-
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
'కార్తీకదీపం' సీరియల్, 'బిగ్బాస్ 7' షోతో గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేసింది. సోమవారం గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్బాస్ షోలో తనతో పాటు పాల్గొన్న తేజ, ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)కర్ణాటకకు చెందిన శోభాశెట్టి.. కన్నడలో పలు షోలు చేసింది. తెలుగులోకి 'కార్తీకదీపం' సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మోనిత అనే విలన్గా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ చేసింది. గతేడాది బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొన్న ఈమె.. ఫైనల్ వరకు వచ్చింది కానీ విజేత కాలేకపోయింది. మరోవైపు ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి అని పరిచయం చేసింది. వీళ్లకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది.ప్రస్తుతం శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఈ గృహ ప్రవేశానికి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే షోలో పాల్గొన్న తర్వాత వచ్చిన డబ్బులతోనే శోభా ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శోభా కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
'కార్తీకదీపం' కాన్సెప్ట్తో హిందీలో సినిమా? హీరోయిన్గా ఇలియానా
'కార్తీకదీపం'.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీరియల్ ప్రేమికులు అలెర్ట్ అయిపోతారు. ఆ సీరియల్కి ఉన్న క్రేజ్ అలాంటిది. కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. మరీ ముఖ్యంగా ఇందులో నలుపుగా ఉండే వంటలక్క క్యారెక్టర్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్తో హిందీలో సినిమా తీసి రిలీజ్కి రెడీ చేశారు. మనకు తెలిసిన ఇలియానా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'తేరా క్యా హోగా లవ్లీ'. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సేమ్ 'కార్తీకదీపం' సీరియల్లో ఉన్నట్లే ఇందులోనూ హీరోయిన్ నలుపు రంగులో ఉంటుంది. అక్కడ డాక్టర్ బాబు ఉంటే ఇక్కడ పోలీస్ బాబు ఉన్నాడంతే. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) ట్రైలర్ బట్టి చూస్తే.. హీరోయిన్ నలుపుగా ఉంటుంది. దీంతో ఈమెని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లందరూ నో చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఓరోజు ఈమె పెళ్లి చేస్తే ఇవ్వడానికి అని ఉంచిన సామాన్లన్నీ దొంగతనానికి గురవుతాయి. దీంతో దర్యాప్తు కోసం ఓ పోలీస్ వస్తాడు. హీరోయిన్తో ప్రేమలో పడతాడు. చివరకు ఏమైంది? హీరోహీరోయిన్ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ. ట్రైలర్ చూస్తే పైకి ఫన్నీగా అనిపిస్తున్నప్పటికీ.. ఇందులో అందం, వరకట్న లాంటి సామాజిక విషయాల్ని ప్రస్తావించారు. కాకపోతే వీటిని సీరియస్గా కాకుండా సున్నితమైన హాస్యంతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఇలియానా హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టం తెచ్చిపెడుతుందేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) -
'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్
ఈసారి బిగ్బాస్ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో లేడీ విలన్గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు. సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
-
శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
-
'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్బాబు!
తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులు, డాక్యుమెంటరీ, ఓటీటీల్లో ఇతర భాషా చిత్రాలు.. ఇలా ఒకటేమిటి నచ్చాలే గానీ ప్రతిదీ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన సీరియల్స్ లో 'కార్తీకదీపం' ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ సీరియల్ కు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చేశాడు. తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. ఏళ్లకు ఏళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవీ ఉన్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ 'కార్తీకదీపం' మాత్రం అటు ప్రేక్షకుల్ని అలరిస్తూ, టీఆర్పీ రేటింగ్స్ సంపాదించడంలోనూ దాదాపు నాలుగైదేళ్లు సక్సెస్ అయింది. అలాంటిది గతేడాది ఫిబ్రవరిలో దీనికి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కొన్నాళ్లకు తిరిగి మొదలుపెట్టడంతో సంతోషించారు. (ఇదీ చదవండి: దళపతి విజయ్పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!) కానీ కొత్తగా మొదలుపెట్టింది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు దాన్ని ఆపేశారు. సీరియల్ ని అయితే నిలిపేశారు గానీ అందులో ప్రధాన పాత్రలు పోషించిన వంటలక్క, డాక్టర్ బాబు గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం 'రాధకు నీవేరా' సీరియల్ చేస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కార్తీకదీపం 2'పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 'ఇప్పటికీ ఎక్కడకి వెళ్లినా 'కార్తీకదీపం', వంటలక్క గురించి ఎక్కువగా అడుగుతుంటారు. నా పేరు మర్చిపోయి డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. నా విశ్లేషణ ప్రకారం.. ప్రతిఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే 'కార్తీకదీపం' సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది. నా భార్యతో బయటకెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. ఆమెకి(మంజుల) పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుంది' ఈ ఇంటర్వ్యూలోనే 'కార్తీకదీపం 2' ఉంటుందా అనే ప్రశ్న డాక్టర్ బాబుకి ఎదురైంది. దీంతో.. 'నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్నీ కుదిరితే సీజన్ 2 చేయాలి. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటరేమో. కానీ మా ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు' అని సీరియల్ నటుడు నిరూపమ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) -
వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నటీనటులను పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈచిత్రంలో లెజెండరి నటుడు శరత్ కుమార్, నటి ప్రియమణి, కమెడియన్ వెన్నెల కిషో, సంపత్ రాజా వంటి స్టార్ నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి తాజాగా ఇందులో బుల్లితెర క్వీన్, నటి ప్రేమి విశ్వనాథ్(కార్తిక దీపం సీరియల్ ఫేం దీప) కూడా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఓ కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమి విశ్వనాథ్కు సెట్లోకి స్వాగతం పలుకుతూ తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు వెల్కమ్ ఆన్బోర్డ్ అంటూ ప్రేమి విశ్వనాథ్ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. Welcoming the Television Queen and Versatile Actress #PremiVishwanath on board for our #NC22 💫🔥@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens @srkathiir @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/FrsJSeAHQQ — Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022 -
'కార్తీకదీపం' ఫ్యాన్స్కి ఊహించని షాక్ ఇచ్చిన డైరెక్టర్
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసి నాలుగేళ్లుగా దిగ్విజయంగా దూసుకుపోతుంది ఈ సీరియల్. అయితే తాజాగా ఈ సీరియల్ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు డైరెక్టర్. వంటలక్క(దీప), డాక్టర్ బాబు(కార్తీక్)ల కథ విషాదంగా ముగించారు. ఓ రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ చనిపోయినట్లు సీరియల్లో చూపించారు.దీంతో ఇకపై కార్తీకదీపంలో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరు. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ బాబు ఫేం నిరుపమ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కార్తీకదీపం సీరియల్కి గుడ్బై అంటూ సెట్లో చివరి రోజు షూటింగ్ను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లుగా తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశాడు.ఈ విషయం తెలిసి కార్తీక దీపం ఫ్యాన్స్ ఉద్వేగానికి గురవుతున్నారు. సీరియల్లో ట్విస్ట్ ఇవ్వడానికి వంటలక్క, డాక్టర్ బాబును చంపేయడం ఏంట్రా అంటూ డైరెక్టర్పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే సీరియల్ చూడమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీరియల్ హైలెట్ రోల్స్ అయిన వంటలక్క, డాక్టర్ బాబులను చంపేయడంతో ఇకపై కార్తీకదీపం ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నెక్ట్స్ జనరేషన్లో హిమ దీపలా మారుతుందని, మోనిత కొడుకు డాక్టర్ బాబులా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala) -
ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క!
కార్తీకదీపం వంటలక్క ఫేమ్ ఇంటికే పరిమితం కాలేదు. ఇప్పుడు పంట చేల దాకా పాకింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు చేలలో దిష్టి బొమ్మలు పెడతాం. వీటికి బదులు హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టడం ఇటీవలి ట్రెండ్ అయింది. అంతకుమించి అభిమానాన్ని చూపించాడో వ్యక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం గ్రామంలో ఓ రైతు... వేరుశనగ చేనులో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ వంటలక్క దీప ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. ఆ దారి గుండా వెళ్లే వారు ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ రైతు క్రియేటివిటీకి ఆశ్చర్యపోతున్నారు. – అశ్వారావుపేట రూరల్ చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క! -
బిగ్బాస్ షో.. మీరు అనుకుంటున్నట్లు కాదు: ఉమాదేవి
Bigg Boss Telugu 5 Uma Devi Chit Chat With Fans: కార్తిక దీపం సీరియల్కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సీరియల్లో అర్థపావు భాగ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి ఉమాదేవి బిగ్బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడటం, చిన్న విషయానికే గొడవకు దిగడం ఆమెకు పెద్ద మైనస్గా మారాయి. దీంతో రెండో వారంలోనే ఆమె ఇంటి దారి పట్టింది.చదవండి: బిగ్బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే... ఇదిలా ఉండగా, తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చిన ఉమాదేవి..బిగ్బాస్ జర్నీ గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంది. తాను ముక్కుసూటిగా మాట్లాడతానని, అయితే హౌస్మేట్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. రెండో వారంలోనే హౌస్ నుంచి బయటకు రావడం బాధగా ఉందని, అక్కడే ఉంటే ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేసేదాన్ని అని అభిప్రాయపడింది. ఇక బిగ్బాస్ షో అందరూ అనుకుంటున్నట్లు కాదని అసలు స్క్రిప్టు అనేది ఉండదని, చాలా జెన్యూన్ గేమ్ షో అని పేర్కొంది. అవకాశం ఉంటే మరోసారి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తానని వెల్లడించింది. త్వరలోనే అర్థపావు భాగ్యంగా సీరియల్లో కనిపిస్తానని చెప్పింది. 'మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చాడో లేదో తెలియదు. కానీ మా డాక్టర్ బాబు బాగుండాలి. మా దీప బాగుండాలి' అంటూ ఫన్నీగా తెలిపింది. Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా' -
బిగ్బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే..
Bigg Boss Telugu 5 Uma Devi Remuneration: నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న బిగ్బాస్ సీజన్-5 రసవత్తరంగా సాగుతుంది. రెండు వారాల్లోనే కంటెస్టెంట్లు తమ ఉగ్రరూపాన్ని చూపించేస్తున్నారు. నామినేషన్స్ వచ్చేసరికి కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడుతుంది. అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో తమను నామినేట్ చేసిన వ్యక్తులను నోటికి వచ్చినట్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. చదవండి: బిగ్బాస్ షో.. మీరు అనుకుంటున్నట్లు కాదు: ఉమాదేవి ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు కార్తిక దీపం ఫేమ్ ఉమాదేవి. గత వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడేసింది. ఆ బూతులకు బిగ్బాస్ బీప్ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆ వర్గం ఓట్లు బాగా తగ్గిపోయాయి. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకునేలోపు ఆమె రెండోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. లోబోతో కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నా నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడకపోయి ఉంటే మరొకొన్ని రోజులు ఆమె బిగ్బాస్లో కంటిన్యూ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో గయ్యాళి అనే పేరు నుంచి తానెంటో నిరూపించుకుందాం అనుకున్న ఉమాదేవి చివరికి ఆ పేరుతోనే హౌస్ నుంచి బయటకు వెళ్లడం స్వయం కృపరాదం అనొచ్చు. ఇక బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. ఆ లెక్కన రెండు వారాలకు గాను ఆమెకు సుమారు రూ. లక్షా అరవై వేల పారితోషికం అందినట్లు సమాచారం. -
డాక్టర్ బాబు ఆస్తుల చిట్టా, హీరోకు ఏమాత్రం తీసిపోడుగా!
Nirupam Paritala Net Worth: నిరుపమ్ పరిటాల.. ఈ పేరు పెద్దగా తెలుసో లేదో కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు నిరుపమ్. ఈ సీరియల్ ఆ రేంజ్లో క్లిక్ అయింది మరి! అప్పుడప్పుడూ సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. టీఆర్పీ రేటింగ్లను కొల్లగొడుతోన్న ఈ సీరియల్ అందులోని నటీనటులను బుల్లితెర స్టార్లుగా నిలబెట్టింది. ఇదిలా వుంటే తాజాగా డాక్టర్ బాబు ఆస్తుల గురించి ఓ కథనం నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం కార్తీకదీపం సీరియల్ నుంచి ఆయనకు ఒక్కరోజుకు 22 వేల రూపాయల మేర పారితోషికం ముడుతుందట. దీనితోపాటు మరో రెండు సీరియల్స్లో నటిస్తుండగా వాటి రెమ్యునరేషన్ను కలుపుకుంటే నిరుపమ్ రోజూవారీ సంపాదనే రూ.60 వేల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.14 లక్షల పైనే సంపాదిస్తున్నాడట. అతడికి హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో రూ.80 లక్షలు విలువ చేసే ఫ్లాటు ఉండగా, విశాఖపట్నంలో రూ.5 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉందని సమాచారం. అంతేకాకుండా రూ.11 లక్షలు ఖరీదు చేసే రెండు కార్లు కూడా అతడి గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియళ్లలో నటిస్తూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అంటే నటిగా ఆమె కూడా గట్టిగానే సంపాదిస్తోంది. కాబట్టి వీరి ఆస్తుల విలువ ఇక్కడ చెప్పుకున్నదాని కంటే ఎక్కువే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నెటిజన్లు. మొత్తానికి బుల్లితెర కథానాయకుడిగా వెలుగొందుతున్న నిరుపమ్ హీరో రేంజ్లోనే సంపాదిస్తున్నాడని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. -
సినిమాల్లోకి వంటలక్క ఎంట్రీ! మరి డాక్టర్ బాబు పరిస్థితి?
కార్తీకదీపం సీరియల్తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్. వంటలక్కగా తన సహజసిద్ధమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమా అవకాశాలు వచ్చినా కాదనుకున్న ప్రేమీ విశ్వనాథ్ తాజాగా ఓ బడా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి- హీరో రామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. రామ్కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ వంటలక్కను సంప్రదించగా.. కథ నచ్చడంలో ఆమె కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర కోసం వంటలక్కకు మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కార్తీకదీపం సీరియల్తో హీరోయిన్కు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్..ఇక వెండితెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Karthika Deepam: మోనితకు ఊహించని ట్విస్ట్, గీతలు చెరిపేసిన దీప
కార్తీకదీపం జూలై 8వ ఎపిసోడ్: కార్తీక్ సౌందర్య అమెరికా వెళ్లిందని చెప్పగానే మోనిత సాక్షి సంతకాల పెట్టడానికి తప్పించుకోడానికే వెళ్లిందా? అంటుంది. ఇక తను మౌనంగా ఉండే పని కాదని, ఎదోకటి చేయాలంటూ కార్తీక్ వెళ్లిపోమ్మని చెబుతూ కారు ఎక్కబోతుంటే కార్తీక్ ఆమె చెయి పట్టుకుని ఆపుతాడు. ఆ తర్వాత ఇక తాను చేయని తప్పుకు దోషిలా ఉండలేనని, తన ప్రేమయేయం లేకుండా జరిగింది తన తప్పుల జాబితాలో చేరదు అని గట్టిగా అరిచి చెబుతాడు కార్తీక్. అంతేగాక ‘నీ నాపై ప్రేమ, వదిలేస్తాననే భయం లాంటివి కనిపించడం లేదు. కావాల్సిన దాని కోసం ఎంత దూరమైన వెళ్తావన్న బెదిరింపు కనిపిస్తుంది’ అని అనడంతో మోనిత ఆశ్చర్యంగా చూస్తుంది. అలాగే ‘స్నేహం కావాలంటే ముందు వరుసలో ఉంటా. అంతేగాని న్యాయం కావాలంటే అన్యాయానికి తలవంచను. మౌనంగా భరిస్తున్న కదా అని ఈ దోషాన్ని దీప, మా అమ్మకు అంటగట్టాలని చూస్తే అది సహించను. నా తప్పు లేకుండా జరిగిందానికి నేను నైతిక బాధ్యత వహించలేను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత షాక్ అవుతూ ప్రియమణి చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ బాబు అందరిలాంటి మగాడు కాదని, తన భార్య, తల్లి, కుటుంబం జోలికి వస్తే ఊరుకోడని ఆమె అన్న మాటలను తలచుకుని కంగారు పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ హిమ, శౌర్యలకు కొత్త బట్టలు కొనుక్కుని తీసుకువెళతాడు. హిమ, శౌర్యను పిలిచి నాన్న డాడీ మీకు బట్టలు తెచ్చాడని అవి వేసుకోమ్మని చెబుతాడు. పిల్లలు అవి వేసుకోని రాగానే సెల్ఫీ తీసుకుందామని, దీపను కూడా పిలిచి తన భుజంపై చేయి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలతో ఈ ఫొటో మన సెల్ఫోన్ అన్నింటిలో ఆ ఫొటోనే వాల్పేపర్గా ఉండాలని చెబుతాడు. ఆ తర్వాత వారికి తెచ్చిన బట్టలను మీ స్నేహితులకు చూపించుకోమ్మని వెళ్లండని చెప్పి పిల్లలను బయటకు పింపిస్తాడు. ఆ తర్వాత దీపను కుర్చీలో కూర్చోబెట్టి ‘నా ప్రవర్తన నీకు కొత్తగా అనిపించోచ్చు దీప. కానీ ఇన్ని రోజులు నా తప్పు లేకుండానే నేను తప్పు చేసినవాడిలా తలదించుకుని ఉన్నాను. ఇక నుంచి అలా ఉండదు. ఈ 25 తేదీలోపు ఈ సమస్య తప్పకుండా పరిష్కారం దొరుకుంది. నన్ను నమ్ము దీప’ అంటూ ఆమె మీద ఒట్టు వేస్తాడు. తరువాయి భాగం.. ఆదిత్య, దీప దగ్గరికి వచ్చి వదినా అన్నయ్య తప్పు చేశాడో లేదో అది నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటి నీకు చెబుతాను అంటూ దీప విజనగరం వెళ్లినప్పుడు కార్తీక్ను నిలదీసిన విషయం చెబుతాడు. అప్పుడు అన్నయ్య మరోసారి పరీక్షలు చేయించుకుంటానని తనతో అన్నది చెబుతాడు. అంతేగాక అన్నయ్య ల్యాబ్ కూడా వెళ్లాడు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అనగానే ఇందులో ఏమైనా ఉందేమో? ఇప్పుడు మనం ఏం చేద్దాం వదిన అనగానే, ఆదిత్యను ఆ ల్యాబ్కు వెళ్లి కనుక్కొమ్మంటుంది. అంతేగాక గోడ మీద మోనిత గీసిన గీతలను తడి గుడ్డతో చెరిపేస్తుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: అర్జెంటుగా అమెరికా వెళ్లిన సౌందర్య, షాక్లో మోనిత
కార్తీకదీపం జూలై 7వ ఎపిసోడ్: తన సంస్కారం మీద నమ్మకం ఉందని, తను ఏ తప్పు చేయాలేదన్నదే నిజమని, అలాంటప్పుడు తానేందుకు తప్పు చేసినవాడిలా భయపడాలి అంటూ తనని తాను సమాధాన పరుచుకుంటాడు కార్తీక్. అలాగే తన కుటుంబమే ముఖ్యమని, తన పిల్లలు, భార్యతో సంతోషంగా ఉంటానని, అలాగే కొడుకుగా, డాక్టర్గా మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరిస్తానని అనుకుంటాడు. ‘నా తల్లి ముందు సుపుత్రుడిగానే నిలబడాలి. మోనిత ముందు తప్పుచేసిన వాడిలా తలదించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే నా వ్యక్తిత్వాన్ని పొగొట్టుకుంటున్నాను. ఇక ముందు అలా జరగకూడదంటే ఈ కడుపు సంగతేంటో తెల్చుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మరోవైపు మోనిత కార్తీక్ను కలవడానికి రెడీ అవుతూ ఉండగా మధ్యలో ప్రయమణి వచ్చి ఎక్కడికి అక్కడికేనా అని అడుగుతుంది. తెలిసి ఎందుకు అడుగుతావని మోనిత అనగానే ప్రియమణి ‘మీ మంచికే చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఒట్టి మనిషివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు’ అనగానే మోనిత ‘ఏడ్చారులే.. కార్తీక్ తప్పు చేశాడని మా అందాల అత్త నమ్ముతోంది. నా భర్త తప్పులేకపోతే మోనిత ఎందుకు గర్భవతి అవుతుంది మా వంటలక్క అనుకుంటోంది. ఇక ఇప్పుడు వాళ్ల జుట్టు, ఇంటి గుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అంటుంది. దీంతో ప్రియమని అని మీరు అనుకుంటున్నారని మోనితకు షాక్ ఇస్తుంది. ‘దీపమ్మ ఇంటి నుంచి వచ్చేసినా డాక్టర్ బాబు తోకలాగే ఆమె వెనక వచ్చాడు. పోనీ దీపమ్మ ఏం అయిన కార్తీక్ అయ్యాను గెంటెయ్యలేదు కదా.. అటూ తల్లి కూడా కార్తీక్ అయ్యా గురించే బాధపడుతున్నారు తప్ప మీ మీద జాలి చూపించడం లేదు కదా’ అని లాజిక్గా మాట్లాడుతుంది. కార్తీక్ అయ్య కూడా అందరి లాంటి మగాడేనని, ఆయన ఏ మహానుభావుడు కాదంటుంది. ఏదైనా తన దాక రాకపోతే ఆడదానితో ఎంత గౌరవంగానైనా ఉంటాడు. అదే కుటుంబానికి, వంశగౌరవానికీ ముప్పు రాబోతుందని తెలిస్తే మాత్రం దెబ్బకు ప్లేట్ పిరాయిస్తాడు. తప్పు చేశానని కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారని, అందులో కార్తీక్ అయ్యా ఉంటారని తనకు నమ్మకం లేదు అంటుంది ప్రియమణి. కాబట్టి మీకే అన్ని తెలుసు అని ధైర్యంగా ఉండకుండా మీకు న్యాయం ఎలా జరుగుతుందా అని ఆలోచించండని మోనితకు హిత బోధ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ కాల్ చేస్తాడు. అది చూసి మోనిత ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా దీప గోడ మీద ఉన్న గీతల వంకే చూస్తూ మోనిత తనవైపు వెక్కిరింతగా చూస్తున్నట్లు తలుచుకుంటోంది. పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉందో మళ్లీ అదే పరిస్థితి ఎందురైందని, ఇప్పుడు చేయాలని, మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాలా? అయితే పిల్లల పరిస్థితి ఏంటీ? నా డాక్టర్ బాబు సంగతేంటి? ఆ మోనితకు వదిలేయని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది. ఇదిలా ఉండగా కార్తీక్, మోనితలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటుంటారు. చూడు కార్తీక్ నువ్వు నన్ను ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటుంది మోనిత. ‘పదేళ్లు అబద్దాని నిజమని నమ్మి దీపను దూరం పెట్టావు, ఇప్పుడు నిజాన్ని అబద్దమంటూ నన్ను ఎన్నాళ్లు దూరం పెట్టాలనుకుంటున్నావు’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటాడు. దీంతో మోనిత నీ ఫ్రెండ్గ్, శ్రేయోభిలాషిగా, నీ వెల్ విషర్గా చెబుతున్నాను.. నువ్వు మోనితని పెళ్లి చేసుకోవడమే న్యాయం అంటుంది మోనిత. కార్తీక్ మౌనంగా ఉండటంతో మోనిత ప్రేమగా కార్తీక్ భజం మీద చెయ్యి వేసి ఇవన్నీ వద్దని, తను పెళ్లి వాయిదా వేయను అని చెబుతుంది. నువ్వు నన్ను తల్లిని చేశావు, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి పెళ్లి కావాలంటున్నాను, తన బిడ్డకు తండ్రివి నువ్వే అని సమాజానికి చెప్పుకోవడం కోసం పెళ్లి చేసుకుందాం అంటుంది. ధర్మం ఎటు ఉందో నువ్వే ఆలోచించు.. ఇంత మాట్లాడుతున్నా నీలో మార్పు రాకుంటే న్యాయం కోసం మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే కార్తీక్ అమ్మలేదు.. అమెరికా వెళ్లిందని చెబుతాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. అమెరికా ఎందుకు వెళ్లిందనగా తన చెల్లి స్వప్న దగ్గరికి అని చెబుతాడు. దీంతో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మోనిత కంగారు పడుతుంది. తరువాయి భాగం.. కార్తీక్ అనుకున్నట్లు గానే పిల్లలతో సంతోషంగా ఉంటాడు. పిల్లలకు బహుమతులు కొనితెచ్చిస్తాడు. సరదాగా వాళ్లతో మాట్లాడం చూసి దీప ఏంటి ఈ సడెన్ మార్పు అని ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ సెల్ఫీ తీస్తుండగా ఇందులో ఒకరూ మిస్సయ్యారు, నిన్నే దీప నువ్వు కూడా ఉంటే బాగుంటుందంటూ దీపను రాగానే భుజం మీద చేయ్యి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలు బయటకు వెళ్లగానే ‘ఈ నెల 25వ తేదీలోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను నీవాడిని దీప నన్ను నమ్ము. ఇది నాటకం కాదు అని దీప తలపై చెయి పెడతాడు’ కార్తీక్. -
దీపతో మోనిత కండీషన్ గురించి చెప్పి ఎమోషనలైన కార్తీక్
కార్తీకదీపం జూలై 5ఎపిసోడ్: మోనిత వీడియో కాల్ చేసి కార్తీక్ పెళ్లి చీరలు ఎలా ఉన్నాయో నిన్ను అడగమంది అనడంతో దీప రగిలిపోతుంది. ఎంటీదని సౌందర్యను దీప ప్రశ్నిస్తుంది. దీంతో సౌందర్య ఆ మోనిత కావాలనే నిన్ను రెచ్చగోట్టాలని కాల్ చేసి వాడిని ఇరికించిందని నా మనసు చెబుతుంది అంటుంది. అంతేగాక వాడు నిజంగా తప్పు చేశాడంటే తను నమ్మలేకపోతున్నానని, ఇందులో ఏదో తెలియని గూడుపుఠాని ఉందని నా మనసు చెబుతుంది దీప, ఒకసారి మనసుతో ఆలోచించు నువ్వు అంటూ తనతో చివరి వరకు కలిసి పోరాడటానికి సాటి స్త్రీగా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ దీపకు భరోసా ఇచ్చి వెళ్లిపోతుంది సౌందర్య. ఇక కార్తీక్.. మోనిత దీపకు కాల్ చేసి ఇరికించిన సంఘటననే గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుచకుంటూ వస్తాడు. అటు వైపే వెళుతున్న సౌందర్య కార్తీక్ను చూసి కారు ఆపుతుంది. కార్తీక్కు ఎదురుగా వెళ్లి ఏమైందరా అని అడగ్గా నా బతుకులాగే కారు కూడా పాడైందని సమాధానం ఇస్తాడు. దీంతో ఆ మోనిత దగ్గరి నుంచే వస్తున్నావా? అని సౌందర్య ప్రశ్నించడంతో నీకేలా తెలుసంటూ ఆశ్చర్యంగా చూస్తాడు కార్తీక్. అప్పుడు కాల్ చేసినప్పుడ దీప పక్కనే ఉన్నానని మరిచిపోయావా? అంటుంది. అవునంటూనే మునిగిపోయాను మమ్మీ సుడిగుండంలో ఊపిరి ఆడనడల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు కార్తీక్. కార్తీక్ నుంచి ఆ మాటలు విని సౌందర్య తట్టుకోలేకపోతుంది. జాలిగా పెద్దోడా అంటూ పెళ్లి బట్టల గురించి ఆరా తీస్తుంది. టైం దగ్గర పడుతోందని కార్తీక్ అనగానే స్నేహానికి పరిమితులు ఉంటాయిరా అని అప్పడే చెప్పాను నువ్వు వినలేదని కార్తీక్ను మందలిస్తుంది. అలాగే జరిగిన దాని గురించి ఏం చేయలేమని, జరగబోయేదంటీ? ఆ పెళ్లి, ముహుర్తం సంగతేంటని సౌందర్య కార్తీక్ను ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ ఏదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతోంది మమ్మీ.. నమ్మండని.. తను నటించడం లేదు అంటూ భావోద్వేగానికి లోనవుతాడు. ‘నేను మనసులో ఏం అనుకుంటున్నానో అదే చెబుతున్నాను మమ్మీ. నా తప్పు లేకుండానే బాధ్యున్ని అయ్యాను. దీపకు గుడి కట్టి దేవతలా చూసుకోవాలనుకున్నాను. కానీ తన ఆశలకి నేను సమాధి కట్టాను. ఇది పాపమా.. శపమా అర్థం కావడం లేదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. సౌందర్య అలా బాధగా చూస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా భాగ్యం ఇంటికి వెళ్లిన హిమ, శౌర్య అమ్మనాన్న ఎందుకు మాట్లాడుకోవడం లేదని భాగ్యాన్ని అడుగుతారు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిని త్వరలోనే కలుస్తారంటూ పిల్లలకు సర్థిచెబుతుంది. మరోవైపు దీప మోనిత వీడియో చేసి చీరలు చూపించిన సీన్ గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దీప ముందు నిలబడతాడు. జరిగినదానికి క్షమాపణలు కోరుతూ పెళ్లి బట్టలు తను కొనలేదని చెబుతాడు. దీంతో ఆ మోనిత సంగతి తనకు తెలుసని, మీరే ఏంటన్నది తనకు అర్థం కావడం లేదంటూ పెళ్లి డేటు, రిజిస్టర్ మ్యారేజ్పై నిలదీస్తుంది. తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. అది విని కార్తీక్ షాక్ అవుతాడు. తడబడుతూనే ఏది తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుందంటూ బాధపడుతుంటాడు. దీంతో దీప కోపంగా చూస్తూ అంత కీలు బొమ్మల ఎలా మారిపోయారంటుంది. 25 తారిఖున పెళ్లి అంటున్నారు దాని మాటేంటి అనగానే కార్తీక్ నాకు ‘నా భార్య పిల్లలె ముఖ్యం’ అంటాడు. దీంతో మరీ మోనిత ఒక్కతే వెళ్లి తాళి, పూల దండ వేసుకుని వస్తుందా అని అని చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయానని, మోనితను ఫ్రెండ్లాగే చూశాను కానీ తను నాకు నరకం చూపిస్తుందంటాడు. నువ్వు అన్నట్లుగా నన్ను కీలు బోమ్మను చేసి ఆడుకుంటోందని, ఫోన్ ఎత్తకపోతే బెదిరింపులు, కలవకపోతే హెచ్చరికలు, తనతో కలిసి బయటకు వెళ్లకపోతే సాధింపలు పదే పదే తప్పును అడ్డం పెట్టుకుని నన్ను మరబోమ్మలా మార్చేసింది దీప దగ్గర విలపించుకుంటాడు కార్తీక్. అంతేగాక ఈ పెళ్లికి నిన్ను, అమ్మను తీసుకువెళ్లి సాక్షి సంతకం పెట్టించమని కండీషన్ కూడా పెట్టిందని దీపతో చెప్పడంతో షాక్ అవుతుంది. ఇలా వారి మధ్య వాదన జరుగుతుండా హిమ, శౌర్యలు వస్తారు. వారు రాగానే కార్తీక్ తల దించుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
మరో సీరియల్ కోసం గెటప్ మార్చిన వంటలక్క, స్టైలిష్ లుక్తో..
కార్తీకదీపం ఫేం దీప(ప్రేమి విశ్వానాథ్) తెలుగు బుల్లితెర ప్రేక్షకులుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంటలక్కగా పాపులర్ అయిన ఆమె చీరకట్టులో అనుకువ, సహనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కార్తీకదీపం ట్వీస్ట్లతో సాగుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్, మోనితల రిజిస్టర్ మ్యారేజ్ గురించి ఉత్కంఠం సాగుతున్న ఈ సీరియల్ను డైరెక్టర్ ఎలా మలుపు తిప్పబోతున్నాడనేది ఎవరి ఊహాకు అందడం లేదు. దీంతో కొంతమంది ‘కార్తీక్, మోనిత పెళ్లి అయిపోతుంది, ఆ తర్వాత వంటలక్క వెళ్లిపోతుంది.. వెంటనే కార్తీకదీపంకు శభం కార్డు’ అంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రేమి విశ్వనాథ్ నటిగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఆమె ఇంతవరకు వేరే సీరియల్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ మాలయాళ సీరియల్కు సంతకం చేసింది. ప్రేమి లీడ్ రోల్లో దేవికా అనే సీరియల్ ప్రాసారం కాబోతుంది. ఈ సీరియల్కు సంబంధించిన ప్రోమోను ఆమె తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ఇందులో వంటలక్క సరికొత్త లుక్లో దర్శనం ఇచ్చింది. మోడ్రన్ డ్రెస్లో స్టైలిష్ లుక్తో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సీరియల్ పేరు దేవికా అని, సోమవరం (జూలై 5) నుంచి రాత్రి 8 గంటలకు సూర్య టీవీ ప్రసారం అవుతున్నట్లు ఈ ప్రమోలో ప్రేమి వెల్లడించింది. కార్తీకదీపంలో చాలా పద్దతిగా, సంప్రదాయం ఉన్న వంటలక్కను ఇలా చూసి ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే ప్రేమి విశ్వనాథ్లో ఇందులో పోగరు ఉన్న సంపన్నురాలిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు బాష అర్థంకాకపోయిన వంటలక్క కోసం సీరియల్ చూసేందుకు అసక్తిచూపుతున్నారట. -
'కార్తీకదీపం' ఫేం హిమ ఇంటికి ఈటల రాజేందర్.. ఫోటో వైరల్
బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. టీఆర్పీ రేటింగ్ విషయంలో ఇంతవరకు ఏ సీరియల్ కానీ, షోలు కానీ ‘కార్తీక దీపం’ని అందుకోలేకపోయాయంటే ఈ సీరియల్కి ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ సిరియల్పై ఫన్నీ మీమ్స్ వస్తుంటాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్' కొత్త పోస్టర్ను సైతం 'కార్తీకదీపం' స్టైల్ లోకి మార్చి మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ సీరియల్ మాత్రమే కాదు.. అందులో నటీనటులు కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టులు సహృద(హిమ), కృతిక(శౌర్య) నుంచి నిరుపమ్(డాక్టర్ బాబు)వరకు అందరికి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా సహృద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా హిమ అలియాస్ సహృద షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ ఇంటికి వచ్చారని చెబుతూ.. ఆయనతో దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది సహృద. అయితే ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. దీంతో మాజీ మంత్రి ఈటల మీ ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Sahrudafruity (@sahrudafruity) -
Karthika Deepam: కార్తీక్, మోనితల పెళ్లిపై సౌందర్యను నిలదీసిన దీప
కార్తీకదీపం జూలై 2: కార్తీక్, మోనితల పెళ్లి విషయం తెలుసుకున్న దీప తండ్రి మురళీ కృష్ణ సౌందర్య దగ్గరికి వస్తాడు. ఈ విషయంపై సౌందర్యను నిలదీయడంతో ఆమె మౌనంగా ఉండిపోతుంది. చెయ్యని తప్పుకు నా బిడ్డ పదేళ్లు శిక్ష అనుభవించింది.. ఇప్పుడు కూడా ఏం చెయ్యారా మీరు? అని ప్రశ్నిస్తాడు. దీనిపై సౌందర్యతో వాదించి చివరకు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లగానే సౌందర్య ‘ఓ కన్నతండ్రిగా ఆయన అడిగిన ఏ ప్రశ్నలకే నా దాగ్గర సమాధానం లేదు. మరీ ఇవే ప్రశ్నలు దీప అడిగితే, ఈ పెళ్లి విషయం గురించి తనకు తెలిస్తే ఏంటి పరిస్థితి’ అంటూ మనసులోనే మదనపడుతుంది. ఇదిలా ఉండగా పిల్లలతో కలిసి కార్తీక్ భోజనం చేస్తుంటే దీప వడ్డిస్తుంది. హిమ మాట్లాడుతూ మధ్యలో డాడీ మనం బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా అని అంటుంది. దీంతో వెంటనే శౌర్య కూడా అవునవును.. మనం నలుగురం కలిసి బయటికి వెళ్దాం.. చాలా బాగుంటుందని అంటుంది. అలాగే దీపతో అమ్మా నువ్వు కూడా వస్తావు కదా అని అడగ్గానే ఎందుకు రాను.. తప్పకుండా వస్తాను అంటుంది. అందరం కలిసి బయటి వెళదామని అనగానే కార్తీక్, పిల్లలు సంతోషిస్తారు. అలాగే తనకు కొన్ని పనులు ఉన్నాయని, ఈ నెల 25 తేదీన మనం నలుగురం కలిసి బయటికి వెళ్దామని, ఆ రోజు డాడీని ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పండి అనగా కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి దీపకు నిజం తెలిసిందా అని కంగారు పడుతాడు కార్తీక్. ఇదిలా ఉండగా మోనిత ఉదయం లేవగానే పొట్టపై చెయి పెట్టుకుని గుడ్ మార్నింగ్ బంగారం అంటూ మురిసిపోతుంది. 16 ఏళ్లు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. కానీ నువ్వు కడుపులో పడిన మూడు నెలలకే ఈ తల్లి పెళ్లి చేస్తున్నావు. నువ్వు గ్రేట్ బేటా అంటూ సంబరపడిపోతుంది మోనిత. మరోవైపు సౌందర్య దీప ఇంటికి వస్తుంది. మురళీ కృష్ణ దీపకు పెళ్లి విషయం చెప్పేసి ఉంటాడా? అని భయపడుతూనే లోపలికి వెళ్లేసరికి దీప గుమ్మం దగ్గరే ఎదురు పడుతుంది. రండి అత్తయ్యా అంటూ దీప అతి మార్యాదు చేయడం చూసి సౌందర్య అనుమాన పడుతుంది. ఆ తర్వాత దీప మోనిత, కార్తీక్ల పెళ్లి విషయం గురించి తనకు ఎందుకు చెప్పలేదని దీప సౌందర్యను నిలదీస్తుంది. చివరకు తనలాగే తన పిల్లలకు కూడా సవతి తల్లి పెంపకం రాసినట్లున్నాడు ఆ దేవుడు కానీ దీప బతికి ఉండగా.. నా పిల్లలకు ఎలాంటి చీడపట్టనివ్వను అని ఆవేశంగా అంటుంది. అంతేగాక ఇన్నాళ్లు తను పడ్డ కష్టాల గురించి మాట్లాడుతుంది. ‘కొన్నేళ్ల పాటు దారుణమైన నిందను మోశాను. అది చెరిగిందో లేదో తెలియదు కానీ మళ్లీ జీవితాంతం అనుభవించడానికి దారుణమైన పరిస్థితి వచ్చింది. నా మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. నా భర్త తప్పు చేశాను తప్పు చేశాను అంటే.. దేవుడు లాంటి మనిషి తప్పు చెయ్యడం ఏంటీ అనుకున్నాను.. ఏదో చెబుతారు ఏదో చెబుతారు అనుకుంటే మోనితోచ్చి కడుపు వచ్చింది అని చెప్పింది. లోపల నా గుండె రగిలిపోతుంది, కడుపు మండుతుంది అత్తయ్యా.. నేను సగటు స్త్రీనే కదా’ అంటూ సౌందర్యతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది దీప. దీంతో సౌందర్య బాధగా దీపా నేనే కాదు.. ఈ విషయం వాడు నీతో చెప్పలేక నలిగిపోతున్నాడే అంటుంది. కానీ దీప మాత్రం అవును, పాపం నిజంగానే నలిగిపోతూనే నిసహాయంగా చూస్తూనే.. దానితో కలిసి 25 తేదీ రిజిస్టర్ ఆఫీస్లో ముహూర్తం నిర్ణయించుకుని వచ్చారు అని వెటకారంగా అంటుంది. ఇంతలో కార్తీక్ కంగారుగా బయటకు వెళతాడు. ఎక్కడికి అని అడిగిన అర్జేంట్ పనుందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: నిజం తెలుసుకున్న దీప, కోపంతో రగిలిపోతున్న మోనిత..
కార్తీకదీపం జూలై 1వ ఎపిసోడ్: కార్తీక్ మనసు బాగాలేక సౌందర్య దగ్గరికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోనిత తన దగ్గరికి వచ్చి వెళ్లిన విషయం సౌందర్య కార్తీక్తో చెబుతుంది. అంతేగాక ఆశీర్వదించండి అంటూ కాబోయే అత్త దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్లిందని కార్తీక్, మోనితకు రిజిస్టర్ మ్యారేజ్ అనే విషయం తనకు తెలిసిందని కార్తీక్ స్పష్టం చేస్తుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలని ధీనంగా అడగ్గా ఏం చేసిన దీప, పిల్లలు, తల్లిదండ్రులైన తమకు, మోనితకు జావాబుదారిగా ఉండాలని అంటుంది సౌందర్య. దీంతో కార్తీక్ తనకే ఎందుకు ఇలా జరుగుతుందని అనగానే ‘నువ్వు చేసిన పాపమే’ అంటుంది సౌందర్య. ‘నా కోడలు ఏ తప్పు చేయకపోయిన పదేళ్లు అనుమానించి తనని బాధపెట్టావు, నీ కన్న బిడ్డే నిన్ను నాన్న అని పిలవడానికి సంకోచించేల చేశావు. ఇన్నాళ్ల దాని ఏడుపే నీకు శాపంగా మారింది’ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయలేను మై డియర్ స్టుపిడ్ సన్ అంటూ సౌందర్య కార్తీక్కు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే కార్తీక్కు తల తిరిగినట్టు అయ్యి అక్కడే కూలబడతాడు. మరోవైపు నిజం తెలుకున్న భాగ్యం దీపకు వచ్చి చెప్పేస్తుంది. దీపతో నీ తలరాత ఇలా ఉందేంటే, నీకు జీవితాంతం కష్టాలు తప్పవా? అంటూ మోనిత, కార్తీక్లకు 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అనే విషయం చెబుతుంది. అది విని షాక్ అయిన దీప ఇదేలా సాధ్యమని, దీనికి డాక్టర్ బాబు ఒప్పుకున్నారా? అని అనుమానంగా ప్రశ్నించగా మోనిత రసీదు కూడా చూపించిందని ఏడుస్తూ చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ రోడ్డు పక్కన కారు ఆపి ‘ఈ పెళ్లి ఎలా ఆపాలి. దీపకు ఈ విషయం తెలియకముందే ఇది జరగాలి. అది మోనిత చెప్పినట్లు వింటేనే సాధ్యం అవుతుంది. కానీ మోనిత వినే పరిస్థితిలో లేదు. నా జీవితం ఇలా అయిపోయిందేంటీ? ఇంకా ఈ నరకం ఎంతకాలం’ అంటూ కార్తీక్ మదనపడుతుంటాడు. మరోవైపు నిజం తెలుసుకున్న దీప కలవరపడుతూ ఉంటుంది. ‘డాక్టర్ బాబుకు, మోనితకు పెళ్లి జరిగితే, నా పిల్లల భవిష్యత్తు, నా సంసారం, నేను ఏం కావాలి’ అని తలచుకుంటూ బాధపడిపోతుంది. ఈ నిజం తనతో ఎందుకు చెప్పలేదని, ఎవరో బయటి వాళ్లు వచ్చి చెబితే కానీ తెలియలేదు అని ఆలోచిస్తుంది. మోనిత అంటే చెప్పదు పెళ్లి ఆపేస్తానని, మరీ డాక్టర్ బాబు ఎందుకు చెప్పలేదు ఆపకూడదనా? అని అనుకుంటూ మరీ అత్తయ్యా ఎందుకు చెప్పలేదు, చెప్పాలకున్న చెప్పలేకపోయారా? ఎప్పుడు నాకు తల్లిలా తోడు ఉండే ఆమె ఈ సారి కొడుకు నిస్సహయత చూసి ఆమెలోని తల్లి మనుసు చలించి కొడుకు వైపు మళ్లిందా? అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా మోనిత అద్దంలో చూసుకుంటూ ‘నా భార్య దీప గుడి కట్టాలి’ అని కార్తీక్ అన్న మాటాలను తలచుకుని రగిలిపోతుంది. అక్కడే ఉన్న పూల ప్లాస్క్తో అద్దాన్ని పగలగోడుతుంది. ఆ శబ్థం అక్కడికి వచ్చిన ప్రియమణి మోనిత సీరియస్గా ఉండటం చూసి భయపడుతుంది. ఏమైందని భయంతోనే అడుగుతుంది. ఇంతలో కాస్తా కూల్ అయిన మోనిత ఇంటి, వంటి పనితోనే కాదు అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇదంతా క్లీన్ చేయి అని మెల్లిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక దీప పిల్లలకు భోజనం పెడుతుండా నాన్న వచ్చాక తింటామని చెబుతారు. దీంతో దీప నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మీరు తినేయండి చెప్పిన వినకుండా లేట్ అయిన వేయిట్ చేస్తామంటూ మారాం చేస్తారు. ఏ పని మీద వెళ్లారో తెలియదు కదా ఎందుకు వేయిట్ చేయడం అనేలోపే కార్తీక్ వచ్చేస్తాడు. కార్తీక్ రాగానే తోందరగా ఫ్రెష్ అయి వస్తే కలిసి తిందాం డాడీ అని హిమ, శౌర్య అడగ్గా సరే అని వెళతాడు. దీంతో పిల్లలు నాన్న చల్ల నీళ్లతో స్నానం చేయడని చెప్పావు కదమ్మా మరేందుకు డాడీకి వేడి నీళ్లు పెట్టలేదని హిమ అడుగుతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు కదా అందుకే పెట్టలేదని దీప అనడంతో మరీ ఇప్పుడు వెళ్లి పెట్టు అనగానే అది విన్న కార్తీక్ వద్దని సమాధానం ఇస్తాడు. -
ఆర్ఆర్ఆర్ పోస్టర్పై ‘డాక్టర్ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ (రౌధ్రం రణం రుధిరం) చిత్రం నుంచి మంగళవారం ఓ కొత్త పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ బండి నడుపుతుంటే.. రామ్ చరణ్ వెనకాల కూర్చొని చిరనవ్వులు చిందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పోస్టర్పై ఇప్పటికే రకరకాల మీమ్స్ వస్తున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్లకు హెల్మెట్ పెట్టి.. ఈ పోస్టర్ని ప్రమోషన్ కోసం వాడేశాడు. దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. మీరు పెట్టిన కాప్షన్ పర్ఫెక్ట్గా లేదు. బండికి నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ ట్రాఫిక్ పోలీసులు ట్విట్కి రిప్లై ఇచ్చింది. ఇక నెట్టింట ఏది వైరల్ అయినా.. కార్తీకదీపం సీరియల్తో ముడిపెట్టే నెటిజన్స్.. ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ని‘డాక్టర్ బాబు’కోసం వాడేశారు. డాక్టర్ బాబు బుల్లెట్ తోలుతుంటే.. వెనుక దీపతోపాటు మోనిత కూడా కూర్చుని ఉన్నట్టుగా మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ పరిటాల కూడా స్పందించాడు. ఈ మీమ్ని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఇలాంటి పోస్టర్ని ఎలా చేసార్రా బాబూ.. నాకు ఈ ఘోరానికి ఎలాంటి సంబంధం లేదు’ అని కామెంట్ పెట్టాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల భారీ మల్టీస్టారర్ చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. చదవండి: 'ఆర్ఆర్ఆర్' పోస్టర్ను మార్ఫింగ్ చేసిన డేవిడ్ భాయ్.. తారక్గా కేన్ మామ ఆర్ఆర్ఆర్ పోస్టర్పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై -
మోనితకు పిండివంటలు చేసి తీసుకెళ్లిన భాగ్యం
కార్తీకదీపం జూన్ 30 ఎపిసోడ్: ప్రియమణి కంగారుగా మోనితకు ఫోన్ చేస్తుంటే. అప్పటికే ఇంటికి చేరుకున్నమోనిత..వస్తున్నానని చెప్పాను కదే, మళ్లీ మళ్లీ చేస్తావేంటి అని విసుగ్గా అంటుంది. దీంతో ప్రయమణి వచ్చినావిడకి ఏం ఇవ్వమంటారని ఫోన్ చేశానమ్మా అంటుంది. ఎవరు వచ్చారు కార్తీక వాళ్ల అమ్మా.. అనగానే ఆవిడ నాకు తెలుసు కదమ్మా ఈవిడను నేను ఎప్పుడు చూడలేదు అని సమాధానం ఇస్తుంది. దీంతో ఎవరబ్బా నాకు చుట్టాలు ఎవరూ కూడా లేరు కదా ఎవరో చూద్దాం పదా అని లోపలికి వెళ్తారు ఇద్దరు. వెళ్లగానే లోపల భాగ్యం ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చిందాని అనుమానంగా చూస్తుంది. మోనితను చూసి భాగ్యం రారా మోనిత ఏమైన తిన్నావా? అసలే వట్టి మనిషివి కాదు ఎదోకటి తినాలి ఖాళీ కడుపుతో ఉండద్దు అని వెటకారంగా అంటుంది. మంచినీళ్లు తాగుతావని మోనితకు మర్యాదలు చేస్తుంటే ‘హాలో ఇది నా ఇల్లు’ అంటుంది మోనిత, దీంతో ఓహో నీ ఇల్లు అయితే మర్యాద చేయకూడదా? అని వెటకారంగా అంటుంది. వెంటనే ఈ ఇళ్లు ఎవరిది నీదేనా, డాక్టర్ బాబు కొనిచ్చాడా? అని అడుగుతుంది. తన డబ్బుతోనే కొనుక్కున్నానంటూ అసహనం చూపిస్తుంది మోనిత. అవునా... ఇప్పటి దాక డాక్టర్ బాబు నుంచి శాంతం లాగేశావ్ అనుకుంటున్నారంతా అంటూ భాగ్యం మోనితకు చురకలు అట్టిస్తుంది. సరేలే.. ఉత్తమనిషివి కాదని ఉత్తి పుట్టిళ్లు క్రియేట్ చేసి నీకు సున్నుండలు, మైసూరు పాక్, రవ్వలడ్డూలు తెచ్చాను అంటుంది. దీంతో ప్రియమణి ఎవరమ్మా మీ పిన్నిగారా? అని అడగ్గానే మోనిత కాదు దీప పిన్ని అని చెప్పతుంది. దీంతో ప్రియమణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత మోనితతో ఎలాగు నీ డబ్బుతోనే ఇళ్లు కొనుక్కున్న అన్నావుగా నీకు పుట్టబోయే బిడ్డను కూడా నువ్వే పెంచుకోమని, కావాంటే డాక్టర్ బాబు చదివిస్తాడని మోనితకు సలహా ఇస్తుంది భాగ్యం. నా అల్లుడు అందులో బంగారం నువ్వే చూశావుగా శౌర్య ఎవరో తెలియకుండానే చదివించాడు, ఇక సొంత బిడ్డ అని తెలిసి చదివించకుండా ఉంటాడా? అంటుంది. అలాగే కార్తీక్కు దూరంగా ఉంటూ తన మానని తనని బతకమని చెప్పడంతో మోనిత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. భాగ్యం తెచ్చిన రవ్వలడ్డూలు తెప్పించి అవి తింటుంది. అందులో చక్కర తక్కువగా ఉందని భాగ్యం స్టైల్ చెబుతుంది మోనిత. సరేలే తను చెప్పే గుడ్ న్యూస్ వింటే చాలా స్వీట్ ఉంటుందంటూ కార్తీక్కు తనకు పెళ్లని, ఈ నెల 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో అని చెప్పి రసీదు చూపిస్తుంది మోనిత. దీంతో భాగ్యం షాక్ అయ్యి ఏడుస్తూ దీపకు అన్యాయం జరుగుతుంది అంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీప కార్తీక్ను భోజనానకి పిలవడానిక వెళుతుంది. కార్తీక్ తనకు ఆకలిగా లేదని, మీ ముగ్గురు తినేయండి అంటూ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెబుతాడు. ఎక్కడికి వెళుతున్నారని లేను అడగలేదే అని దీప వెటకారంగా అంటుంది. దీంతో కార్తీక్ నువ్వు ఏం అనుకున్న నేను మాత్రం మా అమ్మ దగ్గరికే వెళుతున్నానని, పిల్లలు అడిగితే అర్జెంట్ సర్జరీ ఉంటే వెళ్లానని చెప్పమంటాడు. దీప తను అబద్దం చెప్పలేను అనగాను నీకు ఎలా వీలైయితే అలా చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీప ఇంతలా మదనపడుత్ను వ్యక్తి ఆ తప్పు ఎలా చేశాడు అంటూ దీప ఆలోచనలో పడుతుంది. కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్లి దోషిలా నిలబడతాడు. సౌందర్య దేశోద్దారకుడు, సుపుత్రుడు ఎక్కడ ఆ బిరుదులు, ఏ ఇంటి వాకిట్లో తాకట్టు పెట్టివచ్చావు అంటూ కార్తీక్కు చివాట్లు పెడుతుంది. అలాగే మోనత, కార్తీక్ పెళ్లి అనే విషయం కూడా తీయడంతో ఎలా తెలుసని కార్తీక్ ఆశ్చర్యపోతూ అడుగుతాడు. మోనిత వచ్చి, వెళ్లిన విషయం చెబుతుంది. ఏం చేయాలి అని సౌందర్యను కార్తీక్ సలహా అడగ్గా.. ఏం చేసిన జవాబుదారిగా ఉండాలని చెబుతుంది. దీపకు, పిల్లలకు, తమకు మోనితకు జవాబుదారిగా ఉండాలని కార్తీక్ను హెచ్చరిస్తుంది.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
శ్రీలీల బర్త్ డే.. స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్!
T20 World Cup 2024: ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న ఆఫ్ఘన్ బౌలర్లు
ప్రతి ఇంటికి మంచి చేశాం.. వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
కాలు జారి బస్సు కింద పడి విద్యార్థిని మృతి
టెకీలకు గుడ్న్యూస్.. 2 లక్షల మందికి ట్రైనింగ్
ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు
అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..!
'కన్నప్ప' సినిమా తీయమని శివుడు చెప్పాడు: మంచు విష్ణు
‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్
రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి
Advertisement