in "rewards" that I got "for dogfooding the Google Pay Remittance experience." What. pic.twitter.com/Epe08Tpsk2 — Mishaal Rahman (@MishaalRahman) April 5, 2023 దీంతో పొరపాటున తమకు భారీగా డబ్బులు వచ్చినట్టు మిషాల్ రెహమాన్ అనే జర్నలిస్ట్ సహా కొంతమంది రెడిట్ యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కొక్కరికి 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు జమ అయిందట.అయితే ఎంతమంది వినియోగదారుకు ఈ క్రెడిట్ లభించింది అనేది అస్పష్టం. అలాగే ఈ నగదు జమ గూగుల్ పిక్సెల్ వినియోగదారులకు పరిమితమైందా? లేక ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లనుకూడా ప్రభావితం చేసిందా అనేది కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో కొంత మంది యూజర్లను మెయిల్ ద్వారా సంప్రదించింది గూగుల్. వీలైనంత సొమ్మును వెనక్కి తీసుకుంది. అంతేకాదు సంబంధిత క్రెడిట్ను యూజర్లు వాడేసినా, వేరే ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసేసినా, తాము రివర్స్ చేయలేకపోతే, ఇక ఆ డబ్బు మీదే.. తదుపరి చర్యలు అవసరం లేదని కూడా గూగుల్ పేర్కొంది. మరోవైపు ఈ వ్యవహారంపై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కూడా ‘నైస్’ అంటూ వ్యంగ్యంగా స్పందించడం విశేషం. -
యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు..
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్పే, గూగుల్పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్కైనా చెల్లింపులు ఆన్లైన్ వాలెట్లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్చేంజ్ రుసుము విధించేందుకు ఎన్పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఇంటర్చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్పే, గూగుల్పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్కి చెల్లించాలి. మర్చెంట్స్ ప్రొఫైల్ను బట్టి ఇంటర్ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్ఛేంజ్ రుసుము వేరువేరుగా ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొంది. -
ఒక్క క్లిక్తో చెల్లిస్తున్నారు.. తొలి స్థానంలో ఫోన్పే.. నమ్మశక్యం కాని అంకెలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు భారత్లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా దేశవ్యాప్తంగా 2023 జనవరిలో ఏకంగా రూ.12,98,726.62 కోట్లు చేతులు మారాయంటే ఆశ్చర్యం వేయకమానదు. గత నెలలో మొత్తం 803 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ వ్యవస్థ దేశంలో 2016 ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చూస్తే 2023 జనవరిలో నమోదైన గణాంకాలే అత్యధికం. టెలికం కంపెనీల దూకుడుతో పల్లెలకూ ఇంటర్నెట్ చొచ్చుకుపోయింది. స్మార్ట్ఫోన్లు జీవితంలో భాగమయ్యాయి. బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం లేకుండా పేమెంట్ యాప్స్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా క్షణాల్లో సులభంగా, సురక్షితంగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంది. ఈ అంశాలే ఇప్పుడు యూపీఐ వేగంగా విస్తరించడానికి కారణమయ్యాయి. నమ్మశక్యం కాని అంకెలు.. యూపీఐ లావాదేవీల విలువ తొలిసారిగా 2018 డిసెంబర్లో రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. ఆ నెలలో 62 కోట్ల లావాదేవీలకుగాను రూ.1,02,595 కోట్ల విలువైన మొత్తం చేతులు మారింది. సరిగ్గా ఏడాదిలో లావాదేవీల విలువ రెట్టింపు అయింది. 2022 మే నాటికి లావాదేవీలు ఏకంగా రూ.10 లక్షల కోట్లకు ఎగిశాయి. 2017 జనవరిలో రూ.1,000 కోట్ల మార్కును దాటి రూ.1,696 కోట్ల లావాదేవీలు జరిగాయి. లావాదేవీలు అదే ఏడాది డిసెంబర్లో రూ.13,174 కోట్లకు చేరాయి. సరిగ్గా ఏడాదిలో లక్ష కోట్ల స్థాయికి ఎగిశాయి. ఈ గణాంకాలను చూస్తుంటే యూపీఐ పేమెంట్ యాప్స్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఇట్టే అర్థం అవుతోంది. 2023 జనవరి నాటికి 385 బ్యాంకులు యూపీఐ వేదికగా ఉన్నాయి. తొలి స్థానంలో ఫోన్పే.. దేశంలో యూపీఐ చెల్లింపుల్లో తొలి స్థానంలో నిలిచిన ఫోన్పే 2023 జనవరిలో రూ.6,51,108 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. గూగుల్ పే రూ.4,43,725 కోట్లు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ రూ.1,39,673 కోట్లతో ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. క్రెడ్ రూ.19,106 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.17,088 కోట్లు, యస్ బ్యాంక్ రూ.12,116 కోట్లు, భీమ్ రూ.8,164 కోట్లు, అమెజాన్ పే రూ.5,797 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.3,324.8 కోట్లు, కొటక్ మహీంద్రా రూ.2,612 కోట్లు, ఐడీఎఫ్సీ బ్యాంక్ రూ.2,222 కోట్లు, ఎస్బీఐ రూ.1,902 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,467 కోట్లు సాధించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్,, ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, వాట్సాప్, మొబిక్విక్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రూ.707 కోట్ల లావాదేవీలు నమోదు చేయడం విశేషం. చిన్న మొత్తాలే అధికం.. జనవరి గణాంకాల ప్రకారం మొత్తం 803 కోట్ల లావాదేవీల్లో కస్టమర్లు వర్తకులకు చెల్లించిన వాటా 54.88 శాతం కాగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు 45.12 శాతం ఉన్నాయి. కస్టమర్లు వర్తకులకు చెల్లించిన లావాదేవీల్లో రూ.500 లోపు విలువ కలిగినవి 83.36 శాతం కైవసం చేసుకున్నాయి. రూ.500–2,000 మధ్య 11.63 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 5.01 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీల్లో రూ.500లోపు విలువ కలిగినవి 54.71 శాతం, రూ.500–2,000 మధ్య 22.11 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.18 శాతం ఉన్నాయి. -
ఫోన్పే,గూగుల్పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్, అంతకు మించితే!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రాకతో నగదు భారత్లోని చెల్లింపుల వ్యవస్థనే మార్చివేయడమే కాదు ఈ విభాగంలో సరికొత్త విప్లవానికి దారితీసింది. అందుకే ఇటీవల ఎక్కువగా ఉపయోగించే రోజువారీ చెల్లింపు పద్ధతిగా మారింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు పద్ధతి దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంది. దీని రాకతో బయటకు వెళ్లే సమయంలో ప్రజలు నగదు లేదా వాలెట్ను మోసుకెళ్లే భారం తప్పిందనే చెప్పాలి.. కేవలం జేబులో స్మార్ట్ఫోన్ అందులో గూగుల్ పే (Google Pay), ఫోన్పే (PhonePe), పేటీఎం (Paytm), అమెజాన్ పే (Amazon Pay) వంటి వివిధ యాప్ల ఉంటే బ్యాంక్ ఖాతా, యూపీఐ, ఈ యాప్లు ఉండే ఎవరికైనా చిటికెలో నగదు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. మీ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే మొత్తంపై పరిమితి ఉందని మీకు తెలుసా? యూపీఐ చెల్లింపులు.. లిమిట్ ఇదే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక రోజులో యూపీఐ ద్వారా రూ. 1 లక్ష వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. ఇది కాకుండా, మీరు ఒక రోజులో యూపీఐ ద్వారా డబ్బులు బదిలీ చేయాలంటే అది మీ బ్యాంక్, మీరు ఉపయోగిస్తున్న యాప్పై ఆధారపడి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం! గూగుల్పే గూగుల్ పే (Google Pay) లేదా జీపే (GPay) వినియోగదారులు యూపీఐ (UPI) ద్వారా ఒక్క రోజులో రూ. 1 లక్ష కంటే ఎక్కువ చెల్లింపులు చేయలేరు. ఇది కాకుండా, యాప్ వినియోగదారులను ఒక రోజులో 10 కంటే ఎక్కువ లావాదేవీలు కూడా చేసేందుకు అనుమతి ఉండదు. దీనర్థం జీ పే యూజర్లు ఒకే సారి ఒక లక్ష రుపాయల లావాదేవీ లేదా వివిధ మొత్తాలలో 10 లావాదేవీల వరకు చేయవచ్చు. ఆపై ఈ యాప్ నుంచి పేమెంట్స్ చేయలేము. పేటీఎం ఎన్పీసీఐ (NPCI) ప్రకారం, పేటీఎం ( Paytm )కూడా ఒక రోజులో రూ. 1 లక్ష వరకు మాత్రమే చెల్లింపును అనుమతిస్తుంది. కాకపోతే యూపీఐ చెల్లింపుల విషయంలో పేటీఎంకి ఎలాంటి పరిమితి లేదు. ఫోన్పే ఫోన్పే (PhonePe) గూగుల్ పే (Google Pay) తరహాలోనే ఒక రోజుకు చెల్లింపు పరిమితి రూ. 1 లక్ష ఉంటుంది. అయితే ఇందులో ఒక రోజులో 10 లావాదేవీలు మాత్రమే చేయాలనే పరిమితి లేదు. ఒక రోజులో రూ.లక్ష విలువ మించకుండా వినియోగదారులు ఎన్ని పేమెంట్స్ అయినా చేసుకోవచ్చు. అమెజాన్ పే అమేజాన్ పే (Amazon Pay) UPI ద్వారా రూ. 1 లక్ష వరకు చెల్లింపులు చేయవచ్చు. లేదా ఒక రోజులో 20 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. కొత్త కస్టమర్లు మొదటి 24 గంటల్లో రూ. 5,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఫోన్పే, గూగుల్పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి!
గతంలో నగదు చెల్లింపులు జరపాలంటే బ్యాంకులకు వెళ్లడమో లేదా ఇంటర్నెట్ బ్యాంకులు వంటివి ఉపయోగించాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రావడంతో ప్రజలు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇది నగదు చెల్లింపుల విధానంలో ఓ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయనే చెప్పాలి. ఎంతో సులువుగా అవతలి వాళ్లకు డబ్బులను ఈ విధానాన్ని ఉపయోగించి చిటికెలో పంపతున్నాం. అయితే ప్రజలకు కొన్ని సందర్భాల్లో నగదు పొరపాటున తాము అనుకున్న ఖాతాకు కాకుండా వేరు వారికి బదిలీ చేసిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే ఆ సమస్యకు పరిష్యారం గురించి ఇక్కడ తెలుసుకుందాం. యూపీఐ పేమెంట్స్ను ఉపయోగించి సెకనులో డబ్బులను అవతలి వాళ్ల బ్యాంక్ అకౌంట్కు పంపవచ్చు. ఈ విధానం సులువుగా ఉండడంతో మొదట్లో యూపీఐని ఉపయోగించే వారి సంఖ్య వేల నుంచి ప్రస్తుతం కోట్లకు చేరింది. అలా ప్రస్తుతం ఇది మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ మాత్రమే కాదు రోడ్సైడ్ వెండర్ల నుంచి రిటైల్ షాపుల వరకు ఎక్కడ చూసిన ఇదే కనిపిస్తుంది. ఇది సురక్షితమైన చెల్లింపు వ్యవస్థ అయినప్పటికీ కొన్ని సార్లు అనుకోకుండా చేసే పొరపాటు మీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. వేరే ఖాతాకు నగదు బదిలీ.. వెనక్కి రావాలంటే ఇలా చేయండి యూపీఐ ఐడీని తప్పుగా నమోదు చేయడం లేదా పొరపాటుగా వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడం లాంటివి జరుగుతుంటాయి. మనకో లేదా మనకు తెలిసిన వాళ్లకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఆ సమయంలో మీరు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. ఆర్బీఐ ప్రకారం, మీరు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బదిలీ చేసిన మొత్తం నగదు తిరిగి పొందవచ్చు. డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా లావాదేవీలు జరిగితే, బాధిత వ్యక్తి మొదట ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థతో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. మీరు పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్పే (PhonePe) వంటి అప్లికేషన్ల కస్టమర్ సర్వీస్ నుంచి సహాయం పొందవచ్చు. వారి ద్వారా నగదు వాపసు కోసం అభ్యర్థించవచ్చు. చెల్లింపు వ్యవస్థ సమస్యను పరిష్కరించలేపోతే, డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చని తెలపింది. చదవండి: అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్ పేపర్లు తెస్తున్న ట్విటర్ ఉద్యోగులు -
వాట్సాప్కు మరో భారీ షాక్..పేమెంట్స్ హెడ్ గుడ్బై!
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు భారీ షాక్ తగిలింది. వాట్సాప్లో చేరిన నాలుగు నెలల్లోనే వాట్సాప్ పే హెడ్ వినయ్ చొలెట్టి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్కు గల కారణాలేంటనేది స్పష్టతలేదు. అయితే వినయ్ వాట్సాప్ పేమెంట్స్ హెడ్ మనేశ్ మహేత్మే నిష్క్రమణతో వాట్సాప్ పే బాధ్యతలను ఈ ఏడాది సెప్టెంబర్లో వినయ్ అందుకున్నారు. అనూహ్యంగా నాలుగు నెలలకే తన పదవి నుంచి వైదొలిగడం ఆసక్తికరంగా మారింది. వాట్సాప్ పే అసాధారణం వాట్సాప్ పేకు రాజీనామా చేసిన వినయ్ తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించలేదు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్ని అసాధారణంగా మార్చగల శక్తి వాట్సాప్కి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాబోయే సంవత్సరాల్లో దాని సామర్థం ప్రపంచానికి చాటి చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను’ అని పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు భారత్లో వాట్సాప్ యూపీఐ పేమెంట్స్ ఆశించినంత స్థాయిలో లేదనేది మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారు. కానీ వాట్సాప్పే ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంది. మిగిలిన యూపీఐ లావాదేవీలు నిర్వహించే ఫోన్ పే 47.2 శాతం, గూగుల్ పే 34.2 శాతం దూసుకెళ్తుండగా.. వాట్సాప్ పేమెంట్స్ మాత్రం 0.1 ఆ స్థాయిలో వినియోగదారుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. -
ఊపిరి పీల్చుకోండి.. ఫోన్పే, గూగుల్పే యూజర్లకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల మొత్తం లావాదేవీల్లో థర్డ్ పార్టీ యూపీఐ సంస్థల (ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, ఫ్రీచార్జ్ తదితర) వాటా ఒక్కోటీ 30 శాతం మించకూడదన్న నిబంధన అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది. దీంతో 2024 డిసెంబర్ చివరి వరకు అదనపు సమయం లభించినట్టయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో 30 శాతానికి పైగా వాటా కలిగిన ఫోన్పే, గూగుల్పే సంస్థలకు ఊరటనివ్వనుంది. యూపీఐ నిర్వహణను ఎన్పీసీఐ చూస్తుంటుంది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ సంస్థలు ఆఫర్ చేస్తుండడం తెలిసిందే. ఒక్క థర్డ్ పార్టీ యాప్ యూపీఐ లావాదేవీల సంఖ్యలో 30 శాతం మించి నిర్వహించకూడదన్న పరిమితిని 2020 నవంబర్లో ఎన్పీసీఐ తీసుకొచ్చింది.ఈ నిర్ణయం వాస్తవానికి అయితే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలి. అయితే 2020 నవంబర్ 5 నాటికే సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ యాప్లు అయిన గూగుల్, ఫోన్పే సంస్థలు ఈ నిబంధన అమలు చేసేందుకు ఎన్పీసీఐ రెండేళ్ల గడువు ఇచ్చింది. ‘‘యూపీఐ ప్రస్తుత వినియోగం, భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. నిర్ధేశిత పరిమితికి మించి (30 శాతానికి పైగా) లావాదేవీలు నిర్వహిస్తున్న యాప్ సంస్థలకు నిబంధనల అమలుకు ఇచ్చిన రెండేళ్ల అదనపు గడువును, 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించాం’’అని ఎన్పీసీఐ ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులకు ఉన్న భారీ అవకాశాల దృష్ట్యా బ్యాంకులు, నాన్ బ్యాంకులు సైతం ఈ విభాగంలో మరింత వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే వాటా సుమారు 46 శాతం, గూగుల్పే వాటా 33 శాతంగా, పేటీఎం వాటా 11 శాతం మేర ఉంది. చదవండి: 17ఏళ్ల భారతీయ యువకుడి అరుదైన ఘనత, ఎలాన్ మస్క్తో కలిసి -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు షాక్
-
షాకింగ్: గూగుల్ పే, పోన్పేలాంటి యాప్స్లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
గూగుల్ పే పై యూజర్స్ ఫైర్
-
మంచితనమే శాపమైన వేళ.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి దోచేశారు!
విజయనగర్కాలనీ(హైదరాబాద్): లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి అందినకాడికి దోచుకున్న సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ ఆర్.జి.శివమారుతి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రాయణగుట్టకు చెందిన కె.జయంత్ ప్రైవేటు స్కూల్ టీచర్, ఈ నెల 6న సాయంత్రం రాజేంద్రనగర్ నుంచి మెహిదీపట్నం వైపు బైక్పై వెళుతున్నాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 294 వద్ద ఆగాపురాకు చెందిన మహ్మద్ షాహిద్ అలియాస్ సైఫ్ అనే వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ అయ్యిందని అర్జంట్గా వెళ్లాలని మోహిదీపట్నం వరకు లిఫ్ట్ అడిగి ఎక్కాడు. మెహిదీపట్నం పిల్లర్ నెంబర్ 28 వద్దకు రాగానే పక్కనే ఉన్న గల్లీలో దించాలని కోరాడు. అప్పటికే అక్కడ ఉన్న షాహిద్ స్నేహితులు షేక్ అక్రమ్, మహ్మద్ నసీర్ ముగ్గురు కలిసి జయంత్ను భోజగుట్ట స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. కొట్టి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.40 వేలు లాక్కున్నారు. అతని ఫోన్ నంబర్ తీసుకుని బెదిరించి పలు దఫాలుగా గూగుల్ పే ద్వారా రూ.51 వేలు బదిలీ చేయించుకున్నారు. ఈ నెల 13న బాధితుడు ఆసిఫ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఆసిఫ్నగర్ ఇన్స్పెక్టర్ జీహెచ్.శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎస్.ఐ. కె.శ్రీనివాసతేజ, క్రైమ్ సిబ్బంది టి.రవీంద్రనాథ్, బి.విద్యాసాగర్, జె.అచ్చిరెడ్డి, జి.రాహుల్, బి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంపేసి శవాన్ని సొంతూరుకు సాగనంపి..) -
‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!
భారత్లో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) యాప్గా గుర్తింపు సంపాదించుకున్న గూగుల్ పే (Google Pay) తాజాగా నెట్టింట భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యాప్ యూజర్లు ట్విట్టర్లో దీనిపై #GPayతో ట్విట్స్ చేస్తూ వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పనికిరాని యాప్ (Use less App) అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ పే అందిస్తున్న క్యాష్బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఎంతలా అంటే ఏకంగా ఈ ట్రోలింగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ యాప్ పనికి రాదు అమెరికన్ టెక్ కంపెనీ గూగుల్ ఈ గూగుల్ పే యాప్ను 2017లో ప్రారంభించింది. మొదట్లో దీని పేరు తేజ్ యాప్. గూగుల్ పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఈ యాప్ ద్వారా చేసే ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్బ్యాక్ ఇచ్చేది. మొబైల్ రీఛార్జ్, డీటీహెఛ్ రీఛార్జ్ , విద్యుత్ బిల్లులు ఇలా ఒక్కటేంటి ఆన్లైన్కి చెల్లింపు వెసలుబాటు ఉన్న ఈ యాప్ ద్వారా యూజర్లు చెల్లించేవాళ్లు. ఈ క్రమంలో కొందరికి మూడు అంకెల నగదు రాగా, ఎక్కువ మంది కస్టమర్లకు కనీసం నగదు అనేది రివార్డ్స్ రూపంలో వచ్చేవి. అయితే రాను రాను ఈ పరిస్థితి కాస్త పూర్తిగా మారింది. కంపెనీ అందులో మార్పులు చేస్తూ నగదు నుంచి డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా వివిధ డీల్స్పై డిస్కౌంట్లను ఇస్తుంది. దీంతో ట్విటర్లో దీనిపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. ఓ యూజర్ గూగుల్ పే ఇంతకుముందు ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్బ్యాక్ రూపంలో కొంత డబ్బును ఇచ్చేదని, కానీ ఇప్పుడు రివార్డ్లుగా డిస్కౌంట్లు ఆఫర్లంటూ కార్డులు ఇస్తోందని వాపోయాడు. పలువురు యూజర్లు ట్విటర్ వేదికగా మండిపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. The main reason i shifted to another platforms for payment, pathetic #GPay pic.twitter.com/enJrZixExM — Vikz Karan (@VikzKaran1) November 15, 2022 use less..!!!! #GPay pic.twitter.com/7neORNwXZl — Nirmal Rangdal (@nirmal_rangdal) November 15, 2022 Always shows only this on #GPay full time pass pic.twitter.com/UxccW7khzA — Ketan Gandhi (@Coachketang) November 13, 2022 చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే!
ఓ టెక్కీ బ్యాంక్ నుంచి మెయిల్లో వచ్చిందని అనుకుని తన మొబైల్కు వచ్చిన క్యూ ఆర్కోడ్ ను స్కాన్ చేశాడు. వెంటనే అతని ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్ పిన్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు కూడా ఖాళీ అయింది, వ్యక్తిగత ఫోటోలను చూపి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. ఇటీవల టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. కాలానుగుణంగా కొత్త రకం దోపిడికి వ్యూహాలు రచ్చిస్తున్నారు. మన బ్యాంక్ నుంచి మనకి తెలియకుండానే నగదు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటిపై కాస్త అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్తో జాగ్రత్త.. క్యూఆర్ కోడ్ను స్కాన్ పేరుతో కేటుగాళ్లు కొత్త రకం దోపిడికి స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరు ఇబ్బందుల్లో పడక తప్పదు. బ్యాంక్ నుంచి నగదు తీసుకోవడానికి ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మోసపోగా మరో రెస్టారెంట్లో పెట్టిన క్యూ ఆర్కోడ్ను మార్చివేసి తమ అకౌంట్ కు నగదు జమఅయ్యేలా చేసి వంచనకు పాల్పడిన ఘటనలు ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోసగాళ్లు పలు కేంద్రాల్లో( రెస్టారెంట్లు, షాపుల్లో, కస్టమర్లు రద్దీ ఉండే ప్రాంతాలు) యజమానులకు తెలియకుండా అక్కడి క్యూ ఆర్కోడ్ను మార్చి తమ క్యూఆర్ సంకేతాన్ని ఉంచుతున్నారు. ఇది తెలియక కస్టమర్లు తమ బిల్లులు చెల్లించడానికి క్యూ ఆర్ కోడ్ని స్కాన్ చేసి అందులోకి డబ్బులను పంపుతున్నారు. అయితే చివరికి ఈ పైసలన్నీ మోసగాళ్ల ఖాతాల్లోకి జమఅవుతున్నాయి. మరో వైపు రెస్టారెంట్లో రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో దీనిపై విచారించిన యజమానులకు అసలు నిజం తెలియంతో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఫోన్పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్లో దూసుకుపోతుంది ఫోన్పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
Munugode Bypoll: ఆన్లైన్లో డబ్బులు పంపిణీ.. రిజర్వ్ బ్యాంక్ సాయం కోరతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘మునుగోడు నియోజకవర్గంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై నల్లగొండ జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరాం. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం’’అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురిచేసే వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకుల సహకారాన్ని కోరే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే దీనిపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వికాస్రాజ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కొత్త ఓటర్లపై కోర్టు తీర్పు మేరకు నిర్ణయం మునుగోడులో 24 వేలకుపైగా కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మా వాదనలు వినిపించాం. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎన్ని ఆమోదించాం? ఎన్ని తిరస్కరించాం? కారణాలేమిటన్నది కోర్టుకు వివరించాం. కోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. వేలకోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. టీఆర్ఎస్ పేరుమార్పుపై సమాచారం లేదు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చాలంటూ ఆ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. పార్టీ పేరు మార్పునకు అనుమతిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి సమాచారం కోరలేదు. పార్టీ పేరు మార్పునకు అనుమతి విషయంలో ఇంకా ఈసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఫిర్యాదుపై డీజీపీ, జిల్లా ఎస్పీల నుంచి నివేదిక కోరాం. ఇంకా అందలేదు. ఎక్కువ మంది ఉన్నా నిర్వహించగలం గతంలో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసినా విజయవంతంగా ఎన్నికలు జరిపాం. మునుగోడులో ఇప్పటివరకు 40 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను తెప్పించి సిద్ధంగా పెట్టాం. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకుగాను గురువారం నాటికి 2,40,287 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికకు పాత ఈవీఎంలనే వాడుతున్నాం. ఒక పోలింగ్ కేంద్రానికి ఒక కంట్రోల్ యూనిట్ సరిపోతుంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 2,126 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నాం. 1,500 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నాం. 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2,500 మందిని పోలింగ్ బందోబస్తు విధులకు వాడుకుంటాం. ప్రలోభాల కట్టడికి కఠిన చర్యలు మునుగోడు నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 113 పోలీసు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నాం. మరో 45 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, వీడియో స్క్వాడ్స్, అబ్జర్వర్ల బృందాలు పరిశీలన జరుపుతున్నాయి. ఇప్పటివరకు రూ.20 లక్షల నగదు, రూ.16.2 లక్షల విలువ చేసే మద్యం జప్తు చేశాం. రోజువారీ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాం. నియోజకవర్గంలోని 70 బెల్ట్ షాపులను మూయించాం. మద్యం సంబంధిత కేసుల్లో 60 మంది అరెస్టయ్యారు. అనుమతి లేని ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు అంటించడం వంటి ఘటనల్లో 15వేలకుపైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు గట్టి షాక్.. రెడీగా ఉండండి!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ డిజిటల్లోకి మారుతోంది. నోట్ల రద్దు నాడు మొదలైన డిజిటల్ ట్రెండ్ ముఖ్యంగా కరోనా రాకతో డబ్బులు మార్పిడి తగ్గి ఫటా ఫట్మంటూ యూపీఐ లావాదేవీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇదేదో బాగుందనుకుని అప్పటి నుంచి నగదు లావాదేవీల కొరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్లను తెగ వాడుతున్నారు. ఎంతలా అంటే చిన్న షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు మొత్తం యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ, ఫ్రీగా లావాదేవీలకు అలవాటు పడిపోయిన వారికి కేంద్రం గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఇకపై యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఫీజులు, ఛార్జీలు విధించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 3 లోపు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను కోరింది. సాధారణంగా క్రెడిట్ కార్డు వాడితే ఎండీఆర్(MDR) ఛార్జీలు వేస్తారు. దీన్ని బ్యాంకులతో పాటు కార్డు జారీ కంపెనీలు పంచుకుంటాయి. ఇదే తరహాలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్ధంగా సేవలు అందిస్తాయని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే యూపీఐ యాప్లను వినియోగించే వారికి పెద్ద షాక్ తగలనుంది. దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫాంగా యూపీఐ పేరు సంపాదించింది. నగదు బదిలీలతో పాటు వ్యాపార చెల్లింపులు కలిపి ప్రతి నెలా 6 బిలియన్ల లావాదేవీలు, రూ. 10 ట్రిలియన్ల వరకు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 2022 మొదటి త్రైమాసికంలో 64%, విలువ పరంగా 50% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి చదవండి: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది! -
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్.. ‘‘క్యూఆర్’ కోడ్తో పేమెంట్ చేస్తున్నారా?!
ఈ రోజుల్లో ఏదైనా వస్తువు కొనాలంటే వెంట డబ్బులు ఉండనక్కర్లేదు. డెబిట్ కార్డ్ కూడా అవసరం లేదు. స్మార్ట్ ఫోన్.. అందులో డిజిటల్ చెల్లింపుల ఎంపిక ఉంటే చాలు. దీంట్లో భాగంగానే ‘క్యూఆర్’ కోడ్ వచ్చాక మన జీవితం మరింత సులభం అయిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ పద్ధతి వల్ల మోసాల బారినపడుతున్నవారూ ఉన్నారు. అందుకే డిజిటల్ పేమెంట్స్ చేసేవారు తప్పనిసరిగా ‘క్యూ ఆర్’ కోడ్ గురించి తెలుసుకోవాల్సిందే! నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం వేగంగా దూసుకుపోతోంది. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నగదు చెల్లించడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా మన జీవితం మరింత సులభతరంగా మారిపోయింది. క్షణాల్లో చెల్లింపులు నెఫ్ట్ లేదా ఆర్టిజిఎస్ లావాదేవీలను పూర్తి చేయడానికి యుపిఐ అనేది స్వల్పకాలిక చెల్లింపు పద్ధతి. ఆర్థిక లావాదేవీని జరపడానికి .. క్యూఆర్ కోడ్ స్కాన్, నగదు మొత్తం, అంకెల పిన్ చేస్తే చాలు లావాదేవీ సెకన్లలో పూర్తవుతుంది. క్యూఆర్ కోడ్లను ఉపయోగించే యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ లు ప్రధానమైనవి. తర్వాత జాబితాలో భీమ్ యాప్, మొబిక్విక్, పేజ్యాప్, రేజర్పే మొదలైనవి ఉన్నాయి. క్విక్ రెస్పాన్స్ అనే క్యూఆర్ కోడ్ బార్కోడ్ డేటాతో ఎన్కోడ్ చేసే స్కాన్. బాధితుల డబ్బు దొంగిలించడానికి మోసగాళ్లు వారి సొంత క్యూఆర్ కోడ్లను సృష్టిస్తారు. లేదా బాధితుల నుండి వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా రాబడతారు. లింక్స్ ద్వారా ఎర సాధారణంగా బయట షాపింగ్ చేసే సమయంలో ఈ సమస్య తలెత్తదు. ఆన్లైన్ బిజినెస్లో భాగంగా తమ వస్తువును విక్రయించడానికి చేసే పోస్టులో మోసగాళ్లు క్యూఆర్ కోడ్ కూడా రూపొందిస్తారు. ఈ లింక్ను వాట్సప్ లేదా ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీనికి ఆకర్షితులై లింక్ ఓపెన్ చేశాక, నగదు చెల్లింపులకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయమని బాధితుడిని కోరుతారు. బాధితులు తమ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. డబ్బులు జమ చేస్తామని నమ్మించి, మోసగాళ్లు బాధితుల ఖాతాల నుంచి డబ్బును దొంగిలిస్తారు. ఫోన్ చేసి.. రాబట్టే ప్రక్రియ ఒక సైబర్ నేరస్థుడు మీకు ఫోన్ చేసి ఫలానా బహుమతి గెలుచుకున్నారని నమ్మబలుకుతాడు. ఆ బహుమతిని పొందడానికి తాను పంపిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని కోరుతాడు. మీకు తెలిసిన లేదా నమ్మకం కలిగించే వ్యక్తిగా వ్యవహరిస్తాడు. దీని నుంచి వారు మీ డేటాను పొందవచ్చు. చాలా నేరాలు ఫిషింగ్ కాల్స్, ఎసెమ్మెస్/ఇ–మెయిల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా జరుగుతాయి. స్కామర్లు ఇప్పుడు వారి మోడస్ ఆపరెండీని క్యూఆర్ కోడ్లకు కూడా మార్చారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ►మోసగాళ్లు మోసం చేయడానికి కొత్త, సృజనాత్మక మార్గాలను ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. వాటిలో క్యూఆర్ కోడ్ ఒకటి. స్కామర్లు మీకు క్యూఆర్ కోడ్తో కూడిన ఇ–మెయిల్ లేదా సోషల్ మీడియాలో సందేశాన్ని పంపుతారు. క్యూఆర్ కోడ్తో మీరు డబ్బును తిరిగి పొందవచ్చుని పేర్కొంటారు. ►మనం చూసిన క్యూఆర్ కోడ్ చట్టబద్ధమైనదిగా అనిపిస్తుంది. ఆకర్షణీయమైన ప్రకటనలుగా వాట్సప్, సోషల్ మీడియా సందేశాలు ఉంటాయి. ఉదా: క్యూఆర్ కోడ్ చిత్రంతో పాటు మీరు రూ. 5,00,000 గెలుచుకున్నందుకు అభినందనలు అని ఉందనుకోండి. ఆ మెసేజ్కు ఆకర్షితుడైన బాధితుడు కోడ్ని స్కాన్ చేసి, మొత్తాన్ని నమోదు చేసి, తన బ్యాంకు అకౌంట్కు బదిలీచేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఖాతాలోకి నగదును స్వీకరించడానికి పిన్ ఉంటుంది. తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని బాధితులు నమ్ముతారు. కానీ డబ్బును స్వీకరించడానికి బదులుగా మన ఖాతా నుండి నగదు వేరే అకౌంట్కు బదిలీ అవుతుంది. తప్పుడు క్యూఆర్ కోడ్స్ ఫిషింగ్ ఇ–మెయిల్లు, టెక్ట్స్ లేదా సోషల్ మీడియా పోస్ట్లలో తప్పుడు క్యూఆర్కోడ్లను ఉపయోగించడం మరొక పద్ధతి. తప్పుడు కోడ్ను స్కాన్ చేసిన తర్వాత, వినియోగదారులు వాస్తవికంగా కనిపించే పేజీలతో వెబ్సైట్లకు మళ్లించబడతారు, అక్కడ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం అందించడం ద్వారా బాధితుడు అకౌంట్ లాగిన్ అయ్యేలా చూడచ్చు. సురక్షితమైన చెల్లింపులకు... అంతటా క్యూఆర్ కోడ్ చెల్లింపులు జరుగుతున్నాయి. మీరు బాధ్యతాయుతంగా ఈ లావాదేవీలు జరిపినప్పుడు మీ బ్యాంకు ఖాతా నగదు సురక్షితంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ తో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే అవి యంత్రాల ద్వారా మాత్రమే చదవబడతాయి. మీరు స్నేహితుడికి కొంత డబ్బును బదిలీచేయాలనుకుంటే ఉదాహరణకు.. డబ్బును పంపే ముందు మీరు వారి ఖాతా నంబర్, మొత్తం, ఇతర సమాచారాన్ని ధృవీకరించాలి. క్యూఆర్ కోడ్తో ఆ అవసరం లేదు. అందుకని.. తెలియని కోడ్ను స్కాన్ చేయకూడదు. ►డబ్బు చెల్లించడానికే క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. వివరాలు తెలియజేయడానికి కాదు. డబ్బును స్వీకరించడానికి బదులుగా, మీకు మొత్తం క్రెడిట్ చేయబడుతుంది స్కాన్ చేయమని అడిగితే అది స్కామ్ కావచ్చని గ్రహించండి. మీ వ్యక్తిగత ఖాతా వివరాలు మోసగాళ్లచే దొంగిలించబడుతున్నాయని తెలుసుకోండి. వివరాల ఆధారంగా మీ బ్యాంక్ ఖాతా నుండి స్కామర్లు ఎక్కువ మొత్తం నగదు దొంగిలించవచ్చు. ►మీ బ్యాంక్ పంపిన ఈ–మెసేజ్లు, మెయిల్ల గురించి విచారించడానికి నేరుగా బ్యాంక్ను సంప్రదించండి. అంతేకాని, మీ బ్యాంక్ ద్వారా పంపబడినట్లు భావిస్తున్న క్యూఆర్ కోడ్తో స్పామ్ లేదా అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించకండి. ►మీరు నమ్మని క్యూఆర్ కోడ్ని మీరు చూసినట్లయితే, మీరు అందించే సేవ లేదా ఉత్పత్తి గురించిన మరింత సమాచారాన్ని మాన్యువల్గా చూసేందుకు ప్రయత్నించండి. ►క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని మిమ్మల్ని అడిగే స్పామర్లకు ‘నో‘ చెప్పడానికి భయపడకండి. మీకు కష్టంగా అనిపిస్తే, వాటిని బ్లాక్ చేసి సంబంధిత వెబ్సైట్ లేదా బ్యాంక్ లేదా సోషల్ మీడియాకు తెలియజేయండి. ►మీరు క్యూఆర్ కోడ్ స్కామ్కి బాధితులుగా మారితే వెంటనే చేయాల్సింది... cybercrime.gov.in/uploadmedia/MHA-CitizenManualReportOtherCyberCrime-v10.pdfలో ఫిర్యాదును నమోదు చేయండి. లేదా ఫిర్యాదు చేయడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. ►హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయవచ్చు, ఇది సంబంధిత రాష్ట్ర పోలీసు అధికారిచే నిర్వహించబడుతుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని ఫోన్.. ఆధార్ వివరాలు చెప్పినందుకు! -
వచ్చేసింది..గూగుల్ పే, ఫోన్ పే యాప్స్కు పోటీగా టాటా పే...!
అమెజాన్, జియో లాంటి సంస్థలకు పోటీగా టాటా గ్రూప్స్ గురువారం రోజున టాటా న్యూ యాప్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ ఎకానమీలో మరింత బలోపేతం అయ్యేందుకుగాను స్వంత యూపీఐ ‘టాటా పే’ సర్వీసును టాటా న్యూలో జోడించింది. టాటా పేతో చెల్లిస్తే రివార్డులు..! టాటా పే యూపీఐ సేవలు టాటా న్యూ యాప్లో అందుబాటులో ఉండనుంది. టాటా న్యూ యాప్తో జరిపే లావాదేవీలను టాటా పే ఉపయోగించి చెల్లించవచ్చును. ఈ చెల్లింపులతో యూజర్లకు న్యూకాయిన్స్(Neucoins)ను లభించనున్నాయి. టాటా న్యూ అందించే రిడెంప్షన్ ప్రోగ్రామ్లో భాగంగా టాటా పే ఉపయోగించి లేదా ఏదైనా టాటా గ్రూప్స్కు చెందిన స్టోర్లలో జరిపే కొనుగోళ్ల ద్వారా మాత్రమే న్యూకాయిన్స్ లభిస్తాయి. ప్రతి ఒక్క న్యూకాయిన్స్ విలువ రూ. 1 సమానం. కొత్త టాటా పే యూపీఐ ఖాతాను సృష్టించడానికి... ప్రతి ఒకరు మూడు-దశల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుసరించాలి. స్కానింగ్, బ్యాలెన్స్ చెక్, ఖాతా/ స్వీయ-బదిలీ మొదలైన అన్ని సేవలను పొందవచ్చును. భారత్లో యూపీఐ సేవలు గణనీయంగా పుంజుకున్నాయి. దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఫిబ్రవరి, 2022లో రూ. 8.26 లక్షల కోట్లతో పోలిస్తే మార్చి 2022లో రూ. 9.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరలో యూపీఐ లావాదేవీలు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ. 81 లక్షల కోట్ల మార్కును దాటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. చదవండి: 'టాటా న్యూ యాప్ లాంచ్, రతన్ టాటా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా! -
గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..!
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫాం గూగుల్ పే తన యూజర్లకు గుడ్న్యూస్ను అందించింది. మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్ టూ పే’ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. పైన్ ల్యాబ్స్తో భాగస్వామ్యం..! యూపీఐ సేవల్లో భాగంగా 'ట్యాప్ టు పే' ఫీచర్ కోసం ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్తో గూగుల్ పే జతకట్టింది. దీంతో యూజర్లు తమ కార్డ్లను ఉపయోగించకుండా యూపీఐ ద్వారా సజావుగా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ కేవలం డెబిట్, క్రెడిట్ కార్డ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. పైన్ ల్యాబ్స్ రూపొందించిన ఆండ్రాయిడ్ పీఓఎస్ టెర్మినల్ని ఉపయోగించి లావాదేవీలను గూగుల్ పే యూజర్లు చేయవచ్చును. నీయర్ టూ ఫీల్డ్(ఎన్ఎఫ్సీ) పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో ఉండే అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, స్టార్బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారులకు అందుబాటులోకి వచ్చింది. ట్యాప్ టూ పే ఫీచర్తో యూపీఐ పేమెంట్స్ మరింత తక్కువ సమయంలో జరుగుతాయని గూగుల్ పే బిజినెస్ హెడ్ సశిత్ శివానందన్ అన్నారు. అంతేకాకుండా అవుట్లెట్లలో, క్యూ మేనేజ్మెంట్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. గూగుల్ పేతో భాగస్వామిగా పైన్ ల్యాబ్స్ ఉన్నందుకు సంతోషిస్తున్నామని పైన్ ల్యాబ్స్ బిజినెస్ చీఫ్ ఖుష్ మెహ్రా అన్నారు. భారత్లో కాంటక్ట్లెస్ పేమెంట్స్ను అందించేందుకు పైన్ ల్యాబ్స్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. చదవండి: భారత్కు గుడ్బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! -
టాటా యూపీఐ పేమెంట్ యాప్ వచ్చేస్తోంది!
గూగుల్ పే, ఫోన్పేలకు టాటా గ్రూప్ షాకివ్వనుంది. ఆ రెండు సంస్థలకు ధీటుగా టాటా గ్రూప్ యూపీఐ పేమెంట్ యాప్ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం..యూపీఐ పేమెంట్స్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు టాటా గ్రూప్ ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) అనుమతులు తీసుకున్నట్లు టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ యూనిట్ తెలిపిందని ఎకనమిక్ టైమ్ పేర్కొంది. అంతేకాదు ఈ యూపీఐ పేమెంట్ కార్యకాలపాల్ని నిర్వహించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్తో చర్చలు జరిపినట్లు వెల్లడించింది. నాన్ బ్యాంక్ సంస్థలు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు బ్యాంక్లతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశీయంగా యూపీఐ సేవల్ని అందిస్తున్న గూగుల్ పే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఎక్కువ శాతం యూపీఐ లావాదేవీలు గూగుల్ పే లేదా ఫోన్పేలో జరుగుతాయి. ఇక పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి ఇతర యాప్లు మార్కెట్ను కలిగి ఉండగా..తాజాగా టాటా గ్రూప్ రంగంలోకి దిగడంతో యూపీఐ పేమెంట్స్ యాప్స్ మధ్య పోటీ తత్వం నెలకొంది. -
గూగుల్ పే సూపర్ ఆఫర్.. నిమిషాల్లో లక్ష రూపాయల లోన్!
కరోనా మహమ్మరి తర్వాత దేశంలో దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ విలువ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. గూగుల్ పే వాడుతున్న యూజర్లకు ఆన్లైన్ పేమెంట్ యాప్ శుభవార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ఉపయోగించే యూజర్లకు లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే, దీని కోసం మీరు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు రూ.లక్ష వరకు లోన్ పొందడానికి అర్హులు. గూగుల్ పే ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు డీఎమ్ఐ ఫైనాన్స్ అనే కంపెనీ పర్సనల్ లోన్ ఆఫర్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అర్హత కలిగిన వినియోగదారులకు కేవలం నిమిషాల వ్యవదిలోనే డీఎమ్ఐ ఫైనాన్స్ అనే కంపెనీ రూ.1 లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు అందజేయనున్నట్లు పేర్కొంది. అయితే, తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో(3 ఏళ్ల లోపు) తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్ పే వాడే ప్రతి ఒక్కరికీ లోన్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్న యూజర్లకు రుణం లభించే అవకాశం ఉంటుంది. DMI Finance partners with @GooglePayIndia to offer an innovative digital personal loan product to make credit accessible to users of Google Pay.#InstantLoan #PersonalLoan pic.twitter.com/TCQ0YdVqCr — DMI Finance (@DMIFinance) February 14, 2022 "లక్షలాది మంది గూగుల్ పే వినియోగదారులకు పారదర్శకంగా, త్వరితగతిన రుణాలు అందించేందుకు మా బృందాలు పనిచేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి చేరుకోవడానికి కృషి చేస్తామని" డీఎమ్ఐ ఫైనాన్స్ సహ వ్యవస్థాపకుడు & జాయింట్ ఎండి శివశిష్ ఛటర్జీ అన్నారు. (చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఏడాది పాటు ఉచితంగా ఓటీటీ సేవలు..!) -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వర్ డౌన్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) సర్వర్ నేడు డౌన్ అయ్యింది. దీంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి సంస్థలు పని చేస్తాయి. ఈ రోజు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలకు ఓ గంట సేపు అంతరాయం కలిగింది. వినియోగదారులు ఇతర బ్యాంకు ఖాతాలకు తక్షణమే డబ్బు పంపడానికి యుపీఐని ఉపయోగించే గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే పనిచేయడం లేదని వారు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సమస్యపై ఎన్పీసీఐ స్పందించింది. ఎన్పీసీఐ ఒక ట్వీట్ చేస్తూ యూపీఐ వ్యవస్థలో కలిగిన సాంకేతిక లోపాన్ని అంగీకరించింది. అయితే, యూపీఐ ఇప్పుడు మళ్లీ పనిచేస్తోందని తెలిపింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. Regret the inconvenience to #UPI users due to intermittent technical glitch. #UPI is operational now, and we are monitoring system closely. — NPCI (@NPCI_NPCI) January 9, 2022 అయితే, ఈ ట్వీట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు. ఇది కేవలం తమకే అవుతున్నదా.? ఇతరులకూ ఈ అంతరాయం ఎదురైందా? అని ప్రశ్నలు వేసుకున్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం దాని యూపీఐ సిస్టమ్ డౌన్ అయినట్లు వివరించింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్ల తమ యూపీఐ డౌన్లో ఉన్నదని తెలిపింది. ఇదే విషయాన్ని టెక్ రివ్యూయర్ నితిన్ అగర్వాల్ ట్విట్టర్లో తెలిపారు. @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 It's more than 5 hours now #UPI transaction are stuck as servers are down..!!! What's going on here @HDFC_Bank @GooglePay @Paytm !! — Niral Mehta (@NiralMehta1) January 9, 2022 (చదవండి: కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి తయారీ కంపెనీల షాక్..!) -
చిల్లర లేదు అనొద్దు.. నా దగ్గర ఫోన్ పే ఉంది!
సాక్షి హైదరాబాద్: సంక్రాంతికి డూడూ బసవన్నలు సందడి చేస్తుంటాయి. వీటిని ఆడించే గంగిరెద్దుల వారికి జనం తమకు తోచినంత నగదు ముట్టజెబుతుంటారు. ప్రస్తుతం చిల్లర సమస్య ఉండటంతో చాలా మంది డిజిటల్ పేమెంట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బసవన్నలకు గూగూల్పే, ఫోన్పే స్కానర్లను గంగిరెద్దుల వాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం బంజారాహిల్స్లో ఫోన్ పే తగిలించిన డూడూ బసవన్న ఆకట్టుకుంది. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్లను తగలబెట్టేస్తా!) -
యూపీఐ పేమెంట్స్ చేసే యూజర్లకు శుభవార్త..!
యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్..! ఇకపై విదేశాల్లోని భారతీయులు జరిపే నగదు లావాదేవీలు మరింత సులువుగా, వేగంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ యూపీఐ నగదు లావాదేవీ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెస్ట్రన్ యూనియన్తో ఒప్పందం.. భారత నగదు చెల్లింపుల సంస్థ ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) ప్రముఖ విదేశీ నగదు ట్రాన్స్ఫర్ సంస్థ వెస్ట్రన్ యూనియన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో విదేశాల్లోని ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతరులు యూపీఐ పేమెంట్ యాప్స్ను ఉపయోగించి నగదు లావాదేవీలను జరపవచ్చునని ఎన్ఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లాతో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెస్ట్రన్ యూనియన్, పలు సంస్థల భాగస్వామ్యంతో విదేశాల్లో నివసిస్తోన్న 30 మిలియన్ల భారతీయులకు లబ్ధి చేకూరనుంది. మరింత సులువుగా..వేగంగా..! ఇతర దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతర వ్యక్తులు భారత్లోని యూపీఐ కస్టమర్లు నగదు లావాదేవీలను సులభంగా, వేగంగా జరుపవచ్చును. వెస్ట్రన్ యూనియన్ , యూపీఐ ఇంటిగ్రేటెడ్ ఛానెల్ల ద్వారా డబ్బు పంపించుకోవచ్చును. ఛార్జీలు ఏలా ఉంటాయంటే..! విదేశీ మార్కెట్లో రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా జరిపే లావాదేవీలోని ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఛార్జీలు సాధారణంగా మార్కెట్ డైనమిక్స్, అందుబాటులోని ఛానెల్లపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఎన్పీసీఐ , వెస్ట్రన్ యూనియన్ భాగస్వామ్యంతో ఆయా లావాదేవీల ఖర్చు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్న్యూస్..! -
యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) రాకతో నగదు లావాదేవీలు మరింత సులభంగా మారాయి. బ్యాంకుల ప్రమేయం లేకుండా క్షణాల్లో నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. పాన్ షాపు నుంచి మెడిసిన్స్ షాపుల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్కు అలవాటు పడ్డారు. దీంతో కొత్త సైబర్ నేరస్తులు కూడా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూ ఆర్ కోడ్లను, అడ్రస్లను యూజర్లకు గాలం వేసి డబ్బులను కాజేస్తున్నారు. ఇలాంటి నేరాల నుంచి తప్పించుకోవాలంటే యూపీఐ పేమెంట్స్ విషయంలో పలు సూచనలను పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చును. చదవండి: హైటెక్ ఘరానా మోసగాళ్లు..! నమ్మించి సింపుల్గా రూ. 58 వేల కోట్లు స్వాహా..! 1. మీ యూపీఐ చిరునామాను ఎప్పుడూ తెలియనివారితో పంచుకోవద్దు. యూపీఐ చిరునామాను సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమైన భద్రతా చిట్కా. ఏదైనా చెల్లింపు లేదా బ్యాంక్ అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఎవరినీ అనుమతించకూడదు. 2. శక్తివంతమైన స్క్రీన్ లాక్ని సెట్ చేయండి మీరు వాడే గూగుల్పే, ఫోన్పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్కు శక్తివంతమైన స్క్రీన్ లాక్ను ఏర్పాటు చేయడం మంచింది. మీ డేట్ ఆఫ్ బర్త్ను, మొబైల్ నంబర్ అంకెలను, స్క్రీన్ లాక్గా ఉంచకూడదు. మీ పిన్ను ఎవరితోనూ షేర్ చేయకూడదు ఒకవేళ మీ పిన్ బహిర్గతమైందని మీకు అనుమానం వస్తే, వెంటనే దాన్ని మార్చండి. 3. వేరిఫైకాని లింక్లపై క్లిక్ చేయవద్దు, నకిలీ కాల్స్ను హాజరుకావద్దు సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ..యూపీఐ పేమెంట్స్ లింక్స్ను యూజర్లకు పంపిస్తున్నారు. యూపీఐ స్కామ్ అనేది యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ టెక్నిక్. హ్యాకర్లు సాధారణంగా లింక్లను షేర్ చేస్తూ లేదా కాల్ చేసి డబ్బులను ఊడ్చేస్తారు. మీరు అలాంటి లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. మీ పిన్ లేదా మరేదైనా సమాచారాన్ని ఎవరితోనైనా షేర్ చేయకూడదు. బ్యాంకులు ఎప్పుడూ పిన్, ఓటీపీ, మరే ఇతర వ్యక్తిగత వివరాలను అడగవు. 4. ఎక్కువ యాప్స్ వాడకండి. ఆయా యూపీఐ పేమెంట్స్ యాప్స్ భారీగా ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పి ఒకటి, రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్స్ వాడడం మంచింది కాదు. 5. క్రమం తప్పకుండా యాప్స్ను అప్డేట్ చేయాలి. ఆయా యూపీఐ యాప్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొత్త అప్డేట్లు మెరుగైన UI , కొత్త ఫీచర్లు మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. యాప్లను తాజా వెర్షన్కి అప్గ్రేడ్ చేయడంతో మీ యూపీఐ ఖాతాలను సురక్షితంగా ఉంచుతుంది. చదవండి: ‘ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్గా తెలంగాణ..!’ -
‘అదే జరిగితే బ్యాంకులకు తప్పని ముప్పు..!’
భారత్లో డిజిటల్ చెల్లింపులు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. గత ఏడాది కాలంగా కార్డు పేమెంట్స్తో పోల్చుకుంటే డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ కూడా వెల్లడించారు. ఇప్పుడు ఆయా డిజిటల్ చెల్లింపుల యాప్స్ టెక్నాలజీను అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు వెనకబడి ఉన్నాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ వెల్లడించారు. చిన్న చూపు తగదు..! గత రెండేళ్లుగా భారతీయ బ్యాంకర్లు డిజిటల్ చెల్లింపుల వ్యాపారాలను చిన్న చూపు చూసున్నాయని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) బ్లూమ్బెర్గ్ నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరమ్లో ఉదయ్ కోటక్ అన్నారు. 85 శాతం మార్కెట్ వాటాను పొందిన గూగుల్ పే, ఫోన్పే యాప్స్ ద్వారా యూపీఐ సేవలను ఆయా బ్యాంకులు అనుమతించినట్లు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో సాంప్రదాయ మార్కెట్ల నుంచి పెద్దభాగంలో కస్టమర్లు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమైతే బ్యాంకులకు ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఫోన్పై,గూగుల్ పే అనుసరిస్తోన్న సాంకేతికతను వీలైనంత త్వరగా అందిపుచ్చుకుంటే మంచిందని, అందుకు కావాల్సిన వారిపై నియమాకాలను బ్యాంకులు చేపట్టాలని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాలను ఇచ్చేస్తాయి డిజిటల్ చెల్లింపుల యాప్స్ దూకుడు మీద ఉన్నాయి. దేశవ్యాప్తంగా గణనీయమైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపుల యాప్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పేరుతో సేవలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గూగుల్ పే యూజర్లకు ఖాతాలను అందించే విషయంతో వెనకడుగు వేసింది. రానున్న రోజుల్లో ఆయా డిజిటల్ చెల్లింపుల యాప్స్ యూజర్లకు ఖాతాలను అందించే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రూ. 999కే ఆరోగ్య బీమా..! లాంచ్ చేసిన ఫోన్పే..! వివరాలు ఇవే..! -
కార్డులతో చెల్లింపులు.. గూగుల్ కీలక ప్రకటన
Online Payments Google will NOT save your card details from 2022: స్మార్ట్ ఫోన్, ఇతర డివైజ్ల ద్వారా పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్ ముఖ్య గమనిక చేసింది. అదీ గూగుల్ బేస్డ్ మంత్లీ పేమెంట్లు చేసేవాళ్లకు. జనవరి 1,2022 నుంచి కస్టమర్ కార్డు వివరాలు సేవ్ చేయబోమని వెల్లడించింది. ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం చెల్లింపుల విషయంలో ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణంగా ఒక్కసారి పేమెంట్ చేశాక.. మంత్లీ పేమెంట్లు చేసే టైంలో కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్ అనేవి ఆటోమేటిక్గా కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ వివరాలతో యూజర్ అవసరానికి తగ్గట్లు ఆటోమేటిక్గా పేమెంట్ కూడా జరిగిపోతుంటుంది. అయితే ఇకపై గూగుల్ సంబంధిత యాప్స్ విషయంలో ఇలాంటి ఫార్మట్ కనిపించదని పేర్కొంది గూగుల్. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన కార్డు స్టోరేజ్ రెగ్యులేషన్స్ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. పేమెంట్ అగ్రిగ్రేటర్స్(PA), పేమెంట్ గేట్వేస్(PG) కొరకు ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకం జారీ చేసింది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. కార్డ్ జారీచేసినవాళ్లు, సంబంధిత నెట్వర్స్క్ తప్ప కార్డు వివరాల్ని(Card-on-File) ఇతర ప్లాట్ఫామ్స్ ఏవీ సేకరించడానికి వీల్లేదు. గూగుల్ ప్లే అకౌంట్, గూగుల్ వర్క్ అకౌంట్, చివరికి గూగుల్క్లౌడ్లో రికార్డయిన వివరాలు సైతం పని చేయవు. కాబట్టి, వచ్చే ఏడాదిలోనూ అదే కార్డును ఉపయోగించుకోవాలనుకునేవాళ్లు ఎప్పటికప్పుడు కార్డు వివరాల్ని రీఎంటర్ చేయాల్సి ఉంటుందని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. లేనిపక్షంలో పేమెంట్లు క్యాన్సిల్, డిక్లయిన్ అవుతాయని స్పష్టం చేసింది. అయితే మన దేశంలో ఎక్కువ మంది కార్డు పేమెంట్ల ద్వారా ఎక్కువగా ఉపయోగించేది వీసా, మాస్టర్కార్డులే. వీటి విషయంలో మాత్రం ఊరట ఇచ్చే విషయం చెప్పింది గూగుల్. వీసా, మాస్టర్ కార్డు సంబంధిత డెబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయాలనుకుంటే.. డిసెంబర్ 31,2021లోపు కార్డు వివరాల్ని రీ-ఎంటర్ చేయాలని, తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు లేదా పేమెంట్ చేస్తే ఆ వివరాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కార్డు వివరాలు ఆటోమేటిక్గా కనిపించవని, కాబట్టి.. వచ్చే ఏడాది నుంచి పేమెంట్లు చేసే టైంలో మళ్లీ ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక రూపే, అమెరికన్ ఎక్స్ప్రెస్, డిస్కవర్, డైనర్స్ కార్డ్ వినియోగదారులు మాత్రం స్టోర్ కావని, పేమెంట్ చేసిన ప్రతీసారి వివరాలు సమర్పించాల్సిందేనని పేర్కొంది. చదవండి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ..! -
గూగుల్ అసిస్టెంట్తో టీకాల బుకింగ్
Google For India Event 2021 Key Announcements: దేశీయంగా డిజిటల్ సర్వీసులను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఏడో వార్షిక సమావేశం సందర్భంగా పలు ప్రకటనలు చేసింది. గూగుల్ అసిస్టెంట్ ఆధారిత టీకా బుకింగ్ సేవలు, సిడ్బి భాగస్వామ్యంతో లఘు పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. కొత్త ఇంటర్నెట్ యూజర్లు భారతీయ భాషల్లో సమాచారాన్ని పొందడానికి, చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడే డిజిటల్ ఆవిష్కరణలపై కంపెనీకి ఉన్న నిబద్ధతకు ఇవి నిదర్శనమని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. ఇటు వినియోగదారులకు, అటు డిజిటల్ ఎకానమీలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు సురక్షితంగా ఉండేలా తగు సైబర్ చట్టాల తెస్తున్నామని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. ‘గూగుల్ పే’లో హింగ్లీష్ చెల్లింపు సేవల యాప్ గూగుల్ పేలో త్వరలో స్పీచ్ టు టెక్ట్స్ ఫీచర్ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్ మేనేజ్మెంట్) అంబరీష్ కెంగె తెలిపారు. దీనితో చెల్లింపు జరపాల్సిన ఖాతా నంబరును వాయిస్తో (చెప్పడం ద్వారా) యాప్నకు జోడించవచ్చని చెప్పారు. అలాగే దేశీ యూజర్ల సౌలభ్యం కోసం తమ ప్లాట్ఫాంపై హింగ్లీష్ (హిందీ, ఇంగ్లీష్ కలయిక) ప్రాధాన్య భాషగా ఎంచుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సిడ్బితో జట్టు.. రూ. 110 కోట్ల ఆర్థిక ప్రోగ్రాంతో చిన్న సంస్థలకు రుణాలు ఇచ్చే దిశగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (సిడ్బి)తో గూగుల్ చేతులు కలిపింది. దీని కింద మెరుగైన వడ్డీ రేట్లపై లఘు పరిశ్రమలు రూ. 25 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలు పొందవచ్చు. మహిళల సారథ్యంలోని సంస్థలు, కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన వాటిని తయారు చేస్తున్న సంస్థలకు ప్రాధాన్యం లభిస్తుందని సిడ్బి సీఎండీ శివసుబ్రమణియన్ రామన్ తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియాలో మరిన్ని ప్రకటనలు - గూగుల్ అసిస్టెంట్ సహాయంతో కోవిన్ వెబ్సైట్లో టీకాలకు బుకింగ్ చేసుకోవచ్చు. 2022 తొలి నాళ్ల నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది ఎనిమిది భాషల్లో ఈ సర్వీసు లభ్యమవుతుంది. - యూజర్లు ..సినిమాలు, పాటలతో నేరుగా యూట్యూబ్ చానెల్స్ నుంచి వీడియోలను క్రియేట్ చేసేలా కొత్త ఫీచర్ను గూగుల్ ప్రకటించింది. ఎన్హెచ్ స్టూడియోజ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. - వాతావరణ అలర్ట్లు అందించడానికి కేంద్రీయ కాలుష్య నియంత్రణ బోర్డు, ఇండియన్ మెటిరియోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ)తో జట్టు. - నాస్కామ్ ఫౌండేషన్ తదితర సంస్థల భాగస్వామ్యంతో గూగుల్ కెరియర్ సర్టిఫికెట్స్కు సంబంధించి ఒక లక్ష స్కాలర్షిప్లను కంపెనీ ప్రకటించింది. చదవండి: -
గూగుల్పే మాదిరిగా...వాట్సాప్లో మనీ క్యాష్బ్యాక్..!
Whatsapp Offers 255 Rupees Cashback: ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్లో వాట్సాప్ పేమెంట్స్ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా వాట్సాప్ పేమెంట్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండనుంది. గూగుల్పే (తేజ్) తరహాలో క్యాష్బ్యాక్ ఆఫర్లను వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ పేమెంట్స్కు యూజర్ల బేస్ పెంచుకునే క్రమంలో వాట్సాప్ ఈ ఐడియాతో ముందుకువచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: పేరు మార్చాడో లేదో...! ఏకంగా యాపిల్కే గురిపెట్టాడు..! రూ. 255 వరకు కచ్చితమైన క్యాష్బ్యాక్..! వాట్సాప్ పేమెంట్స్ వాడుతున్న యూజర్లు వారి స్నేహితుడికి లేదా ఇతరులకు రూ. 1 చెల్లిస్తే రూ. 51 రూపాయలను క్యాష్బ్యాక్ను వాట్సాప్ అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ మొదటి ఐదు లావాదేవీలకు మాత్రమే చెల్లుబాటు కానుంది. ప్రతి ఐదు లావాదేవీలకు యూజర్లుకు కచ్చితమైన రూ. 51 క్యాష్బ్యాక్ వస్తోంది. వాట్సాప్ పేమెంట్స్ ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా యూజర్లు మొత్తంగా రూ.255 వరకు క్యాష్బ్యాక్ను వాట్సాప్ నుంచి పొందవచ్చు. వాట్సాప్ పేమెంట్ సర్వీస్తో రిజిస్టర్ చేసుకున్న యూజర్ల బ్యాంక్ ఖాతాలో క్యాష్బ్యాక్ నేరుగా జమ అవుతుంది. వాట్సాప్ పేమెంట్స్ను ఇలా సెట్ చేయండి..! వాట్సాప్ పేమెంట్స్ చేయాలనుకునే వారు మొదట వాట్సాప్ అప్ డేట్ వెర్షన్ కలిగి ఉండాలి. వాట్సాప్ చాట్ ఆప్షన్లో కన్పించే ‘₹’ సింబల్పై ప్రెస్ చేయాలి. ఒక వేళ మీరు ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు పేమెంట్ చేసే అప్షన్ కన్పిస్తోంది. ఒకవేళ చేయకపోతే ఇతర యూపీఐ యాప్స్ మాదిరిగానే మీ బ్యాంక్ అకౌంట్ను వాట్సాప్తో లింక్ చేయాలి. మీరు బ్యాంక్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, ఆ నెంబర్తోనే వాట్సాప్ ఉండాలి. యూపీఐ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ నుంచి ఆటో డిటెక్ట్ ఎస్ఎంఎస్ వస్తుంది వాట్సాప్ పే, యూపీఐ సెటప్ పూర్తయిన తర్వాత వాట్సాప్ చాట్ విండో నుంచే మీరు పేమెంట్స్ చేయవచ్చు. చదవండి: మహీంద్రా ఎక్స్యూవీ700 జావెలిన్ ఎడిషన్పై ఓ లుక్కేయండి..! -
గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..!
యూపీఐ విభాగంలో పలు సేవలను అందించాలనే గూగుల్ ప్రణాళిక ఆదిలోనే నిలిచిపోయింది. గతంలో గూగుల్ పే యూజర్లకు ఫ్లెక్స్ సర్వీసులను అందించాలని గూగుల్ భావించింది. ఫ్లెక్స్ సర్వీసెస్ సహాయంతో గూగుల్ పే యాప్ ద్వారా డిజిటల్ బ్యాంక్ ఖాతాలను అందించే ప్రయత్నాలపై గూగుల్ వెనుకడుగు వేసింది. గూగుల్ పే ద్వారా యూజర్ నిర్వహించే వివిధ రకాల సంప్రదాయ బ్యాంకులు అందించే చెకింగ్ లేదా సేవింగ్స్ ఖాతాల కోసం సైన్ అప్ చేయడానికి ఫ్లెక్స్ సర్వీసెస్ ద్వారా వినియోగదారులకు అందించాలని గూగుల్ భావించింది. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ బ్యాంకులకు నష్టమే..! గూగుల్ ప్లెక్స్ సర్వీసులతో యూజర్లు బ్యాంకు సేవలనుంచి దృష్టిమరల్చే అవకాశం ఉంది. గూగుల్ తేస్తోన్న ప్లెక్స్ సర్వీసులు పలు బ్యాంకులతో ప్రత్యక్షపోటీలో ఉండే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. యూజర్లకు నెలవారీ లేదా ఓవర్డ్రాఫ్ట్ ఫీజులు లేకుండా, కనీస నిల్వలు లేకుండా ఖాతాలను అందించే అనేక రకాల ఆర్థిక సంస్థలతో భాగస్వామిగా ఉండటానికి ప్రణాళిక చేసింది. ఇది పలు బ్యాంకులకు నష్టాలను కల్గించే విధంగా ఉండొచ్చును. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం...ఫ్లెక్స్ ప్రాజెక్ట్ తరుచూ వాయిదాలు పడటంతో, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కంపెనీ నుంచి వెళ్లి పోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ సేవలకోసం ఇప్పటికే 4 లక్షల మంది రిజిస్టర్ ఐనట్లు వాల్స్ట్రీట్ పేర్కొంది. చదవండి: సడన్గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..! -
Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!
గూగుల్ సంబంధిత పేమెంట్ యాప్ జీపే(గూగుల్ పే) వివాదంలో చిక్కుకుంది. అనుమతులు లేకుండా యూజర్ ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని కలిగి సేకరిస్తోందని, తద్వారా యూజర్ భద్రతకు ముప్పు వాటిల్లడంతో పాటు అవకతవకలకు ఆస్కారం ఉందంటూ ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్పై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, బుధవారం యూఐడీఏఐ, ఆర్బీఐలను నిలదీసింది. అంతేకాదు ఈ పిటిషన్పై నవంబర్ 8లోపు స్పందించాలంటూ గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు కూడా జారీ చేసింది. గూగుల్ పే టర్మ్స్ అండ్ కండిషన్స్లో బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు, ఆధార్ వివరాల సేకరణ నిబంధనలు ఉన్నాయని.. ఇది అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారమని అభిజిత్ మిశ్రా అనే ఫైనాన్షియల్ ఎకనమిస్ట్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీగా ఆధార, బ్యాకింగ్ సమాచారాన్ని సేకరించడం, యాక్సెస్ పర్మిషన్ లాంటి అధికారాలు ఉండవు. ఇక ఆర్బీఐ ఆథరైజేషన్ లేకుండానే లావాదేవీలు నడిపిస్తోందని మరో పిల్ దాఖలు చేశారు. అయితే ఇది పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ కాదని, థర్డీ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అని గతంలోనే కోర్టుకు ఆర్బీఐ, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ తెలిపాయి. చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల ఆఫర్, స్పందించిన గూగుల్ పే -
ఫిక్స్డ్ డిపాజిట్ల ఆఫర్, స్పందించిన గూగుల్ పే
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్లో భాగమైన గూగుల్ పే తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఆఫర్ చేస్తోందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ వార్తలను నేరుగా ప్రస్తావించకుండా... తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్లో సర్వీసులు అందిస్తున్నామని స్పష్టం చేసింది. పలు సందర్భాల్లో కొన్ని ఆఫర్లను తామే స్వయంగా అందిస్తున్నామనే అపోహలు ఉంటున్నాయని, అవి సరికాదని ఒక బ్లాగ్పోస్ట్లో వివరించింది.చాలా వ్యాపారాలు.. కొత్త వినియోగదారులకు చేరువయ్యేందుకు తమ ప్లాట్ఫాం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోందని గూగుల్ తెలిపింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో డిజిటల్గా ఫిక్స్డ్ డిపాజిట్లు తెరిచే సౌలభ్యాన్ని గూగుల్ పే ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. -
UPI Payments: ఆగస్టులో ఎంతమంది ఉపయోగించారంటే..
కరోనా కారణంగా డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రూరల్కు సైతం చేరడం, దాదాపు ఇంటికొక్కరు చొప్పున ఆన్లైన్ పేమెంట్లే చేస్తుండడంతో కోట్ల విలువైన చెల్లింపులు రోజూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులో అన్ని పేమెంట్ యాప్ల నుంచి డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. యూపీఐ సంబంధిత లావాదేవీలు రికార్డు లెవెల్ను చేరుకున్నాయి. ఒక్క ఆగష్టు నెలలోనే 6.39 ట్రిలియన్ రూపాయల విలువైన చెల్లింపులు జరిగాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు నెలలో సుమారు 3.5 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ యూపీఐ యాప్ చెల్లింపుల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా కిందటి నెలతో పోలిస్తే ట్రాన్జాక్షన్స్ రేటు 9.5 శాతం పెరగ్గా.. ట్రాన్జాక్షన్స్ విలువ 5.4 శాతం పెరిగింది. ►ఏప్రిల్ మే నెల మధ్య సెకండ్ వేవ్ ప్రభావంతో కొంతవరకు తగ్గినా.. తిరిగి మళ్లీ పుంజుకుంది. ఇక యూపీఐ మోడ్లో చెల్లింపులు జులైలో 3.24 బిలియన్ ట్రాన్జాక్షన్స్(జూన్తో పోలిస్తే 15.7 శాతం) జరగ్గా.. ఆగష్టులో అది మరింత పెరిగింది. 2016లో మొదలైన యూపీఐ సర్వీస్ చెల్లింపులు.. కరోనా కారణంగా పుంజుకున్నాయి. భారత్లో మొత్తం 50 థర్డ్పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్పే(వాల్మార్ట్), గూగుల్పే(గూగుల్) ఆ తర్వాత పేటీఎం, అమెజాన్ పే.. డిజిటల్ మార్కెట్లో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాయి. ►యూపీఐతో పాటు ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) ద్వారా ఆగష్టులో 377.94 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరిగాయని, జులైతో పోలిస్తే అది 8.5 శాతం పెరుగుదలగా ఉందని, ట్రాన్జాక్షన్స్ విలువ 3.18 ట్రిలియన్ రూపాయలుగా పేర్కొంది. ►ఎన్పీసీఐ డెవలప్ చేసిన ఫాస్ట్ట్యాగ్(టోల్ కలెక్షన్ కోసం రూపొందించిన ప్రోగ్రాం).. ద్వారా ఆగష్టులో 201.2 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. విలువ మూడువేల కోట్ల రూపాయలుగా ఉంది. అదే విధంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 58.88 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. వాటి విలువ పది వేల కోట్లకుపైనే ఉంది. చదవండి: అకౌంట్ లేకుండానే ఫిక్స్డ్ డిపాజిట్! -
బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ పే యూజర్లు బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. వినియోగదార్లు గూగుల్ పే యాప్లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్ను ఎంచుకోవాలి. డిపాజిట్ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ వెల్లడిం చింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
ఇక ఫోన్పే, గూగుల్ పేతో పనిలేకుండానే ఈ-ట్రాన్జాక్షన్స్!
e-RUPI: ఫోన్పే, గూగుల్ పే, డెబిట్కార్డ్, క్రెడిట్ కార్డులు..... ఇలాంటివేమీ అక్కర్లేకుండానే నగదు రహిత చెల్లింపులు చేసేలా కేంద్రం కొత్త పథకాన్ని అమల్లోకి తేనుంది. మరింత తేలికగా నగదు లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది. ఢిల్లీ: నగదు రహిత లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త స్కీంని రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్లెస్, కాంటాక్ట్లెస్గా ఉండేలా ఈ-రూపీ స్కీం(E-RUPI)ని ప్రవేశపెట్టనుంది. ఎలాగంటే.. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ- రూపీ పద్దతి అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తొలిదశలో వీళ్లకే? ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనా పథకంలో టీబీ రోగులకు ప్రతీ నెల ఔషధాలు అందిస్తోంది, అవసరమైన రోగ నిర్థారణ పరీక్షలు చేయిస్తోంది, అంతేకాదు మాతా శిశు అభివృద్ధి పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. వీటితో పాటు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక సహయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం చేపట్టనుంది. ప్రైవేటు రంగ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం విషయంలో e-RUPI పద్దతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది కేంద్రం. క్లారిటీ రేపే! ఈ-రూపీ పథకం ఆగస్టు 2 నుంచి అమల్లోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త విధానాన్ని లాంఛ్ చేయనున్నారు. తొలి దశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. లబ్ధిదారుల మొబైల్ ఫోన్కి క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేది రానిది కూడా తెలిసేది రేపే!. -
మీ ఫోన్ పోతే యూపీఐ యాప్స్ ను ఎలా బ్లాక్ చేయాలి?
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) టెక్నాలజీ సహాయంతో పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ పనిచేస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు యుపీఐతో లింక్ చేయబడిన వారి ఫోన్లలో కనీసం ఈ మూడింటిలో ఒక పేమెంట్ యాప్స్ అయిన కలిగి ఉన్నారు. యుపీఐ ద్వారా ఎవరికైనా డబ్బును క్షణాలలో బదిలీ చేయవచ్చు. ఎవరైనా మీ ఫోన్ యాక్సెస్ చేస్తే వారు డబ్బును బదిలీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పేమెంట్ యాప్స్ గల స్మార్ట్ ఫోన్ ఎవరైనా దొంగలిస్తే ఏమి జరుగుతుంది?. వారు మీ బ్యాంకులో ఉన్న మొత్తం నగదును డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ కోల్పోయినట్లయితే లేదా ఎవరైనా దొంగలిస్తే ఈ సర్వీసులు యాక్సెస్ చేసుకోకుండా మనం చేయవచ్చు. మీ ఫోన్ పోతే పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పేని మీరు ఏ విధంగా బ్లాక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా బ్లాక్ చేయడం వల్ల వారు మీ ఖాతాలో నుంచి డబ్బును డ్రా చేయలేరు. పేటిఎమ్ ఖాతాను తాత్కాలికంగా ఎలా బ్లాక్ చేయాలి? పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబరు 01204456456కు కాల్ చేయండి. పోయిన ఫోన్ కొరకు ఆప్షన్ ఎంచుకోండి. వేరే నెంబరు నమోదు చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి, మీ కోల్పోయిన ఫోన్ నెంబరును నమోదు చేయండి. అన్ని పరికరాల నుంచి లాగ్ అవుట్ అయ్యే ఆప్షన్ ఎంచుకోండి. తరువాత, పేటిఎమ్ వెబ్ సైట్ కు వెళ్లండి, 24ఎక్స్7 హెల్ప్ఎంచుకోవడానికి దిగువకు స్క్రోల్ చేయండి. Report a Fraud అనే దాన్ని ఎంచుకోండి, ఏదైనా కేటగిరీపై క్లిక్ చేయండి. తర్వాత, ఏదైనా సమస్యపై క్లిక్ చేయండి, ఇప్పుడు దిగువన ఉన్న Message Us బటన్ మీద క్లిక్ చేయండి. పేటిఎమ్ ఖాతా లావాదేవీలను చూపించే డెబిట్/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేటిఎమ్ మీ ఖాతాను ధ్రువీకరిస్తుంది, బ్లాక్ చేస్తుంది. తర్వాత మీరు ధృవీకరణ సందేశాన్ని అందుకుంటారు. గూగుల్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి గూగుల్ పే వినియోగదారులు హెల్ప్ లైన్ నంబర్ 18004190157కు కాల్ చేసి మీ మాతృ భాషను ఎంచుకోండి. ఇతర సమస్యలకు సరైన ఆప్షన్ ఎంచుకోండి. మీ Google Payకు ప్రత్యామ్నాయంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. తద్వారా ఫోన్ నుంచి మీ గూగుల్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ఐఓఎస్ వినియోగదారులు కూడా తమ డేటాను రిమోట్ ఆప్షన్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఫోన్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి ఫోన్ పే వినియోగదారులు 08068727374 లేదా 02268727374 కాల్ చేయాల్సి ఉంటుంది. మీ మాతృ భాషను ఎంచుకున్న తరువాత, మీ ఫోన్ పే ఖాతాతో సమస్యను నివేదించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు దానికి తగిన నెంబరును నొక్కండి. ఇప్పుడు రిజిస్టర్డ్ నెంబరు నమోదు చేయండి. ధృవీకరణ కొరకు మీకు ఓటీపీ పంపబడుతుంది. తర్వాత ఓటీపీ అందుకోనందుకు ఆప్షన్ ఎంచుకోండి. దీని వల్ల సీమ్ లేదా మొబైల్ నష్టం గురించి మీకు ఆప్షన్ రిపోర్ట్ ఇవ్వబడుతుంది, దానిని ఎంచుకోండి. ఫోన్ నెంబరు, ఇమెయిల్ ఐడి, చివరి పేమెంట్, చివరి లావాదేవీ విలువ మొదలైన కొన్ని వివరాలను పొందిన తరువాత మీ ఫోన్ పే అకౌంట్ ని బ్లాక్ చేయడంలో మీకు సహాయపడే ప్రతినిధితో మీరు కనెక్ట్ అవుతారు. -
ఫోన్లో ఎంటర్ చేయగానే లక్ష రూపాయలు మాయం!
బాలానగర్: ఇంటిని అద్దెకు ఇస్తానని ఆన్లైన్లో పోస్ట్పెట్టిన వ్యక్తి రూ.లక్ష పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్కు చెందిన గన్ను తిరుపతయ్య సాయినగర్లోని ఫ్లాట్ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్ డాట్ కమ్లో 2వ తేదీన పోస్ట్ చేయగా.. నేను మీ ఇంటిని అద్దెకు తీసుకుంటానని ఓ వ్యక్తి రిప్లే ఇచ్చాడు. నెలకు రూ.15 వేల అద్దె 3 నెలల అడ్వాన్స్గా ఇవ్వాలని తిరుపతయ్య కోరగా గుర్తు తెలియని ఆ వ్యక్తి గూగుల్ పే నుంచి మీ అకౌంట్ వివరాలు పంపాలని కోరగా బాధితుడు పంపాడు. కాసేపటి తర్వాత మీ దగ్గర నుంచి నాకు మెసేజ్ రాలేదని ఓసారి రూ.45 వేలు ఎంటర్ చేసి చూపండి అని చెప్పగా తిరుపతయ్య అదే విధంగా చేయగా రెండు దఫాలుగా రూ.45 వేలు, మరోసారి రూ.10 వేలు తిరుపతయ్య అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఒక్క అంకె రూ. 50 వేలు నష్టం
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్ పేలో నగదు చెల్లించే సమయంలో ఎదుటి వారి ఫోన్ నంబర్లో ఒక్క అంకె తేడా వేయడం రూ. 50 వేలు నష్టపోవడానికి కారణమైంది. పొరపాటున మరో ఖాతాలో పడిన ఈ మొత్తాన్ని ఆ బ్యాంక్ జమ చేసుకుంది. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ► బాధితుడు ఓ డీసీపీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. తన గూగుల్ పే ఖాతా నుంచి ఓ నంబర్కు రూ. 50 వేలు పంపాలని భావించారు. ► ఈ పనిని తన కుమార్తెకు అప్పగించారు. ఆమె ఆ ఫోన్ నంబర్లో చివరి అంకె తప్పుగా కొట్టారు. ఫోన్ నంబర్ సరిచూసుకోకుండానే పే చేసేశారు. దీంతో హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఫోన్కు లింకైన బ్యాంకు ఖాతాకు కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నంకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం వెళ్లిపోయింది. ► కాస్త ఆలస్యంగా ఈ విషయం గుర్తించిన బాధితుడు నగదు వెళ్లిన ఫోన్ నంబర్లో సంప్రదించారు. అయితే అప్పటికి తన ఖాతాలో రూ. 15 వేలు మాత్రమే ఉన్నాయంటూ సమాధానం వచ్చింది. అసలేం జరిగిందో అర్థం కాని ఆ వ్యక్తి బ్యాంకునకు వెళ్లి ఆరా తీశారు. సదరు బ్యాంకు నుంచి అతగాడు తీసుకున్న గోల్డ్ లోన్కు సంబంధించిన అసలు, వడ్డీ చాన్నాళ్లూగా పెండింగ్లో ఉండి బకాయి పెరిగిందని, ఈ నేపథ్యంలోనే ఖాతాలో రూ. 50 వేలు పడిన మరుక్షణం ఖాతాదారుడినైన తన అనుమతి కూడా లేకుండానే బ్యాంకు రూ. 35 వేలు జమ చేసుకున్నట్లు వెల్లడైంది. ► ఇదే విషయాన్ని నర్సీపట్నం వ్యక్తి నగరానికి చెందిన హోంగార్డుకు చెప్పారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సదరు బ్యాంకు అధికారులకు లేఖ రాసి సంప్రదించడం ద్వారా తన డబ్బు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. -
గూగుల్ పేకు మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్ యాప్ ఫోన్పే టాప్లో నిలిచింది. ఫ్లిప్కార్ట్ మద్దతున్న ఫోన్పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్మార్ట్కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్గా ఫోన్పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్తో ఉన్న ఫోన్పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఫోన్పే లావాదేవీలు 7 శాతం పెరిగాయి, ట్రాన్సాక్షన్స్ విలువ జనవరిలో 5 శాతం పెరిగింది. ఫోన్పే తరువాత రూ .1.71 లక్షల కోట్ల విలువైన 853.53 మిలియన్ లావాదేవీలతో గూగుల్ పే రెండవ స్థానంలో ఉంది. 33,910 కోట్ల రూపాయల విలువైన 281.18 మిలియన్ లావాదేవీలను రికార్డు చేసిన పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే లావాదేవీల విలువ వరుసగా రూ .4,004 కోట్లు, రూ .7,463 కోట్లు, రూ .36 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం రూ .4.2 లక్షల కోట్ల 2.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గతవారం ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘనతను ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. నెలకు ఒక బిలియన్ లావాదేవీలను దాటడానికి యూపీఐకి 3 సంవత్సరాలు పట్టిందని, అయితే ఆ తరువాతి బిలియన్ టార్గెట్ను ఏడాదిలోపే సాధించామన్నారు. లావాదేవీలు 76.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, లావాదేవీల విలువ దాదాపు 100 శాతం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా డిసెంబరులో, ఫోన్పే 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 902 మిలియన్ లావాదేవీలతో ఫోన్పే టాప్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే 854 మిలియన్ లావాదేవీలను 1.76 లక్షల కోట్ల రూపాయలను నమోదు చేసింది. Phenomenal ! UPI recorded 2.3 billion transactions worth ₹ 4.3 trillion in Jan 2021. On a YOY basis, UPIs transaction value jumped 76.5 % while transaction value jumped nearly 100%. Took UPI 3 years to cross 1 billion transactions a month. Next billion came in less than a year.— Amitabh Kant (@amitabhk87) February 3, 2021 -
వివాహ వేడుక.. వినూత్న ఆలోచన
ఎవరైనా పెళ్లికి పిలిస్తే, వారికి బహుమతి ఏమివ్వాలా అని ఆలోచిస్తారు. వస్తువు కొనాలా, డబ్బులు ఇవ్వాలా అని తర్జనభర్జనల తరవాత ఒక నిర్ణయానికి వస్తారు. వీలైనంతవరకు డబ్బు ఇవ్వడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. అలా ఇవ్వటం వల్ల కొత్త జంట వాళ్లకు కావలసింది వాళ్లు కొనుక్కోవచ్చు. అయితే పెళ్లికి బయలుదేరే ముందు కానీ కొన్ని విషయాలు గుర్తుకు రావు. ముఖ్యంగా నూతన వధూవరులకు ఇవ్వాలనుకునే నగదును ఉంచటానికి కావలసిన గిఫ్ట్ క్యాష్ కవర్. ఓ పక్కన ముహూర్తానికి సమయం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కవరు కోసం వెతుకులాట కొనసాగుతూ ఉంటుంది. చివరకు ఏమీ చేయలేక, వధూవరుల చేతిలో నేరుగా డబ్బు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంక కవరు కోసం వెతుకులాడవలసిన అవసరం లేదు. నేరుగా వారి అకౌంట్లోకి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు. ఇంకో అడుగు ముందుకు వేశారు. తమిళనాడులోని మదురైలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న టి. జె. జయంతి కుటుంబం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శుభలేఖ మీద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా నూతన వధూవరులకు ఇవ్వాలనుకుంటున్న నగదు బహుమతిని ఈ కోడ్ ద్వారా బదిలీ చేసేందుకు వీలు కల్పించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా వివాహానికి హాజరు కాలేని వారి కోసం ఆ ఆలోచనను ఆచరణలో ఉంచారు. ‘‘30 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పెళ్లి కానుకను క్యూఆర్ కోడ్ ద్వారా పంపారు, మా కుటుంబంలో ఈ విధంగా క్యూఆర్ కోడ్ ప్రచురించటం ఇదే ప్రథమం. ఆదివారం నాడు వివాహం జరిగింది. మరుసటి రోజు నుంచి ఈ కార్డు వైరల్ అవుతోంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు’’ అంటున్నారు జయంతి. ఆన్లైన్ టెక్నాలజీ వల్ల కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ఒక వివాహం సందర్భంగా, ఇళ్ల దగ్గర నుంచి ఆన్లైన్లో వివాహం వీక్షిస్తున్న బంధువులు, స్నేహితులకి, వారివారి ఇళ్ల దగ్గరకే విందును ఆర్డర్ చేశారు. ఏ లోటూ రాకుండా, దేనినీ మిస్ అయ్యామనే భావన లేకుండా, ఆన్లైన్ ద్వారా అన్నీ సమకూరుతున్నాయి. టెక్నాలజీకి రెండు చేతులతో నమస్కరించాల్సిందే. -
'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్పే
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) యాప్గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి. మరోవైపు గూగుల్ పేలో రూ.1.76లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. డిసెంబరులో జరిగిన మొత్తం 2,234.16 మిలియన్ యుపిఐ లావాదేవీలలో ఫోన్పే, గూగుల్ పే రెండింటి వాటా 78 శాతానికి పైగా ఉన్నాయి. ఈ రెండు యాప్లు మొత్తం 4,16,176.21 కోట్ల యుపిఐ లావాదేవీల వాల్యూమ్లో 86 శాతానికి పైగా ఉన్నాయి.(చదవండి: అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం) ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం, ఫోన్పే డిసెంబరులో లావాదేవీ విలువ గత నెల లావాదేవీల విలువతో పోల్చితే 3.87(868.4 మిలియన్) శాతం పెరుగుదల కనిపించింది. అలాగే, నవంబర్లో నమోదైన లావాదేవీల విలువ రూ.1,75,453.85 కోట్లతో పోల్చితే 3.8 శాతం పెరుగుదల కనిపించింది. అదే గూగుల్ పే విషయానికి వస్తే దీనికి విరుద్ధంగా గూగుల్ పే లావాదేవీల పరిమాణం(960.02 మిలియన్)లో 11 శాతానికి పైగా పడిపోయింది. డిసెంబరులో లావాదేవీ విలువలో 9.15 శాతానికి పైగా పడిపోయింది. వీటి తర్వాత మూడవ స్థానంలో పేటిఎం నిలిచింది. 31,291.83 కోట్ల రూపాయల విలువైన 256.36 మిలియన్ లావాదేవీలతో పేటీఎం మూడో స్థానంలో నిలువగా, కొత్తగా డిజిటల్ పేమెంట్ రంగంలోకి ప్రవేశించిన వాట్సాప్ రూ.29.72 కోట్ల విలువైన 810,000 లావాదేవీలను నిర్వహించింది. -
‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలు డబ్బులను పంపించడం కోసం ఆన్లైన్ చెల్లింపులు మీద ఆధారపడుతున్నారు. దీంతో 2020లో యూపీఐ లావాదేవీల విలువ 105 శాతం పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపిఐ) 2019 డిసెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు లావాదేవీల విలువలో 105 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019 డిసెంబర్ చివరిలో యుపీఐ ప్లాట్ఫాం లావాదేవీల మొత్తం విలువ రూ.2,02,520.76 కోట్లుకు పైగా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 2020 డిసెంబర్ నాటికి రూ.4,16,176.21 కోట్లకు చేరుకుంది.(చదవండి: అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?) గత ఏడాది 2020 సెప్టెంబర్లో రూ.3 లక్షల కోట్ల బెంచ్మార్క్ను దాటింది. యుపీఐ ప్లాట్ఫాం ద్వారా 2019 డిసెంబర్ చివరి నాటికి 1308.40 మిలియన్ లావాదేవీలను జరపగా.. అదే 2020 డిసెంబర్ చివరి నాటికి కరోనా మహమ్మారి కారణంగా 2234.16 మిలియన్లకు చేరుకుంది. యుపీఐ ప్రతి నెలా లావాదేవీల సంఖ్య అక్టోబర్ నుండి రెండు బిలియన్ల మార్కును దాటుతోంది. అక్టోబర్ 2020లో మొదటిసారి ఈ సంఖ్యను దాటింది. అయితే, ఇటీవల ఈ లావాదేవీలపై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు విధిస్తారనే రూమర్లు బాగా వినిపిస్తాయి. మొత్తానికి ఈ ప్రచారం అబద్ధం అని తాజాగా తేలింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలపై ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్ వంటి ఆన్లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరిపే వారికి ఇది గొప్ప ఉపశమనం. ఎప్పటి లాగానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
2020: గూగుల్ పే, ఫోన్ పే టాప్ వ్యాలెట్స్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యస్బ్యాంకు, పీఎన్బీ, హెచ్ఎస్బీసీ బ్యాంకు 2020 సంవత్సరానికి అగ్రగామి 10 బ్యాంకుల్లో స్థానం సంపాదించుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, డూచే బ్యాంకు, ఐడీబీఐ టాప్ 10లో వరుసగా ఉన్నాయి. అదే విధంగా గూగుల్పే, ఫోన్పే టాప్–2 వ్యాలెట్లుగా నిలిచినట్టు.. విజికీ విడుదల చేసిన ‘ది బీఎఫ్ఎస్ఐ మూవర్స్ అండ్ షేకర్స్ 2020’ నివేదిక ప్రకటించింది. బ్యాంకులు, వ్యాలెట్లు, యూపీఐ, ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల వేగవంతమైన పురోగతి గురించి ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తదనంతర పరిణామాలతో బీమాకు కూడా ఆదరణ బాగా పెరిగిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది యూపీఐ, వ్యాలెట్లు బాగా వినియోగంలోకి వచ్చాయని, కస్టమర్లకు ఇవి చేరువ కావడానికి నూతన అవకాశాలు వాటికి అందుబాటులోకి వచ్చాయని వివరించింది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేగంగా రూపాంతరం చెందినట్టు పేర్కొంది. ఇక యోనో నంబర్ 1గా నిలవగా, నియో, కోటక్ 811 యాప్లు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘‘ఎన్బీఎఫ్సీలు ఈ ఏడాది ఎంతో కీలకపాత్ర పోషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) నిధుల అవసరాలకు ప్రధాన వనరుగా మారాయి. కరోనా కాలంలో బ్యాంకులు ఎన్బీఎఫ్సీలకు మరింతగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ విభాగంలో ఎక్స్పోజర్ పెంచుకున్నాయి’’ అని ఈ నివేదిక వివరించింది. -
గూగుల్ పేలో డిజిటల్ గిఫ్ట్ కార్డ్లు
పైన్ ల్యాబ్స్ యాజమాన్యంలోని సంస్థ క్విక్ సిల్వర్ భాగస్వామ్యంతో గూగుల్ పే తన ప్లాట్ఫామ్లో డిజిటల్ గిఫ్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఇది 150 కంటే ఎక్కువ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బ్రాండ్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను 1500 నగరాల్లోని భారతదేశంలోని ప్రజలకు అందించనున్నట్లు తెలిపింది. ఈ బ్రాండ్లలో ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్, ఉబెర్ ఇ-గిఫ్ట్, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ మరియు గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్ మొదలైనవి ఉన్నాయి. క్విక్ సిల్వర్ మరో కన్జ్యూమర్ బ్రాండ్ అయిన వోహోను గూగుల్ పే స్పాట్ ప్లాట్ ఫాంపై లిస్ట్ చేసింది. దీని ద్వారా ఆఫ్లైన్ వ్యాపారాలు గూగుల్ పేలో వర్చువల్ గిఫ్ట్ కార్డులను తయారుచేయవచ్చు. వోహో, గూగుల్ పే భాగస్వామ్యంతో ఆఫ్లైన్ రిటైల్ మార్కెట్ పెరగనుంది. ఎందుకంటే వినియోగదారులు ఆఫ్లైన్ స్టోర్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. గూగుల్ పేలో వోహోను సెర్చ్ చేయడం ద్వారా వర్చువల్ బహుమతి కార్డును పంపవచ్చు. అది కాకపోయినా బిజినెస్ ట్యాబ్ లో ఉండే గిఫ్ట్ కార్డ్ స్టోర్ లోని కార్డులలో ఎంచుకుని పంపుకోవచ్చు. ఒక్కసారి కొంటే ఆ డిజిటల్ కార్డును ఈ మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పంపుకోచ్చు. అప్పుడే మనకు రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులం అవుతాం. భారతదేశంలోని 10 బహుమతి కార్డులలో తొమ్మిది కార్డులు ఇ-కామర్స్, కిరాణా మరియు ఫ్యాషన్ విభాగానికి చెందినవి. క్విక్ సిల్వర్.. వోహో డిజిటల్ కార్డ్ స్టోర్ ను ఆన్ చేసి ఉంచింది. బటన్ క్లిక్ చేసి డిజిటల్ గిఫ్టింగ్ విధానం ద్వారా కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్ మరింత బెటర్ గా పొందొచ్చని పైన్ ల్యాబ్స్ ప్రెసిడెంట్ కుమార్ సుదర్శన్ స్టేట్మెంట్లో చెప్పారు. గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం అనేది గతేడాదే లాంచ్ అయింది. వ్యాపారులు తమ స్పాట్ను గూగుల్ పేలో సెటప్ చేయడానికి గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం ద్వారా వీలు కల్పించారు. -
గూగుల్ పే యూజర్లకు షాకింగ్ న్యూస్
ప్రముఖ డబ్బులు చెల్లింపుల సంస్థ అయిన గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్యాప్ సేవల నిలివేయనున్నట్లు తెలిపింది. అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటి వరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్ ను ఉపయోగించే వారు. (చదవండి: ట్విటర్ లో మరో కొత్త ఫీచర్) "2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్ ను ఉపయోగించండి" అని కంపెనీ అమెరికా ప్రజలకు సమాచారం ఇచ్చింది. గూగుల్ పే వెబ్ యాప్లో.. పీర్-టూ-పీర్ పేమెంట్ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు కూడా అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమేనని భారత యూజర్లకు కాదని తెలిపింది. ఐఓఎస్, ఐఓఎస్ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.