iphones
-
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం: భారీగా తగ్గిన ధరలు
ప్రేమికుల రోజు(Valentine's Day)ను పురస్కరించుకుని ఫ్లిప్కార్ట్ తన 'వాలెంటైన్స్ డే సేల్ 2025'ని ప్రారంభించింది. ఇందులో యాపిల్ ఐఫోన్ల మీద గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మొదలైన ఈ సేల్స్ 14 వరకు కొనసాగుతుంది.ఫ్లిప్కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ 2025లో.. డిస్కౌంట్స్ లభిస్తున్న ఐఫోన్లలో.. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వంటివి ఉన్నాయి.ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు రూ. 11,000 తగ్గింపుతో.. రూ. 78,999 వద్ద లభిస్తుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 5,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే రూ. 74000కు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఇంకా తగ్గింపు లభిస్తుంది.ఐఫోన్ 15 ధర రూ.64,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఐఫోన్ 15 ప్లస్ రూ.68,999 కు లభిస్తుంది. ఐఫోన్ 14 మోడల్ రూ.53,999 ధరకు లభిస్తుంది. కేవలం ఫ్లిప్కార్ట్ మాత్రమే కాకుండా.. వివిధ ఈ కామర్స్ వెబ్సైట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తాయి. ఇందులో కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఇతర వస్తువులు ఉంటాయి. -
Hyderabad: ఘరానా సైబర్ నేరగాడి ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: యజమాని అతడు కాదు... విక్రయించేది–ఖరీదు చేసేదీ కూడా అతగాడు కానేకాదు... అయినప్పటికీ ఈ–కామర్స్ సైట్లో ఫోన్లకు సంబంధించిన పోస్టులు చేసిన వారిని సంప్రదించి డిలీట్ చేయిస్తాడు... ఆపై అవే వివరాలను తాను పోస్టు చేస్తాడు...క్రయవిక్రయాలు చేసే వారిని ఓ ‘ప్లాట్ఫామ్’ పైకి తీసుకువస్తాడు..ఆ ఇద్దరినీ కలిపి తాను ‘లాభపడతాడు’. కేవలం ఐఫోన్లనే టార్గెట్గా చేసుకుని, ఈ వినూత్న పంథాలో తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని మోసం చేసి రూ.60 లక్షలు స్వాహా చేసిన ఘరానా మోసగాడు మరిశర్ల బాలాజీ నాయుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ఎస్.మోహన్కుమార్ ప్రకటించారు. ఇన్స్పెక్టర్ బి.శోభన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్... ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన బాలాజీ నాయుడు అక్కడి ఎస్వీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చిన ఇతగాడు తొలినాళ్లల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేశాడు. జల్సాలు, బెట్టింగ్స్, ఆన్లైన్ గేమింగ్స్కు జీతం డబ్బులు చాలకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరబాట పట్టాడు. ఇందులో భాగంగా వివిధ పేర్లతో సిమ్కార్డులు తీసుకునే ఇతగాడు తరచు తన ఫోన్లు మారుస్తూ ఉంటాడు. 2018 నుంచి మోసాలు చేయడం మొదలెట్టిన బాలాజీ ఇప్పటి వరకు 30 ఫోన్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించడానికి ఉపకరించే ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్ ఆధారంగా మోసాలు ప్రారంభించాడు. ఆ సైట్/యాప్ను ఆద్యంతం గమనించే బాలాజీ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లు పెట్టిన పోస్టుల్ని గుర్తిస్తాడు. వాటిలో కొన్ని ఎంపిక చేసుకుని అందులోని ఫొటోతో పాటు ఇతర వివరాలు కాపీ చేసుకుని భద్రపరుచుకుంటాడు. వారితో తీయించి తాను పోస్టు చేసి... ఆపై ఆ పోస్టు చేసిన వ్యక్తిని సంప్రదించే బాలాజీ ఏమాత్రం బేరసారాలు లేకుండా ఆ ఫోన్ తాను ఖరీదు చేస్తున్నట్లు, త్వరలోనే సంప్రదించి కలుస్తానని చెప్తాడు. అలా వారి నమ్మకాన్ని పొంది ఓఎల్ఎక్స్ నుంచి పోస్టు తీసేలా చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్ద ఉన్న ఫొటో, వివరాలతో తానే ఆ ఫోన్ విక్రయిస్తున్నట్లు అదే ఓఎల్ఎక్స్లో పోస్టు చేసే బాలాజీ..తక్కువ రేటు పొందుపరుస్తాడు. ఈ పోస్టును చూసిన వాళ్లల్లో ఆకర్షితులైన వాళ్లు ఫోన్ ద్వారా బాలాజీని సంప్రదిస్తారు. వారితో బేరసారాలు పూర్తి చేసే అతగాడు..ఫలానా చోట తనను కలిసి, నగదు చెల్లించి, ఫోన్ తీసుకువెళ్లాలని సూచిస్తాడు. అదే సమయంలో ఫోన్ అసలు యజమానికి సంప్రదించే బాలాజీ అతడినీ ఆ ప్రాంతానికి రమ్మని, నగదు చెల్లించి ఫోన్ తీసుకుంటానని చెప్తాడు. అలా ఫోన్ యజమాని, తన ప్రకటన చూసి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన వ్యక్తి కలుసుకోవడానికి కొద్దిసేపటి ముందు వారిని మరోసారి సంప్రదిస్తాడు. తాను రాలేకపోతున్నానని, తన సోదరుడు వస్తున్నాడని చెప్పి, ఫోన్ రేటు విషయం చెప్తే అంత డబ్బు పెట్టి ఎందుకు కొంటున్నావు? అని మందలిస్తారంటూ వారికి చెప్తాడు. ఈ కారణంగానే రేటు విషయం చర్చించ వద్దంటూ ఇద్దరికీ చెప్తాడు. ఇలా ఆ ఇద్దరూ కలిసిన తర్వాత ఖరీదు చేసే వ్యక్తిని బుట్టలో వేసుకుని యజమాని వద్ద ఫోన్ చూసిన వెంటనే నగదు తనకు బదిలీ చేసేలా చేస్తాడు. ఆపై తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుంటాడు. క్రయవిక్రేతలు మాత్రం కొద్దిసేపు ఘర్షణ పడి, అసలు విషయం తెలుసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇలా ఇతగాడు తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని ముంచి రూ.60 లక్షలు స్వాహా చేశాడు. ఈ డబ్బును డప్ఫాబెట్, సారా, రమ్మీటైమ్, రమ్మీ సర్కిల్ వంటి గేమింగ్, బెట్టింగ్ యాప్స్లో పెట్టడం, జల్సాలు చేయడం చేసి ఖర్చు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో బాధితులకు నేరుగా ఆయా యాప్స్కు సంబంధించిన క్యూర్కోడ్స్ పంపి, నేరుగా డబ్బు వాటికే పంపేలా చేశాడు. ఇతగాడిని కటకటాల్లోకి పంపిన పంజగుట్ట పోలీసులు రెండు ఫోన్లు, మూడు సిమ్కార్డులు స్వాదీనం చేసుకున్నారు. బాలాజీపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 138 ఫిర్యాదులు, తెలుగు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల పంజగుట్టలో 3, మధురానగర్లో మరో 3 కేసులు నమోదు కాగా..మరో 25 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
జోరుగా ఐఫోన్ల ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో సుమారు రూ.50,400 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ పరంగా 33 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్లో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి యాపిల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ జోరు చూస్తే భారత్ నుంచి విదేశాలకు సరఫరా అయ్యే ఐఫోన్ల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2023–24లో కంపెనీ సుమారు రూ.84,000 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. ప్రభుత్వ రాయితీలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దేశంలో సాంకేతిక పురోగతి.. వెరశి కంపెనీ భారత్లో తన తయారీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బీజింగ్–వాíÙంగ్టన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనాలో తయారీకి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి యాపిల్ యొక్క వ్యూహంలో భారత్ కీలక కేంద్రంగా మారింది. కీలకంగా యాపిల్.. ప్రధాన మార్కెట్ అయిన యూఎస్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్లో రూ.24,192 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ సరఫరా అయ్యాయి. యూఎస్కు ఎగుమతుల పరంగా టాప్–1 సెగ్మెంట్గా మొబైల్స్ నిలవడంతోపాటు భారత స్మార్ట్ఫోన్ ఎగుమతి రంగానికి ఐఫోన్లు వెన్నెముకగా మారాయి. అయిదేళ్ల క్రితం ఇక్కడి నుంచి యూఎస్కు ఎగుమతి అయిన స్మార్ట్ఫోన్స్ విలువ రూ.43.6 కోట్లు మాత్రమే. తాజా ఎగుమతి గణాంకాలు యాపిల్ తయారీ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది.యాపిల్ కీలక సరఫరాదారులైన తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్ప్, భారత్కు చెందిన టాటా ఎల్రక్టానిక్స్ దక్షిణ భారతదేశంలో చురుకుగా ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. చెన్నైకి సమీపంలోని ఫాక్స్కాన్ ఫెసిలిటీ అతిపెద్ద సరఫరాదారుగా నిలుస్తోంది. ఇది భారత ఐఫోన్ ఎగుమతుల్లో సగం సమకూరుస్తోంది. టాటా ఎల్రక్టానిక్స్ గతేడాది విస్ట్రన్ కార్పొరేషన్ నుంచి అసెంబ్లీ యూనిట్ను కొనుగోలు చేసింది. ఏప్రిల్–సెపె్టంబర్ కాలంలో కర్ణాటక ఫ్యాక్టరీ నుండి సుమారు రూ.14,280 కోట్ల విలువైన ఐఫోన్లను టాటా ఎల్రక్టానిక్స్ ఎగుమతి చేసింది.కొనసాగుతున్న పెట్టుబడులు..యాపిల్ భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం లోపు మాత్రమే వాటా కలిగి ఉంది. షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ బ్రాండ్లదే ఇక్కడ హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆపిల్ దేశీయంగా గణనీయంగా పెట్టుబడులు చేస్తోంది. బెంగుళూరు, పుణేలో కొత్త స్టోర్లతో సహా రిటైల్ ఉనికిని విస్తరించే ప్రణాళికలతో భారత్లో యాపిల్ వృద్ధి పథం ఆశాజనకంగా కనిపిస్తోంది. భారత్లో యాపిల్ అమ్మకాలు 2030 నాటికి రూ.2,77,200 కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, సులభతర వాయిదా చెల్లింపుల స్కీములు ఇందుకు కారణంగా తెలుస్తోంది.కఠిన కోవిడ్–19 లాక్డౌన్లు, ఆరి్ధక సంక్షోభం కారణంగా మాంద్యంతో చైనాలో యాపిల్ కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశీయంగా తయారీ సామర్థ్యం పెంచుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో యాపిల్ ప్రధాన మార్కెట్గా చైనాను అధిగమించే అవకాశం భారత్కు లేదు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారత్లో రూ.1,17,600 కోట్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఉత్పత్తి సామర్థ్యాలను రెట్టింపు చేసింది. -
ఐఫోన్ యూజర్లూ.. జాగ్రత్త!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ రానేవచ్చింది. ఇది ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ( CERT-In ) పలు యాపిల్ ఉత్పత్తులలో సెక్యూరిటీ లోపాల గురించి హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ఓఎస్, మ్యాక్స్ఓఎస్, విజన్ఓఎస్ సహా అనేక రకాల యాపిల్ సాఫ్ట్వేర్ వెర్షన్లు ప్రభావిత జాబితాలో ఉన్నాయి.యాపిల్ ఉత్పత్తలలో ఈ సెక్యూరిటీ లోపాలను ‘హైరిస్క్’గా సెర్ట్ఇన్ వర్గీకరించింది. వీటిని అలక్ష్యం చేస్తే సున్నితమైన సమాచారానికి అటాకర్లకు అనధికార యాక్సెస్ ఇచ్చినట్టువుతుంది. వారు మీ పరికరంలో ఆర్బిటరీ కోడ్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. క్లిష్టమైన భద్రతా పరిమితులు పక్కకు వెళ్తాయి. సేవ తిరస్కరణ (DoS) షరతులకు ఆస్కారం కలుగుతుంది. అటాకర్లు సిస్టమ్పై నియంత్రణ సాధించేందుకు వీలు కలుగుతుంది. స్పూఫింగ్, క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS) దాడులు జరిపే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలను నివారించడానికి యాపిల్ పరికరాలను సాఫ్ట్వేర్ తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలని యూజర్లకు సెర్ట్ ఇన్ సూచించింది.ప్రభావిత యాపిల్ డివైజెస్ ఇవే..iOS: Versions prior to 18 and 17.7iPadOS: Versions prior to 18 and 17.7macOS Sonoma: Versions prior to 14.7macOS Ventura: Versions prior to 13.7macOS Sequoia: Versions prior to 15tvOS: Versions prior to 18watchOS: Versions prior to 11Safari: Versions prior to 18Xcode: Versions prior to 16visionOS: Versions prior to 2 -
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్లతో కూడిన మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. -
హైదరాబాద్ అబిడ్స్లో ఐఫోన్స్ పేరుతో భారీ మోసం
-
విపక్ష ఎంపీల ఐఫోన్లకు అలర్టులు...
న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ యాపిల్ సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు త్వరలో భారత్కు రానున్నారు. గత నెలలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతల ఐఫోన్లలో వార్నింగ్ నోటిఫికేషన్లు ప్రత్యక్షమ వడంతో తీవ్ర దుమారం రేగిన తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందంటూ వారు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్టీ–ఐఎన్(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) యాపిల్ సంస్థకు నోటీసులిచ్చింది. భారత్లోని యాపిల్ సంస్థ ప్రతినిధులు సీఈఆర్టీ–ఐఎన్ నిపుణులను కలుసుకున్నారు. అయితే, ఈ సమస్య వారి సా మర్థ్యానికి మించినదని తేలింది. దీంతో త్వర లోనే అమెరికా నుంచి యాపిల్ సైబర్ సెక్యూ రిటీ ప్రతినిధుల బృందం ఇక్కడికి రానుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. -
యాపిల్కు నోటీసులు
న్యూఢిల్లీ: విపక్ష ఎంపీల ఐఫోన్లకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ల ఉదంతంలో కేంద్ర సైబర్సెక్యూరిటీ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం(సీఈఆర్టీ–ఇన్) సంస్థ తన దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ గురువారం చెప్పారు. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఐఫోన్ల దాడికి యత్నించినట్లు ఏమైనా ఆధారాలుంటే సమరి్పంచాలని ఐఫోన్ తయారీసంస్థ యాపిల్ను కోరుతూ కేంద్రం నోటీసులు పంపింది. సీఈఆర్టీ–ఇన్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు యాపిల్ సంస్థ సహకరించనుందని కృష్ణన్ చెప్పారు. సీఈఆర్టీ అనేది జాతీయ నోడల్ ఏజెన్సీ. కంప్యూటర్ భద్రతను సవాల్ చేసే ఘటనలు సంభవించినపుడు వెంటనే సీఈఆర్టీ స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తుంది. -
మరో నిఘా నేత్రం?
నిత్యం ఏవో కళ్ళు మనల్ని గమనిస్తున్నాయంటే ఎలా ఉంటుంది? చేతిలోని మన చరవాణి సైతం చటుక్కున ప్రత్యర్థిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఫోన్లలోని కీలక సమాచారాన్ని చేజిక్కించుకొనేందుకు ‘పాలకవర్గ ప్రాయోజిత ఎటాకర్లు’ ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్ సంస్థ అక్టోబర్ 31న పంపిన అప్రమత్తపు ఈ–మెయిల్స్తో అదే జరిగింది. ఐ–ఫోన్లు వాడుతున్న పలువురు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులే కాదు... ప్రపంచమంతా ఉలిక్కిపడింది. వ్యక్తిగత డేటా, గోప్యతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆపిల్ ఐ–ఫోన్ వినియోగదారులు పలువురికి ఇలా పారాహుషార్ సందేశాలు అందడం తేలికైన విషయమేమీ కాదు. సహజంగానే కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడుతోందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ అప్రమత్తత నోటిఫికేషన్లు పంపిన టెక్ దిగ్గజం ఆపిల్కు నోటీసులిచ్చి, సహకరించాల్సిందిగా కోరారు. ఫోన్లు – కంప్యూటర్ల హ్యాకింగ్, పాలకపక్షాల గూఢచర్యం ఆధునిక సాంకేతిక యుగం తెచ్చిన అతి పెద్ద తలనొప్పి. ఇది అనేక దేశాల్లో గుట్టుగా సాగుతూనే ఉంది. పులు కడిగిన ముత్యాలమని చెప్పుకొనే పాలకవర్గాలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా యన్నది కీలకం. డేటా లీకేజీలు, గూఢచర్య సాఫ్ట్వేర్ వినియోగాలు మనకూ కొత్త కావు. దేశంలో ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వినియోగం సహా పలు ఆరోపణలపై గతంలో విచారణలు జరిగాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగబోవని హామీలూ వచ్చాయి. అన్నీ నీటిమూటలే. పెగసస్ సాఫ్ట్వేర్ కొనలేదని ప్రభుత్వం తోసిపుచ్చినా, కొత్త గూఢచర్య సాఫ్ట్వేర్ల కొనుగోలుకు భారత్ ఉత్సుకత చూపుతుందని విదేశీ పత్రికల్లో విశ్వసనీయ కథనాలు వచ్చాయి. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ కొన్ని ఫోన్లను పరిశీలించి, పెగసస్ వినియోగంపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని చెబుతూనే, ఈ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని కుండబద్దలు కొట్టింది. అందుకే, తాజా విచారణపైనా అపనమ్మకం వ్యక్తమైతే తప్పుపట్టలేం. తాజా అప్రమత్త సందేశాలు పంపడానికి కారణాలను ఆపిల్ వివరించిన తీరూ అస్పష్టంగా ఉంది. అది సమగ్రంగా కారణాలను వివరించాల్సింది. అసలు ‘పాలకవర్గ ప్రాయోజిత’ ఎటాకర్లు అనే పదానికి ఆ సంస్థ చెబుతున్న వ్యాఖ్యానం, జనానికి అర్థమవుతున్న టీకా తాత్పర్యం వేర్వేరు. పుష్కలంగా నిధులు, వ్యవస్థీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నవన్నీ ఆ వర్గం కిందకు వస్తాయన్నది ఆపిల్ మాట. ప్రభుత్వ జోక్యం లేనిదే అది అసాధ్యమనేది అందరికీ తెలుసు. అందుకే, తాజా రగడపై అటు భారత అటు ప్రభుత్వం, ఇటు ఆపిల్ క్రియాశీలంగా వ్యవహరించాలి. వినియోగదారుల్ని అప్రమత్తం చేయడమే నేరమన్నట్టు ప్రభుత్వం, ఆపిల్ చెవులు మెలేస్తే దేశంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణమే మిగులుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఆపిల్ ఐ–ఫోన్లు వాడుతుంటే, వారిలో 7 శాతం మన దేశంలోనే ఉన్నారు. తమ ఉత్పత్తులు పూర్తి సురక్షితమనీ, హ్యాకింగ్ అవకాశం అత్యల్పమనీ, ఆ యా దేశాల ప్రభుత్వాల పక్షాన తాము గూఢచర్యానికి ఎన్నడూ పాల్పడబోమనీ ఆపిల్ కూడా నమ్మకం కలిగించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం తక్షణం సమావేశమై, ఆపిల్ సందేశాలపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఫోన్ల హ్యాకింగ్ వాదనను ‘యాక్సెస్ నౌ’ సంస్థ సమర్థిస్తోందనీ, కోటీశ్వరుడైన అమెరికన్ ఫైనాన్షియర్ జార్జ్ సోరోస్కు ఆ సంస్థలో పెట్టుబడులున్నాయి గనక ఆయనకు ఈ హ్యాకింగ్ వివాదంతో సంబంధం ఉందనీ అధికార బీజేపీ ఐటీ విభాగాధిపతి ఆరోపించారు. పాలక వర్గాలపై ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిరాధారమని నిరూపించి, నిజాయతీని నిరూపించు కోవాలి. అది వదిలేసి బోడిగుండుకూ, మోకాలుకూ ముడిపెడితే ప్రయోజనం శూన్యం. అదే సమ యంలో ఇచ్చిన సమాచారంపై దృష్టిపెట్టకుండా, తెచ్చిన వార్తాహరుడిపై కత్తులు నూరితే కష్టం. ఆపిల్ అప్రమత్తతకు సరిగ్గా ఒక రోజు ముందరే మన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’ నుంచి దాదాపు 80 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు లీకయ్యాయి. దీనిపైనా లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఆధార్ వివరాలు నమోదు చేసే ‘యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సర్వర్ కట్టుదిట్టమైనదే. కానీ, ఇతర మార్గాల్లో వివరాలు బయటకు పొక్కుతున్నాక ఇక గోప్యతకు అర్థమేముంది! వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణపై ఇటీవలే చట్టం చేసిన ప్రభుత్వం సమాచార సేకరణ, నిల్వ, వినియోగంపై కట్టుదిట్టమైన నియమావళి సత్వరం తీసుకురావాలి. ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టి, పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతను తుంగలో తొక్కాలనుకుంటే అది ఘోరం. ఈ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం పెంచి, ఇలాంటి ఉల్లంఘనల్ని ప్రతిఘటించేలా సంసిద్ధం చేయాలి. పాలకపక్షాలు ఈ ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చాలి. పదేపదే ఆరోపణలు వస్తున్నందున వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిష్కార మార్గాల అన్వేషణే కాదు... ఆచరణలోనూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలి. గోప్యత ఉల్లంఘన జరిగినట్టు తేలితే, కఠిన చర్యలు చేపట్టాలి. అలాకాక, రెండేళ్ళ క్రితం నాటి ‘పెగసస్’ లానే దీన్ని కూడా చాప కిందకు నెట్టేయాలని పాలకులు ప్రయత్నిస్తేనే చిక్కు. రాజకీయ రచ్చగా మారుతున్న తాజా వ్యవహారంలో అసలు సంగతి వదిలేసి, కొసరు విషయాలు మాట్లాడుకుంటే ఎన్నటికీ ఉపయోగం లేదు. -
పార్లమెంటరీ ‘చర్చ’ జరగాల్సిందే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఐఫోన్లపైకి ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దాడికి తెగబడ్డారన్న ఆరోపణలను విపక్షాలు తీవ్రతరం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘంలో చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టస్లు లేఖ రాశారు. స్టాండింగ్ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి హెచ్చరిక అలర్ట్లు అందుకున్న ఎంపీలతోపాటు ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ ప్రతినిధులనూ చర్చకు పిలవాలని లేఖలో డిమాండ్చేశారు. స్థాయి సంఘంలో చర్చకు అధికార బీజేపీ ససేమిరా అంటోంది. ‘ యాపిల్ సబ్స్రైబర్లకు సంబంధించిన ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. హ్యాకింగ్ దాడిని ఎదుర్కొన్నాయంటున్న ఐఫోన్లను చెక్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులది. ఈ అంశాన్ని స్థాయీ సంఘంలో చర్చించాల్సిన అవసరమే లేదు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రాన్ని వేలెత్తిచూపుతున్నారు: చిదంబరం గతంలో పెగసస్ సాఫ్ట్వేర్ సాయంతో దేశంలో పలు రంగాల వ్యక్తులపై కేంద్రప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణల నడుమ ఐఫోన్ల హ్యాకింగ్ వెలుగుచూడటంతో అందరూ సహజంగానే కేంద్రప్రభుత్వం వైపే వేలెత్తిచూపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘2019లో పలువురు సామాజిక కార్యకర్తలు, విపక్ష సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, జడ్జీల ఫోన్లపై పెగసస్ సాఫ్ట్వేర్తో కేంద్రం నిఘా పెట్టిందని దేశమంతటా కలకలం రేగడం తెల్సిందే. ఇప్పుడు వందలాది విపక్ష నేతలకు యాపిల్ ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్లు వచ్చాయనేది వాస్తవం. కేవలం విపక్ష నేతలకు మాత్రమే ఎందుకొచ్చాయి? హ్యాకింగ్ వల్ల భారీ ప్రయోజనం ఒనగూరేది ఎవరికి ?. ఈ ప్రశ్నలు తలెత్తినపుడు అందరూ అనుమానంతో కేంద్ర నిఘా సంస్థలవైపే వేలు చూపిస్తారు. ఎందుకంటే అనుమానించదగ్గ సంస్థలు అవి మాత్రమే’ అని చిదంబరం ఆరోపించారు. రక్షణ కలి్పంచండి: లోక్సభ స్పీకర్కు మొయిత్రా లేఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్ల దాడుల నుంచి విపక్ష ఎంపీలను రక్షించాలని లోక్సభ స్పీకర్ బిర్లాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కోరారు. ఈ మేరకు బిర్లాకు ఆమె లేఖ రాశారు. నిఘాకు రూ.1,000 కోట్లు! ‘అంతర్జాతీయ సంస్థలైన యాక్సెస్ నౌ, సిటిజెన్ ల్యాబ్ వంటి సంస్థలు సెపె్టంబర్లోనే ఇలాంటి యాపిల్ సంస్థ జారీచేసే హెచ్చరిక నోటిఫికేషన్ల విశ్వసనీయతను నిర్ధారించాయి. ఇంటెలెక్సా అలయెన్స్ వంటి సంస్థలతో కలిసి నిఘా కాంట్రాక్ట్లను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులను పెంచుకుంటోందని ఇటీవలే ‘ది ప్రెడేటర్ ఫైల్స్’ పేరిట ఫైనాన్షియల్ టైమ్స్ ఒక పరిశోధనాత్మక సమగ్ర కథనాన్ని వెలువరిచింది. ఈ నిఘా ఒప్పందాల విలువ దాదాపు 1,000 కోట్లు ఉంటుందని అంచనావేసింది’ అని మొయిత్రా తన లేఖలో పేర్కొన్నారు. 2014 తర్వాత ఏదైనా నిఘా సాఫ్ట్వేర్ను కొన్నదీ లేనిదీ కేంద్రం బయటపెట్టాల్సిందేనని స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్చేశారు. కాగా, అలర్ట్ ఘటనపై వివరణ కోరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్వేర్తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి’ -
ఐఫోన్ హ్యాకింగ్పై కేంద్రం క్లారిటీ, ఎంపీలపై మండిపడిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్న ప్రతిపక్ష ఎంపీల ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్ల విషయంలో దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినట్టుతెలిపారు. మెసేజ్లు అందుకున్న వారితో పాటు యాపిస్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని విపక్ష ఎంపీల ఆరోపణలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రియంక చతుర్వేది, శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంపీలు పని గట్టుకుని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తుంటారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. శశిథరూర్, మహువా మొయిత్రా, ఓవైసీ, ఆప్కి చెందిన రాఘవ్ చద్దాతో సహా పలువురు విపక్ష ఎంపీ తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. -
యాప్ట్రానిక్స్ స్టోర్స్లో ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు
Offers on iPhone 15 series యాపిల్ ఉత్పత్తుల విక్రయ సంస్థ యాప్ట్రానిక్స్ తాజాగా ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్లు, వాచ్లను దేశవ్యాప్తంగా 56 స్టోర్స్లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. గుంటూరు, సిద్ధిపేట, విజయనగరం, భీమవరం తదితర నగరాల్లోని స్టోర్స్ కూడా వీటిలో ఉన్నాయి. గుంటూరు, సిద్ధిపేట స్టోర్స్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13లను కొనుగోలు చేసేవారు రూ. 11,000 విలువ చేసే యాక్సెసరీలు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటును ఎంచుకోవచ్చని తెలిపింది. అదనంగా యాపిల్కేర్ప్లస్, ప్రొటెక్ట్ప్లస్పై రూ. 2,000 మినహాయింపును, ఫోన్ను ఎక్సే్చంజ్ చేస్తే రూ. 6,000 వరకు బోనస్ వంటివి పొందవచ్చు. మొత్తం మీద గుంటూరు, సిద్ధిపేట కస్టమర్లు 31 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్డే గిఫ్ట్: ఫాక్స్కాన్ పోస్ట్ వైరల్
యాపిల్ ఐఫోన్ తయారీదారు తైవాన్కు చెందిన పాక్స్కాన్(Foxconn) దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో దాని తయారీ సౌకర్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. భారతదేశంలో తన ఉద్యోగులను రెట్టింపు చేయాలని నిర్ణయించింది ఫాక్స్కాన్ ప్రతినిది లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆదివారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఫాక్స్కాన్ ప్రతినిధి వి లీ ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. "హ్యాపీ బర్త్డే, గౌరవ ప్రధానమంత్రి. మీ నాయకత్వంలో ఫాక్స్కాన్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందింది. వచ్చే ఏడాది గొప్ప బహుమతి అందించేలా మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశంలో వ్యాపార వృద్ధితోపాటు, రెట్టింపు ఉపాధిని అందించే లక్ష్యంతో మరింత కష్టపడి పని చేస్తామంటూ ప్రకటించారు. చైనాఆంక్షల నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాపై దృష్టిపెడుతోంది. తద్వారా ఐఫోన్ విక్రయాలకు పెద్ద మార్కెట్గా ఉన్న చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని కంపెనీ చూస్తోంది. తమిళనాడు ప్లాంట్లో ఇప్పటికే 40వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. (మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!) ఫాక్స్కాన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో, ఫాక్స్కాన్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కర్ణాటక ప్రకటించింది. ఇక్కడ ఐఫోన్ల కేసింగ్ కాంపోనెంట్స్ , చిప్ తయారీకి సంబంధించిన పరికరాల ఉత్పత్తికానున్నాయి. మరోవైపు తెలంగాణలోఇటీవల మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) గత నెలలో ఎర్నింగ్స్ బ్రీఫింగ్ సందర్భంగా, ఫాక్స్కాన్ ఛైర్మన్ లియు యంగ్-వే ఇండియా మార్కెట్పై భారీ ఆశలే ప్రకటించారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. -
లేటెస్ట్ ఐఫోన్స్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
iPhone 15 series , Watch Series 9 ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్స్ 15 సిరీస్లు లాంచ్ అయ్యాయి. అయితే లాంచ్ అయిన వెంటనే లేటెస్ట్ ఐఫోన్ 15, యాపిల్ వాచ్ 9 సిరీస్ ఉత్పత్తులు భారత మార్కెట్లో అవకాశం ఈ ఏడాది ఐఫోన్ లవర్స్కు పండగే అని చెప్పాలి. లేటెస్ట్ ఐఫోన్లు, యాపిల్ వాచ్లను దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్లో విక్రయించనున్నట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ రెడింగ్టన్ లిమిటెడ్ తెలిపింది. 7,000 పై చిలుకు రిటైల్ స్టోర్స్లో ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే, 2,800 స్టోర్స్లో యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 3 కూడా లభిస్తాయని వివరించింది. స్మార్ట్ఫోన్స్, వాచ్ల లభ్యత, ధరల గురించి ఇండియా ఐస్టోర్డాట్కామ్ను సందర్శించవచ్చని కస్టమర్లకు సూచించింది. రూ. 5,000, రూ. 4,000 తక్షణ క్యాష్బ్యాక్ను పొందవచ్చు. అలాగే జీరో డౌన్ పేమెంట్, ఎంపిక చేసిన మోడల్స్పై రూ. 3,329 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఎంపికలతో సహా వివిధ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లపై రెడింగ్టన్ రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా అందిస్తోంది. ముందస్తు ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం. అలాగే ఇంగ్రామ్ మైక్రో ఇండియా కూడా 7,000 కంటే ఎక్కువ రిటైల్ ప్రదేశాలలో తాజా ఆపిల్ ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ. 5,000 క్యాష్బ్యాక్ , ఆరు నెలల నో-కాస్ట్ EMI ఎంపికతో సహా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు లభ్యం. అదనంగా, రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. -
ఆ 4 ఐఫోన్లకు టాటా చెప్పేసిన యాపిల్..
Apple discontinues 4 iPhones: ఐఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ (Apple) ప్రకటించింది. తాజాగా జరిగిన వండర్లస్ట్ ఈవెంట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series)ను లాంచ్ చేసింది. మరోవైపు పలు ఐఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లో అధికారికంగా నిలిపేసింది. నిలిపేసిన ఐఫోన్లు ఇవే.. యాపిల్ నిలిపేసిన ఐఫోన్ మోడల్లలో ఐఫోన్ 12 (iPhone 12), ఐఫోన్ 13 మినీ, (iPhone 13 mini), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఉన్నాయి. గత ఏడాది రూ. 1,39,900 ధరతో విడుదలైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్ను అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. అలాగే గతేడాదిలోనే రూ. 1,29,900 ధరతో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్రో మోడల్ను కూడా భారత మార్కెట్లో నిలిపివేసింది. (జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!) ఇక 2021లో రూ. 69,900లకు విడుదలైన ఆపిల్ ఐఫోన్ 13 మినీకి కూడా యాపిల్ వీడ్కోలు పలికింది. నిలిపివేసిన ఐఫోన్లలో మోడల్లలో ఐఫోన్ 12 కూడా ఉంది. 2020లో ఐఫోన్ 12 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,900 ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పటికీ ఈ పాత ఐఫోన్ మోడల్లపై ఆసక్తి ఉన్నవారు అమెజాన్, ఫ్టిప్కార్ట్ వంటి థర్డ్-పార్టీ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆయా సంస్థలు తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకూ వీటిని విక్రయిస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇవే.. కాగా యాపిల్ కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 15 (iPhone 15) ప్రారంభ ధర రూ. 79,900. ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ధర రూ. 89,900. ఇక ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లకు ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అధికారిక సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు హాజరైనట్టు ఇన్స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్గా మారాయి. (గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్లో పేర్కొంది. ఈ పోస్ట్లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు
Apple Wonderlust Event iOS 17 టెక్ దిగ్గజం ‘వండర్ లస్ట్’ పేరుతో యాపిల్ నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేయనుంది. యాపిల్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ పార్క్లో సెప్టెంబర్ 12న జరగనున్న 'వండర్లస్ట్' ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు(సెప్టెంబరు 12, మంగళవారం) 15 సిరీస్తోపాటు, ఐప్యాడ్లు, కొత్త వాచ్ సిరీస్ను అభిమానుల కోసం లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఈ ఈవెంట్లో కార్యక్రమంలో ఐవోఎస్ 17ను యాపిల్ ఆవిష్కరించనుంది. ముఖ్యంగా భారత యూజర్ల కోసం ఐవోఎస్ (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) 17లో ప్రత్యేక ఫీచర్లను, watchOS 10 లాంచింగ్ తేదీలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు యాపిల్ ఐఫోన్ 15 లైనప్ను USB-C పోర్ట్లతో అందించనుండటం మరో విశేషం కానుంది. ఐవోఎస్17లో ఇండియన్ ఫీచర్లు ఐఫోన్లలో ప్రధానంగా మూడు కొత్త ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్ఫోన్లలో డ్యూయల్ సిమ్ కార్డ్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో డబుల్ సిమ్.ఐవోఎస్ 17 ప్రైమరీ, సెకండరీ సిమ్ ప్రతీ సిమ్ కు మెస్సేజ్ కు సంబంధించి వేర్వేరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.మిస్డ్ కాల్ కనిపిస్తే , ఆ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకపోయినా నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. బైలింగ్విల్ సిరి అసిస్టెంట్ ద్వారా ఒకటికి మించిన భాషలను టింగ్లీష్, హింగ్లీషు లాగా.. ఇంగ్లిష్, హిందీ కలిపి.. లేదంటే ఆంగ్లంతో తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి భాషలను కలిపి మాట్లాడొచ్చు. అలాగే కీబోర్డ్లోనే బిల్టిన్ ట్రాన్సలేషన్ సపోర్టుతో తమిళం, తెలుగు, కన్నడ మలయాళంతో సహా 10 భారతీయ భాషల్లోకి అనువాదానికి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, పంజాబీ డిక్షనరీకి iOS 17 బీటా సపోర్ట్ ఉంటుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. సిరీ ప్లీజ్ సెట్ అలారమ్ మ్యూజిక్ ప్లే లాంటి ఆదేశాలను తెలుగులోనే ఇవ్వొచ్చు. IOS 17 ఎప్పుడు విడుదలవుతుంది? గత సంవత్సరం, Apple iPhone 14 ఈవెంట్ తర్వాత ఐదు రోజుల తర్వాత iOS 16 ను విడుదల చేసింది. ఈ సంవత్సరం, iOS 17 బీటా 8 , పబ్లిక్ బీటా 6 ఇప్పటికే ముగిసింది, కాబట్టి Apple అదే షెడ్యూల్ను అనుసరించవచ్చు. iOS 17ని ముందుగానే ప్రయత్నించాలనుకుంటే, బీటాలను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ పబ్లిక్ రిలీజ్ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. -
ఐఫోన్ వాడకం నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం!
సాధారణంగా యాపిల్ ఐఫోన్స్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధునిక కాలంలో చాలామందికి వినియోగించే మొబైల్స్లో ఐఫోన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్స్ వాడకూడదని చైనా ఇటీవల ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువ దేశాలు చైనా వస్తువులను వినియోగించడానికి ఒకింత ఆలోచిస్తాయి. కానీ చైనా ఐఫోన్స్ మాత్రమే కాకుండా విదేశీ బ్రాండ్ ఫోన్స్ వినియోగాన్ని నిషేదించింది. భద్రతాపరమైన భయం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే ఈ రూల్ ఎంతవరకు అమలవుతుందనేది తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం కేవలం యాపిల్ ఐఫోన్స్ మాత్రమే వినియోగించకూడదని, ఇతర బ్రాండ్స్ గురించి ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ విషయం మీద యాపిల్ కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ముందు చైనా తీసుకున్న ఈ నిర్ణయం అమ్మకాలను దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్ భద్రత మాత్రమే కాకుండా స్వదేశీ బ్రాండ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా తరువాత యాపిల్ కంపెనీకి పెద్ద మార్కెట్ అయిన చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఐఫోన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. -
యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఆఫర్!
Apple Mega Sale:యాపిల్ ఐఫోన్ లవర్స్కు బంపర్ ఆఫర్ ఆందిస్తోంది. త్వరలోనే కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో పాపులర్ ఐఫోన్లు భారీ డిస్కౌంట్లో ధరలో లభ్యం. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 , ఐఫోన్ 13,ఐఫోన్ 1, ఐఫోన్ తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి లేదా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ ముఖ్యంగా ఐఫోన్ 14 ప్లస్పై భారీ ఆఫర్ అందుబాటులోఉంది. దీన్ని రూ. 72,999 వద్దే దీన్ని సొంతం చేసుకోవచ్చు. దీని లాంచింగ్ ప్రైస్ రూ.89,990. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద నిబంధనల ప్రకారం రూ. 48,999 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే HDFC కార్డుద్వారా జరిపే కొనుగోళ్లపై 128 జీబీ వేరియంట్పై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్సెట్ , 12ఎంపీ డ్యుయల్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర) ఐఫోన్ 14 ఐఫోన్ 14 పై అసలు ధరలో 14శాతందాకా తగ్గింపు. అంటే ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 67,999కి అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికివస్తే 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఆకట్టుకునే బ్యాటరీ సామర్థ్యం ప్రత్యేకం.. ఐఫోన్ 13, ఐఫోన్ 12 ఈ సేల్లో ఐఫోన్ 13ను రూ. 59,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 12 ను డిస్కౌంట్ తరువాత రూ. 51,999 కొనుగోలు చేయ వచ్చు. ఇక ఐఫోన్ 11 64GB వేరియంట్ను కేవలం రూ. 41,999 వద్ద అందుబాటులో ఉంది. -
ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..
కొత్త సిరీస్ను ప్రారంభించినప్పుడు యాపిల్ పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపివేస్తూ వస్తోంది.యాపిల్ ఐఫోన్15 (iPhone 15)ఈ సంవత్సరం ఆఖరులో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్ నిలిపివేసే అవకాశం ఉంది. టామ్స్ గైడ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max), ఐఫోన్13 మిని (iPhone 13 mini)తో పాటు ఐఫోన్12 (iPhone 12) మోడళ్లను యాపిల్ కంపెనీ నిలిపివేయనుంది. ఇందులో ఐఫోన్ 12ను నిలిపివేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్ ఫోన్నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్12 మోడల్ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్ 13 భర్తీ చేస్తుంది. యాపిల్ సాధారణంగా ఒక సంవత్సరం అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్లను ఆపేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 మినీని కూడా నిలిపివేయవచ్చని నివేదిక సూచిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ను కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. దీని ధరను రూ.8000లకుపైగా తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్ 15 విడులయ్యాక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కంపెనీ నిలిపేసే అవకాశం ఉంది. కాగా ఐఫోన్ (iPhone 15) సిరీస్ కింద కంపెనీ నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బేస్ ఐఫోన్15 వేరియంట్, ఐఫోన్15 Plus, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది. -
మేడిన్ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రూ.45,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో రూ.90,000 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్ వాటా ఏకంగా 50 శాతం ఉందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. శామ్సంగ్ రూ.36,000 కోట్ల ఎగుమతులతో 40 శాతం వాటా కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే మొబైల్స్ ఎక్స్పోర్ట్స్ రెండింతలయ్యాయి. భారత్ నుంచి విదేశాలకు చేరిన ఎలక్ట్రానిక్స్ 58 శాతం అధికమై గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,85,000 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్స్ ఎగుమతుల విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా చేసుకున్న రూ.75,000 కోట్లను అధిగమించడం ఆనందంగా ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు చేరుతున్న మొత్తం ఎలక్ట్రానిక్స్లో మొబైల్స్ వాటా 46 శాతంగా ఉంది. -
ఐఫోన్లపై పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్: సంచలన రిపోర్ట్
న్యూఢిల్లీ: భద్రతకు పెట్టింది పేరైన ఐఫోన్లు పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్ గురయ్యాయట. ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టుల ఐఫోన్లను హ్యాకింగ్పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి సంచలనం రేపుతోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు చెందిన ఐఫోన్లు ఇజ్రాయెల్ ఆధారిత స్పైవేర్ మేకర్ పెగాసస్ తరహా స్పైవేర్ దాడికి గురైనట్టు మైక్రోసాఫ్ట్ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు క్వాడ్రీమ్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్టు గుర్తించింది. ప్రధానంగా యాపిల్ డివైస్లే లక్ష్యంగా ప్రత్యేకంగా ఐవోఎస్ వెర్షన్లు 14.4, 14.4.2 తోపాటు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లపై మాల్వేర్ DEV-0196 దాడిచేసిందని తెలిపింది. ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్ , మిడిల్ ఈస్ట్లలో కొత్త బాధితులను గుర్తించిన తర్వాత పెగాసస్ తరహా స్పైవేర్ దాడి భయం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాగే బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఘనా, ఇజ్రాయెల్, మెక్సికో, రొమేనియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉజ్బెకిస్తాన్లలో క్వాడ్రీమ్ సర్వర్లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) 'ENDOFDAYS' అని పిలిచే జీరో-క్లిక్ దాడిచేసినట్టు టొరంటో విశ్వవిద్యాలయం సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు ఏదైనా హానికరమైన, ఫిషింగ్ లింక్స్ పై క్లిక్ చేయకుండానే జరిగే దాడులను "జీరో-క్లిక్" అని పిలుస్తారు. ఈ స్పైవేర్ ఆపరేటర్ నుండి బాధితులకు అదృశ్య iCloud క్యాలెండర్ ఆహ్వానాలను ఉపయోగించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) కాగా పెగాసెస్ వివాదం నేపథ్యంలో యాపిల్ స్పైవేర్ డిటెక్టర్ టూల్ ‘ఇమేజింగ్’ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఐఫోన్లలో ‘పెగాసెస్ స్పైవేర్’ని కనిపెట్టవచ్చట.ఈ కొత్త టూల్ ఐఫోన్ బ్యాకప్, ఇతర ఫైల్స్ను చెక్ చేసి మాల్వేర్ ఏదైనా చొరబడిందా లేదా అని నిర్ధారిస్తుందంటూ అప్డేట్ చేసినసంగతి తెలిసిందే. -
యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!
ప్రీమియం ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం యాపిల్ దిమ్మతిరిగే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ఐఫోన్లు, ఐపాడ్లు కింద పడినా ఏమీ కాకుండా రక్షిస్తుంది. ఫోన్లు కింద పడే సందర్భంలో వీటికున్న సెన్సర్లు వెంటనే గ్రహించి వాటి ఫ్లెక్సిబుల్ స్క్రీన్లు మడతపడేలా చేస్తాయి. దీంతో ఫోన్ కింద పడినా స్క్రీన్లకు ఎటువంటి దెబ్బా తగలదు. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి.. ‘సెల్ఫ్-రిట్రాక్టింగ్ డిస్ప్లే డివైస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్ యూజింగ్ డ్రాప్ డిటెక్షన్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీపై యాపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేసేదీ కంపెనీ పేటెంట్ దరఖాస్తులో పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! ఈ టెక్నాలజీలో ఫోల్డబుల్, రోలబుల్ డిస్ప్లేలు కలిగిన మొబైల్ ఫోన్లు కింద పడిపోతున్నప్పుడు గుర్తించేందుకు సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ కింద పడుతున్నట్లు సెన్సార్ గుర్తించిన వెంటనే అది నేలను తాకే లోపు సున్నితమైన డిస్ప్లే నేలకు తగలకుండా ముడుచుకునిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇలా ముడుచుకునే క్రమంలో ఫోన్లోని రెండు స్క్రీన్లకు మధ్య కోణం తగ్గిపోతుంది. దీని వల్ల ఆ స్క్రీన్లకు దాదాపుగా దెబ్బ తాకే అవకాశం ఉండదు. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
ఆన్లైన్లో ఐఫోన్లు ఆర్డర్.. డెలివరీ బాయ్స్ ఫోన్ స్విచాఫ్.. కట్ చేస్తే
బనశంకరి(బెంగళూరు): ఐఫోన్ల పార్శిల్తో పారిపోయిన ఇద్దరు డెలివరి బాయ్లను మంగళవారం కేంద్ర విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఆరు ఐఫోన్లు, రెండు యాపిల్ వాచీలు, ల్యాప్టాప్, నాలుగు మొబైల్స్, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 5న సుణకల్ పేటే దుకాణంలో ఆరు ఐఫోన్లు, ఒక యాపిల్ ఫోన్ తస్లీం అనే వ్యక్తి కొనుగోలు చేసి విజయనగర ఇంటి అడ్రస్కు పంపడానికి ఓ ఆన్లైన్ డెలివరిని ఆశ్రయించాడు. అరుణ్ పాటిల్ అనే పేరుతో పార్శిల్ చేశారు. అయితే కొద్ది సమయం అనంతరం నయన్ అనే వ్యక్తి ఫోన్ చేసి పార్శిల్ తనకు అందిందని, కొద్ది నిమిషాల్లో పార్శిల్ తీసుకువస్తానని తస్లీంకు ఫోన్ చేశారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో తస్లీం సీఈఎన్ను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి బసవరాజ, మాళప్ప అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి Viral Video: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..! -
ఫ్లిప్కార్ట్లో మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఫ్లిప్కార్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్పై హైజీనిక్ పానీపూరి వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్ 14ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది. ఇక ఈ మధ్యనే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు. ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్ అలాగే నథంగ్ ఫోన్(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్ ఈ సేల్లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్పై కచ్చితమైన డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే. -
ఇండియాలో సేల్స్పై యాపిల్ తీవ్ర కసరత్తు.. ఏకంగా మేనేజ్మెంట్నే!
భారతదేశంలో తమ ఉనికిని నిరంతరం విస్తరించుకోవడంలో భాగంగా యాపిల్ కంపెనీ తమ నాయకత్వ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. కేవలం మార్కెట్ కోసం మాత్రమే కాకుండా దేశంలో తమ ఉత్పత్తులను తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీ తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. బ్లూమ్బెర్గ్ నివేదికల ప్రకారం, మాజీ ఉపాధ్యక్షుడు హ్యూగ్స్ అస్సేమాన్ పదవీ విరమణ తర్వాత ఇండియా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలలో ఈ మార్పు వచ్చింది. అస్సేమాన్ స్థానంలో భారత అధినేత ఆశిష్ చౌదరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆశిష్ చౌదరి యాపిల్ ఉత్పత్తుల విక్రయాల అధిపతి మైఖేల్ ఫెంగర్కు రిపోర్ట్ చేస్తారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ విక్రయాలకు బాధ్యత వహించే ఇద్దరు వ్యక్తులలో మైఖేల్ ఫెంగర్ ఒకరు . అయితే ఈయన డౌగ్ బెక్తో కలిసి నేరుగా టిమ్ కుక్కి రిపోర్ట్ చేస్తాడు. ప్రపంచ దేశాల్లో యాపిల్కు భారత్ ముఖ్యమైన మార్కెట్. కంపెనీ ఇండియా నుంచి ప్రతి సంవత్సరం మంచి ఆదాయాన్ని గడిస్తోంది. (ఇదీ చదవండి: హ్యార్లీ డేవిడ్సన్ కొత్త బైకులు.. మునుపెన్నడూ చూడని కొత్త డిజైన్తో) యాపిల్ కంపెనీ మరిన్ని అమ్మకాలను పొందటానికి ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించాలని యోచిస్తోంది. భారత పర్యటన సందర్భంగా టిమ్ కుక్ దేశం ప్రాధాన్యతను గురించి ప్రస్తావించారు. ఆపిల్ కంపెనీకి ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి మూడు ముఖ్యమైన సరఫరాదారులు ఉన్నారు. యాపిల్ సంస్థ భారతదేశంలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్లతో పాటు నాన్-ప్రో వేరియంట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే చైనా మార్కెట్లో విరివిగా ఐఫోన్ల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో చైనాకు ప్రధాన ప్రత్యామ్నాయాన్ని భారతదేశం అందిస్తుందని ఆశిస్తున్నారు. -
భారీ పెట్టుబడులు, ఒప్పందాలు: ఫాక్స్కాన్ షాకిచ్చిందిగా!
సాక్షి,ముంబై: తైవాన్ కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ ఇండియాలో కొత్త పెట్టుబడులపై క్లారిటీ ఇచ్చింది. తమ ఛైర్మన్ ఇండియాను సందర్శించి నప్పటికీ దేశంలోఎలాంటి కచ్చితమైన ఒప్పందాలు కుదుర్చుకోలేదని వెల్లడించింది. యాపిల్ ఐఫోన్ల తయారీలో అగ్రగామి ఫాక్స్కాన్ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సంస్థ శనివారం తోసిపుచ్చింది. దీంతో ఇకపై తక్కువ ధరకే మేడిన్ ఇండియా ఐఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లైంది. కర్ణాటకలో ఏర్పాటు కానున్న భారీ ప్లాంట్లో ఐఫోన్ల విడిభాగాల తయారీకి 700 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలన్న యోచనలో ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఈ విషయంలో మీడియా వచ్చినట్టుగా చర్చలు,అంతర్గత సమీక్షలు, భారీ పెట్టుబడులు అనేది ఫాక్స్కాన్ అందించిన సమాచారం కాదని తేల్చి పారేసింది. అయితే భారీ పెట్టుబడి కోసం ఫాక్స్కాన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గతంలో చెప్పారు.యంగ్ లియుతో వివరణాత్మక చర్చల తర్వాత రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్కాన్తో ఒప్పందం కుదిరిందనీ, ఇది 1 లక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల భూమి కేటాయించినట్టుగా కూడా బొమ్మై ట్వీట్ చేశారు. దీంతోపాటు లక్షమందికి ఉపాధి కల్పించేలా రాష్ట్రంలో పెట్టుబడుల నిమిత్తం ఫాక్స్కాన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. కాగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు గత ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల (మార్చి) 4 వరకు ఇండియాలో పర్యటించారు. సెమి కండక్టర్ల వంటి నూతన రంగాల్లో సహకారాన్ని కోరేందుకు ఉద్దేశించిందని అధికారికంగానే ప్రకటించారు. అలాగే కంపెనీ అభివృద్ధి అవకాశాలను దృష్టిలో నుంచుకొని స్థానిక ప్రభుత్వాలతో సంబంధాలను కొనసాగిస్తామని కూడా ఆయన ప్రకటించిన సంగతి విదితమే. -
మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్-ఐఫోన్స్
మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్కప్ సాధించి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. అయితే ఇప్పటికి ఫుట్బాల్ అభిమానులు మెస్సీ మాయ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అన్నీ తానై నడిపించిన మెస్సీ ఫిఫా వరల్డ్కప్ అందుకోవాలనే తన కలతో పాటు 36 ఏళ్ల అర్జెంటీనా నిరీక్షణకు తెరదించాడు. అందుకే ఫిఫా చరిత్రలోనే అర్జెంటీనా, ఫ్రాన్స్ల మధ్య జరిగిన ఫిఫా వరల్డ్కప్ 2022 ఫైనల్ అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్గా నిలిచిపోయింది. ఫైనల్లో గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్న మెస్సీ ఇప్పటికే ఫిఫా మెన్స్ అత్యుత్తమ ఆటగాడిగా అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా మెస్సీ చేసిన ఒక పని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేంటో తెలుసా.. ఫిఫా వరల్డ్కప్ అందుకున్న అర్జెంటీనా టీమ్, స్టాఫ్ కోసం మెస్సీ రూ. 1.73 కోట్ల విలువైన 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేయడం విశేషం. స్పెషల్గా తయారయిన ఈ గోల్డ్ ఐఫోన్లపై ఆటగాడి పేర్లు, జెర్సీ నెంబర్లు, అర్జెంటీనా లోగోను ముద్రించారు. ఈ ఐఫోన్లు వారాంతంలో మెస్సీ అపార్ట్మెంట్కు చేరుకున్నాయని సమాచారం. ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతం కావడంతో ఈ వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆటగాళ్లకు ప్రత్యేకమైన బహుమతులు అందించాలని మెస్సీ భావిస్తున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ బన్ లైన్స్తో కలిసి మెస్సీ డివైజ్ల డిజైన్ను రూపొందించినట్లు ది సన్ పత్రిక కథనం ప్రచురించింది. టీం సభ్యులకు, సపోర్ట్ స్టాఫ్కు మెస్సీ గోల్డ్ ఐఫోన్గా ఐఫోన్-14ను ఎంచుకున్నారు. ఫోన్ డిజైన్తో పాటు ఐఫోన్లను మెస్సీ రిసీవ్ చేసుకున్న ఫొటోను ఐ-డిజైన్ గోల్డ్ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతా వెల్లడించింది. ఫిఫా వరల్డ్కప్ గెలుపొందిన మెస్సీ బృందంతో పాటు స్టాఫ్ కోసం 35 గోల్డ్ ఐఫోన్లను డెలివరీ చేయడం గౌరవంగా భావిస్తున్నామని క్యాప్షన్ జత చేసింది. ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన అర్జెంటీనా జట్టు: ఎమి మార్టినెజ్, ఫ్రాంకో అర్మానీ, గెరోనిమో రుల్లి, మార్కోస్ అకునా, జువాన్ ఫోయ్త్, లిసాండ్రో మార్టినెజ్, నికోలస్ టాగ్లియాఫికో, క్రిస్టియన్ రొమెరో, నికోలస్ ఒటామెండి, నహుయెల్ మోలినా, గొంజాలో మోంటియెల్, లెగో జర్మన్ పర్జెల్, ఆంరో జర్మన్ పర్జెల్, రోడ్రి పెజ్జెల్లా, డి పాల్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, ఎంజో ఫెర్నాండెజ్, ఎక్సిక్వియెల్ పలాసియోస్, గైడో రోడ్రిగ్జ్, లియోనెల్ మెస్సీ, లౌటరో మార్టినెజ్, పాలో డైబాలా, ఏంజెల్ కొరియా, జూలియన్ అల్వారెజ్, థియాగో అల్మడ, అలెజాండ్రో గోమెజ్ View this post on Instagram A post shared by 𝗜𝗗𝗘𝗦𝗜𝗚𝗡 𝗚𝗢𝗟𝗗 (@idesigngold) View this post on Instagram A post shared by 𝘽𝙚𝙣𝙟𝙖𝙢𝙞𝙣 𝙇𝙮𝙤𝙣𝙨 (@benlyons1111) చదవండి: అదే రెండున్నర రోజులు.. సీన్ మాత్రం రివర్స్! స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ -
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. న్యూఇయర్కు వెల్కమ్ చెబుతూ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు ఫ్లిప్కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫోన్లతో పాటు ఇతర డివైజ్లను డిస్కౌంట్లకే దక్కించుకోవచ్చు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్లో ప్లస్ మెంబర్షిప్ సభ్యులు ఒకరోజు ముందు నుంచి అంటే డిసెంబర్ 15 నుంచి వారికి నచ్చిన ప్రొడక్ట్కు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ విక్రయాల్లో అర్హులైన కష్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొద్ది రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ను నిర్వహించింది. ఆ సేల్ మిస్సైన వాళ్లు ఈ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ పాల్గొనవచ్చు. స్మార్ట్ ఫోన్లతో పాటు, డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్, మానిటర్లు, ప్రింటర్లు సహా ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకూ డిస్కౌంట్స్, టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. -
ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్: ఫ్లిప్కార్ట్ యాపిల్ డేస్ సేల్ అదిరే ఆఫర్లు
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్ డేస్ సేల్ను ప్రకటించింది. ఈ సేలో ఇండియాలో లభ్యమవుతున్న ఐఫోన్లపై అదరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ఉన్నాయి. ఐఫోన్ కొనాలనుకునే కస్టమర్లు ఫ్లిప్కార్ట్లో నవంబర్ 20 వరకు తగ్గింపులు, ఆఫర్లను పొందవచ్చు ఐఫోన్ 13 రూ.69,900కి లభించే ఐఫోన్ 13ని యాపిల్ డేస్ సేల్లో రూ.64,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ల ద్వారా ఫోన్ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 1,500 వరకు తగ్గింపు. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు ఐఫోన్పై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. 256జీబీ స్టోరేజ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లను రూ.74,999 రూ.94,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 మినీ ఐఫోన్ 12 మినీ ఫ్లిప్కార్ట్లో రూ. 38,999కి లిస్ట్ చేసింది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను వరుసగా రూ.43,999 రూ.53,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 రూ. 79,900ల ఐఫోన్ను ఈ సేల్లో రూ.74,900కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలుచేసిన వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు లభ్యం. ఇతర కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి తగ్గింపు ఉండదు. బ్యాంక్ ఆఫర్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్తో కలిసి దీనిపై రూ. 20వేల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. -
యాపిల్కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్బై
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ యాపిల్కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. యాపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్, ఇవాన్స్ హాంకీ తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ స్థానంలో హాంకీ బాధ్యతలు స్వీకరించారు. హాంకీ స్థానంలో ఎవర్ని నియమించిందీ యాపిల్ అధికారంగా ప్రకటించలేదు. అయితే కొత్త నియామకంగా జరిగేదాకా ఆమె తన పదవిలో కొనసాగ నున్నారు. కాగా ఐమాక్, ఐపాడ్ ఐఫోన్ల పరిచయం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరిగా జోనీ ఐవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్తో కలిసి విభిన్నమైన యాపిల్ ఉత్పత్తులకు నాంది పలికారు. అయితే తన సొంత స్వతంత్ర కంపెనీ స్థాపన నేపథ్యంలో యాపిల్ నుంచి ఆయన నిష్క్రమించడం అప్పట్లో వ్యాపార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
అయ్యో! టిమ్ కుక్..ఇక ఆ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: రిఫర్బిష్డ్ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్హ్యాండ్ ఫోన్లు) భారత మార్కెట్లో డంప్ చేయాలన్న వ్యూహాలకు ఆపిల్ చెక్ చెప్పింది. రిఫర్బిష్డ్ ఐఫోన్లను దిగుమతి చేసుకుని భారత్లో అమ్మేందుకు మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో భారత ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు ఇ-వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించిన ఆందోళనల కారణంగా సెకండ్హ్యాండ్ ఐఫోన్ల దిగుమతికి ఆపిల్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో ఇలాంటి ఐఫోన్లను విక్రయించే ప్రణాళికలను ఆపిల్ రద్దు చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. (Tata Group: ఐఫోన్ లవర్స్కు అదిరిపోయే వార్త: అదే నిజమైతే..!) భారత్లో ఆపిల్ స్టోర్లు, సెకండ్హ్యాండ్ ఐఫోన్ల దిగుమతి విక్రయాల ద్వారా వినియోగదారులకు మరింత చేరువకావడంతోపాటు, ఇక్కడి అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్లో విస్తరించాలనేది ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రణాళిక. ఈ క్రమంలో ఆపిల్ గత కొన్నేళ్లుగా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను దిగుమతి,విక్రయాల అనుమతిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. తక్కువ ధరకే 'ప్రీ-ఓన్డ్, సర్టిఫైడ్ ఫోన్ల విక్రయం ద్వారా మార్కెట్ వాటాను విస్తరించుకునేందుక ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ కథ ముగిసినట్టు తెలుస్తోంది. కానీ భారతదేశంలో స్థానిక తయారీపై ప్రదానంగా దృష్టి పెడుతోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై ఆపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ( Google Pixel 6a: ఫ్లిప్కార్ట్ సేల్, గూగుల్పిక్సెల్ ఫోన్పై భారీ తగ్గింపు) సెకండ్ హ్యాండ్ పరికరాల దిగుమతికి ఆపిల్ను అనుమతించడం అంటే ఇతర కంపెనీలు ఉపయోగించిన ఫోన్లను భారతదేశంలోకి డంపింగ్కు , తద్వారా భారీ ఇ-వ్యర్థాలకు దారితీయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తది అయినా, పాతదయినా ఐఫోన్ అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో పాత ఫోన్ విక్రయాలతో తన మార్కెట్ వాటాను విస్తరించాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుందని ఐడీసీ ప్రతినిధి నవకేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో స్థానికంగా గ్లోబల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ భాగస్వామ్యంతో ఐఫోన్లను తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాటా టాటా గ్రూపు విస్ట్రాన్తో చర్చలు జరపుతోంది. పరిశోధనా సంస్థ టెక్ఆర్క్ ప్రకారం, 2022లో దేశంలో దాదాపు 7 మిలియన్ల ఐఫోన్లు విక్రయించనుందని అంచనా. -
ఐఫోన్14 అలా వచ్చిందో లేదో...ఐఫోన్15 సిరీస్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్14 అలా లాంచ్ అయిందోలేదో అప్పుడే రానున్న ఐఫోన్ సిరీస్పై ఊహాగానాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2023లో లాంచ్ కానుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్లో భారీ మార్పులే చేయనుందట. ప్రస్తుతం ఐఫోన్ 14పై మోడల్స్ ఫీచర్స్ మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ ఈసారి భారీ అప్డేట్స్తో నెక్ట్స్ సిరీస్ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో తాజా అంచనాల ప్రకారం ఐఫోన్-15 సిరీస్లో ప్రో, ప్రో మాక్స్ వేరియంట్ మధ్య భారీ మార్పులే తీసుకురానుంది.ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో అందించని ప్రత్యేక ఫీచర్లు ఐఫోన్ 15 ప్రో మాక్స్లో జోడించనుంది. కాగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఆవిష్కరించింది. ఐఫోన్-14 సిరీస్లో ప్రో, నాన్-ప్రో మోడల్స్ ఫీచర్స్ అప్డేట్ చేసినా, కానీ, రెండు ప్రో మోడల్స్ మధ్య బ్యాటరీ, స్క్రీన్ తప్ప మిగతా ఫీచర్స్లో పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ యూజర్లు భారీ నిరాశ చెందారు. ముఖ్యంగా ఆపిల్ వ్యవస్థపాకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఇన్స్టా స్టోరీ కూడా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 చదవండి:ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది? (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 (1/2) I think Apple should name A16 as A16 Pro and A15 used by two iPhone 14 standard models as A16/A15 Plus. Maybe it helps promote two iPhone 14 standard models. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 -
ఐఫోన్ లవర్స్కు అదిరిపోయే వార్త: అదే నిజమైతే..!
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ లవర్స్కు ఆనందాన్నిచ్చే వార్త ఒకటి మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఫోన్ల తయారీకి, అలాగే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి ఒక జాయింట్ వెంచర్ను స్థాపించేందుకు టాటాగ్రూప్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఆపిల్కు తైవాన్ సరఫరాదారుతో టాటా చర్చలు జరుపు తోందని తెలుస్తోంది. సాల్ట్-టు-సాఫ్ట్వేర్ దిగ్గజం టాటాగ్రూపు ఆపిల్ సంస్థకు చెందిన తైవాన్ సరఫరాదారు విస్ట్రన్ కార్పొరేషన్తో చర్చలు జరుపుతోంది. ఐఫోన్ల అసెంబ్లింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇదే వాస్తవమైతే ప్రొడక్ట్ డెవలప్మెంట్, సప్లయ్ చైన్ అండ్ అసెంబుల్ దిగ్గజం విస్ట్రన్తో టాటా గ్రూప్ ఒప్పందం కీలకంగా మారనుంది. ఫలితంగా ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా నిలవనుంది. దీంతో విలాసవంతమైన ఐఫోన్లు, సరసమైన ధరల్లో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్స్, హైటెక్ మాన్యు ఫాక్చరింగ్పై తమ కంపెనీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు ఇటీవల టాటాగ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యలు ఈ అంచనాలను మరింత బలాన్ని ఇస్తున్నాయి భౌగోళిక, రాజకీయ వివాదాలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి హబ్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికాలాంటివి దృష్టిపెట్టనున్నాయి. అలాగే దేశంలో అసెంబ్లింగ్ సంస్థల ఏర్పాటుకు ఇతర ప్రపంచ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్కు కూడా ఇది తోడ్పడనుంది. అయితే ఈ వార్తలపై విస్ట్రన్ ప్రతినిధి గానీ, టాటా గ్రూపునుంచి గానీ, ఆపిల్ నుంచిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. -
ఐఫోన్ లవర్స్కు బంపర్ ఆఫర్: 10వేల దాకా తగ్గింపు
సాక్షి, ముంబై: ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్. తాజా ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో ఆపిల్ ఐఫోన్ 12 మినీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. జూలై ఒకటినుంచి ప్రారంభమైన ఈ సేల్ మరో రెండు రోజులు మాత్రమే కొనసాగుతుంది. ప్రధానంగా ఐఫోన్లపై బెస్ట్ డీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 14 మిని ఈ ఏడాదికి రాదనే అంచనాల మధ్య తాజా తగ్గింపు ధరలపై మరింత ఆసక్తి నెలకొంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో వినియోగదారులు ఐఫోన్ 12 మినీ రూ.49,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.59,900 అంటూ 6 శాతం తగ్గింపు అందిస్తోంది. ఐఫోన్ 12 మిని : 5.4 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, ఏ14 బయోపనిక్ సాక్, 12 ఎంపీ డ్యూయల్ కెమెరా ప్రధాన ఫీచర్లు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ 12,500 వరకు ఎక్స్చేంజ్ డీల్. ఐఫోన్ 13 మిని : 128 జీబీ స్టోరేజ్ మోడల్పై 7 శాతం తగ్గింపుతో దాదాపు 65,299లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. గతంలో వెబ్సైట్లో దీని ధర రూ. రూ. 69,999. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా అదనపు 5 శాతం క్యాష్బ్యాక్తో పాటు 6 నెలల ఫ్రీ గానా ప్లస్ సబ్స్క్రిప్షన్ను పొందొచ్చు. నిబంధనల మేరకు ఎక్స్చేంజ్ ఆఫర్తో 12,500 తగ్గుతుంది. ఈ ఆఫర్లనీ అమలైతే ఐఫోన్ 13 మిని సుమారు 55 వేలకు సొంతం చేసుకోవచ్చు. -
యాపిల్ ఐఫోన్లకు కొత్త ఐవోఎస్16: ముఖ్య ఫీచర్స్ ఇవే!
క్యుపర్టినో (అమెరికా): టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్వేర్కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 16ను ఆవిష్కరించింది. త్వరలో దీన్ని ఉచిత డౌన్లోడ్గా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. గతంతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు తరచూ ఫోన్ను మార్చేయ కుండా పాత డివైజ్నే మరికొంత ఎక్కువ కాలం ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇవ్వాల్సిన అవసరం పెరిగింది. కొత్త ఐవోఎస్తో యూజర్లు తమ ఫేవరెట్ యాప్లను లాక్ స్క్రీన్పై విడ్జెట్లుగా పెట్టుకోవచ్చు. అలాగే లాక్ స్క్రీన్పై లైవ్ నోటిఫికేషన్లు పొందవచ్చు. ప్రస్తుతం ఫోన్ స్క్రీన్ పైభాగం నుంచి వచ్చే ఇతరత్రా నోటిఫికేషన్లు ఇకనుంచి కింది భాగం నుంచి వస్తాయి. అలాగే మెసేజీలను పంపిన తర్వాత కూడా ఎడిట్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఫీచర్లు ఐఫోన్ మెసేజింగ్ సిస్టమ్లో ఉంటాయి. అయితే, ఇందుకోసం ఇరువైపుల యూజర్లు, యాపిల్ మెసేజింగ్ యాప్ను ఉపయోగిస్తుండాలి. హెడ్క్వార్టర్స్ క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ మరికొన్ని ఉత్పత్తులను కూడా ఆవిష్కరించింది. నెక్ట్స్ జనరేషన్ మ్యాక్ చిప్లతో మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో ప్రదర్శించింది. మ్యాక్బుక్ ఎయిర్ రేటు 1,200 డాలర్లుగా, ప్రో ధర రూ. 1,300 డాలర్లుగా ఉంటుంది. -
ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్పై ఆగ్రహం..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఓఎస్ అప్డేట్పై ఐఫోన్ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్లలో ఈ కొత్త ఐఓఎస్ను అప్ డేట్ చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని యాపిల్కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మార్చి 14న ఐఫోన్లలో యాపిల్ అట్టహాసంగా ఐఓఎస్ 15.4ను అప్డేట్ విడుదల చేసింది. లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్లో ఫీచర్లు బాగున్నా..పనితీరు బాగాలేదంటూ వినియోగదారులు యాపిల్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఐఓఎస్ దెబ్బకు ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందంటూ ట్వీట్లలో ప్రస్తావిస్తున్నారు. మ్యాగ్జిమ్ షిషాకో అనే ట్విట్టర్ యూజర్ ఐఓఎస్ 'ఐఓఎస్ 15.4 అప్డేట్ తర్వాత నా ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. Since iOS 15.4 released yesterday on March.15 2022, many iPhone users started to notice that their iPhone storage has been increased 2x while some notice that they lost some GB of storage after updating to iOS 15.4 and battery life is also worse #Apple #iOS #iOS154 #iPhone — SaadPlayz (@isaadplayz) March 15, 2022 ఇప్పుడే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లో ఐఓఎస్ అప్డేట్ చేశా. ఇంతకు ముందు ఛార్జింగ్ పెడితే ఒకటి , లేదా రెండు రోజులు వినియోగించే వాడిని. కానీ ఇప్పుడు ఒక్కరోజు కాదు కదా.. సగం రోజులోనే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని మరో యూజర్ తెలిపాడు. ios 15.4 battery drain is absolutely ridiculous. @Apple @AppleSupport Need to fix the issue asap or you’re gonna lose your customers very badly Model: iphone 13 mini Battery health: 100% — Nasarudheen (@Nasaruattu) March 19, 2022 నా ఐఫోన్కు ఛార్జింగ్ పెట్టా. 95పర్సంటేజ్, 97పర్సంటేజ్ అని చూపించింది. ఛార్జింగ్ తీసేస్తే 100పర్సెంట్ చూపిస్తుంది. ఐదు నిమిషాల తర్వాత ఆటోమెటిగ్గా ఫోన్ రీస్టార్ట్ అవుతుంది.ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉందో కూడా చూపించడం లేదని మండిపడ్డాడు. ఇలా మైక్రోబ్లాగింగ్లో ఐఫోన్ వినియోగదారులు యాపిల్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తుండగా.. ఐఫోన్ యూజర్లకు తలెత్తిన సాంకేతిక సమస్యలపై యాపిల్ సంస్థ ఇంత వరకూ స్పందించలేదు. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్లాక్! -
ఐఫోన్ పై అదిరిపోయే ఆఫర్, రూ.23వేల వరకు భారీ డిస్కౌంట్!!
యాపిల్ ఐఫోన్ లవర్స్కు బంపరాఫర్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్లో ఐఫోన్ 12,ఐఫోన్ 12మినీ, ఐఫోన్ ఎస్ తో పాటు పలు మోడళ్ల ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను అందిస్తున్నాయి. ఇక ఐఫోన్-13పై రూ.23వేల భారీ డిస్కౌంట్తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్-13 డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్కార్ట్లో ఐఫోన్-13 128జీబీ వేరియంట్ ధర రూ.74,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.84,900, 512జీబీ వేరియంట్ ధర రూ.1,04,900గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ లో డిస్కౌంట్ తో పాటు కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ను ఎక్ఛేంజ్ చేస్తే రూ.18,500 వరకు ఆఫర్ పొందవచ్చు.ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో కొనుగోలు దారులు ఫోన్ పనితీరు, మోడల్ నంబర్ ద్వారా ఫ్లిప్కార్ట్ ఎక్ఛేంజ్ ధరను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి. డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఐఫోన్13 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56400, 128జీబీ ఫోన్ ధర రూ.66400, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86400కే సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు ఫ్లిప్కార్ట్,యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లుపై 5శాతం రివార్డ్, నెలకు రూ.2560 ప్రారంభ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంది. -
ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు, లిస్ట్లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి!
మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయడం లేదా?. ఇటీవల వాట్సాప్ తన ఓస్(ఆపరేటింగ్ సాఫ్ట్వేర్)ను అప్డేట్ చేసింది. దీంతో పాత ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఐఫోన్లు సైతం పనిచేయడం లేదు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని రిపోర్ట్లు ప్రకారం..బ్రెజిల్లో 100 మిలియన్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 30 రకాల స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం రిపోర్ట్లు పేర్కొన్నాయి. వాటిలో శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్, హెచ్టీసీ డిజైర్ 500, సోనీ ఎక్స్పీరియా ఎం, ఎల్జీ ఆప్టిమస్ ఎఫ్7 ఫోన్ ఉన్నాయి. అయితే ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి కారణంగా సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయకపోవడమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. జనవరి 2022 నుంచి 30 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని స్ప్రౌట్ వైర్డ్ తన నివేదికలో పేర్కొంది. కాగా, ఇటీవల కాలంలో భారీగా అమ్ముడైన పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచి పోయాయి. వాట్సాప్ అప్డేట్ ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్ కంటే తక్కువ ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇక ఐఫోన్లలో ఐఎస్ఎస్ 9 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఐఫోన్లలో మెసేజ్లు, ఫోటోలు, వీడియోల్ని ఫార్వర్డ్ చేయలేమని Apple iPhone SE (16GB, 32 GB, and 64GB) Apple iPhone 6S (32GB and 64GB) Apple iPhone 6S Plus (16GB, 32GB, 64GB, and 128 GB) Apple iPhone 6S (128 GB) Apple iPhone 6s (16gb) Mini Samsung Galaxy S3 Samsung galaxy Ace 2 Samsung galaxy core Samsung Galaxy Trend II Samsung galaxy trend lite Samsung Galaxy Xcover 2 LG Act LG Lucid 2 LG Optimus F3 LG Optimus F3Q LG Optimus F5 LG Optimus F6 LG Optimus F7 LG Optimus L2 II LG Optimus L3 II LG Optimus L3 II Dual LG Optimus L4 II LG Optimus L4 II Dual LG Optimus L5 II LG Optimus L5 II Dual LG Optimus L7 II LG Optimus L7 II Dual Archos 53 Platinum Caterpillar Cat B15 Faea F1 HTC Desire 500 Huawei Ascend D2 Huawei Ascend G740 Huawei Ascend Mate Lenovo A820 Sony Xperia M THL W8 Vico darkknight Vico sync five ZTE Grand Memo ZTE Grand S Flex ZTE grand x quad v987 ZTE V956 – UMI X2 చదవండి: వాట్సాప్లో యూపీఐ పిన్ మార్చడం ఎలానో తెలుసా..? -
షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే!
ఈ ఏడాది క్యూ3 ఫలితాల్లో 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా 5జీ స్మార్ట్ ఫోన్ షిప్మెంట్పై 'స్ట్రాటజీ అనలిటిక్స్' సంస్థ రిపోర్ట్ను విడుదల చేసింది. యాపిల్ సంస్థ ప్రపంచంలోనే షిప్మెంట్ విభాగంలో అగ్రస్థానంలో నిలవగా షియోమీ రెండో స్థానంలో, శాంసంగ్ మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ప్రస్తుతం 5జీ మార్కెట్ వరల్డ్ వైడ్గా 25శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఐఫోన్ 12 ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ గతేడాది 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ ఐఫోన్ 12 సిరీస్ను విడుదల చేసింది. ఈ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసిన రెండు వారాల్లోనే సేల్స్ జరిగి...ఐఫోన్ 12 ,ఐఫోన్ 12 ప్రో'లు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన 5జీ ఫోన్లుగా నిలిచాయి. తాజాగా స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక సైతం 5జీ మార్కెట్లో యాపిల్ తొలిస్థానంలో కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో యాపిల్ షావోమీని వెనక్కి నెట్టిందని స్ట్రాటజీ అనలిటిక్స్ డైరెక్టర్ కెన్ హైర్స్ తెలిపారు. ఐరోపాలో శాంసంగ్, చైనాలో ఒప్పో స్మార్ట్ఫోన్ సేల్స్ కారణంగా షావోమీ అమ్మకాలు తగ్గాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. షావోమీ హెడ్ క్వార్టర్స్ చైనాలో మాత్రం 5జీ స్మార్ట్ఫోన్ లపై ఆఫర్లు ప్రకటించడంతో డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. శాంసంగ్ సైతం 3వ త్రైమాసికంలో గ్లోబల్ 5జీ ఫోన్ షిప్మెంట్లలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఒప్పోను వెనక్కి నెట్టింది. శాంసంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ సౌలభ్యంతో పాటు ఫోల్డబుల్ ఫోన్ కారణంగా శాంసంగ్కు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. 4వ స్థానంలో ఒప్పో తర్వాత వివో ఐదో స్థానాన్ని సంపాదించుకోగా...హానర్ తన మాతృ సంస్థ హువావే నుంచి విడిపోవడంతో ద్వారా హానర్ ఈ త్రైమాసికంలో 194శాతం వృద్ధిని సాధించినట్లైందని స్ట్రాటజీ అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. చదవండి: వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు -
అలెర్ట్: మీరు ఆ ఫోన్లు వాడుతుంటే ఇకపై వాట్సాప్ పనిచేయదు
త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఆపిల్ ఫోన్ల వరకు వాట్సాప్ పనిచేయడం ఆగిపోనుంది. ముఖ్యంగా నవంబర్ 1నుంచి ఆయా టెక్ సంస్థలు తయారు చేసిన 43 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. సుమారు 2బిలియన్లకు పైగా వినియోగదారులున్న వాట్సాప్ కొత్త కొత్త మార్పులు చేస్తుంది. ఫీచర్లను యాడ్ చేస్తుంది. అయితే వాట్సాప్ తెస్తున్న కొత్త అప్డేట్ లకు స్మార్ట్ ఫోన్లు సపోర్ట్ చేయడం లేదు. ఆ ఫోన్లలో వాట్సాప్ వినియోగం, లేదంటే వాట్సాప్ ఫీచర్లు పనిచేయాలంటే భారీ ఖర్చు చేయాల్సి ఉంది. అందుకే సపోర్ట్ చేయని ఫోన్లలో యాప్ సేవల్ని నిలిపివేసేందుకు వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ OS 4.1..దానికంటే పై వెర్షన్, అలాగే iOS 10 అంతకంటే పెద్ద వెర్షన్ స్మార్ట్ఫోన్ ఉన్న వారు మాత్రమే వాట్సాప్ను ఉపయోగించడం సాధ్యం అవుతుంది. ఇక వాట్సాప్ పని చేయని ఫోన్ల జాబితాలో మీ ఫోన్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవడం మంచిది. ఐ ఫోన్: ఐఫోన్ 6 ఎస్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్ ఆపిల్ ఐ ఫోన్ ఎస్ఈ హువావే ఎస్సేండ్ G740 ఎస్సేండ్ D క్వాడ్ XL ఎస్సేండ్ మాటే ఎస్సేండ్ P1 S ఎస్సేండ్ D2 ఎస్సేండ్ D1 క్వాడ్ XL. శామ్ సంగ్: శామ్సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్ గెలాక్సీ SII గెలాక్సీ ట్రెండ్ II గెలాక్సీ ఎస్ 3 మినీ గెలాక్సీ కోర్ గెలాక్సీ Xcover 2 గెలాక్సీ ఏస్ 2 ఎల్జీ.. ఎల్జీ లూసిడ్ 2 ఆప్టిమస్ L5 డ్యూయల్ ఆప్టిమస్ L4 II డ్యూయల్ ఆప్టిమస్ F3Q ఆప్టిమస్ F7 ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L3 II డ్యూయల్ ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L5 ఆప్టిమస్ L5 II ఆప్టిమస్ L3 II ఆప్టిమస్ L7 ఆప్టిమస్ L7 II డ్యూయల్ ఆప్టిమస్ L7 II ఆప్టిమస్ F6 ఆప్టిమస్ F3 ఆప్టిమస్ L4 II ఆప్టిమస్ L2 II ఆప్టిమస్ నైట్రో హెచ్డీ,4X హెచ్డీ జెడ్డీటీ జెడ్టీఈ గ్రాండ్ S ఫ్లెక్స్ గ్రాండ్ X క్వాడ్ V987 జెడ్టీఈ V956 గ్రాండ్ మెమో -
జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి
కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. వైరస్ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్లను మెయిల్స్ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్ ఆప్ యాడ్స్ను ఫోన్కి సెండ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫోన్ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు చెక్ చేయాలి. వైరస్ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? ♦మీ స్మార్ట్ఫోన్లో వైరస్లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే..వెంటనే కట్ అవ్వడం, మీ స్మార్ట్ఫోన్కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్ను కొనుగోలు చేయడం. ♦ కంటిన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్ను అటాక్ చేసినట్లు గుర్తించాలి. ♦ మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్లను మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి సెండ్ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్ ఫోల్డర్లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలి. ♦ మీ స్మార్ట్ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ♦వైరస్లు, మాల్వేర్లు మీ స్మార్ట్ఫోన్లో కొత్త యాప్లను కూడా డౌన్లోడ్ చేస్తుంటాయి. ♦ ఈ యాప్లు, మెసేజ్ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది. ♦ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటాయి. పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్లో వైరస్ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా కాపీ చేసుకొని..వైరస్ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్గానీ, డివైజ్గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. కారణం.. డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది. 2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. యాపిల్కు ఎదురుదెబ్బ ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్లను, ఛార్జర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం. యాపిల్లో సీ ఉందిగా! ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్బుక్లు మాత్రం యూఎస్బీ-సీ స్టాండర్డ్ మోడర్న్తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్బీ-సీ, యూఎస్బీ-ఏ ఉపయోగిస్తున్నారు. వేటి వేటి కంటే.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు. డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్. - సాక్షి, వెబ్స్ఫెషల్ చదవండి: ఆవులించినా చర్యలు తీసుకునే కెమెరాలు ఇవి! -
జీహెచ్ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయాలపై వివాదం నెలకొంది. ఐ ఫోన్లు కావాలంటూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల పట్టు బట్టినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేసేందుకు స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా సమాచారం. స్టాండింగ్ కమిటీలోని 17 మంది సభ్యులకు తలా ఒక ఐఫోన్ను ‘బహుమతి’గా ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఒక్కో మొబైల్ విలువ 1.6 లక్షలు. ఈ మొత్తం వ్యవహారానికి 27 లక్షల రూపాయలకు పైగా వ్యయం కానుంది. అయితే, మార్కెట్లో ఐఫోన్-12 మ్యాక్స్ ప్రో (ఇంటర్నల్ మెమొరీ 512 జీబీ) మొబైల్స్ స్టాక్ లేకపోవడంతో కొనుగోలును జీహెచ్ఎంసీ వాయిదా వేసిందట. దాంతో తమకు మొబైల్స్ అందవేమోనని స్టాండింగ్ కమిటీ సభ్యులు కలవరపడుతున్నారట. మరో 45 రోజుల్లో ప్రస్తుత గ్రేటర్ పాలకమండలి గడువు ముగియనుండటమే ఈ కలవరపాటుకు కారణం! (చదవండి: ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు..) తీవ్ర విమర్శలు స్టాండింగ్ కమిటిలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మరో 15 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు సభ్యులు. జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. ఇక ఈ బహుమతుల కార్యక్రమంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కారు పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందనడానికి తాజా బాగోతమే ఉదాహరణ అని బీజేపీ హైదరాబాద్ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న నగరపాలక సంస్థ ఇంత ఖర్చు చేసి ఐఫోన్లు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని నీళ్లలాగా ఖర్చు చేస్తున్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులు సిగ్గుపడాలని చురకలు వేశారు. ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని మీడియాతో శుక్రవారం పేర్కొన్నారు. కాగా, గ్రేటర్ నూతన పాలక మండలి ఫిబ్రవరిలో కొలువుతీరనుంది. (చదవండి: ఇక హైదరాబాద్లో ఫ్రీ వాటర్.. అయితే..) -
‘విస్ట్రాన్’లో వేలాది ఐఫోన్లు లూటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నరసాపురాలోని ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ విస్ట్రాన్ కార్పొరేషన్లో అత్యంత విలువైన వేలాది ఐఫోన్లు లూటీకి గురయ్యాయి. ఉద్యోగుల హింసాకాండ వల్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు విస్ట్రాన్ ప్రతినిధులు సోమవారం ప్రకటించారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ విస్ట్రాన్ ప్లాంట్లో ఉద్యోగులు శనివారం తీవ్ర బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ప్లాంట్ చాలావరకు ధ్వంసమైంది. విలువైన యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆçహుతయ్యాయి. 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2,000 మంది గుర్తు తెలియని వ్యక్తులు హింసాకాండకు పాల్పడ్డారని విస్ట్రాన్ ప్రతినిధి టీడీ ప్రశాంత్ చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు, కర్ణాటక కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు 149 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. విస్ట్రా కంపెనీలో దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆపిల్కు భారీ జరిమానా
టెక్ దిగ్గజం ఆపిల్కు భారీ షాక్ తగిలింది. వినియోగదారులను నమ్మించేందుకు తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ ఆపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ ( 12 మిలియన్ డాలర్లు, కోటి 20 లక్షల డాలర్లు) జరిమానా విధించింది. తమ వివిధ ఐఫోన్లు వాటర్ రెసిస్టెంట్ అంటూ తప్పుదోవ పట్టించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ , ఆపిల్ ఇటాలియాపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇటలీ యాంటీ ట్రస్ట్ అథారిటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ : ఆఫర్లు) ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ప్రకటన ప్రకారం ఆపిల్ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.ఈ లక్షణం కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఉందని స్పష్టం చేయకుండా వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది. కంపెనీ డిస్క్లైమర్లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వినియోగదారులను తప్పుడు ప్రకటనతో మోసం చేయడమేనని యాంటీట్రస్ట్ అథారిటీ వాదించింది. అంతేకాదు నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదని కూడా ఆరోపించింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో , ఐఫోన్ 11 ప్రో మాక్స్ మోడళ్లకు సంబంధించిన ప్రచారాన్ని ఇది ఊదహరించింది. ఈ మోడళ్ల నీటి నిరోధక లక్షణాల గురించి తప్పుదారి పట్టించినందుకు ఆపిల్కు 10 మిలియన్ యూరోలు జరిమానా విధించినట్లు తెలిపింది. -
ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, చెన్నై: ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్ఫోన్ మార్కెట్పై కన్నేసిన స్మార్ట్ఫోన్ మేకర్ ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో టాప్ ఎండ్ ఐఫోన్లను తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్కాన్ స్థానిక యూనిట్ ద్వారా ఖరీదైన ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయనుంది. ముఖ్యంగా ఐ ఫోన్ ఎక్స్, ఎక్స్ ఎస్, మాక్స్, ఎక్స్ఆర్ లాంటి అతి ఖరీదైన స్మార్ట్ఫోన్లను రూపొందించనుంది. తమిళనాడులో శ్రీపెరంబూర్ ప్లాంట్లో ఐఫోన్ ఎక్స్ అసెంబ్లింగ్ను సాధ్యమైనంత( వచ్చే ఏడాది ప్రారంభం నుంచి) తొందరగా ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్లోనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఈ యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్ను మొదలుపెడ్తామని ఫాక్స్కాన్ వెల్లడించింది. సుమారు రూ.2500 కోట్ల పెట్టుబడులను ఆపిల్ పెడుతోంది. మరోవైపు కొత్త విస్తరణ నేపధ్యంలో భారీగా ఉద్యోగవకాశాలు లభిస్తాయని తమిళనాడు ప్రభుత్వం ఆశిస్తోంది. సుమారు 25వేలకు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి సంపత్ రాయిటర్స్తో చెప్పారు. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి తిరస్కరించారు. కాగా విస్ట్రన్ కార్పోరేషన్ ద్వారా బెంగళూరులో ఐ ఫోన్ ఎస్ఈ, ఆర్ఎస్ మోడల్స్ మాత్రమే దేశంలో ఎసంబుల్డ్ చేస్తోంది ఆపిల్ కంపెనీ. అలాగే చెన్నై ప్లాంట్లో గతంలో నోకియా ఫోన్లను తయారు చేసిన ఫాక్స్కాన్ ప్రభుత్వంతో వచ్చిన విబేధాల కారణంగా 2014లో ఉత్పత్తిని నిలిపివేసింది. రూ.21 వేల కోట్ల పన్ను వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో తాజాగా ఆ ప్లాంట్లో ఆపరేషన్స్ మొదలుపెట్టినట్టు సమాచారం. -
ఐ ఫోన్లపై భారీ క్యాష్బ్యాక్ ఆఫర్స్
ఐ ఫోన్ కావాలని కలలు కంటున్నారా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ మిస్ అయ్యారా? అయితే దసరా పండుగ సందర్భంగా పేటీఎం మాల్ పలు ఉత్పత్తులపై భారీగా క్యాష్బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఒకవైపు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఫెస్టివ్ సేల్ ఆదివారంతో ముగిసిపోవడంతో పే టీఎం మాల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటి నుంచి (అక్టోబర్ 16) ఈ నెల 18 వరకు పేటీఎం మాల్ మరోసారి ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై క్యాష్బ్యాక్ను అందిస్తోంది. తాజా ఐ ఫోన్లపై మహా క్యాష్బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 256జీబీ స్మార్ట్ఫోన్పై భారీగా 20వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ మార్కెట్ ధర రూ. 1,05,720తో పోలిస్తే. రూ .3830 డిస్కౌంట్ ఆఫర్తో 1,01,890 రూపాయల వద్ద పేటీఎం మాల్ విక్రయించింది. దీనికి ప్రస్తుత క్యాష్బ్యాక్ అదనం. 64 జీబీ ఐఫోన్ ఎక్స్పై రూ. 3502 తగ్గింపు లభిస్తుంది. అంటే మార్కెట్ ధర రూ. 95,390 నుంచి తగ్గి 91,888 రూపాయలకు లభ్యం. అలాగే రూ. 22వేల దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందేందుకు MOBFESTIVE18K ప్రోమో కోడ్ను ఉపయోగించాలి. అంతేకాదు ఐ ఫోన్ ఎక్స్ఎస్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఉంది. IPH5000 ప్రోమో కోడ్ ద్వారా 64జీబీ ఐఫోన్ కొనుగోలుపై 5వేల దాకా క్యాష్ బ్యాక్ ఉంది. 256 జీబీ స్మార్ట్ఫోన్ లో 12వేల క్యాష్ బ్యాక్ ఆఫర్. దీనికి ప్రోమో కోడ్ MOBFESTIVE12K. వీటితోపాటు 64జీబీ ఐఫోన్ 8 ప్లస్పై 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్. ప్రోమో కోడ్ MOBFESTIVE13K.. 256జీబీ ఐఫోన్ 8 కొనుగోలుపై 13500 క్యాష్ బాక్ ఉంది. ప్రోమో కోడ్MOBFESTIVE13500. 32జీబీ , 128జీబీ ఐఫోన్ 7 వరుసగా 4500, 8500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ .ప్రోమో కోడ్ MALLFESTIVE8500.32జీబీ ఐఫోన్ 6ఎస్ లో రూ. 3500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. చివరగా, 32జీబీ ఐఫోన్ 6 వేరియంట్ 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ప్రోమోకోడ్ ద్వారానే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ప్రోమోకోడ్ ద్వారా ఆఫర్ చేస్తున్న నగదును ఫోన్లను డెలివరీ చేసిన 24గంటల్లోపు కస్టమర్ల ఖాతాలో క్రెడిట్ చేస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు దుస్తులపై గరిష్టంగా 70శాతంరాయితీని ప్రకటించింది. కంప్యూటర్ ఉత్పత్తులపై 25శాతం క్యాష్ బ్యాక్ను, గేమింగ్ కన్సోల్స్పై రూ.6వేల క్యాష్బ్యాక్ ఆఫర్. అలాగే గృహోపకరణాలపై 60శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్పై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. -
వాట్సాప్ : ఐఫోన్ యూజర్లకు బ్యాడ్న్యూస్
టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12 ఐఫోన్ యూజర్ల ముందుకు వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో, అప్డేట్లతో ఐఫోన్ యూజర్లను, ఐప్యాడ్ యూజర్లను ఇది అలరిస్తోంది. కొత్త ఐఓఎస్ 12 మార్కెట్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే... ఐఫోన్ యూజర్లకు షాక్ ఇస్తూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఓఎస్ 7.1.2కి ముందున్న ఐఓఎస్ వెర్షన్లకు తమ యాప్ పనిచేయదని ప్రకటించింది. అంటే 1 ఫిబ్రవరి, 2020 నుంచి ఐఓఎస్ 7, దాని ముందున్న వెర్షన్లు వేటికి కూడా వాట్సాప్ సపోర్టు చేయదని చెప్పేసింది. ఐఓఎస్ 7.1.2 యూజర్లకు కూడా తమ యాప్ను వాడుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన కొత్త ఎఫ్ఏక్యూ సెక్షన్లో వెల్లడించింది. వాట్సాప్ సపోర్టు చేసే ఐఫోన్ డివైజ్లను కూడా పేర్కొంది. ఇక నుంచి కేవలం ఐఓఎస్ 8, ఆపై యూజర్లకు మాత్రమే వాట్సాప్ పనిచేయనుందని స్పష్టం చేసింది. ‘ఐఫోన్కు వాట్సాప్ కావాలంటే, ఐఓఎస్ 8 లేదా ఆ తర్వాతి వెర్షన్లు ఉండాల్సిందే’నని తేల్చి చెప్పింది. 1 ఫిబ్రవరి, 2020 తర్వాత కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకోవడానికి, పాత అకౌంట్లను పునఃధృవీకరించుకోవడానికి కూడా కుదరదు. అయితే ఈ ప్రభావం ఎక్కువ మంది యూజర్లపై పడదని తెలుస్తోంది. ఐఓఎస్ 7.1.2 వచ్చిన తర్వాత ఐఫోన్ పాత డివైజ్లకు ఎలాంటి అప్డేట్లు లేదు. ముఖ్యంగా ఐఫోన్ 4కు, ఐఫోన్ 3జీఎస్లకు. ఐఫోన్ 4ను 2010లో లాంచ్ చేయగా.. ఐఫోన్ 3జీఎస్ 2009లో మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6.1.6 తర్వాత ఇక ఎలాంటి అప్డేట్ను పొందలేదు. 2008లో లాంచ్ అయిన ఐఫోన్ 3జీ కి కూడా వాట్సాప్ పనిచేయదు. అయితే 2011లో లాంచ్ అయిన ఐఫోన్ 4ఎస్లకు చివరి అప్డేట్ ఐఓఎస్ 8.4.1. దీంతో వీటికి వాట్సాప్ పనిచేస్తుంది. కాగా, తాజాగా ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12ను సెప్టెంబర్17న విడుదల చేసింది.. 85 శాతం యాక్టివ్ డివైజ్లు ఐఓఎస్ 11తో పనిచేస్తూ ఉండగా.. ఐఓఎస్ 10తో 10 శాతం, పాత వెర్షన్లతో మిగిలిన 5 శాతం పనిచేస్తున్నాయి. అంటే ఐఓఎస్ 10కు ముందున్న వెర్షన్ డివైజ్లు లక్షల్లో కొన్ని మాత్రమే. -
మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ - 4
-
ఆపిల్ వాచ్ బైపాస్ సర్జరీ చేస్తుందట!!
టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ 12.. ఓ ఐకానిక్’ డే. ఎన్నో రూమర్లు, మరెన్నో లీక్ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 12 ప్రవేశపెట్టింది. ఐఫోన్లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్ను దీనిలో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని ఇది లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ తీసుకోవచ్చు. మొట్టమొదటిసారి ఐఫోన్లను డ్యూయల్ సిమ్ ఫీచర్తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త ఆపిల్ ప్రొడక్ట్లపై సోషల్ మీడియా మాత్రం జోకులు వేయడం ఆపలేదు. 2018 ఆపిల్ వాచ్ సిరీస్ 4 ఈసీజీ ఫీచర్ ఉంటే, 2019 వాచ్లో యాంజియోప్లాస్టీ, 2020 వాచ్లో బైపాస్ సర్జరీ, 2021లో అంత్యక్రియల ఏర్పాటు ఫీచర్లు ఉంటాయంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. మనం 2018లో జీవిస్తుంటే, ఆపిల్ ఇంకా 2012లోనే నివసిస్తుందంటూ డ్యూయల్ సిమ్ ఫీచర్ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఓ వ్యక్తి ఒక టేబుల్ వద్ద కూర్చుని ఐఫోన్ ఆపిల్ లోగోతో వస్తుందని చెబుతున్న కార్టూన్ గీయగా.. మరోవ్యక్తి, ఆండ్రాయిడ్ ఫోన్ అవే ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్న పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందపడిపోవడాన్ని ఆపిల్ వాచ్ సిరీస్ 4 గుర్తిస్తుంది, అవునా..అయితే కొంతమంది రూపాయిని ధరిస్తారు అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Apple watch features 2018 : ECG 2019 : Angioplasty 2020 : Bypass Surgery 2021: Funeral arrangements#AppleEvent — SAGAR (@sagarcasm) September 12, 2018 IPhone fans right now #AppleEvent pic.twitter.com/nuQgOyaMWt — Mask ishan (@Mr_LoLwa) September 12, 2018 We’re all living in 2018 while Apple is living in 2012 #AppleEvent pic.twitter.com/hJnyfbGgbK — 9GAG (@9GAG) September 13, 2018 Android be like : Launch wo kar rahein hain par features humaare hain.#AppleEvent pic.twitter.com/v24iRk4tst — SAGAR (@sagarcasm) September 12, 2018 Reality check. #AppleEvent #iphoneXs pic.twitter.com/tC6wBYFqAc — Godman Chikna (@Madan_Chikna) September 12, 2018 me @ my iPhone 📱 after seeing the new prices #AppleEvent pic.twitter.com/xPJW1iB4vV — Khattak (@Nayapakistan_55) September 12, 2018 Fixed it. #AppleEvent pic.twitter.com/6Y1cHkcrzY — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Samsung fans watching #AppleEvent and realising they can’t even taunt you about dual sim anymore. pic.twitter.com/Ka2nksuv15 — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Me and my broke friends checking the price of the new iPhone. #AppleEvent pic.twitter.com/88a1yUyeDm — Bade Chote (@badechote) September 12, 2018 -
ఆపిల్ అభిమానులకు పండుగ : రేపే మూడు ఐఫోన్లు
ఆపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఎన్ని మోడళ్లు వస్తున్నా కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తుంటారు ఐఫోన్ అభిమానులు. కొత్త మోడల్ ఐఫోన్ విడుదలవుతుంటే చాలు ... అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. గంటల తరబడి లైన్లో నిలబడి మరీ కొత్త ఐఫోన్ను సొంతం చేసుకోవాలనుకుంటుంటారు. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఏడాది కూడా ఆపిల్ మూడు సరికొత్త ఐఫోన్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. అది కూడా రేపే. సెప్టెంబరు 12న అంటే రేపు కూపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో వీటి లాంచింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ పేర్లతో ఇవి లాంచ్ కాబోతున్నాయని టాక్. ఐఫోన్ 9 మూడు ఐఫోన్లలో అత్యంత సరసమైనదిగా ఉండనుందని, ఇది 6.1 అంగుళాల ఎల్సీడీ ప్యానల్తో రూపొందిందని ఇప్పటికే పలు రిపోర్టు చెప్పాయి. మిగతా రెండు 5.8 అంగుళాల ఓలెడ్, 6.5 అంగుళాల ఓలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంటుందని పేర్కొన్నాయి. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్ఎస్లు రెండు రోమనియన్ వెబ్సైట్ క్విక్మొబైల్లో సీక్రెట్గా ప్రీ-ఆర్డర్కు కూడా అందుబాటులోకి వచ్చాయట. ఈసారి లాంచ్ చేయబోయే ఐఫోన్లలో ఒకటి డ్యుయల్ సిమ్తో అలరించబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆపిల్ ఐఫోన్లన్నీ సింగిల్ సిమ్తోనే పనిచేసేవి. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీ తట్టుకునేందుకు ఆపిల్ కూడా ఒక మోడల్ను డ్యుయల్ సిమ్తో విడుదల చేయబోతుందని తెలిసింది. మూడు ఐఫోన్లతో పాటు, ఐప్యాడ్ ప్రొ, ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా ఈ కంపెనీ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అసలు రేపు జరిగే ఈవెంట్లో ఆపిల్ తన అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తోందో వేచిచూడాలి. -
2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది(2018లో) మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఎంట్రీ లెవల్ డివైజ్ను 6.1 అంగుళాల స్క్రీన్లో తీసుకొస్తుండగా.. ఇతర వేరియంట్లను 5.8 అంగుళాలు, 6.46 అంగుళాలలో లాంచ్ చేయబోతుంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్లను ఆపిల్ ఎప్పుడు లాంచ్ చేస్తుందో కూడా తెలిసిపోయింది. ఇద్దరు జర్మన్ టెలికాం ఆపరేటర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆపిల్ ఈ మూడు ఐఫోన్లను సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో లాంచ్ చేయనుందని తెలిసింది. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా వెంటనే సెప్టెంబర్ 14నే ప్రారంభం కాబోతున్నాయట. కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ డివైజ్లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని రిపోర్టులు వెల్లడించాయి. ఆపిల్ అప్కమింగ్ స్మార్ట్ఫోన్ల గురించి ఇంటర్నెట్లో పలు ఆసక్తికర వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రీమియం వెర్షన్ ఐఫోన్ల పేరు ఐఫోన్ ఎక్స్ఎస్గా, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్టైలస్ ఫీచర్ అంటే ఆపిల్ పెన్సిల్ సపోర్టుతో ఈ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయట. స్మార్ట్ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 9కు పోటీగా కూపర్టినో కంపెనీ వీటిని తీసుకొస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ రెండూ కూడా కంపెనీ ఏ12 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తాయని, 4జీబీ ర్యామ్, ప్రముఖ ఫేస్ఐడీ ఫీచర్ను ఇవి కలిగి ఉంటాయని సమాచారం. ధర విషయంలో 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ మోడల్ 899 డాలర్లుగా.. 6.46 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ వేరియంట్ 999 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్ వేరియంట్ ధర 650 డాలర్ల నుంచి 800 డాలర్ల మధ్యలో ఉంటుందట. 3జీబీ ర్యామ్లో, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఇది లభ్యమవుతుందని టాక్. -
మిస్టరీ మాల్వేర్ : వీవీఐపీల ఐఫోన్లే టార్గెట్
హైదరాబాద్ : ఇటీవల మాల్వేర్ వైరస్లు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయో చూస్తున్నాం. వ్యక్తిగత డేటాలను చోరి చేస్తూ.. మాల్వేర్లు విజృంభిస్తున్నాయి. తాజాగా భారత్లో 13 ఐఫోన్లపై అనుమానిత అప్లికేషన్ దాడి చేసిందట. డేటాను, సమాచారాన్ని ఆ అప్లికేషన్ దొంగలించేసింది. 13 ఐఫోన్లే కదా..! లక్షల ఫోన్ల మాదిరి చెప్పారేంటి అనుకుంటున్నారా? కానీ చోరికి గురైనా ఆ ఐఫోన్లు వీవీఐపీలవి అంట. వీవీఐపీ స్మార్ట్ఫోన్లను టార్గెట్ చేసి, ఓ మిస్టరీ మాల్వేర్ అటాక్ చేసినట్టు సిస్కో టాలోస్ కమర్షియల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ మాల్వేర్ రీసెర్చర్లు, అనాలిస్టులు బహిర్గతం చేశారు. అయితే ఈ వీవీఐపీలు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. భారత్లో ఉండే ఈ దాడి జరిపిన అటాకర్, రష్యాలో ఉన్నట్టు నమ్మిస్తున్నట్టు సిస్కో నిపుణులు చెప్పారు. రష్యన్ పేర్లు, ఈమెయిల్ డొమైన్లను ఇతను వాడుకున్నట్టు పేర్కొన్నారు. దాడికి రెండు వ్యక్తిగత డివైజ్లను వాడిన అటాకర్, భారత్లో వొడాఫోన్ నెట్వర్క్తో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నెంబర్ను వాడినట్టు చెప్పారు. ఓపెన్ సోర్స్ మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎండీఎం)ను ఫోన్లలోకి చొప్పించి, ఆ 13 డివైజ్లలోకి అటాకర్ ఎన్రోల్ అయినట్టు టాలోస్ ఇంటెలిజెన్స్ నిపుణులు తమ బ్లాగ్లో రివీల్చేశారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్లోకి ఫీచర్లను యాడ్ చేయడం కోసం పలు టెక్నికల్స్ను వాడటం, టార్గెట్ చేసిన డివైజ్లలోకి ఎండీఎం చెందిన టెలిగ్రామ్ను చొప్పించడం ద్వారా ఈ దాడికి పాల్పడినట్టు సిస్కో మాల్వేర్ రీసెర్చర్ ఆడ్రూ విలియమ్స్, మాల్వేర్ అనాలిస్ట్ పౌల్ చెప్పారు. మాల్వేర్, టార్గెట్ చేసిన ఐఫోన్ డివైజ్ల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను సేకరించడం, ఎస్ఎంఎస్లను, యూజర్ల ఫోటోలను, కాంటాక్ట్లను, లొకేషన్, సీరియల్ నెంబర్, ఫోన్ నెంబర్ లాంటి సమాచారాన్ని దొంగలించడం చేసిందని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని బ్లాక్మెయిల్ లేదా అవినీతికి ఉపయోగిస్తున్నట్టు లైనక్స్/యునిక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆన్లైన్ కమ్యూనిటీ నిక్స్క్రాఫ్ట్ చెప్పినట్టు టాలోస్ రీసెర్చ్ కోట్ చేసింది. దీని బారిన పడిన ఐఓఎస్ డివైజ్ యూజర్లకు కనీసం దీని గురించే అర్థం కాదని చెప్పింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ఆపరేషన్ను కనీసం గుర్తించలేకపోయామని చెప్పారు. ‘ఐఫోన్ ప్రమాదబారిన పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ మాల్వేర్ ప్రభావితం బారిన పడటం తక్కువగా నమోదవుతుంటుంది. దీనిలో యూజర్ల తప్పిదం కూడా ఉంటుంది. అటాకర్లు సోషల్ ఇంజనీరింగ్ వాడుకుని ఐఫోన్లలోకి చొప్పించి ఉంటారు’ అని తెలంగాణ సీఐడీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు యూ రామ్మోహన్ చెప్పారు. -
అమెజాన్లో ఐఫోన్ ఫెస్ట్, ఆఫర్లు ఇవిగో!
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన వెబ్సైట్లో ఐఫోన్ ఫెస్ట్కు తెరలేపింది. ఈ ఫెస్ట్ సందర్భంగా పలు ఆపిల్ ఐఫోన్ మోడల్స్పై ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఫోన్లను కేవలం హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఈఎంఐ లావాదేవీలపై కూడా వాలిడ్లో ఉంటుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, జూన్ 12 వరకు కొనసాగుతోంది. ఫెస్ట్లో భాగంగా అందించే ఆఫర్లు... ఆపిల్ ఐఫోన్ 10వ వార్షికోత్సవంగా వచ్చిన స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎక్స్పై 4,001 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అదనంగా దీనిపై 4 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ను ఇస్తోంది. అమెజాన్లో రూ.89వేలుగా లిస్ట్ అయిన ఈ ఫోన్, రెండు డిస్కౌంట్ల అనంతరం రూ.80,999కే అందుబాటులోకి వచ్చింది. అంతేకాక ఈ స్మార్ట్ఫోన్పై రూ.14,600 ఎక్స్చేంజ్ ఆఫర్ను అందిస్తోంది. ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8 స్మార్ట్ఫోన్లపై కూడా 3 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ను కస్టమర్లు పొందవచ్చు. రూ.1,001 ఫ్లాట్ డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 8 ప్లస్ను రూ.71,999కు అమెజాన్ విక్రయిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్ఫోన్పై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ను పొందవచ్చు. మరోవైపు 4వేల రూపాయల డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 8 రూ.59,999కు అందుబాటులోకి వచ్చింది. దీనిపై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 7పై యూజర్లు 2 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ను పొందనున్నారు. 45,999 రూపాయలకు విక్రయించే ఈ స్మార్ట్ఫోన్పై కూడా రూ.6,371 ఫ్లాట్ డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ ఫోన్పై కూడా రూ.14,600 ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇలా ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ స్మార్ట్ఫోన్ అన్నింటిపై అమెజాన్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ప్రతి కొనుగోలుపై రూ.250 అదనపు క్యాష్బ్యాక్నూ అమెజాన్ నేడు ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఇండియా ఐదో వార్షికోత్సవంలో భాగంగా ఈ క్యాష్బ్యాక్ను ఇస్తోంది. -
కొత్త ఐఫోన్ల డిస్ప్లే స్క్రీన్లు ఏంటో తెలుసా?
టర్కీ : వచ్చే ఏడాది కొత్త ఐఫోన్ మోడల్స్ మూడింటిని లాంచ్ చేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు ఓలెడ్ స్క్రీన్లను వాడాలని ఆపిల్ నిర్ణయించినట్టు దక్షిణ కొరియా ‘ఎలక్ట్రానిక్ టైమ్స్’ రిపోర్టు చేసింది. దీంతో జపాన్ డిస్ప్లే షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. జపాన్ డిస్ప్లే ప్రస్తుతం ఐఫోన్లకు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే(ఎల్సీడీ) స్క్రీన్లను అందించే సప్లయిర్లలో ప్రధానమైనది. ఆపిల్ ఇక తన కొత్త ఐఫోన్లకు ఓలెడ్ డిస్ప్లేలను వాడనుందని తెలియడంతో జపాన్ డిస్ప్ షేర్లు పతనమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా ఎల్జీ డిస్ప్లే కో పైకి ఎగిసింది. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి ఆపిల్ దక్షిణ కొరియా కార్యాలయం కానీ, జపాన్ డిస్ప్లే కానీ నిరాకరించాయి. జపాన్ డిస్ప్లే కూడా ఓలెడ్ ప్యానల్స్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్లాన్ను 2019 నుంచి అవలింభించబోతోంది. ఈ కొత్త ప్రొడక్షన్ లైన్ను లాంచ్ చేయడం కోసం కొత్త ఇన్వెస్టర్లను సైతం జపాన్ డిస్ప్లే వెతుకుతోంది. నిజంగానే ఆపిల్ వచ్చే ఏడాది నుంచి అన్ని మోడల్స్కు ఓలెడ్ డిస్ప్లేలను వాడితే, అది ఎల్జీకి గుడ్న్యూస్ కానుంది. దీంతో ఈ కంపెనీ షేర్లు కూడా 5 శాతం పైకి జంప్ చేశాయి. ఓలెడ్ డిస్ప్లేల సరఫరా కోసం వనరులను విస్తరించాలని కూడా ఆపిల్ చూస్తున్నట్టు సియోల్కు చెందిన సిన్యంగ్ విశ్లేషకుడు లీ ఓన్-సిక్ చెప్పారు. -
రూ.15వేలకే ఐఫోన్, ఐప్యాడ్లు
న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. మీ ప్రియమైన వారికి ఆపిల్ డివైజ్తో సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్న్యూస్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్పై హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా అధికారిక డీలర్ల వద్ద ఆపిల్ డివైజ్ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు 10వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. ఐఫోన్లపై డిస్కౌంట్లు : ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6 పై 7 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఇది కేవలం హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై మాత్రమే కొనుగోలు చేయాలి. అది కూడా ఈఎంఐ రూపంలోనే వర్తిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ (32GB) రూ.22వేలుగా ఉంది. 7 వేల రూపాయల క్యాష్బ్యాక్తో రూ.15వేలకే ఐఫోన్ ఎస్ఈ లభిస్తోంది. ఐఫోన్ 6 పైన కూడా ఇదే విధమైన ఆఫర్ అందిస్తోంది. ఐపాడ్స్పై భారీ ఆఫర్లు : ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ 4, ఐప్యాడ్ ప్రొ ఈఎంఐ లావాదేవీలపై రూ.10వేల వరకు క్యాష్బ్యాక్ను హెచ్డీఎఫ్సీ ఆఫర్ చేస్తోంది. దీంతో 9.7 అంగుళాల వై-ఫై ఓన్లీ మోడల్ ఐప్యాడ్(32జీబీ స్టోరేజ్) అత్యంత తగ్గింపుకు వస్తోంది. ప్రస్తుతం రూ.25వేలకు విక్రయిస్తున్న ఈ స్మార్ట్ఫోన్, 10వేల రూపాయల క్యాష్బ్యాక్ ఆఫర్తో కేవలం రూ.15వేలకు మాత్రమే లభిస్తోంది. ఐఫోన్ షోరూమ్లు, ప్రముఖ మొబైల్ షాపుల్లో హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇటీవల ఇదే రకమైన క్యాష్బ్యాక్ ఆఫర్ను ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్లపై కూడా హెచ్డీఎఫ్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డివైజ్ను ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు క్యాష్బ్యాక్ను అందిస్తోంది. ఈ ఆఫర్ 2018 మార్చి 11 వరకు అందుబాటులో ఉంటుంది. -
ఐఫోన్ ధరలు పెంచేసిన ఆపిల్
న్యూఢిల్లీ : బడ్జెట్-2018 ఎఫెక్ట్ ప్రారంభమైంది. బడ్జెట్లో ప్రతిపాదించిన దిగుమతి సుంకం పెంపు మేరకు, టెక్ దిగ్గజం ఆపిల్ తన అన్ని ఐఫోన్ మోడల్స్ ధరలను సగటున 3 శాతం మేర పెంచేసింది. ఒక్క ఐఫోన్ ఎస్ఈ మినహా మిగతా ఐఫోన్ల ధరలన్నీ పెరిగాయి. గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం భారత్లోతన ఐఫోన్ల ధరలను పెంచుతున్నట్టు ఆపిల్ ప్రకటించింది. ఈ పెంపుతో ఐఫోన్ ఎక్స్ 256జీబీ వేరియంట్ ధర రూ.3000 నుంచి రూ.3200 పెరిగింది. దీంతో అంతకముందు రూ.1,05,720గా ఉన్న ఈ ఫోన్ ధర ప్రస్తుతం, రూ.1,08,930గా అయింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్ ధరలు కూడా 1100 రూపాయలు, 1350 రూపాయల మేర పెరిగాయి. దీంతో ఐఫోన్ 6 ధర రూ.31,900గా, ఐఫోన్ 6ఎస్ ధర రూ.42,900గా మారింది. భారత్లో ప్రస్తుతం 16 మోడల్స్ను ఆపిల్ విక్రయిస్తోంది. ఆపిల్ కూడా ఈ ధరల మార్పును ధృవీకరించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తన వెబ్సైట్లో కూడా మారిన ధరలనే పొందుపరిచింది. దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని పెంచడం ఇది రెండోసారి. మేకిన్ ఇండియా ప్రొగ్రామ్ను ప్రోత్సహించడం కోసం దిగుమతి చేసుకునే ఫోన్లపై ప్రభుత్వం ఈ సుంకాన్ని పెంచుతూ వెళ్తోంది. -
ఐఫోన్ దిగ్గజానికి ప్రశ్నల వర్షం
పాత ఐఫోన్లను కావాలనే స్లో చేయడంపై టెక్ దిగ్గజం ఆపిల్కు, అమెరికా హౌజ్ రిపబ్లికన్ల ప్రశ్నలు సంధిస్తున్నారు. పాత ఐఫోన్లు స్లో చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఆపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ను ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీచేసిన వారిలో ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ చైర్మన్తో పాటు నలుగురు అమెరికా హౌజ్ రిపబ్లికన్లు ఉన్నారు. ఈ విషయంపై గత డిసెంబర్ 28నే ఆపిల్ క్షమాపణ చెప్పింది. అంతేకాక బ్యాటరీ రీప్లేస్మెంట్ వ్యయాలను తగ్గించింది. సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేపట్టింది. దీంతో తమ ఫోన్ బ్యాటరీ మంచిగా ఉందో లేదో తెలుసుకోవచ్చని పేర్కొంది. అంతేకాక ఐఫోన్ల బ్యాటరీ ఓవర్హీట్ అయి పేలిపోతున్నాయని, దీనికి కూడా వివరణ ఇవ్వాలని ఆపిల్కు వారు పంపిన లేఖలో పేర్కొన్నారు. గతవారం జరిగిన ఐఫోన్ బ్యాటరీ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి గాయపడిన సంగతి తెలిసిందే. ఫోన్ నుంచి బ్యాటరీని తొలగిస్తున్న క్రమంలో జురిచ్లోని ఆపిల్ స్టోర్లో రిఫైర్ వర్కర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త ఐఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. తక్కువ ధరకు బ్యాటరీను రీప్లేస్ చేయకుండా ఆపిల్ ఈ పన్నాగానికి పాల్పడుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఫోన్ లైఫ్ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు ఆపిల్ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఐఫోన్ డివైజ్లను స్లో చేసిందని కంపెనీపై కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎనిమిది దావాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్లో లీగల్ ఫిర్యాదు కూడా దాఖలైంది. ఫిర్యాదుదారులు మిలియన్ డాలర్లను పరిహారంగా కూడా కోరుతున్నారు. ఇజ్రాయిల్ ఇదే సమస్యపై సుమారు 120 మిలియన్ డాలర్లకు ఓ దావా దాఖలైంది. -
ఫ్లిప్కార్ట్ ఆపిల్ వీక్ : ఐఫోన్లపై బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఆపిల్ వీక్ను ప్రారంభించింది. ఈ వీక్లో భాగంగా ఆపిల్ ఉత్పత్తులు ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్బుక్లు, వాచ్లపై బెస్ట్ డీల్స్ను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్లతో పాటు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన వారికి 8వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్లను అందిస్తోంది. బెస్ట్ డీల్స్ ఇవే... ఐఫోన్ ఎక్స్ : ఆపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర 89వేల రూపాయలు. అదేవిధంగా 256జీబీ వేరియంట్ ధర రూ.1,02,000. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 8వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. అంతేకాక రూ.18వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ : ఐఫోన్ 8(64జీబీ) ధర 64వేల రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గింది. అంటే ఈ స్మార్ట్ఫోన్పై 9వేల రూపాయల డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్(64జీబీ) ధరను 73వేల రూపాయల నుంచి 66,499 రూపాయలకు ఫ్లిప్కార్ట్ తగ్గించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై కూడా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై 8వేల రూపాయల క్యాష్బ్యాక్ లభిస్తోంది. అదేవిధంగా 18వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ : 59వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్ఫోన్ ధరను ఫ్లిప్కార్ట్ 56,999 రూపాయలకు తగ్గించింది. ఐఫోన్ 7 ధర కూడా 49వేల రూపాయల నుంచి 42,999 రూపాయలకు తగ్గింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ఈఎంఐ లావాదేవీలపై 5వేల రూపాయల క్యాష్బ్యాక్ను కొనుగోలుదారులు పొందుతారు. ఎక్స్చేంజ్ ఆఫర్ల కింద ఐఫోన్ 7, 21వేల రూపాయల తగ్గింపుతో లిస్ట్ అయింది. ఇలా ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ, మ్యాక్బుక్ ఎయిర్, ఐఫ్యాడ్ ప్రొ, ఆపిల్ వాచ్ సిరీస్ 2లపై డిస్కౌంట్లను, క్యాష్బ్యాక్లను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. -
ఐఫోన్ల వ్యసనాన్ని మరింత తగ్గించండి
చిన్న పిల్లలు స్మార్ట్ఫోన్ల వాడకం రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ స్మార్ట్ఫోన్ల వాడకంతో పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతూనే ఉంది. దీనిపై కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాక, ఇటు కంపెనీలు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చిన్నపిల్లల్లో రోజురోజుకి పెరుగుతున్న స్మార్ట్ఫోన్ వ్యసనంపై ఆపిల్ మరింత చర్యలు తీసుకోవాల్సిందిగా కంపెనీకి చెందిన ఇద్దరు ప్రముఖ ఇన్వెస్టర్లు వాదిస్తున్నారు. ఈ మేరకు ఈ టెక్నాలజీ దిగ్గజానికి వీరు ఓ లేఖ కూడా రాశారు. పిల్లలపై గాడ్జెట్లు, సోషల్ మీడియా వల్ల పెరిగిపోతున్న ప్రతికూల ప్రభావాన్ని హైలెట్ చేస్తూ న్యూయార్క్కు చెందిన జన పార్టనర్స్ ఎల్ఎల్సీ, ది కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఈ లేఖ రాశాయి. తమ డివైజ్ల్లో పిల్లలను స్మార్ట్ఫోన్ల వ్యసనం బారిన నుంచి కాపాడే టూల్స్ను మరిన్ని ఆఫర్ చేయాలని ఆపిల్ను ఈ ఇన్వెస్టర్లు కోరారు. దీంతో భవిష్యత్తులో ఆపిల్కు, పెట్టుబడిదారులకు ఎంతో మేలు చేకూరనుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆపిల్ వెంటనే స్పందించలేదు. సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లు ఎక్కువ వాడకంతో పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో నివేదించిన పలు రిపోర్టులను ఈ లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ క్లాస్రూంలో అంతరాయం సృష్టిస్తుందని, విద్యాపరమైన అంశాలపై విద్యార్థుల దృష్టిని తగ్గిస్తుందని, ఆత్మహత్య, ఒత్తిడి వంటి వాటిన బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరు తమ లేఖలో తెలిపారు. తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మొబైల్ డివైజ్ల్లో ఆపిల్ సరికొత్త సాఫ్ట్వేర్లను ఆఫర్ చేయడం ప్రారంభించింది. -
క్షమాపణ చెప్పిన టెక్ దిగ్గజం ఆపిల్
-
క్షమాపణ చెప్పిన టెక్ దిగ్గజం ఆపిల్
శాన్ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం ఆపిల్ క్షమాపణలు చెప్పింది. బ్యాటరీ విషయంలో తలెత్తుతున్న సమస్యల పట్ల యూజర్లను ఆపిల్ గురువారం తన వెబ్సైట్లో క్షమాపణలు కోరింది. పాత ఐఫోన్ మోడల్స్ స్లోగా మారడానికి తామే కారణమని ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే యూజర్ల విధేయతను గుర్తించడానికి, నమ్మకాన్ని మళ్లీ చూరగొనడానికి ఐఫోన్లలో పలు మార్పులు చేపడుతున్నట్టు తెలిపింది. అంతేకాక పాత ఐఫోన్ల బ్యాటరీలను రిప్లేస్ చేయడానికి సంస్థ అంగీకరించింది. చాలా తక్కువ ధరకు ఆపిల్ కొత్త బ్యాటరీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 79 డాలర్లు(సుమారు రూ.5000)గా ఉన్న బ్యాటరీ రీప్లేస్మెంట్ ధరను 29 డాలర్లకు(రూ.1,850) తగ్గించినట్టు పేర్కొంది. వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది. అదేవిధంగా పాత ఐఫోన్ల కోసం ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా అప్డేట్ చేసింది. 2018లో కొత్త సాఫ్ట్వేర్ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. దాని వల్ల కస్టమర్ల తమ ఐఫోన్లను మానిటర్ చేసుకునే వీలు ఉంటుంది. బ్యాటరీ ఆరోగ్యకరంగా లేని విషయాన్ని యూజర్లు వెంటనే తెలుసుకోవచ్చు. ఇది ఫోన్ పనితీరుపై ప్రభావం చూపనుంది. కొత్త ఐఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఫోన్ లైఫ్ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు ఆపిల్ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఐఫోన్ డివైజ్లను స్లో చేసిందని కంపెనీపై కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎనిమిది దావాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్లో లీగల్ ఫిర్యాదు కూడా దాఖలైంది. -
ఐఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు
ఆపిల్ ఫేవరెట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయమట. అమెజాన్ తన ప్లాట్ఫామ్పై ఐఫోన్ ఫెస్ట్కు తెరతీసింది. ఈ ఫెస్ట్లో భాగంగా ఐఫోన్ కొత్త మోడల్స్, పాత మోడల్స్పై భారీ డిస్కౌంట్లను ఆఫర్లను ప్రకటించింది. నిన్నటి(నవంబర్ 30) నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, డిసెంబర్ 9 వరకు ఈ ఫెస్ట్ జరుగనుంది. కొన్ని ఐఫోన్లు ముఖ్యంగా ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై ఈ ఐఫోన్లు కొనుగోలు చేసిన వారికి ప్రమోషనల్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాక ఈ కాలంలోనే అమెజాన్ పాత ఐఫోన్ మోడల్స్ ఎక్స్చేంజ్పై రూ.9500 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్లో ఐఫోన్ ఎస్ఈ 32జీబీ వేరియంట్ రూ.20,000కే లిస్టు అయింది. దీన్ని అమెజాన్ అసలు రూ.26వేలకు విక్రయిస్తోంది. అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరో రూ.2000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. దీంతో ఐఫోన్ ఎస్ఈ కస్టమర్లకు రూ.18వేలకే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఐఫోన్ ఎస్ఈ 16జీబీ వేరియంట్ కూడా ఐఫోన్ ఫెస్ట్ సేల్ సందర్భంగా రూ.18,990కే లభ్యమవుతోంది. డిస్కౌంట్ అనంతరం ఇతర ఐఫోన్ల ధరలు ఐఫోన్ 7ను రూ.41వేలకు విక్రయిస్తోంది ఐఫోన్ 6 ఎస్ను రూ.35వేలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 6 ధర రూ.26వేలుగా ఉంది ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ వేరియంట్ను రూ.69,685కు అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ను రూ.58,999కు విక్రయం ఇలా అన్ని ఐఫోన్ మోడల్స్పైనా అమెజాన్ డిస్కౌంట్లను ప్రకటించింది. -
ఆపిల్కు ఎదురుదెబ్బ: ఫస్ట్ ఛాయిస్ దానికే
బీజింగ్ : టెక్ దిగ్గజం ఆపిల్కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా తన హవా చాటుతున్న ఆపిల్, చైనా మార్కెట్లో మాత్రం తన సత్తాను నిరూపించుకోలేకపోతుంది. చైనా వినియోగదారులకు దగ్గర అవాలనుకుంటున్న ఆపిల్ను స్థానిక బ్రాండ్లు దెబ్బకొడుతున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో చైనా స్మార్ట్ఫోన్ కొనుగోలుదారుల తొలి ఛాయిస్గా హువాయ్ నిలుస్తున్నట్టు వెల్లడైంది. ఫైనాన్సియల్ టైమ్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో 31.4 శాతం మంది హువాయ్ను తమ బ్రాండుగా ఎంపికచేసుకుంటున్నట్టు తెలిపారు. తమ తదుపరి ఫోన్గా ఐఫోన్ను కొనుగోలు చేస్తామనే వారి సంఖ్య 24.2 శాతానికి పడిపోయింది. 2016లో ఐఫోన్ 7 లాంచ్ అయినప్పుడు ఈ శాతం 25.8 శాతంగా ఉంది. యేటియేటికి ఐఫోన్ కొనుగోలు చేద్దామనుకునే వారి సంఖ్య పడిపోతుందని తేలింది. గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోనూ జూన్, జూలై విక్రయాల్లో హువాయ్ తొలిసారి ఆపిల్ను అధిగమించేసింది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ తాజా రిపోర్టు 'మార్కెట్ పల్స్ ఫర్ జూలై 2017'' ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తర్వాతి స్థానం గ్లోబల్గా హువాయ్దేనని తెలిసింది. హువాయ్కు ఇది ఒక మైలురాయని, విక్రయ ఛానల్ను విస్తరించుకోవడం, తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లలో స్థిరమైన పెట్టుబడులకు ఇది ఒక ప్రతీకని రిపోర్టులు పేర్కొన్నాయి. కీలక సప్లై చైన్ పార్టనర్లతో హువాయ్, వివో, ఒప్పో, షావోమిలు విజయమవుతున్నట్టు తెలిపాయి. బెజెల్-ఫ్రీ, ఫుల్ డిస్ప్లేస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇన్-హౌజ్ చిప్సెట్స్, అడ్వాన్స్డ్ కెమెరా ఫీచర్లతో వీటి ఫోన్లు రూపొందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది లాంచ్ అయిన కొత్త ఐఫోన్లు కొనుగోలుచేస్తామనే వారి శాతం కూడా తగ్గిపోయింది. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా సెప్టెంబర్12న ఆపిల్ మెగా ఈవెంట్ను నిర్వహించబోతుంది. ఈ మెగా ఈవెంట్లో ఐఫోన్ 8 ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ కాబోతుంది. ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్లను ఆపిల్ లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్ల రాక సందర్భంగా పాత ఐఫోన్లపై పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 తో పాటు మిగతా మోడల్స్పై పేటీఎం మాల్ ఈ భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. ముందస్తు ఎన్నడూ చూడని ధరలో ఐఫోన్7 విక్రయానికి వచ్చింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాల వ్యవధిలోనే అందుబాటులో ఉండనున్నాయని పేటీఎం మాల్ చెప్పింది. ఐఫోన్ 7 ఆఫర్... ఆపిల్ గతేడాది తీసుకొచ్చిన ఐఫోన్ 7ను అతి తక్కువగా డిస్కౌంట్ ధరలో రూ.39,479కే విక్రయించుతోంది. దాంతో పాటు 65,200 రూపాయల ధర కలిగిన ఐఫోన్ 7 128జీబీ వేరియంట్పై కూడా 8 శాతం డిస్కౌంట్, రూ.12వేల రూపాయల క్యాష్బ్యాక్ను పేటీఎం మాల్ ప్రకటించింది. ఇక ఐఫోన్ 7 32జీబీ రోజ్ గోల్డ్ వేరియంట్ను కూడా 13 శాతం డిస్కౌంట్, 9,100 రూపాయల క్యాష్బ్యాక్తో 39,599 రూపాయలకే పేటీఎం మాల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ అసలు ధర రూ.56,200. ఐఫోన్ 7 256జీబీ రోజ్ గోల్డ్ వేరియంట్పై కూడా పేటీఎం మాల్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర 80వేల రూపాయలుంటే, దీనిపై 24 శాతం డిస్కౌంట్, 10,500 క్యాష్బ్యాక్తో 60,898 రూపాయలకే అందిస్తోంది. ఐఫోన్ 7 256జీబీ బ్లాక్ వేరియంట్ కూడా డిస్కౌంట్ ధరలో రూ.62,099కు అందుబాటులో ఉంది. ఐఫోన్ 6 ఆఫర్.... ఐఫోన్ 6ను 21,685 రూపాయలకు పేటీఎం మాల్ అందిస్తోంది. ఈ ఫోన్ ఇప్పటికే డిస్కౌంట్ ధర 27,685 రూపాయలకు అందుబాటులో ఉండగా.. దీనిపై 6000 రూపాయల క్యాష్బ్యాక్ను పేటీఎం మాల్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ధర రూ.21,685కు దిగొచ్చింది. ఐఫోన్ 7 ప్లస్... ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్ కూడా డిస్కౌంట్ ధరలో అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ-గోల్డ్ వేరియంట్ అసలు ధర 72వేల రూపాయలుండగా.. డిస్కౌంట్ అనంతరం 51,399 రూపాయలకే ఈ ఫోన్ విక్రయానికి వచ్చింది. ఇదే వేరియంట్ సిల్వర్ కలర్ ఫోన్ కూడా 51,370 రూపాయలకే అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ(గోల్డ్) వేరియంట్ను పేటీఎం మాల్ 57,599 రూపాయలకు విక్రయిస్తోంది. ఈ మోడల్ అసలు ధర 82వేల రూపాయలు. ఐఫోన్ 6ఎస్ ప్లస్... ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్ను కూడా డిస్కౌంట్ ధరలో 37,299 రూపాయలకు పేటీఎం మాల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ అసలు ధర 72వేల రూపాయలు. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16జీబీ(గోల్డ్) వేరియంట్ కూడా 38,299 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మోడల్ అసలు ధర కూడా 72వేల రూపాయలు. ఇలా ఐఫోన్ వేరియంట్లపై పేటీఎం మాల్ డిస్కౌంట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. -
అమెజాన్ ఆపిల్ ఫెస్ట్: డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా రెండు రోజుల ఆపిల్ ఫెస్టివల్కు తెరతీసింది. ఈ ఫెస్టివల్లో ఐఫోన్లు, వాచ్లు, ఐప్యాడ్లు, ఐమ్యాక్లపై డిస్కౌంట్లను, క్యాష్బ్యాక్ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. నేడు, రేపు ఈ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డుహోల్డర్స్పై రూ.1500 క్యాష్బ్యాక్ను అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఐఫోన్ 7, ఐఫోన్6, ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 7, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డివైజ్ ధర రూ.56,200 కాగ, ఈ ఫోన్ 11,201 రూపాయల డిస్కౌంట్తో 44,999 రూపాయలకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత డివైజ్తో ఎక్స్చేంజ్లో ఐఫోన్ 7ను కొనుగోలు చేయాలనుకుంటే 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక 32జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 6 ధర 29,500 రూపాయలు కాగ, ఈ డివైజ్ కూడా 3,501 రూపాయల డిస్కౌంట్లో 25,999కే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 6పై కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 14,920 రూపాయల వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఆపిల్కు చెందిన మరో ఫేమస్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎస్ఈ కూడా డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎస్ఈ అసలు ధర 26వేల రూపాయలు కాగ, 7,001 రూపాయల డిస్కౌంట్లో 25,999 రూపాయలకే ఈ ఫోన్ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్పై కూడా 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆపిల్ స్మార్ట్వాచ్లపై 3000 రూపాయల తగ్గింపు, ఐప్యాడ్లపై ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐలు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. -
మీ ఐఫోన్కు హ్యాకర్ల ముప్పుందా? అయితే...
ఎంతో సురక్షితమైన ఫోన్గా పేరుగాంచిన ఐఫోన్ కూడా హ్యాకర్ల బారిన పడుతోంది. ఇటీవలే లక్షల కొద్దీ ఐఫోన్ల డేటాను టర్కిష్ క్రైమ్ ఫ్యామిలీ హ్యాకింగ్ చేసినట్టు చెప్పుకుంటోంది. ఐక్లౌడ్.కామ్, మి.కామ్ డొమైన్ల 559 మిలియన్ల ఆపిల్ ఈ-మెయిల్ అకౌంట్ల యాక్సస్ తమ వద్ద ఉందని, 75వేల డాలర్లను బిట్ కాయిన్ రూపంలో లేదా లక్షల డాలర్ల ఐట్యూన్ గిఫ్ట్ కార్డులను తమకివ్వాలని ఆపిల్ ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తోంది. లేదంటే ఐఫోన్ల పాస్వర్డులు రీసెట్ చేస్తామని, ఫోటోలు , వీడియోలు, టెక్ట్స్ మెసేజ్లు, ఇతర వ్యక్తిగత డేటాను తొలగిస్తామని హెచ్చరిస్తోంది. కానీ ఐఫోన్లు అసలు హ్యాకింగ్ బారినే పడలేదని వారి బ్లాక్ మెయిల్ను ఆపిల్ కొట్టిపారేసింది. ఒకవేళ ఐఫోన్ల డేటా హ్యాకర్ల బారిన పడిన మాట నిజమైతే.. హ్యాకర్స్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి మార్గాలున్నాయట. ఏప్రిల్ 7కంటే ముందస్తుగా ఈ ప్రక్రియను పూర్తిచేసి తమ ఐఫోన్ డేటాను కాపాడుకోవాలని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాకర్ల బారి నుంచి తప్పించుకునే మార్గాలు... అధిక ఎంట్రోపీకి పాస్ వర్డ్ మార్చుకోవడం: అధిక ఎంట్రోపీకి పాస్ వర్డును మార్చుకోవాలంట. ర్యాండమ్ నెంబర్లు, క్యాపిటల్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్లతో పాస్వర్డులను ఉంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. లాస్ట్ పాస్ మాదిరి పాస్ వర్డ్ మేనేజర్ ను మీరు సృష్టించుకోవచ్చట. ఈ పాస్ వర్డ్ మేనేజర్తో ఎప్పడికప్పుడూ పాస్ వర్డ్ లను మేనేజ్ చేస్తూ ఉంచుకోవాలని సూచిస్తున్నారు. హై-ఎంట్రోపీ పాస్ వర్డ్ ఈ విధంగా ఉంచుకోవచ్చు. ఉదాహరణకి 1A@0z# మాదిరి పాస్ వర్డులు పెట్టుకుంటే హ్యాకర్లు వాటిని కనుక్కోవడం కొంచెం కష్టమని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. సెక్యురిటీ ప్రశ్నలకు ఒకే మాదిరి సమాధానం లేకుండా... సెక్యురిటీ ప్రశ్నలకు సమాధానాలు బట్టి కూడా హ్యాకర్లు తమ డేటా బేస్ ను దొంగతనం చేస్తారు. సైట్ కి సైట్ కి సెక్యురిటీప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు మార్చుకోవాలని చెబుతున్నారు. మెయిన్ నెంబర్తో కీలకడేటాను కనెక్షన్ వద్దు... యూజర్లు తమ మెయిన్ నెంబర్ను ఈ-మెయిల్ అకౌంట్ సెక్యుర్గా పెడితే, అది హైజాకింగ్ బారిన పడే ముప్పు ఎక్కువగానే ఉందంట. మీ మెయిన్ నెంబర్ టెల్కో వద్ద ఉంటుంది. దాంతో పాటు గూగుల్ వాయిస్ కూడా మీ నెంబర్ ను మేనేజ్ చేయనప్పుడు అంత సురక్షితం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సిటివ్ అకౌంట్లకు వేరే నెంబర్లను ఇచ్చుకోవాలని అది గూగుల్ వాయిస్ నెంబర్ అయితే హ్యాకర్లు మీ అనుమతి లేకుండా ఫోన్లలోకి చొచ్చుకుని రాలేరట. ఎక్కువగా హ్యాకర్లు ఫోన్ నెంబర్లను దొంగతనం చేసే డేటాను దొంగలిస్తుంటారని టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టూ-ఫ్యాక్టర్ అథన్టికేషన్: టూ-ప్యాక్టర్ అథన్టికేషన్ ను వినియోగిస్తే బారి ముప్పు నుంచి తప్పించుకోవచ్చట. ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ లేదా వాయిస్ స్కాన్ లేదా బయోమెట్రిక్ సెన్సార్ వంటి వాటిని అథన్టికేషన్ గా వినియోగించుకోవచ్చు. -
గతవారం బిజినెస్
మాల్యా కేసులో 8 మంది అరెస్ట్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి... ఐడీబీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యోగేష్ అగర్వాల్ సహా 8 మందిని సీబీఐ గత సోమవారం అరెస్ట్ చేసింది. వీరిలో ఐడీబీఐ బ్యాంకు మాజీ ఉద్యోగులు ముగ్గురు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు చెందిన నలుగురు ఉన్నారు. సరైన తనఖాలు లేకుండా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కు రూ.950 కోట్లు రుణమిచ్చారని యోగేశ్ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాల్యా నివాసం సహా బెంగళూరులోని యూబీ టవర్స్లో, అగర్వాల్ తదితరుల నివాసాల్లో సీబీఐ సోమవారం తనిఖీలు చేశాక అరెస్ట్లు జరిగాయి. బీఎస్ఈ ఐపీఓకు భారీ స్పందన బీఎస్ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. దేశంలో తొలి స్టాక్ ఎక్సే్చంజ్ ఐపీఓ, ఈ ఏడాది తొలి ఐపీఓ కూడా అయిన బీఎస్ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖవిలువ గల 1.54,27,197(28.26 శాతం వాటా) షేర్లను జారీ చేయనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు మినహా జారీ చేయనున్న 1,07,99,039 షేర్లకు గాను 55,23,34,986 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. బుధవారం ముగిసిన రూ.805–806 ఇష్యూ ధరగా ఉన్న ఈ రూ.1,243 కోట్ల ఐపీఓకు రూ.44,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. డిమోనేటైజేషన్ తర్వాత వచ్చిన తొలి ఐపీఓ ఇది. లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ బీఎస్ఈనే. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ప్రపంచంలో పదవది. త్వరలో ఎన్ ఎస్ఈ రూ.10,000 కోట్ల ఐపీఓ రానుంది. భారత్లో త్వరలో ఐఫోన్స్ తయారీ! అమెరికా, చైనాలో ఐఫోన్ ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. వ్యయాలు తగ్గించుకునే దిశగా ఇప్పటికే భారత్లో ఐఫోన్ల తయారీపై ఆసక్తి వ్యక్తం చేసిన యాపిల్.. తాజాగా ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకుంది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రమేశ్ అభిషేక్ సారథ్యంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందంతో భేటీ అయిన కంపెనీ వర్గాలు ఈ విషయాలు వివరించాయి. తెలుగులో భీమ్ యాప్ డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్నకు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్ ను విడుదల చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) వెల్లడించింది. అప్డేటెడ్ వెర్షన్ 1.2లో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషలు కూడా చేర్చినట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఇది లభిస్తోంది. డిసెంబర్ 30న ప్రవేశపెట్టినప్పట్నుంచీ భీమ్ యాప్నకు ఇది రెండో అప్డేట్. డాక్టర్ రెడ్డీస్పై కొరియా కంపెనీ దావా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్టర్ రెడ్డీస్కు మరో చిక్కు వచ్చి పడింది. డాక్టర్ రెడ్డీస్పై దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్ కంపెనీ మెజియాన్ ఫార్మా కోర్టుకెక్కింది. ఉత్తమ తయారీ విధానం మార్గదర్శకాల (సీజీఎంపీ) విషయంలో పెద్ద ఎత్తున లోపాలను దాచిపెట్టి డాక్టర్ రెడ్డీస్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. నిబంధనల అమలులో తప్పుదోవ పట్టించి, మోసపూరితంగా విషయాలను దాచిపెట్టిన డాక్టర్ రెడ్డీస్ నుంచి మిలియన్ల డాలర్లను నష్టాల కింద వసూలు చేయాలని కోరింది. పీవీఆర్ స్క్రీన్ల వేట మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ మరిన్ని ‘స్క్రీన్ల’ను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 స్క్రీన్లను కొనుగోలు చేయనున్నామని పీవీఆర్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 70–80 స్క్రీన్లను కొనుగోలు చేస్తామని కంపెనీ జాయింట్ ఎండీ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. కొనుగోలు చేయడానికి పలు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ తమకు తగినవి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని, ఈ విషయమై కసరత్తు జరుగుతోందని వివరించారు. స్క్రీన్ల కొనుగోళ్ల కోసం ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోబోమని, అంతర్గత వనరుల నుంచే నిధులు సమకూర్చుకుంటామని వివరించారు. ప్రస్తుతం పీవీఆర్ సంస్థ 48 నగరాల్లో 122 ప్రోపర్టీల్లో 562 స్క్రీన్లను నిర్వహిస్తోంది. మారుతీ కార్లు ప్రియం మారుతీ సుజుకీ ఇండియా కార్ల ధరలు పెరిగాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 రూ.8,014 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)వరకూ పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కమోడిటీ, రవాణా, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.2.45 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.12.03 లక్షలు ధర ఉన్న ఎస్–క్రాస్ మోడల్ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఈ కంపెనీ కొన్ని రకాల మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.5,000 రేంజ్లో పెంచింది. కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజా ధరను రూ.20,000, ప్రీమియమ్ హ్యాచ్బాక్ బాలెనో ధరను రూ.10,000 చొప్పున పెంచింది. -
ఈ దేశాల్లో ఐఫోన్లు చాలా ఖరీదైనవి!
ఐఫోన్ బ్రాండు అంటేనే.. కొంచెం ఖరీదైనది. వాటిని కొనాలంటే డబ్బులెక్కువ వెచ్చించాల్సిందే. అయితే బ్రెజిల్, ఇండియా, స్వీడన్, డెన్మార్క్ లేదా ఇటలీ వెళ్లినప్పుడు అసలు ప్రయాణికులు తమ ఐఫోన్లను చేజార్చుకోవద్దని డ్యుయిస్ బ్యాంకు చెబుతోంది. ఎందుకో తెలుసా? ఈ దేశాల్లో ఐఫోన్ ధరలు భారీగా ఉంటాయట. ఒకవేళ ఈ దేశాల ప్రయాణంలో ఐఫోన్లను పోగొట్టుకుంటే, మళ్లీ దాన్ని కొనుకోవాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తుల ధరలతో డ్యుయిస్ బ్యాంకు ప్రతేడాది ఓ వార్షిక రిపోర్టు తయారుచేస్తోంది. ఈ రిపోర్టులో గ్లోబల్ సిటీలోని 20కి పైగా కామన్ ఉత్పత్తుల ధరలను ఇతర దేశాలతో పోల్చి చూపిస్తోంది. ఈ మేరకు డ్యుయిస్ బ్యాంకు 2016 సంవత్సరానికి గాను విడుదల చేసిన రిపోర్టులో ఐఫోన్ ఏయే దేశాల్లో అత్యంత ఖరీదైనదో వెల్లడించింది. బ్రెజిల్ స్థానిక కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలర్ల విలువ గతేడాది కంటే దిగొచ్చింది. కానీ ఐఫోన్ ధర మాత్రం బ్రెజిల్లో తగ్గలేదని తెలిపింది. ఐఫోన్ ధరలు అత్యధికంగా ఉన్న టాప్ దేశాలు దేశం 2016 ధర(డాలర్లలో) బ్రెజిల్ 931 ఇండోనేషియా 865 స్వీడన్ 796 ఇండియా 784 ఇటలీ 766 -
బెంగళూరుకు ఆపిల్ కళ.. అక్కడ నుంచే ఐఫోన్స్!
బెంగళూరు: ప్రతిష్టాత్మక సంస్థ ఆపిల్ తన ఐఫోన్లను ఇక భారత్లో కూడా తయారు చేయనుంది. ఇందుకోసం బెంగళూరు నగరాన్ని ఎంచుకోవాలని నిర్ణయించిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ నగరంలోనే భారత్కు అవసరమైన ఐఫోన్లను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేయనుంది. విస్ట్రన్ తైవానీస్ ఓఈఎం అనే సంస్థ ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను తయారుచేస్తోంది. ఇప్పుడు ఈ ఓఈఎం బెంగళూరులోని ఇండస్ట్రియల్ హబ్ అయిన పీన్యాలో ఐఫోన్ తయారీలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆపిల్ సంస్థ ఉన్నత వర్గాల సమాచారం మేరకు భారత్లో వచ్చే ఏడాది చివరినాటికి ఐఫోన్ తయారీ పూర్తి స్థాయి ప్రక్రియను సిద్ధం చేయాలని చాలా సీరియస్గా ఆపిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బెంగళూరు నగరాన్నే అందరూ ఆమోదించినట్లు సమాచారం. భారత్లోనే వీటిని నేరుగా తయారు చేయడం వల్ల ధరలో కూడా కొంతమార్పు వచ్చి అమ్మకాలు కూడా విపరీతంగా జరిగి కంపెనీకి లాభాలు వస్తాయని ఆపిల్ భావిస్తోంది. అయితే, మహారాష్ట్రలో కూడా ఫాక్స్కాన్ అనే సంస్థ ఆపిల్ ఫోన్లను తయారుచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అది షియామి, వన్ప్లస్ వంటి లోకల్ బ్రాండ్లకు ఫోన్లను తయారుచేసి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఒక్క ఆపిల్ మాత్రమే కాదని, కానీ బెంగళూరులో పెట్టే తయారీ సంస్థ మాత్రం పూర్తి స్థాయిలో ఆపిల్ ఐఫోన్ల మీదే దృష్టి సారించనుందట. -
అతనో దిగ్గజ కంపెనీ మేనేజర్.. చేసింది దొంగపని!
తైపీ : అతనో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్ కాన్కి మాజీ సీనియర్ మేనేజర్. కానీ సుమారు రూ.10 కోట్ల విలువైన ఐఫోన్లను చోరి చేశాడు. ఈ విషయాన్ని తైవనీస్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం వెల్లడించారు. అయితే అతను దొంగలించిన ఐఫోన్లెనో తెలుసా? దాదాపు 5700 ఫోన్లను దొంగతనం చేసి, వాటిని చైనా మార్కెట్లో విక్రయించాడు. ఫాక్స్ కాన్ ఆపిల్, సోనీ లాంటి అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పత్తులన్నింటిన్నీ ఒకచోట చేర్చి, కాంట్రాక్ట్పై వీటిని తయారుచేస్తోంది. చైనాలో మిలియన్ల కొద్దీ వర్కర్లు ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. టిసాయ్ కుటుంబ పేరుకు చెందిన ఇతను, తైవాన్ ఫాక్స్కాన్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. చైనీస్ నగరం షెన్జెన్ దక్షిణ ద్వీపకల్పంలో ఫాక్స్కామ్లో టెస్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎనిమిది మంది సహాయంతో, సుమారు 6వేల ఐఫోన్5, ఐఫోన్ 5ఎస్ ఫోన్లను స్మగుల్ చేయించాడు. టిసాయి, అతని సహచరులు కలిసి టెస్టింగ్కు వచ్చిన ఐఫోన్లను దొంగతనం చేసినట్టు తెలిసింది. కంపెనీ ఇంటర్నల్ ఆడిట్లో తైవనీస్ అధికారులు ఇది బయటపెట్టినట్టు ఫాక్స్ కాన్ చెప్పింది. నమ్మక ద్రోహం చేసినందుకు ఇతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవల కాలంలోఇతను కార్మిక వివాదాలకు తెరతీస్తూ ఉద్యోగులపై దుష్ఫర్తనకు పాల్పడినట్టు కూడా విచారణలో తెలిసింది. -
ఓఎల్ఎక్స్ యూజర్లే టార్గెట్..
రాంగోపాల్పేట్: ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన వారినే టార్గెట్ చేసి ఐ ఫోన్లు కొంటానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. అదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఉదయ్కిరణ్రెడ్డి (29) జగద్గిరిగుట్టలో నివసించే వాడు. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఖర్చులకు భార్యను డబ్బు అడిగి వేధిస్తుండటంతో ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్లు అమ్ముతామని ప్రకటనలు ఇచ్చిన వారిని మోసం చేయాలని పథకం పన్నారు. అందులో ఇచ్చిన మొబైల్కు ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతాడు. ఫోన్ తన సోదరికి కావాలని ఆమె కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుందని నమ్మిస్తాడు. అమ్మే వ్యక్తి చెప్పిన ధర చెల్లిస్తానని ఒకమారు ఆస్పత్రిలో ఉన్న సోదరికి చూపించి వస్తానని చెబుతాడు. ఆస్పత్రి లోపలికి వెళ్లి అటునుంచి అటే వెళ్లిపోతాడు. ఇలా ఐదుగురి నుంచి ఐ6ఎస్ రెండు, ఐ6 ఫోన్లు 3 కొట్టేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిని మోసం చేసేందుకు కొత్త సిమ్కార్డు కొనుగోలు చేసి దాంతో మోసాలు చేసేవాడు. నిందితుడి నుంచి రూ.2.30లక్షల విలువ చేసే ఐదుఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఫోన్లు కొంటా..
రాంగోపాల్పేట్: ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన వారినే టార్గెట్ చేసి ఐ ఫోన్లు కొంటానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఉదయ్కిరణ్రెడ్డి (29) జగద్గిరిగుట్టలో నివసించే వాడు. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఖర్చులకు భార్యను డబ్బు అడిగి వేధిస్తుండటంతో ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్లు అమ్ముతామని ప్రకటనలు ఇచ్చిన వారిని మోసం చేయాలని పథకం పన్నారు. అందులో ఇచ్చిన మొబైల్కు ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతాడు. ఫోన్ తనసోదరికి కావాలని ఆమె కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుందని నమ్మిస్తాడు. అమ్మే వ్యక్తి చెప్పిన ధర చెల్లిస్తానని ఒకమారు ఆస్పత్రిలో ఉన్న సోదరికి చూపించి వస్తానని చెబుతాడు. ఆస్పత్రి లోపలికి వెళ్లి అటునుంచి అటే వెళ్లిపోతాడు. ఇలా ఐదుగురి నుంచి ఐ6ఎస్ రెండు, ఐ6 ఫోన్లు 3 కొట్టేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిని మోసం చేసేందుకు కొత్త సిమ్కార్డు కొనుగోలు చేసి దాంతో మోసాలు చేసేవాడు. నిందితుడి నుంచి రూ.2.30లక్షల విలువ చేసే ఐదు ఐ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఫోన్ల నుంచి టన్ను బంగారం..
ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు బంగారం కావాలంటే ఏం చేస్తారు.. కొనుకుంటారా! లేకపోతే అద్దెకు తీసుకొస్తారా! అంటే యాపిల్ సంస్థ మాత్రం పాత గాడ్జెట్లను, ఫోన్లను రీసైక్లింగ్ చేసి, బంగారాన్ని తీసుకుంటుందట. ఎక్కువగా పాత ఐఫోన్ల ద్వారా ఈ బంగారం రాబట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. సగటున ఒకో ఐఫోన్ తయారీలో ౩౦ మిల్లీగ్రాముల బంగారం ఉపయోగిస్తారు. గత ఏడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల(టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐపోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను పగలగొట్టి రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో తెలిపింది. వీటి విలువ దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అసలు యాపిల్ కు బంగారం ఎందుకు అవసరం అవుతుందనే సందేహం కూడా రావచ్చు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులో బంగారానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం పనిచేసేలా, అద్భుతమైన విద్యుత్ వాహకంలా బంగారం ఉపయోగపడుతుంది. వెండిని, రాగిని కూడా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో వాడతారు. అయితే అవి త్వరగా తుప్పుపట్టి, పాడయ్యే అవకాశాలు అధికంగా ఉండటం, అతిముఖ్యమైన సమయంలో ఎలక్ట్రాన్లను మెల్లగా ప్రయాణించేలా చేయడం వల్ల వీటిని గాడ్జెట్లలో తక్కువగా వాడతారు. 90 మిలియన్ పౌండ్ల ఈ-వేస్ట్ ను రీసైక్లింగ్ ప్రొగ్రామ్స్ ద్వారానే చేపడతామని, పునర్వినియోగ పదార్థాల నుంచి 61 మిలియన్లు రాబట్టుకున్నామని యాపిల్ సంస్థ తెలిపింది. పాత గాడ్జెట్ల నుంచి తీసుకున్న అతి ముఖ్యమైన పదార్థంలో బంగారం ఒకటని పేర్కొంది. అదేవిధంగా 23 మిలియన్ పౌండ్ల ఉక్కును, 13 మిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ ను, 12 మిలియన్ పౌండ్ల గ్లాస్ ను, 4.5 మిలియన్ పౌండ్ల అల్యూమినియంను, 3 మిలియన్ పౌండ్ల కాపర్ ను, 6,600 పౌండ్ల సిల్వర్ ను రీసైక్లింగ్ ద్వారా రాబట్టుకున్నామని వెల్లడించింది. తాము చేపడుతున్న ఈ రీసైక్లింగ్ ప్రొగ్రామ్స్ ద్వారా, భూమి, గనుల నుంచి అవసరమైన లోహాలను తీసుకునే అవసరం తగ్గుతుందని యాపిల్ పేర్కొంది. -
ఐఫోన్ యూజర్లకు యాపిల్ సారీ!
తమకు తెలిసిన మెకానిక్ తో హోమ్ బటన్ ను మార్పిడి చేసుకున్న ఐఫోన్ యూజర్లకు తాజాగా 'ఎర్రర్ 53' వస్తుండటంతో వారికి యాపిల్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఐఫోన్ల హోమ్ బటన్లో యాపిల్ 'టచ్ ఐడీ ఫింగర్ప్రింట్ రీడర్' ఉంటుంది. పాస్వర్డ్ అవసరం లేకుండానే ఫోన్ను అన్లాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, హోమ్ బటన్లు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇటీవల ఐఫోన్, ఐప్యాడ్ లలో వాటిని స్థానిక మెకానిక్ల ద్వారా మార్చుకున్న వినియోగదారులకు.. ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ చేసుకునేటప్పడు.. 'ఎర్రర్ 53' అని వస్తుంది. దీంతో ఐఫోన్ షట్డౌన్ అయి.. ఎంతకూ రీస్టార్ట్ కావడం లేదు. వేలమంది వినియోగదారులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాపిల్ కంపెనీ మాత్రం డివైస్ సెక్యూరిటీ కోసమే ఈ ఫీచర్ను ప్రవేశపెట్టామని చెప్పింది. ఈ ఫీచర్ విషయంలో ఎర్రర్ వస్తే యాపిల్ సపోర్ట్కు కాల్ చేసి.. సమస్య పరిష్కరించుకోవచ్చునని సలహా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించామని, అప్డేటెడ్ వెర్షన్ ఐవోఎస్లో ఈ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని యాపిల్ తాజాగా ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఇబ్బందిపడిన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. -
ఆరువేల కోట్లతో గూగుల్-యాపిల్ 'సెర్చ్' డీల్!
సాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. ఐఫోన్ మొబైల్ కంపెనీ యాపిల్కు అక్షరాల ఒక బిలియన్ డాలర్లు (రూ. 6,757 కోట్లు) ముట్టజెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. యాపిల్కు చెందిన ఉత్పత్తుల్లో తమ 'గో టు సెర్చ్' టూల్ను డిఫాల్ట్గా అమర్చేందుకు 2014లో ఈ సొమ్మును గూగుల్ అందజేసిందని 'బ్లూమ్బర్గ్' కోర్టు పత్రాలను ఉటంకిస్తూ వెల్లడించింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇటు గూగుల్ కానీ, అటు యాపిల్ కానీ సాధారణంగా బహిర్గతం చేయవు. ఈ నేపథ్యంలో ఒరాకిల్ సంస్థకు చెందిన న్యాయవాది గతవారం సాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో విచారణ సందర్భంగా ఈ అరుదైన వివరాలు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు మాత్రం వెల్లడికాలేదు. 'ఆల్పాబెట్' కార్పొరేట్ కంపెనీలో భాగమైన గూగుల్ సంస్థ కేవలం ఐఫోన్లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ మొత్తాన్ని ముట్టజెప్పిందని ఒరాకిల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, అత్యంత సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని ఒరాకిల్ అసంబద్ధంగా వ్యవహరిస్తున్నదని, ఇది సరికాదని గూగుల్ ఈ కేసులో పేర్కొంది. ఆండ్రాయిడ్ విభాగం ద్వారా గూగుల్ సంస్థ 22 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిందన్న విషయాన్ని కూడా గతవారం జరిగిన కోర్టు విచారణలో ఒరాకిల్ న్యాయవాది వెల్లడించారు. 2008లో ఆవిష్కరించిన ఆండ్రాయిడ్ స్టాఫ్వేర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 80శాతం స్మార్ట్ఫోన్లలో వినియోగిస్తున్నారు. అయితే ఒరాకిల్ తయారుచేసిన జావా సాఫ్ట్వేర్కు సంబంధించిన మౌలిక కాపీరైట్ అంశాలను ఆండ్రాయిడ్ రూపకల్పనలోవాడుకున్నారని గూగుల్పై ఆ సంస్థ దావా వేసింది. చాలాకాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణ రహస్యంగా సాగుతోంది. -
యాపిల్ సీఈవో జీతమెంతో తెలుసా?
ఐఫోన్లు, ఐ ప్యాడ్లు విక్రయించే యాపిల్ సంస్థ గత ఏడాది భారీ లాభాలు ఆర్జించింది. 2015లో సంస్థ అమ్మకాలు 28శాతం పెరిగి.. లాభాలు 38శాతం పెరిగాయి. దీంతో యాపిల్ సీఈవో టిమ్ కూక్ వేతనం కూడా భారీగా పెరిగింది. 2015లో ఆయన వేతన 11.5శాతం పెరిగి 10.3 మిలియన్ డాలర్ల (రూ. 69 కోట్ల)కు చేరుకుంది. ఇదంతా బాగానే ఉన్నా 2008 తర్వాత తొలిసారి యాపిల్ వాటాలు మాత్రం గత ఏడాది పతనమయ్యాయి. ఇక యాపిల్ కంపెనీలో సీఈవో కూక్ కన్నా ఇతర ఎగ్జిక్యూటివ్ల జీతాలు అధికంగా ఉండటం గమనార్హం. గత ఏడాది యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి లుకా మేస్ట్రీ వేతనం 81శాతం పెరిగి 25.3 మిలియన్ డాలర్ల (రూ. 169 కోట్ల)కు పెరిగింది. అదేవిధంగా రిటైల్, ఆన్లైన్ స్టోర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏంజెలా ఎరెండట్స్ వేతనం భారీగా పెరిగి 25.8 మిలియన్ డాలర్ల (రూ. 172 కోట్ల)కు చేరుకుంది. 2015లో కూక్ మౌలిక వేతనం 14.4 శాతం పెరిగి రెండు మిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆయనకు చెల్లించే నాన్ ఈక్విటీ పరిహారం 19శాతం పెరిగి 8 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కూక్ నేతృత్వంలో 2015 యాపిల్కు బాగా కలిసొచ్చింది. చైనాలో యాపిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఐఫోన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో కొనసాగాయి. -
రాడో వాచీలు.. స్కాచ్ విస్కీ బాటిళ్లు.. పంచిపెడుతున్నారు
బెంగళూరు : పెద్దల సభలోకి వెళ్లాలంటే ఓటర్లకు 'పెద్ద'గా ఖర్చు పెట్టాలని వివిధ పార్టీల నాయకులు భావించినట్లున్నారు. అనుకున్నదే తడవుగా అలా ఇలా కాదు అత్యంత ఖరీదైన బహుమతులు అందిస్తూ... ఓటర్ల 'మతి' పోగోడుతున్నారు. పార్టీని బట్టి ఓటర్లకు చిన్న... పెద్ద నజరానాలు అందుతున్నాయి. పెద్ద పార్టీ అయితే స్విస్ రాడో వాచీలు అందిస్తూ... ఓటర్లను ఆకట్టుకుంటుంది. అలాగే చిన్న చితక పార్టీలు మాత్రం స్మార్ట్ ఫోన్లు.... ఐ పాడ్లు.... ల్యాప్ టాప్లు అందిస్తున్నాయి. దీంతో ఓటర్లు మాత్రం ఈ ఆఫర్లతో తడిసి ముద్దవుతున్నారు. ఓటర్ల కోసం ఇప్పటికే ఓ పెద్ద పార్టీ నాయకులు ఒక్కో రాడో వాచీ కోసం కనీసం రూ. 20 వేలు చెల్లించి... భారీ ఎత్తున కొనుగోలు చేశారని సాక్షాత్తూ... సదరు వాచీల పంపిణీదారుడే వెల్లడించడం కొసమెరుపు. కర్ణాటక రాష్ట్రంలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దార్వాడ్, బాగల్కోట్, విజయపూరీ జిల్లాలో ఫోన్లు.... ఐ పాడ్లు.... ల్యాప్ టాప్లు నాయకులు ఓటర్లకు అందిస్తున్నారు. కోలార్ జిల్లాలో అయితే రాడో వాచీలు ఓటర్ల చేతిలో తిరుగుతున్నాయి. అలాగే కోడుగు ప్రాంతంలో మాత్రం జానీ వాకర్ బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ బాటిళ్లు చేరుతున్నాయి. ఈ ఎన్నికల్లో 700 నుంచి 9500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటరు చేతిలో ఐపాడ్... స్మార్ట్ ఫోన్...రాడో వాచీలు... స్కాచ్ విస్కీల బాటిల్ ఏదో ఒక్కటి చేరనుంది.