harrasements
-
కట్నం డిమాండ్ చేయడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భార్య నుంచి భర్త కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. భర్త, అత్తమామల నుంచి వివాహిత మహిళలకు రక్షణ కల్పించేందుకు 1983లో ప్రవేశపెట్టిన ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం.. కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరమైన నేరంగా భావించలేమని వెల్లడించింది. సెక్షన్ ప్రకారం 498ఏ ప్రకారం క్రూరత్వం అనేపదానికి విస్తృతమైన అర్థం ఉంది. కట్నం కింద ఆస్తులు గానీ, విలువైన వస్తువులు గానీ ఇవ్వాలని డిమాండ్ చేయడం చట్టవిరుద్ధమే. అయితే, కట్నం కోసం మహిళను శారీరకంగా, మానసికంగా వేధించడం క్రూరత్వం అవుతుంది. కేవలం కట్నం డిమాండ్ చేశారని 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 12న ఆదేశాలు జారీ చేసింది. -
జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను కోర్టులో జడ్జి వేధించాడని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి చనిపోయేందుకు ప్రయత్నించాడు. అదృష్టం బాగుండి అధికారులు కాపాడటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన అలీఘర్లో వెలుగుచూసింది.బన్నాదేవి పోలీస్ స్టేసన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సచిన్ కుమార్ ఇటీవల బైక్ చోరికి పాల్పడిన అయిదుగురు నిందితులను పట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా వారిని కోర్టులో హాజరుపరిచారు.అయితే నిందితులను కాకుండా తప్పుడు వ్యక్తులను పట్టుకున్నారని స్థానిక న్యాయమూర్తి త్రిపాఠి.. ఎస్సై సచిన్ను మందలించారు. కోర్టు విచారణ సమయంలో మేజిస్ట్రేట్ తన పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించారని.. కోరిన రిమాండ్ను మంజూరు చేయకుండా సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వేచి ఉండేలా చేశారని కుమార్ ఆరోపించారు.Sub Inspector Sachin Kumar sitting on the railway track to commit su!cide, over He said that "The police had caught 5 bike thieves. I presented them in the court. The judge said that you have caught wrong people. The judge misbehaved with me" pic.twitter.com/WWck5gBpnU— Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2024దీంతో మనస్తాపం చెందిన సచిన్ కుమార్ రైల్వే ట్రక్పై కూర్చొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన స్టేషన్ ఇంచార్జ్ పంకజ్ కుమార్ మిత్రా, ఇతర పోలీసులు వెంటనే స్పందిచి కుమార్ను రక్షించారు. అయితే ఈ ఆరోపణలపై న్యాయమూర్తి త్రిపాఠి ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించారు. -
బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్సఫర్ఎక్స్ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్లోని సివాన్కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్లో ప్రయాణిస్తున్నారు.అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్రూమ్కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడుమహిళ వాష్రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్రూమ్కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్బాగ్ జంక్షన్కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని సమస్త్పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్ఫోర్స్లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్పై కేసు
శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.అనంతరం వింగ్ కమాండర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.అయితే వింగ్ కమాండర్పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
పోలీసుల వేధింపులు?.. రెండు రోజుల వ్యవధిలో సోదరుల ఆత్మహత్య
లక్నో: పోలీసుల వేధింపులకు రెండు ప్రాణాలు బలయ్యాయి. హత్రాస్ పోలీసుల వేధింపులతో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా తమ్ముడు సంజయ్ అనే ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకు ఆగ్రా సమమీపంలోని ఓ గ్రామంలో చెట్టుకు ఉరేసుకొని సోదరుడు ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.కాగా జూన్ 9న అతని బావమరిది లక్ష్మణ్ గ్రామంలోని ఒక మహిళతో పారిపోవడంతో పోలీసులు సంజయ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూన్ 13న ప్రమోద్ను విచారించారు. అయితే కస్టడీలో ఉన్న సంజయ్ను కొందరు పోలీసు అధికారులు కొట్టారని, వారు అతని నుంచి రూ. 1 లక్ష డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముందుగా పదివేలు కట్టి, మిగతా 90 వేలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సంజయ్ను విడుదల చేశారని తెలిపారు.అనంతరం జూన్ 22 న సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసు అధికారులు నిరంతరం వేధింపులకు గురిచేయడం, పోలీస్ స్టేషన్కు పిలపించి బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన సంజయ్ చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు.సంజయ్ మరించిన తర్వాత ప్రమోద్ను పోలీసులు మళ్లీ విచారణకు పిలించారు. దీంతో అతడు కూడా సోమవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయవద్దని ప్రమోద్ను పోలీసులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యుడు ఆరోపించారు. కాగా జంట ఆత్మహత్యలపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భద్రతను పెంచారు.సుసైడ్కు ముందు హత్రాస్లోని సాదాబాద్ పోలీస్ స్టేషన్లో కొంతమంది అధికారులను తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ప్రమోద్ సింగ్ ఓ లేఖ రాశారు. దీని ఆధారంగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ అధికారి అగ్నిహోత్రిని సస్పెండ్ చేయగా.. మరో అధికారి కుమార్ను బదిలీ చేశారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.ఇక మైసూర్లోని కేఆర్ నగర్కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్ రేవణ్ణ.. గురువారంయ అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్పోర్టులో దిన వెంటనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్ను సిటీ సివిల్ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వలను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ 2014-19లో హాసన నుంచి జీడీఎస్ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్సభల్లోనూ ఎన్డీయూ కూటమి తరపున. హాసన నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. -
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన కిరణ్కుమార్ కృష్ణానగర్లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పార్టీ ఆఫీస్ ఎదుటే.. బీజేపీ మహిళా నాయకురాలి ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుకు నిరసనగా మహిళ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అంజనా చౌదరి.. పార్టీలో వేధింపులు తాళలేక బీజేపీ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. మహిళా నాయకురాలిని వేధించిన పార్టీ నాయకుడికి అందలమెక్కించిన పురందేశ్వరి తీరుపై మనస్తాపంతోనే ఈ పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు అంజనా చౌదరి తన మనుసులోని ఆవేదనను బయటకు చెప్పుకుంది. ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పింది. 26వ వార్డు మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో వివాదం జరిగిందని.. అప్పటి నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి తనను టార్గెట్ చేసినట్లు పేర్కొంది. బీజేపీ వర్క్ షాప్ జరిగినపుడు వాష్ రూమ్కు వెళ్లి వచ్చేటప్పుడు వీడియోలు తీసి వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ప్రశాంత్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్లకు పదవులు ఇచ్చి, తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీలో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వాపోయారు. తన చావుకు కారణం రాజంపేట బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులతో పాటు నాగోతు రమేష్ నాయుడు, ప్రశాంత్ అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు మహిళ అయినా ఒక మహిళగా తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం -
టీడీపీ నేత కీచక పర్వం.. విద్యార్ధినికి వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం మండలం గొట్లూరులో టీడీపీ నేత భాస్కర్ కీచక పర్వానికి తెగబడ్డాడు. ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోలో నుంచి బయటకు లాక్కెళ్లి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలికకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి తల్లిదండ్రులు పోలసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్ -
మహిళలు, విద్యార్థినులపై వేధింపులు.. భద్రతకు కొత్త ఫోన్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్ (ఎక్స్)లో నూతన నంబర్లను వెల్లడించారు. ఏ రకమైన వేధింపులున్నా మహిళలు, విద్యార్థినులు 8712656858 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. 8712656856 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు నంబర్లు గుర్తు లేకపోతే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: కిషన్ రెడ్డి #WomenSafetyWing is dedicated & committed to your well-being & safety. Don't hesitate to call us!#Dial: #918712656858 #Chat: #9187126 56856 For EMERGENCY DIAL 100.#SuicideAwarenes #AskForHelp #Telangana #Help #MentalHealthMatters #MentalHealthAwareness #Support pic.twitter.com/HELLdkKCLP — Women Safety Wing, Telangana Police (@ts_womensafety) September 8, 2023 -
కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు
సాక్షి, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను మరోసారి దుర్గం చిన్నయ్యకు కేటాయించడంపై శేజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామా పిశాచికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కామ పిశాచి, చీటర్కు లైసెన్స్ ఇచ్చి నీకు అడ్డులేదు రెచ్చిపో, ఇష్టమొచ్చిన అమ్మాయిని వేధించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు. కాగా బీఆర్ఎస్ పార్టీ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దుర్గం చిన్నయ్య పేరు ఉండడంపై బాధితురాలు శేజల్ తీవ్రంగా స్పందించారు. .తాను ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవలేదని వాపోయారు. దుర్గం చిన్నయ్య భవిష్యత్తులో మహిళలను వేధించకుండా ఉంటారని గ్యారంటీ ఎంటని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఎమ్మెల్యే అరాచకాలకు బలికావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు దోచుకోవాలని, అమ్మాయిలను వేధించాలని దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇచ్చారంటూ శేజల్ మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దుర్గం చిన్నయ్య చేసిన తప్పులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన లైంగిక వేధింపులు, అక్రమాలు, భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తానని.. దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు. చదవండి: సీఎం కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు: కూనంనేని -
అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మామ, భర్త తరపు బంధువులు తరచూ తనను అవమానిస్తున్నారని గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్నగర్ కృష్ణానగర్ కాలనీ నివాసి విష్ణువర్ధన్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మియాపూర్, ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ(33)తో వివాహమైంది. వీరికి కుమార్తె శ్రేయారెడ్డి(6)ఉంది. శశికళను మామ దేవేందర్రెడ్డి, భర్త తరఫు బంధువులు ఉషారాణి, వందన, రాజశేఖర్ తరచూ అవమానిస్తున్నారని శశికళ తన తల్లి యానాం గౌరికుమారికి పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, విష్ణువర్దన్రెడ్డి గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి తక్షణమే తమ ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి కుమార్తె ఇంటి పక్కన ఉండేవారికి ఫోన్ చేయగా, శశికళ చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే బంధువులతో కలిసి ఆమె కృష్ణానగర్కు చేరుకొని కన్నీరు మున్నీరైంది. మామ, బంధువులు అవమానకరంగా ప్రవర్తించడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరీకుమారి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
ఏయూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ధర్మసాగర్(హన్మకొండ): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై ధర్మసాగర్ మండలం జాన కీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చినట్టు తెలిసింది. జూన్ 21న ఎమ్మెల్యే టి.రాజయ్య, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్, నవ్య భర్త ప్రవీణ్లపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సర్పంచ్ నవ్య కేసుపై సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించాయి. ఈ క్రమంలో వేధింపులకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్లు సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని చెపుతున్నారు. సర్పంచ్ నవ్య నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు బుధవారం పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య.. కేసు నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని చెబుతోంది. చదవండి: ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు -
Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ హెల్త్ అప్డేట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. మాదాపూర్లో శేజల్ నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పేస్ ఆసుపత్రిలో శేజల్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆమెకు ఎమర్జెన్సీ బ్లాక్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శేజల్ ఆయుర్వేదిక్కు సంబంధించిన నిద్రమాత్రలు వేసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆమెకు మద్దతుగా పలువురు నేతలు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. సూసైడ్ లెటర్ స్వాధీనం శేజల్ బ్యాగ్లో నిద్రమాత్రలు, సూసైడ్ లెటర్ను గుర్తించారు. ఇందులో బాధితురాలు పలు విషయాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన శేజల్.. తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ లెటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఎమ్మెల్యేపై న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శేజల్ను పెద్దమ్మ టెంపుల్ దగ్గర వదిలి వెళ్లగా.. టెంపుల్ నుంచి కనిపించకుండా పోయారు. ఆ తరువాత మాదాపూర్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజు క్రితం కూడా శేజల్ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: హైదరాబాద్లో మరో భారీ ఐటీ కుంభకోణం -
Ranga Reddy: సాఫ్ట్వేర్ ఉద్యోగినికి న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని వేధిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కడ్తాల్ గ్రామానికి చెందిన మనోజ్కుమార్ ఆదిబట్ల సమీపంలోని సాయితేజ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉద్యోగం చేస్తుండేవాడు. అపార్ట్మెంట్లో టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వారికి పార్సిల్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ క్రమంలో కొంతమంది ఫోన్నంబర్లు మనోజ్కుమార్ వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో టీసీఎస్లో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ యువతిని న్యూడ్ ఫోన్కాల్స్ చేస్తూ కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని సదరు ఉద్యోగిని గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మనోజ్కుమార్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. -
Mancherial: సాయం పేరుతో రాత్రివేళల్లో చాటింగ్, వీడియో కాల్స్
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ సాయం చేస్తానంటూ మాటలు కలిపి మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఓ మహిళ మంగళవారం మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్ నివాసం ఉంటున్న కాలనీలోనే తాను భర్తతో కలసి ఉంటున్నట్లు పేర్కొంది. తమ మధ్య ఉన్న గొడవను ప్రవీణ్ అనుకూలంగా మలుచుకునేందుకు ఓవైపు తన భర్తతో, మరోవైపు తనతో సన్నిహితంగా ఉంటూ పోలీసులు తెలుసంటూ మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. అధికార పార్టీ నేత కావడంతోనే పోలీసులు సైతం ప్రవీణ్ చెప్పినట్లు చేయడం, దీనిని ఆసరాగా చేసుకొని తనకు అర్ధరాత్రి వరకు వాట్సాప్లో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారని మహిళ వివరించింది. ఈ విషయమై బింగి ప్రవీణ్ను సంప్రదించగా తన ఇంటి సమీపంలోనే భార్యాభర్తలు ఉంటారని, సాయం చేయాలని కోరితేనే భార్యాభర్తలకు తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. మహిళ లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. భర్త మణికంఠ చెల్లెలి భర్తపైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతోపాటు శ్వేత సెల్ఫోన్ కీలకంగా మారింది. మృతురాలి మొబైల్ను పరిశీలిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా అత్తింటి వేధింపులతో విశాఖ బీచ్లో ఐదు నెలల గర్భిణి శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: విశాఖ బీచ్లో గర్భిణీ మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు.. సూసైడ్ నోట్ స్వాధీనం అసలేం జరిగిందంటే.. పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్.కె.బీచ్లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాసి ఉంది. చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి.. -
బీచ్లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్లో శవమై తేలిన మహిళ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వివాహిత శ్వేత మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్మెంట్ను త్రీటౌన్ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. అయితే అత్తమామలు వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు విడాకులు ఇస్తానని భర్త బెదిరింపులు కాగా అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని.. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తల్లి మాట్లాడుతూ శ్వేత అత్తింటి వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని.. కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని పేర్కొన్నారు. ఫోన్ చేసి రోజూ ఏడ్చేది.. ‘భర్తను పొగొట్టుకున్నాను. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశాను. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్ చేసి ఏడ్చేది. సివిల్స్కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. శ్వేత అత్త నటిస్తోంది. అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ వల్ల శ్వేత ప్రాణం తీసుకుంది. నా ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ వాపోయారు. సూసైడ్ నోట్ ఇదిలా ఉండగా శ్వేత చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. ఇందులో ‘చిట్టీ...నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్వేత భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్లో కనిపించింది. చదవండి: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి.. -
‘నా చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణం.. కుటుంబానికి ప్రాణహాని’
సాక్షి, కరీంనగర్: ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో బొడిగె శ్యామ్ అలియాస్ శంభయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన చవుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఐ గోపాలకృష్ణ కారణమని, తన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆరోపించాడు. ఈ మేరకు సుసైడ్ నోట్ రాశాడు. ఓ భూమి విషయంలో సీఐ బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. సీఐ గోపాలకృష్ణ 30 లక్షలతో భూమి కొనుగోలు చేసి.. 8 నెలల్లో రెట్టింపు కోసం టార్చర్ పెట్టినట్లు వెల్లడించాడు. అసభ్య పదజాలంతో తిట్టినట్లు వాపోయాడు. గోపాలకృష్ణ వేధింపులు భరించలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. సీఐ నుంచి తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, ఈ లేఖను జిల్లా కలెక్టర్, ఎస్పీకి అందజేయాలని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సూసైడ్ నోటును స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శంభయ్య మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంభయ్య సుసైడ్ లేఖ ఆధారంగా పోలేసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంభయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: విధి చిన్న చూపు: కూతురు అల్లరి చూసి ఆ తల్లి మురిసిపోయింది.. అంతలోనే -
హోలీ రోజు వేధింపులు.. దేశం విడిచి వెళ్లిన జపాన్ యువతి
హోలీ వేడుకల సందర్భంగా బుధవారం ఢిల్లీలో జపాన్కు చెందిన ఓ యువతిపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతానికి చెందిన యువకులు యువతిని చుట్టుముట్టి ఆమెను వేధింపులకు గురిచేశారు. తనను గట్టిగా పట్టుకుని బలవంతంగా రంగులు పూశారు. తలపై గుడ్డు కొట్టారు. వారిని వదిలించుకొని వెళ్తున్న యువతికి మరో యువకుడు అడ్డు వచ్చాడు. దీంతో ఆమె అతని చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. యువకుల చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు..ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జపాన్ యువతి ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానిక యువకులు హోలీ పేరుతో యువతిని వేధించిననట్లు తెలిపారు. బలవంతంగా యువతిపై రంగులు చల్లి, తలపై గుడ్టు పగులకొట్టిన్నట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అంతేగాక యువతి దేశం విడిచి శుక్రవారమే బంగ్లాదేశ్ వెళ్లిన్నట్లు పేర్కొన్నారు. For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab — Ram Subramanian (@iramsubramanian) March 10, 2023 తాను బంగ్లాదేశ్ చేరుకున్నట్లు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు యువతే స్వయంగా ట్వీట్ చేసిందని చెప్పారు. అంతేగాక యువతికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం జపాన్ రాయబార కార్యలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. వీడియోను పరిశీలించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. Very distrubing videos getting viral on social media showing sexual harassment with foreign nationals on Holi! I am issuing notice to Delhi Police to examine these videos and arrest the perpetrators! Completely shameful behaviour! — Swati Maliwal (@SwatiJaiHind) March 10, 2023 -
మెడికో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి అవమానించాడు: సీపీ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతిని సీనియర్ వేధించినట్లు పోలీసులు నిర్ధారించారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఈమేరకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రీతిని టార్గెట్ చేసి సైఫ్ వేధించాడని తెలిపారు. నాలుగు నెలలుగా వేధిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రీతి చాలా తెలివి, ధైర్యం ఉన్న అమ్మాయని.. అలాగే సున్నిత మసన్తత్వం కలిగినదని సీపీ చెప్పారు. వాట్సాప్ గ్రూపులో ప్రీతిని అవమానించేలా సీనియర్ విద్యార్థి సైఫ్ మెసెజ్లు పెట్టాడని పేర్కొన్నారు. సైఫ్ తన ఇతర మిత్రులతో చేసిన చాటింగ్లో ప్రీతిని టార్గెట్ చేసినట్లు తెలిసిందన్నారు. ఆమెకు సహకరించవద్దని సైఫ్ తన ఫ్రెండ్స్కు చెప్పాడని, బ్రెయిన్ లేదంటూ హేళన చేస్తున్నట్లు చాటింగ్ ద్వారా వెల్లడైందన్నారు. ‘దీనిపై ఈనెల 18న వాట్సాప్ గ్రూపులో అతడు పెట్టిన మెసేజ్పై ప్రీతి ప్రశ్నించింది. తనను ఉద్దేశించి గ్రూప్లో చాట్ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తీసుకోలేకపోయాడు. వేధింపుల గురించి ప్రీతి వాళ్ల తల్లిదండ్రులకు తెలియజేసింది. మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించింది. వాట్సాప్ గ్రూప్లో మెసెజ్ల ద్వారా అవమానించడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుంది. 21వ తేదీనే ప్రీతి, సైఫ్ను పిలిచి కాలేజీ యాజమాన్యం విచారించింది. పాయిజన్ ఇంజెక్షన్ ఏముంది అన్నదానిపై ప్రీతి గూగుల్లో సెర్చ్ చేసింది. విద్యార్థిని వేధించినందుకు ర్యాగింగ్ కేసుతోపాటు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. సైఫ్ను కోర్టులో హాజరుపరచనున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, కేసును పక్కదారి పట్టిస్తున్నారని ప్రచారం చేయడం సరికాదు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల దీని వల్ల విచారణపై ప్రభావం పడుతుంది.’ అని సీపీ పేర్కొన్నారు. -
మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వల్లే ప్రీతి ప్రాణాలు తీసుకోవలనుకున్నట్టు పాల్పడినట్లు తెలుస్తోంది. తనను వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అఘాయిత్యాల గురించి ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. గత కాలంగా సైఫ్ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రీతి తన తండ్రికి చెప్పింది. తండ్రి స్వయంగా ఆర్ ఎస్సై కావడంతో పోలీస్ భద్రతా లభిస్తుందని విద్యార్థిని ఎదురుచూసింది. అయితే తన తండ్రి ఏసీపీ బోనాల కిషన్కు ఫోన్ చేసి వివరాలు చెప్పినా స్పందించలేదు. మరోసారి ఏసీపీకి మెసేజ్ చేసినా అటునుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఈ విషయాన్ని కూతురికి చెప్పాడు. దీంతో పోలీసుల సహకారం కూడా రాకపోవడం, ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు హోంమంత్రి మహమూద్ అలీ అండదండలు ఉన్నాయని కొంతకాలంగా సైఫ్ వేధిస్తున్నట్లు ప్రీతి తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సైఫ్ వేధింపుల గురించి తన తండ్రికి ప్రీతి పెట్టిన మెసేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని బులెటెన్లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. -
అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్ ఇంజిక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యార్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాలేజీలో సీనియర్ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి.. అత్యంత విషమంగా పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్ నుంచి నిమ్స్కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో సీనియర్ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. సైఫ్ వేధింపుల వల్లే.. కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వల్లే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. నవంబర్లో ప్రీతి కేఎంసీలో చేరిందని, డిసెంబర్ నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘జనవరి 20వ తేదీనకాలేజీ దగ్గరికి వెళ్లానని, ఉన్నతాధికారులకు వేధింపుల గురించి తెలియజేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాం. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పా. వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. మార్కులు తక్కువ వేస్తారు అని భయపడింది. ఎంతో ధైర్యంగా ఉండేది. కరోనాలో కూడా విధులు నిర్వర్తించింది. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధించాడో. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్కు తీసుకువచ్చారు. వరంగల్లో గొడవ అవుతుందని కావాలని హైదరాబాద్ తరలించారు. మాకు న్యాయం చేయాలి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల నా బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి. మా బిడ్డ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాడికి శిక్ష పడాలి. చాలా దారుణంగా వేధించాడు. మా బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ప్రీతికి ఎటువంటి ఆనారోగ్యం లేదు. చదువుల్లో నంబర్ వన్. పోలీసు ఫిర్యాదు తర్వాత సైఫ్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. సైఫ్ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు సరికావు: జూనియర్ డాక్టర్లు ఆధారాలు లేకుండా సీనియర్ విద్యార్థిపై ఆరోపణలు చేయడం సరికాదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై ప్రస్తుతం అధికారుల విచారణ జరుగుతోందని, విచారణపూర్తయ్యే వరకు తప్పుడు ఆరోపణలు చేయవద్దని పేర్కొన్నారు. అయితే ర్యాంగింగ్ లాంటిదేమి జరగలేదని కేఎంసీ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. -
వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిమ్స్కు తరలింపు
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తుంది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా హైదరాబాద్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు. నిమ్స్కు తరలింపు మరోవైపు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే.. విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. శ్వాస తీసకోవడంతో బాధితురాలు ఇబ్బంది పడుతోందని, విద్యార్థినిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ర్యాగింగ్ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. సీనియర్ తప్పు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ -
Delhi: మహిళా కమిషన్ చైర్పర్సన్కు వేధింపులు.. బయటకొచ్చిన వీడియో..!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలీవాల్ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నగరంలో మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆమెను మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో 15 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇది జరిగిన మరుసటి రోజు ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్గా మారింది. ఇందులో.. దేశ రాజధానిలో మహిళ భద్రతను పరిశీలించేందుకు తన బృందంతోకలిసి రోడ్డు మీదకు వచ్చారు. గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో నిల్చొని ఉండగా ఆమె వద్దకు ఓ బాలెనోకారు వచ్చి ఆగింది. కార్లో వచ్చి కూర్చొమని కా వ్యక్తి స్వాతిని అడిగాడు.. దీనికి ఆమె స్పందిస్తూ.. సారీ మీ మాటలు వినిపించడం లేదు.. మీరు నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారని అడిగింది. వెంటనే మలివాల్ కాస్తా దూరంగా వెళ్లడంతో ఆ వ్యక్తి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి యూటర్న్ తీసుకొని ఆమె వద్దకు వచ్చాడు. మళ్లీ తనను కార్లో ఎక్కమని ఒత్తిడి చేయడంతో ఆగ్రహం చెందిన మాలివాల్.. నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావ్.. నువ్వు ఇక్కడికి రావడం రెండో సారి.ఇలాంటివి వద్దని పదేపదే చెప్తున్నా’ అని అరుస్తూ కారు డ్రైవర్ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్ను కిటికీ ద్వారా బయటకు లాకేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె చేయి లోపల ఉండగానే కారు డ్రైవర్ విండో మూసేశాడు. దీంతో స్వాతి చేయి కారులోనే ఉండగానే నిందితుడు అలాగే 15 మీటర్లు లాక్కెళ్లారు. కాగా స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల హరీష్ చంద్రగా గుర్తించిన పోలీసులు.. ఫిర్యాదు అందిన 22 నిమిషాల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. బాలెనో కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. అతడిని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది. దీనిపై స్పందించిన స్వాతి మాలివాల్..తనకు ఎదురైన అనుభవాన్ని భయనక సంఘటనగా అభివర్ణించారు. సమాయానికి తన బృందం అందుబాటులో లేకుంటే మరో అంజలి పరిస్థితి ఎదుర్కొనేదని పేర్కొంది. . దేవుడే తన ప్రాణాలు కాపాడాడని, ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్కే భదత్ర లేకుండా సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాగా ఈ ఏడాది తొలి రోజు( జనవరి1) అంజలి అనే యువతిని కొంతమంది యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. చదవండి: Video: సచిన్ పైలట్ను కరోనాతో పోల్చిన సీఎం అశోక్ గహ్లోత్ Viral Video of Swati Maliwal, claiming AAP leader and Chairperson DCW staging attack on herself to defame Delhi Police and LG; Drama stands exposed. pic.twitter.com/WOZEGDpTub — Megh Updates 🚨™ (@MeghUpdates) January 20, 2023 -
పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన యువకుడు.. పెళ్లై ఏడాది తిరగకముందే
సాక్షి, వరంగల్: యువకుడు, అతని కుటుంబ సభ్యుల వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బండమీదితండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన మనుబోతులగడ్డకు చెందిన భూక్య డోలి, బిచినిల చిన్న కుమార్తె మూడు అనూష (24)ను బండమీదితండాకు చెందిన రమేశ్కు ఇచ్చి 2022 ఫిబ్రవరి మాసంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం అనూష మూడు నెలల గర్భిణి. వీరి జీవితం సజావుగా సాగుతున్న క్రమంలో తండాకు చెందిన ఉస్మాన్తో పాటు మరికొంతమంది వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామ పెద్దలు, పోలీసులు హెచ్చరించినా వేధింపులు ఆపకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కుమార్తె మృతికి కారణమైన ఉస్మాన్, మస్తాన్, ఇమామ్సాబ్, సర్వర్, అనిల్, సైదులుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సంపత్రావు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. చదవండి: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. -
Karimnagar: ఉమక్క, రమేశ్ బావ క్షమించండి.. కంటతడి పెట్టిస్తోన్న లేఖ
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ పట్టణం సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటననాలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి కాలనీవాసులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికే చెందిన జంగిలి రాజు (30) స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానిక ఓ వైన్షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో అతడి తల్లి మృతిచెందింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. రాజు ఉండే ఇంటి పరిసరాల నుంచి సోమవారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా రాజు కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. ఆయన చుట్టూ రక్తం ఉండడం.. శరీరం నుంచి ద్రవాలు వెలువడడంతో ముఖమంతా ఏర్పడకుండా మారిపోయింది. అతడి సెల్ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ అయి ఉంది. బంధువులకు సమాచారం అందించగా.. వారం నుంచి అతడి సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోందని తెలిపారు. అయితే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? మరేదైనా కారణమా..? అనే విషయం విచారణ చేసిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని పో లీసులు చెబుతున్నారు. గది లోపలి నుంచి తలుపులకు తాళం వేసి ఉండడంతో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్లో దారుణం.. ఆర్డర్ ఆలస్యమైందని, ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి సూసైడ్ నోట్లో ముగ్గురి పేర్లు.. రాజు మృతదేహం వద్ద సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు చిన్నమ్మ అనసూర్య, శ్రీధర్, శివ కారణమని రాసి ఉంది. తన అమ్మ చనిపోయిన తర్వాత అక్క, బావ చేరదీశారని, అయితే పై ముగ్గురితో మానసికంగా ఇబ్బందిపడ్డానని, అనసూర్య, ఆమె కొడుకులు తనను కొడుతున్నారని, వారివల్లనే జీవితంపై విరక్తి కలిగిందని, అందుకే ఇంజక్షన్ తీసుకుంటున్నానని రాసి ఉంది. తన చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని కూడా ఆ ఉత్తరంలో కోరాడు. ఉమక్క, రమేశ్బావ క్షమించండి.. ‘ఉమక్క నన్ను క్షమించు’ అంటూ రాజు రాసిన లేఖ కంటతడి పెట్టించింది. ‘ఉమక్క భయం వేస్తుంది. నాకు చావాలని లేదు. నన్ను జంగిలి అనసూర్య, శివ, శ్రీధర్ తిడుతూ కొడుతున్నారు. వాళ్ల వల్లే చనిపోతున్నా. ఇంజక్షన్ వేసుకున్నాక ఎలా ఉంటుందో నాకు తెల్వది. ఆ ఇంజక్షన్ వేసుకున్న తర్వాత చస్తే నా బాడీ కుళ్లిపోయి వాసన వచ్చేవరకు ఎవరూ రారేమో. బహుశా మీరు కూడా చూసే అవకాశం ఉండదేమో. ఎందుకంటే అంతగా నా బాడీ కుళ్లి పోయి ఉంటుంది. కనుక నన్ను క్షమించండి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. లేఖలోని విషయాలపైనా పో లీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్కు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. మధురానగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్న 27 ఏళ్ల యువతి ఓ టీవీ చానెల్లో యాంకర్గా పనిచేస్తుంది. కళాశాలలో ఆమెతో కలిసి చదువుకున్న క్లాస్మేట్ కూకట్పల్లి నివాసి కె.సామ్రాట్ ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమించాలని వెంట పడటంతో అందుకు నిరాకరించగా స్నేహితుల్లా ఉందామని నమ్మించాడు. ఓసారి తన కారులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించగా తిరిగి హాస్టల్ వద్ద విడిచివెళ్లాడు. యువతిపై కోపం పెంచుకున్న సామ్రాట్ ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. కోరిక తీర్చకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..!
సాకక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు కలిగినా తరచుగా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు పేగు తెంచుకుని పుట్టిన సొంత బిడ్డలను సైతం దూరం చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఆ తల్లి తీవ్ర మనోవేదనకు గురై పిల్లలే నాకు దూరమైతే నేనెందుకు బతకాలి, ఇంకెందుకు నా బతుకంటూ పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం బాగ్లింగంపల్లిలోని సంజయ్న గర్లో జరిగింది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం సూసైడ్ నోటు ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తమ బిడ్డ మృతదేహంతో సంజయ్నగర్ బస్తీలోని భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు.. స్థా నికుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, అంతమ్మ గూడంనకు చెందిన శ్రీలత(30)కు పదేళ్ల క్రితం బాగ్లింగంపల్లికి చెందిన సాగర్తో వివాహమైంది. వీరికి చెర్రి (7), హని (6) ఇద్దరు సంతానం. డీజే సౌండ్ సిస్టమ్ను నడుపుకునే సాగర్, అతని తమ్ముడు గడ్డం సతీష్ ఓ రాజకీయ పారీ్టలో పనిచేస్తున్నారు. వారి తల్లి భాగ్యలక్ష్మి రైల్వేలో ఉద్యోగి. గత కొన్నిరోజులుగా సాగర్ మద్యం సేవించి భార్య శ్రీలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. కాగా అదనపు కట్నం తీసుకురావాలంటూ తీ వ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అమ్మకు దయ్యం పట్టిందంటూ ఇద్దరు పిల్లలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలత పుట్టింటికి వెళ్లగా పిల్లలను తనవద్దే ఉంచుకుంటానని చెప్పి భా ర్యకు విడాకులు ఇస్తున్నట్లుగా ఓ అడ్వొకేట్ ద్వారా సాగర్ భార్యకు నోటీసులు పంపినట్లు సమాచారం. పిల్లలే దూరమైతే నేనెందుకు బతకాలి, నాబతుకెందుకు అంటూ ఆమె పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. భర్త ఇంటిముందు బంధువుల ఆందోళన... మంగళవారం ఉదయం 5గంటల నుంచి 6గంటల మధ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీలత మృతదేహానికి స్థానిక పోలీసులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శ్రీలత మృతదేహంతో బాగ్లింగంపల్లిలోని సంజయ్నగర్లోని భర్త సాగర్ ఇంటి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు సాయంత్రం 4గంటల ప్రాంతంలో వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సీఐ సంజీవకుమార్, ఎస్సైలు వెంకట్రమణ, శ్రీనివాస్రెడ్డి, కిరణ్, సందీప్రెడ్డితోపాటు ముషీరాబాద్, గాం«దీనగర్, గోషామహల్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులు, మృతిరాలి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తామని, కనీసం పిల్లలను తమకు అప్పగించేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మీంచుకోని కూర్చున్నారు. ఏసీపీ, సీఐలు ఎంత నచ్చజెప్పినా మృతదేహాన్ని నిందుతుని ఇంటిముందు పెట్టుకోని నిరసన వ్యక్తం చేశారు. శ్రీలత ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ ఓ ఫ్లెక్సీని ఇంటి గేటుకు తగిలించారు. అయితే గడ్డం సాగర్, అతని తమ్ముడు సతీష్కు పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారని బాధితులు ఆరోపించారు. శ్రీలత మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, అప్పుడు మాత్రమే ఆందోళన విరమిస్తామని మృతిరాలి బంధువులు, తల్లిదండ్రులు స్పష్టం చేశారు. -
నా చావుకు మల్లికార్జున్ సార్ కారణం..‘కాల్మొక్తా.. కాపాడన్నా’
సాక్షి, రంగారెడ్డి: ‘కాల్మొక్తా కాపాడన్నా’.. అంటూ ఓ యువకుడు మంటల్లో కాలిపోతూ వేడుకున్నాడు. తను పనిచేసే పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్ మోసం చేశారని ఆరోపించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లేడ్ చౌదరిగూడ మండలం లచ్చంపేట గ్రామానికి చెందిన కమ్మరిపేట లక్ష్మి, నర్సింలుకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు తిరుమలేశ్ (27) ఐదేళ్లుగా వనంపల్లి శివారులోని జీబీ బేకర్స్ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గత జూలైలో పరిశ్రమలో పనిచేస్తుండగా చేయి ప్రమాదవశాత్తు మిషన్లో పడి గాయాలపాలయ్యాడు. పరిహారం ఇవ్వడంతోపాటు ఉద్యో గం పర్మినెంట్ చేస్తామని పరిశ్రమ యాజమాన్యం, మేనేజర్ మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ఈ విషయమై తిరుమలేశ్ కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. యాజమాన్యంతో మాట్లాడతానంటూ మల్లికార్జున్ మభ్యపెడుతూ వచ్చాడు. శనివారం మరోసారి గుర్తు చేయగా ‘పరిహారం లేదు, ఏమీ లేదు.. నీ చావు నీవు చావు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పరిశ్రమలో పనిచేసేందుకు యథావిధిగా తిరుమలేశ్ వెళ్లగా లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురై తుమ్మలపల్లి శివారు కంకల్ దారిలోని ఎల్లమ్మ దేవాలయం దగ్గరలో ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. నా చావుకు మల్లికార్జున్ సార్ కారణం.. లాల్పహాడ్ వైపు నుంచి యెన్కెపల్లి వైపు ట్రాక్టర్ డోజర్తో వెళ్తున్న లచ్చంపేట గ్రామానికి చెందిన వడ్డెగారి శ్రీనివాస్ మంటల్లో కాలిపోతున్న తిరుమలేశ్ను చూశాడు. ఏమైంది.. ఎందుకిలా చేశావు అనగా ‘కాల్మొక్తా అన్నా.. నన్ను కాపాడు’ అంటూ అరిచాడు. వెంటనే స్థానికుల సాయంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన చావుకు మల్లికార్జున్ సార్ కారణం అంటూ తిరుమలేశ్ ఆత్మహత్యాయత్నానికి ముందు తన మొబైల్లో స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు తిరుమలేశ్ను వెతుకుతున్న క్రమంలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలిసింది. మల్లికార్జున్తోపాటు లేబర్ కాంట్రాక్టర్ వెంకట్రెడ్డి, అసిస్టెంట్ బాలకృష్ణ వేధింపులే కారణమని బాధితుడి సోదరుడు కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సక్రమ్, షాద్నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ ఉస్మానియాలో చికిత్స పొందుతున్న తిరుమలేశ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి -
జైలుకెళ్లినా బుద్ధి మారలే.. సహజీవనం చేయాలని కానిస్టేబుల్ ఒత్తిడి
సాక్షి, రంగారెడ్డి: ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన పి.వెంకటేశ్వర్లు గతంలో మాదన్నపేట పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించాడు. వీరి ఇంటి సమీపంలో నివాసముండే బాధిత మహిళ (34) కుటుంబం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉండేవారు. వెంకటేశ్వర్లు గతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తిరస్కరించింది. అయినా వినకుండా మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు 25 జనవరి, 2021 రోజున సైదాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వెంకటేశ్వర్లు బుద్ధి మార్చుకోకుండా మహిళను వేధించడంతో పాటు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఎంతకీ అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి సైదాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో 2021, మే నెలలో వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ సమ యంలో సదరు మహిళ ఫోన్ నంబర్తో పాటు తమ నివాసాన్ని మొదట ఈసీఐఎల్కు, అక్కడి నుంచి మీర్పేట సీతాహోమ్స్కు మార్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. అనంతరం మహిళ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తెలుసుకుని భర్త, పిల్లలు లేని సమయంలో ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించాడు. 2022, ఆగస్టు 17న మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి తనతో సహజీవనం చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారం చేసి, వీడియోలు ఫొటోలు తీశాడు. ఈ నెల 14న మళ్లీ వెళ్లి.. గతంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. పరుష పదజాలంతో దూషిస్తూ లైంగిక దాడికి యత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు నీ నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న మీర్పేట్ పోలీసులు వెంకటేశ్వర్లుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి బుధవారం రిమాండ్కు తరలించారు. -
కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది?
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనరేట్ పరిధిలోని మహిళ, సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు అనునిత్యం పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. వేధింపులు ఎదురైన, బెదిరింపులకు లోనైన వారితో పాటు ఆర్థికంగా నష్టపోయిన వాళ్లూ వీటి మెట్లు ఎక్కుతారు. అప్పుడప్పుడు ఈ ఠాణాలకు వస్తున్న కొన్ని కేసులు పోలీసులనే షాక్కు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికి ఎలా న్యాయం చేయాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల పోలీసుల వద్దకు వచ్చిన ఆ తరహాకు చెందిన కేసుల్లో కొన్ని... పతి, పత్నీ ఔర్ ఓ... భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనో, ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనో, పెళ్లి పేరుతో ప్రేమాయణం నడిపి మోసం చేశాడనో...ఇలా అనే కేసులు పోలీసుల వద్దకు వస్తుంటాయి. అయితే బుధవారం మహిళ ఠాణాకు వచ్చిన ఓ కేసు అధికారులకే మతి పోగొట్టింది. వివాహితుడైన ఓ వ్యక్తికి ఆన్లైన్లో నగరానికే చెందిన యువతితో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించడం అనేక కేసుల్లో వింటూనే ఉంటాం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఈ ప్రేమాయణం కథ మొత్తం అతడి భార్యకూ తెలిసి ఉండటం. ఈ భార్య, ఆ ప్రియురాలు ఓ అండర్ స్టాడింగ్కు వచ్చి కలిసే అతడితో కాపురం చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం సదరు యువతి ఇంట్లో తెలియడంతో కథ అడ్డం తిరిగింది. వివాహితుడికి రెండో భార్యగా ఉంటావా? అంటూ యువతిని మందలించారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో విషయం ఠాణా వరకు వచి్చంది. ‘నా భర్త ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.. ముగ్గురం కలిసే ఉంటాం’ అంటూ భార్య, ‘ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను’ అంటూ యువతి చెప్తుండగా... ఆమె తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. భార్య ఉండగా ఆమె సమ్మతించినా రెండో పెళ్లి చేసుకోవడం నేరమంటూ చట్టాన్ని వివరించిన పోలీసులు ముగ్గురికీ కౌన్సిలింగ్ చేశారు. ఫలితంగా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఎవరి ఇళ్లకు వాళ్లు చేరారు. నిందితుడిగా మారిన మాజీ ప్రియుడు... వివాహిత అయిన మాజీ ప్రేయసి నుంచి సందేశం అందుకున్న ఆ ప్రియుడు ఎగిరి గంతేసి మరీ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆమే తనను పెళ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అతను నగరంలో చదువుకునే సమయంలో ఈమెతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట ప్రయాణం పెళ్లి వరకు వెళ్లలేదు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి కావడంతో అతడు ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడాకులు తీసుకోవాలని భావించింది. ఆ తంతు పూర్తయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామంటూ మాజీ ప్రియుడికి సందేశం ఇచ్చింది. ఇంకేముంది ఉన్న ఫళంగా నగరానికి వచ్చేశాడు. ఆమె భర్తతోనే కలిసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యాడు. పెళ్లి చేసుకుందామంటూ పదేపదే ఆమెకు సందేశాలు పెట్టాడు. విడాకులు తీసుకోకుండా అదెలా సాధ్యమంటూ దాటవేస్తూ వచ్చింది. అలాంటప్పుడు తనను ఎందుకు రమ్మన్నావంటూ అతడు గొడవకు దిగాడు. తన వేదనను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే బాధితురాలిగా మారిన ఆ యువతి తన మాజీ ప్రియుడి పైనే సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు పెట్టింది. కౌన్సిలింగ్తో ఈ కథ లండన్కు చేరింది. చదవండి: కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో యాప్... ఎంతపని చేసింది... ఓయూ ప్రాంతానికి చెందిన ఓ నిరక్షరాస్యుడు గొర్రెలు, మేకల వ్యాపారి. ఇతడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు చెట్టపట్టాలుగా తిరిగారు. నిరక్షరాస్యుడని తెలియడం..ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆమె అతడిని దూరంగా పెట్టింది. దీంతో తనను ప్రేమిస్తున్నానంటూ మోసం చేసిందని వ్యాఖ్యానిస్తూ ఇన్స్ట్రాగామ్లో యువతి ఫొటోతో సహా అతడు పోస్టు చేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాటింగ్ యుద్ధం కూడా జరిగింది. అవాక్కైన పోలీసులు ఆవేదనకు గురైన ఆమె అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించింది. నిరక్షరాస్యుడైన అతడికి చాటింగ్, పోస్టులు పెట్టడం రాదని, అతడి వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించింది. కేసు నమోదు కావడంతో ఆ యువకుడిని పోలీసులు ఠాణాకు తీసుకొచ్చారు. విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన విషయాలు విని అవాక్కయ్యారు. ఏ మాత్రం ఆంగ్ల పరిజ్ఞానం లేని అతడు ఓ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యువతి పంపిన సందేశాన్ని కాపీ చేసి అందులో పేస్ట్ చేసే వాడు. దానికి ఏం సమాధానం చెప్పాలన్నది ఆ యాప్ సూచించేది. దాన్ని మళ్లీ కాపీ చేసే అతడు యువతికి పోస్టు చేసేవాడు. కొన్నిసార్లు వాయిస్ కమాండ్స్ను టెక్టస్గా మార్చి పోస్టు చేసే వాడు. నిందితుడిగా మారిన అతగాడు తనను ఆ యువతి ఎలా మోసం చేసిందో కూడా వివరించాడు. ఈ విషయాలను ఆమె కూడా అంగీకరించడంతో అరెస్టు పర్వం తప్పింది. -
కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో
సాకక్షి, కరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. – మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల.. వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో సదరు హెచ్ఎం వేములవాడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ బన్సీలాల్ ఘటనపై పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుకున్న డీఈవో రాధాకిషన్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పందిస్తు విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని విద్యాశాఖ అధికారులను విమర్శించారు. ఈ ఘటన మరువకముందే మరో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఘటన సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తనను పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యారి్థని తన తల్లికి తెలపడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ కరువు... ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు విద్యార్థులకు ఉన్న వసతులపై పర్యవేక్షించే శాశ్వత అధికారులు జిల్లాలో లేరు. విద్యాశాఖలో 640 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఎంఈఓలున్నారు. వీరందరూ ఏదో ఒక పాఠశాలలో హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారేకావడం గమనార్హం. వీరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గతంలో వీరితో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వీరి ఆదేశాలను పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా డీఈవో కూడా డిప్యూటేషన్లో పనిచేస్తుండం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులు రెగ్యులర్ కాకపోవడంతో పర్యవేక్షణ లోపం జిల్లాలో అధికంగా ఉందని ఇదే కారణంగా అనేక పాఠశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎంఈవోలు, డీఈవో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – లక్ష్మారెడ్డి, ఎస్సై, తంగళ్ల్లపల్లి -
వరంగల్లో మరో సెల్ఫీ సూసైడ్ కలకలం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్తో అప్పులపాలై యువకుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరిచిపోక ముందే మరో వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అపార్ట్మెంట్ యజమాని కులం పేరుతో దూషించి, దాడి చేశాడని వాచ్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా గత వారం రోజుల్లో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం ఇది రెండో ఘటన. ఆత్మహత్యకు పాల్పడ్డ అపార్ట్మెంట్ వాచ్మెన్ వడ్లకొండ శ్రీనివాస్, ఓనర్ వేధింపులు కులం పేరుతో దూషించడమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయిదు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్, ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. తన ఆత్మహత్యకు అపార్ట్మెంట్ ఓనర్ యాదగిరి ఆయన భార్య హిందుమతి, పనిలో పెట్టించిన రాజయ్య ఆయన భార్య కారణమని ఆరోపించాడు. సెల్ఫీ వీడియో ద్వారా వారు పెట్టిన ఇబ్బందులను చూపించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్మాగా మారడంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీనివాస్ కొద్దిరోజులు అపార్ట్మెంట్లో ఉండి వాచ్మెన్గా పనిచేసి బయటికి వచ్చినప్పటికీ యాదగిరి హిందుమతి దంపతులు మళ్లీ శ్రీనివాసునే పిలిపించుకుని వాచ్మెన్గా పెట్టుకున్నారని బంధువులు తెలిపారు. గౌడ కులస్థుడైన శ్రీనివాస్ కులాంతర వివాహం ఎస్సీ మహిళను చేసుకోవడంతో కులం పేరుతో దూషించి కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. అంటరాని వారిగా చూస్తూ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. అపార్ట్మెంట్ యజమాని ప్రస్తుతం పరారీలో ఉండగా.. గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరువు ఆత్మహత్యగా భావిస్తు కుల సంఘాలు అక్కడి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. . -
Hyderabad: యువతి ఫోటో మార్ఫింగ్ చేసి వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: యువతి ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు పంపి వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట్ జిల్లా హుజుర్నగర్కు చెందిన నవదీప్(18)కు అతడి స్నేహితుడి ద్వారా ఓ యువతి(19) పరిచయమైంది. ఆమె పేరుపై ఇన్స్టా ఐడీ తెలుసుకున్న నవదీప్ గుర్తుతెలియని వ్యక్తి పేరుపై ఐడీ క్రియేట్ చేసి సందేశాలు పంపించసాగాడు. ఈ క్రమంలో యువతి ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు రూపొందించి పంపి వేధించంతో పాటు రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నవదీప్ను అదుపులోకి తీసుకొని జుడీషియల్ రిమాండ్కుతరలించారు. చదవండి: కన్న కూతురిపై కన్నేసిన కామాంధుడు.. అసభ్యకర ప్రవర్తన -
‘నువ్వంటే ఇష్టం... నాతో ఉండిపో’.. వివాహితకు సినీ కెమెరామెన్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: వివాహితను వేధింపులకు గురిచేస్తున్న కెమెరామెన్పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్గూడ సమీపంలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న కూనపరెడ్డి శ్రీనివాస్(49) సినీ పరిశ్రమలో కెమెరామెన్గా, యాడ్స్ డైరెక్టర్గా పనిచేస్తుంటాడు. పలు సినిమాలకు కెమెరామెన్గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటికి ఎదురుగా వివాహిత(39) తన భర్త, పిల్లలతో కలిసి 2007 నుంచి ఉంటోంది. శ్రీనివాస్ కుటుంబంతో పరిచయం ఉన్న బాధితురాలిని కొన్ని నెలలు గా తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇంటిముందు నిలబడి గట్టిగా కేకలు వేయడం, సదరు మహిళ గురించి చెడుగా మాట్లాడటంతో కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మద్యం మత్తులో అలా ప్రవర్తిస్తుంటాడని భావించిన వివాహిత భర్తతో పాటు కుటుంబసభ్యులు పలు మార్లు మందలించినా ఏ మాత్రం మార్పురాకపోగా వేధింపులు తీవ్రమయ్యాయి. నువ్వంటే ఇష్టం.. నాతో ఉండిపో.. అంటూ రోడ్డుమీదనే అటకాయించడం, తనమాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నా డు. దీంతో విసిగిపోయిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు కూనపరెడ్డి శ్రీనివాస్పై ఐపీసీ 354(డి), 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: హెచ్సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ -
బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని..
సాక్షి, బెంగళూరు : బంధువు వేధిస్తోందని తీవ్ర నిర్ణయం తీసుకుందో తల్లి. ఈ దుర్ఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్ పరిధిలోని హొసగుడ్డహళ్లిలో జరిగింది. తమ్ముని భార్య సతాయిస్తోందని లక్ష్మమ్మ (48), కొడుకు మదన్ (13)ను గొంతు పిసికి చంపి, తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ్ముని భార్య కేసు పెట్టిందని వివరాలు... లక్ష్మమ్మ తమ్ముడు సిద్దేగౌడకు రంజిత అనే యువతితో వివాహమైంది. అప్పుడప్పుడు భార్యభర్తలు గొడవపడేవారు. రంజిత కట్నం, గృహహింస కేసును పెట్టడంతో భర్త సిద్దేగౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో లక్ష్మమ్మ, ఈమె భర్త శివలింగేగౌడతో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో విరక్తి చెంది అకృత్యానికి పాల్పడింది. భర్త ఫోన్ చేయగా హొసగుడ్డహళ్లిలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ భర్త గాందీనగరలో హోటల్ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9:30 హోటల్కు భర్త హోటల్ నుంచి ఫోన్ చేశాడు. ఎంతసేపటికీ స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేయగా వారు వెళ్లి చూస్తే శవాలై కనిపించారు. భర్త శివలింగేగౌడ, పెద్ద కొడుకు నవీన్ ఇంటికి చేరుకుని విలపించారు. పెద్ద తప్పు చేశాను రంజితతో నా తమ్మునికి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను, ఆమె వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నాను. నా మరణానికి సవితా, శివణ్ణ, లక్ష్మి, పుట్ట, సిద్ధరాజు, శివలింగ, శంకర, సిద్దరామ అనే వారు కారణమని, భర్త, తమ్ముడు తన అంత్యక్రియలను చేయాలని వీడియోలో తెలిపింది. -
ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో మహిళలకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి మహిళల సోషల్ మీడియా ప్రొఫైల్స్కు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం.. వారి వ్యక్తిగత ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటిని ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో ప్రొఫెషనల్స్గా పేర్కొంటూ అశ్లీల వ్యాఖ్యలు జోడించడం... ఇలా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్లు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశంజిల్లా కంభం మండలానికి చెందిన గంగుల హరీష్(19) 2022 ఏప్రిల్లో యూట్యూబ్లో ఒక ఛానల్ను క్రియేట్ చేశాడు. నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, మహిళల ఫొటోలను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకునేవాడు. తన యూట్యూబ్ ఛానల్లో మహిళలను ఎస్కార్ట్ సర్వీస్ ప్రొఫెషనల్స్గా పేర్కొంటూ, అశ్లీల వ్యాఖ్యలతో ఆ ఫొటోలను ఆప్లోడ్ చేస్తున్నాడు. దీంతో అతని ఛానల్ను 20 వేల మంది సబ్ స్రైబ్ చేయడంతో పాటు అతను అప్లోడ్ చేసిన వీడియోలను చాలా మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు అతడిని హెచ్చరిస్తూ కాల్స్ చేయడంతో వాటిని యూట్యూట్ నుంచి తొలగించాడు. అనంతరం బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు గంగుల హరీష్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. -
Hyderabad: మహిళకు ఫైనాన్స్ సంస్థ వేధింపులు.. సుసైడ్ నోట్ రాసి..
సాక్షి, హైదరాబాద్: ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజబొల్లారం తండాకు చెందిన సునీత(35) గత కొంత కాలంగా కూతురుతో కలిసి మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్లో నివాసం ఉంటూ అలియాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద బైక్జోన్ నిర్వహిస్తుంది. వ్యాపార నిర్వహణకు ఇన్స్టా ఫండ్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకుంది. అయితే కొన్ని నెలలుగా ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపానికి లోనైంది. శుక్రవారం ఉదయం కుమార్తెను పాఠశాలకు పంపిన తర్వాత తన ఆత్మహత్యకు ఇన్స్టా ఫండ్ ఫైనాన్స్ వారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నిట్లో లైంగిక వేధింపులు.. వాట్సాప్ మెసెజ్లు పంపుతూ..
సాక్షి, వరంగల్: అతని లైంగి కవేధింపులకు విసిగివేసారిన మహిళా సెక్యూరిటీ గార్డులు చివరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన నిట్ వరంగల్ క్యాంపస్లో గురువారం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వరన్ పది నెలల క్రితం క్యాంపస్కు డిప్యూటీ రిజిస్ట్రార్గా అడ్మిన్ హోదాలో వచ్చాడు. క్యాంపస్లో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులను ఒంటరిగా తన ఇంటికి పిలిపించుకుని వ్యక్తిగత పనులు చేయాలంటూ కొన్నిరోజులుగా వేధిస్తున్నాడు. వాట్సాప్ మెసెజ్లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. చెప్పిన పని ఒప్పుకోకపోతే గంజాయి కేసు పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం వెంకటేశ్వరన్.. ప్రశాంత్నగర్లోని తన ఇంటికి ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిపించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో గార్డులు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్కు దేహశుద్ధి చేసి కాజీపేట పోలీసులకు అప్పగించారు. ముందుగానే ఈ విషయాన్ని రిజిస్ట్రార్ గోవర్ధన్రావుకు తెలిపినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. నిట్ వరంగల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్ఐఎస్ సంస్ధ యజమాని డిప్యూటీ రిజిస్ట్రార్తో కుమ్మక్కై మహిళా సెక్యూరిటీ గార్డులను తన ఇంటికి పంపించే విధులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్, చీఫ్ సె క్యూరిటీ ఆఫీసర్ కుమారస్వామి, ఎస్ఐఎస్ సెక్యూరిటీ సంస్థ శంకరన్లపై కేసు నమోదు చేసినట్లు కాజీపేట ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి తెలిపారు. కాగా, గతంలో తమిళనాడులో తాను పనిచేసిన సంస్థలోనూ వెంకటేశ్వరన్ ఇదే తరహాలో లైంగిక వేధింపులకు పాల్పడడంతో అక్కడినుంచి నిట్ వరంగల్కు మకాం మార్చినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి:పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలమీదకు తెచ్చిన రూ.200 చిరిగిన నోటు -
ఒకే మహిళను రెండోసారి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు, కట్నం వద్దంటూనే
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ మహిళను కట్నం వద్దంటూ వివాహం చేసుకున్న రెస్టారెంట్ నిర్వాహకుడు ఆపై అతని అసలు రంగు చూపించాడు. కట్నానికి బదులుగా ఆమె డైరెక్టర్గా ఉన్న కంపెనీలో షేర్లు రాయాలంటూ బెదిరించాడు. శారీకంగా, మానసికంగా వేధించడంతో పాటు ఆమెపై సీసీఎస్లో తప్పుడు కేసు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని సీసీఎస్ ఆధీనంలోని మహిళ ఠాణాలో ఫిర్యాదు చేసింది. రవికుమార్తో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన రీనా ఓ ప్రైవేట్ సంస్థకు ప్రమోటర్ డైరెక్టర్. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి నుంచి వచ్చి గడ్డిఅన్నారంలోని తిరుమల హిల్స్లో నివసిస్తున్న రెస్టారెంట్ నిర్వాహకుడు తగరం రవికుమార్తో ఈమెకు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమైంది. రీనా తల్లిదండ్రులు, రవికుమార్ సమీప బంధువులైన తగరం అబ్రహం, మేరీ రాణి, కరుణ కుమారి, శ్రీనివాస్లతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు కట్నం కోసం పట్టుబట్టడంతో సంబంధం కుదరలేదు. ఆపై కొన్నాళ్లకు రీనాతో సంప్రదింపులు జరిపిన రవి కట్నం లేకుండా వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఈ సమయంలోనే రవికుమార్ యోగా ట్రైనర్గా చెప్పుకొన్న షాగుఫ్తాను రీనాకు పరిచయం చేశాడు. గతేడాది అక్టోబర్ 15న నిశ్చితార్థం, ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహం జరిగాయి. చదవండి: Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి కొన్నాళ్లకే అసలు రంగు.. రవికుమార్ నిశ్చితార్థం, వివాహానికి ఆయన తరఫువారు హాజరు కాలేదు. దీంతో వారి కోసమంటూ రవి కుమార్ చింతలపూడిలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మరోసారి వివాహ కార్యక్రమం, పార్టీ పెట్టాడు. అయితే వివాహమైన కొన్ని రోజులకే రవికుమార్, అతడి కుటుంబీకుల అసలు రంగు బయటపడింది. కంపెనీలో రీనా షేర్లు, ఆస్తులు అడగటంతో భర్తే కదా అని ఆమె అన్నీ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంటికి ఆలస్యంగా రావడం మొదలెట్టాడు. అదేమని ప్రశ్నిస్తే అసభ్యంగా, అభ్యంతరకరంగా దూషించడంతో పాటు చేయి చేసుకునే వాడు. ఉద్దేశపూర్వకంగా కులాల ప్రస్తావన తీసుకువస్తూ కించపరిచే వాడు. తాను కట్నం తీసుకోలేదు కాబట్టి తన కంపెనీతో పాటు కుటుంబీకులకు ప్రైవేట్ సంస్థలో రీనాకు ఉన్నవి బదిలీ చేయాలని బలవంతం చేశాడు. ఈ ఏడాది మార్చి 11న ఇంటి నుంచి వెళ్తూ బదిలీ పూర్తయితేనే వస్తానన్నాడు. మర్నాడు రాత్రి వచ్చిన రవి షేర్లు బదిలీ చేయాలంటూ రీనాను దూషించడంతో పాటు తీవ్రంగా హింసించాడు. ఆమె సంస్థలోనే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టాడు. తాను చెప్పినట్లు చేయకపోతే పరువు తీస్తానని, హైదరాబాద్లో తలెత్తుకుని బతకలేని స్థితి తీసుకువస్తానని బెదిరించాడు. అలా బయటకు వెళ్లిన రవి కొన్నాళ్ల వరకు తిరిగి ఇంటికి రాలేదు. సీసీఎస్లో కేసు పెట్టి.. దీంతో రీనా స్వయంగా అతడి ఇంటితో పాటు చైతన్యపురిలోని అతడి రెస్టారెంట్కు వెళ్లింది. రీనాను రవి కుమార్ ఇరుగు వారికి, రెస్టారెంట్ ఉద్యోగులకు సైతం అప్పటి వరకు పరిచయం చేయలేదు. ఇంటికి రావడం పూర్తిగా మానేసిన రవి యోగా ట్రైనర్గా చెబుతున్న షాగుఫ్తాతో కలిసి ఉంటున్నట్లు రీనా తెలుసుకున్నారు. రవి ఈ ఏడాది మార్చిలో రీనాతో పాటు ఆమె కుటుంబీకులు, మరికొందరిపై సీసీఎస్లో తప్పుడు ఫిర్యాదు చేశాడు. మహిళా ఠాణాలో ఆరుగురిపై కేసు.. అప్పటి వరకు తనతో పాటు కుటుంబం పరువు కోసమంటూ బాధలు భరించిన రీనా ఈ కేసుకు సంబంధించిన నోటీసులు అందడంతో నోరు విప్పారు. సీసీఎస్ పోలీసుల ఎదుట అసలు విషయం చెప్పడంతో పాటు ఆధారాలు అందించారు. దీంతో రవి ఫిర్యాదు వాస్తవ దూరమని తేల్చిన అధికారులు ఆ కేసు మూసేశారు. ఇతగాడి వ్యవహారాలు శ్రుతి మించడంతో రీనా సైతం ఉమెన్ పోలీసుస్టేషన్ మెట్లు తొక్కారు. రవికుమార్తో పాటు అతడి కుటుంబీకులు తగరం అబ్రహం, తగరం మేరీ రాణి, కరుణ కుమారీ, షాగుఫ్తాలపై ఫిర్యాదు చేశారు. ఈమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన పోలీసులు వీరిపై ఐపీసీతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రీనాను వివాహం చేసుకున్న రవికుమార్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనికోసం జూన్ 10న ఇండియా క్రిస్టియన్ మాట్రిమోనీ సైట్లో మరో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీన్ని అతడి తల్లిదండ్రులు తెరిచినట్లు అందులో పొందుపరిచాడు. ఈ విషయాన్నీ పోలీసులు పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అసభ్యకర మెసేజ్లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా అసభ్య మెసేజ్ పంపతూ.. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నటి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. అమీర్పేట, నాగార్జునానగర్ కాలనీలో ఉంటున్న నటి (42) కు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ పదిహేనేళ్లుగా పరిచయం. ప్రవీణ్ భవనాలు నిర్మించే బిల్డర్. 8 ఏళ్ల క్రితం ఆమె వద్ద రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాధితురాలు అపార్ట్మెంట్లో ఉండే మరో మహిళ వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని ప్రవీణ్కు ఇచ్చింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అసభ్యకర మెసేజ్లు పెడుతూ తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి -
తాను తవ్వుకున్న గోతిలో తానే.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ఆపై
సాక్షి, చెన్నై: పెరియార్ వర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ గోపీని సోమవారం సాయంత్రం సేలం సూర మంగళం పోలీసులు అరెస్టు చేశారు. ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయన అడ్డంగా బుక్కయ్యాడు. వివరాలు.. సేలం పెరియార్ వర్సిటీలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా గోపీ పనిచేస్తున్నారు. ఆదివారం పరిశోధక ఓ విద్యార్థినిని వర్సిటీలోని తన చాంబర్కు రావాలని ఆయన ఆదేశించాడు. అక్కడికి వచ్చిన ఆ విద్యార్థిని కాసేపటి తర్వాత మౌనంగా బయటకు వెళ్లి పోయింది. అయితే, ఆ విద్యార్థినిపై సాయంత్రం ఆయన సూర మంగళం పోలీసు స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశాడు. అధిక మార్కులతో పాటుగా త్వరితగతిన డిగ్రీ దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బంధువుల ద్వారా ఆ విద్యార్థిని దాడి తనపై చేయించినట్టు ఆరోపించాడు. అంతే కాకుండా, రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అడ్మిట్ అయ్యాడు. సోమవారం ఉదయాన్నే పోలీసులు సంబంధిత విద్యార్థిని పిలిపించి విచారించగా రిజిస్ట్రార్ బండారం బయట పడింది. చాంబర్కు పిలిపించి తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు, తాను బయటకు చెప్పుకోలేక మౌనంగా ఉండి పోయినట్లు ఆ విద్యార్థిని ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థినితో పోలీసులే ఫిర్యాదు చేయించారు. అలాగే, గోపీతో పాటుగా ఆదివారం వర్సిటీలో విధుల్లో ఉన్న సిబ్బంది, సహచర విద్యార్థుల్ని పోలీసులు విచారించారు. గోపీ బండారం బయట పడడంతో ఆయన్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పోలీసుల్ని ఆశ్రయించిన నాటకం ఆడిన రిజిస్ట్రార్ గోపీ.. చివరకు తాను తవ్వుకున్న గోతిలోనే పడ్డారని పలువురు వాఖ్యానించారు. -
సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ..
సాక్షి, బెంగళూరు: భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపి హింసిస్తూ, పదే పదే గర్భస్రావం చేయిస్తున్న భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బాణసవాడి ప్రాంతంలో ప్రదీప్ అనే వ్యక్తి అయిదు నెలల కిందట బాధిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లైన కొన్నిరోజులకే భార్యకు తన నిజ స్వరూపం చూపించాడు. నిత్యం మద్యం తాగి వచ్చి ఆమెపై చిత్రహింసలకు పాల్పడేవాడు. అశ్లీల వీడియోలు చూపించి వేధింపులకు గురిచేశాడు. సెగరెట్తో వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. భర్త బాధలు పడలేక మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ భర్త ప్రదీప్ ఆమె సతాయించడం మానలేదు. ఒకటి రెండుసార్లు గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్ చేయించాడు. స్నేహితులను ఇంటికి పిలిపించి పార్టీ చేసుకుని వారి ముందే భార్యను హింసించేవాడు. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టి, విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. సైకో భర్త ప్రవర్తనతో విసుగుచెందిన భార్య బాణసవాడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రదీప్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక.. -
కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి..
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో యువతిని, ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోన్న యువకుడిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోటి ఉమెన్స్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తోన్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్దిరోజుల స్నేహం తర్వాత యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. స్నేహంగా ఉన్న రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతి చోటా ఆన్లైన్లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడ్పోస్తానని బెదిరింపులకు గురిచేసేవాడు. తెలంగాణ మోడల్ స్కూల్ గంగాధర సోషల్ మీడియా అకౌంట్ను ట్యాగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈ నెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోతుగా విచారించిన పోలీసులు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. భరద్వాజ్ కదలికలపై దృష్టి పెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్కు వెళ్లగా అక్కడే అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా కొందరు వీడియో తీసినవి సోషల్ మీడియాలో రావడంతో కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చా యి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి కిడ్నాప్ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు. చదవండి: Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ.. -
హైదరాబాద్: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి 8 మంది కాలేజీ అమ్మాయిలకు మెసెజ్ల రూపంలో అర్థ నగ్న ఫోటోలు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడు. అగంతకుడి చిత్రహింసలతో విసిగిపోయిన బాధిత యువతులు షీ టీమ్స్ను ఆశ్రయించారు. దీంతో విజయ్ కుమార్ అనే ర్యాపిడో డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామవాంఛతో ఇలా ఆడపిల్లల్ని వేధిస్తున్నట్టు విజయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. -
రూ.20 లక్షల కట్నం, ఘనంగా పెళ్లి.. ఏడాది కాకముందే..
సాక్షి, సిరిసిల్ల: వరకట్నం వేధింపులకు నవ వధువు బలైంది. హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోగా.. మృతదేహాన్ని కస్బెకట్కూర్కు తరలించారు. సిరిసిల్లలోని అబ్బాయి ఇంటి వద్ద అమ్మాయి కుటుంబీకులు, గ్రామస్తులు నిరసన తెలుపగా.. పోలీసులు బందోబస్తు చేపట్టారు. మృతురాలి పెద్దనాన్న జూపల్లి వేణుగోపాల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటకు చెందిన చీటి ఉదయ్కు తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్కు చెందిన జూపల్లి నిఖితకు 11 నెలల క్రితం వివాహమైంది. రూ.20 లక్షల కట్నం, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన ఉదయ్, నిఖితలు హైదరాబాద్లో కాపురం పెట్టారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఉదయ్ అదనపు కట్నం తేవాలని నిఖితను వేధించసాగాడు. తల్లిగారింటి వద్ద వ్యవసాయ భూమిలో నుంచి రెండెకరాలు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన నిఖిత హైదరాబాద్లో వారు ఉంటున్న ఇంట్లోనే గురువారం తెల్లవారుజామున ఉరేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు అంబులెన్స్ను కస్బెకట్కూర్ పంపించిన పోలీసులు నిఖిత కుటుంబసభ్యులు ఆమె మృతదేహంతో హైదరాబాద్ నుంచి అంబులెన్స్లో బయలుదేరారు. సిరిసిల్లలోని నిఖిత అత్తగారింటి వద్ద ధర్నా చేస్తారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు తంగళ్లపల్లి మండలం జిల్లెల చెక్పోస్టు వద్ద అంబులెన్స్ను అడ్డుకొని, కస్బెకట్కూర్కు పంపించారు. మృతురాలి పెద్దనాన్న ఆధ్వర్యంలో పలు వు రు ముందుగానే ఉదయ్ ఇంటికి వెళ్లగా.. అప్పటికే తాళం వేసి, పరారయ్యారు. ఎలాంటి తప్పు చేయకుంటే ఇంట్లో ఎందుకు ఉండరని ప్రశ్నిస్తూ అక్కడే నిరసనకు దిగారు. అయితే మృతదేహం కస్బెకట్కూర్లో ఉండగా కుటుంబసభ్యుల్లో కొందరు సిరిసిల్లలో ఉదయ్ ఇంటి వద్దే ధర్నా చేస్తున్నారు. ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్యను వదిలేసి స్వాతి టీచర్తో న్యాయవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్!
సాక్షి, చైతన్యపురి: కన్న కొడుకును చిత్రహింసలు పెట్టాడని భార్య ఫిర్యాదుతో ఓ న్యాయవాదిపై సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆర్డర్పై తన వద్ద ఉన్న కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లారని న్యాయవాది ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిపై కేసులు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మాధవరావు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్స్ కాలనీలో నివసించే న్యాయవాది దేవులపల్లి సంతోష్కుమార్కు ఉమామహేశ్వరితో 11 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి అర్షిత్సాయి (10), కల్యాణ్సాయి (8) కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇద్దరు కుమారులను సంతోష్కుమార్ తన వద్దకు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, సోమవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఉమామహేశ్వరికి ఫోన్కాల్ వచ్చింది. తప్పిపోయిన మీ కుమారుడు తమ వద్ద ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఉమామహేశ్వరికి తన పెద్ద కుమారుడు అర్షిత్సాయి కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉన్నాయి. తనను తండ్రి సంతోష్కుమార్, ఆయనతో పాటు ఉంటున్న టీచర్ స్వాతి తనను చిత్రహింసలు పెట్టారని తల్లికి వివరించాడు. స్వాతి టీచర్ గరిటెతో పొట్టపై వాతలు పెట్టిందని, తండ్రి బెల్ట్తో కొట్టాడని చెప్పటంతో ఉమామహేశ్వరి సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై కోపంతో తమ కుమారుడిని చిత్రహింసలు పెట్టిన భర్త సంతోష్కుమార్, స్వాతిపై చర్యలు తీసుకోవాలని కోరింది. చదవండి: కూతురిపై కన్నేసిన తండ్రి.. కాపాడిన సవతి తల్లి తన కుమారుడు అర్షిత్ సాయిని తాము చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం కాదని.. కోర్టు అనుమతితో తీసుకొచ్చిన తన కుమారుడిని ఉమామహేశ్వరి, ఆమె సోదరుడు శివకుమార్ బలవంతంగా తీసుకెళ్లారని సంతోష్ కుమార్ సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదు స్వీకరించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మాధవరావు తెలిపారు. చదవండి: ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం.. స్పందించిన బోధన్ ఎమ్మెల్యే -
పాపం పసివాడు.. కుమారుడితో సహా భవనంపై నుంచి దూకిన మహిళ
సాక్షి, చిలకలగూడ: వరకట్న వేధింపులు భరించలేక గృహిణి ఏడాది వయసున్న తన కుమారునితో సహా భవనం పైనుంచి దూకింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. నార్త్జోన్ డీసీపీ చందన దీప్తి, గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి సఫిల్గూడకు చెందిన దివ్యతేజకు, మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్కు 2018 సెప్టెంబర్ 6న వివాహమైంది. ఈ దంపతులకు గతేడాది మార్చి 3న రిత్విక్ జన్మించాడు. ఈ క్రమంలో మహేందర్తో పాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం దివ్యతేజను వేధిస్తున్నారు. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె సోమవారం ఉదయం తన కుమారునితో కలిసి ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి చేరుకుంది. శానిటైజర్ను కుమారునికి తాగించి, తానూ తాగింది. కుమారుని చేతి మణికట్టు, మెడపై కోసి తానూ కోసుకుంది. రక్తస్రావం అవుతుండగా చిన్నారిని పట్టుకుని భవనం పైనుంచి కిందికి దూకింది. చదవండి: హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల! రోడ్డుపై పడిన చిన్నారి రిత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పార్కింగ్ చేసిన వాహనంపై పడిన దివ్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మీదాస్, తరుణ లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేందర్తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపారు. చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే? -
హైదరాబాద్: మహిళలపై వేధింపులు తగ్గట్లే!
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో సైబరాబాద్ షీ టీమ్కు 256 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా వాట్సాప్ ద్వారా 214 ఫిర్యాదులు అందగా.. భౌతికంగా 22, ట్విట్టర్ ద్వారా 3, హ్యాక్ ఐలో 8, ఈ–మెయిల్ ద్వారా 2, హెచ్ఓడీ ద్వారా ఏడు ఫిర్యా దులు వచ్చాయి. 55 ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. వీటిల్లో 14 క్రిమినల్ కేసులు, 41 పెట్టీ కేసులున్నాయి. ఫోన్ వేధింపులే ఎక్కువ.. సామాజిక మాధ్యమాల ద్వారా లేదా తెలిసిన వ్యక్తుల ద్వారా మహిళల నెంబర్లను సేకరించి ఫోన్లో వేధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో సైబరాబాద్ పరిధిలో 103 ఫిర్యాదులు ఈ తరహావే ఉండటం గమనార్హం. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఘటనలో 17 ఫిర్యాదులు, సోషల్ మీడియాలో వేధింపులు 32, వెంబడిస్తూ వేధించే కేసులు 22, అసభ్య ప్రవర్తన 11, బ్లాక్మెయిలింగ్ 25 కేసులు వంటి ఫిర్యాదులున్నాయి. మహిళలను వేధిస్తున్న పోకిరీలలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. గత రెండు నెలల్లో పట్టుబడిన 144 మంది ఆకతాయిలలో 53 మంది మైనర్లే ఉండటం గమనార్హం. 52 మంది 19–24 మధ్య వయస్సున్న వాళ్లు, 34 మంది 25–35 ఏళ్లు, 5 మంది 36–50 ఏళ్ల వయసు ఉన్నవాళ్లున్నారు. ఫోన్లో వార్నింగ్.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో సైబరాబాద్ పరిధిలోని బస్ స్టాప్లు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, ట్యుటోరియల్స్, కాలేజీ వంటి పలు ప్రాంతాలలో 975 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. 70 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా.. వీటిల్లో 44 పెట్టీ కేసులు బుక్ చేశారు. మిగిలిన పోకిరీలను కౌన్సిలింగ్కు పంపించారు. గడిచిన రెండు నెలల్లో 622 అవగాహన సదస్సులు నిర్వహించగా.. 8,851 మంది పాల్గొన్నారు. 112 మంది పోకిరీలకు ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. -
భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో..
సాక్షి, కుషాయిగూడ: అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక బీదర్కు చెందిన మచ్ఛీంద్రా రాథోడ్, కుటుంబ సభ్యులతో కలిసి ఏడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏఎస్రావునగర్, సాయినాథపురంలో నివాసముంటూ స్వీట్కాన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ప్రియాంక జాదవ్ (20)ఉన్నారు. కూతురికి 2020 మార్చిలో ఏఎస్రావునగర్లోనే ఉంటున్న సచిన్జాదవ్తో వివాహం జరిగింది. వారికి 13 నెలల పాప ఉంది. కొంత కాలం సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ భార్యను అనుమానించడం, వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు భరించలేని ప్రియాంక, తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా పలుమార్లు సర్ధి చెప్పినా అ తని తీరు మారలేదు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఈ నెల 20న ప్రియాంక వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. కూ తురుకి మళ్లీ సర్ధిచెప్పి మరుసటి రోజు సోదరుడు సంతోష్తో కలిసి ప్రియాంకను అత్తరింటికి పంపించారు. వారిని చూసిన సచిన్ దురుసుగా ప్రవర్తించాడు. కాసేపటి తర్వాత సంతోష్ ఇంటికెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఒంటరిగా ఎందుకు వదిలివచ్చావని, చిన్న కొడుకు సందీప్ను కూతురు ఇంటికి పంపించాడు. సందీప్ అక్కడికి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎంతకీ తీయకపోవడంతో కిటికీ లోంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమ.. మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి.. మనోవేదనకు గురై.. అల్వాల్: మానసిక ఒత్తిడి, మనోవేదనకు గురై గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ గంగాధర్ వివరాల ప్రకారం.. భూదేవినగర్కు చెందిన రేవతి (28) మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్కు చెందిన కిరణ్తో గతేడాది వివాహం జరిగింది. గత కొంతకాలంగా రేవతి తల్లి లత తలకు తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. ఇటీవల రేవతి భూదేవినగర్లోని తల్లి ఇంటికి వచ్చింది. తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోయి ఒత్తిడి గురైంది. ఈ నెల 20న రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో లోపలికెళ్లి చూడగా రేవతి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
‘నన్ను క్షమించు... మిస్ యూ సో మచ్ లవ్ యూ..’
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): పెళ్లయిన ఆరునెలల నుంచే భర్త అనుమానంతో వేధించడంతో ఓ వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ నిత్యం అనుమానిస్తుండడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దాపూర్లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ గూడూరి సంతోష్ కుమార్ వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(22)ని పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర రమేష్(24)తో ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. తర్వాత రోజూ భర్త అనుమానిస్తుండడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన గోడు చెప్పుకునేది. భర్త నుంచి వేధింపులు ఎక్కవ కావడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు పెద్దాపూర్కు చేరుకొని బోరున విలపించారు. చదవండి: క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి సూసైడ్ లెటర్ కలకలం... ‘‘అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించండి. నా భర్త రమేష్... నాపై అనుమానంతో రోజు నరకం చూపుతున్నాడు. తట్టుకోలేక చనిపోతున్నా. రోజు నా ఫోన్ చెక్ చేయడం చేస్తున్నాడు. అందుకే చనిపోతున్న. అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించు. మిస్ యూ సో మచ్ లవ్ యూ. మీ బుజ్జీ’’. అంటూ లెటర్ ముగించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: ఆస్తి కోసం పేగు బంధాన్ని మరిచిన కూతురు.. కన్న తల్లిని కిరాతకంగా చంపి.. -
డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో
సాక్షి, జవహర్నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడి ఆ ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బీజేఆర్నగర్లో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్నగర్కు చెందిన నవీన్(23) ఫుడ్ డెలివరీ బాయ్. రెండు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇటీవలే యువతికి వారి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న నవీన్ యువతి బంధువులను బెదిరించి యువతి ఇంటిని తగలబెడతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు వారి నానమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల 10న ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఈ నెల 23న యువతి ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు నవీన్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
సార్.. ఎవ్వరినీ వదిలిపెట్టొదు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు!
అత్తింటివారి వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైపోయింది. పెళ్లయిన నెల రోజులకే తనువు చాలించింది. భర్త, అత్తమామల వేధింపులకు నిండు నూరేళ్ల జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. సాక్షి, కడప: జీవితాంతం తోడు నీడగా ఉంటానని పచ్చని పెళ్లిపందిరిలో బాస చేసిన భర్త మాట తప్పాడు. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కడప నగరం నెహ్రూనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి, బంధువుల ఫిర్యాదు మేరకు చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో పద్మజ కుమార్తె ఝాన్సీ(26)కి, రాజంపేట బోయిన పల్లికి చెందిన నల్లు సుబ్రమణ్యం, వెంకటసుబ్బమ్మల కుమారుడు రాధాకృష్ణతో గత నెల 15వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రాధాకృష్ణ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో కట్నకానుకల కింద 15లక్షల రూపాయలు ఇచ్చారు. వివాహమైన రెండవరోజు నుంచే అధిక కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. రూ. 70 లక్షలు ఇస్తేనే సంసారానికి రావాలంటూ ఈనెల 2వ తేదీన అత్తా, మామలు ఝాన్సీని కడపలోని నెహ్రూనగర్లో ఉన్న పుట్టింటిలో వదిలివెళ్లారు. చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో పెద్దమనుషులంతా కలిసి రాజంపేటలోని బోయినపల్లిలో ఉన్న రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పంచాయితీ చేశారు. తనకు రూ. 70 లక్షలు ఇస్తేనే తన భార్యను సంసారానికి తీసుకెళతానని తేల్చిచెప్పాడు. తన వల్ల తల్లి పద్మజ, తమ్ముడు పవన్, కుటుంబ సభ్యులకు అవమానంగా ఉందని భావించిన ఆ యువతి సూసైడ్ నోట్ రాసి, ఇంటిలో ఎవరూ గమనించని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, తమ్ముడు గమనించే సరికి ఫ్యాన్కు వేలాడుతోంది. వెంటనే రిమ్స్కు తరలించారు. కానీ అప్పటికే మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు. సార్.. ఎవ్వరినీ వదిలిపెట్టొదు.. డియర్ పోలీస్ డిపార్ట్మెంట్..ఎవ్వరినీ వదిలిపెట్టొ్టద్దు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు.. వాళ్లు చాలా క్రిమినల్ మైండ్ కలవాళ్లు.. మా తల్లిని, కుటుంబాన్ని రక్షించండి.. పవన్ ( తమ్ముడు) నువ్వు ఏడవద్దు.. మా తల్లికి, తమ్ముడికి భవిష్యత్తులో ఆపద వస్తే అది రాధాకృష్ణ వల్లనే... అంటూ సూసైడ్ నోట్లో రాసి ఉంది. అలాగే నా భర్త రాధాకృష్ణకు నేను అడ్డుగా ఉన్నా.. ఇప్పుడు తొలగిపోతున్నా... నువ్వు మీ చెల్లెళ్లను చూసుకో.. హ్యాపీగా ఉండు.. అని భర్తను ఉద్దేశించి కూడా రాసింది. సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిమ్స్ మార్చురీలోని మృతదేహాన్ని కడప డీఎస్పీ సునీల్ పరిశీలించారు. చిన్నచౌక్ సీఐ కె.అశోక్రెడ్డి, ఎస్ఐ అమర్నాథ్రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వరకట్న చావు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌక్ సీఐ అశోక్రెడ్డి తెలిపారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. -
ట్యూషన్లో పరిచయం, ఇన్స్ట్రాలో ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఆపై!
సాక్షి,నాగోలు: యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫిల్గూడకు చెందిన ముముడి సాయిమాధవ్(19) విద్యార్థి. బాధితురాలు ట్యూషన్లో పరిచయం కావడంతో ఇన్స్ట్రాగామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ తర్వాత ఆమె అంగీకిరించింది. కొంత కాలం ఆమెతో మామూలుగా చాట్ చేసేవాడు. అతని విచిత్ర ప్రవర్తన కారణంగా కొంత కాలం తర్వాత అతడిని బ్లాక్ చేసింది. దీంతో నిందిడుతు ఆమెపై పగ పెంచుకున్నాడు. బాధితురాలి మొబైల్ నంబర్ను పోర్న్ వెబ్సైట్లో పెట్టి కాల్గర్ల్గా అప్లోడ్ చేశాడు. వెంటనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పెట్టుబడి పెడితే డబుల్ రిటర్న్స్ అంటూ మోసం సాక్షి,నాగోలు: ఆన్లైన్ పెట్టుబడులు పెడితే ఎక్కవ డబ్బులు వస్తాయని నిమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్భగవత్ వివరాలు వెల్లడించారు. నేపాల్, ఖాట్మండుకు చెందిన తారా బహదూర్ (33) న్యూఢిల్లీ వచ్చి పాండవ్నగర్, లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో నివాసం ఉంటూ ట్రావెల్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. తరువాత తన స్నేహితుల ద్వారా సైబర్ మోసాల గురించి తెలుసుకున్నాడు. నిందితుడు తారా బహదూర్, వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్భగవత్ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫాంలో ఖాతాలు సృష్టించి ఇన్వెస్టిమెంట్, డబుల్ రిటరŠన్స్ అంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. యూరోషియాకు చెందిన వ్యక్తిగా ఆన్లైన్లో నమ్మించేవాడు. తక్కవ పెట్టుబడిపై వారు చెప్పినట్లుగా రూ.వెయ్యి, రూ.500 తిరిగి డబుల్ రిటరŠన్స్ ఇచ్చి పలువురిని నమ్మించాడు. ఎక్కువ పెట్టుబడి పెట్టినా డబుల్ రిటర్న్స్ అంటూ నమ్మించి డబ్బులు కాజేశాడు. కొత్త మంది ఏజెంట్ల సాయంతో సిమ్కార్డులు తీసుకుని తరుచు సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఆధార్, పాన్కార్డులు, రెండు సిమ్కార్డులు, కోటక్ మహీంద్ర బ్యాంక్లో ఉన్న రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్, సీఐ వెంకటేష్ పాల్గొన్నారు. -
ఆసుపత్రిలో నర్సును లైంగికంగా వేధించిన డాక్టర్..
సాక్షి, కోరుట్ల(జగిత్యాల): ప్రజలను ఆరోగ్యంవంతులను చేసి కాపాడాల్సిన డాక్టరే సాటి నర్సుపట్ల కామాంధుడిగా వ్యవహరించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన, స్థానిక శ్రీలక్ష్మీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కాగా, సదరు వైద్యుడు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సును లైంగికంగా వేధించినందుకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. ఆసుపత్రి వైద్యుడు రాజేశ్ తనను లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యుడు రాజేశ్ లైంగిక వేధింపుల చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పూటుగా మద్యం తాగి.. క్యాబ్ నడిపిస్తున్న యువతిపై..
సాక్షి, బంజారాహిల్స్: షీక్యాబ్స్ నడిపిస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. లంగర్హౌజ్లో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్వ్యాపారి మోటా రమణ(55) ఆదివారం సాయంత్రం జీడిమెట్ల సమీపంలోని గాజులరామారంలో విందుకు హాజరయ్యాడు. అక్కడ పూటుగా మద్యం తాగిన రమణ ఇంటికి వెళ్లేందుకు ఉమెన్ ఆన్ వీల్స్ క్యాబ్ను బుక్ చేసుకున్నాడు. క్యాబ్ నడిపిస్తున్న యువతి (32)ని దారిపొడవునా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సరిగ్గా బంజారాహిల్స్ రోడ్ నెం–1 చేరుకోగానే ఆమె రమణ చేష్టలు భరించలేక రాత్రి 9.45 ప్రాంతంలో డయల్ 100కు ఫోన్ చేసింది. అప్రమత్తమైన బంజారాహిల్స్ పెట్రోలింగ్ పోలీసులు క్షణాల్లోనే బంజారాహిల్స్ రోడ్ నెం–12 చౌరస్తా సమీపానికి వచ్చి క్యాబ్ను ఆపడంతో పాటు ఆమెకు భద్రత కల్పించారు. నిందితుడు రమణను అరెస్టు చేసి బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు దర్యాప్తు అధికారి ఎస్ఐ కె.ఉదయ్ తెలిపారు. -
చనువుగా ఫోటోలు, వీడియో కాల్స్.. కట్ చేస్తే..
సాక్షి, పటాన్చెరు టౌన్: అమాయకులైన ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకొని వారి ఫోన్ నంబర్లు తీసుకొని పరిచయాలు పెంచుకున్నాడు ఓ యువకుడు. అనంతరం వారితో చనువుగా ఫోన్లో సెల్ఫీలు దిగుతూ మీ భర్తలకు పంపుతాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఇలానే ఓ మహిళ దగ్గర నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి బెదిరిస్తుండగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు రెడ్డి కథనం మేరకు.. అమీన్పూర్కు చెందిన ఎండీ అక్రమ్ బిన్ అహ్మద్ అలియాస్ అక్రం ఖాన్ (23) పాలిటెక్నిక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి అమాయాకులైన ఆడవారిని ఆసరాగా చేసుకొని ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. వారితో పరిచయం పెంచుకొని ఫోన్లో చాట్ చేసి వీడియో కాల్స్ మాట్లాడుతూ లోబర్చుకునేవాడు. ఆపై తను చెప్పిన చోటుకు పిలిచి దగ్గరగా సెల్ఫీలు తీసుకునేవాడు. వారు వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్ షాట్లు తీసి వాటిని తల్లిదండ్రులు, భర్తలకు పంపుతా అని బెదిరించసాగాడు. చాలా మందితో ఇలానే ప్రవర్తించాడు. ఇలాగే ఓ మహిళతో పరిచయం పెంచుకొని లోబర్చుకున్నాడు. ఆపై భర్తకు చెబుతానని బెదిరించి ఆమె నుంచి రూ.18 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఇంకా బెదిరిస్తున్న క్రమంలో భరించలేని మహిళ శుక్రవారం అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే అక్రమ్ బిన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మహిళలు సోషల్ మీడియాలో అపరిచుతులతో మాట్లాడకూడదని, ఫొటోలు, ఫోన్ నంబర్లు పెట్టకూడదన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
కోవిడ్–19: మహిళలపై తీవ్రమైన వేధింపులు
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన విలయ తాండవం మహిళలపై మరో కోణంలో ప్రభావం చూపింది. లాక్డౌన్ కాలంలో మహిళలపై తీవ్రతరమైన హింస ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో శారీరక లేదా లైంగిక హింసకు గురైనట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా అధ్యయనం వెల్లడించింది. మహిళలపై హింసకు సంబంధించి అతిపెద్ద అధ్యయనం ఇదేనని తెలిపింది. మూడొంతుల మంది మహిళలు 20 ఏళ్ళు వచ్చేసరికి పరిచయస్తుడైన ఎవరో ఒక వ్యక్తి చేతిలో లైంగిక హింసకు గురవుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పెరిగిన గృహ హింస కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతో, ఆ సమయంలో మహిళలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఫలితంగా వారిపై హింస మరింత తీవ్రతరమైనట్టు డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం గుర్తించింది. మహిళలపై హింస విషయంలో అన్ని దేశాలూ ఒక్కటే అయినా తరతమ స్థాయిల్లో తేడా ఉంటుంది అంతే. స్త్రీలపై హింస అన్నిదేశాల్లోనూ ఉంది. ఇది లక్షలాది మంది మహిళలకు, వారి కుటుంబాలకు తీరని హాని కలిగిస్తోంది. వారి జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా మహిళలపై హింస మరింత పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియేసస్ చెప్పారు. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు సమస్య పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం నొక్కి చెపుతోందని అన్నారు. 15 ఏళ్ల వయసులోనే.. 2013 తరువాత డబ్ల్యూహెచ్ఓ తొలిసారిగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ఇటు జీవిత భాగస్వాముల చేతిలో స్త్రీలు హింసకు గురవుతున్నారని, అంతేకాకుండా పరిచయస్తులు కాని పురుషుల చేతిలోనూ లైంగిక హింసకు గురవుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 73.6 కోట్ల మంది మహిళలు, బాలికలు తమ 15 ఏళ్ల వయస్సులోనే, పైన చెప్పుకున్న కనీసం ఏదైనా ఒక రకమైన హింసకు గురవుతున్నట్టు అధ్యయనంలో వెల్లడయ్యింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు సన్నిహిత భాగస్వామి హింసను, పరిచయస్తులు కాని వారి చేతిలో లైంగిక íß హింసను ఎదుర్కొంటున్నారు’’ అని డబ్ల్యూహెచ్లోని సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ రీసెర్చ్ యూనిట్ డాక్టర్ క్లౌడియా గార్సియా–మొరేనో తెలిపారు. దేశాల మధ్య హింసలో తేడా తక్కువ ఆదాయ దేశాల్లోని మహిళలు, తక్కువ మధ్య ఆదాయ దేశాల్లోని మహిళలపై ఈ హింస ప్రభావం ఒకేలా లేదని ఈ అధ్యయనంలో గుర్తించారు. కొన్ని దేశాల్లో సగం మంది మహిళలపై ఈ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ మధ్య వయస్సు వారిపై సమీప భాగస్వామి చేతిలో హింస ప్రభావం ఎక్కువగా ఉంది. -
51 ఏళ్ళ వ్యక్తి..100 మంది మహిళలను వేధించాడు!
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటుచేసుకొంది. మహిళలను, బాలికలనే టార్గెట్గా చేసుకొని లైంగికంగా వేధిస్తున్నఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూపీలోని ఔరియా జిల్లాకు చెందిన 51 ఏళ్ళ రాజేష్ మహిళలను లైంగికంగా వేధించేవాడు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది మహిళలు ఇతని బారిన పడ్డారని లక్నో పోలీసుల విచారణలో బయటపడింది. ఈమేరకు నిందితుడు రాజేష్ను ఔరియా పోలీసులు అరెస్టు చేశారు. ఇతని దగ్గర నుంచి రెండు ఫోన్లు, సిమ్ కార్డ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు సంచలనాత్మక విషయాలను రాబట్టారు. కాగా, ఇతనికి 200 మంది మహిళలతో పరిచయాలున్నట్లు పోలీసుల విచారణలో రాజేష్ తెలిపాడు. మొదట బాలికలు, మహిళలతో పరిచయం పెంచుకొని ఆతర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఆగకుండా వీరికి అశ్లీలఫోటోలు, మెస్సెజ్లను పంపి పైశాచికానందం పొందేవాడు. కాగా, ఇతనిపై యూపీ వ్యాప్తంగా 66 కేసులు నమోదయ్యాయని ఔరియా పోలీసు అధికారి అపర్ణ గౌతమ్ పోలీసులు తెలిపారు. ఇతనిపై తొలి వేధింపులు కేసు 2018లోను వెలుగులోకి వచ్చిందని..అయితే అప్పట్లో కేసు నమోదు చేసుకున్నలక్నో ఉమెన్ పవర్లైన్ పోలీసులు, నిందితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికి రాజేష్ తీరుమార్చుకోలేదు. కాగా, నిందితుడిపై పోక్సోచట్టం, పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసుకున్న లక్నోపోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి -
మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు నెల రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త సాయి ప్రణీత్ మృతి చెందగా..భార్య విజయ పరిస్థితి విషమంగా ఉంది. కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్(22), విజయ(18) కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. అమ్మాయి తల్లి సావిత్రి నెల రోజుల క్రితం ఇద్దరికీ ఓ గుడిలో పెళ్లి చేసింది. కొన్ని రోజుల పాటు అమ్మాయి తల్లి ఇంట్లో ఉన్న జంటకు వేధింపులు ఎక్కువయ్యాయి. అమ్మాయి తల్లి కూతురిని అల్లుడిని వేధిస్తుండటంతో అబ్బాయి తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం అత్త అక్కడికి సైతం వచ్చి గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ పురుగుల మందు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న జంటను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అబ్బాయ సాయి ప్రణీత్ మృతి చెందాడు. విజయ పరిస్థితి విషమంగా ఉంది.. తన ఆత్మహత్యకు అత్త వేధింపులు కారణం అని సూసైడ్ నోట్ ఇంట్లో లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మచెందర్ రెడ్డి తెలిపారు. చదవండి: పహాడీషరీఫ్లో ఆటో డ్రైవర్ ఘాతుకం ఇదిలా ఉండగా తమ చావుకు అమ్మనే కారణమని విజయ సూసైడ్ లెటర్లో పేర్కొంది. అమ్మ పెట్టే బాధలు భరించలేకే చావడానికి సిద్ధపడుతున్నట్లు వెల్లడించింది. ‘పెళ్లి అయినప్పటి నుంచి అమ్మ వేధింపులకు గురి చేస్తోంది. నాతోపాటు నా భర్తను కూడా ఇబ్బందులు పెడుతోంది. మా అత్తమామలపై కూడా కేసు పెడతామని బెదిరిస్తున్నారు. నన్ను కొడుతున్నారు. మా చావుకు కారణమైన అమ్మను జీవితంలో క్షమించను. ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాను. ఇంకో జన్మంటూ ఉంటే నీ కూతురిగా పుట్టొద్దని దేవుడిని కోరుకుంటున్నా’ అని విజయ లేఖ రాసింది. -
మహిళ ఆత్మహత్య; అత్తారింటిపై 5 పేజీల లేఖ
సాక్షి, నెల్లూరు : చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామంలో శనివారం విషాదం అలుముకుంది. అత్తారింటి వేధింపులు భరించలేక సునీత అనే 28 సంవత్సరాల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తలూరు సమీపంలో చెక్ డ్యాంలో దూకి అర్థాంతరంగా తనువు చాలించింది. అయితే అత్తారింటి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సునీత తన డైరీలో అయిదు పేజీల లేఖ రాసింది. చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య -
సూసైడ్ నోట్: నా చావుకు వారే కారణం..!
సాక్షి, నర్సంపేట రూరల్ : ఎక్సైజ్ పోలీసులు, వైన్స్ యజమాని వేధిస్తున్నారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జేబులో సూసైడ్ నోట్ లభించడంతో మృతదేహంతో ఎక్సైజ్ స్టేషన్ ఎదుట కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు, ఎక్సైజ్ అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన ఊడ్గుల రాజమల్లు(52) వికలాంగుడు కావడంతో గౌడ వృత్తి చేయలేక కిరాణం షాపు అందులోనే బెల్టుషాపు నడిపిస్తున్నాడు. చెన్నారావుపేటలోని వైన్స్ నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముకునేవాడు. కోవిడ్ మొదలైనప్పుడు లాక్డౌన్ విధించగా, అధికారులు తనిఖీలు చేపట్టి రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మద్యాన్ని తిరిగి ఇప్పిస్తానని ఒకరు నమ్మబలికినట్లు తెలుస్తుండగా, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కానరాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమల్లు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమల్లు మృతదేహం అయితే ఆయన చొక్కా జేబులో సూసైట్ నోట్ను కుటుంబీకులు గుర్తించారు. నా చావుకు కారణం ఎక్సైజ్ ఎస్సై, సీఐ గారు మరియు చెన్నారావుపేట బ్రాండీ షాప్ యాజమాని కృష్ణారెడ్డి గారు కారణం. వీరి మధ్యల ఇబ్బంది పడ్డాను అని ఉండడంతో ఆయన మృతదేహాన్ని తీసుకుని నర్సంపేటలోని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట వేసి ధర్నాకు దిగారు. సుమారు ఐదుగంటల పాటు ధర్నా కొనసాగగా, వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, నర్సంపేట ఏసీపీ ఫణీందర్ చేరుకుని బాధిత కుటుంబంతో చర్చించారు. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాజమల్లు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ ఎస్సై, సీఐ, కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాసాగర్రెడ్డి తెలిపారు. ఈ అంశంపై నర్సంపేట ఎక్సైజ్ సీఐ శశికుమారిని వివరణ కోరగా లాక్డౌన్ సమయంలో రూ.2వేల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామే తప్ప ఆయనను తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసుపై పోలీసులతో పాటు తమ శాఖ తరఫున పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. -
క్యాస్టింగ్ కౌచ్: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా!
ఏడాది క్రితం ఇండియాలో మొదలైన మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఎంతో మంది మహిళలు ఇంకా ఇలాంటి అమానుషాన్నిఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు బాలీవుట్ నటి మాన్వీ గాగ్రీ. ధూమ్ మచావో ధూమ్ టెలివిజన్ షోతో కెరీర్ ప్రారంభించిన మాన్వీ.. ట్రిప్లింగ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వంటి వెబ్ సిరీస్లో నటించారు. హిందీ సినిమాలతోపాటు సీరియల్స్లోనూ నటించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్లో పనిచేయానికి నిర్మాత నుంచి ఆఫర్ వచ్చిందని, ఆ సమయంలో నిర్మాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించారు. అతని నుంచి లైంగిక వేధింపులు ఎదర్కొన్నానని పేర్కొన్నారు. ఇక గతంలోనూ మాన్వీ తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. ఓ ఆడిషన్కు వెళ్లినప్పుడు అత్యాచార సన్నివేశంలో నటించమని అడిగారని, దాంతో బయపడి అక్కడి నుంచి పరుగులు తీశానని ఆమె తెలిపారు. (ఈ మేలు మర్చిపోము: ట్రంప్ ) ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏడాది క్రితం ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వెబ్ సిరీస్ చేస్తున్నామని, అందులో నన్ను నటించాలని కోరారు. అలాగే నీ బడ్జెట్ ఎంత అని నన్ను అడిగారు. దానికి నేను.. ఇప్పుడే బడ్జెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ముందు మీరు కథ చెప్పండి. నాకు నచ్చితే అన్నింటి గురించి చర్చిద్దామన్నాను. అయినప్పటికీ నా మాటలు పట్టించుకోకుండా.. లేదు మీకు మేము ఇంత బడ్జెట్ను ఇవ్వాలనుకుంటున్నామని చెప్పాడు. అయితే అది చాలా తక్కువ అని చెప్పడంతో అతను వెంటనే దాన్ని మూడు రేట్లు పెంచాడు. అంతేకాకుండా నువ్వు కావాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ ఇస్తా.. కానీ రాజీపడాలని కోరాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇక్కడైతే బతికిపోయేవాడు) ‘ఆ మాటలు విని షాక్ అయ్యాను. కాంప్రమైజ్ అనే మాట దాదాపు 7, 8 సంవత్సరాల తర్వాత విన్నాను. కోపంతో వెంటనే అతని తిట్టడం ప్రారంభించాను. ఫోన్ కట్ చేయి.. నీకు ఎంత ధైర్యం.. నీ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదించాను’ అని మాన్వీ చెప్పుకొచ్చారు. కాగా ఓ వైపు మీటు పేరుతో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా.. ఇంకా ఇలాంటివి ఎలా జరుగుతున్నాయో ఆశ్యర్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు. (వేషం ఉంది.. టాప్ తీసెయ్ అన్నాడు -
ఉదయం 2 గంటలకు ఫోన్ చేసింది.. కానీ
చండీగఢ్ : ఇంటి యాజమాని వేధింపులతో విసుగు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గురాగ్రామ్లో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్కు చెందిన మిస్తు సర్కార్. స్పైస్ జెట్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా విధులు నిర్వర్తిస్తూ గురుగ్రామ్లోని ఓ ఇంట్లో పెయింగ్ గెస్ట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్ తరచూ వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన యువతి మంగళవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్ను ఉరేసుకొని మరణించింది. బాధితురాలి తండ్రి హవాలు చందర్ సర్కార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురును యాజమాని మానసికంగా వేధిస్తున్నాడని, తన చావుకు యాజమానే కారణామని.. అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా కూతురు మంగళవారం ఉదయం 2 గంటలకు కాల్ చేసింది. తన ఇంటి ఓనర్ అమరిందర్ సింగ్ తరచూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అదే రాత్రి తిరిగి ఇంటికి వచ్చినప్పడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడని చెప్పింది. నాతో ఫోన్ మాట్లాడుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. తన మొబైల్ను హ్యాక్ చేశాడని, ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదని నాతో చెప్పి ఫోన్ కట్ చేసింది. తర్వాత కొంత సమయానికి సింగ్ తనకు నా కూతురు ఏదో ఆఘాయిత్యానికి పాల్పడిందని సమాచారం ఇచ్చాడు. ఏం జరిగిందని అడిగితే సమాధానం చెప్పలేదు. నేను వెంటనే గురుగ్రామ్ పోలీసులను సంప్రదించి విచారణ జరిపించాలని కోరాను’ అని పేర్కొన్నాడు. కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా యువతి ఫ్యాన్కు ఉరేసుకొని విగతా జీవిగా పడి ఉంది. అయితే యువతి వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇంటి యాజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
ఆమెను నేను ప్రేమించా.. నువ్వెలా చేసుకుంటావ్?
సాక్షి, బంజారాహిల్స్ : ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో అతను తట్టుకోలేకపోయాడు. అతని అడ్డు తొలగిస్తే తాను పెళ్లి చేసుకోవచ్చని మిత్రుడితో కలిసి అతనిపై దాడిచేశారు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్లో నివసించే గోపాల్(22) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న యువతి(19) జూబ్లీహిల్స్లోని ఓ మెడికల్ షాపులో ఫార్మాసిస్టుగా పనిచేస్తోంది. కొంతకాలంగా గోపాల్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహంగానే ఉన్నారు. అయితే ఆ యువతికి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి కుదిర్చారు. మరో నాలుగు నెలల్లో పెళ్లి జరపాలని తీర్మానించారు. దీనిని గోపాల్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ప్రేమించిన యువతి మరొకరికి దక్కకూడదని రోజూ ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. కాబోయే భర్తను బెదిరించి అడ్డు తొలగిస్తే యువతి దక్కుతుందని జూబ్లీహిల్స్ దుర్గాభవాని నగర్లో నివసించే ఫుడ్ డెలివరీ బాయ్ అయిన తన స్నేహితుడు జీవన్(22)తో పథకం వేశాడు. ఇందులో భాగంగా యువతికి కాబోయే భర్తను కిడ్నాప్ చేసి బెదిరించి పెళ్లి వద్దనే విధంగా హెచ్చరించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి మద్యం తాగిన గోపాల్ దుర్గాభవానినగర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వేచివున్నాడు. పథకం ప్రకారం జీవన్ ఆ యువతికి కాబోయే భర్తను వెంటాడుతూ ఓ చోట లిఫ్ట్ కావాలని అడిగి నేరుగా తన స్నేహితుడు గోపాల్ ఉన్న చోటుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి అతనిని పిడిగుద్దులతో బాదారు. నా లవర్ను నువ్వెలా పెళ్లి చేసుకుంటావంటూ దాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటపడి కాలర్ పట్టుకుని ఆమెను వదిలేయకపోతే అంతు చూస్తానంటూ హెచ్చరించారు. వారి నుంచి తప్పించుకుని బాధితుడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న గోపాల్, జీవన్లను అర్థరాత్రి అరెస్టు చేశారు. వీరిపై 70(సీ) కింద కేసు నమోదు చేసి సోమవారం ఉదయం నాంపల్లి పదవ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులు ఇద్దరికీ మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
అత్యాచార నిందితుడి అరెస్టు
సాక్షి యాలాల(హైదరాబాద్) : జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కిందట కేసు నమోదుతో పాటు అత్యాచార కేసును నమోదు చేసినట్లు చెప్పారు. యాలాల ఎస్ఐ విఠల్రెడ్డితో కలిసి విశ్వనాథ్పూర్ గ్రామంలో బాధిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన అనంతరం జరిగిన పరిణామాలను బాధితురాలి తల్లిని అడిగి తెలుసుకున్నారు. సమాజానికి చీడగా మారిన ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మతిస్థితిమితం లేని బాలికపై నక్కల శేఖర్ అత్యాచారం చేసిన ఘటనతో గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని పలువురు గ్రామస్తులు పోలీసుల ఎదుట వాపోయారు. నిందితుడి కుటుంబసభ్యులు తమ ఇంటి వద్ద మారణా యుధాలతో సంచరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ నిందితుడి కుటుంబసభ్యులు దౌర్జన్యానికి పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. నిందితుడికి కోర్టులో కఠినశిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. త్వరలో గ్రామంలో పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. నిందితుడు శేఖర్ను బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట సర్పంచ్ సత్యమ్మ, వైస్ ఎంపీపీ పసుల రమేశ్ ఉన్నారు. -
చిన్నారిపై వృద్ధుడి లైంగికదాడి
సాక్షి, మందస (శ్రీకాకుళం) : అభం శుభం తెలియని ఆ చిన్నారి(6)కి తాత వయసులో జోల పాటలతో మురిపించాల్సిన ఓ వృద్ధుడు తన పెద్దరికానికే మచ్చ తెచ్చాడు. చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అకృత్యం తెలుసుకోలేని బాధిత బాలిక బాధను గుర్తించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోంపేట సీఐ కే శ్రీనివాసరావు, మందస ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ వివరాల మేరకు... మందస మండలం భైరిసారంగపురం గ్రామంలో బాధితురాలి తండ్రి ఓ టైలర్ వద్ద సహాయకునిగా, జీడిపిక్కల ఫ్యాక్టరీలో తల్లి కూలీగా పని చేస్తున్నారు. వీరి కుమార్తె స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. వీరికి సమీపంలో నివాసముంటున్న గొరకల రుషి(62) ఈ నెల 18న చిన్నారి తల్లిదండ్రులు లేని సమయంలో చాకెట్లు, బిస్కట్లు ఇస్తానని ఆశపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి బాధనకు తల్లికి చెప్పడంతో పలాసలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయట పడింది. చిన్నారి విషయం చెప్పడంతో కుటుంబం పరువు పోతుందని తొలుత భావించిన ఆ కుటుంబం చివరకు పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లింది. పెద్ద మనుషులు ప్రశ్నించగా నిందితుడు తప్పును అంగీకరించి, నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పెద్దల సూచన మేరకు మందస పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. సీఐ, ఎస్ఐలు బుధవారం గ్రామానికి చేరుకుని, పెద్దలతో చర్చించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధిత చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం పలాస లేదా, శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తామన్నారు. ఈ కేసు విచారణలో ఏఎస్ఐ రెల్ల కూర్మారావు, సోంపేట హెచ్సీ అరుణ్కుమార్, ఎం కోదండరావు, రామ్మోహనరావు, సూర్యనారాయణ, సంతోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రుషిపై పోక్సోచట్టం, ఐపీసీ 376 ఏ, బీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు సోంపేట సీఐ కే శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు లైంగిక దాడి కేసులో నిందితుడు రుషిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈయన గుడ్డిభద్రలో తన బంధువుల ఇంట్లో దాగున్నట్లు తెలిసింది. గురువారం కోర్టులో హాజరు పరిచే అవకాశమున్నట్టు సమాచారం. -
మరో సమిధ
మానవమృగాల ఆకృత్యాలకు అడ్డులేకుండా పోతోంది. నడక నేర్వని చిన్నారుల నుంచి పండు ముసలమ్మల వరకు బలవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా.. కఠిన శిక్షలు పడుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు ప్రవీణ్కు ఉరిశిక్ష పడి ఐదు రోజులు కూడా గడవక ముందే నగరంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల బాలికపై ముగ్గురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అవమాన భారం తట్టుకోలేక బాధితురాలు ఉసురు తీసుకుంది. – భీమారం సాక్షి, భీమారం(వరంగల్) : తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికపై కామాంధులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వరంగల్ నగరంలోని సమ్మయ్యనగరలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. నగరంలోని సమ్మయ్యనగర్కు చెందిన సిరిగిరి వెన్నెల(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి సారంగం మృతి చెందగా, తల్లి మరో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వెన్నెల పోషణ భారం నాన్నమ్మ చూసుకుంటోంది. బైక్పై తీసుకెళ్లి.. శనివారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో బైక్పై వచ్చిన ఓ యువకుడు ఓ చిన్నబాలుడిని ఇంటికి పంపి వెన్నెలను బయటకు పిలిచాడు. ఆ తర్వాత దగ్గరకు వెళ్లగానే బలవంతంగా బైక్పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వెన్నెల అపస్మారస్థితికి చేరుకుంది. రాత్రి సమయంలో మెలకువ వచ్చిన తర్వాత ఏం జరిగిందని వెన్నెల నానమ్మ అడగ్గా.. కొందరు మామిడి తోటకు తీసుకెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పాడు చేశారని విలపిస్తూ చెప్పిందని బాధితురాలి నానమ్మ వివరించింది. అవమానం భరించలేక ఆత్మహత్య ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బాలిక నానమ్మ పాల ప్యాకెట్కు బయటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి వెన్నెల చీరతో ఉరివేసుకుని విగతజీ విగా మారింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై హరికృష్ణ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. వెన్నెల ఆత్మహత్యకు దారితీసి కారణాలపై ఆరా తీశారు. శనివారం ఇంటికి ఓ యువకుడు వచ్చి విషయాన్ని నానమ్మ వివరించింది. ప్రతిరోజు కొన్ని ఫోన్ నంబ ర్లతో కాల్స్ వచ్చేవని తెలపడంతో ఎస్సై ఆ నంబ ర్లకు ఫోన్ చేశారు. అనంతరం పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కూడా నిందితుల నుంచి ఫోన్ ఇదిలా ఉండగా, ఆ యువకులు ఆదివారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో వెన్నెలకు ఫోన్ చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. రాత్రి కూడా ఫోన్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ.. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీధర్, పోలీస్ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాత్రి వేళ పోస్ట్మార్టం వెన్నెల మృతదేహానికి ఆదివారం రాత్రి పోస్ట్మార్టం నిర్వహించారు. రాత్రి 7.30 గంటల ప్రారంభమైన పోస్ట్మార్టమ్ రాత్రి 9.10 వరకు సాగింది. కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వినయ్ పరామర్శ మృతురాలి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే వినయభాస్కర్ పరామర్శించారు. సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు వరంగల్ క్రైం: కాకతీయ యూనివర్సీటి పోలీసు స్టేషన్ పరిధి సమ్మయ్యనగర్కు చెందిన మైనార్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సరస్వతీ నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక తనతో చదివే బాలుడితో ఈనెల 10నద్విచక్ర వాహనం అంబాల రూట్లో వెళ్లినట్లు తెలిపారు. మార్గ మధ్యలో మరో యువకుడు తిరుపతి అదే వాహనంపై కలిసి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు సీపీ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెదిరిన బట్టలతో బాలిక ఇంటికి రావడంతో కంగారుపడిన నాయనమ్మ విచారించగా తనతో చదువుకునే హసనపర్తి మండలం పెంబర్తికి చెందిన మైనర్ బాలుడుతో పాటు మరో యువకుడు గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు నాయనమ్మకు వివరించినట్లు సీపీ వివరించారు. ఆదివారం ఉదయం పాల కోసం బయటకు వెల్లిన నాయనమ్మ ఇంటికి వచ్చేసరికి బాధితురాలు ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకుందని సీపీ తెలిపారు. మృతురాలి నాయనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వివరించారు. -
మంట కలిసిన మానవత్వం..
బయ్యారం(వరంగల్) : కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు ఇంట్లో నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిని లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజుమాదిరిగానే శనివారం రాత్రి మానసిక వికలాంగురాలు(20) తల్లిపక్కనే నిద్రిస్తోంది. ఈ క్రమంలో మండలంలోని జగ్నాతండాకు చెందిన ఇస్లావత్ రవి మద్యం మత్తులో వచ్చి వికలాంగురాలి నోటిని చేతితో మూసివేసి లాక్కెళ్లాడు. కొంత సమయం తర్వాత పక్కన కూతరు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లి పక్కనే నిద్రిస్తున్న కొడుకును లేపింది. ఇంటి పక్కల వారితో కలిసి వెతుకుతుండగా బయట లైంగికదాడికి పాల్పడిన రవి గమనించి తన మోపెడ్ను అక్కడే వదిలి పారిపోయాడు. గాయాలతో ఉన్న బాధితురాలిని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామంధుడిపై దాడికి యత్నం.. మానసిక వికలాంగురాలిపై లైంగికదాడికి పాల్పడిన ఇస్లావత్ రవిపై బాధితురాలి బంధువులు దాడికి యత్నించారు. బయ్యారంలో ప్రైవేట్ పంచాయతీకి యత్నిస్తున్న సమయంలో కోపోద్రిక్తులైన వారు దాడిచేయడానికి యత్నించగా రవితో పాటు అతనికి అడ్డుగా వచ్చిన క్రిష్ణ తలకు గాయాలయ్యాయి. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బయ్యారం పోలీసులు లైంగికదాడికి పాల్పడిన ఇస్లావత్ రవిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపట్ల కఠినచర్యలు తీసుకుంటామని గార్ల–బయ్యారం సీఐ రమేష్, ఎస్సై మురళీధర్ హెచ్చరించారు. -
ప్రేమ వేధింపులకు బాలిక బలి
మంచిర్యాలక్రైం: ప్రేమికుని వేధింపులు భరించలేక ఓ బాలిక (17) తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిని బూర్ల రాజయ్య, స్వరూప దంపతుల కూతురు సంధ్యకు అదే గ్రామానికి చెందిన ఎండీ.అక్బర్ కొంతకాలం క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ వెంట పడుతున్నాడు. ఏడాదిన్నర క్రితం సంధ్య సీసీసీ నస్పూర్లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికెళ్లింది. ఆ సమయంలో అక్బర్ సంధ్యను కిడ్నాప్ చేశాడు. ఈ విషయంలో అక్బర్పై సీసీసీ పోలీస్స్టేషన్లో నాన్బెయిలేబుల్ కేసు నమోదైంది. అక్బర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అక్బర్ను మరిచిపోవాలని కుటుంబసభ్యులు సంధ్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మూడు నెలల జైలుశిక్ష అనంతరం బెయిల్పై వచ్చిన అక్బర్.. సంధ్యను వివాహం చేసుకుంటానంటూ మళ్లీ వేధించసాగాడు. అతడి వేధింపులు భరించలేని సంధ్య కుటుంబం ఇటీవల మంచిర్యాలలోని సున్నంబట్టివాడకు మకాం మార్చారు. అయినా అక్బర్ నుంచి వేధింపులు ఆగలేదు. ఇటీవల ఇంటికి వెళ్లి సంధ్యను తానే పెళ్లి చేసుకుంటానని, తనను కాదని ఎవరు చేసుకున్నా వారి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబస భ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తు న్నట్లు మంచి ర్యాల ఎస్సై ఓంకార్యాదవ్ తెలిపారు. -
టాప్ డైరెక్టర్పై లైంగిక ఆరోపణలు.. షాక్లో బాలీవుడ్!
‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్ డైరెక్టర్పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్కి పెద్ద షాకే. -
అక్క మొగుడే కాలయముడు
సాక్షి, కొణిజర్ల (ఖమ్మం): సొంత అక్క భర్తనే ఆమె పాలిట య ముడయ్యాడు. ప్రేమించాలని బావ నిత్యం వేధించి..మానసికంగా నరకం చూయించి..చివరకు కేసు పెడతానని బెదిరించి.. ఆమె ప్రాణం తీసుకునేలా ప్రవర్తించాడు. ఎస్సై చిలువేరు యల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామానికి చెందిన లింగాల భిక్షమయ్యకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు సుష్మకు అదే మండలం సింగరాయపాలెంకు చెందిన మో టపోతుల అశోక్తో వివాహం జరిపారు. ఇతను కొత్తగూడెం క్రైంబ్రాంచ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. గతేడాదికాలంగా అశోక్ తనను ప్రేమించాలని మరదలు లింగాల అనూష (21)ను వేధిస్తున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో గతంలో పెద్దమనుషులతో చెప్పించారు. అయినా కూడా ఆమెను వదిలిపెట్టలేదు. ఆదివారం ఉదయం చిన్నగోపతి వచ్చిన అశోక్ అనూషకు ఇవ్వమని ఓ నోటీస్ను పక్కింటి అమ్మాయితో పంపించాడు. అందులో ఓ వ్యక్తి అనూషకు వ్యతిరేకంగా కేసు పెట్టినట్లు, కోర్టుకు హాజరుకాక పోతే అరెస్టు చేస్తారని ఉంది. దీంతో భయపడిన ఆ యువతి విషయాన్ని తల్లికి చెప్పి తండ్రిని పిలుచుకురమ్మని బయటికి పంపింది. ఆ తర్వాత..ఇంట్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లీతండ్రి కూతురిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ..అప్పటికే ప్రాణాలొదిలింది. తన అల్లుడు వేధింపుల కారణంగానే చిన్నకూతురు ఆత్మహత్య చేసుకుందని భిక్షమ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సోనమ్–కంగనాల మాటల తూటాలు
మనసుకి అనిపించినది ఎవరికీ భయపడకుండా బాహాటంగా మాట్లాడే స్వభావం ఉన్న నటి కంగనా రనౌత్. ఇటీవల తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే వాటిని సమర్థిస్తూ ‘అవును’ అంటూ ఆ ఆరోపణలు చేసిన స్త్రీని సపోర్ట్ చేశారు కంగనా. ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్ ముందు బాలీవుడ్ మీడియా కంగనా గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. సోనమ్ తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించారు. ఆ మాటలకు కంగనా ప్రతిస్పందించారు. ఇద్దరి మాటలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కంగనాని నమ్మలేం వికాస్ బాల్పై ఆరోపణలు చేసిన స్త్రీని కంగనా సపోర్ట్ చేయడం పై మీ అభిప్రాయం ఏంటి? అని సోనమ్ కపూర్ని అడగ్గా – ‘‘స్త్రీలపై వేధింపులు దారుణం. చాలా బాధగా అనిపిస్తుంది. అయితే కంగనా మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తనని నమ్మడం కష్టం. కంగనా చాలా మాటలు మాట్లాడుతుంది. వాటిలో నిజం ఎంత? అనేది చెప్పలేం’’ అని సమాధానమిచ్చారు. – సోనమ్ సోనమ్ గొప్ప నటి కాదు ‘‘కంగనాని నమ్మలేం అంటే అర్థం ఏంటి? నాకు ఇలాంటి సంఘటన జరిగింది అని నేను చెప్పుకున్నప్పుడు నన్ను జడ్జ్ చేసే హక్కు సోనమ్కి ఎవరు ఇచ్చారు? కొందరిని నమ్మాలి.. మరికొందర్ని నమ్మకూడదు అనే లైసెన్స్ ఏమైనా తనకుందా? నా మాటలను నమ్మకపోవడానికి కారణమేంటో? మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తా అనే పేరు నాకుంది. మన దేశాన్ని గురించి పలు ప్రపంచ దేశాల సదస్సులలో ప్రసంగించాను. నా ప్రసంగాల ద్వారా యువతను ప్రభావితం చేయగలను అనే పేరు నాకుంది. అంతే కానీ మా నాన్నగారి వల్ల కానీ, ఆయన సంపాదించి పెట్టిన ప్లేస్ వల్ల కానీ కాదు. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఉంది. అది స్వయంగా నేను సంపాదించుకున్నదే. సోనమ్ గొప్ప నటీ కాదు.. వక్త కూడా కాదు. నా గురించి మాట్లాడటానికి వాళ్లకు ఏం హక్కుందని?’’ అన్నారు. మొత్తానికి సోనమ్–కంగనాల వాడి వేడి మాటలు చాలామందికి వినోదం అయ్యాయి. నెక్ట్స్ వీళ్ల నుంచి వచ్చే తూటాల్లాంటి మాటల కోసం ఎదురు చూస్తున్నారు. – కంగనా -
అదనపు కట్నం తేలేదని..
బొమ్మనహళ్లి : వరకట్నం వేధింపుల నేపథ్యంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈఘటన ఆనేకల్లో వెలుగు చూసింది. బహుదూరు పుర ప్రాంతంలో నివాసం ఉంటున్న మోహన్కు ఎనిమిది నెలల క్రితం జీవిత (21)తో వివాహమైంది. కట్నంగా 120 గ్రాముల బంగారం, రూ.75 వేలు నగదు ఇచ్చారు. అయితే అదనపు కట్నం తేవాలని జీవితను అత్త గౌరమ్మ, మామ నాగరాజు, అడపడచు శ్వేతలు వేధించేవారని సమాచారం. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలపగా వారు సర్ది చెప్పారు. ఇటీవల అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిన జీవిత..బుధవారం తిరిగి అత్తవారింటికి వచ్చింది. ఈక్రమంలో గురువారం రాత్రి మోహన్ జీవిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుందని, ఆస్పత్రికి తరలించామని సమాచారం ఇచ్చాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోగా జీవిత విగతజీవిగా కనిపించింది. తమ కుమార్తెను భర్త, అత్తమామ, కలిసి వరకట్నం కోసం హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మోహన్, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
రోజూ నరకమే..
రాంగోపాల్పేట్: ఆయన ఓ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్...పెళ్లై 13 ఏళ్లు అవుతోంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ప్రతి రోజు భార్యను తీవ్రంగా కొడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సంజయ్ కుమార్ అనే వ్యక్తి గోపాలపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ గాస్మండి ఆదయ్యనగర్లో ఉంటున్నాడు. 2003లో అతడికి సరితతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, ఒక బాబు. గత కొన్నేళ్లుగా సంజయ్ తరచూ భార్యపై చేయి చేసుకుంటున్నాడు. ప్రతి రోజు మధ్యం సేవించి ఇంటికి రావడమే కాకుండా విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారు. అతడికి రాము, శ్రీకాంత్ అనే అతని స్నేహితులు మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది. మూడు రోజుల క్రితం కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సరిత మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా... భార్య ఫిర్యాదు మేరకు సంజయ్ కుమార్ను మార్కెట్ పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇన్స్పెక్టర్ మట్టయ్య వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తనకు భార్య వద్దని ఏ కేసు పెట్టుకున్నా సరే విడాకులు తీసుంటానని మొండికేశాడు. భార్య సరిత మాత్రం తనను మళ్లీ కొట్టకుండా బాగా చూసుకుంటానంటే సరేనని చెప్పినా అతను మాత్రం కేసు పెట్టుకోమని చెప్పడం గమనార్హం. -
పెళ్లాం వద్దు.. ప్రియురాలే ముద్దు
తాడేపల్లి(తాడేపల్లి రూరల్): ప్రియురాలే ముద్దు.. నువ్వు వద్దు అంటూ భార్యను ఓ కీచక భర్త చిత్రహింసలు పెట్టడంతో తాళలేక బుధవారం రాత్రి భార్య తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు భర్తను పిలిపించి భార్యాభర్తలు ఇద్దరకూ కౌన్సిలింగ్ ఇస్తుండగానే భార్య నాకు వద్దు, ప్రియురాలే నాకు కావాలని ఆ భర్త తేల్చి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య స్టేషన్లో నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి రోడ్డుపై వస్తున్న ఓ లారీ కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మహానాడు ప్రాంతంలో నివాసం ఉండే కరీముల్లాకు నసీమా అనే యువతితో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. విజయవాడలో నివాసం ఉండే ఓ యువతి మహానాడు ప్రాంతంలో నివాసం ఉండేందుకు వచ్చింది. ఇదే సమయంలో కరీముల్లాకు ఆ యువతితో పరిచయం ఏర్పాడింది. అనంతరం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి భార్య నసీమాను కరీముల్లా వేధించడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు పెద్దలు సర్ది చెప్పినా కరీముల్లా ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ముందు కూడా చులకన చేసి మాట్లాడటంతో మనస్తాపం చెంది భార్య ఆత్మహత్యయత్నం చేసింది. చివరకు పోలీసులు గుంటూరు ఫ్యామిలీ కౌన్సిలింగ్కు పంపేందుకు సన్నాహాలు చేశారు. -
ప్రణాళిక ప్రకారమే హత్య
సబ్బవరం(పెందుర్తి): డబ్బులు కోసం డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని ఒకరు... తన తమ్ముడిని కొట్టాడని కక్షతో ఒకరు... కలిసి ప్రణాళిక రచించి ఓ పాత నేరస్తుడిని హతమార్చారు. గత నెల 29న రాత్రి మెగలిపురం సమీపంలోని టెరాకాన్ లే అవుట్ వద్ద రోడ్డు పక్కన సబ్బవరంలోని దుర్గానగర్ కాలనీకి చెందిన కోన చంద్రశేఖర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుని సోదరి మంగళగిరి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సబ్బవరం పోలీస్ స్టేషన్లో అనకాపల్లి రూరల్ సీఐ జి.రామచంద్రరావు, ఎస్ఐ ఎన్.ప్రభాకర్రెడ్డి బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. సబ్బవరంలోని దుర్గానగర్ కాలనీకి చెందిన కోన చంద్రశేఖర్, బాటజంగాలపాలెంకు చెందిన సిలారపు కుమార్(25), నాగేంద్ర కలిసి దొంగతనాలు చేస్తుండేవారు. వీరు ముగ్గురు పెందుర్తి, సబ్బవరం, పరవాడ, గాజువాక మండలాల్లో 2013, 2014వ సంవత్సరాలలో పలు దొంగతనాలకు పాల్పడడంతో 8 కేసులు నమోదయ్యాయి. అప్పట్లో వీరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో 2014లో బెయిల్పై వచ్చారు. దొంగగా మారిన తమ్ముడు కోన చంద్రశేఖర్ను అతని అక్కలు ఇంటికి రానివ్వలేదు. అప్పటి నుంచి పాతరోడ్డు సమీపంలోని షకీలా దాబాలో ఆశ్రయం పొందాడు. డబ్బులు కోసం వేధిస్తుండడంతో... జైలు నుంచి వచ్చిన తర్వాత సబ్బవరం ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని సిలారపు కుమార్ తీసుకుని విజయవాడ వెళ్లిపోయాడు. ఆమె గర్భవతి కావడంతో కొన్ని నెలల కిందట తీసుకుని సబ్బవరం వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న కోన చంద్రశేఖర్... మన ఇద్దరిపై పలు స్టేషన్లలో ఉన్న కేసులు కొట్టించేశానని, అందుకు అయిన ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే తను మరలా దొంగతనాలు చేస్తానని, కేసులన్నీ నీపైకి వస్తాయని కుమార్ను చంద్రశేఖర్ బెదిరించాడు. దీంతో అప్పట్లో రూ.6వేలు కుమార్ ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడంతో ఎలాడైనా చంద్రశేఖర్ను అడ్డు తొలగించుకోవాలని కుమార్ ఆలోచన చేశాడు. అందుకోసం బీహార్ నుంచి 15 సంవత్సరాల కిందట నరవ వచ్చి టైర్లు పంక్చర్లు వేసుకుంటూ జీవిస్తున్న మహ్మద్ అలంగేర్అలియాస్ చంద్తో చేతులు కలిపాడు. గతంలో తన తమ్ముడు సాజిత్ను చంద్రశేఖర్ కొట్టడంతో కక్ష పెంచుకున్న మహ్మద్ అలంగేర్ వెంటనే అందుకు అంగీకరించాడు. వీరిద్దరూ కలిసి కోన చంద్రశేఖర్ అడ్డు తొలగించుకోవాలని నెల రోజుల కిందట ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా గతంలో తాను దొంగలించిన ఫోన్తో చంద్రశేఖర్కు మహ్మద్ గత నెల 29న ఫోన్ చేశాడు. కుమార్ డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడని, రావాలని కోరాడు. అదే రోజు రాత్రి నరవలో ఆటో బుక్ చేసుకుని సబ్బవరం కాంప్లెక్స్లో శేఖర్ను ఎక్కించుకుని రెండు బీర్లు తీసుకుని మొగలిపురంలోని టెరాకాన్ లే అవుట్ సమీపానికి చేరుకున్నారు. ముందే అనుకున్న ప్రకారం శేఖర్ మత్తులోకి జారుకున్నాక కుమార్, మహ్మద్ కలిసి రాడ్డుతో మోది, కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీర్ బాటిళ్లపై ఉన్న వేలి ముద్రల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఏ1 సిలారపు కుమార్, ఏ2 మహ్మద్ అలంగెర్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.