Jailer
-
స్నేహంతో ‘వల’.. ఆపై వేధింపుల ‘సెగ’..!
విశాఖ సిటీ: ‘నేను చేస్తున్నట్లే... నాకూ న్యూడ్ కాల్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు.. నమ్మకం లేకపోతే అకౌంట్ నంబర్ పెట్టు.. వెంటనే డబ్బులు పంపిస్తా’.. అంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతపురం కీచక జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్రయత్నిస్తే, అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్ పొందాడు. ఈ ఉదంతంపై పోలీసుల వివరాల ప్రకారం, పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న గృహిణి ఫేస్బుక్ అకౌంట్కు కొన్నాళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను జైలర్గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్కు అంగీకరించడంతో, స్నేహం పేరుతో చాటింగ్ ప్రారంభించాడు. కొద్ది రోజులకు అసలు రంగును బయటపెట్టాడు. న్యూడ్ కాల్స్, అసభ్య మెసేజ్లతో వేధించసాగాడు. మొదట ‘సారీ’.. ఆ తరువాత ‘కుక్క’ బుద్ధి..!మహిళ భర్త, మరో బంధువు పోలీస్ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్లు, వేధింపుల వ్యవహారాన్ని మహిళ బంధువైన ఏసీపీకి, ఎస్ఐగా పనిచేస్తున్న భర్తకు చెప్పింది. దీంతో వారు జైలర్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సదరు వ్యక్తి కేవలం ఫ్రెండ్షిప్ కోసమే మెస్సేజ్లు పంపించానని, సారీ చెప్పాడు. కొన్నాళ్లు మెస్సేజ్లు పంపించడం మానేశాడు. మళ్లీ గత నెల 25వ తేదీ నుంచి మెస్సేజ్లు, కాల్స్ చేయడం ప్రారంభించాడు. వేధింపులను భరించలేక సదరు మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, జైలర్ను అరెస్టు చేయడానికి అనంతపురం వెళ్లగా.. అప్పటికే పరారయ్యాడు. విశాఖకు వచ్చి 5వ ఏడీజే (ఫ్యామిలీ) కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖ పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్ పత్రాలను అందజేశాడు. శాఖాపరమైన చర్యలు..కాగా, జైలర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
అజ్ఞాతంలో అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి
-
జైలర్ మూవీ కమెడియన్తో నటి పెళ్లి.. అదే నాన్న చివరి కోరిక (ఫోటోలు)
-
'జైలర్' పాట విషయంలో ఇప్పటికీ ఆ బాధ ఉంది: తమన్నా
బహుభాషా కథానాయకి తమన్నా భాటియా. అయితే ఐటమ్ సాంగ్స్కు కేరాఫ్ అడ్రస్ అంటే ఈ బ్యూటీనే అని చెప్పవచ్చు. చిత్రానికి అవసరం అయితే ఎంత గ్లామరస్గానైనా నటించడానికి ఆమె సై అంటారు. కాగా తమన్న ప్రత్యేక పాటలో నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్టే. అలా తమన్న నటించిన చిత్రాల విజయంలో ఆమె భాగం చాలానే ఉంటుంది. అందుకు నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఒక ఉదాహరణ. అందులో 'నువ్వు కావాలయ్యా..' అనే పాట కుర్రకారును ఉర్రూతలూరించిందనడం అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే అనిరుద్ సంగీతాన్ని అందించిన ఆ పాటలో నటుడు రజనీకాంత్ కూడా ఒక సహాయ నటుడిగా కనిపించారు. మరో విషయం ఏమిటంటే ఆ పాటలో నటి తమన్న డ్రస్, ఆమె స్టెప్స్కు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. అలాంటి పాటలో తన నటన గురించి తమన్న ఇటీవల తన సోషల్ మీడియాలో పేర్కొంటూ జైలర్ చిత్రంలోని పాటలో తాను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందన్నారు. ఇంకా కొంచెం బాగా చేయవచ్చుననే ఫీల్ అయ్యానని చెప్పారు. అయితే తాను కొన్ని నెలల క్రితం నటించిన హిందీ చిత్రం స్త్రీ 2 చిత్రంలో 'ఆజ్ కీ రాత్' అనే పాటలో నటించాననీ, ఆ పాటలో నటన సంతృప్తి కలిగించిందని చెప్పారు. ఆ పాటలో నటన గురించి ఆ చిత్ర దర్శకుడు అమర్ కౌశిక్ స్పందిస్తూ ఆజ్ కీ రాత్ పాటకు నటి తమన్నా ఆ పాత్రగానే మారారని చెప్పడమే చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు,తమిళం భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాగా నటుడు రజనీకాంత్ త్వరలో జైలర్– 2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులోనూ తమన్నాకు ఐటమ్ సాంగ్ ఉంటుందేమో చూడాలి. -
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
జైలర్ సీక్వెల్ కు లైన్ క్లియర్..
-
జైలర్ డైరెక్టర్ తో బన్నీ డిస్కషన్స్..
-
విషాదం.. ‘జైలర్’ నటుడు మృతి
కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ జి మారి ముత్తు(57) మరణించాడు. గుండెపోటుతో ఆయన శుక్రవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెళ్లడించారు. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు మారి ముత్తు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇందులో విలన్ నమ్మకస్తుడి పాత్రలో నటించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి ముత్తు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయి.. మారిముత్తుకు చిన్నతనం నుంచే సినిమాలపై ప్రేమ కలిగింది. ఇంట్లో చెబితే ఒప్పుకోకపోవడంతో 1990లో సొంతూరు పసుమలైతేరి నుంచి చెన్నైకి పారిపోయాడు. దర్శకుడు కావాలనే కోరికతో గీత రచయిత వైరముత్తు దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్గా పనిచేశాడు. తరువాత నటుడు-దర్శకుడు రాజ్ కిరణ్లో సహాయ దర్శకునిగా చేరాడు. మణిరత్నం, వసంత్, ఎస్ జే సూర్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాడు. 'మన్మధన్'సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘కన్నుమ్ కన్నుమ్’సినిమాతో డైరెక్టర్గా మారాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత ‘పులివాల్’చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2014లో విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. (చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?) -
ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే
కోలీవుడ్ నటుడు జాఫర్ సాదిఖ్ పేరు జైలర్ సినిమాతో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్- కమల్ హాసస్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో మరగుజ్జుగా ఆయన నటించిన తీరు అందరనీ ఆకట్టుకుంటుంది. తాజాగ ఆయన ప్రియురాలు 'సిద్ధికా షెరిన్'ను ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులకు పరిచయం చేశాడు. ఎక్కడ పరిచయం కోలీవుడ్లో విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోలలో జాఫర్ సాదిఖ్ పాల్గొనేవాడు. అదే టీవీలో ఆమె కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, జోడి నంబర్ 1, ఉంజాలిల్ యార్ ప్రభుదేవా-2 వంటి డ్యాన్స్ షోలలో సిద్ధిక పోటీదారురాలిగా కనిపించింది. మొదట ప్రకాశ్రాజ్-సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన పావ కథైగల్ అనే వెబ్ సీరిస్తో జాఫర్ సాదిఖ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరిస్ నెట్ఫ్లిక్స్లో పలు విభాగాలుగా విడుదలైంది. అది చూసి లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో ఓ పాత్ర ఇచ్చి సినీ రంగానికి పరిచయం చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్లో ఒకరిగా జాఫర్ మాస్గా నటించాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ సీన్లో కమల్ కాలు కోసే ప్రయత్నంలో జాఫర్ సాదిఖ్ కనిపిస్తాడు. ఈ సన్నివేశమే ఆతన్ని పాపులర్ చేసింది. మరోవైపు అతను కొరియోగ్రాఫర్గా కూడా బిజీగా ఉన్నాడు. అతను తన స్వంత డ్యాన్స్ స్టూడియోను కూడా నడుపుతున్నాడు. విక్రమ్ సినిమా తర్వాత అతనికి శింబుతో సినిమా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జైలర్ ఇలా వరుసగా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో కూడా జాఫర్ కొన్ని ప్రాజెక్ట్స్కు సైన్ చేశాడు. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న జాఫర్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. జాఫర్ యొక్క ప్రత్యేక లక్షణం అతని పొట్టి పొట్టితనమే. కానీ అతని స్నేహితురాలు జాఫర్ కంటే పెద్దది, అందమైనది కూడా. వీరిద్దరూ స్టైలిష్గా పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాఫర్ ప్రియురాలి పేరు సిద్ధిక అని వెల్లడించారు. ఆమె కోలీవుడ్లో మంచి డ్యాన్సర్గా రానిస్తుంది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్లకు కొరియోగ్రాఫర్గా ఆమె వర్క్ చేస్తుంది. (ఇదీ చదవండి; ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి) జాఫర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మూడు మాత్రమే కానీ అతనికి అభిమానుల నుంచి మరింత మద్ధతు అందుతున్నందున మరెన్నో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆనందంలో తన ప్రియురాలు సిద్ధికను కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఈ వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నా తాజాగ ఆయన ప్రకటించాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by sidhiqa sherin (@sidhiqasherink) -
డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా
రజనీకాంత్ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలో దద్దరిల్లిపోతోంది. కారణం ఆయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడమే. కాగా తదుపరి 'లాల్సలామ్' చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో రజనీకాంత్ మొయిదీన్ బాబాగా అతిథిపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం. (ఇదీ చదవండి: ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!) లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ముందుగా రజనీకాంత్ గెస్ట్గా నటిస్తున్నారన్న ప్రచారం జరగ్గా తాజాగా ఆయనది ఈ చిత్రంలో ఎక్సెంట్ క్యామియో పాత్ర అని తెలిసింది. ఇంతకు ముందు రజనీకాంత్ భాషాలో పోషించిన పాత్రకు 10 రెట్లు పవర్ఫుల్గా ఉంటుందని సమాచారం. ఈయన పాత్ర చిత్రం విలువ భాగంలో ఫుల్లుగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జైలర్ చిత్రం తరువాత విడుదలవుతున్న లాల్సలామ్ చిత్రంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్
రజనీకాంత్ 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఒకరకంగా జైలర్ విజయం కోలీవుడ్ పరిశ్రమకు మంచి బూస్ట్ను తెచ్చిందనే చెప్పవచ్చు. అక్కడ రజనీకాంత్ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సక్సెస్ నిరూపించింది. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా గురించి తాజాగ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రజనీ నిజ జీవితంలో జైలర్ క్లైమాక్స్ సీన్ జైలర్ సినిమాలో తన కుటుంబ సన్నివేశాల్లో వచ్చే చాలా డైలాగులు రజనీ నిజ జీవితానికి సంబంధించినవని ఆయన అన్నారు. క్లైమాక్స్ సీన్లో ఏదైనా చెప్పాలని ఉందా..? అంటూ తన కుమారుడిని పదేపదే రజనీ అడిగే సన్నివేశం ఉంటుంది. అందులో అతని నిజ జీవితంలోని నొప్పిని చూపిస్తుంది. ఇది కేవలం డైలాగ్ కాదు. అది వారి జీవితం. డైలాగ్ మాట్లాడేటప్పుడు అతను ధనుష్, అతని కుమార్తె ఐశ్వర్య గురించి ఆలోచించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. ధనుష్ దంపతుల మధ్య ఏదో జరుగుతోందని రజనీకి ముందే అనిపించివుండవచ్చు.. విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఈ విషయం గురించి తన కూతురిని రజనీ నేరుగా అడగలేరు. అందుకే ఆయన నిజ జీవితంలో కూడా 'ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అని ఆమెను చాలాసార్లు అడిగారు.' అని ప్రవీణ్ గాంధీ తెలిపాడు. ఆ సినిమాలో రజనీ నవ్వుతున్న టాప్ యాంగిల్ షాట్ ఉంటుంది. అందులో చాలా ఎమోషన్ కనిపిస్తుంది. ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు ఆ సీన్ చాలా దగ్గరగా ఉంటుందని ఆయన తెలిపాడు. (ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?) ఆ సమయంలో చాలాసార్లు కన్నీళ్లు పెట్టాడు రజనీకాంత్కు ఇద్దరు కూతుళ్లు. ఒక తండ్రిగా, అతను తన కుమార్తెలను చాలా అమితంగా ప్రేమిస్తాడు. వారిని ఆయన చాలా క్రమశిక్షణతోనే పెంచారు. కానీ దేవుడి రాతను ఎవరూ మార్చలేరని ఆయన చెప్పారు. రజనీకి తన ఇద్దరు కూతుళ్ల ప్రాణాలే ముఖ్యం. కానీ వారి జీవితంలో జరిగిన సంఘటనలకు ఇద్దరూ బాధపడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఆ షాట్లోనే కనిపిస్తాయని ప్రవీణ్ గాంధీ స్పష్టం చేశారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య గతేడాది ధనుష్ నుంచి విడిపోయింది. వారి పిల్లల యాత్ర, లింగ ఇద్దరూ ధనుష్ వద్దే ఉంటారు. అప్పడప్పుడు రజనీకాంత్ వద్దకు వెళ్తుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ పిల్లలిద్దరినీ చూడగానే చాలా సందర్భాల్లో రజనీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా వారి విడాకులు ఇరువురి కుటుంబాలను తీవ్రంగా కలవరపరిచాయని చెప్పుకొచ్చాడు. గతంలో రజనీకాంత్ కూడా వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించారని తెలిసింది అది ఫలించలేదన్నాడు. సౌందర్య జీవితంలో కూడా ఇబ్బందులే రజనీ చిన్న కూతురు సౌందర్య కూడా మొదటి వివాహం విఫలమైంది. గ్రాఫిక్ డిజైనర్గా ఉన్న సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్కుమార్ను వివాహం చేసుకుంది. 2015లో వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత విబేదాలు రావడంతో 2017లో ఇద్దరూ విడిపోయారు. 2019లో నటుడు, వ్యాపారవేత్త విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకుంది. గతేడాది ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడని ఆయన పేర్కొన్నాడు. జైలర్లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే చాలా సన్నివేశాలు రజనీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని ప్రవీణ్ గాంధీ తెలుపుతూ ఆ ఇంటర్వ్యూను ముగించారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) -
యోగి ఆదిత్యనాథ్ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు. ఆగష్టు 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో రజనీకాంత్ స్టైల్కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లాయి. సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లిన రజనీ.. తన యాత్ర ముగించుకుని తిరిగి వచ్చారు. (ఇదీ చదవండి: మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్నే: మంచు విష్ణు) నేడు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను రజనీకాంత్ కలవనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్తో కలిసి జైలర్ సినిమాను తలైవా చూడనున్నారు. అందులో భాగంగా రజనీ ఇప్పటికే లఖ్నవ్ చేరుకున్నారు. దేవుడి దయ వల్ల సినిమా మంచి విజయం సాధించిందని ఆయన తెలిపారు. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జైలర్ సినిమాను ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వీక్షించడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయ్ కూడా ఈ సినిమా చూసిన విషయం తెలిసిందే. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్కుమార్, తమన్నా, సునీల్, కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే 'జైలర్' రూ.450 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఫైనల్గా రూ.600 కోట్ల మార్క్ను దాటుతుందని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. (ఇదీ చదవండి: లైన్లో నలుగురు.. మెగాస్టార్ దారెటు.. బాసూ బీ కేర్ఫుల్!) -
జైలర్లో టాలీవుడ్కు చెందిన లెజండరీ పర్సన్ వారసుడిని గుర్తించారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇందులో నటించిన కొంతమంది నటీనటులకు పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు. అలాంటి వారిలో నటుడు సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. జైలర్ సినిమా ద్వితీయార్ధంలో కామెడీ ట్రాక్లో అతను తమన్నా లవర్గా, సినిమా డైరెక్టర్ బాగున్నారా బాలు పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు అంతటా అతని గురించే చర్చ జరుగుతుంది. ఇంతకు అతను ఎవరో కాదు.. టాలీవుడ్కు చెందిన లెజెండరీ ఫిల్మ్ మేకర్ కోదండ రామిరెడ్డి పెద్ద కుమారుడు. ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అందించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్బాస్లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే జైలర్లో సునీల్ రెడ్డి పాత్ర ఎక్కడొస్తుందటే.. తెలుగు ప్రముఖ నటుడు అయిన సునీల్, తమన్నా పాత్రల మధ్య సునీల్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. సునీల్ ఇస్తున్న గిఫ్ట్లను తీసుకుని తమన్నాకు ఇస్తుంటాడు. సునీల్, తమన్నా మధ్య జరిగే సీన్లలో సునీల్ రెడ్డి మెప్పిస్తాడు. సునీల్లాగే విగ్తో సహా కామెడీ ఎలిమెంట్స్ని వివిధ సన్నివేశాల్లో అతను అలరించాడు. ఈ మధ్యే విడుదలైన మామన్నన్ సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్కు అన్నయ్య పాత్రలో కాలేజీ యజమానిగా మెప్పించాడు. (ఇదీ చదవండి: శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు.. ఆర్థికంగా అన్నీ కోల్పోయాం: డిస్కో శాంతి) సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ రెడ్డి కూడా తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగు ఇండస్ట్రీలో మొదట 'గొడవ' అనే సనిమా తీసినా.. ఇక్కడ కాంపీటేషన్ ఎక్కువ కావడంతో వైభవ్ తమిళ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. తన సోదరుడి అడుగుజాడల్లో, సునీల్ రెడ్డి సినీ ప్రపంచంలోకి ప్రవేశించాడు, ప్రధానంగా హాస్య పాత్రలతో ఆయన అక్కడ పేరుగాంచాడు. సునీల్ రెడ్డి ఇప్పటి వరకు మాస్టర్, బీస్ట్, డాక్టర్, మామన్నన్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. డాక్టర్ చిత్రంలో సునీల్ రెడ్డి నటనకు ఫిదా అయిన నెల్సన్ జైలర్లో మరో అవకాశం ఇచ్చాడు. అలా తమిళనాట సునీల్ రెడ్డి కూడా ట్రెండింగ్ నటుల జాబితాలో చేరిపోయాడు. -
ఆ ఆపజయాల వల్లే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ: రమ్యకృష్ణ
రమ్యమైన నటి రమ్యకృష్ణ. తొలి రోజుల్లో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలో మెప్పించారు. రజినీకాంత్తో కలిసి నటించిన 'నరసింహ' చిత్రానికి ముందు వరకు కథానాయకిగా నటించిన రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో రజనీకాంత్కు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నీలాంబరిగా రమ్యకృష్ణ నటనను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో రాజమాత శివగామిగా జీవించారు. (ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి) తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్కు భార్యగా అత్యంత సహజంగా నటించారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో తనకు సరిగ్గా నటించడం తెలియలేదు అన్నారు. నటిగా తన తొలి చిత్రం తమిళంలో 'వైళ్లె మనసు' అని చెప్పారు.1988లో తమిళ్లో నటించిన ముదల్ వసంతం చిత్రాన్ని ఇటీవల చూసిన తన తల్లి నువ్వు ఇలాంటి నటనతో ఎంతకాలం ఎలా నిలబడగలిగావు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. దీంతో అప్పట్లో తన నటన ఎలా ఉండేది అన్నది అర్థం చేసుకోండి అని అన్నారు. అలా తాను తమిళంలో నటించిన పలు చిత్రాలు అపజయాన్ని చూడడంతో తెలుగు చిత్రంపై దృష్టి సారించానని అన్నారు. అయితే తెలుగులో లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చానని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. -
'జైలర్' చూసి రజనీకాంత్ ఎలాంటి కామెంట్ చేశారంటే: నెల్సన్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్, కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి నెల్సన్ కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. కాగా ఈనెల 10న విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగ చిత్ర సక్సెస్ మీట్ను నిర్వహించారు. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ జైలర్ చిత్రం ఇంత సంచలన విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదన్నారు. ఒక మంచి చిత్రాన్ని చేయాలన్న భావనతోనే చిత్ర షూటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్ర ఘన విజయానికి కారణం కథ, రజనీకాంత్ ఫీవర్, స్లాంగ్, అభిమానుల ఆదరణే ముఖ్యకారణమన్నారు. (ఇదీ చదవండి: ఆ రూమర్స్పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) చిత్ర విడుదలకు మూడు రోజుల ముందు రజనీకాంత్ చూశారన్నారు. అప్పుడు మీరు ఊహించిన విధంగా చిత్రం వచ్చిందా అని ఆయన్ని అడిగానని, అందుకు ఆయన ఊహించిన దానికంటే పదిరెట్లు బాగా వచ్చిందని చెప్పారన్నారు. చిత్రం బాగా వస్తుందని తెలుసు కానీ, ఇంత బాగా వస్తుందని ఊహించలేదన్నారు. ఆ ప్రశంసే ఆనందాన్నిచ్చిందన్నారు. ఇప్పటి సంతృప్తే అప్పుడే కలిగిందనే అభిప్రాయాన్ని నెల్సన్ వ్యక్తం చేశారు. చిత్రం బడ్జెట్ ముందుగా అనుకున్న దానికంటే పెరిగిందని అయినా సన్ పిక్చర్స్ నిర్వాహకులు కాదనకుండా ఖర్చు చేశారని చెప్పారు. నిర్మాత కళానిధి చిత్రం ప్రారంభించినప్పటి నుంచి చాలా సపోర్టుగా ఉన్నారన్నారు. జైలర్ చిత్రం ఏడు రోజుల్లో రూ.375.40 కోట్లు వసూలు చేసిందని నిర్మాతల వర్గం గురువారం అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారన్నారు. -
రజనీకాంత్కు అనిరుధ్ ఏమవుతాడో తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు.. ఈ మూవీలో 'హుకూం' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో రజనీకాంత్ స్టైల్కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లాయి. రజనీ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్బమ్స్ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అనిరుధ్ ఇచ్చిన స్టేజ్ ఫర్మామెన్స్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. (ఇదీ చదవండి: పవన్తో విడాకుల టైమ్లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) స్టేజీపై మ్యూజిక్కు తగ్గట్టుగా ఆతను ఊగిపోతూ పాడుతుంటే ఆడియన్స్ను మరో ట్రాన్స్లోకి వెళ్తారు. అంతలా రజనీ కోసం పర్ఫామెన్స్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ను వివరిస్తూ సాగే ఆ పాట సినీ అభిమానులను ఊపేస్తోంది. జైలర్ సినిమాతో అనిరుధ్ తమిళంలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. 2012లో ధనుష్ త్రి సినిమా కోసం పాటను కంపోజ్ చేసినప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దపు కాలం గడిచింది. తన కెరియర్లో ఎన్నో అద్బుతమైన పాటలను అందించాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏఆర్ రెహమాన్ను మించిపోయాడని సినీ ట్రేడర్స్ తెలుపుతున్నాయి. రజనీకి కుమారుడు లేరనే సమస్య లేదు: విఘ్నేష్ జైలర్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అనిరుధ్- రజనీకాంత్ బంధం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. 'మనం జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తాం. నేను తలైవా ముందు నిలబడిన ఈ క్షణం అలాంటిదే. జైలర్లో తండ్రీకొడుకుల అనుబంధంపై ఓ పాట రాశాను. దాని గురించి గుర్తుచేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల తండ్రిని. భవిష్యత్తులో వాళ్లు పెద్దయ్యాక నేను రాసిన పాట రజనీ సినిమాలో ఉందని చెబుతాను. (ఇదీ చదవండి: అతను నా తమ్ముడు.. అవసరమైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తా: విష్ణు) అలాగే, తలైవా గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. రజనీ సార్ కోసం ఓ పాటను సిద్ధం చేసినప్పుడే తలైవా పట్ల అనిరుధ్లోని నిజాయతీ, ప్రేమ కనిపించాయి. రజనీ సర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు కొడుకు లేడనే సమస్య అనిరుధ్తో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనిలో విపరీతమైన ప్రేమను చూశాను. ఒకవేళ రజనీకి కొడుకు ఉంటే అనిరుద్- రజనీకాంత్ బంధాన్ని చూసి అసూయపడేవాడు.' అని విఘ్నేష్ శివన్ అన్నారు. (అనిరుధ్ ఫ్యామిలీ) రజనీ- అనిరుధ్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే ఆడియో లాంచ్ ఫంక్షన్కి అనిరుధ్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజనీ అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అనిరుధ్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్కు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య సతీమణి లతా రజనీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి అనిరుధ్ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ సినిమా షూటింగ్లో ఉండగా అనిరుధ్ను తీసుకుని లత వెళ్లారట. ఆ సమయంలో రజనీ-అనిరుధ్ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
హన్సిక సంగతేంటి నెల్సన్..?
రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల చిత్రంతో దర్శకుడిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దాని తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కూడా రూ.200 కోట్లు వసూలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఈయన వీటన్నిటికంటే ముందుగా శింబు కథానాయకుడిగా వేట్టై మన్నన్ అని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటి హన్సిక నాయకిగా నటించిన ఈ చిత్రం కొంత భాగం షూటింగులు జరుపుకొని ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయింది. కాగా జైలర్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రం వేట్టై మన్నన్ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నటుడు శింబు దర్శకుడు నెల్సన్తో సంప్రదించినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కథానాయకి హన్సిక సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. (ఇదీ చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) శింబు హన్సికల ప్రేమ వ్యవహారం తెలిసిందే. పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన వీరి ప్రేమ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక కథానాయకిగా ప్రధాన పాత్రలో నటించిన ఆమె 50వ చిత్రం మహాలో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా దర్శకుడు నెల్సన్ తదుపరి ధనుష్ కథానాయకుడిగా చిత్రం చేయనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఉద్యోగుల కోసం 7 స్క్రీన్లు బుక్ చేసిన సీఈఓ - తలైవా సినిమా అంటే అట్లుంటది!
మన దేశంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్కి ఉన్న ఫ్యాన్స్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తమిళనాడులో ఇది మరింత ఎక్కువగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జైలర్ సినిమా ఈ రోజు విడుదలైంది. దీనికోసం తమిళనాట ఒక కంపెనీ సీఈఓ తమ ఎంప్లాయిస్ కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫ్రెష్వర్క్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ గిరీష్ మాతృభూతం తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం జైలర్ స్పెషల్ షోలు వేయిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా ఏడు స్క్రీన్స్ బుక్ చేసుకున్నాడు. తమ 2200 మంచి ఉద్యోగుల కోసం ఇవి బుక్ చేసినట్లు తానే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఫ్రెష్వర్క్స్ కంపెనీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తోంది. ఈ సంస్థ సీఈఓ రజినీకాంత్ వీరాభిమాని.. కావున జైలర్ సినిమా రిలీజ్ రోజునే ఉద్యోగులకు సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కబాలి మూవీ విడుదల సమయంలో కూడా చెన్నైలో ఒక థియేటర్ బుక్ చేసాడు. అంతకు ముందు కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. గిరీష్ చేస్తున్న పనికి తమళనాడులో అతని పేరు మారుమ్రోగిపోతోంది. రజిని అభిమానులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 2200 tickets 7 screens Freshworks employees only #thalaivaralaparai #TigerkaHukum #ThalaivarNirandharam #freshworksda pic.twitter.com/shjOumBeaY — Girish Mathrubootham (@mrgirish) August 9, 2023 -
మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా
‘నువ్వు కావాలయ్య...’ అంటూ ‘జైలర్’లో హుషారుగా స్టెప్పులేశారు తమన్నా. ఈ బ్యూటీ కూడా సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. అందుకే దాదాపు 20 ఏళ్లయినా ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంలో ‘అరణ్మణై’, మలయాళంలో తొలి చిత్రం ‘బాంద్రా’, ఓ టీవీ షోతో బిజీగా ఉన్నారామె. చిరంజీవి సరసన తమన్నా నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానుంది. అంతకు ఒక్కరోజు ముందు రజనీకాంత్ ‘జైలర్’తో థియేటర్లకు వస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మించారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ రూపొందింది. రెండు చిత్రాలతో థియేటర్లకు రానుండటం, ఇతర విశేషాలు తమన్నాతో జరిపిన ఇంటర్వ్యూలో ఈ విధంగా... ► ఈ నెల 10న ‘జైలర్’, 11న ‘భోళా శంకర్’ సినిమాలతో వస్తున్నారు. సో.. వచ్చే వారం మీకు స్పెషల్ అనొచ్చు... విషయం ఏంటంటే.. ఒకటి తమిళ సినిమా, మరొకటి తెలుగు సినిమా అయినా రెండు సినిమాలూ అన్ని భాషల్లో థియేటర్లకు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిగారు, సూపర్ స్టార్ రజనీకాంత్గారు.. ఇద్దరూ దేశంలో పెద్ద స్టార్స్. ఇలా ఒక్క రోజు గ్యాప్లో ఇద్దరు స్టార్స్తో సినిమా అంటే కల నెరవేరినట్లు ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. నేను చేసిన ఇంకో సినిమా కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. అదొక మంచి ఫీలింగ్. ► చిరంజీవి డ్యాన్స్ మామూలుగా ఉండదు... మీరు డ్యాన్స్లో బెస్ట్. అయితే మీ ఇద్దరికీ ‘సైరా’లో డ్యాన్స్ చేసే చాన్స్ రాలేదు.. ‘భోళా శంకర్’లో మీ కాంబో డ్యాన్స్ గురించి... ‘మిల్కీ బ్యూటీ...’ మంచి రొమాంటిక్ మెలోడి సాంగ్. ఈ పాటలో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. మిగతా స్టెప్స్ కూడా గ్రేస్ఫుల్గా ఉంటాయి. చిరంజీవిగారి డ్యాన్స్ చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. అందుకే మిగతావారికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పైగా శేఖర్ మాస్టర్ మంచి స్టెప్స్ డిజైన్ చేశారు. స్విట్జర్లాండ్లో ఈ పాట షూట్ జరిగింది. పెద్దగా రిహార్సల్స్ చేయలేదు. అక్కడికి అక్కడే నేర్చుకుని చేసేశాం. అలాగే ఇదే సినిమాలో ‘జామ్ జామ్...’ పాట కూడా నాకు చాలా ఇష్టం. ► సీనియర్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు... అంత సీనియర్స్తో ఎందుకు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది కదా... ఇప్పుడు నా కెరీర్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అన్ని రకాల యాక్టర్స్తో నటిస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు జోడీగా, నాకు సమానమైన ఏజ్ ఉన్నవాళ్లతో, సీనియర్లతో సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాను. నా కెరీర్లో నేనెప్పుడూ ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేను యాక్టర్లను యాక్టర్లగా చూస్తాను. నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా అన్నదే నాకు ముఖ్యం. ఏజ్ వల్ల ఈక్వేషన్ ఏం మారదు. ► దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ రేస్లో దూసుకెళ్లడానికి కారణం? అస్సలు నేను ఇది రేస్ అనుకోను. చాలా చిన్న వయసులో కెరీర్ స్టార్ట్ చేశాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. టీమ్ వర్క్ ముఖ్యం. ఒక్కోసారి కొన్ని విజయాలకు నేనూ కారణం అవుతాను. ఆ సంగతి పక్కనపెడితే.. కెరీర్లో ముందుకు వెళ్లాలంటే నిరంతరం హార్డ్వర్క్ చేయాలి. ఆ ఫోకస్తోనే వెళుతున్నాను. ► ఈ మధ్య కొన్ని హద్దులను దాటి, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.. ఈ మార్పు గురించి? మారకపోతే నేనెక్కడ మొదలయ్యానో అక్కడే ఆగిపోయినట్లే.. అలా ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఎవరైనా కెరీర్లో ఎదగాలనే అనుకుంటారు. ప్రతీ జాబ్లో ప్రమోషన్ ఉన్నట్లే మా జాబ్ కూడా. ప్రమోషన్ కోసం కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి.. కొత్త ప్రయత్నాలు చేయాలి. అప్పుడు జర్నీ ఇంకా లాంగ్గా, బెటర్గా ఉంటుంది. ► ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్లో నటించిన అనుభవం గురించి? మన చుట్టూ ఇప్పుడు రకరకాల మాటలు దొర్లుతుంటాయి. వాటిలో ఏది మంచో.. చెడో తెలుసుకోలేం. అందుకే ‘లస్ట్ స్టోరీస్ 2’ గురించి నాతో అభిమానులు, ఇంకా వేరేవాళ్లు బాగుందని అన్నప్పుడు కొత్త ప్రయత్నం రీచ్ అయిందనే ఆనందం కలిగింది. ముఖ్యంగా ఉమన్ వచ్చి బాగుందని అభినందించడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను. ► ఇన్నేళ్లల్లో మీ గురించి రానటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.. ఫర్ ఎగ్జాంపుల్ నటుడు విజయ్ వర్మ, మీ గురించి ఎక్కువ ప్రచారమవుతోంది... ఎవరో ఏదో మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు మీడియాతో మాట్లాడినా హానెస్ట్గానే మాట్లాడాను. ఇక ఎవరెవరో రూమర్స్ క్రియేట్ చేస్తే నేనేం చేయలేను. ► పెళ్లి ప్లాన్ ఏమైనా? ఇప్పటికైతే లేదు. ప్లాన్ చేసుకున్నప్పుడు కచ్చితంగా చెబుతాను. -
'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సునీల్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, జాకీష్రాప్, శాండల్వుడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, యోగిబాబు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: జైలర్కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్కు అసూయ ఎందుకు?) ట్రైలర్ చూస్తే జైలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే కాల్పులు, బాంబు మోతలతో దద్దరిల్లింది. 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే' అనే రజినీకాంత్ డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా జైలర్ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఇకపోతే సాధారణంగా చిత్రాల్లో హీరోలకు ఇంట్రో సాంగ్ ఉంటుంది. అయితే జైలర్ చిత్రంలో నటి తమన్న ఇంట్రో సాంగ్లో మెరవబోతుండటం విశేషం. తమన్నా సాంగ్ కచ్చితంగా జైలర్ చిత్రానికి ప్రత్యేక తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (ఇది చదవండి: 'జైలర్'పై నో బజ్.. వ్యాపారం కూడా అలానే!) -
ఆగస్ట్లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. జులై నెలలో ప్రతివారం రెండు, మూడు చిన్న సినిమాలు థియేటర్స్లో సందడి చేశాయి. వాటిల్లో కొన్ని హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇక ‘బేబీ’ చిత్రం అయితే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బేబీ’తో మరోసారి రుజువైంది. అందుకే ఆగస్ట్లో కూడా వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మొదటి వారం(ఆగస్ట్ 4) ప్రముఖ క్రికెటర్ ధోనీ నిర్మించిన తొలి సినిమా ‘ఎల్జీఎం’విడుదల కానుంది. దీంతో పాటు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘హెబ్బులి’, ‘రాజుగారి కోడి పలావ్’, ‘విక్రమ్ రాథోడ్’, ‘దిల్సే, ‘మిస్టేక్’, ‘మెగ్ 2’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ Vs సూపర్ స్టార్ ఇక ఆగస్ట్ రెండోవారంలో రెండు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్ ’రిలీజ్ కాబోతుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించింది. అటు ‘జైలర్’, ఇటు ‘భోళా శంకర్’ ల మధ్య మరో చిన్న చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. ఇలా ఆగస్ట్ రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలతో పాటు ఒక చిన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హిందీ నుంచి కూడా రెండు ఆసక్తికరమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ మై గాడ్ 2’, సన్నీదేఓల్ నటించిన ‘గదర్ 2’ చిత్రాలు ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా రెండు సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ కావడం గమనార్హం. మూడో వారంలో నాలు చిన్న చిత్రాలు ఆగస్ట్ మూడో వారంలో అన్ని చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. రెండో వారంలో జైలర్, భోళాశంకర్ లాంటి బడా సినిమాలు రావడంతో మూడో వారం ఎలాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సాహసం చేయలేదు. దీంతో ఈ వారం మళ్లీ చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆదికేశవ’తో పాటు శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు 1’, సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, ‘నచ్చినవాడు’ చిత్రాలు విడుదలకానున్నాయి. ‘మెగా’ సందడి ఆగస్ట్లో నెలలో వరుసగా మెగా హీరోలు సందడి చేయనున్నారు. రెండో వారం ‘భోళా శంకర్’తో చిరంజీవి వస్తే... మూడో వారం ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. ఇక నాలుగో వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాంఢీవధారి అర్జున’ విడుదల కాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కార్తికేయ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ చిత్రం కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. వీటితో పాటు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన హిందీ చిత్రం ‘డ్రీమ్ గర్ల్ 2’ కూడా ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. -
విజయ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాపై తమన్నా కామెంట్
సౌత్ ఇండియాలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. సినిమాలతో పాటు పలు వెబ్ సీరిస్లతో ఆమె మెప్పిస్తుంది. ఆగష్టు నెలలోనే ఆమె నటించిన జైలర్,భోళా శంకర్ రిలీజ్ కానున్నాయి. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా దళపతి విజయ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) విజయ్- తమన్నా కలిసి 2010లో 'సుర' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. అలాంటి డిజాస్టార్పై తమన్నా తాజాగా ఇలా మాట్లాడింది. 'నాకు సుర సినిమా అంటే చాలా ఇష్టం. అందులోని పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. అందులో నటిస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. కొన్ని సీన్స్లలో అయితే నా నటన నాకే నచ్చలేదు. ఆ సీన్లు సరిగా రావడంలేదనే విషయాన్ని షూటింగ్ జరుగుతున్న సమయంలోనే గ్రహించాను. సీన్స్ బాగా రావడం లేదని సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అంచనా వేయొచ్చు. కానీ అప్పుడు సినిమా నుంచి తప్పుకోవడం జరగదు. ఎందుకంటే ఒక సినిమాను అంగీకరించిన తర్వాత కచ్చితంగా దాన్ని పూర్తిచేయాల్సిందే. ఏవో కొన్ని కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. ఈ రంగంలో జయాపజయాలు సహజం. నటులందరికి ఇండస్ట్రీ చాలా విలువైనది. కాబట్టి ప్రతివారు బాధ్యతాయుతంగా ఉండాలి.' అని తమన్నా చెప్పింది. -
జైలర్కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్కు అసూయ ఎందుకు?
చిత్ర పరిశ్రమంలో సెంటిమెంట్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిత్రం హిట్ అయితే ఆ తరహాలోనే చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇకపోతే ప్రస్తుతం జైలర్ చిత్రంలో తమన్నా నటించిన కావాలా పాట ట్రెండింగ్గా మారింది. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. (ఇదీ చదవండి: తరుణ్ ఎవరింటి అల్లుడు?) అయితే వీటన్నింటినీ తమన్నా నటించిన కావాలా పాట పక్కకు నెట్టేసింది. ఇంతకుముందు ఇదేవిధంగా అల్లు అర్జున్ పుష్పాలో సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా మామ ట్రెండ్ సెట్టర్గా మారింది. పలువురు స్టార్ హీరోయిన్ల నుంచి విదేశీ భామల వరకు ఈ పాటకు డాన్స్ చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడు తమన్నా నటించిన కావాలా పాట కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. 52 ఏళ్ల రమ్యకృష్ణ కూడా ముచ్చటపడి ఈ పాటకు డాన్స్ చేయడం విశేషం. ఇకపోతే ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కూడా కావాలా పాటపై తన అసూయను వ్యక్తం చేశారు. ఆరు రోజులు చిత్రీకరించిన ఈ పాటలో తనకు ఒక పూట కూడా నటించే అవకాశాన్ని కల్పించలేదనే నిష్టూరాన్ని ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో వెలిబుచ్చారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కావాలా అంటూ తెలుగు పదాలతో ఈ పాట మొదలవుతుంది. (ఇదీ చదవండి: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా దిల్రాజు) ఇంతకుముందు కూడా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో దేవుడ దేవుడా అనే పాట తెలుగు పదాలతో మొదలవుతుంది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో పాటు చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ జైలర్ చిత్రానికి కూడా వర్క్ అవుట్ అవుతుందా..? లేదా..? అనే విషయం త్వరలో తేలిపోనుంది. -
ఇక్కడ నేనే కింగ్!
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘హుకుమ్..’ అంటూ సాగే పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను హీరో వెంకటేష్ ఆదివారం షేర్ చేశారు. ‘‘హే ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్.. ఆ రూల్స్ని నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి, అది వదిలేసి ఏదైనా పిచ్చిపనులు చేయాలని చూశావో నిన్ను కండకండాలుగా నరికి విసిరిపారేస్తాను.. హుకుమ్.. టైగర్గా హుకుమ్..’ అంటూ మొదలై, ‘ఉరుముకి మెరుపుకి పుట్టాడురా.. పిడుగును పిడికిట పట్టాడు రా.. అడుగడుగున గుడి కట్టాలిరా... తర తర తరముల సూపర్ స్టార్ రా..’ అంటూ సాగుతుందీ పాట. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, డింకర్ కల్వల పాడారు. -
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే: రజినీకాంత్
Rajnikanth Speech Latest: సూపర్స్టార్ రజినీకాంత్ పేరు చెప్పగానే ఆవేశంతో ఊగిపోయే ఫ్యాన్స్, విజిల్స్తో దద్దరిల్లే థియేటర్లు గుర్తొస్తాయి. అయితే 'రోబో' తర్వాత ఈయన రేంజ్కు తగ్గ మూవీస్ పడలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు 'జైలర్' కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 10న రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన తలైవా.. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో పశ్చాత్తాప పడ్డారు. నేను చేసిన పెద్ద తప్పు 'నా జీవితంలో మద్యం అనేది లేకపోయింటే ఈ పాటికి నేను సమాజసేవ చేస్తుండేవాడిని. మందు తాగడం.. జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. 'నువ్వు రాజువి మందు తాగొద్దు' అని నా తమ్ముడు అప్పటికీ చెబుతుండేవాడు. కానీ నేనే వినలేదు. ఒకవేళ నా లైఫ్లో ఆల్కహాల్ అనేది లేకపోయింటే.. ఇప్పుడున్న దానికంటే ఎంతో గొప్పస్థాయిలో ఉండేవాడిని, వ్యక్తిగతంగా కూడా' (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) మీ వల్ల వాళ్లకు ఇబ్బంది 'అయితే నేను పూర్తిగా మందు తాగొద్దు అని చెప్పడం లేదు. మీకు సరదాగా అనిపించినప్పుడు ఎప్పుడో ఓసారి తాగండి. కానీ రోజూ మాత్రం డ్రింక్ చేయొద్దు. ఎందుకంటే అది మీ ఆరోగ్యంతోపాటు మీ చుట్టూ వాళ్ల ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఒకవేళ మీరు తాగితే మాత్రం మొత్తం జీవితం తలకిందులైపోతుంది. మీ తల్లిదండ్రులు, కుటుంబం, అందరూ మీ తాగుడు వల్ల ఇబ్బంది పడతారు. అందుకే మందు తాగొద్దు' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. మరి రజినీకాంత్ ఇంతలా చెప్పారు కానీ ఫ్యాన్స్ దీన్ని పాటిస్తారా అనేది సందేహమే. సరే ఇదంతా పక్కనబెడితే 'జైలర్' తెలుగులో పెద్దగా బజ్ లేదు. 'కావాలయ్యా' అనే పాట యూట్యూబ్, ఇన్ స్టాలో ట్రెండింగ్ లో ఉంది కానీ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందనేది చూడాలి. తమిళ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి సూపర్స్టార్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 10 వరకు ఆగాలి. (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) -
నేను ఆ ఇద్దరికి మాత్రమే భయపడతా: రజనీకాంత్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ వేదికపై నటుడు రజనీకాంత్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఇటీవల సూపర్ స్టార్ తానే అనే విషయంపై చాలా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రజనీ స్పందించారు. చిత్రంలోని హుకుమ్ అనే పాటలో సూపర్ స్టార్ అనే పదం చోటుచేసుకుందని, దాన్ని తాను తొలగించాల్సిందిగా చెప్పానన్నారు. నిజానికి సూపర్ స్టార్ అన్న పట్టం పెద్ద తలనొప్పి అని పేర్కొన్నారు. 1977లోనే దీనిపై పెద్ద వివాదం జరిగిందని, అప్పట్లో నటుడు కమలహాసన్, శివాజీ గణేషన్ ప్రముఖ నటులుగా రాణిస్తున్నారని, అలాంటి సమయంలో ఈ సూపర్ స్టార్ పట్టం తనకు ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసిందన్నారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలని అడవిలో ఒక గద్ద, కాకి ఉన్నాయని, అయితే కాకి గద్దకంటే పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుందని, కానీ ఎప్పటికీ గద్దను మించి ఎగరలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు విజయ్ గురించే మాట్లాడినట్టు చర్చ జరుగుతోంది. అదేవిధంగా తాను జీవితంలో ఇద్దరికే భయపడతానని అందులో ఒకరు భగవంతుడు, రెండోది మంచి మనుషులకు అని పేర్కొన్నారు. ప్రముఖుడి కొడుకు అని చెప్పటం ఈజీ అని అయితే ఆ పేరును కాపాడుకోవడం చాలా కష్టమని రజనీకాంత్ పేర్కొన్నారు. చదవండి: 87 ఏళ్ల వయసులో లిప్లాక్.. రొమాన్స్కు వయసుతో పనేంటి? అన్న నటుడు పెట్టుబడి రూ.6 లక్షలు, ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే? -
వెన్నెల నవ్వితే... ఆ అందం నువ్వే!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిరుథ్ రవిచందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చి శిల్పారావుతో కలిసి పాడాడు. ఈ పాటకు తమన్నా భాటియా వేసిన స్టెప్లను నెటిజనులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాచీ బీట్స్ పాట యూ ట్యూబ్లో 74 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ పాటలో తమన్నా హుక్ స్టెప్స్ను అనుసరిస్తూ మిస్ కేరళ (2017) ప్రియాంక మేనన్ అందమైన వీడియో చేసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 47.2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది. -
Tamannaah White Corset Top Photos: తమన్నా అందాల విందు.. అస్సలు తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
రజనీ సార్ కాపాడండి.. నా కూతురు నగలు కూడా తాకట్టు పెట్టా: నిర్మాత
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘జైలర్’ విడుదలకు రెడీగా ఉంది . కానీ ఇదే పేరుతో మలయాళీ దర్శకుడు సక్కిర్ మడథిల్ కూడా ఓ సినిమాను తీస్తున్నారు. దీంతో, ‘జైలర్’ టైటిల్ విషయంలో తాజాగా పెద్ద దుమారమే రేగుతుంది. మలయాళీ చిత్ర దర్శకుడు సక్కిర్ మడథిల్ స్పందించాడు. తను చేస్తున్న జైలర్ సినిమా బడ్జెట్ రూ. 5 కోట్లు అని తెలిపాడు. తనది చిన్న చిత్రమని ఆయన పేర్కొన్నారు. పెద్ద బడ్జెట్తో రజనీ కాంత్ సినిమా వస్తోంది. దీంతో తాను భారీగా నష్టపోతానని ఆయన తెలిపాడు. హీరో రజనీకాంత్ అంటే తనకెంతో ఇష్టమని ఆయన చెప్పారు. ఈ సినిమాపైనే తన జీవితం ఆధారపడి ఉందంటూ సక్కిర్ మడథిల్ వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) 1957లో చోటు చేసుకున్న వాస్తవ సంఘటన ఆధారంగా తాను జైలర్ సినిమాను తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. దీనికి సంబంధించి 2021 ప్రారంభంలోనే జైలర్ అనే టైటిల్ను రిజిస్టర్ చేపించానని తెలిపాడు. కానీ కొద్దిరోజుల తర్వాత రజనీ- నెల్సన్ కూడా ఇదే టైటిల్తో పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పుడే తనకు అసలు విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నాడు. టైటిల్ మార్చుకోమని సన్ పిక్చర్స్ను ఇప్పటికే పలు మార్లు చెప్పానని అయినా ఫలితం లేదని చెప్పుకొచ్చారు. కనీసం కేరళలో అయినా రజనీ జైలర్ సినిమా టైటిల్ను మార్చి విడుదల చేయాలని ఆయన కోరుతున్నారు. నా కూతురు నగలు తాకట్టు పెట్టాను: సక్కిర్ మడథిల్ 'నేనే నిర్మాతగా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమా తీశాం. దీని కోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చు పెట్టాను. సినిమా కోసం నా కూతురు నగలు, ఇల్లు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాను. సొంత కారును కూడా అమ్మేసుకున్నాను. అవి సరిపోక పోవడంతో త్వరగా చెల్లించవచ్చని ఎక్కువ వడ్డీకి బయట నుంచి అప్పులు తీసుకువచ్చి ఈ సినిమాను నిర్మించాను. కనీసం రజనీకాంత్ సార్ అయినా నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఈ టైటిల్ క్లాష్ రావడం వల్ల ఒక్కొసారి నాకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా వస్తున్నాయి.' అంటూ మలయాళీ దర్శకుడు సక్కిర్ మడథిల్ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ ‘జైలర్’ ఆగస్టులో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. సక్కిర్ తెరకెక్కించిన ‘జైలర్’ సెప్టెంబర్లో కేరళలో విడుదల కానుంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై సన్ పిక్చర్స్ ఎలా స్పందిస్తుందో తేలాల్సి ఉంది. -
టైగర్ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్కు పండుగే
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్ కుమార్, మోహన్లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్లో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) ఈ సినిమా నుంచి ఇప్పటికే మొదటి పాటతో 'నువ్వు కావాలయ్యా' అంటూ తమన్నా దుమ్ములేపింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘హుకుం...’ అంటూ సాగే ఈ పాట రజినీకాంత్ స్టైల్ని హైలెట్ చేస్తూ సాగుతుంది. ఈ సాంగ్లో రజినీకాంత్ స్టైల్ను ప్రధానంగా ఎలివేట్ చేస్తూ చిత్రీకరించారు. ఈ పాటకు సుబు రాసిన లిరిక్స్కు అనిరుధ్ కంపోజ్ చేసిన ట్యూన్ పక్కాగా సెట్ అయింది ‘హుకుమ్’ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆగస్టు 10 వరకు ఫ్యాన్స్కు పండుగే. -
సూపర్స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు
Rajinikanth Jailer Movie:సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'జైలర్'. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్లలోకి రాబోతుంది. పెద్దగా బజ్ లేని ఈ సినిమా ఇప్పుడు లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరలో కోర్టు హియరింగ్ కూడా ఉంది. ఒకప్పటితో పోలిస్తే రజినీకాంత్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. సరైన కథాకథనాలు లేకపోవడం, దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ చిత్రాలన్నీ ఫెయిలవుతూ ఉండటం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ తమదే అంటూ మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?) సదరు మలయాళ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం.. ఆగస్టు 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో 'జైలర్' టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అదే ఏడాది నవంబరులో షూటింగ్ ప్రారంభించారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ప్రొడక్షన్ ఆలస్యమైంది. ఈ రెండు సినిమాల స్టోరీలు వేర్వేరు అయినప్పటికీ కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని సక్కిర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మిగతా భాషల్లో కుదరకపోయినా మలయాళ వరకు అయినా సరే రజినీకాంత్ సినిమా టైటిల్ మార్చి విడుదల చేయాల్సిందేనని దర్శకుడు సక్కిర్ మడతిల్ పట్టుబడుతున్నారు. మరోవైపు మార్కెట్ పరంగా తమ చిత్రానికి ఎక్కడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించారు. ఆగస్టు 2న హియరింగ్ ఉంది. ఆ రోజు ఈ వివాదంపై క్లారిటీ వస్తుంది. #Jailer TITLE change issue. Malayalam director Sakkir Madathil appeals to makers of #Rajinikanth's 'Jailer' to change movie title. He formally registered the title with the Kerala Film Chamber in August 2021. His film commenced production on November 6, 2021, concluded on… pic.twitter.com/ELGkbVSowg — Manobala Vijayabalan (@ManobalaV) July 16, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
'జైలర్'పై నో బజ్.. వ్యాపారం కూడా అలానే!
Rajinikanth Jailer Movie: ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) ఆట మొదలెట్టారు. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ఆయన అభిమానులకు మజానే. సూపర్స్టార్ రజనీకాంత్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ మధ్య రజనీకాంత్ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో ఆయన స్టామినా తగ్గిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్' సినిమా వ్యాపారపరంగా పెద్దగా ఊపు లేదనే మాట కూడా వినిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమన్నా, రమ్యకష్ణ, యోగిబాబు, వసంత రవి లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!) షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో రజనీకాంత్, ముత్తువేల్ పాండియన్ అనే పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఇందులో రజనీకాంత్ గెటప్, టైటిల్ లాంటివి రిలీజ్ చేసినా ఆశించిన మూమెంట్ రాలేదు. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రచారం అస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధం అయ్యింది. ఇటీవల జైలర్ నుంచి 'కావాలయ్యా' పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఇది ఊపేస్తోంది. తమన్నా అందాలారబోత, అనిరుధ్ బీట్స్ దెబ్బకు పాట తెగ వైరల్ అయిపోయింది. ఈ వేడిలో హుకుమ్ టైగర్ కా హుకుమ్ అనే మరో మాస్ పాటను విడుదల చేయబోతున్నారు. జూలై 17న విడుదల చేయనున్నట్లు రజనీకాంత్ ఫొటోతో పోస్టర్ను విడుదల చేశారు. ఇది సృష్టించే సంచలనం కోసం రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Oru chinna Preview-ku ready-ah? #HukumPreview Today at 6 PM 🙌🏼#Hukum #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @soupersubu pic.twitter.com/7OnUgA8WW8 — Sun Pictures (@sunpictures) July 15, 2023 (ఇదీ చదవండి: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) -
తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!
Tamannaah Vijay Varma: హీరోయిన్ తమన్నా ఈ మధ్య తెగ ట్రెండింగ్ అవుతోంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్, ముద్దుల దగ్గర నుంచి మొదలుపెడితే వెబ్ సిరీసుల్లో వీరిద్దరూ రెచ్చిపోవడం వరకు ఒకటా, రెండా.. ఎక్కడ చూసినా మిల్కీ బ్యూటీనే. చేతిలో ఉన్న సినిమాలు తక్కువేమో గానీ వస్తున్న వార్తలు మాత్రం బోలెడు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు విజయ్ వర్మ.. ఈమె డ్యాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమన్నా ఊరమాస్ సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న తమన్నా.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్'లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా 'కావాలా..' లిరికల్ పాటని విడుదల చేశారు. ట్యూన్ క్యాచీగా ఉంది. ఇందులో తమన్నా డ్యాన్స్ సూపర్ గా ఉంది. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. (ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!) సినిమా దేవత గతేడాది వరకు సింగిల్ గానే ఉన్న తమన్నా.. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ మెంటైన్ చేస్తోంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' ఈ మధ్యే రిలీజైంది. అందులో శృంగార సన్నివేశాలు, ముద్దులతో ఈ జోడీ రెచ్చిపోయింది. ఇక తమన్నా లేటెస్ట్ సాంగ్ చూసిన విజయ్ వర్మ ఫిదా అయిపోయాడు. 'పాట ఫైర్ పుట్టిస్తోంది. సినిమా దేవుడు, దేవత' అని విజయ్ రాసుకొచ్చాడు. లవర్ని ఓ రేంజులో అయితే ఈ క్యాప్షన్ లో రజినీకాంత్ ని సినిమా దేవుడు అని విజయ్ వర్మ చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ తమన్నాని ఏకంగా దేవత అని ఎలివేషన్ ఇవ్వడం మాత్రం ఆశ్చర్యపరిచింది. ఎంత లవర్ అయితే మాత్రం ఈ రేంజు ఎలివేషన్స్ ఎలా భయ్యా అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) -
రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!
హీరోయిన్ తమన్నా గత కొన్నిరోజులుగా ట్రెండింగ్ లో ఉంది. కారణం ఏంటో మీకు తెలుసు. రెండు వెబ్ సిరీసులు.. బోలెడన్ని అలాంటి సీన్స్ దీనికి మెయిన్ రీజన్. హమ్మయ్యా ఒకటి అయిందనుకునేలోపు మరొకటి అన్నట్లు షాక్ ఇచ్చి, ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ చేసి పడేస్తోంది. రెచ్చిపోవడం అనే రేసులో గుర్రంలా దూసుకెళ్తూ గీత ఎప్పుడో దాటేసిందా అనిపిస్తుంది. ఇంతకీ మిల్కీబ్యూటీ ఇంతలా మారిపోవడానికి కారణమేంటో తెలుసా?రెమ్యునరేషన్ డబుల్సాధారణంగా హీరోలతో పోలిస్తే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినాసరే రెమ్యునరేషన్ తక్కువగానే ఇస్తుంటారు. కొన్నాళ్ల ముందువరకు తమన్నా.. సినిమాకు రూ.4 కోట్లు మాత్రమే అందుకునేదట. ఆమెతో వెబ్ సిరీసులు చేయాలనుకున్న దర్శకనిర్మాతలు కొత్త ప్లాన్ వేశారు. ఏకంగా రెమ్యునరేషన్ డబుల్ ఇస్తాం, అంటే రూ.7 కోట్లు వరకు అని చెప్పారట. దీంతో ఎప్పటి నుంచో ముద్దుకి కూడా నో చెబుతూ వచ్చిన తమన్నా.. ఏకంగా శృంగార సన్నివేశాలు చేసి హద్దులు చెరిపేసింది.(ఇదీ చదవండి: గే రిలేషన్షిప్లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్)కెరీర్ లాస్ట్ స్టేజ్తమన్నా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. 2005 నుంచి సినిమాల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం తమన్నా వయసు కాస్త ఎక్కువ కావడం, హిట్స్ లేకపోవడం వల్ల దర్శకనిర్మాతలు ఈమెపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదేమో అనిపిస్తుంది. బహుశా తమన్నాకు ఇది అర్థమైనట్లు ఉంది. అందుకేనేమో ఇండస్ట్రీలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే ఆలోచనతో ఉన్నట్లు ఉంది. అందుకే ముద్దు నుంచి సెక్స్ సీన్స్ వరకు అన్నింటికీ ఓకే చెప్పేస్తోందా అనే డౌట్ వస్తోంది. విజయ్తో రిలేషన్గతేడాది వరకు తమన్నా సింగిల్. ఈ ఏడాది న్యూయర్ పార్టీలో మాత్రం నటుడు విజయ్ వర్మని ముద్దాడుతూ కనిపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వీళ్లిద్దరి రిలేషన్ బయటపడింది. ఈ జంట పెళ్లి చేసేసుకుందామని ఫిక్సయినట్లు ఉన్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లయితే.. సదరు హీరోయిన్లకు అవకాశాలు వచ్చేది తక్కువ. పెళ్లి తర్వాత ఎలా పడితే అలా చేసేద్దాం అంటే కుదరకపోవచ్చు. ఇదీ కూడా తమన్నా ఆలోచించిదేమో.. అందుకే ఇలా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఆ శివయ్యకే ఎరుక! (ఇదీ చదవండి: 'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!) -
నువ్వు కావాలయ్యా అంటూ దుమ్ములేపిన తమన్నా
కొంచెం ఆట కావాలా? కొంచెం పాట కావాలా? అంటూ ఊర మాస్ స్టెప్పులతో తమన్నా అదరగొట్టారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ సాగే పాట ఇది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ‘జైలర్’ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. రజనీకాంత్, తమన్నా మధ్య ఈ పాట సాగుతుంది. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరచిన ఈ పాటకు అరుణ్ రాజా కామరాజ్ సాహిత్యం అందించగా శిల్పా రావు, అనిరుధ్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. ‘జైలర్’లో శివ రాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. -
'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్! ఎందుకంటే కొన్నిరోజుల ముందు విడుదలైన 'భోళా శంకర్' టీజర్ అభిమానులకు నచ్చేసింది. దీంతో సినిమా రిలీజ్ కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇలాంటి టైంలో చిత్రబృందాన్ని సంతోషపరిచే ఓ వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇంతకీ ఏంటది? లైన్ క్లియర్ చిరు 'భోళా శంకర్' సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ఆగస్టు 11న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అదే తేదీన 'అర్జున్రెడ్డి' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' విడుదల చేయాలని అనుకున్నారు. ఆగస్టు 10న సూపర్స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా విడుదలని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు పోటీ నుంచి 'యానిమల్' తప్పుకొన్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) 'యానిమల్' ఎప్పుడు? సినిమాకు సంబంధించిన కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆగస్టు 11న 'యానిమల్'ని తీసుకురావడం కుదరదని తేలినట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబరులో చేద్దామనుకున్నారు కానీ ఆ నెలలో షారుక్ 'జవాన్' ఉంది. దీంతో అన్నీ ఆలోచించి.. ఏకంగా 'యానిమల్'ని డిసెంబరులో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'భోళా'కు ఇది ప్లస్ పోటీలో ఉన్న మూడు సినిమాల్లో ఒకటి తప్పుకోవడం 'భోళా శంకర్' కు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ కచ్చితంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. రజినీకాంత్ 'జైలర్' సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఒకవేళ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప.. చిరంజీవి కొత్త చిత్రానికి కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: హీరో ధనుష్కి రెడ్ కార్డ్.. అతడి సినిమాలపై నిషేధం?) -
రజనీకాంత్ జైలర్ మూవీ సెట్లో కేక్ కటింగ్
ప్రస్తుతం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. అన్నాత్తే చిత్రం తరువాత రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కన్నడ స్టార్ శివరాజ్కుమార్, తెలుగు నటుడు సునీల్, వసంత్ రవి, నటి రమ్యకృష్ణ, తమన్న, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్గా జైలర్ పాత్రలో నటించారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. జైలర్ చిత్రంలో కామెడీ సూపర్గా ఉంటుందని నటుడు యోగిబాబు పేర్కొన్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రజనీకాంత్తో సహా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న జైలర్ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం కోసం సినీ వర్గాలతో పాటు, రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా నటుడు రజనీకాంత్ వెంటనే తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రషూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతోంది. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నారన్నది గమనార్హం. It's a wrap for #Jailer! Theatre la sandhippom 😍💥#JailerFromAug10@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8 pic.twitter.com/Vhejuww4fg — Sun Pictures (@sunpictures) June 1, 2023 చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువ నటుడు మృతి వారందరికీ నా ప్రగాఢ సానుభూతి: అల్లు అర్జున్ -
ఇండియన్ స్క్రీన్ పై నయా ట్రెండ్
-
సినిమాలకు గుడ్ బై? ఫ్యాన్స్కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్
-
Rajinikanth: కొత్త పోస్టర్ రిలీజ్.. రజనీ మాస్ లుక్.. స్టైల్గా కారులో
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్ కుమార్, మోహన్లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్లో రిలీజ్ కానుంది. కాగా ఆదివారం ‘జైలర్’ నుంచి కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టైల్గా కారులో కూర్చున్న రజనీ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్సలామ్’ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్నారు రజనీకాంత్. అలాగే ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. -
ఆగస్ట్లో ఫిక్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్కు సంబంధించిన ఓ అప్డేట్ను గురువారం చిత్ర యూనిట్ ఇచ్చింది. ఆగస్ట్ 10న ‘జైలర్’ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియోలో కారులో నుంచి స్టైల్గా దిగుతున్న రజనీకాంత్ లుక్ ఆకట్టుకుంటోంది.కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు పూర్తి భిన్నంగా థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతోందని కోలీవుడ్ టాక్. శివరాజ్కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుల్ మోహన్, మిర్నా మీనన్ తదితరులు ముఖ్య ΄ాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్. -
వినాయక చవితికి రజనీకాంత్ ‘జైలర్’!
గత ఏడాది రజనీకాంత్ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు. 2021 నవంబర్లో ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్నయ్య’)తో అలరించారు. సూపర్ స్టార్ సినిమా రిలీజై æ ఏడాదిన్నర అవుతోంది కాబట్టి ఆయన నటించిన తాజా చిత్రం ‘జైలర్’ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం విడుదలవుతుందనుకున్నారు కానీ, రాలేదు. తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. రజనీకాంత్ పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయిందని ఇటీవల ఈ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ ఓ వేడుకలో స్పష్టం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో వినాయక చవితికి సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ అంటోంది. రజనీ సరసన తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శివ రాజ్కుమార్, సునీల్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేశారు. మోహన్లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. -
క్రేజీ కాంబో: రజనీకాంత్తో లోకేశ్ కనగరాజ్ భారీ ప్రాజెక్ట్!
ఏడుపదుల వయసులోనూ రజనీకాంత్ జోరుగా హుషారుగా సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతూ, బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ‘జైలర్’ చిత్రంలో హీరోగా, ‘లాల్సలామ్’ చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారాయన. ఇవి కాకుండా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న చిత్రం అంగీకరించారు. తాజాగా మరో సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల రజనీకాంత్ను కలిసి ఓ కథ వినిపించారని, ఈ స్క్రిప్ట్ రజనీకాంత్కి నచ్చిందని టాక్. ఈ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందంటోంది చెన్నై సినిమా సర్కిల్. ఈ చిత్రాన్ని కమల్హాసన్ నిర్మించనున్నారని సమాచారం. -
కొచ్చిలో జైలర్
కొచ్చికి మకాం మార్చారు ‘జైలర్’. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్’. శివ రాజ్కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రధారులుగా, ఓ అతిథి పాత్రలో మోహన్లాల్ నటిస్తున్నారు. ‘జైలర్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల కొచ్చిలో ప్రారంభమైంది. రజనీకాంత్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజులు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
జైలర్తో మిల్కీ బ్యూటీ
తమిళ సినిమా: జైలర్. ఈ పేరే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీనికి ప్రధాన కారణం సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటిస్తున్న 169వ చిత్రం ఇది. సన్ పిక్చర్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీస్ట్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి మరో విశేషం స్టార్ డమ్. రజనీకాంత్తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ నటుడు సునీల్, వసంత రవి, యోగి బాబు, నటి రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 70 శాతం పూర్తి అయినట్లు సమాచారం. ఇక అసలు విషయం ఏమిటంటే నటి తమన్నా భాటియా తొలిసారిగా ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడీ చిత్రం షూటింగ్లో ఈమె పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం తన ఇన్ స్ట్రాగామ్లో విడుదల చేసిన చిన్న వీడియో ద్వారా తెలిపారు. నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రం టాకీ పార్ట్ జరుగుతోందని, ఇందులో నటించడం హ్యాపీగా ఉందని పేర్కొన్నారు. జైలర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. కాగా చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఆగస్ట్లో విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిత్రంలో అనేక మంది పెద్ద నటులు ఉండడంతో జైలర్ చిత్రంపై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయనే చెప్పాలి. -
జైసల్మేర్ టు మంగళూరు
మంగళూరుకు షిఫ్ట్ అయ్యారు జైలర్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొం దుతున్న సినిమా ‘జైలర్’. శివరాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపా త్రలు పో షిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో రజనీ, మోహన్లాల్, జాకీ ష్రాఫ్ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ‘జైలర్’ షూటింగ్ మంగళూరులో జరుగుతోంది. రజనీ, శివరాజ్కుమార్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ను చెన్నైలో ప్లా న్ చేశారట. -
తీర్పు కోసం... 'జైలు చుట్టూ స్టార్స్'
కొన్ని రోజులుగా కొందరు స్టార్స్ జైలు చుట్టూ తిరుగుతున్నారు. అయితే సినిమా జైలు అన్నమాట. ఈ జైలు సెట్లో కొందరు స్టార్స్ జైలర్లుగా, కొందరు ఖైదీలుగా నటిస్తున్నారు జైలు బ్యాక్డ్రాప్లో సాగే కథలతో వసూళ్ల పరంగా బాక్సాఫీస్ కోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇక ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఖైదీలు పారిపొకుండా ‘జైలర్’గా కాపు కాస్తున్నారు హీరో రజనీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. ఈ చిత్రంలో శివరాజ్కుమార్, మోహన్లాల్, సునీల్, జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా కీ రోల్స్ చేస్తున్నారు. శివరాజ్కుమార్, మోహన్లాల్ ఖైదీల్లా కనిపిస్తారట. ఈ చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో జైలు సెట్ను వేసి, ఓ భారీ షెడ్యూల్ను చిత్రీకరించారు. ఇక కన్నడ స్టార్ శివరాజ్కుమార్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’. ఈ సినిమా కథ మేజర్గా జైలులోనే సాగుతుంది. జైలు సీన్స్ కోసం దాదాపు 6 కోట్ల రూపాయలతో సెట్ వేశారు. ఈ చిత్రంలో శివరాజ్కుమార్ ఖైదీ పాత్రలో కనిపిస్తారని టాక్. శ్రీని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే నాగచైతన్య హీరోగా వెంకట్ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమా సెట్స్పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నాగచైతన్య పోలీసాఫీసర్గా నటిస్తుండగా, నేరం మోపబడిన ఖైదీ పాత్రలో కనిపిస్తారట కృతి. ఇక బాలీవుడ్లోనూ జైలు కథలు ఉన్నాయి. ‘మున్నాభాయ్ ఎమ్బీబీఎస్ (2004), ‘లగే రహో మున్నా భాయ్’ (2006) వంటి హిట్ చిత్రాలతో మెప్పించిన సంజయ్ దత్, అర్షద్ వార్షి తాజాగా మరో సినిమా చేస్తున్నారు. జైలు బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని దర్శకుడు సిద్ధాంత్ సచ్దేవ్ తెరకెక్కిస్తున్నారని ఫస్ట్ లుక్ చెబుతోంది. ఇక తమిళ హిట్ మూవీ ‘ఖైదీ’ (2019) కొంత జైలు బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్ ‘భోలా’గా రీమేక్ చేశారు. సో.. ఈ చిత్రం కూడా జైలు, ఖైదీ బ్యాక్డ్రాప్లో ఉంటుందని ఊహించ వచ్చు. ఈ సినిమాలో నటించడంతో పాటు, దర్శకత్వం కూడా వహించారు అజయ్ దేవగన్. టబు పోలీసాఫీసర్ రోల్ చేసిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. ఇక ‘హే సినామిక’ చిత్రం తర్వాత కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ డైరెక్ట్ చేసిన మరో ఫిల్మ్ ‘థగ్స్’. జైలు బ్యాక్డ్రాప్లో ఖైదీలు, వారి ఆలోచనల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. హ్రిదు, సింహా, ఆర్కే సురేష్, మునిష్కంత్ నటించిన ఈ చిత్రం తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా రిలీజ్ కానుంది. ఇప్పటివరకూ చెప్పిన చిత్రాలు జైలు చుట్టూ తిరుగుతాయి. కాగా మేజర్ బ్యాక్డ్రాప్ అని చెప్పలేం కానీ కమల్హాసన్ ‘ఇండియన్ 2’, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ చిత్రాల్లో కొన్ని జైలు సీన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇవే కాదు.. చెరసాల చుట్టూ తిరిగే చిత్రాలు ఇంకొన్ని రానున్నాయి. -
18 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్, కమల్ మధ్య బాక్సాఫీస్ వార్!
లోకనాయకుడు కమలహాసన్, సూపర్స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీరిద్దరూ తమిళ సినిమాకి రెండు ధృవాలు లాంటి వారు. తొలి దశలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత ఎవరి ఇమేజ్ వారికి రావడంతో విడివిడిగా నటించడం మొదలెట్టారు. కాగా ఇటీవల విక్రమ్ చిత్రంతో ఫుల్ఫామ్లోకి వచ్చిన కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పక్క నటుడు రజనీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో నటిస్తున్న జైలర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీష్రాప్, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జైపూరులో జరుగుతోంది. కాగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2005 ఏప్రిల్ 14న రజనీకాంత్ చంద్రముఖి, కమలహాసన్ ముంబయి ఎక్స్ప్రెస్ చిత్రాలు విడుదలై పోటీపడ్డాయి. అప్పట్లో చంద్రముఖి చిత్రం ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ 18 ఏళ్ల తరువాత రజనీకాంత్ జైలర్ చిత్రం, కమలహాసన్ ఇండియన్–2 ఒకే రోజు విడుదల కానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
36 ఏళ్ల తర్వాత రజనీకాంత్తో కలిసి యాక్ట్ చేస్తున్న నటుడు!
సౌత్ స్టార్ హీరో రజనీకాంత్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్ నటించనున్నారని, ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారని యూనిట్ ప్రకటించింది. కాగా 1987లో వచ్చిన హిందీ చిత్రం ‘ఉత్తర్ దక్షిణ్’ తర్వాత రజనీకాంత్, జాకీష్రాఫ్ మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ‘జైలర్’ కావడం విశేషం. దాదాపు 36 ఏళ్ల తర్వాత రజనీ, జాకీష్రాఫ్ కలిసి నటిస్తున్నారన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ మేరకు తమన్నా ఫస్ట్ లుక్ కూడా ఇటీవల రిలీజైంది. ఈ మూవీలో మాలీవుడ్ సూపర్స్టార్ మోహన్లాల్తో పాటు కన్నడ హీరో శివరాజ్కుమార్, కమెడియన్ సునీల్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. Jackie Shroff from the sets of #Jailer 🔥 @rajinikanth @bindasbhidu @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/O9ees6RuJt— Sun Pictures (@sunpictures) February 5, 2023 చదవండి: బ్లాక్బస్టర్ గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ -
మద్యానికి, సిగరెట్లకు బానిసైన నన్ను ఆమె మార్చేసింది: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్కు భార్య లత అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆమె గురించి గొప్పగా చెప్పారు రజినీ. ఆమె వచ్చాక తన జీవితమే మారిందని పలు మార్లు చెప్పిన సూపర్స్టార్.. తాజాగా మరోసారి భార్య లతకు, ఆమెను పరిచయం చేసిన స్నేహితుడు మహేంద్రన్కు కృతజ్ఞతలు చెప్పారు. జీవితాంతం వీరిద్దరికి రుణపడి ఉంటానన్నారు. ‘లత నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఆమెను చూసే క్రమశిక్షణ నేర్చుకున్నాను. బస్సు కండక్టర్గా ఉన్నప్పుడు రోజు మద్యం సేవించేవాడిని. సిగరెట్లు తాగేవాడిని. ఎక్కువగా మంసాహారం తినేవాడిని. ఈ మూడు అలవాట్లు ఆరోగ్యానికి మంచిది కాదు. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఆ చెడు అలవాట్లకు దూరం చేసింది. ఆమె వల్లే నేను ఇప్పుడు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు. -
‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ కోసం రజనీకాంత్ సినిమా వాయిదా?
వెండితెరపై ‘జైలర్’ రాక ఏప్రిల్ నుంచి ఆగస్టుకు మారిందా? అంటే అవునంటోంది కోలీవుడ్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జైలర్’. ఈ చిత్రాన్ని ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోందనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆగస్టులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ (ఏప్రిల్ 28 విడుదల) బాక్సాఫీస్ వసూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ‘జైలర్’ టీమ్ స్నేహపూర్వకంగా ఏప్రిల్ రిలీజ్ను వాయిదా వేసుకుందని కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
జైలర్కు అతిథిగా...
సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాలో మలయాళ స్టార్ మోహన్లాల్ కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ‘జైలర్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ శివరాజ్కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో, తమన్నా కీ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మోహన్లాల్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. మోహన్లాల్ అతిథి పాత్రలో కనిపించనునున్నారని, ఈ వారంలోనే షూటింగ్లో జాయిన్ అవుతారని కోలీవుడ్ సమాచారం. కాగా ‘జైలర్’ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
ఎండలు బాగా మండే ఏప్రిల్లో సందడి చేసే సినిమాలివే!
సంక్రాంతి సీజన్ తర్వాత సినిమాలకు బాగా కలిసొచ్చేది సమ్మర్. సమ్మర్ హాలీడేస్ను బాగా వాడుకోవాలి అనుకుంటారు మేకర్స్. అందుకోసం తమ సినిమాలు రిలీజ్ అయేలా ప్లాన్ చేసుకుంటారు. ఎండలు బాగా మండే ఏప్రిల్ నెలలో రిలీజ్కు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. పొన్నియిన్ సెల్వన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. గతేడాది సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ఊహించని స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. సూపర్ స్టార్ రజినీ కాంత్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్తో ఆకట్టుకున్నారు మేకర్స్. ఈ మూవీని ఏప్రిల్ 14 న రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే మెగాస్టర్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ మూవీని కూడా ఏప్రిల్ 14 న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక మెగా మేనల్లుడు సాయి తేజ్ ఏప్రిల్ 21 విరుపాక్ష మూవీతో రావాటానికి ముస్తాబు అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాతో సాలిడ్ విజయం అందుకున్నాడు.ఈయన కెరీర్లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది ధమాకా. త్వరలో రావణ సుర మూవీతో రాబోతున్నాడు. ఏప్రిల్ 7 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ ముచ్చటకు వస్తే..సల్మాన్ ఖాన్ ‘కిసికా బాయ్ కిసికా జాన్’ కూడా ఏప్రిల్లో విడుదలకు ముస్తాబు అయింది. ఏప్రిల్ 21 న మూవీ రిలీజ్ కాబోతుంది. -
తలైవాతో ఢీ అంటున్న శివరాజ్కుమార్
తమిళసినిమా: సూపర్స్టార్ రజనీకాంత్ అన్నాత్తే తరువాత నటిస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పడయప్పా తరువాత నటి రమ్యకృష్ణ రజనీకాంత్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే విధంగా నటుడు వసంత్ రవి, యోగిబాబు, వినాయగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోకి తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వచ్చారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న జైలర్ చిత్రం గత ఆగస్టు నెలలో ప్రారంభమైంది. ఇటీవల కడలూర్ ప్రాంతంలో రెండో షెడ్యూల్ జరుపుకుంది. ఇప్పటికే 59 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై జైలర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. చిత్రంలో తలైవా యాక్షన్ సన్నివేశాలు హైఓల్టేజ్లో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయగా అది ట్రెండింగ్ అవుతోంది. కాగా జైలర్ చిత్రంలో శివరాజ్ కుమార్ రజనీకాంత్కు ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో రజినీకాంత్కు ఎంతో అనుబంధం ఉంది. అలాంటిది జైలర్ చిత్రంలో రజనీకాంత్ను శివ రాజ్ కుమార్ ఢీ కొనే సన్నివేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. -
జైలర్తో పోరాటం!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. ఇందులో రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యారు కన్నడ స్టార్ శివరాజ్కుమార్. ఈ చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, శివరాజ్కుమార్ కాంబినేషన్లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
సూపర్ స్పీడ్ మీద ఉన్న సూపర్ స్టార్.. మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్
యాభై ఏళ్ల కెరీర్లో రజనీకాంత్ నూటయాభై చిత్రాలకు పైగా చేశారు. ప్రస్తుతం 169 చిత్రంగా ‘జైలర్’లో నటిస్తున్నారు. ఏడు పదుల వయసులో ఉన్న సూపర్ స్టార్ సూపర్ స్పీడ్ మీద ఉన్నారు. ‘జైలర్’లో నటిస్తూనే మరో రెండు చిత్రాలు అంగీకరించారట. ఆ విశేషాల్లోకి వస్తే... రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జైలర్’. ఆగస్ట్లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. రజనీ ఫస్ట్ లుక్ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీ స్టయిలిష్ జైలర్గా కనిపించనున్నారని లుక్ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఈలోపు తన రెండు కొత్త చిత్రాల షూటింగ్స్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారట రజనీకాంత్. అయితే ఈ రెండు చిత్రాలను ఒకే సంస్థ నిర్మించనుండటం విశేషం. లైకాతో మళ్లీ... రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘2.0’ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ రజనీతో ‘దర్బార్’ కూడా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో రజనీకి, లైకాకి మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే రజనీతో మరో రెండు సినిమాలు నిర్మించాలనుకుని సూపర్ స్టార్తో ఒప్పందం కుదుర్చుకుందట లైకా సంస్థ. ఇటీవల మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ని లైకా సంస్థనే విడుదల చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రజనీ ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. లైకా సంస్థకు రజనీ చేయనున్న చిత్రాల దర్శకులు కూడా దాదాపు ఖరారయినట్లే. ఒకరు సిబి చక్రవర్తి, మరొకరు దేసింగు పెరియస్వామి. యువదర్శకులతో... తొలి చిత్రం ‘డాన్’ (2022)తో సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకున్నారు సిబి చక్రవర్తి. ఈ యువదర్శకుడికి రజనీ చాన్స్ ఇవ్వడం విశేషం. ఇక మరో దర్శకుడు దేసింగు పెరియస్వామి కూడా యువ దర్శకుడే. ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ (2020) వంటి హిట్ చిత్రంతో పెరియస్వామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా రిలీజైంది. పెరియస్వామికి కూడా రజనీ చాన్స్ ఇచ్చారట. ఇలా ఒకే బేనర్లో ఇద్దరు అప్కమింగ్ డైరెక్టర్లతో రజనీ చేయనున్న చిత్రాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
డైరెక్టర్తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్’ నుంచి తప్పుకున్న హీరోయిన్!
కథానాయకిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ప్రియాంక మోహన్. తెలుగు, మలయాళం చిత్రాలలో నటించిన ఈమె ఆ తరువాత కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నటించిన తొలి చిత్రం డాక్టర్. ఈ చిత్రం ఆమెకు సక్సెస్తో స్వాగతం పలికింది. ఆ తరువాత అదే హీరోతో రొమాన్స్ చేసిన డాన్ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో కోలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది. అయితే హీరో సూర్యకు జంటగా నటించిన ఎదుర్కుమ్ తుణిందవన్ చిత్రం ఈ అమ్మడిని నిరాశ పరిచిందనే చెప్పాలి. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్ అయినా ఆమెకు వరుసగా అవకాశాలు ప్రియాంక వస్తున్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రం కూడా ఒకటి. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. కాగా ఈ చిత్రం నుంచి నటి ప్రియాంక మోహన్ వైదొలగినట్లు తాజా సమాచారం. దీని గురించి ఈ భామపై రకరకాల వదంతులు వస్తున్నాయి. చదవండి: అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్ డాక్టర్ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు నెల్సన్తో మనస్పర్థలే చిత్రాన్ని ఆమె వదులుకోవడానికి కారణమనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఇకపోతే ప్రియాంక మోహన్ వదులుకున్న పాత్రలోనే నటి తమన్నా నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక మోహన్ కూడా ఈ విషయమై స్పందించలేదు. ప్రస్తుతం ఆమె రాజేష్ దర్శకత్వం, జయం రవి కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తోంది. -
కోలీవుడ్కి రీఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.. విజయం దక్కేనా?
మిల్కీ బ్యూటీ తమన్నా సుదీర్ఘ విరామం తర్వాత కోలీవుడ్లోకి ఎంటర్ కాబోతుంది. అందం అభినయం మెండుగా ఉన్న నటి తమన్నా భాటియా. ఆదిలో అందాలతో వెండితెరను ఊపేసినా, ఆ తర్వాత బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో అద్భుత అభినయాన్ని చాటి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఈ 36 ఏళ్ల జాణకు కోలీవుడ్లో మాత్రం ఆశించిన విజయాలు దక్కలేదని చెప్పాలి. దీంతో ఇక్కడ ఆగ్రనటిగా రాణించాలన్న ఆమె కోరిక ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందనే చెప్పవచ్చు. అలాంటిది అనూహ్యంగా ఇప్పుడు అగ్ర నటుడితో నటించే అవకాశం రావడం నిజంగా ఈ అమ్మడికి లక్కీ అనే చెప్పాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఒక్క చిత్రంలో ఒక్క సన్నివేశంలో నటించే అవకాశం వస్తే చాలని భావించే నటీమణులు ఎందరో ఉంటారు. అలాంటి అవకాశం నటి తమన్నాకు జైలర్ చిత్రంతో వరించింది. దీంతో ఈ చిత్రంలో పాల్గొనడానికి ఈ బ్యూటీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఆయనకు జంటగా నటి ఐశ్వర్య రాయ్, తమన్నా నటింనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో నటి తమన్నా పాత్ర పరిధి తక్కువే అనే టాక్ వినిపిస్తోంది. అయినా జైలర్ చిత్రంలో నటించడానికి చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నట్లు తమన్నా ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొంది. మరి ఆమెకు జైలర్ చిత్ర యూనిట్ నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో చూడాలి! -
సెట్స్పైకి రజనీ ‘జైలర్’.. కొత్త పోస్టర్ రిలీజ్
‘అన్నాత్తే’ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం ‘జైలర్’. బీస్ట్ మూవీఫేం నెల్సన్ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల మూవీ టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ వదిలిన చిత్ర బృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు సోమవారం(ఆగస్ట్ 22న) జైలర్ షూటింగ్ ప్రారంభమైందని చెబుతూ తలైవా ఫ్యాన్స్కు గుడ్న్యూస్ అందించారు మేకర్స్. చదవండి: ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఈ సందర్భంగా రజనీకి లుక్కు సంబంధించిన పోస్టర్ను వదిలారు. ఇందులో రజనీ ఫార్మల్ డ్రెస్లో సీరియస్ లుక్తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో రజనీ లైటిల్ రోల్ పోషించనున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన లుక్కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించన్నాడు. #Jailer begins his action Today!@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/6eTq1YKPPA — Sun Pictures (@sunpictures) August 22, 2022 -
ఢిల్లీకి రజనీకాంత్..10 రోజుల పాటు అక్కడే!
జయాపజయాలకు అతీతుడు రజనీకాంత్. నటుడుగా తన 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను చూశారు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్స్టార్ రజనీకాంత్. ఈయన సక్సెస్ అందుకుని చాలా కాలం అయినా క్రేజ్ ఇంచి కూడా తగ్గలేదు. ఆయన నూతన చిత్రం అనౌన్స్మెంట్ వచ్చిన రోజు అభిమానులకు పండుగ రోజుగా మారిపోతున్న పరిస్థితి. అలాంటి రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం జైలర్. టైటిలే పవర్ఫుల్గా ఉంది కదా! చిత్ర కథ కూడా అంత కంటే పవర్పుల్గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. గతంలో విజయ్ హీరోగా బీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్!) సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, ప్రియాంక అరుణ్ మోహన్, రమ్యకృష్ణ, యోగిబాబు, పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అలాగే రాఖి, తరమణి చిత్రాలు ఫేమ్ వసంత రవి ఒక కీలక పాత్రను పోషించనున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కేశాలంకరణ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రానికి మేకోవర్గా చేసిన ఆలిమ్ హాకింగ్ పని చేస్తున్నారు. ఇది రజనీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా ఆయన మొట్టమొదటిసారిగా ఇందులో జైలర్గా నటిస్తుండటం విశేషం. కాగా చిత్రం కోసం హైదరాబాదులో భారీ సెట్ను వేస్తున్నారు. అయితే ముందుగా చెన్నైలో షూటింగ్ను నిర్వహించి ఆ తరువాత కారైకాల్ సముద్రతీర ప్రాంతాల్లో కొంత భాగాన్ని చిత్రీకరించి ఆ తరువాత హైదరాబాదులో షూటింగ్ను నిర్వహించడానికి చిత్ర వర్గాలు ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సడన్గా శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ జైలర్ చిత్రానికి సంబంధించిన 10 రోజుల షూటింగ్ నిర్వహించి చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం. -
కొత్త రకం హెయిర్ స్టయిల్లో రజనీకాంత్!
స్టయిలు స్టయిలులే ఇది సూపర్ స్టయిలులే.. అని రజనీకాంత్ స్టయిల్ మీద ‘బాషా’లో ఒక పాట ఉన్న విషయం తెలిసిందే. సిగరెట్ని గాల్లో విసిరి నోటితో క్యాచ్ పట్టడం, వేగంగా నడవడం.. టోటల్గా రజనీ స్టయిల్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ని సూపర్ హెయిర్ స్టయిల్లో చూపించనున్నారు ముంబైకి చెందిన హెయిర్ స్టయిలిస్ట్ అలీమ్ హకీమ్. రజనీ హీరోగా ‘జైలర్’ టైటిల్తో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో రజనీని కొత్త రకం హెయిర్ స్టయిల్లో చూపించనున్నారు అలీమ్. ‘‘కింగ్ (రజనీని ఉద్దేశించి) తో వర్క్ చేసిన ఈ రోజు చాలా కొత్తగా ఉంది’’ అంటూ రజనీతో దిగిన ఫొటోను షేర్ చేశారు అలీమ్. ఇటీవల టెస్ట్ షూట్ జరిగిందని సమాచారం. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ఆరంభం కానుంది. ఇందులో రజనీ సరసన ఐశ్వర్యా రాయ్ నటిస్తారని టాక్. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. -
‘జైలర్’గా వస్తున్న సూపర్ స్టార్, టైటిల్ పోస్టర్ రిలీజ్
తలైవా రజనికాంత్ 169వ చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్ను ఖారారు ఈ మేరకు టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. కత్తికి రక్తపు మరకలతో పోస్టర్ రూపొందించారు. జైలు నేపథ్యంలో రూపొందే ఈ మూవీని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రజనీకి జోడిగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో కథానాయికగా నటి ప్రియాంక కనిపించనుండగా.. నటి రమ్యకృష్ణ, డైరెక్టర్ కేఎస్ రవికూమార్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలు చేయనున్నారని వినికిడి. జులై నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. #Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c — Sun Pictures (@sunpictures) June 17, 2022 -
జైలర్ గదిలోనే ఖైదీ, గ్యాంగ్స్టర్ సంసారం!
పట్నా: ఒకప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నా ఖైదీలకు యథేచ్ఛగా సెల్ఫోన్లు, మాదక ద్రవ్యాలు, విలాస వస్తువులు అందేవి. ఖైదీలతో జైలు సిబ్బంది కుమ్మక్కై.. ఇలాంటి చిన్న చిన్న సేవలు అందించడం కారాగారాల్లో నిత్యకృత్యంగా జరుగుతున్నా.. ఈ విషయంలో బిహార్ జైలు సిబ్బంది మరో అడుగు ముందుకువేశారు. జైలు గదిలోనే ఓ గ్యాంగ్స్టర్, అతని భార్య అయిన అండర్ ట్రయల్ ఖైదీ సంసారం చేసుకోవడానికి వీలు కల్పించినట్టు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిహార్లోని షివోహర్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ పూజకుమారి గర్భం దాల్చిన వ్యవహారంపై దర్యాప్తు జరుపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న తన భర్త, గ్యాంగ్స్టర్ ముఖేశ్ పాఠక్ను ఆమె తరచూ జైలులోని అసిస్టెంట్ జైలర్ కార్యాలయంలో కలిసేదని, ఇద్దరు కాపురం చేసిన ఫలితంగా ఆమె గర్భం దాల్చిందని వెలుగుచూడటం విస్మయపరుస్తోంది. గత ఏడాది ఈ భార్యాభర్తలు ఇద్దరూ వేర్వురు కేసుల్లో షివోహర్ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. ఆ సమయంలో వీరు వేరువేరు గదుల్లో దూరంగా ఉన్నా.. జైలు సిబ్బందికి తాయిలాలు ముట్టజెప్పి.. అసిస్టెంట్ జైలర్ కార్యాలయంలో తరచూ కలుసుకొనేవారని తాజా దర్యాప్తులో తేలింది. షివోహర్ జిల్లా మేజిస్ట్రేట్, ముజఫర్పుర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఈ దర్యాప్తు నిర్వహించారు. ఉత్తర బిహార్లో బలమైన నేరగాడైన సంతోష్ షా గ్యాంగ్లో షార్ప్షూటర్ అయిన ముఖేశ్ పాఠక్ దర్భాంగ ఇంజినీర్ల హత్యకేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. జైలు నుంచి పరారైన అతడు ప్రస్తుతం నేపాల్లో తలదాచుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. -
త్రీమంకీస్ - 34
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్థ్రిల్లర్ - 34 - మల్లాది వెంకటకృష్ణమూర్తి బయటకి వచ్చాక ఓ బేంక్కి వెళ్ళి జైలర్ ఇచ్చిన లెటర్ని చూపించాడు. ‘‘ఓ! నువ్వు జైల్లో ఉన్నావని దాచకుండా చెప్పావంటే నువ్వు నమ్మదగ్గ వాడివే. వాడ్డుయూ వాంట్?’’ బ్రాంచ్ మేనేజర్ అదరంగా చూస్తూ అడిగాడు. ‘‘ఐ వాంట్ టు స్టార్ట్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ. గివ్ మి ఏ లోన్. దెన్ లీవ్ మి ఎలోన్’’ వానర్ ఘనంగా ఉంటుందని ఇంగ్లీష్లో అభ్యర్థించాడు. వాళ్ళిచ్చిన లోన్తో ఓ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి గది తీసుకుని తినడానికి, తాగడానికి ఆర్డర్ ఇచ్చాడు. అవి వచ్చాక ట్రే మీది తెల్లటి శుభ్రమైన బట్టని తొలగిస్తే చికెన్ ఫ్రై కనిపించింది. ఓ కోడి పిల్ల చికెన్ ఫ్రై వంక చూస్తూ బాధగా అడుగుతోంది. ‘‘మమ్మీ! మాట్లాడు మమ్మీ. నాతో మాట్లాడు మమ్మీ! ఇలా అయిపోయావేమిటి?’’ గ్లాసులోని ఆరెంజ్ జూస్ని చూసి పక్కనే ఉన్న ఆరెంజి పండు అరుస్తోంది. ‘‘అమ్మా! నాన్నా! నన్ను అనాథని చేసి వెళ్ళిపోయారా?’’ వాటి మీది దయతో వానర్ కళ్ళల్లోంచి నీళ్ళు జలజలా కారాయి. ఆ దయతోనే గుండె ఆగింది. ‘‘చూడండి. వీడి గుండె కొట్టుకుంటోంది. కొద్దిసేపు గుండె ఆగినట్లయింది. అంతే. మరణించిన వాళ్ళనే ఇక్కడికి తీసుకురావాలని తెలీదా?’’ ఆ మాటలకి కళ్ళు తెరిచి చూస్తే యమధర్మరాజు తన భటుల వంక కోపంగా చూస్తున్నాడు. ‘‘వాళ్ళ తప్పేంలేదు సార్. నా గుండెలో నా ప్రియురాలు నివశిస్తోంది. అందుకని అది కొట్టుకుంటోంది’’ వానర్ చెప్పాడు. ‘‘మీరంతా ఎవరు?’’ తన చుట్టూ మూగిన కొత్తవాళ్ళని చూసి అడిగాడు. ‘‘గుర్తు పట్టలేదా? మేమంతా నీ ఎఫ్బిలో మిత్రులం. నువ్వూ చచ్చాక, ఇక్కడికి వచ్చాక ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. అదృష్టం. నరకానికి వచ్చావు. స్వర్గానికి వెళ్తే నీకు ఇంతమంది కంపెనీ దొరికేది కాదు’’ వాళ్ళు చెప్పారు. ‘‘ఈ తెల్లవాళ్ళంతా ఎవరు?’’ ‘‘జీవించి ఉండగా గో టు హెల్ అని తిట్టించుకోబడ్డవారు.’’ ‘‘బాబోయ్! ఇది హెల్లా?’’ ‘‘అవును. అల్లాటప్పా హెల్ కాదు. రియల్ హెల్. హెల్ మీద మనం విన్నవి ఉత్తి జోక్స్ కాదు. నిజాలు. ఉదాహరణకి ఇక్కడి బీర్ ఉంటుంది కాని బీర్ మగ్గులకి రంధ్రాలు కూడా ఉంటాయి. అందమైన ఆడవాళ్ళుంటారు కాని ఆడవాళ్ళకి... అర్థం చేసుకో.’’ అంతా గందరగోళంగా మాట్లాడుకుంటూంటే యమధర్మరాజు సుత్తితో కొడుతూ అరిచాడు. ‘‘ఆర్డర్! ఆర్డర్!’’ ‘‘ఓ పీజా, రెండు బర్గర్లు, ఓ కోక్ జీరో’’ వానర్ వెంటనే చెప్పాడు. ‘‘షటప్’’ ఆయన అరిచాడు. ‘‘కొత్త బ్రాండా? సరే. షటప్ టేస్ట్ చేస్తాను. సెవెన్ అప్ లేదా థంప్స్ అప్లా ఉంటుందా?’’ అడిగాడు. ‘‘వీడి వల్ల ఇక్కడ డిసిప్లిన్ దెబ్బతింటోంది. ముందు వీడ్ని తీసుకెళ్ళి కాగే నూనెలో వేయండి’’ ఆయన ఆసహనంగా అరిచాడు. ‘‘ఒద్దు. ఒద్దు. నా వంటి నిండా దద్దుర్లు వస్తాయి...’’ అరుస్తున్న వానర్కి ఠక్కున మెలకువ వచ్చేసింది. పెబైర్త్ నించి వచ్చే గురక విని అది కలని తెలుసుకున్నాక స్థిమిత పడ్డాడు. దుప్పటిని తీసుకెళ్ళి టాయ్లెట్లో పిండి మళ్ళీ పరచుకుని పడుకున్నాడు. 9 మర్నాడు ఉదయం గార్డ్ కపీష్తో చెప్పాడు - ‘‘నీకోసం ములాఖత్కి ఎవరో వచ్చారు.’’ కపీష్కి వెంటనే అనుమానం కలిగింది. కొంపతీసి తను జైలు పాలైన సంగతి తన తల్లితండ్రులకి తెలిసిందా? పేపర్లో తన గురించి వచ్చిందా? ‘‘ఎవరు?’’ అడిగాడు. ‘‘నేను నీ ఇన్ఫార్మర్ని కాదు. పద. నువ్వే చూడు’’ గార్డ్ కోపంగా చెప్పాడు. కపీష్ అతన్ని అనుసరించాడు. ఎదురుగా గంధం బొట్టు మీద కుంకం బొట్టు కనిపించగానే ఊపిరి పీల్చుకున్నాడు. తల తిప్పి చూేన్త నిన్న కనిపించిన అమ్మాయి కనిపించింది. కపీష్ వెంటనే నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. ‘‘జైల్లో ఉండగా ఏం చేయలేనన్నాను కదా? మళ్ళీ ఎందుకు వచ్చారు?’’ కపీష్ ఆమె వంక చూస్తూ ఆయన్ని ప్రశ్నించాడు. ‘‘నీ డబ్బు జైలర్ దగ్గర ఉందని కదా నిన్న చెప్పావు?’’ సేఠ్ అడిగాడు. ‘‘అవును?’’ ‘‘నువ్వు నాకు డబ్బు ఇవ్వాలని ఆయనకి చెప్పి ఇప్పించచ్చుగా?’’ ‘‘ఎవరికి చెప్పి?’’ కపీష్ ఆమెనే చూస్తూ అడిగాడు. ‘‘జైలర్కి. లేకపోతే నీకు అనవసరంగా వడ్డీ పెరిగిపోతుంది.’’ ‘‘ఏం పెరుగుతుంది?’’ కపీష్ దృష్టంతా ఆమె మీదే ఉండటంతో సేఠ్ చెప్పేది అర్థం చేసుకోలేకపోయాడు. ‘‘వడ్డీ.’’ ‘‘పెరగనీండి’’ ఆమె వంకే చూస్తూ నవ్వుతూ చెప్పాడు.