-
ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్లోనే.. .. తమన్ హార్ట్ టచ్చింగ్ స్టోరీ
తమన్..ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మ్యూజిక్ సెన్సేషన్గా మారిపోయాడు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరికి హుషారెత్తే మ్యూజిక్ అందించాడు.డ్రమ్మర్గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు. అయితే తమన్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. తన ఎమోషన్ అంతా దాచుకొని క్రికెట్ గ్రౌండ్లో చూపించేవాడట. ఇండియన్ ఐడడ్ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడ్స్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆహాలో స్క్రీమ్ అవుతున్న ఈ మ్యూజికల్ రియాలిటీ షోకి తమన్తో పాటు కార్తిక్, గీతా మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. షో మధ్యలో ఓ సందర్భంలో ‘మీ జీవితంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా?’అని గీతా మాధురి అడిగిన ప్రశ్నకు బదులుగా ''జీవితంలో తాను ఎన్నోసార్లు ఏడిచాను. నా ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్ లో ఉంటుంది'అని తన ఎమోషన్ ని దాచుకునే ప్రయత్నం చేశారు. తర్వాత గీతా మాధురి తమన్ అమ్మగారిని గురించి ప్రస్థావించినపుడు.. గతాన్ని బాల్యన్ని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు తమన్.తమన్ లోని ఎమోషన్ కోణాన్ని టచ్ చేసిన ఈ వీడియో నెటిజన్స్ని కదిలిస్తుంది. -
టాలీవుడ్ రియాలిటీ షో.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 వచ్చేసింది!
టాలీవుడ్ సినీ ప్రియులను అలరించేందుకు మరో రియాలిటీ షో వచ్చేసింది. యువ సింగర్స్ టాలెంట్ను వెలికితీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 సిద్ధమైంది. ఈ రోజు నుంచే షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు సీజన్లు సక్సెస్ కావడంతో ఈ సీజన్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 షో ఇక నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. గతవారమే లాంచ్ ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి జడ్జిలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి, శ్రీరామచంద్ర వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ షో మొత్తం 33 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించారు. స్వర సంగీత సమరం!🎶సరిగమ రాగల సంబరం!!🎙️తెలుగు ఇండియన్ ఐడల్- 3 ఆగమనం!!!🥳Global star ni chese star meere...ika chuseyandi ..👉▶️https://t.co/QVPfxrk2AG🎤🎶 Watch India's biggest singing song #TeluguIndianIdolS3 streaming now only on @ahavideoin, every Friday and Saturday at 7… pic.twitter.com/ZeOYSI28yf— ahavideoin (@ahavideoIN) June 14, 2024 -
సంగీత ప్రియులను అలరించే షో.. ప్రోమో అదుర్స్!
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హిట్షో ఇండియన్ ఐడల్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి సంగీత ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇండియన్ ఐడల్ మరో సీజన్ ఈనెల 14 నుంచి ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు.తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 లాంఛ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతామాధురి, శ్రీరామచంద్ర, కార్తీక్ వ్యవహరించనున్నారు. కొత్త సీజన్లో కంటెస్టెంట్ల ఎమోషన్స్ ఫుల్గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ షో మూడోసారి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ కానుంది. దీంతో వారం ముందుగానే ప్రోమోను ఆడియన్స్కు పరిచయం చేశారు మేకర్స్. Ultimate musical journey ki muhurtham set ayindi 🎙️🗓️.Kotha swarala madya competition, Judges iche entertainment tho Indian Idol resound India antha vinapadutundi.✨.Telugu Indian Idol Season 3 Launch Promo Out▶️https://t.co/6b5B1VURT9🎤🎶 Catch #TeluguIndianIdolS3 starting… pic.twitter.com/Pl33SKG5No— ahavideoin (@ahavideoIN) June 6, 2024 -
Manuka Paudel: పాడాలి... వినపడుతుంది
'శక్తి లేదనిపిస్తుంది. ప్రయత్నించాలి. కాళ్లలో బలం లేదనిపిస్తుంది. కదలాలి. ఎవరూ తోడు నిలవడం లేదనిపిస్తుంది. ఒంటరిగా పోరాడాలి. లేదని ఓడేది మనిషే. ఉందని గెలిచేది మనిషే. మేనుకా పౌడెల్కు చూపు లేదు. నేపాల్ నుంచి ఇండియాకు పాటను నమ్ముకుని వచ్చింది. తన పాటతో ఎందరినో కదిలించింది. ఇండియన్ ఐడెల్ కంటెస్టెంట్గా ఎంపికై ఇప్పుడు ‘సలార్’లో పాడి దేశం మొత్తానికి వినపడుతోంది.' స్ఫూర్తిదాయకమైన ఈ గాయని గురించి.. ‘ఓ పాలన్ హారే నిర్గుణ్ ఔర్ న్యారే తుమ్రె బిన్ హమ్రా కోనొ నహీ’... ‘లగాన్’లోని ఈ పాటను మేనుకా పౌడెల్ (25) పాడుతున్నప్పుడు, ఆ పాటలోని ఆర్తికి, అర్పణకి, ఆరాధనకి న్యాయ నిర్ణేతల్లో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడుస్తూనే ఉంది. మరో జడ్జి విశాల్ దద్లానీ పరిస్థితీ అంతే. ఇంకో జడ్జయిన ప్రముఖ గాయకుడు కుమార్ షాను ‘వహ్వా’లు కొడుతూనే ఉండిపోయాడు. కన్ను తెరిచినా, కన్ను మూసినా చీకటి తప్ప, గాఢాంధకారం తప్ప, ఓడించాలని చూసే నలుపు తప్ప మరేమీ ఎరగని ఆమె తన పాటతో దివ్వె వెలిగించింది. వెలుతురు చూస్తోంది. వెలుతురు చూపిస్తోంది. నేపాల్కు చెందిన అంధురాలు మేనుకా పౌడెల్కు ఆడిషన్స్ రౌండ్లో గోల్డెన్ మైక్ దొరికింది. ఇండియన్ ఐడెల్ సీజన్ 14లో ఇంకా ఆమె టాప్ కంటెస్టెంట్గా కొనసాగుతూ ఉంది. ముఖేష్ స్పెషల్లో ముఖేష్ తనయుడు నితిన్ ముఖేష్ సమక్షాన ‘ఏ ప్యార్ కా నగ్మా హై’ పాడితే ఆయన ఎంతో సంతోషించాడు. దర్శకుడు మహేశ్ భట్ సమక్షంలో ‘జఖ్మ్’ సినిమాలోని ‘గలి మే ఆజ్ చాంద్ నిక్లా’ పాటను పాడితే ఆయన స్పందిస్తూ ‘హృదయం దగ్గర ఒక కన్ను ఉంటుందని నువ్వు నిరూపించావు’ అన్నాడు. వాద్యాలు చూడకుండా, పాటను అక్షరాల్లో చూడకుండా, అంత పెద్ద సెట్ను చూడకుండా, తన ఎదుట ఉన్న జడ్జిలు ఎలా ఉంటారో చూడకుండా మేనుకా పౌడెల్ ఎంతో నిబ్బరంతో పాటలు పాడటం వల్ల కోట్లమంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకుముందు రియాల్టీ షోలలో కొంతమంది అంధులు పాడటానికి ప్రయత్నించారు కానీ ఇలా నిలువలేదు. మేనుకా పౌడెల్ గొంతులోని మాధుర్యం చివరకు ఆమెను‘సలార్’ లో పాడే వరకూ తీసుకెళ్లింది. ‘సలార్’ హిందీ వెర్షన్లోని ‘సూరజ్ హీ ఆజ్ తన్కే’ పాటను మేనుకా పౌడెల్ పాడింది. దీనివల్ల ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఒక భారీ సినిమాతో జరిగిందని చెప్పాలి. ఇదంతా ఆమె పాడాలి అనుకోవడం వల్ల. ఓడాలి అని అనుకోకపోవడం వల్ల. నేపాల్ అమ్మాయి మేనుకా పౌడెల్ది నేపాల్లోని జాపా. పుట్టుకతో చూపు లేకపోయినా తల్లిదండ్రులు ఆ లోటు తెలియనీకుండా పెంచారు. బాల్యం నుంచి గానం పట్ల ఆమె ఆసక్తిని ప్రోత్సహించారు. తండ్రి మలేసియాలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లగా ఇంటి బాధ్యత ఇప్పుడు మేనుక మీదే ఉంది. ముంబైలోని సురేష్ వాడ్కర్ అకాడెమీలో కొన్నాళ్లు పాడటం నేర్చుకున్న మేనుక గాయనిగా తన ప్రతిభను చాటేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. సాయిబాబా భజనలు పాడుతూ ఉపాధి పొందింది. ‘సాయిబాబా నా కుటుంబ సభ్యుడు’ అని చెప్పుకుంటుంది. బహుశా ఆ సాయి దయ వల్లే ఆమెకు ఇప్పుడు గొప్ప గుర్తింపు లభించింది. ఆమె పాటను మీరు ఇండియన్ ఐడల్లో వినచ్చు. -
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
సింగర్ను పెళ్లాడనున్న బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
మరాఠీ నటి స్వానంది టికేకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఇండియన్ ఐడల్- 12 కంటెస్టెంట్ ఆశిష్ కులకర్ణితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్వానంది తన ఇన్స్టాలో రాస్తూ..' మేము నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక నుంచి నువ్వే నా ఏకైక ఇల్లు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా.. స్వానంది ప్రముఖ నటుడు ఉదయ్ టికేకర్, ప్రసిద్ధ సింగర్ ఆరతి అంకాలికర్ కుమార్తె. సింగర్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత స్వానంది తన పెళ్లి గురించి మాట్లాడింది. (ఇది చదవండి: ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్ నటుడు!) స్వానంది మాట్లాడుతూ..' మా పెళ్లి త్వరలోనే జరగబోతోంది. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రస్తుతానికి ఇది మాత్రమే చెప్పగలను. నేను జీవితంలో ఒక నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా. ఆశిష్, నేను మా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆస్వాదిస్తున్నా.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఇండియన్ ఐడల్ -12 తర్వాత ఆశిశ్కు గుర్తింపు వచ్చింది. కాగా.. స్వానంది టికేకర్ మరాఠీ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. దిల్ దోస్తీ దునియాదారి, దిల్ దోస్తీ దొబారా, అస్సా మహేర్ నాకో గా బాయి పాత్రలకు ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా ఏక్ శూన్య తీన్, డోంట్ వర్రీ బి హ్యాపీ అనే చిత్రాల్లో నటించింది. ఇండియన్ ఐడల్ మరాఠీ షోకు హోస్ట్గా చేసింది. View this post on Instagram A post shared by A D I N A T H P A ‘त’ K A R (@adinath.patkar) (ఇది చదవండి: 'ఓపెన్హైమర్' సినిమాలో ఆ సీన్ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ) View this post on Instagram A post shared by Ashish Kulkarni (@ashishkulkarni.music) -
ఇండియన్ ఐడల్ 2 విన్నర్ ఆమెనే.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ గ్రాండ్ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫైనల్లో విశాఖపట్నానికి చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన జయరాం, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియలు ఫస్ట్, సెకండ్ రన్నరప్లుగా నిలిచారు. వీరికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'సంగీతంలో ఎంతో ప్రతిభావంతులైన వీరి ప్రదర్శన చూసి మనసంతా ఆనందంతో నిండిపోయింది. సంగీతంపై మరింత ప్రేమ పెరిగింది. ఈ షో నాకెంతో ప్రత్యేకమైనది, మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలింది. సౌజన్యకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆమె అసాధారణమైన విజయాన్ని సాధించింది. రెండేళ్ల చిన్నారికి తల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొనటం.. ఓ వైపు సంగీతం, మరో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది అంత సులువైన విషయం కాదు. ఆమె అంకిత భావం, నిబద్ధత చూస్తే గౌరవం పెరిగింది. ఆమెకు కుటుంబం నుంచి వచ్చిన మద్దతు ఎంత గొప్పగా ఉందో, దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. పెళ్లైన ప్రతి స్త్రీ వెనుక ఆమె భర్త సహకారం ఉండాలి. అలా ఉన్నప్పుడు మహిళలు వారి అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. అది వారి ఉనికిని అందరికీ తెలిసేలా చేస్తుంది. సౌజన్య సాధించిన ఈ విజయం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆమె సంగీత ప్రయాణంలో ఇలాంటి విజయాలను మరెన్నింటిలో అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విజేతగా నిలిచిన సౌజన్య భాగవతుల మాట్లాడుతూ ‘‘ఆహా వారి తెలుగు ఇండియన్ 2లో విజేతగా నిలవటం, ముఖ్యంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. కల నిజమైనట్లు ఉంది. ఆయన అందించిన ప్రోత్సాహం, ప్రశంసలను నేనెప్పటికీ మరచిపోను. ఈ మ్యూజికల్ జర్నీ నాలోని పట్టుదలను మరింతగా పెంచింది. ఇంత గొప్ప వేదికను అందించిన ఆహా వారికి, న్యాయ నిర్ణేతలకు, నా తోటి కంటెస్టెంట్స్కు, మా వెనుక ఉండి ప్రోత్సహించిన టీమ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. ఇంకా గొప్పగా రాణించటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. సౌజన్య, జయరాం, లాస్యప్రియతో పాటు న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్కు చెందిన కార్తికేయ టాప్-5లో ఉన్నారు. Today is the time! In an hour from now ICON STAR @AlluArjun garu will announce the winner of #TeluguIndianIdol2. 🎵🕺Watch Part 2 of ICONIC FINAALE now!😍🔥@MusicThaman @singer_karthik @geethasinger . Streaming now ▶ https://t.co/XgDhOwib60 pic.twitter.com/FLwIzzvXtq — ahavideoin (@ahavideoIN) June 4, 2023 @alluarjun intha ga blush avvadaniki, Sruthi story ento telusukovadaniki. Inkoka '4hrs' matrame. Watch Iconic Grand FinAAle #TeluguIndianIdol2 #AAforTeluguIndianIdol2 #IconicFinAAle #AlluArjun @MusicThaman @geethasinger pic.twitter.com/IXH2aZNuNA — ahavideoin (@ahavideoIN) June 4, 2023 చదవండి: డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్గా ఉంచాల్సిన వీడియో లీక్ -
ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే.. ఛీఫ్ గెస్ట్ పేరు లీక్!
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!) అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు పాన్ ఇండియా స్టార్ హాజరవుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాకుండా పుష్ప-2 టీజర్తో పాటు గెస్ట్ ఎవరో కూడా హింట్ ఇచ్చింది. ఈ సారి గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాగా.. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆమెకు ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) PAN India Charchalu modhalayyayi ante iga thaggede le 🔥🔥🔥 Guess the star 🌟#TeluguIndianIdol2 Masss Finale coming soon. Stay tuned for exclusive updates. #alluarjun @MusicThaman @singer_karthik @GeethaArts @PushpaMovie pic.twitter.com/Y12m87iZVf — ahavideoin (@ahavideoIN) May 19, 2023 -
Chakrapani Nagari: పాటల తుపాకీ...
దేశ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్. వేదికల మీద పాటలు పాడుతూ తనలో ఉన్న కళకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. ‘డ్యూటీలో ఉంటూ గాన సాధన కూడా చేయడంతో ఈ పాట నాకు బాగా వంటపట్టింది’ అంటూ ఇటీవల హైదరాబాద్ వచ్చిన చక్రపాణి నగరి తన గురించి వివరించారు. ‘‘మాది శ్రీకాకుళం జిల్లా, పలాస. టెన్త్క్లాస్ వరకు హైదరాబాద్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ సమయంలో బీఎస్ఎఫ్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి, అప్లై చేశాను. ఆ పరీక్షల్లో సెలక్ట్ అయ్యి 2013లో బీఎస్ఎఫ్లో చేరాను. ఇప్పటి వరకు రాజస్థాన్లో పని చేశాను. ఇప్పుడు సెలవు మీద హైదరాబాద్కు వచ్చాను. సెలవు పూర్తవగానే జమ్ములో విధులు నిర్వర్తించాలి. డ్యూటీలో ఉంటూ.. ఏదో ఒకటి పాడుకుంటూ ఉండటం అనేది స్కూల్ టైమ్ నుంచే ఉండేది. కానీ, ఎప్పుడూ దానిని నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోలేదు. బీఎస్ఎఫ్లో చేరిన తర్వాత అక్కడ మా టీమ్, క్యాంపుల్లో సరదాగా పాడుతుండేవాడిని. నెలకు ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో అన్నీ హిందీ పాటలు పాడేవాడిని. అక్కడున్నవారందరికీ హిందీ తెలుసు కాబట్టి, అవే పాటలు పాడేవాడిని. మా తోటి జవాన్లే కాదు ఆఫీసర్స్ కూడా చాలా ప్రోత్సహించేవారు. డ్యూటీలో ఉన్నా లేకున్నా పాటలు పాడటం మాత్రం ఆగేది కాదు. ఇక మా ఊరికి వచ్చినప్పడు పెళ్లిళ్లు వంటి వేడుకల సందర్భాల్లోనూ నా గాన కచేరీ ఉండేది. ఖాళీ సమయంలో డిజిటల్ మీడియాని ఫాలో అవుతుంటాను. అలా, హైదరాబాద్లోని ఓ టీవీ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రకటన చూసి, అప్లై చేసుకున్నాను. వేల మందిలో నాకు అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మా అధికారులకు చెబితే వాళ్లూ వెంటనే ఓకే చేశారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, గాన గంధర్వుడు బాలుగారి మైక్ను కానుకగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. కష్టపడుతూ.. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం. నా చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో మా అమ్మ చాలా కష్టాలు పడింది. మమ్మల్ని హాస్టల్లో ఉంచి, తెలిసినవారి ద్వారా ఢిల్లీ వెళ్లి, పనులు చేసి, మాకు డబ్బు పంపేది. ఇప్పుడు అమ్మ ఊళ్లో వ్యవసాయం పనులు చేస్తుంది. అన్నయ్య సొంతగా బేకరీ నడిపిస్తున్నాడు. అక్క గ్రామవాలంటీర్గా చేస్తోంది. మాకు కష్టం విలువ తెలుసు, స్వయంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తూనే వచ్చాం. ఆ కష్టంలో నుంచే ఈ పాట పుట్టుకు వచ్చిందనుకుంటాను. ఎక్కడ ఉన్నా కళ రాణిస్తుందనడానికి నేనే ఉదాహరణ అనిపిస్తుంటుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని సింగర్గా రాణించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశాడు ఈ జవాన్. – నిర్మలారెడ్డి -
‘ఆహా’ కోసం బాలయ్య కొత్త అవతారం.. న్యూ లుక్ పిక్స్ వైరల్
నందమూరి నట సింహా బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్.. యాంకరింగ్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఆయన హోస్ట్గా చేసిన టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ హిట్ అయింది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోతో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇదే జోష్తో మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు ఈ నందమూరి నటసింహం. ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నమ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్ రెండో సీజన్లో బాలయ్య గెస్ట్గా మెరవబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంపిటీషన్ షో కోసం 12 మంది కంటెస్టెంట్స్ని ఫైనల్ చేశారు. ఈ 12 మందిని పరిచయం చేస్తూ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా ట్వీట్ చేసింది.. గతంలో ఇంతకు ముందెన్నపుడు చూడని బాలయ్యను చూస్తారంటూ ట్వీటర్లో పేర్కొంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన న్యూ లుక్స్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. The Fire sets the stage on fire, yet again! Inthaku mundhennadu chudani Balayyani Chusthaaru, March 17&18th na #TeluguIndianIdolS2 #GalaWithBala lo🔥@MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem@southindiamalls @realmeIndia @KhiladiOfficia3 @BingoSnacks @ShaadiDotCom pic.twitter.com/L7jnmaID5K — ahavideoin (@ahavideoIN) March 13, 2023 -
ఒకే ఒక్క లైఫ్.. నచ్చినవన్నీ చేసెయ్యాలి: సింగర్ గీతా మాధురి
-
తెలుగు ఇండియన్ ఐడల్ 2లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!
ఆహా మొదలైనప్పటినుంచి ప్రేక్షకుల కోసం వినోదాత్మక, ఉత్కంఠభరిత కంటెంట్ అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఒరిజినల్స్, రియాలిటీ షోలు ప్రసారమయ్యాయి. వీటికి అదనంగా తెలుగు ఇండియన్ ఐడల్ రియాలిటీ షోని ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో త్వరలో రెండో సీజన్కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పసందైన గళాల కోసం బ్రాండ్ న్యూ అవతార్లో తెలుగు ఇండియన్ ఐడల్ 2 రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ సీజన్ ఇచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, శ్రావ్యమైన గళాలను ప్రేక్షకులకు పరిచయం చేసేలా మరింత గ్రాండియర్గా రూపొందుతోంది సెకండ్ సీజన్. అన్స్టాపబుల్ 2లో ఈ షో గురించి అనౌన్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ సీజన్లో ఎస్ ఎస్ తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బీవీకే వాగ్దేవి ట్రోఫీ గెలుచుకున్నారు. శ్రీనివాస్, వైష్ణవి తొలి రెండు రన్నరప్ స్థానాల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న శ్రావ్యమైన గళాలకు అద్భుత వేదికను ఏర్పాటు చేసి, ప్రపంచానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ షోని ప్లాన్ చేసింది ఆహా. 16 నుంచి 30 ఏళ్లలోపున్నవారు ఈ షోలో పాల్గొనవచ్చు. హైదరాబాద్, బషీర్బాగ్లోని సెయింట్ జార్జి గ్రామర్ హై స్కూల్లో జనవరి 29న ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. ప్రతిభావంతులైన ఔత్సాహిక గాయనీగాయకులకు ఇదో సువర్ణావకాశం. మీరు నెక్స్ట్ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనాలనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? ఆడిషన్స్లో తప్పక పాల్గొనండి. వచ్చే సీజన్లో తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీ విజేతగా మిమ్మల్ని మీరు చూసుకోండి! చదవండి: పెళ్లికి రెడీ అయిన కార్తీకదీపం నటి, పెళ్లిచూపులు వీడియోతో సర్ప్రైజ్ ఆస్తి కోసం చిన్న గొడవ.. ప్రేమించి పెళ్లాడిన భర్త వదిలేసి పోయాడు.. 30 ఏళ్లవుతోంది: నటి -
గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్.. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-1 సంగీత ప్రియులను అలరించింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఆహా మరోసారి ప్రేక్షకులకు కనివిందుల చేసేందుకు సిద్ధమైంది. ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ సింగర్స్ ప్రతిభను వెలికితీసేందుకు మరోసారి రెడీ అయింది. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2తో మీ ముందుకొస్తున్నట్లు ప్రకటించింది ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడిషన్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మొదటి సీజన్కు ప్రేక్షకుల అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు ఇండియన్ ఐడల్ను బ్లాక్బస్టర్ హిట్ కావడంతో సీజన్-2 సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన సింగర్స్కు ఈ షో చక్కని అవకాశం కల్పించనుంది. ఈ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షోకి సంబంధించిన ఆడిషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆమె ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు. -
అన్స్టాపబుల్ సీజన్ 2పై బాలయ్య క్లారిటీ
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వచ్చిన టాక్షో అన్స్టాబుల్ విత్ ఎన్బీకే. ఈ షో ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఈ షోకు కోసం బాలయ్య హోస్ట్గా మారి అన్స్టాబబుల్ తొలి సీజన్ను విజయంతంగా చేశాడు. తన షోకు విచ్చేసిన అతిథులందరినీ కలుపుకుపోతూ ఎన్నో విషయాలు రాబడుతూ ఆడియన్స్నే ఆశ్చర్యపరిచాడు. ఆహాలో సూపర్ డూపర్ హిట్టయిన అన్స్టాపబుల్ విజయవంతంగా తొలి సీజన్ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 2పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్స్టాబుల్ సీజన్ 2పై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ టాప్ 6 ఎపిసోడ్కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా హోస్ట్ శ్రీరామ చంద్ర బాలయ్యను అన్స్టాబుల్ సీజన్ 2 ఎప్పుడు సార్? అని ప్రశ్నించాడు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే.. అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఇదే వీడియోను ఆహా వీడియోస్ షేర్ చేస్తూ ‘త్వరలోనే అన్స్టాబుల్ టాక్ షో మళ్లీ మీ ముందుకు రాబోతుంది. ఈసారి ఎవరెవరు గెస్ట్గా రావాలనుకుంటున్నారో కామెంట్స్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో డిజిటల్ ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ రాబోతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్గా ఎవరో రావాలో చెబుతూ తమ తమ అభిమాన హీరోల పేర్లను కామెంట్లో పేర్కొంటున్నారు. Bigger, Better and Crazier. Your favourite and India's No.1 talk show returns with Season 2 #UnstoppableWithNBK coming soon! Who should we have on the show as guests? Comment below.🥳 P.S: Crazy comments only (Think Unstoppable) 😉😉 pic.twitter.com/RS4o15vT8I — ahavideoin (@ahavideoIN) June 20, 2022 -
‘తెలుగు ఇండియన్ ఐడల్’ విజేత వాగ్దేవి ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్ అయిన ఈ ఫైనల్ ఎపిసోడ్కు మెగాస్టార్ చిరు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కంటెస్టెంట్స్ చేసిన సందడి బాగా ఆకట్టుకుంది. చిరుతో పాటు రానా, సాయిపల్లవిలు ‘విరాటపర్వం’ ప్రమోషన్లో భాగంగా ఈ షోలో సందడి చేశారు. చదవండి: ‘ఆ బుక్ ఆధారంగా కెఫె కాఫీ డే వీజీ సిద్ధార్థ బయోపిక్ తీస్తున్నాం’ కాగా ఈ సింగింగ్ రియాలిటీ షోకు శ్రీరామ్చంద్ర హోస్ట్గా.. సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యామీనన్, సింగర్ కార్తీక్లు జడ్జ్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఫినాలే ఎపిసోడ్లో వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్లు ఫైనల్కు రాగా.. వాగ్దేవి విన్నర్గా నిలిచింది. శ్రీనివాస్, వైష్ణవిలు 2, 3 స్థానాల్లో నిలిచి రన్నర్లుగా నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి ట్రోఫీని అందించాడు. అలాగే ట్రోఫీతో పాటు రూ.10 లక్షల ప్రైజ్మనీని కూడా ఆమె గెలుచుకుంది. అంతేకాదు ఇకపై గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో ఓ పాట పాడే అవకాశం కూడా ఆమె అందుకుంది. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య మొదటి రన్నరప్గా నిలిచిన శ్రీనివాస్కు రూ. 3 లక్షలు ప్రైజ్మని, రెండవ రన్నరప్గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల రూపాయలు బహుమాతిగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తదుపరి సినిమా ‘గాడ్ఫాదర్’లో వైష్ణవికి పాట పాడే అవకాశం ఇచ్చాడు. అలాగే సింగర్ కార్తీక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో విన్నర్ వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఆనంతరం చిరుతో ముందుగానే వాగ్ధేవికి చెక్ను కూడా అందించాడు. ఇక ఈ ఎపిసోడ్లో నిత్యా మీనన్ పాట పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థమన్, కార్తిక్ పాటల ప్రదర్శన, శ్రీరామ్ చంద్ర నృత్య ప్రదర్శనతో షోను మరింత వినోదంగా సాగింది. -
తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జ్గా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !
S Thaman As Judge For Telugu Indian Idol Show: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు తమన్. 2009లో రవితేజ కిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అనేక మంది స్టార్ హీరోలకు మ్యూజిక్ కంపోజ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో తమన్ పేరు మారుమోగిపోయింది. అందులో తమన్ కొట్టిన బీజీఎంకు మాములు క్రేజ్ రాలేదు. ఇదే కాకుండా పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' పాటలు ఇప్పటికే ఫుల్ పాపులర్ అయ్యాయి. దీంతోపాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు తమన్. అయితే ప్రస్తుతం తమన్కు సంబంధించిన ఒక క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంతతో 'సామ్ జామ్', నందమూరి బాలకృష్ణతో 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే' వంటి టాక్ షోలతో ఆహా అనిపించింది. తాజాగా తెలుగు 'ఇండియన్ ఐడల్' పేరుతో సింగింగ్ రియాలిటీ షోను పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్గా సింగర్, బిగ్బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర హోస్ట్గా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ షోకు న్యాయ నిర్ణేతగా తమన్ వ్యవహరించనున్నాడట. ఇండియన్ ఐడల్ మేకర్స్ దాదాపుగా తమన్ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే షోకు రేటింగ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ షోకు తమన్ జడ్జ్గా వస్తే సోషల్ మీడియాలో మీమర్స్కు కూడా పని దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే తమన్ చాలా సినిమాల నుంచి మ్యూజిక్ కాపీ కొడతాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవి. నాగార్జున నటించిన కింగ్ మూవీలోని కొన్ని సీన్లను స్పూఫ్ చేస్తూ తమన్పై ట్రోలింగ్, మీమ్స్ చేసినవారు కూడా ఎక్కువే. కాగా న్యాయనిర్ణేతగా తమన్ ఇచ్చే జడ్జిమెంట్పై ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు -
శ్రీరామచంద్రకు 'ఆహా' అనిపించే ఆఫర్.. ఏంటంటే ?
Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha: శ్రీరామ చంద్ర అంటే మొన్నటి వరకు పాపులర్ సింగర్ గానే తెలుసు. కానీ బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొనడంతో మరింత పాపులర్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టిన శ్రీరామచంద్ర.. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్బాస్ 5వ సీజన్కు విన్నర్గా శ్రీరామ చంద్ర గెలుస్తాడని మొదట అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మూడో స్థానంతో శ్రీరామ బిగ్బాస్ జర్నీకి బ్రేక్ పడింది. అలా జరిగిన కూడా ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్. అయితే ఈ విన్నర్ తాజాగా అదిరిపోయే ఆఫర్ అందుకున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' తర్వలో 'ఇండియన్ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఈ ప్రోగ్రామ్కు హోస్ట్గా శ్రీరామచంద్రను సెలెక్ట్ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్. ఇదివరకు శ్రీరామచంద్ర 2013లో ఇండియన్ ఐడల్గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ ఐడల్లో (హిందీ) సింగర్గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఆడిషన్స్ జరుపుకుంటున్న తెలుగు 'ఇండియన్ ఐడల్' త్వరలోనే ప్రారంభం కానుంది. 🥁 CAN THIS GET ANY BETTER? #SreeramaChandra to host the first-ever #TeluguIndianIdol mee aha lo 🧡✨Are you excited or AREEE YOUU EXCITEEEDD!@fremantle_india @Sreeram_singer @instagram pic.twitter.com/0uBIIrjatZ — ahavideoIN (@ahavideoIN) December 26, 2021 -
ఘనంగా ఇండియన్ ఐడల్ సింగర్ నిశ్చితార్థం
Sayli Kamble Engagement: తన అద్భుత గాత్రంతో ఎంతోమంది సంగీతప్రియులను అలరించింది సింగర్ సయాలీ కంబ్లే. ఇండియన్ ఐడల్ 12వ సీజన్ సెకండ్ రన్నరప్గా నిలిచిన ఆమె తన స్నేహితుడు ధావల్ను పెళ్లాడనుంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇండియన్ ఐడల్ షో కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలను లవ్ బర్డ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయారు. 'నీతో చిరునవ్వులు చిందించడానికి, బాధలో ఉన్నప్పుడు సంతోషం వైపు నడిపించడానికి, జీవితాంతం ప్రేమిస్తూ ఎల్లప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. నా ఊపిరి ఆగేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు ధావన్. View this post on Instagram A post shared by Sayli Kamble (@saylikamble_music) కాగా ధావన్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. సయాలీ, ధావన్లకు మూడేళ్ల నుంచే పరిచయం ఉంది. ఆ చనువుతో ఓరోజు ధావన్ ఆమెకు ప్రపోజ్ చేయగా సయాలీ సిగ్గుపడుతూ దాన్ని అంగీకరించింది. అలా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక సయాలీ మ్యూజిక్ టూర్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో వచ్చే ఏడాది మే తర్వాతే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందట! View this post on Instagram A post shared by Dhawal (@dhawal261192) తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ సయాలీ తనకు కాబోయే భర్త గురించి మాట్లాడింది. 'ఆశయాలు పెద్దదిగా ఉండాలని, వాటిని సాధించాలంటూ ధావల్ నన్నెప్పుడూ ఇన్స్పైర్ చేస్తుంటాడు. నేనెప్పుడూ పెద్ద కలలు కనలేదు. కానీ అతడు మాత్రం మనం కల ఎప్పుడూ పెద్దదిగా ఉండాలని చెప్పేవాడు. అతడి మాటలు, ప్రోత్సాహం వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. లాక్డౌన్కు ముందు కొన్ని షోలలో పాటలు పాడేదాన్ని. అయితే లాక్డౌన్ వల్ల అవి ఆగిపోయాయి. ఆ సమయంలో ధావల్ ఇండియన్ ఐడల్ 12 ఆడిషన్స్లో పాల్గొనమన్నాడు. సరే చూద్దామని నేను పాడిన వీడియో పంపాను. అలా ఈ షోలో అవకాశం దక్కించుకుని ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాను' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sayli Kamble (@saylikamble_music) -
‘తెలుగు ఇండియన్ ఐడల్’ షోను పరిచయం చేయబోతోన్న ఆహా
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ఆహా ఎప్పుడూ ప్రేక్షకులకు సరికొత్తగా వినోదం పంచే దిశగా అడుగు వేస్తోంది. అందుకే ప్రారంభమైన తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కంటెంట్ను అందిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్లకు మాత్రమే పరిమితం కాకుండా టాక్ షోలతో డిజిటల్ వ్యూవర్స్కి సరికొత్త అనుభూతిని పంచేందుకు టాక్ షోలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆరంభంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ టాక్ షో నిర్వహించి టాలీవుడ్ బిగ్ సెలబ్రెటీలతో సందడి చేయించింది. చదవండి: ‘పుష్ప’లో చేయనని చెప్పాను: నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ఏకంగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణతో ‘అన్స్టాబుల్ విత్ బాలయ్య’ పేరుతో మరో టాక్ షో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెర తీసింది ఆహా. త్వరలోనే తెలుగు ఓటీటీలో ఇండియన్ ఐడల్ షోను పరిచయం చేయబోతున్నామంటూ ప్రకటన ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ ఐడల్ అంటే హిందీలో జరిగే సింగింగ్ రియాలిటీ షోని మనకు తెలిసిందే. హీందీలో 12 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పటి వరకు తెలుగులో లేదు. దీంతో ఇండియన్ ఐడల్ తెలుగులో పరిచయం చేసేందుకు ఆహా సన్నాహాలు చేస్తోంది. చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా! దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది ఆహా. తెలుగు సింగింగ్ టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆడిషన్స్కు సంబంధించిన వివరాలను ప్రకటించారు ఆహా నిర్వహకుల. డిసెంబర్ 26న తొలి ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులకు ఆహ్వానం అందించారు. ఇక ఈ ఆడిషన్స్ హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని ఒయాసిస్ స్కూల్లో నిర్వహించనున్నారు. Can it get better than this? WE THINK NOT. The former Indian Idol winner @singerrevanth to host first-ever #TeluguIndianIdol.@fremantle_india @instagram pic.twitter.com/6Wh6K6vUPW — ahavideoIN (@ahavideoIN) December 18, 2021 -
విజయ్ను కలిసి షణ్ముక ప్రియ, ‘లైగర్’ ఓ పాట పాడే అవకాశం
హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్ షణ్ముక ప్రియకు పాట పాడే అవకాశం కల్పించాడు. తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరిస్తూ..ఇండియన్ ఐడల్ సీజన్ 12లో మెరిసింది షణ్ముఖ ప్రియ. ఇటీవల షో నిర్వహకుల విజ్ఞప్తి మేరకు లైవ్లో జూమ్ ద్వారా షణ్ముకతో మాట్లాడిన విజయ్ గెలిచినా, ఓడినా అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ్ తన హామీని నిలబెట్టుకున్నాడు. ఇండియన్ ఐడల్ 12 సీజన్లో షణ్ముక టాప్ 6 కంటెస్టెంట్స్లో ఒకరుగా నిలిచి ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ షణ్ముక ట్రోఫి మాత్రం గెలుచుకోలేకపోయింది. అయితే ఇటీవల ఈ షో ముగియడంతో తన స్వస్థలం విశాఖపట్నం చేరుకుంది. చదవండి: నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ ఇక ఇటీవల వైజాగ్ చేరుకున్న షణ్ముక సోమవారం విజయ్ను కలిసింది. తన తల్లితో కలిసి హైదరాబాద్లో విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో విజయ్ ఆమెతో తనిష్క్ బాఘ్చి మ్యూజిక్ కంపోజిషన్లో ప్రియ పాట పాడించాడు. అయితే తుది మిక్సింగ్ అయిపోయిన తర్వాత పాటను వినాలని షణ్ముఖకు చెప్పాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తల్లి షణ్ముకను శాలువతో సత్కరించి చీరలు, ఇతర బహుమతులు అందజేసింది. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్పై ఛార్మి నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్ -
షణ్ముఖప్రియ సుస్వరాల జల్లులో తడిసి ముద్దాయిన వైజాగ్
-
నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ
సాక్షి,విశాఖపట్నం(మద్దిలపాలెం): ఇండియన్ ఐడల్–12 ఫైనలిస్ట్ షణ్ముఖప్రియ రాగాలాపనతో.. విశాఖ సాగరతీరం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆమె సుస్వరాల జల్లులో నగరం తడిసి ముద్దయింది. రాక్ సింగర్గా తనదైన శైలిలో ఇండియన్ ఐడల్ వేదికపై ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ.. విశాఖ సంగీత ప్రియులను తన గానంతో మైమరిపించింది. ఇండియన్ ఐడల్ ముగిసిన తర్వాత తొలిసారిగా ఆదివారం విశాఖ వచ్చిన ఆమెకు నగర ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గుర్రపు బగ్గీపై ఊరేగించారు. అనంతరం సిరిపురంలోని ఫోర్ పాయింట్ హోటల్లో ఆతీ్మయ అభినందన సభ నిర్వహించారు. విబాస్ మూవీస్ ఆధ్వర్యంలో వీరుమామా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో షణ్ముఖప్రియకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి విశ్వగాన ప్రియ పురస్కారం ప్రదానం చేశారు. యంగ్ రాక్స్టార్ ఆఫ్ ఇండియాగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పిస్తూ.. గిరిజన కార్పొరేషన్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి చేతులమీదుగా ధ్రువీకరణపత్రం అందజేశారు. వి.విజయకుమార్ ఆమెకు రూ.10లక్షలు విలువ చేసే ప్లాట్ పత్రాలను బహూకరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో షణ్ముఖప్రియ ఇండియన్ ఐడల్ వేదికగా విశాఖ నగర ఖ్యాతిని ఇనుమడింపజేసిందని కొనియాడారు. రాష్ట్ర విద్యా మౌలిక వసతుల, సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ సంగీత సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి షణ్ముఖప్రియ ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్ మాట్లాడుతూ సొంతగడ్డపై అపూర్వ స్వాగ తం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన గానంతో షణ్ముఖప్రియ సంగీత ప్రియులను ఓలలాడించింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పాటలను ఆలపించి, అలరించింది. కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, విశాఖ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, రంజిత్, రోటరీ దొర బాబు, రత్నరాజు, వినీతలు పాల్గొన్నారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్కు 9 సెంటిమెంట్ నిజమేనా? -
షణ్ముఖ ప్రియకు విశ్వ గాన ప్రియ బిరుదు
సాక్షి,విశాఖ పట్నం: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియకు ఈ నెల 5వ తేదీన విశ్వ గాన ప్రియ బిరుదుతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యంగస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేస్తున్నట్టు నిర్వహకుడు వీరుమామ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకులకు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎస్.అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, జీవీ తదితరు పాల్గొంటారన్నారు ఆరోజు సాయంత్రం 5 గంటలకు హోటల్ ఫోర్ పాయింట్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. విజయ కుమార్ మాట్లాడుతూ షణ్ముఖ ప్రియకు తమ సంస్థ నుంచి పది లక్షలు విలువైన 108 గజాలు స్థలం బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకులకు సంబంధించిన పాస్ల కోసం 99129 99949 నంబరుకు సంప్రదించాలన్నారు. చదవండి: బాక్సింగ్ రింగ్లోకి..విజయ్ దేవరకొండ -
హైదరాబాద్: ఇండియన్ ఐడల్ గాయకులతో సంగీత కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడిల్లో విజేతగా నిలిచిన పవన్దీప్ రాజన్, అదే విధంగా తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు సిద్ధమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులను ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘ఇందులో భాగంగానే కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్, మసాలా కాఫీ, ఇండియన్ ఐడిల్ షోలో ఫైనలిస్టులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ కళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న, ఇండియన్ ఐడల్ విజేత పవన్దీప్ రాజన్తో సెప్టెంబరు 3న హార్ట్కప్లో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ సిరీస్లో దేశంలోని అత్యుత్తమమైన సంగీతకారులతోపాటు గాయకులు పాలుపంచుకొని అబిమానులను ఉర్రూతలుగించనున్నారు. సెప్టెంబర్ 2 - తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద సెప్టెంబర్ 3 - ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ (హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి) సెప్టెంబర్ 23 - మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద అక్టోబర్ 1 - ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ (గ్రీజ్ మంకీ క్లబ్, జూబ్లీహిల్స్) అక్టోబర్ 2 - చిన్మయి + కాప్రిసియో అక్టోబర్ 9 - స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్ అక్టోబర్ 15 - శోభన (రవీంద్ర భారతి) వద్ద అక్టోబర్ 23 - ఇండియన్ ఐడల్ టాప్ 5 (హార్ట్ కప్ కాఫీ) వద్ద -
పెద్ద అచీవ్మెంట్.. మాటల్లో చెప్పలేను: షణ్ముఖప్రియ
‘ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లు ప్రత్యేకత ఉన్న వాళ్లే. ఫైనల్లో గెలవగలిగిన టాలెంట్ అందరిలోనూ ఉంది’ ఇది షణ్ముఖ ప్రియ జవాబు. ‘ఫైనల్లో ఎవరు గెలుస్తున్నారనుకుంటున్నార’ని ఓ వారం కిందట జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు ప్రియ ఇచ్చిన ఈ సమాధానంలో ఎంతో పరిణతి ఉంది. ‘ఈ వేదిక నుంచి ఇంటికి వెళ్తూ ఏమి తీసుకెళ్లబోతున్నార’నే ప్రశ్నకు కూడా... ‘అనేక జ్ఞాపకాలను, నేర్చుకున్న పాఠాలను’ అని స్థితప్రజ్ఞతతో బదులిచ్చింది ఈ పద్దెనిమిదేళ్ల గడుసమ్మాయి. వైజాగ్లో పుట్టి టీవీ తెర మీద తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందే పెరిగిన షణ్ముఖ ప్రియ గొంతు ప్రతి తెలుగింటిలోనూ వినిపించింది. పదమూడేళ్లుగా ప్రతి తెలుగింటికీ ఇంటి బిడ్డగా మారిపోయింది. అంతటి ప్రేమ ఆప్యాయతలను అందుకుంటోంది. ఒక ‘సారేగమప లిటిల్స్, మరో ‘పాడుతా తీయగా’, సూపర్సాంగ్స్, ద వాయిస్ ఇండియా కిడ్స్తో సెలయేరులా సాగిన రాగప్రవాహం ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో వేదికను చేరింది. ఫైనల్స్లో ఆరవస్థానంలో నిలిచిన షణ్ముఖప్రియ ముంబయి నుంచి సాక్షితో పంచుకున్న అనుభవాలు. ఈ షో మలుపు తిప్పింది. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్లో పాడాలనే కోరిక ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. ఫైనల్ వరకు రావడమే పెద్ద అచీవ్మెంట్. దానిని సాధించగలిగాను. సంగీతంతో మమేకమైన నా జీవితంలో ఈ షో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ షో ద్వారా నేను ఎంతమంది సంగీతప్రియుల మనసుకు దగ్గరయ్యానో మాటల్లో చెప్పలేను. ప్రతి పాటలోనూ నా వంతుగా నూటికి నూరుశాతం ఇచ్చాను. మై లెవెల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పడానికి సందేహించడం లేదు. ఇక గెలుపు ఓటముల విషయం అంటారా? ఇక్కడ గెలుపును ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నా పార్టిసిపేషన్ మాత్రమే నాకు ముఖ్యం. ఫలితం మీద నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా ఈ షో నా జీవితంలో గొప్ప మలుపు కాబోతోంది. జావేద్ అక్తర్తోపాటు అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు నన్ను ఈ షో ద్వారానే గుర్తించారు. నన్ను అంతర్జాతీయ ప్రముఖులు జస్టిన్ బీబర్, షకీరాలతో పోల్చారు. నాకది ఎంతో సంతోషంగా ఉంది. రెండు వేలుగా ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా రెండు లక్షల ఎనభై వేలకు చేరింది కూడా ఇప్పుడే. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేశాను. ఇరవై పాటలతో విడుదలవుతున్న ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను గెలవాలని ఇంతమంది వీక్షకులు కోరుకోవడమే పెద్ద విజయం’’ అని చెప్పింది షణ్ముఖ ప్రియ. అలాగే ఈ ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో సందర్భంగా ప్రియ మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించేసింది. అదేంటంటే... ‘ఇదే నా ఆఖరి రియాలిటీ షో. ఇకపై సంగీత ప్రపంచంలో నా ప్రయాణం కొత్తదారిలో సాగుతుంది’ అని చెప్పింది. – వాకా మంజులారెడ్డి