Karthika Deepam
-
15వ వెడ్డింగ్ యానివర్సరీ.. మళ్లీ పెళ్లి చేసుకున్న నిరుపమ్- మంజుల (ఫోటోలు)
-
'కార్తీకదీపం' వంటలక్కకి ఇంత పెద్ద కొడుకా.. హీరోలా ఉన్నాడే! (ఫొటోలు)
-
వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్
గత కొన్నేళ్లలో తెలుగు సీరియల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్నది ఏదైనా ఉందంటే అది 'కార్తీకదీపం'. కాస్త నలుపు ఛాయలో ఉన్న ఓ గృహిణి పడే ఇబ్బందులు అనే కథతో తీసిన ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో వంటలక్క పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ అనే నటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఇది తప్పితే ఆమె గురించి పెద్దగా విషయాలేం తెలియవు.(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)ప్రస్తుతం సరికొత్త 'కార్తీకదీపం' సీరియల్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్.. రీసెంట్గా ఓ కుర్రాడితో కలిసి ఇన్ స్టాలో రీల్ చేసింది. ఈ వీడియోని సదరు కుర్రాడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'మామ్ అండ్ సన్' (తల్లి-కొడుకు) అనే క్యాప్షన్ పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఎందుకంటే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్కి పెళ్లయి పిల్లలున్నారని తెలుసు గానీ మరీ ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని మాత్రం ఊహించలేకపోయారు.కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్.. వినీత్ భట్ అనే ఆస్ట్రాలజర్ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు పుట్టిన అబ్బాయి పేరు మనుజిత్. తాజాగా తల్లితో కలిసి చేసిన ఓ రీల్ షేర్ చేయగా.. అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆరడుగుల పొడుగు సిక్స్ ప్యాక్ బ్యాడీతో చూడటానికి హీరోలా ఉన్నాడు. దీంతో బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు. సంతూర్ మమ్మీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) View this post on Instagram A post shared by Manujith (@_.maaaaaaaanu) -
‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..
దేశంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, బ్యాంకులు, ఇతర సంస్థలు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజల్లో కొంత మార్పు వచ్చింది. ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్)వివరాలను అపరిచితులతో షేర్ చేసుకోవడం లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు నయా పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల పేర్లు చెప్పకుండా..ఏకంగా పోలీసుల పేర్లతో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా ‘కార్తీక దీపం ’సీరియల్ నటి ఉషా రాణి సైబర్ నేరగాళ్ల నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ కేటుగాడు డీఎస్పీని అంటూ ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే.. తెలివిగా వ్యవహరించి ఆన్లైన్ మోసానికి చెక్ పెట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ..జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది. వీడియోలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.’నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. అందులో మొత్తం రూ.5 లక్షల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. దానిని మా అబ్బాయి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. వాడు తరచు ప్యాంట్ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు. ఈ సారి కూడా ఎక్కడో పెట్టే ఉంటాడులే అనుకొని బ్లాక్ చేయకుండా వదిలేశా. ఆ కార్డు అమోజాన్కి లింక్ అయి ఉండడంతో నా షాపింగ్కి కూడా ఇబ్బంది కాలేదు. పని జరుగుతుంది కదా అని నేను లైట్ తీసుకున్నాను.కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను. జాగ్రత్తగా ఉండండి.మోసపోకండి’ అని ఉషారాణి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Usha Rani (@usharani_actor) -
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
'కార్తీకదీపం' సీరియల్, 'బిగ్బాస్ 7' షోతో గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేసింది. సోమవారం గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్బాస్ షోలో తనతో పాటు పాల్గొన్న తేజ, ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)కర్ణాటకకు చెందిన శోభాశెట్టి.. కన్నడలో పలు షోలు చేసింది. తెలుగులోకి 'కార్తీకదీపం' సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మోనిత అనే విలన్గా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ చేసింది. గతేడాది బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొన్న ఈమె.. ఫైనల్ వరకు వచ్చింది కానీ విజేత కాలేకపోయింది. మరోవైపు ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి అని పరిచయం చేసింది. వీళ్లకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది.ప్రస్తుతం శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఈ గృహ ప్రవేశానికి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే షోలో పాల్గొన్న తర్వాత వచ్చిన డబ్బులతోనే శోభా ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శోభా కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
'కార్తీకదీపం' కాన్సెప్ట్తో హిందీలో సినిమా? హీరోయిన్గా ఇలియానా
'కార్తీకదీపం'.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీరియల్ ప్రేమికులు అలెర్ట్ అయిపోతారు. ఆ సీరియల్కి ఉన్న క్రేజ్ అలాంటిది. కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. మరీ ముఖ్యంగా ఇందులో నలుపుగా ఉండే వంటలక్క క్యారెక్టర్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్తో హిందీలో సినిమా తీసి రిలీజ్కి రెడీ చేశారు. మనకు తెలిసిన ఇలియానా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'తేరా క్యా హోగా లవ్లీ'. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సేమ్ 'కార్తీకదీపం' సీరియల్లో ఉన్నట్లే ఇందులోనూ హీరోయిన్ నలుపు రంగులో ఉంటుంది. అక్కడ డాక్టర్ బాబు ఉంటే ఇక్కడ పోలీస్ బాబు ఉన్నాడంతే. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) ట్రైలర్ బట్టి చూస్తే.. హీరోయిన్ నలుపుగా ఉంటుంది. దీంతో ఈమెని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లందరూ నో చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఓరోజు ఈమె పెళ్లి చేస్తే ఇవ్వడానికి అని ఉంచిన సామాన్లన్నీ దొంగతనానికి గురవుతాయి. దీంతో దర్యాప్తు కోసం ఓ పోలీస్ వస్తాడు. హీరోయిన్తో ప్రేమలో పడతాడు. చివరకు ఏమైంది? హీరోహీరోయిన్ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ. ట్రైలర్ చూస్తే పైకి ఫన్నీగా అనిపిస్తున్నప్పటికీ.. ఇందులో అందం, వరకట్న లాంటి సామాజిక విషయాల్ని ప్రస్తావించారు. కాకపోతే వీటిని సీరియస్గా కాకుండా సున్నితమైన హాస్యంతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఇలియానా హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టం తెచ్చిపెడుతుందేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) -
'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్
ఈసారి బిగ్బాస్ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో లేడీ విలన్గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు. సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
-
శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
-
'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్బాబు!
తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులు, డాక్యుమెంటరీ, ఓటీటీల్లో ఇతర భాషా చిత్రాలు.. ఇలా ఒకటేమిటి నచ్చాలే గానీ ప్రతిదీ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన సీరియల్స్ లో 'కార్తీకదీపం' ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ సీరియల్ కు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చేశాడు. తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. ఏళ్లకు ఏళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవీ ఉన్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ 'కార్తీకదీపం' మాత్రం అటు ప్రేక్షకుల్ని అలరిస్తూ, టీఆర్పీ రేటింగ్స్ సంపాదించడంలోనూ దాదాపు నాలుగైదేళ్లు సక్సెస్ అయింది. అలాంటిది గతేడాది ఫిబ్రవరిలో దీనికి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కొన్నాళ్లకు తిరిగి మొదలుపెట్టడంతో సంతోషించారు. (ఇదీ చదవండి: దళపతి విజయ్పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!) కానీ కొత్తగా మొదలుపెట్టింది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు దాన్ని ఆపేశారు. సీరియల్ ని అయితే నిలిపేశారు గానీ అందులో ప్రధాన పాత్రలు పోషించిన వంటలక్క, డాక్టర్ బాబు గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం 'రాధకు నీవేరా' సీరియల్ చేస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కార్తీకదీపం 2'పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 'ఇప్పటికీ ఎక్కడకి వెళ్లినా 'కార్తీకదీపం', వంటలక్క గురించి ఎక్కువగా అడుగుతుంటారు. నా పేరు మర్చిపోయి డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. నా విశ్లేషణ ప్రకారం.. ప్రతిఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే 'కార్తీకదీపం' సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది. నా భార్యతో బయటకెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. ఆమెకి(మంజుల) పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుంది' ఈ ఇంటర్వ్యూలోనే 'కార్తీకదీపం 2' ఉంటుందా అనే ప్రశ్న డాక్టర్ బాబుకి ఎదురైంది. దీంతో.. 'నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్నీ కుదిరితే సీజన్ 2 చేయాలి. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటరేమో. కానీ మా ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు' అని సీరియల్ నటుడు నిరూపమ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) -
వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నటీనటులను పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈచిత్రంలో లెజెండరి నటుడు శరత్ కుమార్, నటి ప్రియమణి, కమెడియన్ వెన్నెల కిషో, సంపత్ రాజా వంటి స్టార్ నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి తాజాగా ఇందులో బుల్లితెర క్వీన్, నటి ప్రేమి విశ్వనాథ్(కార్తిక దీపం సీరియల్ ఫేం దీప) కూడా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఓ కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమి విశ్వనాథ్కు సెట్లోకి స్వాగతం పలుకుతూ తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు వెల్కమ్ ఆన్బోర్డ్ అంటూ ప్రేమి విశ్వనాథ్ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. Welcoming the Television Queen and Versatile Actress #PremiVishwanath on board for our #NC22 💫🔥@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens @srkathiir @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/FrsJSeAHQQ — Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022 -
'కార్తీకదీపం' ఫ్యాన్స్కి ఊహించని షాక్ ఇచ్చిన డైరెక్టర్
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసి నాలుగేళ్లుగా దిగ్విజయంగా దూసుకుపోతుంది ఈ సీరియల్. అయితే తాజాగా ఈ సీరియల్ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు డైరెక్టర్. వంటలక్క(దీప), డాక్టర్ బాబు(కార్తీక్)ల కథ విషాదంగా ముగించారు. ఓ రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ చనిపోయినట్లు సీరియల్లో చూపించారు.దీంతో ఇకపై కార్తీకదీపంలో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరు. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ బాబు ఫేం నిరుపమ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కార్తీకదీపం సీరియల్కి గుడ్బై అంటూ సెట్లో చివరి రోజు షూటింగ్ను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లుగా తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశాడు.ఈ విషయం తెలిసి కార్తీక దీపం ఫ్యాన్స్ ఉద్వేగానికి గురవుతున్నారు. సీరియల్లో ట్విస్ట్ ఇవ్వడానికి వంటలక్క, డాక్టర్ బాబును చంపేయడం ఏంట్రా అంటూ డైరెక్టర్పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే సీరియల్ చూడమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీరియల్ హైలెట్ రోల్స్ అయిన వంటలక్క, డాక్టర్ బాబులను చంపేయడంతో ఇకపై కార్తీకదీపం ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నెక్ట్స్ జనరేషన్లో హిమ దీపలా మారుతుందని, మోనిత కొడుకు డాక్టర్ బాబులా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala) -
ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క!
కార్తీకదీపం వంటలక్క ఫేమ్ ఇంటికే పరిమితం కాలేదు. ఇప్పుడు పంట చేల దాకా పాకింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు చేలలో దిష్టి బొమ్మలు పెడతాం. వీటికి బదులు హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టడం ఇటీవలి ట్రెండ్ అయింది. అంతకుమించి అభిమానాన్ని చూపించాడో వ్యక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం గ్రామంలో ఓ రైతు... వేరుశనగ చేనులో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ వంటలక్క దీప ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. ఆ దారి గుండా వెళ్లే వారు ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ రైతు క్రియేటివిటీకి ఆశ్చర్యపోతున్నారు. – అశ్వారావుపేట రూరల్ చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క! -
బిగ్బాస్ షో.. మీరు అనుకుంటున్నట్లు కాదు: ఉమాదేవి
Bigg Boss Telugu 5 Uma Devi Chit Chat With Fans: కార్తిక దీపం సీరియల్కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సీరియల్లో అర్థపావు భాగ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి ఉమాదేవి బిగ్బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడటం, చిన్న విషయానికే గొడవకు దిగడం ఆమెకు పెద్ద మైనస్గా మారాయి. దీంతో రెండో వారంలోనే ఆమె ఇంటి దారి పట్టింది.చదవండి: బిగ్బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే... ఇదిలా ఉండగా, తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చిన ఉమాదేవి..బిగ్బాస్ జర్నీ గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంది. తాను ముక్కుసూటిగా మాట్లాడతానని, అయితే హౌస్మేట్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. రెండో వారంలోనే హౌస్ నుంచి బయటకు రావడం బాధగా ఉందని, అక్కడే ఉంటే ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేసేదాన్ని అని అభిప్రాయపడింది. ఇక బిగ్బాస్ షో అందరూ అనుకుంటున్నట్లు కాదని అసలు స్క్రిప్టు అనేది ఉండదని, చాలా జెన్యూన్ గేమ్ షో అని పేర్కొంది. అవకాశం ఉంటే మరోసారి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తానని వెల్లడించింది. త్వరలోనే అర్థపావు భాగ్యంగా సీరియల్లో కనిపిస్తానని చెప్పింది. 'మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చాడో లేదో తెలియదు. కానీ మా డాక్టర్ బాబు బాగుండాలి. మా దీప బాగుండాలి' అంటూ ఫన్నీగా తెలిపింది. Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా' -
బిగ్బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే..
Bigg Boss Telugu 5 Uma Devi Remuneration: నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న బిగ్బాస్ సీజన్-5 రసవత్తరంగా సాగుతుంది. రెండు వారాల్లోనే కంటెస్టెంట్లు తమ ఉగ్రరూపాన్ని చూపించేస్తున్నారు. నామినేషన్స్ వచ్చేసరికి కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడుతుంది. అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో తమను నామినేట్ చేసిన వ్యక్తులను నోటికి వచ్చినట్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. చదవండి: బిగ్బాస్ షో.. మీరు అనుకుంటున్నట్లు కాదు: ఉమాదేవి ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు కార్తిక దీపం ఫేమ్ ఉమాదేవి. గత వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడేసింది. ఆ బూతులకు బిగ్బాస్ బీప్ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆ వర్గం ఓట్లు బాగా తగ్గిపోయాయి. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకునేలోపు ఆమె రెండోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. లోబోతో కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నా నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడకపోయి ఉంటే మరొకొన్ని రోజులు ఆమె బిగ్బాస్లో కంటిన్యూ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో గయ్యాళి అనే పేరు నుంచి తానెంటో నిరూపించుకుందాం అనుకున్న ఉమాదేవి చివరికి ఆ పేరుతోనే హౌస్ నుంచి బయటకు వెళ్లడం స్వయం కృపరాదం అనొచ్చు. ఇక బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. ఆ లెక్కన రెండు వారాలకు గాను ఆమెకు సుమారు రూ. లక్షా అరవై వేల పారితోషికం అందినట్లు సమాచారం. -
డాక్టర్ బాబు ఆస్తుల చిట్టా, హీరోకు ఏమాత్రం తీసిపోడుగా!
Nirupam Paritala Net Worth: నిరుపమ్ పరిటాల.. ఈ పేరు పెద్దగా తెలుసో లేదో కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు నిరుపమ్. ఈ సీరియల్ ఆ రేంజ్లో క్లిక్ అయింది మరి! అప్పుడప్పుడూ సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. టీఆర్పీ రేటింగ్లను కొల్లగొడుతోన్న ఈ సీరియల్ అందులోని నటీనటులను బుల్లితెర స్టార్లుగా నిలబెట్టింది. ఇదిలా వుంటే తాజాగా డాక్టర్ బాబు ఆస్తుల గురించి ఓ కథనం నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం కార్తీకదీపం సీరియల్ నుంచి ఆయనకు ఒక్కరోజుకు 22 వేల రూపాయల మేర పారితోషికం ముడుతుందట. దీనితోపాటు మరో రెండు సీరియల్స్లో నటిస్తుండగా వాటి రెమ్యునరేషన్ను కలుపుకుంటే నిరుపమ్ రోజూవారీ సంపాదనే రూ.60 వేల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.14 లక్షల పైనే సంపాదిస్తున్నాడట. అతడికి హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో రూ.80 లక్షలు విలువ చేసే ఫ్లాటు ఉండగా, విశాఖపట్నంలో రూ.5 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉందని సమాచారం. అంతేకాకుండా రూ.11 లక్షలు ఖరీదు చేసే రెండు కార్లు కూడా అతడి గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియళ్లలో నటిస్తూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అంటే నటిగా ఆమె కూడా గట్టిగానే సంపాదిస్తోంది. కాబట్టి వీరి ఆస్తుల విలువ ఇక్కడ చెప్పుకున్నదాని కంటే ఎక్కువే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నెటిజన్లు. మొత్తానికి బుల్లితెర కథానాయకుడిగా వెలుగొందుతున్న నిరుపమ్ హీరో రేంజ్లోనే సంపాదిస్తున్నాడని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. -
సినిమాల్లోకి వంటలక్క ఎంట్రీ! మరి డాక్టర్ బాబు పరిస్థితి?
కార్తీకదీపం సీరియల్తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్. వంటలక్కగా తన సహజసిద్ధమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమా అవకాశాలు వచ్చినా కాదనుకున్న ప్రేమీ విశ్వనాథ్ తాజాగా ఓ బడా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి- హీరో రామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. రామ్కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ వంటలక్కను సంప్రదించగా.. కథ నచ్చడంలో ఆమె కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర కోసం వంటలక్కకు మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కార్తీకదీపం సీరియల్తో హీరోయిన్కు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్..ఇక వెండితెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Karthika Deepam: మోనితకు ఊహించని ట్విస్ట్, గీతలు చెరిపేసిన దీప
కార్తీకదీపం జూలై 8వ ఎపిసోడ్: కార్తీక్ సౌందర్య అమెరికా వెళ్లిందని చెప్పగానే మోనిత సాక్షి సంతకాల పెట్టడానికి తప్పించుకోడానికే వెళ్లిందా? అంటుంది. ఇక తను మౌనంగా ఉండే పని కాదని, ఎదోకటి చేయాలంటూ కార్తీక్ వెళ్లిపోమ్మని చెబుతూ కారు ఎక్కబోతుంటే కార్తీక్ ఆమె చెయి పట్టుకుని ఆపుతాడు. ఆ తర్వాత ఇక తాను చేయని తప్పుకు దోషిలా ఉండలేనని, తన ప్రేమయేయం లేకుండా జరిగింది తన తప్పుల జాబితాలో చేరదు అని గట్టిగా అరిచి చెబుతాడు కార్తీక్. అంతేగాక ‘నీ నాపై ప్రేమ, వదిలేస్తాననే భయం లాంటివి కనిపించడం లేదు. కావాల్సిన దాని కోసం ఎంత దూరమైన వెళ్తావన్న బెదిరింపు కనిపిస్తుంది’ అని అనడంతో మోనిత ఆశ్చర్యంగా చూస్తుంది. అలాగే ‘స్నేహం కావాలంటే ముందు వరుసలో ఉంటా. అంతేగాని న్యాయం కావాలంటే అన్యాయానికి తలవంచను. మౌనంగా భరిస్తున్న కదా అని ఈ దోషాన్ని దీప, మా అమ్మకు అంటగట్టాలని చూస్తే అది సహించను. నా తప్పు లేకుండా జరిగిందానికి నేను నైతిక బాధ్యత వహించలేను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత షాక్ అవుతూ ప్రియమణి చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ బాబు అందరిలాంటి మగాడు కాదని, తన భార్య, తల్లి, కుటుంబం జోలికి వస్తే ఊరుకోడని ఆమె అన్న మాటలను తలచుకుని కంగారు పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ హిమ, శౌర్యలకు కొత్త బట్టలు కొనుక్కుని తీసుకువెళతాడు. హిమ, శౌర్యను పిలిచి నాన్న డాడీ మీకు బట్టలు తెచ్చాడని అవి వేసుకోమ్మని చెబుతాడు. పిల్లలు అవి వేసుకోని రాగానే సెల్ఫీ తీసుకుందామని, దీపను కూడా పిలిచి తన భుజంపై చేయి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలతో ఈ ఫొటో మన సెల్ఫోన్ అన్నింటిలో ఆ ఫొటోనే వాల్పేపర్గా ఉండాలని చెబుతాడు. ఆ తర్వాత వారికి తెచ్చిన బట్టలను మీ స్నేహితులకు చూపించుకోమ్మని వెళ్లండని చెప్పి పిల్లలను బయటకు పింపిస్తాడు. ఆ తర్వాత దీపను కుర్చీలో కూర్చోబెట్టి ‘నా ప్రవర్తన నీకు కొత్తగా అనిపించోచ్చు దీప. కానీ ఇన్ని రోజులు నా తప్పు లేకుండానే నేను తప్పు చేసినవాడిలా తలదించుకుని ఉన్నాను. ఇక నుంచి అలా ఉండదు. ఈ 25 తేదీలోపు ఈ సమస్య తప్పకుండా పరిష్కారం దొరుకుంది. నన్ను నమ్ము దీప’ అంటూ ఆమె మీద ఒట్టు వేస్తాడు. తరువాయి భాగం.. ఆదిత్య, దీప దగ్గరికి వచ్చి వదినా అన్నయ్య తప్పు చేశాడో లేదో అది నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటి నీకు చెబుతాను అంటూ దీప విజనగరం వెళ్లినప్పుడు కార్తీక్ను నిలదీసిన విషయం చెబుతాడు. అప్పుడు అన్నయ్య మరోసారి పరీక్షలు చేయించుకుంటానని తనతో అన్నది చెబుతాడు. అంతేగాక అన్నయ్య ల్యాబ్ కూడా వెళ్లాడు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అనగానే ఇందులో ఏమైనా ఉందేమో? ఇప్పుడు మనం ఏం చేద్దాం వదిన అనగానే, ఆదిత్యను ఆ ల్యాబ్కు వెళ్లి కనుక్కొమ్మంటుంది. అంతేగాక గోడ మీద మోనిత గీసిన గీతలను తడి గుడ్డతో చెరిపేస్తుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: అర్జెంటుగా అమెరికా వెళ్లిన సౌందర్య, షాక్లో మోనిత
కార్తీకదీపం జూలై 7వ ఎపిసోడ్: తన సంస్కారం మీద నమ్మకం ఉందని, తను ఏ తప్పు చేయాలేదన్నదే నిజమని, అలాంటప్పుడు తానేందుకు తప్పు చేసినవాడిలా భయపడాలి అంటూ తనని తాను సమాధాన పరుచుకుంటాడు కార్తీక్. అలాగే తన కుటుంబమే ముఖ్యమని, తన పిల్లలు, భార్యతో సంతోషంగా ఉంటానని, అలాగే కొడుకుగా, డాక్టర్గా మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరిస్తానని అనుకుంటాడు. ‘నా తల్లి ముందు సుపుత్రుడిగానే నిలబడాలి. మోనిత ముందు తప్పుచేసిన వాడిలా తలదించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే నా వ్యక్తిత్వాన్ని పొగొట్టుకుంటున్నాను. ఇక ముందు అలా జరగకూడదంటే ఈ కడుపు సంగతేంటో తెల్చుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మరోవైపు మోనిత కార్తీక్ను కలవడానికి రెడీ అవుతూ ఉండగా మధ్యలో ప్రయమణి వచ్చి ఎక్కడికి అక్కడికేనా అని అడుగుతుంది. తెలిసి ఎందుకు అడుగుతావని మోనిత అనగానే ప్రియమణి ‘మీ మంచికే చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఒట్టి మనిషివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు’ అనగానే మోనిత ‘ఏడ్చారులే.. కార్తీక్ తప్పు చేశాడని మా అందాల అత్త నమ్ముతోంది. నా భర్త తప్పులేకపోతే మోనిత ఎందుకు గర్భవతి అవుతుంది మా వంటలక్క అనుకుంటోంది. ఇక ఇప్పుడు వాళ్ల జుట్టు, ఇంటి గుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అంటుంది. దీంతో ప్రియమని అని మీరు అనుకుంటున్నారని మోనితకు షాక్ ఇస్తుంది. ‘దీపమ్మ ఇంటి నుంచి వచ్చేసినా డాక్టర్ బాబు తోకలాగే ఆమె వెనక వచ్చాడు. పోనీ దీపమ్మ ఏం అయిన కార్తీక్ అయ్యాను గెంటెయ్యలేదు కదా.. అటూ తల్లి కూడా కార్తీక్ అయ్యా గురించే బాధపడుతున్నారు తప్ప మీ మీద జాలి చూపించడం లేదు కదా’ అని లాజిక్గా మాట్లాడుతుంది. కార్తీక్ అయ్య కూడా అందరి లాంటి మగాడేనని, ఆయన ఏ మహానుభావుడు కాదంటుంది. ఏదైనా తన దాక రాకపోతే ఆడదానితో ఎంత గౌరవంగానైనా ఉంటాడు. అదే కుటుంబానికి, వంశగౌరవానికీ ముప్పు రాబోతుందని తెలిస్తే మాత్రం దెబ్బకు ప్లేట్ పిరాయిస్తాడు. తప్పు చేశానని కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారని, అందులో కార్తీక్ అయ్యా ఉంటారని తనకు నమ్మకం లేదు అంటుంది ప్రియమణి. కాబట్టి మీకే అన్ని తెలుసు అని ధైర్యంగా ఉండకుండా మీకు న్యాయం ఎలా జరుగుతుందా అని ఆలోచించండని మోనితకు హిత బోధ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ కాల్ చేస్తాడు. అది చూసి మోనిత ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా దీప గోడ మీద ఉన్న గీతల వంకే చూస్తూ మోనిత తనవైపు వెక్కిరింతగా చూస్తున్నట్లు తలుచుకుంటోంది. పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉందో మళ్లీ అదే పరిస్థితి ఎందురైందని, ఇప్పుడు చేయాలని, మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాలా? అయితే పిల్లల పరిస్థితి ఏంటీ? నా డాక్టర్ బాబు సంగతేంటి? ఆ మోనితకు వదిలేయని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది. ఇదిలా ఉండగా కార్తీక్, మోనితలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటుంటారు. చూడు కార్తీక్ నువ్వు నన్ను ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటుంది మోనిత. ‘పదేళ్లు అబద్దాని నిజమని నమ్మి దీపను దూరం పెట్టావు, ఇప్పుడు నిజాన్ని అబద్దమంటూ నన్ను ఎన్నాళ్లు దూరం పెట్టాలనుకుంటున్నావు’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటాడు. దీంతో మోనిత నీ ఫ్రెండ్గ్, శ్రేయోభిలాషిగా, నీ వెల్ విషర్గా చెబుతున్నాను.. నువ్వు మోనితని పెళ్లి చేసుకోవడమే న్యాయం అంటుంది మోనిత. కార్తీక్ మౌనంగా ఉండటంతో మోనిత ప్రేమగా కార్తీక్ భజం మీద చెయ్యి వేసి ఇవన్నీ వద్దని, తను పెళ్లి వాయిదా వేయను అని చెబుతుంది. నువ్వు నన్ను తల్లిని చేశావు, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి పెళ్లి కావాలంటున్నాను, తన బిడ్డకు తండ్రివి నువ్వే అని సమాజానికి చెప్పుకోవడం కోసం పెళ్లి చేసుకుందాం అంటుంది. ధర్మం ఎటు ఉందో నువ్వే ఆలోచించు.. ఇంత మాట్లాడుతున్నా నీలో మార్పు రాకుంటే న్యాయం కోసం మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే కార్తీక్ అమ్మలేదు.. అమెరికా వెళ్లిందని చెబుతాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. అమెరికా ఎందుకు వెళ్లిందనగా తన చెల్లి స్వప్న దగ్గరికి అని చెబుతాడు. దీంతో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మోనిత కంగారు పడుతుంది. తరువాయి భాగం.. కార్తీక్ అనుకున్నట్లు గానే పిల్లలతో సంతోషంగా ఉంటాడు. పిల్లలకు బహుమతులు కొనితెచ్చిస్తాడు. సరదాగా వాళ్లతో మాట్లాడం చూసి దీప ఏంటి ఈ సడెన్ మార్పు అని ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ సెల్ఫీ తీస్తుండగా ఇందులో ఒకరూ మిస్సయ్యారు, నిన్నే దీప నువ్వు కూడా ఉంటే బాగుంటుందంటూ దీపను రాగానే భుజం మీద చేయ్యి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలు బయటకు వెళ్లగానే ‘ఈ నెల 25వ తేదీలోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను నీవాడిని దీప నన్ను నమ్ము. ఇది నాటకం కాదు అని దీప తలపై చెయి పెడతాడు’ కార్తీక్. -
దీపతో మోనిత కండీషన్ గురించి చెప్పి ఎమోషనలైన కార్తీక్
కార్తీకదీపం జూలై 5ఎపిసోడ్: మోనిత వీడియో కాల్ చేసి కార్తీక్ పెళ్లి చీరలు ఎలా ఉన్నాయో నిన్ను అడగమంది అనడంతో దీప రగిలిపోతుంది. ఎంటీదని సౌందర్యను దీప ప్రశ్నిస్తుంది. దీంతో సౌందర్య ఆ మోనిత కావాలనే నిన్ను రెచ్చగోట్టాలని కాల్ చేసి వాడిని ఇరికించిందని నా మనసు చెబుతుంది అంటుంది. అంతేగాక వాడు నిజంగా తప్పు చేశాడంటే తను నమ్మలేకపోతున్నానని, ఇందులో ఏదో తెలియని గూడుపుఠాని ఉందని నా మనసు చెబుతుంది దీప, ఒకసారి మనసుతో ఆలోచించు నువ్వు అంటూ తనతో చివరి వరకు కలిసి పోరాడటానికి సాటి స్త్రీగా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ దీపకు భరోసా ఇచ్చి వెళ్లిపోతుంది సౌందర్య. ఇక కార్తీక్.. మోనిత దీపకు కాల్ చేసి ఇరికించిన సంఘటననే గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుచకుంటూ వస్తాడు. అటు వైపే వెళుతున్న సౌందర్య కార్తీక్ను చూసి కారు ఆపుతుంది. కార్తీక్కు ఎదురుగా వెళ్లి ఏమైందరా అని అడగ్గా నా బతుకులాగే కారు కూడా పాడైందని సమాధానం ఇస్తాడు. దీంతో ఆ మోనిత దగ్గరి నుంచే వస్తున్నావా? అని సౌందర్య ప్రశ్నించడంతో నీకేలా తెలుసంటూ ఆశ్చర్యంగా చూస్తాడు కార్తీక్. అప్పుడు కాల్ చేసినప్పుడ దీప పక్కనే ఉన్నానని మరిచిపోయావా? అంటుంది. అవునంటూనే మునిగిపోయాను మమ్మీ సుడిగుండంలో ఊపిరి ఆడనడల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు కార్తీక్. కార్తీక్ నుంచి ఆ మాటలు విని సౌందర్య తట్టుకోలేకపోతుంది. జాలిగా పెద్దోడా అంటూ పెళ్లి బట్టల గురించి ఆరా తీస్తుంది. టైం దగ్గర పడుతోందని కార్తీక్ అనగానే స్నేహానికి పరిమితులు ఉంటాయిరా అని అప్పడే చెప్పాను నువ్వు వినలేదని కార్తీక్ను మందలిస్తుంది. అలాగే జరిగిన దాని గురించి ఏం చేయలేమని, జరగబోయేదంటీ? ఆ పెళ్లి, ముహుర్తం సంగతేంటని సౌందర్య కార్తీక్ను ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ ఏదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతోంది మమ్మీ.. నమ్మండని.. తను నటించడం లేదు అంటూ భావోద్వేగానికి లోనవుతాడు. ‘నేను మనసులో ఏం అనుకుంటున్నానో అదే చెబుతున్నాను మమ్మీ. నా తప్పు లేకుండానే బాధ్యున్ని అయ్యాను. దీపకు గుడి కట్టి దేవతలా చూసుకోవాలనుకున్నాను. కానీ తన ఆశలకి నేను సమాధి కట్టాను. ఇది పాపమా.. శపమా అర్థం కావడం లేదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. సౌందర్య అలా బాధగా చూస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా భాగ్యం ఇంటికి వెళ్లిన హిమ, శౌర్య అమ్మనాన్న ఎందుకు మాట్లాడుకోవడం లేదని భాగ్యాన్ని అడుగుతారు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిని త్వరలోనే కలుస్తారంటూ పిల్లలకు సర్థిచెబుతుంది. మరోవైపు దీప మోనిత వీడియో చేసి చీరలు చూపించిన సీన్ గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దీప ముందు నిలబడతాడు. జరిగినదానికి క్షమాపణలు కోరుతూ పెళ్లి బట్టలు తను కొనలేదని చెబుతాడు. దీంతో ఆ మోనిత సంగతి తనకు తెలుసని, మీరే ఏంటన్నది తనకు అర్థం కావడం లేదంటూ పెళ్లి డేటు, రిజిస్టర్ మ్యారేజ్పై నిలదీస్తుంది. తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. అది విని కార్తీక్ షాక్ అవుతాడు. తడబడుతూనే ఏది తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుందంటూ బాధపడుతుంటాడు. దీంతో దీప కోపంగా చూస్తూ అంత కీలు బొమ్మల ఎలా మారిపోయారంటుంది. 25 తారిఖున పెళ్లి అంటున్నారు దాని మాటేంటి అనగానే కార్తీక్ నాకు ‘నా భార్య పిల్లలె ముఖ్యం’ అంటాడు. దీంతో మరీ మోనిత ఒక్కతే వెళ్లి తాళి, పూల దండ వేసుకుని వస్తుందా అని అని చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయానని, మోనితను ఫ్రెండ్లాగే చూశాను కానీ తను నాకు నరకం చూపిస్తుందంటాడు. నువ్వు అన్నట్లుగా నన్ను కీలు బోమ్మను చేసి ఆడుకుంటోందని, ఫోన్ ఎత్తకపోతే బెదిరింపులు, కలవకపోతే హెచ్చరికలు, తనతో కలిసి బయటకు వెళ్లకపోతే సాధింపలు పదే పదే తప్పును అడ్డం పెట్టుకుని నన్ను మరబోమ్మలా మార్చేసింది దీప దగ్గర విలపించుకుంటాడు కార్తీక్. అంతేగాక ఈ పెళ్లికి నిన్ను, అమ్మను తీసుకువెళ్లి సాక్షి సంతకం పెట్టించమని కండీషన్ కూడా పెట్టిందని దీపతో చెప్పడంతో షాక్ అవుతుంది. ఇలా వారి మధ్య వాదన జరుగుతుండా హిమ, శౌర్యలు వస్తారు. వారు రాగానే కార్తీక్ తల దించుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
మరో సీరియల్ కోసం గెటప్ మార్చిన వంటలక్క, స్టైలిష్ లుక్తో..
కార్తీకదీపం ఫేం దీప(ప్రేమి విశ్వానాథ్) తెలుగు బుల్లితెర ప్రేక్షకులుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంటలక్కగా పాపులర్ అయిన ఆమె చీరకట్టులో అనుకువ, సహనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కార్తీకదీపం ట్వీస్ట్లతో సాగుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్, మోనితల రిజిస్టర్ మ్యారేజ్ గురించి ఉత్కంఠం సాగుతున్న ఈ సీరియల్ను డైరెక్టర్ ఎలా మలుపు తిప్పబోతున్నాడనేది ఎవరి ఊహాకు అందడం లేదు. దీంతో కొంతమంది ‘కార్తీక్, మోనిత పెళ్లి అయిపోతుంది, ఆ తర్వాత వంటలక్క వెళ్లిపోతుంది.. వెంటనే కార్తీకదీపంకు శభం కార్డు’ అంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రేమి విశ్వనాథ్ నటిగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఆమె ఇంతవరకు వేరే సీరియల్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ మాలయాళ సీరియల్కు సంతకం చేసింది. ప్రేమి లీడ్ రోల్లో దేవికా అనే సీరియల్ ప్రాసారం కాబోతుంది. ఈ సీరియల్కు సంబంధించిన ప్రోమోను ఆమె తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ఇందులో వంటలక్క సరికొత్త లుక్లో దర్శనం ఇచ్చింది. మోడ్రన్ డ్రెస్లో స్టైలిష్ లుక్తో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సీరియల్ పేరు దేవికా అని, సోమవరం (జూలై 5) నుంచి రాత్రి 8 గంటలకు సూర్య టీవీ ప్రసారం అవుతున్నట్లు ఈ ప్రమోలో ప్రేమి వెల్లడించింది. కార్తీకదీపంలో చాలా పద్దతిగా, సంప్రదాయం ఉన్న వంటలక్కను ఇలా చూసి ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే ప్రేమి విశ్వనాథ్లో ఇందులో పోగరు ఉన్న సంపన్నురాలిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు బాష అర్థంకాకపోయిన వంటలక్క కోసం సీరియల్ చూసేందుకు అసక్తిచూపుతున్నారట. -
'కార్తీకదీపం' ఫేం హిమ ఇంటికి ఈటల రాజేందర్.. ఫోటో వైరల్
బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. టీఆర్పీ రేటింగ్ విషయంలో ఇంతవరకు ఏ సీరియల్ కానీ, షోలు కానీ ‘కార్తీక దీపం’ని అందుకోలేకపోయాయంటే ఈ సీరియల్కి ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ సిరియల్పై ఫన్నీ మీమ్స్ వస్తుంటాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్' కొత్త పోస్టర్ను సైతం 'కార్తీకదీపం' స్టైల్ లోకి మార్చి మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ సీరియల్ మాత్రమే కాదు.. అందులో నటీనటులు కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టులు సహృద(హిమ), కృతిక(శౌర్య) నుంచి నిరుపమ్(డాక్టర్ బాబు)వరకు అందరికి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా సహృద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా హిమ అలియాస్ సహృద షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ ఇంటికి వచ్చారని చెబుతూ.. ఆయనతో దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది సహృద. అయితే ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. దీంతో మాజీ మంత్రి ఈటల మీ ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Sahrudafruity (@sahrudafruity) -
Karthika Deepam: కార్తీక్, మోనితల పెళ్లిపై సౌందర్యను నిలదీసిన దీప
కార్తీకదీపం జూలై 2: కార్తీక్, మోనితల పెళ్లి విషయం తెలుసుకున్న దీప తండ్రి మురళీ కృష్ణ సౌందర్య దగ్గరికి వస్తాడు. ఈ విషయంపై సౌందర్యను నిలదీయడంతో ఆమె మౌనంగా ఉండిపోతుంది. చెయ్యని తప్పుకు నా బిడ్డ పదేళ్లు శిక్ష అనుభవించింది.. ఇప్పుడు కూడా ఏం చెయ్యారా మీరు? అని ప్రశ్నిస్తాడు. దీనిపై సౌందర్యతో వాదించి చివరకు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లగానే సౌందర్య ‘ఓ కన్నతండ్రిగా ఆయన అడిగిన ఏ ప్రశ్నలకే నా దాగ్గర సమాధానం లేదు. మరీ ఇవే ప్రశ్నలు దీప అడిగితే, ఈ పెళ్లి విషయం గురించి తనకు తెలిస్తే ఏంటి పరిస్థితి’ అంటూ మనసులోనే మదనపడుతుంది. ఇదిలా ఉండగా పిల్లలతో కలిసి కార్తీక్ భోజనం చేస్తుంటే దీప వడ్డిస్తుంది. హిమ మాట్లాడుతూ మధ్యలో డాడీ మనం బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా అని అంటుంది. దీంతో వెంటనే శౌర్య కూడా అవునవును.. మనం నలుగురం కలిసి బయటికి వెళ్దాం.. చాలా బాగుంటుందని అంటుంది. అలాగే దీపతో అమ్మా నువ్వు కూడా వస్తావు కదా అని అడగ్గానే ఎందుకు రాను.. తప్పకుండా వస్తాను అంటుంది. అందరం కలిసి బయటి వెళదామని అనగానే కార్తీక్, పిల్లలు సంతోషిస్తారు. అలాగే తనకు కొన్ని పనులు ఉన్నాయని, ఈ నెల 25 తేదీన మనం నలుగురం కలిసి బయటికి వెళ్దామని, ఆ రోజు డాడీని ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పండి అనగా కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి దీపకు నిజం తెలిసిందా అని కంగారు పడుతాడు కార్తీక్. ఇదిలా ఉండగా మోనిత ఉదయం లేవగానే పొట్టపై చెయి పెట్టుకుని గుడ్ మార్నింగ్ బంగారం అంటూ మురిసిపోతుంది. 16 ఏళ్లు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. కానీ నువ్వు కడుపులో పడిన మూడు నెలలకే ఈ తల్లి పెళ్లి చేస్తున్నావు. నువ్వు గ్రేట్ బేటా అంటూ సంబరపడిపోతుంది మోనిత. మరోవైపు సౌందర్య దీప ఇంటికి వస్తుంది. మురళీ కృష్ణ దీపకు పెళ్లి విషయం చెప్పేసి ఉంటాడా? అని భయపడుతూనే లోపలికి వెళ్లేసరికి దీప గుమ్మం దగ్గరే ఎదురు పడుతుంది. రండి అత్తయ్యా అంటూ దీప అతి మార్యాదు చేయడం చూసి సౌందర్య అనుమాన పడుతుంది. ఆ తర్వాత దీప మోనిత, కార్తీక్ల పెళ్లి విషయం గురించి తనకు ఎందుకు చెప్పలేదని దీప సౌందర్యను నిలదీస్తుంది. చివరకు తనలాగే తన పిల్లలకు కూడా సవతి తల్లి పెంపకం రాసినట్లున్నాడు ఆ దేవుడు కానీ దీప బతికి ఉండగా.. నా పిల్లలకు ఎలాంటి చీడపట్టనివ్వను అని ఆవేశంగా అంటుంది. అంతేగాక ఇన్నాళ్లు తను పడ్డ కష్టాల గురించి మాట్లాడుతుంది. ‘కొన్నేళ్ల పాటు దారుణమైన నిందను మోశాను. అది చెరిగిందో లేదో తెలియదు కానీ మళ్లీ జీవితాంతం అనుభవించడానికి దారుణమైన పరిస్థితి వచ్చింది. నా మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. నా భర్త తప్పు చేశాను తప్పు చేశాను అంటే.. దేవుడు లాంటి మనిషి తప్పు చెయ్యడం ఏంటీ అనుకున్నాను.. ఏదో చెబుతారు ఏదో చెబుతారు అనుకుంటే మోనితోచ్చి కడుపు వచ్చింది అని చెప్పింది. లోపల నా గుండె రగిలిపోతుంది, కడుపు మండుతుంది అత్తయ్యా.. నేను సగటు స్త్రీనే కదా’ అంటూ సౌందర్యతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది దీప. దీంతో సౌందర్య బాధగా దీపా నేనే కాదు.. ఈ విషయం వాడు నీతో చెప్పలేక నలిగిపోతున్నాడే అంటుంది. కానీ దీప మాత్రం అవును, పాపం నిజంగానే నలిగిపోతూనే నిసహాయంగా చూస్తూనే.. దానితో కలిసి 25 తేదీ రిజిస్టర్ ఆఫీస్లో ముహూర్తం నిర్ణయించుకుని వచ్చారు అని వెటకారంగా అంటుంది. ఇంతలో కార్తీక్ కంగారుగా బయటకు వెళతాడు. ఎక్కడికి అని అడిగిన అర్జేంట్ పనుందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: నిజం తెలుసుకున్న దీప, కోపంతో రగిలిపోతున్న మోనిత..
కార్తీకదీపం జూలై 1వ ఎపిసోడ్: కార్తీక్ మనసు బాగాలేక సౌందర్య దగ్గరికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోనిత తన దగ్గరికి వచ్చి వెళ్లిన విషయం సౌందర్య కార్తీక్తో చెబుతుంది. అంతేగాక ఆశీర్వదించండి అంటూ కాబోయే అత్త దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్లిందని కార్తీక్, మోనితకు రిజిస్టర్ మ్యారేజ్ అనే విషయం తనకు తెలిసిందని కార్తీక్ స్పష్టం చేస్తుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలని ధీనంగా అడగ్గా ఏం చేసిన దీప, పిల్లలు, తల్లిదండ్రులైన తమకు, మోనితకు జావాబుదారిగా ఉండాలని అంటుంది సౌందర్య. దీంతో కార్తీక్ తనకే ఎందుకు ఇలా జరుగుతుందని అనగానే ‘నువ్వు చేసిన పాపమే’ అంటుంది సౌందర్య. ‘నా కోడలు ఏ తప్పు చేయకపోయిన పదేళ్లు అనుమానించి తనని బాధపెట్టావు, నీ కన్న బిడ్డే నిన్ను నాన్న అని పిలవడానికి సంకోచించేల చేశావు. ఇన్నాళ్ల దాని ఏడుపే నీకు శాపంగా మారింది’ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయలేను మై డియర్ స్టుపిడ్ సన్ అంటూ సౌందర్య కార్తీక్కు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే కార్తీక్కు తల తిరిగినట్టు అయ్యి అక్కడే కూలబడతాడు. మరోవైపు నిజం తెలుకున్న భాగ్యం దీపకు వచ్చి చెప్పేస్తుంది. దీపతో నీ తలరాత ఇలా ఉందేంటే, నీకు జీవితాంతం కష్టాలు తప్పవా? అంటూ మోనిత, కార్తీక్లకు 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అనే విషయం చెబుతుంది. అది విని షాక్ అయిన దీప ఇదేలా సాధ్యమని, దీనికి డాక్టర్ బాబు ఒప్పుకున్నారా? అని అనుమానంగా ప్రశ్నించగా మోనిత రసీదు కూడా చూపించిందని ఏడుస్తూ చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ రోడ్డు పక్కన కారు ఆపి ‘ఈ పెళ్లి ఎలా ఆపాలి. దీపకు ఈ విషయం తెలియకముందే ఇది జరగాలి. అది మోనిత చెప్పినట్లు వింటేనే సాధ్యం అవుతుంది. కానీ మోనిత వినే పరిస్థితిలో లేదు. నా జీవితం ఇలా అయిపోయిందేంటీ? ఇంకా ఈ నరకం ఎంతకాలం’ అంటూ కార్తీక్ మదనపడుతుంటాడు. మరోవైపు నిజం తెలుసుకున్న దీప కలవరపడుతూ ఉంటుంది. ‘డాక్టర్ బాబుకు, మోనితకు పెళ్లి జరిగితే, నా పిల్లల భవిష్యత్తు, నా సంసారం, నేను ఏం కావాలి’ అని తలచుకుంటూ బాధపడిపోతుంది. ఈ నిజం తనతో ఎందుకు చెప్పలేదని, ఎవరో బయటి వాళ్లు వచ్చి చెబితే కానీ తెలియలేదు అని ఆలోచిస్తుంది. మోనిత అంటే చెప్పదు పెళ్లి ఆపేస్తానని, మరీ డాక్టర్ బాబు ఎందుకు చెప్పలేదు ఆపకూడదనా? అని అనుకుంటూ మరీ అత్తయ్యా ఎందుకు చెప్పలేదు, చెప్పాలకున్న చెప్పలేకపోయారా? ఎప్పుడు నాకు తల్లిలా తోడు ఉండే ఆమె ఈ సారి కొడుకు నిస్సహయత చూసి ఆమెలోని తల్లి మనుసు చలించి కొడుకు వైపు మళ్లిందా? అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా మోనిత అద్దంలో చూసుకుంటూ ‘నా భార్య దీప గుడి కట్టాలి’ అని కార్తీక్ అన్న మాటాలను తలచుకుని రగిలిపోతుంది. అక్కడే ఉన్న పూల ప్లాస్క్తో అద్దాన్ని పగలగోడుతుంది. ఆ శబ్థం అక్కడికి వచ్చిన ప్రియమణి మోనిత సీరియస్గా ఉండటం చూసి భయపడుతుంది. ఏమైందని భయంతోనే అడుగుతుంది. ఇంతలో కాస్తా కూల్ అయిన మోనిత ఇంటి, వంటి పనితోనే కాదు అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇదంతా క్లీన్ చేయి అని మెల్లిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక దీప పిల్లలకు భోజనం పెడుతుండా నాన్న వచ్చాక తింటామని చెబుతారు. దీంతో దీప నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మీరు తినేయండి చెప్పిన వినకుండా లేట్ అయిన వేయిట్ చేస్తామంటూ మారాం చేస్తారు. ఏ పని మీద వెళ్లారో తెలియదు కదా ఎందుకు వేయిట్ చేయడం అనేలోపే కార్తీక్ వచ్చేస్తాడు. కార్తీక్ రాగానే తోందరగా ఫ్రెష్ అయి వస్తే కలిసి తిందాం డాడీ అని హిమ, శౌర్య అడగ్గా సరే అని వెళతాడు. దీంతో పిల్లలు నాన్న చల్ల నీళ్లతో స్నానం చేయడని చెప్పావు కదమ్మా మరేందుకు డాడీకి వేడి నీళ్లు పెట్టలేదని హిమ అడుగుతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు కదా అందుకే పెట్టలేదని దీప అనడంతో మరీ ఇప్పుడు వెళ్లి పెట్టు అనగానే అది విన్న కార్తీక్ వద్దని సమాధానం ఇస్తాడు. -
ఆర్ఆర్ఆర్ పోస్టర్పై ‘డాక్టర్ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ (రౌధ్రం రణం రుధిరం) చిత్రం నుంచి మంగళవారం ఓ కొత్త పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ బండి నడుపుతుంటే.. రామ్ చరణ్ వెనకాల కూర్చొని చిరనవ్వులు చిందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పోస్టర్పై ఇప్పటికే రకరకాల మీమ్స్ వస్తున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్లకు హెల్మెట్ పెట్టి.. ఈ పోస్టర్ని ప్రమోషన్ కోసం వాడేశాడు. దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. మీరు పెట్టిన కాప్షన్ పర్ఫెక్ట్గా లేదు. బండికి నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ ట్రాఫిక్ పోలీసులు ట్విట్కి రిప్లై ఇచ్చింది. ఇక నెట్టింట ఏది వైరల్ అయినా.. కార్తీకదీపం సీరియల్తో ముడిపెట్టే నెటిజన్స్.. ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ని‘డాక్టర్ బాబు’కోసం వాడేశారు. డాక్టర్ బాబు బుల్లెట్ తోలుతుంటే.. వెనుక దీపతోపాటు మోనిత కూడా కూర్చుని ఉన్నట్టుగా మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ పరిటాల కూడా స్పందించాడు. ఈ మీమ్ని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఇలాంటి పోస్టర్ని ఎలా చేసార్రా బాబూ.. నాకు ఈ ఘోరానికి ఎలాంటి సంబంధం లేదు’ అని కామెంట్ పెట్టాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల భారీ మల్టీస్టారర్ చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. చదవండి: 'ఆర్ఆర్ఆర్' పోస్టర్ను మార్ఫింగ్ చేసిన డేవిడ్ భాయ్.. తారక్గా కేన్ మామ ఆర్ఆర్ఆర్ పోస్టర్పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై -
మోనితకు పిండివంటలు చేసి తీసుకెళ్లిన భాగ్యం
కార్తీకదీపం జూన్ 30 ఎపిసోడ్: ప్రియమణి కంగారుగా మోనితకు ఫోన్ చేస్తుంటే. అప్పటికే ఇంటికి చేరుకున్నమోనిత..వస్తున్నానని చెప్పాను కదే, మళ్లీ మళ్లీ చేస్తావేంటి అని విసుగ్గా అంటుంది. దీంతో ప్రయమణి వచ్చినావిడకి ఏం ఇవ్వమంటారని ఫోన్ చేశానమ్మా అంటుంది. ఎవరు వచ్చారు కార్తీక వాళ్ల అమ్మా.. అనగానే ఆవిడ నాకు తెలుసు కదమ్మా ఈవిడను నేను ఎప్పుడు చూడలేదు అని సమాధానం ఇస్తుంది. దీంతో ఎవరబ్బా నాకు చుట్టాలు ఎవరూ కూడా లేరు కదా ఎవరో చూద్దాం పదా అని లోపలికి వెళ్తారు ఇద్దరు. వెళ్లగానే లోపల భాగ్యం ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చిందాని అనుమానంగా చూస్తుంది. మోనితను చూసి భాగ్యం రారా మోనిత ఏమైన తిన్నావా? అసలే వట్టి మనిషివి కాదు ఎదోకటి తినాలి ఖాళీ కడుపుతో ఉండద్దు అని వెటకారంగా అంటుంది. మంచినీళ్లు తాగుతావని మోనితకు మర్యాదలు చేస్తుంటే ‘హాలో ఇది నా ఇల్లు’ అంటుంది మోనిత, దీంతో ఓహో నీ ఇల్లు అయితే మర్యాద చేయకూడదా? అని వెటకారంగా అంటుంది. వెంటనే ఈ ఇళ్లు ఎవరిది నీదేనా, డాక్టర్ బాబు కొనిచ్చాడా? అని అడుగుతుంది. తన డబ్బుతోనే కొనుక్కున్నానంటూ అసహనం చూపిస్తుంది మోనిత. అవునా... ఇప్పటి దాక డాక్టర్ బాబు నుంచి శాంతం లాగేశావ్ అనుకుంటున్నారంతా అంటూ భాగ్యం మోనితకు చురకలు అట్టిస్తుంది. సరేలే.. ఉత్తమనిషివి కాదని ఉత్తి పుట్టిళ్లు క్రియేట్ చేసి నీకు సున్నుండలు, మైసూరు పాక్, రవ్వలడ్డూలు తెచ్చాను అంటుంది. దీంతో ప్రియమణి ఎవరమ్మా మీ పిన్నిగారా? అని అడగ్గానే మోనిత కాదు దీప పిన్ని అని చెప్పతుంది. దీంతో ప్రియమణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత మోనితతో ఎలాగు నీ డబ్బుతోనే ఇళ్లు కొనుక్కున్న అన్నావుగా నీకు పుట్టబోయే బిడ్డను కూడా నువ్వే పెంచుకోమని, కావాంటే డాక్టర్ బాబు చదివిస్తాడని మోనితకు సలహా ఇస్తుంది భాగ్యం. నా అల్లుడు అందులో బంగారం నువ్వే చూశావుగా శౌర్య ఎవరో తెలియకుండానే చదివించాడు, ఇక సొంత బిడ్డ అని తెలిసి చదివించకుండా ఉంటాడా? అంటుంది. అలాగే కార్తీక్కు దూరంగా ఉంటూ తన మానని తనని బతకమని చెప్పడంతో మోనిత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. భాగ్యం తెచ్చిన రవ్వలడ్డూలు తెప్పించి అవి తింటుంది. అందులో చక్కర తక్కువగా ఉందని భాగ్యం స్టైల్ చెబుతుంది మోనిత. సరేలే తను చెప్పే గుడ్ న్యూస్ వింటే చాలా స్వీట్ ఉంటుందంటూ కార్తీక్కు తనకు పెళ్లని, ఈ నెల 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో అని చెప్పి రసీదు చూపిస్తుంది మోనిత. దీంతో భాగ్యం షాక్ అయ్యి ఏడుస్తూ దీపకు అన్యాయం జరుగుతుంది అంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీప కార్తీక్ను భోజనానకి పిలవడానిక వెళుతుంది. కార్తీక్ తనకు ఆకలిగా లేదని, మీ ముగ్గురు తినేయండి అంటూ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెబుతాడు. ఎక్కడికి వెళుతున్నారని లేను అడగలేదే అని దీప వెటకారంగా అంటుంది. దీంతో కార్తీక్ నువ్వు ఏం అనుకున్న నేను మాత్రం మా అమ్మ దగ్గరికే వెళుతున్నానని, పిల్లలు అడిగితే అర్జెంట్ సర్జరీ ఉంటే వెళ్లానని చెప్పమంటాడు. దీప తను అబద్దం చెప్పలేను అనగాను నీకు ఎలా వీలైయితే అలా చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీప ఇంతలా మదనపడుత్ను వ్యక్తి ఆ తప్పు ఎలా చేశాడు అంటూ దీప ఆలోచనలో పడుతుంది. కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్లి దోషిలా నిలబడతాడు. సౌందర్య దేశోద్దారకుడు, సుపుత్రుడు ఎక్కడ ఆ బిరుదులు, ఏ ఇంటి వాకిట్లో తాకట్టు పెట్టివచ్చావు అంటూ కార్తీక్కు చివాట్లు పెడుతుంది. అలాగే మోనత, కార్తీక్ పెళ్లి అనే విషయం కూడా తీయడంతో ఎలా తెలుసని కార్తీక్ ఆశ్చర్యపోతూ అడుగుతాడు. మోనిత వచ్చి, వెళ్లిన విషయం చెబుతుంది. ఏం చేయాలి అని సౌందర్యను కార్తీక్ సలహా అడగ్గా.. ఏం చేసిన జవాబుదారిగా ఉండాలని చెబుతుంది. దీపకు, పిల్లలకు, తమకు మోనితకు జవాబుదారిగా ఉండాలని కార్తీక్ను హెచ్చరిస్తుంది. -
25వ తేదీన ఏం చేయబోతుందో సౌందర్యకు వివరించిన మోనిత
కార్తీకదీపం జూన్ 25 ఎపీసోడ్: కార్తీక్, దీపలు కూర్చుని మాట్లాడుకునే సీన్తో నిన్నటి ఎపిసోడ్ ముగిసన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్ అదే సీన్తో ప్రారంభమవుతుంది. దీప మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నేను చేయని తప్పుకు ఎన్నో అనరాని మాటలు పడ్డాను. ఇప్పుడు అలాంటి మాటలు మిమ్మల్ని అనలేను. అలాగే ఇంకేవరు అన్న వినలేను. మీకు నాకు అదే తేడా. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంట దీప ఎందుకు స్పందించడం లేదో’ అని అంటుంది. ఆ తర్వాత మీ భార్యగా మీకు ఏ విధంగా సాయపడగలను? నాకు నేను సర్దిచెప్పుకోవాలా? లేక నా తలరాత ఇంతేనని రాజీ పడాలా? అని కార్తీక్ని ప్రశ్నస్తుంది. దీంతో కార్తీక్ నువ్వు నువ్వుగానే ఉండని, తనని నమ్ము అంటాడు. నా మీద కోపంగా ఉంటే తిట్టు.. ఇంకా కసి తీరకపోతే చెంప పగలగొట్టు దీప అంటుండగా దీప అలా మాట్లాడకు అన్నట్లుగా రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ ‘నేను తప్పు చేయలేదు అనట్లేదు.. కానీ ఆ తప్పు నా ప్రమేయం లేకుండా జరిగిందని నమ్ము. ఇదంతా నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పడంలేదు దీప’ అంటాడు. దీంతో ఇప్పడే నా ప్రమేయం లేకుండ జరిగిందని చెబుతూనే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదంటున్నారే అని ప్రశ్నించింది. ‘అవును మళ్లీ మళ్లీ అదే చెబుతాను ఎందుకంటే అదే నిజం కాబట్టి. కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండోద్దని వేడుకుంటాడు కార్తీక్. మరోవైపు మోనిత సౌందర్య ఇంటికి వెళ్లి తనకు న్యాయం చేమని అడగ్గా ‘నా కొడుకు నాకో విషయం చెప్పాడు’ అని చెప్పి మోనితలో కంగారు పుట్టిస్తుంది సౌందర్య. ఇక శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్ తెప్పిస్తుంది. అది తాగిన మోనిత టెన్షన్గా ఇప్పటికైనా చెప్పండి ఆంటీ.. కార్తీక్ మీతో ఏం చెప్పాడని నిళ్లు నములుతూ అడుగుతుది. వెంటనే సౌందర్య నీకు తెలిసి తెలియనట్లు నటించడకు మోనితా.. వాడు చెప్పింది నిజమని నా మనసు చెబుతోంది అంటూ కార్తీక్ సౌందర్యతో ‘నేనుఆ తప్పు చేశానంటే నమ్మలేకపోతున్న మమ్మీ. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు’ అని అన్నాడని అంటుంది. ఆ తర్వాత మోనితతో.. ఇంకా వివరంగా ఇంకా లోతుగా దీనిపై చర్చించగలను కాకపోతే నువ్వే ఒక గైనకాలజిస్ట్వి కాబట్టి అంత వివరంగా చెప్పాల్సిన పనిలేదు.. అయినా ఇప్పుడు నువ్వు కన్నెపిల్లవి కాదంటే.. దానికి కారణం మా వాడికి తెలియదు అంటే.. అయినా సరే వాడేనని నువ్వు అంటే.. మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందని అని సౌందర్య అనడంతో మోనిత అయోమయంగా చూస్తుంది. అంతేగాక ఈ తప్పు గురించి తప్పుడు సమాచారం క్రియేట్ చేశావా? అని, తప్పటడుగు వెనుక తప్పని సరైన కారణం కనిపెట్టావా? అని నిలదీస్తుంది. అలాగే పూజ రోజు నువ్వు దీప ముందే ఈ విషయం బయటపెట్టగానే.. వాడు తలదించుకోలేదు సరికదా.. నీకే చివాట్లు పెట్టాడు.. ఆ నిజాయితీ వాడి కళ్లల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాను అని సౌందర్య ప్రశ్నలతో కడిగిపారేసే సరికి మోనిత షాక్ అవుతుంది. అయితే మోనిత కాసేపటికి తేలుకుని ఏ పరిస్థితుల్లో ఇలా జరిగిందో మీకు తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అయినా క్రియేట్ చెయ్యడానికి నేనేం పురాణకాలనాటి స్త్రీని కాదు..ఇది నిజం.. దీన్ని నిరూపించుకోవడానికి ఏ వేదిక కావాలంటే ఆ వేదికను ఆశ్రయించొచ్చు అని సవాలు చేస్తుంది. దీప విషయంలో మీ కొడుకుని నమ్మని మీరు నా విషయంలో మీ కొడుకునే నమ్ముతున్నారా? ఇంతకాలం మీరు చాలా ఫర్ఫెక్ట్ అనుకున్నాను.. నాకు సపోర్ట్ చేసి మొదటి వ్యక్తి మీరే అవుతారు అనుకున్నాను.. కానీ మీరు సగటు తల్లిగా మారిపోయారు.. మీ కొడుకుతో కలిసి నాకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక నా జీవితం గురించి ఎవరితోనూ సలహాలు తీసుకోదలుచుకోలేదు. నిజం నా కడుపులో ఉంది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను.. ఈ నెల 25 తారీఖున కార్తీక్తో నా పెళ్లికి స్లాట్ రిజిస్టర్ చేసుకోబోతున్నాననంటూ సౌందర్యకు షాక్ ఇస్తుంది. అయితే ఏ ఊరికో వెళ్లి తల దాచుకోమనే చవకబారు సలహాలు ఇవ్వద్దని మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను.. అదే జరిగితే.. పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి.. గుర్తుపెట్టుకోండి ఆంటీ అంటూ హెచ్చరిస్తుంది. అలాగే 25 తేదీన మీ కొడుక్కి నాకు పెళ్లి.. నన్ను ఆశీర్వదించండి అత్తయ్యగారు అంటూ సౌందర్య కాళ్లకు దండం పెట్టుకుంటూ ఆశీర్వదించమని మోనిత అంటుండగా సరిగ్గా అప్పుడే హిమ, శౌర్యలు ఎంట్రీ ఇస్తారు. ఆ సీన్ చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే మోనిత ఆంటీ ఎందుకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందని అడడంతో సౌందర్య పిల్లలు ఏం వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. -
karthika Deepam: మోనిత ప్లాన్ను సౌందర్య తిప్పి కొట్టబోతుందా?!
కార్తీకదీపం జూన్ 24వ ఎపిసోడ్: తమ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్ వివరించడంతో దీప ఆలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మోనిత కార్తీక్కు పెట్టిన గడువు రెండు రోజుల్లో పూర్తైయిపోతుందని, ఎల్లుండి ఈ టైంకి ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే ఒళ్లు పులకరిస్తుందంటూ మురిసిపోతుంది. అంతేగాక తనని తిట్టిన దీప, సౌందర్యల నోళ్లు ఈ దెబ్బకు మూతపడతాయని తెగ సంబరపడిపోతూ ప్రియమణిని పిలిచి వేడి నీళ్లు తీసుకురమ్మని చెబుతుంది. ఇదిలా ఉంగా భాగ్యం మురళీ కృష్ణతో దీప ఇంటికి వెళ్లోస్తానని చెబుతుంది. ఎందుకని అడగ్గా దీపను ఇంటికి తీసుకువచ్చేస్తానని, అది డాక్టర్ బాబుతో ఉండేలా కనిపించడంలేదంటుంది. అంతేగాక ఇక దీప కష్టాలు పడింది చాలు ఇకనైనా దాని కష్టాలను దూరం చేద్దామని అనడంతో దీప గురించి భాగ్యం అంతగా ఆలోచించడం చూసి మురళీ కృష్ణ ఆనందపడిపోతాడు. మరోవైపు మోనిత కార్తీక్కు ఫోన్ చేస్తూనే ఉంటుంది. అయినా కార్తీక్ లిఫ్ట్ చేయడు. అలా దాదాపు మోనితవి 25కు పైగా మిస్డ్ కాల్స్ ఉండటం చూస్తాడు కార్తీక్. దీంతో ఆలోచనలో పడతాడు. మోనిత ఏంటీ ఇన్నిస్లార్లు కాల్ చేస్తుందని, ఏం మాట్లాడాలి. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఏమైన రచ్చ చేస్తుందా అంటూ ఆలోచిస్తుండగా శౌర్య అప్పడే వస్తుంది. నాన్న.. నాన్న అని ఎన్నిసార్లు పలిచిన కార్తీక్ పలకడు. దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మరోవైపు దీప కూడా అంతే తీవ్ర ఆలోచనలో పడుతుంది. డాక్టర్ బాబు మీద తను పెట్టుకున్న నమ్మకానికి ఎందుకింత ఎదురు దెబ్బ తగిలిందని, మోనిత ఎంత జానతనం చూపించిన ఆయన చలించడని గట్టిగా నమ్మాను.. అయినా ఈ తప్పు ఎలా జరిగిందని ఆలోచిస్తుండగా మధ్యలో హిమ వచ్చి అమ్మ అని ఎన్నిసార్లు పిలిచిన పలకకపోవడంలో అక్కడి నుంచి హిమ వెళ్లిపోతుంది. ఇక ఇందులో మోనిత కుట్ర ఏదో ఉందని అది ఎలా తెలుస్తుందంటూ ఆలోచిస్తూ దీప ప్రియమణిని నిలిదీస్తే చెబుతుందా? అని అనుకుంటుంది. చెప్పదు.. మరి ఏం జరిగింది అన్నది ఎలా తెలుస్తుందని మదనపడుతుంది దీప. ఇక కార్తీక్ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోనిత రగిలిపోతుంది. తనని అవాయిడ్ చేస్తున్నాడా? ఇంత చెప్పిన కార్తీక్ తన మాటలను చెవికి ఎక్కించుకోవడం లేదని మండిపోడుతుంది. ఇంకా దీపనే కోరుకుంటే ఆ తర్వాత తను చేసేది చూసి బుర్ర తిరగడమే కాదు.. తనే నా చుట్టు తిరిగేలా చేస్తా అనుకుంటూ క్యాలెండర్లో 25 తారీఖుని స్కెచ్తో మార్క్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియమణి వచ్చి ఈ సున్నా ఏంటని అడగ్గా.. ఇది సున్నా కాదే వెర్రి మొహమా.. సునామీ.. ఆ రోజు తను క్రియేట్ చెయ్యబోయే సునామీ అని సమాధానం ఇస్తుంది. మరోవైపు సౌందర్య కూడా దీప, కార్తీక్ల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా.. మోనిత చీర కట్టుకుని ఇంటికి వస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే అత్త ఎదురైందంటే మంచి శకునమే అంటూ నమస్తే ఆంటీ అంటూ లోపలికి వెళుతుంది. సౌందర్యతో తనకు న్యాయం చేయమని, కార్తీక్ తననుంచి మొహం చాటేస్తున్నాడని చెబుతూ, సాటి స్త్రీగా తన దరపున పోరాడాల్సిన సమయం వచ్చింది ఆంటీ అంటూ సౌందర్య దగ్గర అమాయకంగా నటిస్తుంది మోనిత. దీంతో సౌందర్య అవును పోరాడే సమయం వచ్చందని, కార్తీక్ తనతో ఓ మాట చెప్పడంటూ సౌందర్య మోనితలో కంగారు పుట్టిస్తుంది. దీంతో అదేంటని భయంగా అడగడంతో మోనిత వంక సౌందర్య అనమానంగా చూస్తుంది. అదేం లేదని నువ్వు కంగారు పడకు అంటూ శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్ తీసుకురమ్మని చెబుతుంది సౌందర్య. వెంటనే శ్రావ్య అయ్యో.. కడుపుతో ఉన్నానంటుంది కదా అత్తయ్యా.. ఏ పుల్ల మామిడి కాయలో, చింతకాయ ఏమైనా అడుగుతుందేమో అని వెటకారంగా అంటుంది. ‘అంత వికారంగా ఏం కనిపించడటం లేదులే.. జ్యూస్ చాల్లే’ అని అంతే వెటకారంగా అంటుంది సౌందర్య. ఏం చెప్పి ఉంటాడు కార్తీక్.. ఈవిడేంటీ? ఏ మాత్రం తొణక్కుండా ఉంది’ అని మోనిత మాత్రం చేతులు నలిపేసుకుంటూ కంగారుపడుతుంది. మరోవైపు దీప కార్తీక్లు కూర్చుని ఉండగా.. నిన్ను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకోవడానికి ఎంతసేపు బతిమలాడాల్సి వచ్చిందో.. నా పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు దీపని కార్తీక్ అంటాడు. అంతేగాక నీ మౌనాన్ని భరించలేకపోతున్నానని, నాతో మాట్లాడు దీపని కార్తీక్ వేడుకుంటాడు. దీంతో దీప చెప్పండి డాక్టర్ బాబు.. మీరే నాతో మళ్లీ ఏదో చెబుతానంటున్నారు.. విన్నదే అయితే వినడం ఎందుకు? ఉన్నదే అయితే చెప్పడం దేనికీ?’ అంటుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
Karthika Deepam: ఇదేమైన మోనిత డ్రామా? అని అనుమానిస్తున్న దీప
కార్తీకదీపం జూన్23వ ఎపిసోడ్: మోనితకు గట్టిగా బుద్ది చెప్పాలని సౌందర్యకు సలహా ఇవ్వడానికి వెళ్లిన భాగ్యం ఎప్పుడు వస్తుందా అని ఇంటివ దగ్గర మురళీ కృష్ణ ఎదురు చూస్తుంటాడు. ఇంతలో భాగ్యం వస్తుంది. రాగానే చెప్పావా అంటూ ఆత్రుతగా అడుగుతాడు మురళీ కృష్ణ. దీంతో భాగ్యం అక్కడ జరిగిన విషయం, సౌందర్య ఏం చెప్పిందో అన్ని వివరిస్తుంది. ఇదిలా ఉండగా కార్తీక్ ఫుల్గా తాగి ఆ రోజు మోనిత ఇంట్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ మోనిత గీసిన గీతలు చూస్తూ మనసులో తప్పు చేసిన భావనతో పశ్చాతాప పడతాడు. మరోవైపు దీప పిల్లలు పడుకుని ఉండగా వారిని చూస్తూ హిమా ఆటోలో తనతో బాధపడిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది.హిమ అడిగిన ఏ ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదని ఆలోచిస్తుంది. చిన్నప్పుడు సవతి తల్లి కారణంగా లేకుండా ఎందుకు కొడుతుందని నాన్న అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు, నా మీద డాక్టర్ బాబుకు అనుమానం ఎందుకంటే సమాధానం లేదు, ఇప్పుడు నాన్న ఎందుకు అలా ఉంటున్నాడంటే నా దగ్గర సమాధానం లేదంటూ మనసులో అనుకుంటు కుమిలి పోతుంది. నా కడుపున పట్టినందుకే మీకు ఇన్ని కష్టాలంటూ దీప మదనపడుతుండగా బయట నుంచి శబ్థం వినిపిస్తుంది. దీంతో దీప వెళ్లి చూడగా కార్తీక్ తను ఏ తప్పు చేయలేదని నన్ను నమ్ము దీప అంటూ బాధపడుతుంటాడు. ‘నాతో మాట్లాడూ దీప, వాదించు.. తిట్టూ.. నేను చెప్పేది విను దీప’ అంటూ తల పట్టుకుని ఏడుస్తుంటాడు కార్తీక్. దీంతో దీప మనసులో తను ఏం చేసిన కరెక్ట్ అని వాదించి మనిషి ఎందుకు ఇలా ఉంటున్నాడు. తప్పు చేశాననే భావన ఆయనలో కనిపిస్తుంది. ఎలాగు మోనితను పెళ్లి చేసుకుంటా అనుకున్నాను కదా అందుకే ఇద్దరం కలిసిపోయామని ఆయన చెప్పోచ్చు.. కానీ అలా కాకుండా తప్పు చేసిన వాడిలా అసలు నోరు కూడా మెదపడం లేదంటూ దీప కార్తీక్ను చూస్తూ మనసులోనే మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ కింద కూర్చోని బాధపడుతుంటే దీప వెళ్లి మంచినీళ్లు ఇస్తుంది. గ్లాస్ తీసుకుని నీళ్లు తాగిన అనంతరం కార్తీక్ తనతో మాట్లాడమని, తాను ఏ తప్పు చేయలేదంటూ దీపతో అంటాడు. ‘దేవుడు నాకు పిల్లలు పుట్టే యోగం ఉందని మరో రకంగా అయినా తెలియజేయోచ్చు కదా. ఎవరైతే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారో నా క్లోజ్ ఫ్రేండ్కే అలా జరగడం ఏంటి’ అంటూ కుంగిపోతాడు. అంతేగాక ఆ రోజు ఫుల్గా తాగి ఉన్నానని అసలు ఏం జరిగిందో తనకు తెలియదంటాడు. అంతేగాక మ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్ చెప్పగానే దీప ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా ఆదిత్య సౌందర్యతో హిమా, శౌర్యలను చూసోస్తానని సౌందర్యతో అనగానే ఆమె వద్దని చెబుతుంది. కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడని అన్నయ్యను చూడగానే నీ మాటలు అదుపులో ఉండవని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావని చెబుతుంది సౌందర్య. ఇక దీప కార్తీక్ తనతో చెప్పిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇదంతా నిజమేనా లేక మోనిత ఏదైనా డ్రామా ఆడుతుందా? అనుకుంటుంది. డాక్టర్ బాబులో మోనితపై అభిమానం కనిపించడం లేదని ఆమె చేతిలో మోసపోయిన వ్యక్తిలా చూస్తున్నాడనుకుంటుంది. దీని వెనక ఎదో రహస్యం ఉందని కనిపెట్టాలని దీప నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
ఏదైనా దీవిలో ఇరుక్కుపోయామా అని భయమేస్తోంది అమ్మ: హిమా
కార్తీకదీపం జూన్ 22 ఎపిపోడ్: కార్తీక్ దీప ఇంటి ముందు జనత ఉచిత వైద్యశాల పేరుతో క్టీనిక్ నడుపుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ పేషెంట్స్ను చూస్తుండగా సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. కార్తీక్ అతడి రిపోర్ట్స్ చూసి మందులు రాసి ఇస్తాడు. అంతేగాక తన దగ్గర పని చేయాలని అందుకు తనకు రూ. 25 వేల జీతం ఇస్తానని కార్తీక్ చెప్పడంతో లక్ష్మణ్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ దేవుడు అంటూ పొగుడుతుండగా సరిగ్గా అదే సమయానికి దీప బయటకు వస్తుంది. లక్ష్మణ్ దీపను చూసి దీపమ్మా ఇలా రమ్మా అంటూ పిలిచి వారిద్దరి కాళ్లకు దండం పెట్టుకుంటాడు. మీరిద్దరూ ఆదర్శ దంపతులంటూ మీలో రాముడు, సీత.. శివుడు, పార్వతిలు కనిపిస్తున్నారంటాడు. దీంతో కార్తీక్ ‘ప్రపంచానికి గొప్పగా కనిపిస్తున్న ఈ మనిషి లోపల ఎంత దుర్మార్గుడో వీళ్లకేం తెలుసు అనుకుంటున్నావా దీపా’ అని మనసులో అనుకుంటూ బాధపడతాడు. సరిగ్గా అప్పుడే హిమ బయటికి వచ్చి అమ్మా వెళ్దామా అంటుంది. కార్తీక్ ఎక్కడికి అనడంతో మార్కెట్కు వెళ్తున్నామని చెబుతుంది దీప. ఇదిలా ఉండగా భాగ్యం సౌందర్యతో రహస్యంగా మాట్లాడుతుంది. మోనితకు ఇలా సాఫ్ట్గా చెబితే పని జరగదని, తను వెళ్లి తన తీరులో మోనితకు వార్నింగ్ ఇస్తానని చెబుతుంది భాగ్యం. లేదంటే మీరైనా క్లాసుగా కాకుండా మాస్గా వార్నింగ్ ఇవ్వండి అంటూ సలహా ఇస్తుంది. అది జరగని పని.. మన దగ్గర తప్పు పెట్టుకుని మోనితని ఏం చేయలేమని సౌందర్య అంటుంది. అంతేగాక తన దగ్గర ఇప్పుడు బ్రహ్మస్త్రం ఉందని ఇప్పుడు మోనిత భయపెట్టడం జరగదంటుంది. కానీ భాగ్యం మాత్రం మనసైడు తప్పు ఉన్న తల వంచకుండా తెలివిగా ఆలోచించి మోనిత పని చెప్పాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ ఒంటరిగా కూర్చుని.. గోడపై మోనిత గీసిన గీతలని చూస్తూ టెన్షన్ పడుతూ ఉండగా లోపల నుంచి శౌర్య వస్తుంది. కార్తీక్ ఆ గీతలను చూస్తుండటం చూసి అవి నీ భవిష్యత్తు అన్నావు కదా నాన్న ఇప్పుడు వాటి వల్ల ఎమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అమాయకంగా. అప్పుడే కార్తీక్కు అన్ని గుర్తు చేసుకుంటాడు. దీప ప్రెగ్నెట్ అని తెలియగానే ఆ బిడ్డకు తనకు సంబంధం లేదని గట్టిగా అరిచి చెప్పిన సంఘటన, అలాగే శౌర్య గతంలో నాన్న పిలిచి నువ్వే మా నాన్నవని ఎప్పుడో తెలుసు అనడం, కార్తీక్ హిమని ఎత్తుకుని తిరిగింది అన్ని గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అవుతాడు. దీంతో శౌర్యను దగ్గరకు తీసుకుని ఎత్తుకుని తీప్పుతుండగా అప్పుడే సౌందర్య వస్తుంది. అదంతా చూసి ఆనందిస్తుంది. ఇంతలో కార్తీక్ సౌందర్య చూసి నానమ్మ వచ్చిందని చెప్పగానే శౌర్య సంతోషిస్తుంది. లోపలికి వచ్చిన సౌందర్య గోడ మీద ఉన్న గీతలను చూసి శౌర్యతో గ్లాసులో నీళ్లు తెమ్మని చెబుతుంది. ఆ లోపు కార్తీక్తో ఆ గీతల్ని చెరపకుండా అలేనే ఉంచుతావా అని ప్రశ్నిస్తుంది. అయినా కార్తీక్ మౌనంగా ఉంటాడు. ‘ఆ గీతల్ని చెరిపి నీ రాతను మార్చుకోరా’ అంటుంది అనడంతో తన వల్ల కాదేమో మమ్మీ అంటాడు కార్తీక్ నిరాశగా.. ఆ మోనిత నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని, తనని బెదరిస్తుంది కానీ దీపకు భయపడుతుంది అంటుంది. అందుకే. సమస్యని దీపకు చెప్పు.. దీప చేతిలో పెట్టు.. ఆ గీతల్ని దీపే చెరిపేస్తుంది అని సౌందర్య చెబుతుంది. దీంతో ఆ కార్తీక్ దీప చూసే చూపుల్లో ఆ గీతల్ని చెరిపే బాధ్యత నీదే అన్నట్టు నాకు అర్థమవుతుంది మమ్మీ.. ఇంకా ఆ గీతల్ని ఎలా చెరిపేస్తుంది అంటాడు కార్తీక్. మరోవైపు ఆటో వస్తుండగా హిమ దీపతో వారణాసి ఎందుకు రాలేదని, ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నాడని ప్రశ్నిస్తుంది. దీంతో ఏదో పని మీద బయటకు వెళ్లాడని దీప సమధానం ఇస్తుంది. ఆ తర్వాత హిమ నాకు చాలా భయంగా ఉందని, ఏదో మనసులో తెలియని బాధ ఉంటోందంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మనం అందరం కలిసే ఉన్నా ఏంటో భయం భయంగా అనిపిస్తుందంటూ బాధపడుతుంది. వారణాసి కూడా ఫోన్ ఎత్తకపోతే.. ఇక మీదట వారణాసి కూడా మనతో మాట్లాడడేమోననే భయమేస్తోందని, ఈ ప్రపంచంలో మనషులంతా వేరు, మన నలుగురం వేరేమో.. ఏదైనా దివిలో ఇరుక్కుపోయామోనని అనిపిస్తుంది అమ్మ అంటూ హిమ కన్నీరు పెట్టుకోవడంతో దీప హిమను దగ్గరకు తీసుకుని తాను కూడా ఎమోషనల్ అవుతుంది. -
Karthika Deepam: అసలేం జరిగిందో దీపకు వివరించిన కార్తీక్
కార్తీకదీపం జూన్ 21వ ఎపిసోడ్.. సౌందర్యని కలవడానికి వెళ్లిన దీప.. తిరిగి రావడం, కార్తీక్ తింటూ రా దీపా.. నీకు ఇడ్లీ తీసిపెట్టాను అని చెప్పడంతో.. మరి నాకు అంటూ మోనిత ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. నవ్వుతూ.. లోపలికి వచ్చి.. టిఫిన్ తింటాను అంటూ కూర్చుంటుంది. అంతేగాక దీపను కూడా తిను అని అడగడంతో.. ఇప్పుడు తినను తర్వాత తర్వాత తింటానని దీప సమాధానం ఇస్తుంది. వెంటనే మోనిత ‘చెప్పాను కదా దీప నీలాగా నేను వేయిట్ చేయలేను’ అంటూ పిల్లలకు అర్థం కాకుండా తెలివిగా మాట్లాడుతుంది. ఇండ్లీ పెట్టుకుని ‘కార్తీక్ ఇడ్లీ సూపర్ నీ చేతుల్లానే భలే మెత్తగా ఉంది’ అని మాట్లాడుతూ దీప ఉడుక్కునేలా చేస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటోంది, అందుకే టైమ్కి తింటున్నాను. లేకపోతే కళ్లు తిరుగుతున్నాయి. ఈ మధ్య వికారంగా ఉంటోందంటూ తన మాటలతో కార్తీక్ను, దీపను ఇబ్బంది పెడుతుంది మోనిత. ఇక హిమ, శౌర్యలకు తెచ్చిన చాక్లెట్స్ బ్యాగులోంచి తీసి మనపిల్లలే కదా అని తీసుకొచ్చాను అంటుంది. ఇక మోనిత తీరు చూసి కార్తీక్ మనసులో ‘నాకు తెలిసి నేను ఎప్పుడూ ఏ తప్పు చెయ్యలేదు.. గిల్టీగా ఫీల్ కాలేదు.. అందుకే నాకు తల దించుకోవడం అలవాటు లేదు.. ఇప్పుడు అర్థమవుతుంది చెయ్యని నేరానికి దీప పాపం ఎంత నరకం అనుభవించుంటుంది?’ అనుకుంటాడు బాధగా. పిల్లలను బయటకు వెళ్లమని చెప్పి మోనిత గోడ మీద గీసిన 10 గీతల్లో రెండో గీత కొట్టేసి వెళ్లిపోతుంది. ఇక సౌందర్య ఇంటికి వెళ్లి పరువు గురించి, దీప జీవితం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రావ్య కూల్ చేసే ప్రయత్నం చేస్తే.. శ్రావ్యతో కూడా అదే బాధను పంచుకుని బాధపడుతుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన మోనిత అద్దంలో చూసుకుంటూ దీప తనకంటే అందంలో, చదువులో, డబ్బు సంపాదనలో ఎందులో ఎక్కవ కాదు మరేందుకు కార్తీక్ దీపనే ఇష్టపడుతున్నాడని ప్రియమణిని అడుగుతుంది. ప్రియమణి అన్నింట్లోనూ మీరే ఎక్కువ అంటూనే మోనితకు కౌంటర్ వేస్తుంది. మోనిత చేతిని తీసి ఆమె గుండెల మీద పెట్టి.. ‘ఇప్పుడు చెప్పండమ్మా.. దీపమ్మ మంచిదా.? మీరు మంచివారా’ అంటుంది. దాంతో మోనితకి తను చేసిన నేరాలన్నీ గుర్తొస్తాయి. మీ కళ్లలోనే తెలుసిపోతుందమ్మా.. మీరు మంచివారైతే కార్తీక్ అయ్యే మీ దగ్గరకు వస్తాడని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది. అయితే మోనిత మాత్రం మనసులో.. ‘ఎవరు ఎన్ని చెప్పినా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను’ అనుకుంటుంది. ఇదిలా ఉండగా దీప దగ్గరకు వారణాసి కంగారు వస్తూ అక్కా.. డాక్టర్ మోనిత ఇక్కడికి వచ్చి వెళ్లిందా?’ అని అడుగుతాడు. దీంతో ఏం అయ్యిందని దీప అడగ్గా.. మోనిత తనని తమ్ముడని పిలిచిందని, నిన్ను బాగా చూసుకోమ్మని ఇక నుంచి ఏ కష్టం వచ్చినా నువ్వే చూసుకోవాలని అన్నదని చెబుతాడు.అదంతా విన్న కార్తీక్ అక్కడి రాగానే వారణాసి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ దీప వంక జాలిగా చూస్తూ దీపకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నస్తాడు. ఇంతలో పిల్లలు వాళ్లిదరికీ ఫోటోస్ తీసి.. ‘సూపర్ నాన్నా.. సూపర్ డాడీ.. మీరు ఇలా కలిసి ఉంటేనే మాకు చాలా ఇష్టం.. ఇంతకన్నా మాకు ఏం అవసరం లేదు’ అంటారు. తరువాయి భాగంలో కార్తీక్ అసలు ఏం జరిగిందనేది ఏడుస్తూ చెపుతాడు. తనకు పిల్లలు పుట్టరని మోనిత చెప్పిందనే విషయంతో పాటు ఆరోజు రాత్రి మోనిత ఇంట్లోనే ఫుల్గా తాగి పడిపోయిన విషయం చెబుతాడు. ఆ మైకంలో ఏం జరిగిందో కూడా తనకు తెలియదని ఈ విషయం మోనిత తనకు చెప్పేవరకు తెలియదని కార్తీక్ దీపకు వివరిస్తాడు. దీంతో దీప ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్: ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్ -
9 రోజుల తర్వాత అలా చేస్తా: ప్రియమణికి వివరించిన మోనిత
కార్తీకదీపం జూన్ 19: అబార్షన్ చేసుకోమ్మని సర్దిచెప్పడానికి వెళ్లిన కార్తీక్కు మోనిత షాక్ ఇస్తుంది. కార్తీక్నే ఎదోక నిర్ణయం తీసుకోవాలని లేదంటే తానే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. అంతేగాక భార్య స్థానం ఇవ్వమంటుంది. ఇదే విషయాన్ని కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్లిన చెప్పి సలహా అడుగుతాడు. సౌందర్య తానేం చేయలేనని, నువ్వు తప్పు చేశాడు ఫలితం అనుభవించాల్సిందే అంటూ హితవు పలుకుతుంది. మరీ కార్తీక్ మోనిత విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నాడో నేటి(శనివారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. సౌందర్య దగ్గరికి వెళ్లి సలహా అడిగిన కార్తీక్కు ఆమె చివాట్లు పెడుతుంది. తానేం చేయలేనని చేతులెత్తెస్తుంది. దీంతో కార్తీక్ తిరిగి దీప ఇంటికి వచ్చేస్తాడు. ఉదయం దీప లేచేసరికి కార్తీక్ బయట పడుకుని కనిపిస్తాడు. అలా కార్తీక్ను చూడటంతో దీప మనసు కరుగుతుంది. ఆ తర్వాత కాఫీ పెట్టి తీసుకేళ్లి కార్తీక్ను లేపుతుంది. దీప పిలుపుతో కళ్లు తెరిచిన కార్తీక్ ఆమెను చూసి ఏంటి ఇంత ఉదయాన్నే రేడి అయ్యావని కంగారు పడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావా? ప్లీజ్ దీప అలా చేయకు అని తను తట్టుకోలేనని, పిల్లలు మమ్మీ ఏదని అడిగితే ఏం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు కార్తీక్. దీంతో దీప ఎక్కడికి వెళ్లడం లేదని, కాస్తా పనుండి బయటకు వెళ్తున్నట్లు చెబుతుంది. అలాగే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదంటూ గంటలో వస్తానని చెబుతుంది. దీంతో కార్తీక్ మన కారులో డ్రాప్ చేస్తానంటాడు. కానీ దీప వారణాసి ఆటోలో వెళ్తానని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప, సౌందర్యలు పార్కులో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మోనిత, ప్రియమణితో కలిసి వాకింగ్కు వస్తుంది. అదే సమయంలో మోనిత తొమ్మిది రోజుల తర్వాత తను ఏం చేయనుందో ప్రియమణికి వివరిస్తుంది. దీంతో ప్రియమణి అది జరిగే పని కాదని, దీప, సౌందర్యలు అడ్డుకుంటారనగానే మోనిత అక్కడ దీపను, సౌందర్యను చూస్తుంది. సౌందర్య దీపతో కార్తీక్ తన దగ్గరికి వచ్చి సలహా అడిగిన విషయం చెబుతుంది. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి వారిని పలకరిస్తుంది. ఆ తర్వాత ‘ఓ కాలమా ఇది నీ గాలమా’ కాలానికి అద్భుతమైన శక్తి ఉంది ఆంటీ అంటూ దీప విజయనగం వెళ్లిన రోజులను గర్తు చేస్తుంది. అంతేగాక హిమను వెతికి పెడితే కార్తీక్ తనని పెళ్లి చేసుకుంటానని అడమేంటని, చావుబతుకుల్లో ఉన్న దీపను కార్తీక్ బతికించుకోవడం ఏమిటి? పాపం ఇన్ని చేసిన కార్తీక్ను దీప ఛీ కొట్టే పరిస్థితి రావడం ఏంటీ? అంటూ ఇది మోనిత మహత్యం కాదని, కాల మహత్యం అంటుంది. ఇప్పుడు కాలం గాలి రెండూ ఇప్పుడు మోనిత వైపే ఉన్నాయంటూ విర్ర వీగుతుంది మోనిత. ఆ తర్వాత మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో సౌందర్య కార్తీక్ చేసిన పనికి కోపం తెచ్చుకుంటూ ఏం చేయాలేని పరిస్థితి తీసుకోచ్చాడని, కాళ్లు చేతులు కట్టేశాడంటూ అహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే నీకు అన్యాయం జరగనివ్వనని, కష్టం కలగనివ్వను అంటుండగా.. దీప తనకు జరిగిన నష్టానికి ఖరీదు ఎంతుంటుంది అత్తయ్యా తన మాటలతో సౌందర్యను బాధపెడుతుంది. ఇక తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం కార్తీక్కు, దీపకు సాయం చేస్తానంటుంది. ఇలాంటి విషయాలను డీల్ చేయాలంటే ఆ సౌందర్య, దీప, కార్తీక్ ఎవరి వల్ల కాదని తనలాంటి వాళ్ల వల్లే అవుతుంది అంటుంది. నేనోంటో చూపిస్తా అని మురళీ కృష్ణతో చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ మొక్కలకు నీళ్లు పడుతుండగా.. పిల్లలు దీప గురంచి అడుగుతారు. బయటికి వెళ్లిందని అనడంతో ఏంటి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా? అని అడుగుతుంది. నిజంగా అమ్మ మీతో చెప్పిందా? ఏ గోడకో, చెట్లకో చెప్పిందా అంటూ కార్తీక్, దీపలు ఎందుకు మాట్లాడుకోవడం లేదని, దీప తనపై ఎందుకు కోపంగా ఉందని పిల్లలు కార్తీక్ను ప్రశ్నిస్తారు. దీంతో ప్రశ్నలు ఆపి ఫ్రెష్ అయ్యి రండని, టిఫిన్ చేసి పెడతా అంటాడు కార్తీక్. దీప వచ్చేసరికి పిల్లలు బయట ఆడుకుంటారు. కార్తీక్ అప్పడే టిఫిన్ చేస్తాడు. దీపను చూసి నువ్వే వచ్చేసరికి లేటు అవుతుంది తను తినేస్తున్నానని అంటుండగా.. అప్పుడే మోనిత మరీ నాకు అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది సోమవారం నాటి ఎపిసోడ్లో చూద్దాం. -
Karthika Deepam: భార్య స్థానం కోరిన మోనిత, సౌందర్యను సలహా అడిగిన కార్తీక్
కార్తీకదీపం జూన్ 18: మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్ని బెదిరిస్తుంది. పది అంటే పదే రోజుల్లో తనకు న్యాయం జరిగే నిర్ణయం చెప్పాలని గోడ మీద 10 గీతలు గీసి కౌంట్డౌన్ స్టార్ట్ అంటూ హెచ్చరించి వెలుతుంది. ఆ తరువాత కార్తీక్ మోనితకు ఆబార్షన్ చేయించుకోమ్మని చెప్పేందుకు ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ మోనిత కార్తీక్ చెప్పేది వినకుండా తనని పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇవ్వమని అడుగుతుంది. దీంతో కార్తీక్ ఏ నిర్ణయం తీసుకోనున్నాడనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మోనితతో పదేళ్లుగా దీపను అనుమానించానని, ఇప్పుడది తప్పని తేలింది. ఈ సయమంలో అంటూ నానుస్తుండగా.. అయితే దానికి నాకు సంబంధం ఏంటని నిలదీస్తుంది మోనిత. ‘నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? నేనే చేయను. దీప కంటే ముందు నుంచి నిన్న ప్రాణంగా ప్రేమిస్తున్న, మరీ నా మీద ఎందుకు నీ ప్రేమ రాలేదు. కనీసం జాలి అయినా చూపించు కార్తీక్. అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. నీ ప్రమేయం ఉన్నా లేకున్నా జరిగిన దానికి న్యాయం చెయ్యమంటున్నాను.. అంతే’ అంటుంది మోనిత. త్వరలో కార్తీక్ను తన నిర్ణయం చెప్పాలని, లేదంటే తనే ఏదోక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంటుంది. ఆ తర్వాత ‘నీ యాక్షన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకుని చెప్పు’ అంటూ హెచ్చరిస్తుంది మోనిత. మరోవైపు పిల్లలు దీప బెండకాయలు కట్ చేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చి ఇంతకుముందు నాన్న వస్తే ఇష్టమైనవవి వంటలు అన్ని చేసి పెట్టెదానివి. ఇప్పుడు నాన్న వచ్చి మనతోనే ఉంటున్నా ఈ పిచ్చి వండి పెడుతున్నావు? ఏమైంది అమ్మ నీకు కొన్ని రోజుల నుంచి ఏం మాట్లాడకుండ మౌనంగా ఉంటున్నావు. నాన్నకు, నీకు మధ్య ఏం జరిగిందని పిల్లలు ఆరా తీస్తారు. అలాగే గోడ మీద గీతలు గురించి అడుగుతూ.. కార్తీక్ తన చేతి గీతలని, భవిష్యత్ చెప్పిన మాటలకు అర్థం ఏంటని దీపను ప్రశ్నిస్తారు. అయినా దీప ఏం మట్లాడదు. దీంతో హిమ మీరు చెప్పకపోతే మేమే కనిపెడతామని, శౌర్యతో నువ్వు ఇవన్ని తెలుసుకుంటావు కదా అనగానే ‘నాన్ననే కనిపెట్టిన దాన్ని ఇది నాకు పెద్ద విషయం కాదు’ అంటుంది. శౌర్య తెలుసుకుంటా ఖచ్చితంగా కనిపెడతా అని అక్కడ నుంచి వెళ్లిపోగానే దీప ‘పిల్లలకి నిజంగానే ఆయన చేసిన తప్పు గురించి తెలిస్తే.. ఆయన్ని క్షమిస్తారా? కచ్చితంగా క్షమించరు. అసహించుకుంటారు’ అంటూ మనసులో మదన పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ మోనిత దగ్గర జరిగిందంతా సౌందర్యకు చెబుతాడు. ‘ఇందులో నేను చెయ్యగలిగింది ఏం లేదు’ అని సౌందర్య అంటే.. ‘అలా అనకు మమ్మీ.. ఊబిలో కూరికుపోయాను.. చెయ్యి అందించి గట్టుకు చేర్చు మమ్మీ’ సౌందర్యను సలహా అడుగుతాడు. కార్తీక్.. చిన్నప్పుడు నీకు గాజేంద్ర మోక్షం చదివి వినిపించాను గుర్తుందా.. మోనిత ఇప్పుడు నీళ్లలో ఉన్న ముసలిరా.. అది చాలా శక్తివంతురాలు. దాని నోటికి చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నావు. నా దగ్గరకి వచ్చి మొరపెట్టుకుంటే కాపాడటానికి నేను విష్ణుమూర్తిని కాదు.. దాని తల ఛేదించి నిన్ను రక్షించడానికి నా దగ్గర విష్ణు చక్రమూ లేదు’ అని అంటుంది. అలా అనకు మమ్మీ ఎలాగైన నన్ను దీని నుంచి బయట పడే మార్గం చూపించమని కార్తీక్ అడగ్గా.. దీనికి ఒకేట మార్గం ఉందని, మోనిత స్వయంగా తన కడుపు నాటకమని లేదా ఆ కడుపులో బిడ్డకు నువ్వు తండ్రివి కాదని చెప్పాలని అంటుంది. అదే జరిగే పనేనా? అని మోనిత నీళ్లలో ఉన్న మొసలి అని అది నిన్ను ముంచెడయం ఖాయం, నువ్వు తప్పు చేశావు ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. దానికి మోక్షం ఆ పైవాడు చూపిస్తాడు అంటూ కార్తీక్కు చివాట్లు పెడుతుంది సౌందర్య. రాత్రి ఇంటిక తిరిగి వచ్చేస్తాడు. పిల్లలకు చాక్లేట్స్, బిస్కెట్స్ తీసుకుని వెళుతాడు కార్తీక్. ఇక తెల్లారి దీప లేచి చూసేసరికి కార్తీక్ బయట పడుకుని ఉంటే కాఫీ తీసుకుని వెళ్లిని డాక్టర్ బాబు అంటూ దీప కార్తీక్ని నిద్ర లేపుతుంది. ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చుద్దాం. -
karthika Deepam: మోనిత ఇంటికి వెళ్లిన కార్తీక్, భార్య స్థానం అడిగిన మోనిత
కార్తీకదీపం జూన్ 17: మోనిత దీప ఇంటికి వస్తుంది. దీప గొప్పది. పురాణాల్లో విన్నామే మహా పతివ్రతల గురించి.. అలాంటిది దీప. భర్త ఎలాంటి వాడైనా పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే పాతకాలం నాటి మనిషి.. భూదేవి అంత సహనం ఉంది కాబట్టి నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి పదేళ్లగా ఎదురు చూసింది.. కానీ నాకు అంత ఓపిక లేదందూ గోడ మీద 10 గీతలు గీసి అవి చూపిస్తూ.. పది రోజులు నీకు టైమ్ ఇస్తున్నాను.. పది రోజుల్లో నాకు న్యాయం జరిగే సమాధానం కావాలని లేదంటే నీ కుటుంబం గడగడ వణికిపోయేలా చేస్తానంటూ హెచ్చరిస్తుంది. ఇక మోనిత వెళ్లిపోతూ వెనక్కి తిరిగి ఎక్కువగా ఆలోచించకు దీప.. ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఏం లేదు.. ఆరోగ్యం బాగా చూసుకో.. ఎందుకంటే రేపు నాకు పురుడు పొయ్యాల్సింది నువ్వే.. పది మందికి అన్నం పెట్టిన చెయ్యి.. నీ చేత్తో పురుడు పోస్తే చాలా మంచిది అంటూ దిప ఉడికించి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం దీప దగ్గరకు వెళ్లి భర్త రాజీపడమని చెబుతానంటూ మురళీ కృష్ణతో చెబుతుంది. దీంతో అతను వద్దని భాగ్యంకు నచ్చజెప్పిన వినకుండా వెళ్తనని మొండిగా అంటుంది. ఇక పిల్లలు ఆడుకుంటూ మోనిత గీసిన గీతల దగ్గరకు వెళ్లి ఏంటవి అని మాట్లాడుకుంటుంటారు. మ్యాథమెటిక్స్ హా, ఆల్జిబ్రా గీతలు అంటూ వాళ్లు మాట్లాడుకుంటుంటే గుమ్మం దగ్గర నుంచి దీప, సోఫాలో కూర్చున్న కార్తీక్ వింటుంటారు. ఆ తర్వాత పిల్లలు దీపని ‘ఇవి ఎవరు గీసారని అడగ్గా దీప కార్తీక్ వైపు చూస్తుంది. దాంతో పిల్లలు కార్తీక్ని నువ్వు గీశావా? నాన్న అని అడగ్గా... అవి నా భవిష్యత్ అమ్మ అంటాడు. దాంతో దీప కార్తీక్ తానో తప్పు చేశానని, నా భవిష్యత్కి సంబంధించింది. రేపు చెబుతాను అన్ని విషయం గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ చెబుతానన్న నిజం మోనిత ప్రెగ్నెంట్ విషయం అయ్యి ఉంటుందని, మోనిత ద్వారానే కార్తీక్ తన పతివ్రత అనే నిజాన్ని నమ్ముతున్నాడని ఆలోచిస్తూ బాధపడుతుంది. మొత్తానికి పిల్లలు కార్తీక్ చెప్పిన పెద్ద పెద్ద మాటలు అర్థం చేసుకోలేక.. ‘మన లెక్కలే బెస్ట్ అర్థమవుతాయి’ అనుకుంటూ వెళ్లిపోతారు. ఇక సౌందర్య దీప, కార్తీక్ల గురించి దిగులు పడుతూ ఉండగా.. దీపకు బహుమతిగా ఇవ్వడానికి కార్తీక్ గిఫ్ట్ పేపర్తో కవర్ చేసిన శ్రీశ్రీ పుస్తకం సౌందర్య కంటపడుతుంది. ‘దాన్ని తీసి పైన ఉన్న ‘దీపకు ప్రేమతో నీ డాక్టర్ బాబు’ అనేది చదివి.. ఓపెన్ చేసి.. అందులో ఉన్న పుస్తకం చూసి.. ‘అంటే ఈ గిఫ్ట్ వాడి చేతులతో దానికి ఇద్దాం అనుకున్నాడా..? ఎప్పుడు ఇద్దాం అనుకున్నాడు? ఎందుకు ఇవ్వలేదు?’ అని ఆలోచనలో పడుతుంది. బహుశా ఇదే ఆధారాన్ని కార్తీక్ ముందు ఉంచి కార్తీక్ని నిలదీస్తే.. దీప పవిత్రత అనే విషయం కార్తీక్కి ముందే తెలిసిందని బయటపడుతుంది. అప్పుడు దీప కార్తీక్ కాస్తైనా దగ్గరవుతారని ఆలోచిస్తుంది. మరోవైపు కార్తీక్ మోనిత ఇంటికి వెళతాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తోంది మోనిత అని అంటాడు. ఏ విషయం అని అడుగుతుంది మోనిత. ‘అదే.. ఇంటికి వచ్చి పదిరోజులు గడువు ఇచ్చావు కదా అంటుండగా అందులో తప్పేముంది కార్తీక్ అంటుంది. ఆ తర్వాత కార్తీక్ మన మధ్య జరిగింది అది ప్రేమతోనో, ఇష్టంతోనో కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అలా అని ఏం తెలియనట్లు ఎలా ఉండమంటావని మోనిత అంటుంది. అలాగే దీప మీద ఉన్న ప్రేమతో ఇప్పుడు నాకు అన్యాయం చెయ్యాలని చూడకు కార్తీక్ అంటూ మోనిత రిక్వెస్ట్గా అడుగుతుంది. నా ఉద్దేశం అది కాదు అని కార్తీక్ అంటుండగా ‘నేను చెప్పిన మాటల్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు.. అందరి ముందు నా మెడలో తాళి కట్టి దీపకు ఇచ్చినట్లే నాకు భార్య స్థానం ఇవ్వు’ అంటుంది మోనిత. దీంతో కార్తీక్ మోనితా ప్లీజ్ అంటాడు ధీనంగా. తానేం తప్పు మాట్లాడలేదని ఎదురు తిరుగుతుంది మోనిత. అది కాదు మోనితా.. గత పదేళ్లుగా నా భార్యని నేను అనుమానించాను.. ఇప్పడు అది తప్పు అని తెలిసింది.. ఇప్పుడు ఈ టైమ్లో అని అంటూ కార్తీక్ ఆగిపోతాడు. దీంతో ‘దానికీ నాకు సంబంధం ఏంటీ కార్తీక్.. నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? సారీ కార్తీక్ నా వల్ల కాదు అన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే నేను అన్యాయం అయిపోతాను.. ఏం కార్తీక్.. ఇప్పుడు దీప మీద ప్రేమ కలిగింది సరే.. మరి దీపకంటే ముందు నుంచే నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే.. మరి నా మీద నీకెందుకు ప్రేమ కలగడం లేదు?’ అని కార్తీక్తో అంటుంది. -
karthika Deepam: నాన్న ఏదో తప్పు చేసిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు..
కార్తీకదీపం జూన్ 15: దీప దీర్ఘంగా ఆలోచిస్తూ బయట కూర్చుంటే హిమ వచ్చి ఏమైందని, నువ్వు డాడీ ఎందుకలా ఉంటున్నారని ప్రశ్నిస్తుంది. ఈ లోపు అక్కడికి శౌర్య కూడా వస్తుంది. వచ్చిరాగానే ఏంటి ఇక్కడ ఉన్నారంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి దీపతో ఆ ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావని అడగడంతో పనుందంటూ లోపలికి వెళ్లిపోతుంది దీప. ఆ తర్వాత పిల్లలిద్దరూ ‘అమ్మకు ఏమైంది? నాన్న కూడా ఈ మధ్య ఎలానో ఉంటున్నారు. ఎప్పుడు అమ్మ గురించి అడిగిన చికాకు పడే నాన్న.. నిన్న మనం అడగ్గానే తలదించుకుని ఉన్నాడు. నాతో రండి అంటూ ఇక్కడికి తీసుకువచ్చాడు. ఏదో తప్పు చేసిన వాడిలా సైలెంట్గా ఉంటున్నాడు’ అని అనుకుంటారు. దీంతో రౌడీ అదేంటో నేను తెలుసుకుంటా అని హిమతో అంటుంది. అయితే లోపలి నుంచి వాళ్లిద్దరూ మాట్లాడుకునేదంతా దీప వింటుంది. మరోవైపు సౌందర్య దీప ఇంట్లో నిన్న ఏం జరిగి ఉంటుందా? అని ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్ బ్యాగ్ పట్టుకుని కిందకు వస్తాడు. శ్రావ్య కార్తీక్తో టిఫిన్ తీసుకురమ్మంటారా బావగారు అని అడగ్గానే.. ‘వద్దమ్మా నేను మీ అక్క ఇంట్లో.. అదే మా ఇంట్లో చేస్తాను’ అని కార్తీక్ అంటాడు. వెంటనే సౌందర్యతో ‘మీ అక్కా పిల్లలతో కలిసి మా ఇంట్లో భోజనం చేస్తాను.. ఆహా వినడానికి ఎంత సంస్కారవంతంగా ఉందిరా.. ఈ మాట చెప్పడానికి నీకు పదేళ్లు పట్టింది’ అని అంటుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటూ అవును మమ్మీ పెద్ద తప్పు చేశాను.. అదే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని అనగానే వెంటనే సౌందర్య మరి ఆ తప్పుని(మోనిత ప్రెగ్నెన్సీ విషయం) అంటూ ప్రశ్నిస్తుంది. అలాగే సౌందర్య మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది కార్తీక్.. నిన్ను చూస్తే కాదు.. దీప, పిల్లలు గుర్తోస్తే అంటుంది. అంతేగాక పిల్లలు, దీపా పదేళ్లుగా పడిన కష్టాలను ఆమె కార్తీక్కు గుర్తు చేస్తుంది. ‘శౌర్య సొంత తండ్రిని నాన్న అని పిలవడానికి ఎంతలా ఆలోచిందిరా, ఇంత ఐశ్యర్యం ఉన్నా బస్తిల్లో లేనివాళ్లలా ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు నువ్వు మారిపోయి అంతా బాగుంటుందని సంతోషించే సమయానికి పెద్ద ప్రళయాన్ని సృష్టించావు. రేపు మోనితను కడుపుతో చూసి పిల్లలు ఆమె భర్త ఎవరని అడిగితే ఏం సమాధానం చెబుతవురా’ అని నిలదీస్తుంది సౌందర్య. దీంతో పరిస్థితి అంతవరకు రానివ్వను మమ్మీ అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య కోపంతో ‘పళ్లు రాలగోడతాను’ అని కార్తీక్పై అరుస్తుంది. మోనిత అంటే ఆడబొమ్మ కాదురా.. ఆడపల్లి ఆమె ఎలాంటిదైన కానీ ఒక మాగాడి వల్ల తల్లి అవ్వడం అంటే చిన్న విషయం కాదురా. మోనిత పొగరుదే కావచ్చు, పరాయి అడదాని భర్తను కోరుకున్నదే కావచ్చు. పదహారేళ్లుగా చూస్తున్నా మోనితా నిన్ను తప్పా మరే మగాడిని వేరే దృష్టితో చూడలేదు. నువ్వే ప్రాణంగా బతికింది. అందుకే అది ప్రమాదకారి అని ఎన్నోసార్లు హెచ్చరించిన వినలేదు. ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడ్డావు. అందరిని పడేశావు. నువ్వు ఇప్పుడు నా భార్య, పిల్లలు అంటే ఆమె ఊరుకుంటుందా? నా పరిస్థితి ఏంటని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది’ అంటుంది సౌందర్య మధ్యలో మోనిత ఫోన్ చేయడంతో కార్తీక్ కట్ చేస్తాడు. అయినా పదే పదే ఫోన్ చేస్తుండటంతో కార్తీక్ ఫోన్ స్విచ్చావ్ చేస్తాడు. దీంతో మోనిత ‘నా ఫోన్ కట్ చేస్తాడా? ఇంతకు ముందు చేస్తున్నాడంటే ఒకే కానీ ఇప్పుడు నా గురించి తెలిసి కూడా కాల్ కట్ చేస్తున్నాడేంటి?’ అంటే కార్తీక్ నన్ను కట్ చేస్తున్నాడా? అలా జరగకూడదు’ అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తన చీర ఐరన్ చేయమని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప పిల్లను తీసుకుని గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కార్తీక్ జనతా హాస్పిటల్ అనే బోర్డు పెట్టి ఉచిత వైద్యం అందించబడును అనే బోర్డు పెడతాడు. అది చూసి పిల్లలు దీప షాక్ అవుతారు. లోపలి నుంచి కార్తీక్ బయటకు వస్తాడు. పిల్లలు ఇక ఇక్కడే ఉంటావా నాన్నా అని అడగ్గానే ‘అవునమ్మా ఇక నుంచి ఇక్కడే ఉంటాను.. ఇక్కడే వైద్యం చేస్తాను’ అంటూ దీపను చూస్తూ సమాధానం ఇస్తాడు. ఇక పేదవారికి ఉచిత వైద్యం చేస్తానంటూ దీపతో లక్ష్మణ్కు ట్రీట్మ్మెంట్ చేస్తానని చెప్పి రమ్మని చెప్పుమంటాడు. దీంతో హిమ అమ్మా నువ్వు ఇప్పుడు హ్యాపీనేగా అని అడుగుతుంది. దీప మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో శౌర్య నాన్న చాలా మంచివాడని తనకు చిన్పప్పుడే తెలుసని, భలబద్రాపురంలో ఉన్నప్పుడు నాన్నని క్యాంప్లో చూశాని అప్పటి విషయం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు నీతో పాటు మోనిత ఆంటీ కూడా వచ్చింది కదా నాన్నా అని శౌర్య అనగానే దీప రెండు కనుబొమ్మలు పైకి లేపి కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
కార్తీక్కు మోనిత వార్నింగ్, 10 రోజులు డెడ్లైన్.. లేదంటే నీ ఫ్యామిలీ..
కార్తీకదీపం జూన్ 14: కార్తీక్ దీపతో మాట్లాడుతూ తను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దీప మాత్రం కార్తీక్ వంక కోపంగా చూస్తుంటే అలా చూడకు దీప.. ఆ చూపులు తట్టుకోలేను అంటాడు. అదంతా చాటుగా హిమ, శౌర్యలు వింటారు. కానీ దీప మాత్రం కరగదు. సీరియస్గా ఒకటి అడుగుతా చేస్తారా? అని అంటుంది. అదేంటో.. దీప కార్తీక్ మాటలకు కరిగిపోతుందా? లేదా! అనేది నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ‘నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు.’ అంటాడు దీప కళ్లల్లోకి చూస్తూ. ‘నువ్వు, పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఏదీ ముఖ్యం కాదు దీపా.. నాకు నువ్వు కావాలి పిల్లలు కావాలి. అంతకంటే ఏమీ వద్దు దీప.. ’ అనే కార్తీక్ మాటలు విని పిల్లలు సంతోషిస్తుంటే.. దీప మాత్రం అవునా అన్నట్లు వెటకారంగా చూస్తుంది. ‘నా మాటల నమ్మనట్టుగా అలా చూడకు దీపా.. ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీపా.. నేను భరించలేకపోతున్నాను.. ఏదో ఒకటి మాట్లాడు.. ప్లీజ్’ అంటాడు కార్తీక్. కార్తీక్ తను ఏ తప్పు చేయలేదు నమ్ము దీప అని ప్రాధేయపడ్డ కూడా దీప కరగదు. దీంతో కార్తీక్ ‘నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కనీసం తిట్టు దీపా.. మనసులోని ఉన్న కోపాన్ని మాటల ద్వారా చూపించి నీ కసి తీర్చుకో’ అంటాడు. దీంతో దీప ఒక మాట అడుగుతాను చేసిపెడతారా? అని అడుగుతుంది. దీంతో కార్తీక్ సంబరపడిపోతూ నువ్వు నోరు తెరిచి అడిగావ్ అది చాలు నాకు.. నువ్వు ఏం అడిగిన సరే అది చేసి పెడతాను.. చెప్పు ఏం చెయ్యమంటావు ఈ దేశాన్నే వదిలి విదేశాలకు వెళ్లిపోదామా? అని అంటాడు. ‘నీకు ఏ దేశమంటే ఇష్టమో చెప్పు పిల్లలని తీసుకుని అక్కడే సెటిలైయిపోదాం.. పిల్లల్ని తీసుకుని వెళ్లిపోదాం. మనమిద్దరం మనకిద్దరు అన్నట్లు బతుకుదాం’ అంటాడు. దానికి దీప అప్పుడు మోనితకి అన్యాయం చేసినట్లు అవుతుందిగా.. నేను మన సంగతి మాట్లాడటం లేదు.. మాట్లాడను కూడా అంటూ సరోజక్క మరిది లక్ష్మణ్ విషయం అడుగుతుంది. మీ చెయ్యి మీ మనసు మంచిదని నమ్ముతున్నాడు అంటుంది. ఆ నమ్మకాన్ని పోనివ్వకూడదని మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ నమ్మకాన్ని నిలబెడతారా? మిమ్మల్ని దేవుడు అన్నాడు. వైద్యం చేస్తారా? అతడిని మీ దగ్గరకు పంపించమంటారా? అంటుంది దీప. దీంతో కార్తీక నిరాశగా లేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సౌందర్య, ఆదిత్య, శ్రావ్యలు కార్తీక్ పిల్లల్ని తీసుకుని తీసుకొస్తాడని నిద్రపోకుండా ఎదురు చూస్తుంటారు. ఆదిత్య కార్తీక్ చేసిన తప్పు గురించి ఎత్తడంతో సౌందర్య కార్తీక్ వైపే మాట్లాడుతుంది. దీంతో ఆదిత్య నేను తప్పుగా అన్నానా మమ్మీ, అన్నయ్య తప్పు చేయలేదంటావా? అని ప్రశ్నించగా సౌందర్య ‘నేను తప్పు కాదు అనడం లేదురా వాడు తిరగబడి నా ఇష్టం అనట్లేదుగా. చేసిన తప్పుకు పశ్చాతాప పుడుతున్నాడు, సిగ్గుతో తలవంచుకుంటున్నాడు. అందుకే వాడంటే జాలి కలుగుతోంది’ అంటుంది బాధగా. కార్తీక్ నిద్రపోతున్న హిమ, శౌర్యను లేపి ఎక్కడ ఉంటారని అడగ్గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అని సమాధానం ఇస్తారు. దీంతో నేను వెళ్లి మీ బట్టలు తెస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ఇక తెల్లారి హిమకు ఏదో వాసన రావడంతో మెలుక వస్తుంది. కిచెన్లోకి వెళ్లి చూడగా పాలన్నీ పొంగి కింద వరకూ ఒలిగిపోతాయి. అది చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తుంది హిమ. దీప బాధగా బయట కూర్చుని ఉండటం చూసి దగ్గరికి వెళ్లి ‘అమ్మా నీకు ఏమైంది. నాన్న మీద ఎందుకు కోపం’ అని అడుగుతుంది. తరువాయి భాగంలో.. మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్కు వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా పదోరోజులోగా నాకు సరైన సమాధానం, నాకు న్యాయం జరిగే నిర్ణయం రాకపోతే.. మొత్తం నీ ఫ్యామిలీ గడగడా వణికిపోయేలా చేస్తాను బీ రేడి అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. -
హిమ తర్వాత అంతగా నేను ప్రేమించింది నిన్నే దీప: కార్తీక్
కార్తీకదీపం జూన్ 12: అమ్మని మళ్లీ తిట్టి పంపేశావా డాడీ, అమ్మ అంటే నీకు జాలి లేదా?’ అంటూ ఎమోషనల్గా ప్రశ్నిస్తుంటారు పిల్లలు. దీంతో నాతో రండీ అని పిల్లల్ని తీసుకుని దీప ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. ఇక మోనిత తన ఫోన్లో పిల్లల ఫొటోలు చూస్తూ మురిసిపోతుండగా ప్రియమణి పాలు తీసుకుని రావస్తుంది. అవి తాగుతూ.. ‘కడుపుతో ఉన్నాను కదా కాస్త కారం, ఉప్పు, మసాలాలు తగ్గించు’ అంటుంది. సరేనమ్మ అన్న ప్రియమణి అనుమానంగా ‘మీరు నిజంగానే కడుపుతో ఉన్నారా? లేక నాటకం ఆడుతున్నారా’ అనడంతో మోనిత ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ‘ఏం మాట్లాడుతున్నావే. ఈ విషయంలో నేనేందుకు అబద్దం ఆడతాను, నేను కడుపుతో ఉన్నాననేది నిజం.. నా ఈ కడుపుకి మీ కార్తీక్ అయ్యే కారణం అన్నది ఇంకా పచ్చినిజం’ అటూ ఆవేశ పడుతుంది మోనిత. మరోవైపు దీప పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండగా హిమ, శౌర్య అమ్మా.. అంటూ వచ్చి ఆనందంగా పట్టుకుంటారు. వెంటనే గుమ్మం దగ్గరే ఆగిపోయిన కార్తీక్ని చూసి ‘పిల్లలు రాగానే నన్ను అడిగి ఉంటారు.. నా దగ్గర వదిలపెట్టడానికి తీసుకొచ్చి ఉంటారు’ అని మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడికి మళ్లీ ఎందుకచ్చావమ్మా నాన్న నిన్ను ఏమైనా అన్నాడా? అని పిల్లలు అడగ్గా దీప నాకెందుకో అంతపెద్ద ఇంట్లో కంఫర్ట్గా ఉండటం లేదని సమాధానం ఇస్తుంది. వెంటనే హిమ బాధగా.. ‘మరి డాడీకి ఇక్కడ కంఫర్ట్గా ఉండరు కదమ్మా’ అని అనగానే దీప కోపంగా కార్తీక్వైపు కళ్లు తిప్పి ‘ఆయనకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే.. అక్కడుండొచ్చు’ అంటుంది. దీంతో కార్తీక్ వెంటనే మీ అందరితో కలిసి తను ఇక్కడే ఉంటానని అంటాడు. ఆ తర్వాత కార్తీక్తో దీపతో కాస్తా మాట్లాడాలని చెప్పి పిల్లలను పడుకొమ్మంటాడు. అయితే కార్తీక్ భోజనం చేశావా? అని అడగ్గానే తిన్నాని అబద్ధం చెబుతుంది దిప. ఇదిలా ఉండగా మోనితకు తను పురిటినొప్పులతో చనిపోయినట్లు పిడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది. ఇలాంటి పీడకల వచ్చిందేంటని కంగారు పడుతుంది. అన్నట్టు చనిపోయినట్లు కలొస్తే మంచి జరుగుతుంది అంటారు కదా.. నాకూ మంచే జరుగుతుంది. అయినా నేను అంత త్వరగా ఎందుకు చస్తాను.. నా కార్తీక్తో సంతోషంగా ఉంటాను అనుకుంటూ పడిపడి నవ్వుకుంటుంది. వెంటనే కార్తీక్ వంటగదిలోకి వెళ్లి గిన్నెలో అన్నం ఉండటం చూసి దీప తినలేదని తెలుసుకుంటాడు. దీపతో మాట్లాడాలని హాల్కు తీసుకుని వస్తాడు కార్తీక్. అన్నం పెట్టుకుని కలుపుతూ దీపను తినమన్నట్లు ముద్ద పెడతాడు. కానీ ఆమె సీరియస్గా చూసేసరికి చేయి తీసుకుని దీప చేతిలో అన్నం ముద్ద పెడతాడు. ప్లీజ్ తిను దీప అని చెప్పడంతో ఆమె తింటుంది. కార్తీక్ అన్నం కలుపుతూ ‘నేను నటించడం లేదు దీపా.. నా కసలు నటించడం చేతకాదు.. మనసుకి అనిపించింది పైకి అనేస్తాను.. లోలోపల ఏది దాచుకోను. కార్తీక్ అంటే కచ్చితం.. కార్తీక్ అంటే స్పష్టత’ అని తన క్యారెక్టర్ ఏంటో దీపకు చెప్పాలనుకుంటాడు. ఇక కార్తీక్ కాలేజీ రోజుల్లో హిమను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానని, ఆ తర్వాత అంతగా ప్రేమించింది నిన్నే దీప అని చెబుతాడు. ‘హిమ చనిపోయాక కొన్నాళ్లు పిచ్చొడిని ఆయ్యాను, జీవితంలో ఇక పెళ్లి అనే మాటే లేదు అనుకున్నాను నిన్ను చూసేదాక.. నీ ఆత్మ సౌందర్య నాకు నచ్చి.. హిమ తర్వాత నేను ఇష్టపడింది ప్రేమించింది నిన్నే. నిన్ను కోడలిగా అమ్మ అంగీకరించదని తెలిసినా నీ మెడలో తాళి కట్టాను.. నెమ్మదిగా కన్విన్స్ చెయ్యొచ్చు అనుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు’ అంటూ దీప కళ్లలోకే చూస్తూ చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందనేది సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
దీప ఇంట్లో లేదని కనిపెట్టిన శౌర్య, కార్తీక్ను నిలదీసిన హిమ..
కార్తీకదీపం జూన్ 11: హిమ, శౌర్యలు ఇంటికి తిరిగి వస్తారు. వారిని చూసి అంతా షాక్లో ఉండిపోతారు. అది గమనించిన పిల్లలు మీలో మేము వచ్చి ఆనందంగా కనిపించకపోగా అప్పుడే ఎందుకొచ్చారా? అన్నట్టు చూస్తున్నారని ప్రశ్నిస్తారు. కాసేపటికి అమ్మ కనిపించడం లేదని అడగ్గానే అందరు ఒకరి మొహలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(జూన్ 11వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ఇంటికి వచ్చిన పిల్లలు అమ్మ ఎక్కడ కనిపించడం లేదని అడగ్గానే అందరు కంగుతింటారు. ఆ తర్వాత సౌందర్య ముందు ఫ్రెష్ అయ్యి రండి అనడంతో శ్రావ్య బ్యాగ్స్ తీసుకుని పిల్లల్ని పైకి తీసుకుని వెళుతుంది. హిమ మాత్రం కార్తీక్నే గమనిస్తూ వెనక్కి వచ్చి ఏం అయ్యింది డాడీ బాగా డల్గా కనిపిస్తున్నావని అడగ్గా.. ‘మీ మీద బెంగ పెట్టుకున్నాడే.. ప్రశ్నలు ఆపి వెళ్లు’ అని సౌందర్య పంపిస్తుంది. దీంతో కార్తీక్ కాస్త రిలాక్స్ అవుతాడు. మురళీ కృష్ణ దీప ఇంటి నుంచి తిరిగి వచ్చి అన్ని మర్చిపోయి కార్తీక్తో ఉండమని, కాపురం చక్కదిద్దుకొమ్మని చెబుతామనుకుంటే అసలు ఆ విషయమే నాతో చెప్పనివ్వలేదంటూ సలహాలు ఏం ఇవ్వద్దు నాన్నా తినేసి వెళ్లు అందని భాగ్యంతో చెబుతూ బాధపడతాడు. దాంతో భాగ్యం ఆ మోనిత అనుకున్నది మాత్రం సాధించింది అంటూ తిట్టిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత ఇంట్లో వాంతులు (వేగుళ్లు) చేసుకుంటుంది. ప్రియమణి చెవులు మూసి సాయం చేస్తుంది. ఆ తర్వాత మీది ఎవరి పోలిక అమ్మాని మోనితని అడుగుతుంది. మోనిత.. నవ్వుతూ ‘ఈ ప్రపంచంలో నాకు ఎవరితో పోలికే లేదే. నేనో స్పెషల్ అంతే.. కాకపోతే ఇంకా ఆరో నెలల్లో నా పోలికలతోనే మరో ప్రాణి ఈ భూమ్మిద పడదుతుంది’ అంటు మురిసిపోతుంది. దీప సరోజక్క మరిది లక్ష్మణ్ గురించి అతడి రిక్వస్ట్ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో సరోజక్క వచ్చి ఆమె మరిది లక్ష్మణ్ వచ్చిన విషయం గరించి అడుగుతుంది. ‘అది నువ్వేమీ పట్టించుకోకు దీప, డక్టర్ బాబు, నువ్వు బాగుంటే ఇక్కడకి నువ్వేందుకు వస్తావు. అది కూడా ఆలోచన లేని అమాయకుడు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు నువ్వు డాక్టర్ బాబుతో ఏం చెబుతావు? పక్క మనిషి గురించి పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయాయి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో.. అన్నింటికీ సిద్ధపడే ఉండాలి. అందరితో పాటే ఇతడు కూడా భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే.. బతుకుతాడు. లేదంటే లేదు. పాపం మా చెల్లెల్ని తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. సరేలే నువ్వేం ఆలోచించకు. వస్తాను దీపా’ అంటూ వెళ్లిపోతుంది. ఇక సరోజక్క వెళ్లగానే దీప లక్ష్మణ్కి వైద్యం చేయించమని డాక్టర్ బాబుతో చెప్పాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో.. ఈ టైమ్లో ఈ గోలంతా ఏంటీ అంటారా? అంటూ ఆలస్యం చేయకుండా లక్ష్మణ్ విషయం ఎలగైనా ఆయనకు చెప్పాలని మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా శౌర్య తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీప గదికి వెళ్లి ఆమె బ్యాగు, కబోర్డ్లో బట్టలు చూస్తుంది. అవి ఉండకపోయేసరికి అమ్మ ఇంట్లోంచి మళ్లీ వెళ్లిపోయింది అని తెలిసి ఏడుస్తుంది. అసలు ఎందుకు వెళ్లిందని, నాన్న ఏమైనా అన్నాడా? నాన్న తిట్టి అమ్మను పంపిచాడా? అసలు ఎక్కడ ఉన్నావమ్మా అంటు కుమిలి కుమిలి ఏడుస్తుంది. వెంటనే కార్తీక్ని నిలదీయడానికి వెళుతుంది. సరిగ్గా అప్పుడే హిమ తల్లి గురించి కార్తీక్ని, సౌందర్యని నిలదీస్తుంది. అప్పుడే ఆవేశంగా వచ్చిన శౌర్య ‘లేదు హిమా.. అమ్మ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది’ అంటుంది. ఆ తర్వాత శౌర్య, హిమలు ఏడుస్తూ అమ్మ ఎక్కడికి వెళ్లిందని, నువ్వే పంపించావా నాన్న? అంటు రకరకాల ప్రశ్నలు వేస్తూ కార్తీక్ను నిలదీస్తారు. ఏం సమాధానం చెప్పలేక కార్తీక్ తల దించుకుంటాడు. -
కార్తీక్ని మాటలతో చంపేసిన సౌందర్య, చివరికి ట్విస్ట్ ఏంటంటే..
కార్తీకదీపం జూన్ 10: దీపను ఇంటికి తీసుకువద్దామని వెళ్లిన కార్తీక్కు నిరాశ ఎదురైంది. కార్తీక్ మాట్లాడుతున్న పట్టించుకోనట్లుగా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ కార్తీక్ తప్పు చేశాడన్న విషయాన్ని నమ్ముతున్నట్లు చెప్పకనే చెబుతుంది. దీంతో కార్తీక్ బరువెక్కిన గుండెతో ఇంటికి తిరిగి వస్తాడు. మరోవైపు మోనిత వీడియో మెసెజ్ పంపి బుల్లి కార్తీక్ పుడతాడంటు మురిసిపోతుంది. కార్తీక్ తన తప్పుకు కుమిలిపోతు బాధతో మేడపైకి వెళ్లగా అప్పటికే సౌందర్య అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మేడపైకి వెళ్లగా అక్కడ సౌందర్యను చూసి తలదించుకుని వెనక్కి తిరుగుతాడు. కొడుకుని చూసి సౌందర్య పెద్దోడా.. ఇలా రా అని పిలిసి ‘నా కొడుకు నా ముందు తలదించుకున్నాడు.. నా కొడుకు యోగ్యుడు, శ్రీరామచంద్రమూర్తి అని మురిసిపోయేదాన్ని. నీ దగ్గర నుంచి ఇది ఊహించలేదురా’ అంటుంది సౌందర్య బాధగా. దీంతో కార్తీక్ తను కూడా ఇది ఊహించలేదు మమ్మీ అంటూ ధీనంగా మొహం పెడతాడు. సౌందర్య ప్రతి ఒక్కరిలోనూ దైవత్యమూ ఉంటుంది రాక్షత్వమూ ఉంటుంది. కానీ బలహీనక్షణాల్లో కూడా లోపలి రాక్షసుడ్ని బయటికి రానివ్వని వాడినే సంస్కారవంతుడు అంటు కార్తీక్తో నా కొడుకు సంస్కారవంతుడు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఒక మామూలు మగాడివే అని నిరూపించుకున్నావు అంటుంది. అంతేగాక నీలో అనుమానం తప్ప ఇంకేలోపం లేదని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు దీప గర్వంగా తల ఎత్తుకుంది, నువ్వు తలదించుకుని పాతాళానికి దిగజారవు అంటు మట్లాడుతుంది సౌందర్య. అలాగే మీ నాన్నగారు ఫోన్ చేసి పిలలు ఇంటికి వెళ్లిపోదామంటు గోల చేస్తున్నారని చెప్పారు, ఇవాళ రేపో వాళ్లు వస్తే అమ్మ ఏదని అడిగితే ఏం సమాధానం ఇస్తావని ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు దీప ఏ తప్పు చేసిందని నిందించావో, దూరం పెట్టావో అదే తప్పు నువ్వు చేశావని పిలలతో చెప్పగలవా? ఈ సారి కాలుష్యం నావైపు వీచింది అని చెబుతావా? ఏం చెప్పాలో తెలియక తప్పు వాళ్ల అమ్మ మీదకు మాత్రం నెట్టకురా.. ఆడవాళ్లంటే నీకు లోకువ కదా.. మగబుద్ధి చూపిస్తావేమోనని చెబుతున్నాను అంటు మాటలతో కార్తీక్ను బాధపెడుతుంది సౌందర్య. ఒకవేళ పిల్లలను తీసుకురాకని మీ నాన్నతో చెబితే ఆయన ఎందుకని అడిగితే ఏం చెప్పాలి, మళ్లీ మీరు తాత కాబోతున్నారని నువ్వు చేసిన ఘనకార్యం చెప్పమంటావా? అంటూ నిలదీస్తుంది. దీంతో కార్తీక్ వెంటనే సౌందర్య చేతులు పట్టుకుంటాడు. సౌందర్య ‘భయపడకు కార్తీక్.. చెప్పనులే.. అంతటి శుభవార్త విని ఆయనకు ఏదైనా అయితే భరించాల్సింది నేనే కదా.. నాకంత ధైర్యం లేదు కార్తీక్’ అంటూ సౌందర్య ఏడుస్తుంటే కార్తీక్ కూడా ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.కార్తీక్ తన పాపానికి ప్రాయిశ్చిత్తం లేదని, ఒక పవిత్రమూర్తిని ఏ విషయంలో క్షోభపెట్టానో వాస్తవానికి ఆ నేరం తాను చేసినందుకు చచ్చిపోతే బాగుండు అనిపిస్తోందంటు ప్రశ్చాతాప పడతాడు. ఈ నరకం అనుభవించే కంటే ఒక్కసారిగా ప్రాణం పోతే బాగుంటుందనిపిస్తోంది మమ్మీ.. నన్ను చంపెయ్ మమ్మీ అంటాడు కార్తీక్. కానీ ఒక్కటి మాత్రం నిజం మమ్మీ.. ఇది ఏదో పొరపాటువల్ల జరిగింది కానీ దీప మీద ప్రేమ లేకో.. మోనిత మీద మోజుతోనూ కాదు నన్ను నమ్ము మమ్మీ.. కోడలు తప్పు చేసిందంటేనే నమ్మని దానివి.. కొడుకు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేశాడంటే నమ్ముతున్నావా అని ధీనంగా అడిగే సరికి సౌందర్య మనసు కాస్త కరుగుతుంది. ‘నువ్వు కావాలని ఈ తప్పు చెయ్యలేనది నేను నమ్ముతాన.. కానీ అది అక్కడ అవకాశం కోసం గోతికాడ నక్కలా కాచుకుని ఉందిరా.. బలహీన క్షణంలో నిన్ను రెచ్చగొట్టి ఉండొచ్చు.. కానీ తప్పు తప్పే కదా కార్తీక్.. ఏదో చిన్న తప్పు అని చెరుపేసుకోలేం కాదుకదా.. ఆ మోనిత మంచిది కాదురా కాపురంలో నిప్పులు పోసే ఆడదిరా అలాంటి వారికి దూరంగా ఉండరా ఎంతటి నీచానికైనా దిగజారుతుందిరా అని నేను నీ భార్య చిలక్కి చెప్పినట్లు చెప్పాం. కానీ నువ్వు పెడచెవిన పెట్టావు. చివరికి ఫలితం అనుభవిస్తున్నావు’ అంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా దీప సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. గతంలో డాక్టర్ బాబు తన వైద్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తాడు. మళ్లీ తనకు కాస్త నీరసం పెరిగిందని, కార్తీక్ దగ్గర వైద్యం ఇప్పించాలని కోరతాడు. దీంతో తనకు కొంచం టైం కావాలంటుంది దీప. సరేనంటు అతడు వెళ్లిపోతాడు. కార్తీక్, సౌందర్య భోజనం చేస్తుంటే సడెన్గా శౌర్య, హిమలు వస్తారు. వారిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో పిల్లలు మేము ఎందుకు వచ్చామా అన్నట్లు చూస్తున్నారెంటి, మేము ఇంతా ఆనందంగా ఉంటే అంటు ప్రశ్నిస్తారు. దీంతో సౌందర్య వాళ్లకు ఏదో చెప్పి నచ్చజెబుతుంది. ఆ తర్వాత అమ్మ ఏది అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సీరియల్ కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడున్నరేళ్లుగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్లో నెంబర్1 స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ వస్తుందంటే అన్ని పనులు పక్కనపెట్టి మరీ సీరియల్ను చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. మలయాళంలో వచ్చిన ‘కరుతముత్తు' అనే సీరియల్ రీమేకే కార్తీకదీపం. ఈ ఒక్క సీరియల్తో కేరళలో బాగా పాపులర్ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్. దీంతో రీమేక్లోనూ ఆమెనే తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1991 డిసెంబర్2న కేరళలలో జన్మించిన ప్రేమీ విశ్వనాథ్ తండ్రి పేరు విశ్వనాథ్ కాగా, తల్లి కాంచన. లా చదివిన ప్రేమీ విశ్వనాథ్ ఓ ప్రైవేటు సంస్థకు లీగల్ అడ్వైజర్గా పనిచేసింది. ఇక సీరియల్స్లో నటించేకంటే ముందే మోడల్గానూ రాణించిందని సమాచారం. అంతేకాకుండా సొలోమన్ 3డీ అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈమె అన్నయ్య శివప్రసాద్ ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్ కూడా సోదరుడి లాగే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పనిచేసిందట. ఇక ప్రేమీ విశ్వనాథ్ భర్త డా.వినీత్ భట్ ఆయన ఆస్ర్టాలజీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు సైతం గెలుచుకున్నారు. ఈయన వద్దకు పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన వాళ్లు వస్తుంటారట. వినీత్ భట్ సూచనలతో తమ పేర్లలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రేమీ విశ్వనాథ్-వినీత్ భట్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కార్తీకదీపంతో బాగా పాపులర్ అయిన వంటలక్కకు తెలుగులో పలు సినీ అవకాశాలు వస్తున్నాయట. కానీ ఇప్పటివరకు ఆమె ఒక్క ప్రాజెక్టుకు కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! -
బుల్లి కార్తీక్ పుడతాడంటూ.. కార్తీక్కు మోనితా వీడియో మెసెజ్
కార్తీకదీపం జూన్ 9: దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి దీప ఇంట్లో లేదని తెలుసుకున్న సౌందర్య, ఆదిత్యలతో మీరు ఆపలేదా? అని అడగ్గా ఏందుకు ఉండాలి ఇక్కడ? అని ప్రశ్నిస్తుంది సౌందర్య. దీంతో అసలేం జరిగిందో కార్తీక్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సౌందర్య వినిపించుకోకుండా... ఇది నాకు కాదు నీ భార్యకు, నీ వల్ల గర్భవతి అయిన ఆ మోనితకు అంటుంది. ఇక కార్తీక్ దీపను తీసుకురావడానికి శ్రీరాంనగర్ బస్తీకి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(మంగళవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. దీప శ్రీరామ్ నగర్ బస్తీలో ఇంటి ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటే వారణాసి ఇళ్లంతా కడుగుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వారణాసితో మీ అక్క నాతో ఇంటికి వస్తుందని చెబుతాడు. దీంతో దీప వెంటనే వద్దులే డాక్టర్ బాబు ఎవరు ఎక్కడుండాలనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు.. మీరు నేను కాదు అంటుంది. కార్తీక్ ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. దీప మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. ‘అసలు నీ మనసులో ఏం ఉంది దీపా? నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అంటు వివరిస్తుంటాడు. కానీ దీప వినదు. కుర్చీ వెయ్యనా.. భోజనం చేశారా? అంటూ పొంతన లేని సమాధానాలిస్తూ, ఆ విషయం అనవసరం అన్నట్టు ప్రవర్తిస్తుంది. అయినా కార్తీక్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే వారణాసిని అడ్డు పెట్టుకుని ‘ఇక చాలు వారణాసీ.. ఎంతసేపు కడుగుతావు.. వదిలెయ్’ అంటు కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. దీంతో కార్తీక్ తనని అర్థం చేసుకునే అవకాశమే లేదని అర్థమైందని తలదించుకుంటాడు. ‘నన్ను క్షమించే ప్రసక్తే లేదని క్లియర్గా తెలుస్తోంది.. నీకంటే నేనే దురదృష్టవంతుడ్ని దీపా.. నీకంటే ఎక్కువగా నేనే నష్టపోయాను’ అంటు పశ్చాత్తాపపడతాడు కార్తీక్. అయినా దీప తన తీరు మార్చుకోకుండా ‘మంచి నీళ్లు కూడా తేవాలి వారణాసీ’ అంటుంది. సీన్ వారణాసికి కూడా అర్థమై బాధగా, మౌనంగా చూస్తాడు. ఇక కార్తీక్ వెళ్లొస్తాను అని ముందుకు కదలడంతో భోజనం చెయ్యరా? అని అడుగుతుంది దీప. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కార్తీక్ అనగా.. ‘ఈ ఇంట్లో అయినా..ఆ ఇంట్లో అయినా.. మరింకెక్కడైనా భోజనం మాత్రం మానకండి’ అని దీప సమాధానమిస్తుంది. కార్తీక్ తప్పు చేశాడని తాను కూడా నమ్మతున్నట్లు చెప్పకనే చెబుతుంది దీప. మురళీ కృష్ణ దీప గురించి బాధపడుతుంటే.. భాగ్యం వచ్చి దీప జీవితం నిలబడే మార్గం ఒకటుందయ్యా అంటూ.. ‘అల్లుడు తప్పు చేశాడని దీప తనతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు.. ఆ మాటకొస్తే నీ మొదటి పెళ్లాం చచ్చిపోతే నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోలేదా? నేను నీతో కాపురం చెయ్యట్లేదా? ఇదీ అంతేనయ్యా.. కాకపోతే దీప ఉండగానే మోనితకి కడుపు చేశాడు.. ఇప్పుడు గొడవలకు పోయి జీవితం నాశనం చేసుకోవడం కంటే.. రాజీ పడి కలిపోవడం మేలు.. లేదంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. కొంచెం ఆలోచించయ్యా’ అని సలహా ఇస్తుంది భాగ్యం. అది విని మురళీ కృష్ణ నిజమే అంటూ ఆలోచనలో పడతాడు. కార్తీక్ తన రూమ్లో జరిగిందంతా తలుచుకుని కుమిలిపోతూ.. ఆ రోజు రాత్రి మోనిత ఇంట్లో డ్రింక్ చేసిన సీన్ గుర్తు చేసుకుని.. అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటాడు. ‘బుద్ది లేదా రా నీకు.. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక ఆడపిల్ల ఇంట్లో డ్రింక్ చెయ్యడమేంట్రా.. ముందు కొడితే.. సంస్కారం ఏం అయిపోయింది.. మమ్మీ ఎప్పుడూ అంటుంది నువ్వు స్టుపిడ్ అని.. నిజంగానే నేను స్టుపిడ్ని..’అని తిట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే మోనిత ఓ వీడియో మెసెజ్ పంపిస్తుంది. ఇంతలో మోనిత కార్తీక్కు వీడియో మెసేజ్ పంపిస్తుంది. ‘హాయ్ కార్తీక్.. ఎలా ఉన్నావ్.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడా? మగా? అని డౌట్ వచ్చింది. నేను గైనకాలజిస్ట్ కాబట్టి స్కాన్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ అది నేరం.. అయినా డెలివరీ అయ్యేదాకా ఆగితేనే థ్రిల్ అంటుంది. ఇంతకీ నీకు ఎవరు కావాలి పాపా? బాబా? పాప వద్దులే.. ఆల్ రెడీ మనకు ఇద్దరున్నారు కదా.. మనకు బాబే కావాలి. దేవుడ్ని నేను అదే కోరుకుంటాను.. బుల్లి కార్తీక్ని ఇవ్వమని.. ఐ లవ్ దట్ ఫీలింగ్ బై' అంటుంది వీడియోలో. అది చూసి కార్తీక్ తలపట్టుకుని మరింత కుంగిపోతాడు. మోనిత మాత్రం సంబరపడిపోతూ ‘ఇదేంటి కార్తీక్ నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు..నన్ను దూరం పెడుతుతున్నాడా? అంటే కార్తీక్ కూడా కొంత మంది మగాళ్లలా అవసరం తీరాక వదిలెయ్యాలనుకుంటున్నాడా? అని ఓ సెకన్ కంగారుపడుతుంది. కానీ అంతలోనే నా కార్తీక్ అలా చేయడు. ఏదో కంగారులో ఉండి సమాధానం ఇవ్వలేదనుకుంటా’ అంటూ సరిపెట్టుకుంటుంది మోనిత. -
karthika Deepam: మోనితపై కార్తీక్ ఫైర్, నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది..
కార్తీకదీపం జూన్ 5: కార్తీక్ దీప కాళ్లు పట్టుకుని, నిజం చేప్పేలోపే మోనిత వచ్చి కథ అంతా మారుస్తుంది. తాను గర్భవతిని అని దీవించండి అంటూ సౌందర్యతో అంటుంది. అది విన్న వారంత ఒక్కసారిగా షాక్ అవుతారు. మరీ మోనిత చెప్పింది నమ్ముతారా! మరీ దీప ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నదనేది నేటి(శనివారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. నేను నెల తప్పాను ఆంటీ అని చెప్పగానే సౌందర్య కోపంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్’ అంటుంది ఆవేశంగా. ‘ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ..? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అంటుంది మోనిత. దాంతో అంతా షాక్ అవుతారు. వెంటనే కార్తీక్ కోపంగా ‘స్టాపిట్ మోనితా.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇది జోక్ చేసే విషయమా? నీ గురించి అమ్మా దీపా ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ళ్లారా చూస్తున్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పిలవని పేరంటంలా వచ్చేస్తావ్.. రసాబస చెయ్యాలని చూస్తావ్.. నువ్వు నా ఫ్రెండ్వా శత్రువ్వా.. ఎందుకింత దారణంగా మాట్లాడుతున్నావ్?’ అంటాడు ఆవేశంతో ఊగిపోతూ. వెంటనే మోనిత నిజం మాట్లాడుతున్నాను కార్తీక్ అంటు ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. అందరిని నమ్మించేందుకు కార్తీక్ పురషాహంకారం చూపించుకుంటున్నావా ఆడదంటే అంత అలుసా? ప్రెగ్నెంట్ అని అబద్దం చెబుతున్నా అనుకుంటే అది దాస్తే దాగే విషయమా? అంటుంది. పోనీ నా ప్రెగ్నెన్సీకి నువ్వు కారణం కాదంటావా? రేపు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే అది కూడా బటయపడుతుంది కదా.. ఏ ఆడదైనా ఈ విషయంలో అబద్దం చెబుతుందా కార్తీక్.. ఆ దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే కారణం. నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్ కార్తీక్.. అది అబద్దం అని ఇవాళ నా వల్ల నిర్ధారణ అయ్యింది’ అంటుంది మోనిత. దీప బాధగా తలవంచి నిలబడగా.. మోనిత దీపని చూసి లోలోపల నవ్వుకుంటూ దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ‘నన్ను క్షమించు దీప కార్తీక్ నీ విషయంలో తప్పు జరిగిందని గట్టిగా నమ్మేసరికి.. ఒక ఫ్రెండ్గా అతడ్ని సపోర్ట్ చేశాను.. సాటి ఆడదానిగా నీకు అన్యాయం చేశాను.. నువ్వు కళంకితవు కాదు.. పరమ పవిత్రురాలు.. కార్తీక్ ఒక్క క్షణం కాదంటేనే నేను భరించలేకపోయాను. నువ్వు 10 ఏళ్ల పాటు ఈ నింద నువ్వు ఎలా తట్టుకున్నావో ఎలా మోశావో ఊహిచడం నావల్ల కాదు. నువ్వు చాలా గ్రేట్ దీపా హ్యాట్సాప్ టు యూ’ అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక సౌందర్య వైపు తిరుగుతుంది. ‘మీరు చాలా మంచివారు ఆంటీ.. కొడుకు మాట కూడా నమ్మకుండా కోడలికి సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తిత్వం మీది.. నేను ఆడపిల్లనే నాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే ఆలోచించి మీ అబ్బాయికి చెప్పండి.. ఇంకా మీకు ఎవరికీ నమ్మకం కుదురకపోతే.. ఇదిగో నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్’ అని దేవుడు దగ్గర పెట్టి వెళ్లిపోతుంది. మోనిత వెళ్లిపోగానే మురళీ కృష్ణ పెద్దగా నవ్వుతూ.. ‘దీన్ని ఏం అంటారు? మోసమా? కుట్రనా నయవంచనా? ఇంత దారుణమా.. ఇంత నీచత్వమా? ఎలాగో నాకు పిల్లలు పుట్టరనే సాకుతో ఇలా ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటావా? ఇప్పుడు ఆవిడ వల్ల ఈ నిజం బయటపడింది.. బయటపడని బాగోతాలు ఎన్నో? ఇంకెంత మంది అభాగ్యులు ఉన్నారో మీ లిస్ట్లో? అంటూ కార్తీక్ని ప్రశ్నిస్తాడు. ‘మురళీ కృష్ణ గారు..’ అని అరుస్తాడు కార్తీక్. ‘ఆపవయ్యా.. ఆయనకి మూడ్ వస్తే మావయ్యా అంటాడు.. కోపమొస్తే మురళీ కృష్ణా అంటాడు.. మావయ్యా అంటే మురిసిపోవాలి.. నోరుమూసుకుని పోవాలంటే పోవాలి.. ఎందుకంటే దీనికి పెళ్లి ముందు నాకు పిల్లలు పుట్టరు.. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను.. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పండి అభ్యంతరం లేదంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇతడిలోని నిజాయితీకి మురిసిపోయాను’ అంటూ మురళీ కృష్ణ ఏడుస్తూ అంటుంటే కార్తీక్ తలదించుకుంటాడు. దీప బొమ్మలా నిలబడి ఉంటుంది. ‘ఎంతైనా మధ్యతరగతి వాడిని కదా.. పిల్లలు పుట్టకపోతే ఏంటిలే దత్తత తీసుకుంటారులే అనుకుని, నా కూతురు ఇంతటి వాడ్ని మిస్ అయిపోకూడదని.. ఆ విషయం నా కూతురుకి కూడా చెప్పకుండా పెళ్లి చేశాను.. వరమో శాపమో దీని కడుపు పండింది. అప్పటి నుంచి దీపను చేడిపోయావంటు కార్తీక్ అవమానించిన రోజులను గుర్తు చేస్తూ కార్తీక్పై అసహనం వ్యక్తం చేస్తాడు మురళీ కృష్ట. ఇక వెంటనే సౌందర్య వైపు తిరిగి.. ‘చెయ్యని తప్పుకుని ఇన్నేళ్లు నరకం చూపించిన నీ కొడుక్కి ఎలాంటి శిక్ష వేస్తావమ్మా.. నీ కొడుకు వల్ల జీవితమే నాశనం అయిన నా కూతురికి ఏం న్యాయం చేస్తావమ్మా? అని అడుగుతాడు. దీపతో నువ్వు నా కడుపున పుట్టడమే నీకు శాపం, అంతకన్నా ఏం లేదమ్మా.. పదమ్మా వీళ్లందరికీ దూరంగా వెళ్లిపోదాం అనడంతో దీప కార్తీక్ వైపు చూస్తుంది. ఆ తర్వాత దీప ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, నెక్ట్ మోనిత వేసే ప్లాన్ ఏంటో సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
‘కార్తీకదీపం’ డైరెక్టర్తో వంటలక్క.. కాపుగంటిపై నెటిజన్ల కౌంటర్!
కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 1057వ ఎపిసోడ్కు చేరుకున్న ఈ ధారా వాహిక ఎన్నో ట్వీస్ట్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్.. లీడ్ పాత్రల మధ్య గొడవలు పెట్టించి గత రెండున్నారేళ్లుగా వారిని కలపకుండా థీమ్ దర్శకుడు సాగతీస్తున్నాడు. ‘అబ్బబ్బా.. ఇదేం సీరియల్రా బాబూ.. ఇలా సాగదీస్తున్నారు. ఇక వంటలక్క, డాక్టర్ బాబును కలిపేయచ్చు కదా, ఆ వంటలక్కను ఇంకేన్నాళ్లు బాధపెడతారు’ అంటూ అందరు డైరెక్టర్పై మండపడ్డారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన కనిపిస్తే కొట్టేయాలన్నంతా కసితో నెటిజన్లు కామెంట్స్ పెట్టెవాళ్లు. అంతలా సీరియల్పై విసుగు తెప్పించిన డైరెక్టర్ ఒక్కసారిగా అనుకోని ట్వీస్టులతో సీరియల్ను రక్తికట్టించాడు. అయితే ఈ సీరియల్ని అభిమానించేవాళ్లు ఎంతమంది ఉన్నారో తిట్టుకుంటూ చూసేవాళ్లు కూడా అంతేమంది ఉన్నారు. అయితే కార్తీక్దీపం డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికి చాలా మందికి తెలియదు. తాజాగా ఈ సీరియల్ ఫేం ప్రేమి విశ్వనాథ్(దీప) దర్శకుడు కాపుగంటి రాజేంద్రతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అది చూసిన బుల్లితెర ప్రేక్షకులు, నెటిజన్లు తమదైన శైలిలో డైరెక్టర్పై విరుచుకుపడుతున్నారు. ‘ఆ మహానుభావుడివి నువ్వేనా సామీ. అబ్బా సీరియల్ని ఏం తిప్పారు సర్ మీరు సూపర్. ఇంతవరకూ డాక్టర్ బాబు వంటలక్కని నమ్మలేదు.. ఇప్పుడు వంటలక్క డాక్టర్ బాబుని నమ్మదు.. ఇప్పుడు ఈ కథతో సీరియల్ను నడపబోతున్నారా?’ , ‘మళ్లీ మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్ ఏంటి సారూ.. ఖచ్చితంగా రేటింగ్స్ పడిపోవడం ఖాయం’ అంటు కౌంటర్ ఇస్తున్నారు. కాగా దర్శకుడు కాపుగంటి రాజేంద్ర గతంలో ‘అందం, బంగారు బొమ్మ’ వంటి సీరియల్స్తో పాపులర్ అయ్యాడు. ఇక ఆయన దర్శకత్వంలో పలు సినిమాలు కూడా వచ్చాయి. రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. మోహన్ బాబు ‘శివ్ శంకర్’, అల్లరి నరేష్ ‘రాంబాబు గాడి పెళ్లాం’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కార్తీకదీపం సీరియల్తో మళ్లీ దర్శకత్వ బాధతల్ని చేపట్టి బుల్లితెరపై భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Premi Vishwanath (@premi_vishwanath) -
karthika Deepam: దీప కాళ్లు పట్టుకున్న కార్తీక్, మోనిత ఎంట్రీ, షాక్లో సౌందర్య
కార్తీకదీపం జూన్ 4: పూజకు అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెబుతాడోనన్న టెన్షన్తో ఉంటుంది. కార్తీక్ దీపకు గిప్ట్ ఇవ్వాలని శ్రీశ్రీ పుస్తకాన్ని ప్యాక్ చేసి.. ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి పెట్టుకుంటాడు. అదే టైమ్కి మోనిత తన ఇంట్లో పూజకు వెళ్లడానికి బాగా రెడీ అవుతుంది. ప్రియమణీతో త్వరలోనే పప్పు అన్నం పెడతానంటు ఏవేవో కబుర్లు చెబుతుంది. ఇక పూజాలో దీపకు చెబుతాన్న విషయం కార్తీక్ చెప్పనున్నాడా? లేదా ఇలోపు మోనిత ఎలాంటి ట్వీస్ట్ ఇవ్వబోతోంది అనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. సౌందర్య ఇంట్లో పూజకు అన్ని రేడి చేస్తారు. దీంతో పూజారి పూజకు టైం అవుతుంది అనడంతో అంతా కిందకి వస్తారు. కానీ కార్తీక్ మాత్రం కిందకు రాడు. దీంతో కార్తీక్ రాకపోవడంతో సౌందర్య ఆదిత్యను అన్నయ్య ఎక్కడ అని అడగడంతో ఇంకా గదిలోనే ఉన్నాడంటూ పైకి చూస్తుండా అప్పడే కార్తీక మెట్లు తిగుతూ వస్తాడు. వస్తూనే క్షమాపణలు ఎలా అడగాలో తెలియడం లేదంటు దీప దగ్గరికి వెళ్లతాడు. వెంటనే కార్తీక్కు తను దీపకోసం పెట్టిన గిఫ్ట్ గుర్తొచ్చి దీపకు ఇష్టమైన శ్రీశ్రీ పుస్తకం ఇచ్చి క్షమాపణలు కోరతాను అంటు వెళ్లి తెద్దామని వెనక్కి వెళ్లబోతాడు. దాంతో సౌందర్య ‘టైమ్ అవుతుందిరా.. దేవుడికి దన్నం పెట్టుకుని కూర్చోండి’ అంటుంది. వెంటనే కార్తీక్ వెనక్కి తిరిగి.. దీపవైపు చూస్తూ దేవుడికి కాదు మమ్మీ.. ముందు దేవతకు దండం పెట్టుకోవాలి అంటు దీప ముందు మోకాళ్లపై కూర్చుని తన కాళ్లకు దండం పెట్టబోతాడు కార్తీక్. పడ్డాడు. దీప వెనక్కి జరిగిపోతుంది కంగారుగా. అంతా షాక్లో ఉంటారు. తెలియకుండా నవ్వుముఖాలుగా ఉంటాయి ఆదిత్య, శ్రావ్య, దీప తండ్రి, సౌందర్య అంతా ఆనందంతో ముఖాలు వెలిగిపోతాయి. ‘నేను చేసిన తప్పుకు శిక్ష ఏ కోర్టులోనూ ఏ జడ్జ్ వెయ్యలేడు..బయటికి కనిపించని చెప్పుకోలేని నేరం చేశాను.. మాటలతో గుండెల్లో పొడిచి పొడిచి చిత్రవథ చేశాను. అందరినీ క్షోభ పెట్టి జీవితాలతో ఆడుకున్నాను.. నేను చేసిన అపరాధం హత్యానేరం కన్నా పెద్దది. దానికి ఉరిశిక్షవేశానా సరిపోదు.. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప’ అని కార్తీక్ క్షమాపణలు చెప్పడంతో దీప ఎంటో అర్థం కానట్లు అయోమయంలో ఉండిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత సడెన్ ఎంట్రీ ఇస్తుంది. రాగానే ‘అంత తప్పు నువ్వేం చేశావ్?’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ షాక్తో వెనక్కి తిరిగి చూస్తు దీప పక్కన నిలబడతాడు. ‘చెప్పు కార్తీక్ అంత పెద్ద తప్పు ఏం చేశావ్? తప్పు తెలుసుకున్నావ్.. సరిదిద్దుకుంటావ్.. ఇన్నాళ్లు నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్.. రిపోర్ట్స్ అలా వచ్చాయ్.. అందుకు నువ్వేం చేస్తావ్? ఎవరిదో రిపోర్ట్ నీవనుకుని ల్యాబ్ టెక్నీషియన్ మార్చేస్తే. నువ్వేం చేస్తావ్? అది మానవ తప్పిదం.. అందులో నిన్ను తప్పు బట్టడానికి ఏం లేదు’ అంటుంది మోనిత. మోనిత మాటలకు అంతా బిత్తరపోతారు. వెంటనే మోనితే మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్ కార్తీక్.. నీకు పిల్లలు పుట్టే యోగం ఉందని ఇవాలే తేలింది.. 100 పర్సెంట్ నీకు ఆ అర్హత ఉంది.. ఇది సంతోషించాల్సిన విషయమే కాదా? దీనికి క్షమాపణలు కోరుకోవడం దేనికి? నీకు పిల్లలు పుడతారు కార్తీక్.. హిమ, సౌర్య నీ కన్నబిడ్డలు. నీ సంతానమే’ అంటుంది నవ్వుతూ. ‘మోనితా నువ్వేం మాట్లాడుతున్నావ్?’అంటాడు కార్తీక్ అయోమయంగా. ‘శుభవార్త మోసుకొచ్చాను కార్తీక్.. అసలు అందరికీ ఈ విషయం స్వీట్స్ తినిపించి చెప్పాలనుకున్నాను.. కానీ పట్టరాని ఆనందంలో ఈ వార్త అందరికీ అందజెయ్యాలనే కంగారులో స్వీట్స్ తీసుకుని రావడం మరిచిపోయాను. పోనీలెండీ.. ఇక్కడ అక్షింతలు ఉన్నాయిగా.. అవి నా నెత్తిన వేసి నన్ను ఆశీర్వదించండి ఆంటీ’ అంటూ సౌందర్య కాళ్ల మీద పడుతుంది మోనిత. అంతా షాక్లోనే ఉండిపోతారు. సౌందర్య అయోమయంగా.. ‘వాడికి పిల్లలు పుడతారని నువ్వు చెప్పడమేంటీ? నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటీ? నాకేం అర్థం కావట్లేదు’ అంటుంది. వెంటనే పైకి లేచిన మోనిత.. నవ్వుతూ.. ‘నేను నెల తప్పాను ఆంటీ.. ఎస్ అయామ్ ప్రెగ్నెంట్.. నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది..’ అంటుంది. వెంటనే సౌందర్య ఆవేశంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్..’ అని అరుస్తుంది. ‘ఇంతచెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అని చెప్పడంతో అందరి మొహాలు తెల్లబోతాయి. ఇక ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: దీపకు కార్తీక్ ప్రత్యేక బహుమతి, ఇంతలో ఫోన్ రింగ్..
కార్తీకదీపం జూ 2: కార్తీక్ రేపు ఏం చెప్పబోతున్నాడో తెలియక గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటు కంగారు పడిపోతుంటుంది దీప. ఇంతలో సౌందర్య వచ్చి ధైర్యం చెప్పి కార్తీక్ కాసేపు మాట్లాడమంటు గదిలోకి పంపిస్తుంది. ఆ సమయానికి కార్తీక్ కవితల పుస్తకం చూస్తు కనిపిస్తాడు. మరోవైపు కార్తీక్ చేసిన అవమానానికి మోనిత రగిలిపోతుంది. కార్తీక్ చేతి ఆ పుస్తకం చూసి దీప ఎల స్పందించనుంది, పగతో ఉన్న మోనిత ఏం చేయబోతుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. భాగ్యం ఇస్తీ చేసుకుంటూ దీప ఎందుకు ఫోటోను గోడకు పెట్టనివ్వాలేదు? డాక్టర్ బాబు చేసేది కూడా అలానే ఉంటుందిల.. దీప అనుమానం నిజమే అయ్యి ఉంటుందా? లేక డాక్టర్ బాబు మారిపోయి ఉంటాడా అని తనలో తనే మాట్లాడుకుంటుంది. మరోవైపు దీప కార్తీక్ గదికి వెళ్లేసరికి అతడు ఏదో ఆలోచిస్తు మందు తాగడం చూస్తుంది(కానీ కార్తీక్ దీపని అవమానించిన క్షణాలను తలుచుకుని కుమిలిలోతుంటాడు). అలా కార్తీక్ను చూసి తలుపు దగ్గరి నుంచే తిరిగి వెనక్కివచ్చేస్తుంది దీప. కింద సౌందర్య భర్త ఆనందరావుతో మాట్లాడుతుంటే దీప కిందికి రావడం గమనించి ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది అని అడగ్గా డాక్టర్ బాబు ఏదో టెన్షన్లో ఉన్నంటున్నాడు, మందు తాగుతున్నాడని చెబుతుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. వాడు తాగడం మానేశాడే.. మొన్నెప్పుడో తాగొస్తే.. మనసు బాలేదు అన్నాడు.. మరి ఇప్పుడు ఎందుకు తాగుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా మోనిత పొద్దున్నే లేచి కాఫీ చేసి ప్రియమణిని లేపి తాగమని ఇస్తుంది. దీంతో షాక్ అయిన ప్రియమణి కోపం వస్తే కొట్టండి, తిట్టండి కానీ ఇలాంటివి చేయకండని అని అనడంతో.. భవిష్యత్తులో కార్తీక్కి పెట్టి ఇవ్వాలిగా.. ప్రాక్టీస్గా ఉంటుందని పెట్టాను చెబుతుంది. ఆ తర్వాత ఆ కాఫీ తాగి పైన ఉన్న తన చీర ఇస్తీ చేయి అంటు ‘నేను కార్తీక్ దగ్గరకు వెళ్లాలి.. త్వరగా చేసిపెట్టు అంటుంది. ప్రియమణి మనసులో.. ‘ఈమె హడావుడి చేస్తే దీపమ్మ కొంప ముచ్చేలానే ఉంది’ అనుకుంటుంది. ఇక అటు సౌందర్య ఇంట్లో పూజకు అన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భాగ్య కాలు జారిపడిందని, కాలు నెప్పి పెడ్డటంతో రాలేదని మురళీ కృష్ణ మాత్రమే వస్తాడు పూజకు. ఇక అటు దీప, ఇటు కార్తీక్లు వేరు వేరు రూమ్స్లో రెడీ అవుతూ ఉంటారు. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెప్పబోతున్నాడోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ పంచెకట్టుకుని. శ్రీ శ్రీ పుస్తకాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి.. దానిపై స్లిప్ అంటించి ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి.. మళ్లీ ఆ స్లిప్ చించి ‘దీపకు ప్రేమతో కార్తీక్’ అని రాసి మురిసిపోతుంటాడు. ఇంతలో కార్తీక్కు ఫోన్ రావడంతో ఆ గిఫ్ట్ బెడ్ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అయితే దీపకు శ్రీశ్రీ కవితలంటే పచ్చి. ఆ పిచ్చి కారణంగానే కార్తీక్ దీపను అవమానించేందుకు దారితీసింది. దీంతో అప్పటి నుంచి శ్రీశ్రీ కవితలు వింటేనే రగిలిపోయే కార్తీక్ అదే శ్రీశీ కవిత పుస్తకాన్ని దీపకు బహుమతి ఇచ్చి.. తనలోని అనుమానం నిజం కాదని చేప్పాలని అనుకుంటున్నాడు. అయితే ఆ ఫోన్ ఎవరి దగ్గరి నుంచి వచ్చింది. ఈలోపు మోనిత ఎంట్రి ఇచ్చి కార్తీక్ ప్లాన్ మొత్తం తారుమారు చేయనుందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: మోనితను అవమానించిన కార్తీక్, సంతోషంలో దీప, సౌందర్య
కార్తీకదీపం జూన్ 2: దీప కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అదేంటో చెప్పండి డాక్టర్ బాబు అని దీప వేడుకున్ప్పటివకి కార్తీక్ పూజ రోజే చేప్తానని, ఇది నా జీవితానికి సంబంధించిన విషయమంటూ దీప మరింత కంగారు పెట్టడం, ఇటు మోనిత కార్తీక్ను తన భర్తను చేసుకునే పెద్ద రహస్యాన్ని బయటపెట్టేందుకు సన్నాహాలు చేయడం ఇలా గత మూడు రోజులుగా ఇదే సాగుతుంది. మరీ ఈ రోజు అయినా ఆ నిజాన్ని కార్తీక్ బయటపెట్టి దీప గుండెదడను తగ్గిస్తాడో లేదో నేటి(జూన్ 2వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి. మోనితా కార్తీక్తో అర్జంటుగా మాట్లాడాలనునకుంటుంది. ఇందుకోసం కార్తీక్ను ఇంటికి వెళ్లాలనుకుంటుంది. ‘ఎటు నేను పెద్ద జలక్ ఇవ్వబోతున్నాను కదా..అందుకే వాళ్లింటికే వెళ్లి చివరి సారిగా దీప మొగుడిగా నా కార్తీక్ని చూడాలి. నా విషయంలో ఆ దీప కానీ.. ఆ సౌందర్య కానీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా అది ఈ రోజు వరకే.. ఎందుకంటే రేపటితో సీన్ మొత్తం మారిపోతుందిగా.. పాపం దీప.. కార్తీక్ మారిపోయాడు ఇక తనతోనే ఉండిపోతాడు అనుకుంటోంది.. రేపటితో కార్తీక్ ఆ దీపకు భర్తగా కాదు.. ఈ మోనితకి భర్త కాబోతున్నాడు.. ఇన్నీ సంవత్సరాల నా కల రేపటితో నెరవేరబోతుంది.. కార్తీక్.. వస్తున్నా’ అంటు తెగ మురిసిపోతు బయలుదేరుతుంది మోనిత. మరోవైపు భాగ్యం.. ఇంట్లోని పాత ఫొటోలను తూడుస్తూ దీప, కార్తీక్లు కలిసి ఉన్న ఫోటో(గతంలో కార్తీక్ పగలగొట్టిన విషయం గుర్తొచ్చి.. ఈ ఫోటోని గోడకు తగిలించే రోజు ఎప్పుడొస్తుందో? ఏంటో’ అని నిట్టుర్పుగా అంటుంది. అలాగే కార్తీక్ మారిన విషయం, దీప వైద్యం చేయించి బతికుంచుకున్నాడంటే డాక్టర్ బాబు మారినట్లే కదా మరీ ఇంకేందుకు ఈ ఫొటో దాచడమని గోడకు తగిలించబోతుంటే అప్పడే సౌందర్య, దీపలు అక్కడి వస్తారు. దీంతో భాగ్యాన్ని ఏం చేస్తున్నావని సౌందర్య అడగ్గా.. ఈ విషయం చెబుతుంది. ఆలస్యం చేయకుండ ఆ ఫొటోను గోడకు తగిలించమని సౌందర్య చెప్పగా.. దీప వద్దు అని అడ్డుపడుతుంది. రేపు ఆ విషయం ఏంటో చెప్పాక తగిలించోచ్చు లే అనడంతో వారు ఊరుకుండిపోతారు. ఆ తర్వాత భాగ్యంతో రేపు మనింట్లో పూజ ఉందని.. మీరు తప్పకుండా రావాలని పిలుస్తుంది సౌందర్య. ఇక కార్తీక్ బయట నుంచి ఇంటికి వస్తాడు. ఇంట్లో అప్పటికి ఎవరు ఉండకపోవడంతో బాధగా కూర్చుని.. ‘రేపు నా జీవితంలో చాలా భారంగా ఉండబోతుంది. తర్వాత నేను నా మనసులోని భారాన్ని దింపేసుకుని ఫ్రీ కాబోతున్నా.. అప్పుడు అంతా సంతోషమే.. కానీ రేపు గడిచేదెలా’ అంటూ తనలో తనే సంఘర్షణ పడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ‘హాయ్ కార్తీక్’ అంటూ గుమ్మంలోంచి ఎంట్రీ ఇస్తుంది మోనిత. నువ్వేంటి ఇలా వచ్చావ్’అని కార్తీక్ చిరాకు మూడ్లో అనడంతో. నేను అంతే అడ్డదారుల్లో రావడం నాకు ఇష్టం ఉండదు.. మనదంతా రహదారి అంటూ పెద్దగా నవ్వుతుంది. ఇంతలో దీప, సౌందర్య భాగ్యం ఇంటి నుంచి వస్తారు. ‘ఏంటి దీపా.. బాగున్నావా? అదేంటి అప్పుడే అత్తా-కోడళ్లు బయట షికార్లు చేస్తున్నారంటు కాస్త రెస్ట్ తీసుకో దీప అని వెటకారంగా ఉంటుంది. వెంటనే కార్తీక్ అప్పుడే ఎందుకు బయటికి వెళ్లావు దీపా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని ప్రేమ అనడంతో మోనిత రగిలిపోతుంది. ఇంతలో సౌందర్య.. ‘పిల్లలు ఎక్కడరా కనిపించడం లేదని కార్తీక్ని అడుగుతుంది. దీంతో కార్తీక్ వాళ్లను డాడీ దగ్గర ఫామ్ హౌజ్లో దింపి వచ్చాను మమ్మీ అంటాడు. అదేంటీ రేపు పూజ పెట్టుకునీ.. అంటు సౌందర్య మోనితని చూసి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయారు ఆంటీ.. పిలవని పేరంటంగా నేను వస్తాననా? నాకు రావాలని ఉంటే పిలవకపోయినా వస్తానుగా.. మీరు ఆగిపోకండి.. మాట్లాడండి’ అంటుంది మోనిత నవ్వుతూ. దాంతో సౌందర్య.. అలా ఎందుకు చేశావురా రేపు పూజలో పిల్లలు లేకుండా ఎలా?అంటుంది సౌందర్య. దాంతో మళ్లీ మోనిత కలుగజేసుకుని.. నిజమే కార్తీక్.. పెళ్లి అయ్యి పదేళ్లు అయినా.. పదేళ్ల కూతుర్లు ఉన్నా.. నీకు ఈ మాత్రం కూడా తెలియదు.. పూజలో ఆడపిల్లలు పట్టుబట్టలు కట్టుకుని కూర్చుంటే ఎంత అందంగా ఉంటుంది.. వెళ్లు.. వెళ్లి తీసుకొచ్చేసెయ్.. వెళ్లు వెళ్లు అంటూ కాస్తా చనువుగా మాట్లాడుతుంది మోనిత. అప్పటికే విసిగిపోయి ఉన్న కార్తీక్ ‘విల్ యు ప్లీజ్ సెట్ యువర్ మౌత్ మోనితా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కదా.. నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావ్? ఎన్నిసార్లు చెప్పినా నీకు కామన్ సెన్స్ లేకుండా పోతుంది’ అని కార్తీక్ మోనితపై అరుస్తాడు. అలా అనేసరికి మోనిత షాక్లో దీప, సౌందర్యలు సంతోషంలో ఉంటారు. క్షమించు కార్తీక్. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోవడం వల్ల నోరు జారాను.. రియల్లీ సారీ.. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కదా మీరే మాట్లాడుకోండి.. నేనొస్తాను’ అంటూ మోనిత బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వెంటనే సౌందర్య ‘పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని చెబుతుంది. దీంతో కార్తీక్ వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించేసి వచ్చాను.రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మోనిత కారులో వెళ్తూ జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతుంది. ‘ఇంతకాలం చేదు అయిపోయిన నీ పెళ్లాం ఇప్పుడు బెల్లమైపోయిందా కార్తీక్.. దాని ముందే నన్ను అవమానించావ్ కదూ.. చెబుతా.. రేపు ఈ టైమ్కి నువ్వు నా కాళ్ల దగ్గర ఈ కారు క్లచ్లా పడి ఉంటావ్. నిన్ను నేను వదలను’ అంటూ కోపంతో ఊగిపోతుంది. తరువాయి భాగంలో సౌందర్య దీపను కార్తీక్ గదిలో ఒక్కడే ఉన్నాడు. నువ్వు కాస్తా మాటలు కలుపు అని చెబుతుంది. నేను ఇప్పుడు వెళ్లి ఏం మాట్లాడను అత్తయ్య వెళ్లను అంటుంది. అయినా సౌందర్య వెళ్లు ఏం కాదని చెప్పి పంపిస్తుంది. దీప గదిలోకి వెళ్లేసరి కార్తీక్ ఒకప్పుడు తాను చింపేసిన కవిత పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. ఇది చూసి దీప మరింత షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: మోనిత కొత్త స్కెచ్.. భారతిని ఇంటికి పిలిచి..
కార్తీకదీపం జూన్ 1: కార్తీక్ నిజం తెలుసుకున్న విషయం దీపతో చెప్పి క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇటూ మోనిత.. కార్తీక్, దీపలు విడిపోయే పెద్ద సీక్రేట్కు రీవిల్ చేసేందుకు సిద్దమవుతుంది. మరోవైపు కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక దీప కంగారు పడుతూ ఉంటుంది. ఇన్ని సస్పెన్స్ల నడుమ కార్తీక్ దీపకు నిజం చెబుతాడా లేదా అనేది నేటి(జూన్ 1వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి. మోనిత డాక్టర్ భారతిని ఇంటికి పిలుస్తుంది. తనకు నచ్చిన మైసూర్ పాక్ స్వీట్ను ప్రియమణితో స్పెషల్గా చేయిస్తుంది. భారతి మోనిత నానా హడావుడి చేస్తూ భారతి స్వీట్ ఇస్తుంది. గదిలోకి వెళ్లి పండ్లు, చీర తీసుకోచ్చి.. దీపను చావు అంచుల నుంచి లాక్కొంచి కార్తీక్ ఆరోగ్యం అప్పగించావ్ కదా అందుకే ఇది ఇస్తున్నా అంటుంది. కానీ భారతి అది తీసుకునేందుకు ఇష్టపడదు. వద్దంటుంటే బలవంతంగా చీర ఇస్తుంది. ఇదంతా చూసి భారతి ఆలోచనలో పడుతుంది. ఇదేంటి మోనిత ఏమైనా కొత్త నాటకానికి తెరలేపిందా అంటు అనుమానంగా ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. ఇక ఆమె వెళ్లిపోగానే మోనిత ‘ఇదంత భారతి కార్తీక్కు చెబుతుంది, కార్తీక్ వెళ్లి దీప, సౌందర్యలకు చెబుతాడు, ఆ తర్వాత నా ప్లాన్ ఏంటో తెలియక ఆ అత్త-కోడళ్లు తలలు పట్టుకుంటారు. ఇలోపు నేను చేయాల్సిన పని చేసేస్తా’ అని మనసులో అనుకుంటు నువ్వుకుంటుంది. గదిలో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప ధీనంగా కూర్చోని ఆలోచిస్తుంది. ఇంతలో సౌందర్య దీప కోసం జ్యూస్ తెచ్చి తాగమంటుంది. కార్తీక్ చెప్పబోయే విషయం ఏంటా అని దీప సౌందర్యతో అంటూ ఉండగా.. కార్తీక్ వచ్చి ‘మమ్మీ మోనిత భారతిని పిలిచి చీర పళ్లు పెట్టిందట.. దీప కోలుకునేలా చేశావ్.. థాంక్యూ.. వాళ్లు ఇప్పుడు ఇదంతా ఆలోచించే సమయంలో ఉండిఉండరు. అందుకే వాళ్ల తరపున నేను ఈ చిరు కానుక ఇస్తున్నాను అంటూ భారతికి చీర పెట్టిందట.. పాపం పిచ్చిది’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న సౌందర్య, దీప షాక్ అవుతారు. మోనితని పాపం పిచ్చిది.. అంటున్నాడు ఈ అమాయకుడు అని సౌందర్య తిట్టుకుంటుంది. దీప మనసులో రేపు ఈయన చెప్పబోయే విషయానికి మోనితకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మోనిత బాల్కనీలో కూర్చుని.. ఈ పాటికి ఆ అత్తాకోడళ్లకు తెలిసే ఉంటుంది. అర్థం కాక జుట్టు పీక్కుంటుంటారు. ఇలాగే నా లక్ష్యం కోసం ఏదొక అడుగు వేస్తూ ఏదోరోజు ఒక అడుగు కార్తీక్ ఇంట్లో వేస్తాను.. వెంటనే మంచి ముహూర్తం ఉంటే చూసిపెట్టుకోవాలి అనుకుంటుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తనకు తెలిసిన పంతులు ఫోన్ చేసి ఇవ్వమంటుంది. ప్రియమణి ఫోన్ చేసి ఇవ్వగానే మోనిత నేనొక మంచి పని తలపెడుతున్నాను పంతులుగారు.. మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి అని అడుగుతుంది మోనిత. దీంతో ఆ పంతులు రేపు మంచి ముహూర్తం ఉందని, ఆ తర్వా మూడు నెలల దాక మంచి ముహుర్తాలు లేవని చెబుతాడు. దాంతో మోనిత వెంటనే మనసులో ‘రేపే అంటే టైమ్ లేదే.. ఇంత తక్కువ టైమ్లో అంత పెద్ద స్కెచ్ వెయ్యడం ఎలా అబ్బా? ఏది ఏమైనా సరే.. రేపటితో నేను అనుకున్నది జరగాలి.. జరిగి తీరాలి..’ అని నిర్ణయించుకుంటుంది. కార్తీక్ బయటికి వెళ్లబోతుంటే.. దీప డాక్టర్ అని పిలిచి ఆపగా.. ఏం కావాలి, చీరలా, పండ్లా.. ఏం తేవాలి దీపా అని అడుగుతాడు. అవేం కాదు డాక్టర్ బాబు.. మీరు చెబుతానన్న విషయం ఏంటో.. అది అంటుంది దీప. వెంటనే కార్తీక్ రేపు నేను చెప్పబోయే విషయం.. నా జీవితానికి సంబంధించినది అంటాడు. అంటే నా జీవితానికి సంబంధంలేనిదా అని దీప ప్రశ్నించగా.. ‘నా జీవితంతో ముడిపడే కదా నీ జీవితం’ అంటాడు కార్తీక్. ‘నా మనసు ఆగడం లేదు డాక్టర్ బాబు.. మీరు చెప్పబోయే విషయం ఏంటో తెలుసుకోవాలని ఉంది.. ఇప్పుడే చెప్పొచ్చు కదా? నా గుండె దడ తగ్గుతుంది?’ అంటుంది దీప రిక్వస్ట్గా. దీంతో కార్తీక్ తాను తప్పు చేశానని, అది నా నోటితో నేను చెప్పడానికి నన్ను నేను సిద్దం చేసుకోవాలంటే దానికి కొంచం టైం కావాలి అంటాడు. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి కారులో వెళ్లిపోతాడు. అనంతరం దీప ఆలోచనలో పడుతుంది. తరువాయి భాగంలో పూజకు అందరు సిద్దంగా ఉంటారు. దీప, సౌందర్య, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని సౌందర్య చెప్పగా ‘వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించి రమ్మన్నాను.. రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు..’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఇక తర్వాత ఏం జరగనుందనేంది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
కార్తీకదీపం: ఆస్పత్రిలో ‘వంటలక్క’.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
తెలుగు డైలీ సీరియల్ కార్తీకదీపం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డాక్టర్ బాబు నిజం తెలుసుకోవడం, మోనిత ప్రెగ్నెంట్ ట్వీస్ట్, దీప అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడంతో ఏమౌతుందోననే ఉత్సుకతతో బుల్లితెర ప్రేక్షకులంతా టీవీలకే అతక్కుపోతున్నారు. ఇక గత వారమంత హాస్పిటల్లో దీప చావు బతుకుల మధ్య ఉండటం.. డాక్టర్ బాబు కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన కార్తీక్దీపం అభిమానులు భావోద్వేగానికి లోనవుతుండగా.. మరోవైపు ఈ ప్రోమోలపై నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్ క్రియేట్ చేస్తూ, ఫన్నీ కామెంట్స్తో స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దీప ఐసియూలో ఆక్సిజన్ అందక కొట్టుకుంటుంటే, కార్తీక్ కంగారు పడుతున్న ప్రోమోను ఆనందయ్య మందుకు సింక్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంఉటన్నాయి. అవుతున్నాయి. ‘దీపక్క.. ఆక్సిజన్ పెట్టుకుని చావుబతుకుల మధ్య ఉంటే.. ఆవిడను ఆనందయ్య దగ్గరకు తీసుకువెళ్ళండి డాక్టర్ బాబు’ , ‘ఈ హాస్పిటల్స్ని నమ్మకండి డాక్టర్ బాబు.. ఆనందయ్య నాటు వైద్యమే వంటలక్కకి కరెక్ట్. లేదంటే దీపక్కకు ఆక్సిజన్ కావాలంటే సోనుసూద్ సాయం తీసుకుందాం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
karthika Deepam: తప్పు చేశానన్న కార్తీక్.. బాంబు పేల్చడానికి సిద్దమైన మోనిత
కార్తీకదీపం మే 31: బుల్లితెర ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అందరూ కోరుకున్నట్టుగానే దీప కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ తనని పట్టించుకోకుండా దీప మీద ప్రేమ కురిపిస్తుండటంతో మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ పూర్తిగా మారిపోయాడని తెలుసుకున్న మోనిత ఎలాంటి కుట్ర పన్ననున్నందో నేటి(మే 31) ఎపిసోడ్లో తెలుసుకొండి.. దీప కోలుకుని ఇంటికి వస్తుంది. మరోవైపు మోనిత నిరాశగా కూర్చోని దిగులుగా ఉండగా ప్రియమణి.. మోనితకి కాఫీ తెచ్చిస్తుంది. ఎందుకమ్మా అలా ఏడుస్తూ కూర్చుంటారు, కార్తీక్ అయ్యకి.. ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదమ్మా? ఏంటమ్మా మీరు ఏడుస్తున్నారు.. వాళ్లింటికి వెళ్లి ఇష్టమొచ్చినట్లు దులిపెయ్యండి అంటుంది. అంటే కార్తీక్ అయ్యని నమ్ముకున్నవాళ్లలో ఎవరో ఒకరు ఏడవాల్సిందేనా.. మీకేం ఖర్మమ్మా.. మీరు పడే బాధేంటో ఆవిడకు తెలిసి తీరాలని ఏవేవో చెబుతుంది. అది వింటు మోనిత మనసులో ‘ఊరుకో ప్రియమణీ.. నేను దీపని కాదు సర్దుకుపోవడానికి.. మోనితని.. మోసం చేసే వాళ్లని క్షమించను.. కొడతా.. కోలుకోలేని దెబ్బ కొడతా.. నా ప్రేమతో ఆడుకుంటే ప్రేమించినవాడు అని కూడా చూడను.. అతి త్వరలో విడుదల కానుంది ఒక భయంకరమైన చిత్రం’ అంటూ నవ్వుకుంటుంది. సౌందర్య కార్తీక్కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చార్రా అని కనుక్కుని పిల్లలతో ఆనందంగా ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారు అని చెప్తుంది. హిమ, శౌర్యలు అమ్మ నాన్నకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం అంటూ పైకి వెళతారు. ఇంతలో మోనిత ఫోన్ చేయడంతో సౌందర్య.. శుభమా అని దీప కోసం ఎదురు చూస్తుంటే ఇదెందుకు ఇప్పుడు ఫోన్ చేసింది..చూద్దాం అంటు లిఫ్ట్ చేస్తుంది. ఆంటీ దీప ఇంటికి వచ్చిందా? అని అడగ్గా.. ఇంకా రాలేదని చెబుతుంది సౌందర్య. ‘అయ్యో ఏమైందని వెటకారంగా అనడంతో.. ఏం కాలేదు.. ఇకపై ఏం కాదు కూడా.. అయినా ఇంకా రాలేదు అంటే.. దారిలో ఉంది.. వస్తూ ఉందని అర్థం.. ఇది తెలుసుకోవడానికి ఫోన్ చేశావా అని మోనితకు సౌందర్య కౌంటర్ వేస్తుంది. లేదు ఆంటీ దీప ఉంటే విష్ చేద్దామని ఫోన్ చేశాను అంటుంది మోనిత. అంతేగాక ఇక నుంచి నువ్వు మా మీద ఇంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదని సౌందర్య అనడంతో ఏం.. ఎందుకు ఆంటీ అని అడుగుతుంది మోనిత. అది అంతేలే.. చూడు నేను ఇప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నాను.. ఇలా మాట్లాడి దాన్ని కాస్తా చెడగొట్టకని సౌందర్య అనగానే మోనిత నవ్వుతూ.. అలా అనకండి ఆంటీ ఎలాంటి మూడ్నైనా చెడగొట్టే టాలెంట్ నాలో ఉంది.. సరే మీరు హ్యాపీ మూడ్లో ఉన్నారు కదా.. ఇలా ఎన్ని రోజలు ఉంటారో నేను చూస్తాను అని మోనిత హెచ్చరిస్తున్నట్లు మాట్లాడుతుంది. అది విని సౌందర్య ‘ఏంటే నువ్వు చూసేది ఇప్పుడు నా కొడుకు చాలా మారిపోయాడు.. నా కోడల్ని బంగారంలా చూసుకుంటున్నాడు.. నువ్వు చెప్పే సోది వినడం అవసరమా చెప్పు.. పెట్టెయ్ ఫోన్’ అని విసుగ్గా ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ పెట్టేశాక మోనిత మనసులో ‘నీ కోడలు దీప బంగారం అయితే మరి నేనేంటి? ప్లాటినమ్నా? దానికంటే నేనే ఎక్కువని రుజువు చేస్తాను.. ఫేస్ చెయ్యడానికి రెడీగా ఉండండి ఆంటీ అని మనసులో పడిపడి నవ్వుకుంటుంది. ఇదిలా ఉండగా దీప, కార్తీక్ల కారు వస్తుంది. దీప దిగగానే కార్తీక్ ఆమె పట్టుకుని నడిపించుకుంటు వస్తాడు. వాళ్లను గుమ్మం దగ్గరే ఆపి సౌందర్య శ్రావ్యను పిలిచి హారతి ఇచ్చి ఆనందంతో మురిసిపోతు ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది సౌందర్య. లోపలికి వెళ్లగానే పిల్లలు తల్లిదండ్రులకు పూలు చల్లి గ్రాండ్ వెల్కం చెబుతారు. సంతోషంగా కిందకు దిగి దీపని హత్తుకుని ముద్దాడతారు. తర్వాత కార్తీక్ దీపల మధ్యకు వచ్చిన రౌడీ.. కార్తీక్ చేతిని దీప చేతికి కలుపుతూ.. ‘మీరిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్సే కదా..’ అంటుంది. కార్తీక్ అవునంటాడు. ఆ తర్వాత శౌర్య ‘నువ్వే మా నాన్నవని తెలిసినప్పుడు, హిమ నా చెల్లి అని తెలిసినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు నాన్నా.. ఏదో వెలితిగా ఉండేది.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది’ అంటు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని తాను తెలుసుకున్న నిజం గురించి చెప్పి దీపను క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇంతలో సౌందర్య శుభవార్తనే అని అడగ్గా మీరందరూ పండగ చేసుకునే వార్త అనడంతో సౌందర్య భాగ్యం చేయించాలనుకున్న పూజ గురించి చెబుతుంది. ఈ శుభావార్త ఏదో దేవుడు ముందు చెప్పమని, అందరికి శుభం జరుగుతుందంటుంది.దీంతో కార్తీక్ కూడా అందరి ముందే చెప్పడమే కరెక్ట్ అంటాడు. అందరు ఉన్నప్పుడు చెబితే నాకు సంతోషంగా అనిపిస్తుంది. కొంతైనా న్యాయం చేశానేమో అనిపిస్తుందంటూ భావోద్వేగానికి లోనవుతాడు. దీంతో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప కంగారు పడుతుంది. ఇక తరువాయి భాగంలో.. దీప అదేంటో ఇప్పుడే చెప్పండి డాక్టర్ బాబుని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో నేనొక తప్పు చేశాను దీపా.. అంటాడు కార్తీక్ తలదించుకుని. ‘మీరా..’ అంటుంది దీప అనుమానంగా ఆశ్చర్యంగా. ‘అవును నేనే.. అది నా నోటితో నేను చెప్పడానికి.. చాలా ఎక్స్సైజ్ చెయ్యాలి.. ప్రాక్టీస్ కావాలి.. అందుకే నాకు కొంచెం టైమ్ కావాలి.. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా..’ అంటాడు కార్తీక్ ఎమోషనల్గా రిక్వస్ట్గా. దీప ఆలోచనగా చూస్తూ ఉంటుంది. మరోవైపు రేపే సరైన సమయం చూసి బాంబు ఎలా పెల్చాలా అని మోనిత ప్లాన్ చేస్తుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: మోనిత దీప చావు కోరుకుందని కార్తీక్తో చెప్పబోయిన భారతి
కార్తీకదీపం మే 29: దీప ఉన్న ఐసీయూ గది ముందు నిలబడి కార్తీక్ నువ్వు బతకాలి దీప అని మనసులో అనుకుంటు దీనంగా చూస్తుంటాడు. ఇంతలో దీప పల్స్ రేట్ పడిపోవడం ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. అది చూసి కంగారుగా వెళ్లి డాక్టర్ భారతి, గోవర్థన్లను తీసుకువస్తాడు. దీంతో భారతి దీపను చెక్ చేస్తుంటే ఏమైంది.. ఏమైందని అడగుతూ ఆడుగుతుంటాడు. భారతి కార్తీక్ను బయటకు వెళ్లమని చెబుతుంది. ఇక ఆ తర్వాత బయట దిగులుగా ఉన్న కార్తీక్ భారతి వచ్చి దీప కోలుకుందనే శుభవార్త వినిపిస్తుంది. దీపను చూసేందుకు గదిలోకి వెళ్లిన కార్తీక్ నిజం తెలుసుకున్న విషయం దీపతో చెబుతాడా లేదా అనేది నేటి(మే 29) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. బయట దిగులుగా ఉన్న కార్తీక్ దగ్గరికి డాక్టర్ భారతి వచ్చి దీప సేఫ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అతడి మొహంలో చిరునవ్వు వస్తుంది. వెంటనే దీపను చూడటానికి వెళతానని కదలబోతుండగా భారతి కార్తీక్ అని పిలిచి ఆగిపోతుంది. మనసులోనే మోనిత నిజస్వరూపం చెప్పాలి.. ఆమె దీప చావు కోరుకుందని చెప్పేస్తా అనుకుంటుంది. కానీ ఇప్పుడే ఇంత ఆనందంలోనే ఉన్న కార్తీక్ ఈ విషయం చెప్పి మెంటల్గా డిస్టర్బ్ చేయడం ఎందుకనుకుంటుంది. కానీ ఎప్పటికైనా మోనిత డెంజర్ అనే విషయం కార్తీక్కు చెప్పి తీరాలని ఆలోచిస్తుంటే. ఇంతలో కార్తీక్ ఏంటని అడగడంతో.. దీప సృహలోకి వచ్చింది. ఇప్పుడు నీతో పాటు నడిచి వచ్చేలా ఉందని భారతి అనడంతో కార్తీక్ సంతోషంగా అవునా అంటు దీప గదికి వెళ్లబోతుంటే ఇంతతో ఆదిత్య క్యారేజ్ తీసుకుని వస్తాడు. ‘అరే.. ఆదిత్య మీ వదిన సృహలోకి వచ్చిందట.. చూసొస్తాను’ అంటూ పరుగుతీస్తాడు. కార్తీక్ దీప గదిలోకి ఆమెనే చూస్తూ.. దీప తలని నిమురుతాడు. ఆ తర్వాత పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ‘ఏది నా చదువు? ఏది నా సంస్కారం.. ఎక్కడో నన్ను నేను పొగొట్టుకున్నాను.. నన్ను నేను వెతుక్కునే సరికి పదేళ్లు పట్టింది.. ఈ పదేళ్లలో నువ్వు అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నావ్.. నేను అందరానంత పాతాళానికి జారిపోతూనే ఉన్నాను.. ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి.. ఇది అన్నపూర్ణమ్మ చెయ్యి.. వంటలక్కా అని ఈసడించుకున్నాను.. ఏది నాకు పాప పరిహారం’ అని చేతిని ముద్దాడతాడు. అలాగే ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు. మన బిడ్డల పుట్టుకని కూడా అవమానించాను. వీటన్నింటికీ క్షమాపణ చెప్పుకోవాలి. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను’ అంటు కన్నీరు పెట్టుకని దీప చేయిని నిమురుతాడు. కార్తీక్ స్పర్శతో కళ్లు తెరిచిన దీప కార్తీక్ మాట్లాడాక, పిల్లల గురించి ఆరా తీస్తుంది. ఆ తర్వాత దీప మోనిత గురించి అడుగుతుంది. అప్పుడే వెళ్లిపోయిందని కార్తీక్ చెప్పడంతో నిజమేనా డాక్టర్ బాబు. లేకపోతే. నేనేమైనా అనుకుంటానని చెబుతున్నారా అని దీప అంటుంది. ‘నేను దాచింది నీ ప్రాణాంతమైన జబ్బు గురించి మాత్రమే. .అంతకు మించి నేను ఏ అబద్దం లేదు. ఏం ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకో రేపు ఉదయం నిన్ను డిశ్చార్జ్ చేస్తారు, మన ఇంటికి వెళ్లిపోవచ్చు’ అని బుగ్గమీద ప్రేమగా తట్టుతాడు. కార్తీక్ స్పర్శ తగిలిన వెంటనే దీప తన బుగ్గని తడుముకుంటూ ‘ఈ మత్తులో ఇలా అనిపిస్తుందా.. లేక ఇది నిజమేనా.. డాక్టర్ బాబు ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకులా మాట్లాడుతున్నప్పుడు ఎటూ చూడకుండా నా కళ్లలోకి చూస్తూ మాట్లాడుతున్నారు.. ఇక నుంచి జాలి చూపిస్తున్నారా అని అస్సలు అడగను’ అనుకుంటుంది దీప మనసులో.. మరోవైపు మోనిత టాబ్లెట్స్ వేసుకుంటుంది. ప్రియమణి ఈ టాబ్లెట్ ఎందుకని ఆరా తీయగా నిజం చెప్పించే టాబ్లెట్ అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత నిన్ను ఒక్కటి అడుగతాడు నిజాయితిగా నిజం చెప్పు అని కార్తీక్ మంచివాడా చెడ్డవాడా. అని అడుగుతుంది. తండ్రిగా, కొడుగ్గా, భర్తగా కార్తీకయ్య బంగారం లాంటోడని, ప్రియుడిగా మాత్రం చెడ్డొడు అంటుంది ప్రియమణి. దీంతో మోనిత కోపంగా చూడటంతో అంటే మిమ్మల్ని కరివేపాకులా చూస్తాడు కదమ్మా అందుకే అలా అన్నానని అనగా.. నువ్వు సూపర్ ప్రియమణి.. నాకు చాలా ప్రశ్నలకు జవాబు దొరికేలా చేశావ్ కీప్ ఇట్ అప్.. వెళ్లు వెళ్లి పని చూసుకో అంటుంది మోనిత. మనసులో నువ్వు భయపడుతూ చెప్పినా నిజమే చెప్పావు ప్రియమణి. కార్తీక్ తన కుటుంబం గురించి తప్పా.. ఈ మోనిత గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టి ఇప్పుడు నేను కార్తీక్ విషయంలో చేస్తున్న పని ఏ మాత్రం తప్పు కాదని అర్ధమైంది అనుకుంటుంది. కార్తీక్ హాస్పిటల్ చైర్లో నిద్రపోతుంటే.. ఆదిత్య వచ్చి నిద్రలేపుతాడు. అయ్యో ఈ రోజు 8 గంటలకే దీప డిశ్చార్జ్ కదా.. నిద్రపట్టేసింది.. అంటూ కంగారుపడుతుంటే.. ‘అదంతా నేను చూసుకుంటాను.. నువ్వు వదిన దగ్గరకు వెళ్లు’ అంటాడు ఆదిత్య. అక్కడ దీప ఇంటికి వస్తుందని సౌందర్య దేవుడికి పూజా చేసి దండంపెట్టుకుంటుంది. ఇంతలో పిల్లలు అమ్మ ఎప్పుడొస్తుంది అనడంతో.. ‘స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకోండి.. అమ్మ వచ్చేస్తుంది’ అని నచ్చజెప్పి పంపించి.. దేవుడికి థాంక్స్ చెబుతుంది. ‘ఇక మీదట కార్తీక్ దీపలు సంతోషంగా ఉండాలని వేడుకుంటుంది. ఇక దీప లేచి బెడ్ మీద కూర్చుంటుంది. కార్తీక్ దీప రూమ్లోకి వెళ్తాడు. మొదటిసారి కార్తీక్ దీప తన భార్య స్థానంలో ఇంటికి తీసుకువెళ్లబోతున్నాడు. ఆ తర్వాత ఏం జరగనుందో సోమవారం నాటి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: కార్తీక్ స్పర్శతో కళ్లు తెరిచిన దీప
కార్తీకదీపం మే 28: కార్తీక్, మోనితతో నా భార్య బతకాలి అంటూ దీప మీద ప్రేమ, కన్సర్న్ చూపించడంతో మోనిత తట్టుకోలేపోతుంది. దాంతో తాను అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీపకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తనని మత్తలోకి వెళ్లకుండా మెలకువతో ఉండమని చెబుతారు. మరోవైపు సౌందర్య బయట కూర్చోని దీప అరోగ్యంపై దిగులు పడుతూ ఉంటుంది. మరి దీప ఆరోగ్యం బాగావుతుందా, కార్తీక్ ప్రవర్తనతో రగిలిపోతున్న మోనిత ఏం చేయనుందో నేటి ఎపోసిడ్(మే 28) ఇక్కడ చదవండి.. కార్తీక్, సౌందర్య దీప పరిస్థితి గురించి మాట్లాడుకుంటుండగా.. డాక్టర్ భారతి వచ్చి ఫార్మాలిటీస్ మరిచిపోయాను.. సైన్ చెయ్యి అనడంతో కార్తీక్ సైన్ చేస్తాడు. అది చూసి దీపకు ఏమౌంతుందోనంటూ భయపడుతున్న సౌందర్యకు.. దానికి ఏం కాదు మమ్మీ అంటు ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు కార్తీక్. అప్పటికే పిల్లలు దీప కోసం కంగారుపడుతుంటే ఆదిత్య వారికి ఓదార్పు మాటలు చెబుతుండగా.. సౌందర్య ఇంటికి రావడంతో నానమ్మ అంటు హిమ, శౌర్య దగ్గరకి వెళ్లి పట్టుకుని ఏడుస్తారు. అమ్మకు ఏమైనా అవుతుందని భయపడుతున్నారా, అక్కడ దానికి ఏం కాలేదు రెండు రోజుల్లో ఇంటికి వస్తుందంటూ మనసులో భయపడతూనే పిల్లలకు ధైర్యం చెబుతుంది. అది గమనించిన ఆదిత్య పిల్లలు మాలతితో వెళ్లగానే ఏంటి వదిన పరిస్థితి బాగాలేదా అని అడగ్గా అవునని తల ఊపుతుంది, దీప ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తుంది. ఐసీయూలో పడుకుని ఉన్న దీపను కార్తీక్ బయట డోర్ నుంచి చూస్తూ.. ‘నువ్వు బాగుండాలి దీపా.. నీకేం కాకూడదు.. క్షేమంగా బయటికి రావాలి. ఇక నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను దీపా.. కష్టాలే లేని నీ స్వప్నలోకాన్ని నీకు అందిస్తాను’ అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే దీపకు పల్స్ పడిపోయి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంది. దీంతో కార్తీక్ కంగారుగా భారతి దగ్గరికి పరుగులు తీస్తాడు. ‘భారతి.. గోవర్ధన్... దీపా పల్స్రేట్ పడిపోతుంది.. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది’ అని కంగారుగా పడుతుండటంతో ‘వాట్?’ అంటూ గోవర్ధన్తో పాటు భారతి కంగారుపడుతూ.. దీప ఉన్న ఐసీయూలోకి పరుగుతీస్తారు. ‘‘భారతి దీపను చెక్ చేస్తుంటే మధ్యలో కార్తీక్ ఏమైంది.. ఏమైంది అంటూ ఆందోళన పడుతుంటాడు. దీంతో భారతి డాక్టర్ గోవర్ధన్తో కార్తీక్ని ఐసీయూ నుంచి బయటికి తీసుకెళ్లమని చెబుతుంది. ఇదిలా ఉండగా హాస్పిటల్లో జరిగిదంతా తలుచుకుంటూ మోనిత కోపంతో మండిపోతుంది. అదే సమయంలో ప్రియమణి భోజనం తెస్తుంది. కార్తీక్ దీపల గురించి ఆరా తియ్యడంతో ఆ ప్లేట్ విసిరి కొట్టి.. క్లీన్ చెయ్ అంటూ ముందు గదిలోకి వస్తుంది మోనిత. ‘దీప అనారోగ్యం కార్తీక్లో ఇంత మార్పుకు కారణం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు.. ఇన్నాళ్లు దీపకు దూరంగా ఉంటే ఏదో ఒకరోజు నాకు దగ్గర కాకపోతాడా అని ఆశతో ఉండేదాన్ని. కానీ ఈ రోజుతో అది అడియాశేనని తేలిపోయింది. ప్రేమగా కార్తీక్ని నా కార్తీక్ అనుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది.. నా కార్తీక్ని నాకు దూరం చేసిన ఆ దీపని మాత్రం కార్తీక్కి దగ్గర అవ్వనివ్వను.. అలాగే ఆ దీపని అస్సలు ఉండనివ్వను. కార్తీక్ దీపలు కలిసి సంతోషంగా ఎలా ఉంటారో నేనూ చూస్తా, ఇప్పుడే కాదు.. ఇంకో 100 ఏళ్లు అయినా మిమ్మల్ని కలవనివ్వకుండా దూరం చేసే ప్లాన్ నా దగ్గర ఉంది.. ఈ మోనిత అంటే ఏంటో చూపిస్తాను’ అంటు ఉన్మాదంగా ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన సౌందర్య.. కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ అనుమానమే లేదు పెద్దోడిలో మార్పు వచ్చింది. దీపని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కానీ పదేళ్లుగా రాని మార్పు ఈ రెండు రోజుల్లో ఎలా వచ్చింది? ఏం జరిగి ఉంటుంది? అని ఆలోచిస్తుంది. ఏమైతేనేం వాడిలో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పు దీప చూస్తుందో లేదా అంతా నీదే భారం స్వామి అని బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర కార్తీక్ దీప గురించి బాధపడుతూ ఉండగా.. డాక్టర్ భారతి వచ్చి.. నువ్వు మంచివాడివి కార్తీక్.. నీకు ఆ దేవుడు అన్యాయం చేయడు, దీప సేఫ్ అనడంతో ఒక్కసారిగా కార్తీక్ ప్రాణాలు లేచోస్తాయి. దీంతో నేటి ఎపిపోడ్ పూర్తిఅవుతుంది. తరువాయి భాగం.. సృహలో లేని దీప దగ్గరకు కార్తీక్ వెళ్లి.. తల నిమురుతూ.. ‘రెండే రెండు రోజులు ఆగు దీపా ప్రపంచంలో ఏ జంట ఇంత ఆనందంగా ఉండరు అనిపించేలా.. మనం ఉందాం..’ అంటాడు. వెంటనే దీప పక్కనే కూర్చుని.. దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని.. ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు.. క్షమించరాని ఘోరమైన అపరాదం.. వీటన్నింటికీ నేను క్షమాపణ చెప్పుకోవాలి.. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను..’ అంటూ దీప చేతుల్ని ముద్దాడుతూ ఏడుస్తుండగా, ఆ స్పర్శకు దీప కళ్లు తెరిచి చూస్తుంది. -
karthika Deepam: ఎవరు ఎన్ని అనుకుంటే నాకేంటి? నా భార్య బతకాలి..
కార్తీకదీపం మే 27: కార్తీక్ దీపతో సరదాగా మాట్లాడటం, నిన్ను బతికించుకోవడం భర్తగా నా కనీస బాధ్యత అని అనడంతో అది విన్న మోనిత కోపంతో రగిలిపోతుంది. ఇక కార్తీక్ దీప ఆరోగ్యం గురించి దిగులు పడుతుంటాడు. ఇక అక్కడే హాస్పిటల్లో కార్తీక్కు ఏమైందంటూ ఆలోచిస్తున్న మోనిత ఏం చేయబోతుంది, కార్తీక్ దీపతో నిజం తెలిసిన విషయం చెబుతాడో లేదో నేటి(మే 27) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ను సౌందర్య ఓదారుస్తు అది నిన్ను చివరి క్షణాలంటూ.. నన్ను నమ్మానని చెప్పండి అని అడుగుతుంటే ఎందుకురా నోరు మెదపలేదని అడగ్గా కార్తీక్ ఏమో నోరుకు ఎదో అడ్డుపడినట్లు అయ్యింది అంటాడు. నువ్వు నమ్మానని ఒక్క మాట చెబితే ఆ మాటలతో అది ధైర్యం తెచ్చుకుని మరణంతో కూడా పోరాడి తిరిగోచ్చేది కదరా ఇది నువ్వు ఓ డాక్టర్ బాబుగా కాదు డాక్టర్లా చెప్పు అని సౌందర్య అనగా.. కార్తీక్ అవునన్నట్లు తల ఊపుతాడు. అయిన దానికి ఏం కాదు మమ్మీ.. అది ఎవరూ దీప బతికేస్తుంది.. అది బతకాలి.. బతుకుతుంది అంటాడు కార్తీక్. ఇంతలో మురళీ కృష్ణ యాపిల్ పండ్లు తీసుకువచ్చి సౌందర్య, కార్తీక్కు తినమని ఇస్తాడు. కార్తీక్ అవి తీసుకుని సౌందర్యకు ఒకటి ఇచ్చి, మరోకటి మీరు ఏం తినలేదు కదా మామయ్య ఇది మీరు తీసుకోండి అంటు ఆ యాపిల్ను మురళీ కృష్ణకు ఇస్తాడు. ఇక అది విన్న సౌందర్య షాక్ అవుతుంది. ఏం అన్నాడు వాడు అని మురళీ కృష్ణను అడగ్గా నోరరా మామయ్య అన్నాడమ్మా అనగానే సౌందర్య సంతోషంతో కార్తీక్ను చూస్తుండిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ మోనిత కార్తీక్ ఏంటి దీపతో అల మాట్లాడాడు. అంటే కార్తీక్ ఇప్పటి దాకా నా మీద చూపించింది ప్రేమ కాదు అనుకుంటుంది. కనీసం విజయనగరం నుంచి పెళ్లాం, పిల్లలను విమానంలో తీసుకొచ్చినప్పుడైనా నాకు సిగ్గు ఉండాలి కదా? లేదు నేను కార్తీక్ని పెళ్లి చేసుకోవడం కోసం నేను చేసిన దరిద్రగొట్టు పనులన్నీ ఇంకే ఆడది చెయ్యదు.. ఇంత కథ నడిపినా ఇన్నేళ్లకు కూడా నా బతుక్కి మోక్షం లేదు.. చావాలనిపిస్తోంది అంటూ తనలోనే తానే మాట్లాడుకుంటుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడగడంతో.. దీప గురించే అని కవర్ చేస్తుంది మోనిత. అంటే.. భారతి ఏమైనా చెప్పిందా అని కంగారుగా అడగ్గా భారతి నాకు చెప్పడం ఏంటీ? దీప గురించి అంటుంది మోనిత. నా భార్య గురించి నాకు చెబితే నేను తట్టుకోలేనని నీతో ఏమైనా చెప్పిందా? అని అడుగుతున్నాను మోనితా.. చెప్పి ఉంటే నిజం చెప్పు.. అవసరం అయితే స్పెషల్ డాక్టర్స్ని పిలిపిస్తాను అని కార్తీక్ అనడంతో మోనిత ఇంకా కోపంతో రగిలిపోతుంది. మొగుడితో చెప్పకుండా నాతో ఎందుకు చెబుతుందని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత మోనిత నువ్వు నిజంగా బాధపడుతున్నావా? పిల్లలు బాధపడతారని బాధపడుతున్నావా అని వెటకారంగా అనడంతో.. ‘పిల్లల గురించి కాదు.. లోకం గురించి కాదు.. భర్తగా ఇది నా బాధ్యత అని కూడా కాదు.. దీప బతకాలి.. బతికి తీరాలి.. ఇన్నాళ్లు దీప ఎన్నో కష్టాలు పడింది.. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రాణాలతో పోరాడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా అనుకుంటే నాకేంటీ? ఐ డోంట్ కేర్..నా భార్య బతకాలి..దట్స్ ఆల్’ అని అంటాడు కార్తీక్ ఆవేశంగా అంటాడు. అది విన్న మోనిత ‘ఇది జాలి కాదు.. మానవత్వం కాదు..మరేదో ఉంది..’ అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత మోనిత నేను వెళతాను అనగానే కార్తీక్ మంచిది అని ఇచ్చిన సమాధానాన్ని మోనిత ఊహించలేకపోతుంది. దీంతో ఆమో మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోతాయి. వెంటనే కార్తీక్ ఉండొచ్చు కదా.. భారతికి తోడుగా అనగా నువ్వు ఉన్నావ్గా ఫ్రెండ్గా అనుకుంటు అక్కడ నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు డాక్టర్ భారతి దీపకు ఒక ఇంజక్షన్ ఇస్తూ ఇంజక్షన్ ఇచ్చాక మత్తుగా ఉంటుంది కానీ పడుకోవద్దని చెబుతుంది. ఇంజక్షన్ ఇవ్వగానే దీప మత్తు రావడంతో పడుకుంటుండగా డాక్టర్ భారతి దీపతో పడుకోవద్దని లేపుతుంది. ఆ తర్వాత సౌందర్య, కార్తీక్లు అక్కడికి వస్తారు. దీపతో ధైర్యంగా ఉండు.. నిద్ర అసలు పోకుడదంటుంటే దీప సరే అన్నట్లు నవ్వుతూ తల ఊపుతుంది. సౌందర్య కూడా చెప్పడంతో ఆమెనే చూస్తూ దీప చిరునవ్వు చిందిస్తుంది. నాకు ధైర్యం చెప్పడం కాదే నువ్వు ధైర్యంగా ఉండు అని చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్ సౌందర్యలను మీరు వెళ్లండి నేను చూసుకుంటా అని చెప్పి బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ సౌందర్యతో నువ్వు ఇంటికెళ్లు మమ్మీ నేను ఉంటానంటే, నువ్వే వెళ్లరా ఫ్రెష్ అయ్యి కాస్తా తిని రమ్మనగా అది ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా వెళతాను మమ్మీ.. ఇక్కడే ఉంటానని అంటాడు కార్తీక్. -
‘వంటలక్క’ వెరైటీ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
‘‘సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు..’’ అంటూ అల వైకుంఠపురములో మూవీలో మాస్ బీట్తో బంటు అలియాస్ అల్లు అర్జున్ స్టైలిష్ ఫైట్తో అలరించాడు కదా. సేమ్.. ఆ రేంజ్ ఫోజుతో వంటలక్క అలియాస్ నటి ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను అలరిస్తోంది. సీరియల్తోనే కాదు.. ఛాన్స్ దొరికితే బయట కూడా తన చేష్టలతో ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తుంటుంది ప్రేమి విశ్వనాథ్. లుంగీ కట్టు, పూల చొక్కా, చేతిలో సిగరెట్, నోటి నుంచి గుప్పుమని పొగ, గాల్లో ఎగిరే కోడిపుంజు.. వెరసి ప్రేమి ఆరాచకమైన ఫొజుతో అలరిస్తోంది. తన సోదరుడు తీసిన ఆ ఫొటోను ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్ హ్యాష్ట్యాగ్ను యాడ్ చేసింది మన వంటలక్క. ఫాలోవర్స్ కోసం.. కింద నో స్మోకింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఉంచింది. View this post on Instagram A post shared by Premi Vishwanath (@premi_vishwanath) -
Karthika Deepam: దీపకు స్లోపాయిజన్ ఇచ్చారు అనగానే..
కార్తీకదీపం సీరియల్.. దీప ఆరోగ్యం దిగజారిపోవడంతో కార్తీక్ హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తాడు. ఆ విషయం తెలుసుకుని మోనిత ఆస్పత్రికి వచ్చిన మోనిత ఎలాంటి ప్లాన్తో ఉందో తెలియదు. మరోవైపు ఎలాగైనా దీపను బతికించుకోవాలని చూస్తున్న డాక్టర్ బాబు ప్రయత్నం తిరుతుందా లేదంటే మోనిత కొత్తగా దీపపై ఎమైనా పన్నాగాలు పన్ననుందా అనేది తెలుసుకోవాలంటే నేటి(మే 26) ఎపిసోడ్ ఇక్కడ చదివేయండి.. కార్తీక్, డాక్టర్ భారతి, డాక్టర్ గోవర్థన్లు మాట్లాడుకుంటుంటే మోనిత అక్కడకు వస్తుంది. వారిని పలకరించినప్పటికీ ముగ్గురు మోనితను పట్టించుకోకుండా వారు సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. దీంతో ‘హాలో.. నేను కూడా డాక్టర్నే, నన్న కాస్త గుర్తించండి. నాతో కూడా డిస్కషన్ చేయోచ్చు’ అని మోనిత అంటుంది. దీంతో భారతి మొదటి నుంచి చెప్పలేము.. దీపకు పదేళ్ల క్రితం ఎవరో స్లోపాయిజన్ ఇంజెక్ట్ చేశారు అనగానే మోనిత ఒక్కసారిగా కంగుతింటుంది. అది ఇన్నాళ్లుగా మెల్లిమెల్లిగా ప్రతి టిష్యును డ్యామెజ్ చేసుకుంటు.. ఒక్కో ఆర్గాన్ పనిచేయకుంగా చేస్తూ వస్తోంది. ఆ డ్రగ్ బయటకు వెళ్లే అవకాశం లేదు అందుకే బ్లడ్ ప్యూరిఫై చేయాల్సి వచ్చింది. దానికి డయాలసీస్ తప్ప వేరే మార్గం లేదు’ అని భారతి వివరిస్తుంది. అలాగే డాక్టర్ గోవర్ధన్ కూడా దీప ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది అంటాడు. మరోవైపు పిల్లలు(హిమ, శౌర్య) ఇంటి దగ్గర దిగులుగా ఉంటారు. వారణాసి వాళ్లకు అన్నం పెట్టాడు. ఆ తర్వాత వారణాసితో అమ్మకు ఏంకాదు కదా.. ఏం కాదమ్మా.. అక్కడ ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, వాళ్లు అమ్మకు ఏం కాకుండా చూస్తారు. మీ డాడి కూడా డాక్టరే కదా అని వారికి సర్ది చెబుతాడు. ఇక హిమ ఇక్కడే ఉంటే అమ్మ గుర్తోస్తుంది నానమ్మ వాళ్ల ఇంటికి వెళదాం.. వారణాసి మమ్మల్ని అక్కడ దీంపుతావా అని అడుగుతుంది. శౌర్య కూడా అవును మనం ఇప్పుడు ఇక్కడ కంటే ఆదిత్య బాబాయ్, పిన్నితో ఉండటమే కరెక్ట్ అని అక్కడి వెళ్లతారు. ఆస్పత్రి దగ్గర మోనిత, భారతిలు దీప దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. దీపను ఇప్పుడు ఎలా ఉంది అని భారతి అడగ్గానే ఇంటికి ఎప్పుడు వెళ్లోచ్చు రేపా, ఎల్లుండా అని అనగా.. గుడ్ ఇలా ధైర్యంగా ఉండాలి అంటుంది భారతి. ఆ తర్వాత దీప నా భర్తను చూడాలని ఉంది, ఆయన్ని పిలవండి అని భారతికి చెబుతుంది. ఆ తర్వాత మోనిత పలకరిస్తూ ఎలా ఉన్నావ్ దీప అనగానే నన్ను ఇలాంటివి ఏం చేస్తాయి, నీలాంటి మహమ్మారే ఏం చేయలేకపోయింది అంటూ మోనితకు కౌంటర్ వేస్తుంది దీప. ఆ తర్వాత నాకు తెలుసు నేను లేకపోతే నా భర్తను పెళ్లి చేసుకుంటావని, నీకు ఆ అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను ఉండగా నా భర్తను చేసుకునే ధైర్యం నువ్వు చేయవు అంటుంది దీప. మోనిత కార్తీక్ వస్తున్నట్లు గమనించి.. ‘నువ్వు బతకాలి దీప. నిండు నూరేళ్లు బతికి నీ భర్త, పిల్లలతో హాయిగా ఉండాలి’ అంటు దొంగ ఏడుపు ఏడుస్తుంది. కార్తీక్ రాగానే గెట్ అవుట్ దీప నా భర్తతో మాట్లాడాలి అంటుంది. ఆ తర్వాత మోనిత బయటకు వెళ్లి డోర్ నుంచి వాళ్లను గమనిస్తుంది. ఇక కార్తీక్, దీపలు ఒకరిని ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ చెప్పు వంటలక్కా అని పిలవగానే దీప నవ్వుతుంది. ఇలా నవ్వుతూ ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి దీప అంటు కాస్త సరదాగా మాట్లాడుతాడు. నువ్వు మీ డార్లీంగ్ అత్తయ్యాతో షాపింగ్ అని తిరగాలి, పిల్లలకు రకరకాల వంటలు వండిపెట్టాలి. దొసకాయ పచ్చడి పిల్లలకే కాదు కాలనీ మొత్తం పంచాలంటూ దీప కార్తీక్తో మాట్లాడం చూసి మోనిత షాక్ అవుతుంది. ఇక నాకు ఏమైన అయితే డాక్టర్ బాబు అనగానే స్టుపిడ్ నీకు ఏం కాదు ఇంకోసారి అలా మాట్లాడకు అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్లి సౌందర్య పక్కన కూర్చుంటాడు. బయట సౌందర్య భుజం మీద తల వాల్చగానే సౌందర్యతో అది చివరి క్షణాలు అంటూ ఇప్పటికైనా నమ్మనని చెప్పండి అని చేతిలో చెయ్యేసి అంత ధీనంగా అడిగినప్పుడు కూడా నీకు చెప్పాలనిపించలేదారా, ఏం మాట్లాడకుండ అలా మౌనంగా ఉండిపోయావు అని అడుగుతుంది. ఆ తర్వాత తరువాయి భాగంలో కార్తీక్ దీప రూం బయట నిలుచుని నీకు ఏం కావద్దు నువ్వు బ్రతకాలి దీప అని మనసులో అంటుండగా దీప పల్స్రేట్ పడిపోతుంది. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. వెంటనే కార్తీక్ డాక్టర్ భారతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి దీప పరిస్థితి గురించి చెబుతాడు. వెంటనే వాళ్లు అక్కడికి వెళ్లి చెక్ చేస్తుంటారు. చదవండి: కార్తీకదీపం: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు -
karthika Deepam: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు
కార్తీకదీపం మే 25: దీప టాబ్లెట్ వేసుకున్న మరు క్షణంలో కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో సౌందర్య, పిల్లలు కంగారు పడిపోతుంటారు. తల్లికి ఏమైందోనని శౌర్య, హిమలు భయంతో ఏడుస్తుంటారు. ఇంతలో కార్తీక్, మురళీ కృష్ణ ఇంటికి రాగానే పిల్లల ఏడుపు వినిపించడంతో కంగారు పడుతూ ఇంట్లోకి వస్తారు. అక్కడ దీప జీవచ్చవంలా పడి ఉండటం చూసి మురళీ కృష్ణ షాక్ అవుతాడు. కార్తీక్ దీపకు నీళ్లు తాగించగా అవి బయటకు వచ్చేస్తాయి. అలా షాక్లో దీప వంకే చూస్తుండిపోతూ.. ‘కనీసం ఆ దేవుడు నాకు క్షమణలు కోరే అవకాశం కూడా ఇవ్వడం లేదేంటి దీప. నాకు నిజం తెలిసిందని నీకు చెబితే అదే నిన్ను సంజీవినిలా బ్రతికేంచేదని’ కార్తీక్ మనసులో అనుకుంటూ దీపను దగ్గరగా పట్టుకుని హత్తుకుంటాడు. ఇక పిల్లలు ఏడుస్తుంటే అమ్మకు ఏం కాదు మీరు ఊరుకొండమ్మా అని చెప్పి సౌందర్యతో.. మమ్మీ పిల్లలను దగ్గరికి తీసుకో అంటాడు. మురళీ కృష్ణ కూడా అమ్మ దీపా అంటు బాధపడుతుంటే నన్ను నమ్మండి దీపకు ఏంకాదు ఎలాగైనా తనని బ్రతికించుకుంటానని ధైర్యం చెబుతాడు. వెంటనే ఫోన్ తీసి డాక్టర్ గోవర్ధన్ నెంబర్ ఉంటుందని దానికి కాల్ చేసి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్పు మమ్మీ అని సౌందర్యకు ఫోన్ ఇస్తాడు. అలాగే డాక్టర్ భారతికి కూడా ఫోన్ చేసి చెప్పిన హాస్పిటల్కు రమ్మని చెప్పమంటాడు. ఇక దీపను హాస్పిటల్కు తీసుకేళ్లి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్తుంటే నీకు ఏంకాదు ఎలాగైనా బ్రతికించుకుంటాం నువ్వు ధైర్యంగా ఉండు దీప అంటుంది సౌందర్య. అలాగే మురళీ కృష్ణ కూడా ఆ దేవుడు నీ వైపు ఉన్నాడమ్మా నీకు ఏం కాదు అంటాడు. దీప కార్తీక్ వంక చూస్తు దగ్గరగా రమ్మనంటు సైగ చేస్తుంది. దీంతో కార్తీక్ దగ్గరగా వచ్చి దీప చేయిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ‘ఇవి నాకు చివరి క్షణాలని నాకు అర్థమవుతుంది డాక్టర్ బాబు... నేను వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త.. ఇప్పటికైనా నన్ను నమ్మానని చెప్పండి డాక్టర్ బాబు హాయిగా కళ్లు మూస్తాను’ అని అంటుండగా డాక్టర్ వచ్చి పెషేంట్ కండీషన్ తెలియదా ఇంక ఇక్కడే ఉంచారేంటని హడవుడి చేస్తాడు. మరోవైపు మోనిత తన హాస్పిటల్కు వెళ్లడానికి రెడీ అవుతుంటే ప్రియమణి కాఫీ తీసుకువస్తుంది. కాఫీ తెమ్మని చెప్పిన అరగంటకు తెస్తావా నీకు బద్దకంగా బాగా పెరిగిపోయిందే అంటుంది మోనిత. దీంతో ప్రియమణి.. బద్దకం కాదమ్మా, పని ఎక్కువై అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా అంటుంది ప్రియమణి. ఆ కాఫీ తాగి మోనిత హాస్పిటల్కు బయలుదేరబోతుంటే డాకర్ భారతి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. దీంతో మోనిత తెగ ఆనందపడుతూ.. ఫొన్ అవునా!.. వస్తున్న వెంటనే బయలుదేరుతున్నా అంటు బాధపడిపోతున్నట్లు నమ్మిస్తుంది. ‘దీపమ్మ ఆస్పత్రిలో చేరిందనగానే మీ మొహంలో ఆనందం కనిపించిందమ్మ. దయ చేసి దీపమ్మను చంపడం లాంటివి చేయకండి’ అని ప్రియమణి మోనితతో అనగానే నాకు ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనే లేదే నువ్వు అన్నాకే వచ్చింది. చూస్తా అంటు వెళ్లిపోతుంది. మరోవైపు ఆదిత్య ఏమైంది అమ్మ రాగానే వదిన ఆరోగ్యం బాగాలేదని వెళ్లిపోయింది.. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదని కంగారు పడుతూ అందరికి ఫోన్ చేస్తాడు. ఎవరు ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో చిరాకుపడుతుంటాడు. మురళీ కృష్ణ నా కూతురికి ఏమైందమ్మా ఏదైనా ప్రాణాంతక రోగమా అనగానే.. సౌందర్య ఏడుస్తూ దానికి ఏం కాదు, ఇక్కడ నా కొడుకు ఉన్నాడు దీపను ఎలాగైనా బ్రతికించుకుంటాం... ఈ హాస్పిటల్ నుంచి సంతోషంగా నా కోడల్ని తీసుకెళ్తాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో మోనిత అక్కడకు వస్తుంది. రేపటి ఎపిసోడ్లో దీప, మోనితలు మాట్లాడుకుంటారు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు నా ప్రాణం పోగానే ఇక్కడే నా భర్తతో తాళి కట్టించుకునేందుకు ఎదురు చూస్తున్నావని తెలుసు అంటుండగా... డాక్టర్ బాబు అక్కడికి వస్తాడు. గెట్ అవుట్ మోనిత నా భర్తతో నేను మాట్లాడాలి అంటుంది దీప. -
karthika Deepam: మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచింది
కార్తీకదీపం మే 24: సౌందర్య దీపతో మాట్లాడుతుంటే మధ్యలో శౌర్య, హిమ వచ్చి.. దీపకు ముద్దులు పెడతారు. ‘ఏంటమ్మా’ అంటే దీప అడగ్గా నాన్నమ్మ మాకో కథ చెప్పిందమ్మ. అందులో ఇద్దరుంటారు. వాళ్లు ఎవరో కాదు నువ్వు.. నాన్నా.. మీరెంత మంచివాళ్లో నాన్నమ్మ మాకు అర్థమయ్యేలా చెప్పింది. అందుకే ముద్దు పెడుతున్నామంటు వారు మురిసిపోతుంటారు. అది వినగానే దీప కాస్త సంతోషంగా నవ్వుతుంది. తర్వాత హిమ నాన్నమ్మా మాకు అమ్మ కూడా ఓ కథ చెప్పింది. ఆవు పులి కథ. అది వింటే మాకు చాలా ఏడుపొచ్చింది అని దీప చెప్పిన కథను సౌందర్యకు వివరిస్తుంటారు. దీంతో ఆ కథ దీపను ఉద్దేశించే చెప్పిందని తెలుసుకుని, కొన్నిసార్లు పులి చెడ్డది కాదమ్మా.. ఆవులోని అమ్మదనాన్ని, ఆ కమ్మదనాన్ని తెలుసుకుంది. బిడ్డలకి త్లలిని దూరం చేయదు, ఎప్పటికీ దూరం చేయదంటూ భావోద్వేగంతో చెబుతుంది సౌందర్య. మరోవైపు ప్రియమణి వంటలో ఉప్పు లేకుండా మోనితకి పెడుతుంది. అది తిని ఇందులో ఉప్పలేదని అడగ్గానే.. దానికి కావాలనే వేయలేదమ్మా.. మీరు కనిపెడతారా లేదా టెస్ట్ చేశా అంటు మోనితకు ప్రియమణి షాకిస్తుంది. దీంతో మోనిత చిరాకుతో తిట్టిపోస్తూ అసహనం చూపిస్తుంటే... ఈ తిట్లన్ని నా మీద కోపంతో కాదమ్మా, కార్తీక్ బాబు ఈ మధ్య ఇటు రావట్లేదనే కదా.. కార్తీక్ అయ్య నీ దగ్గరకు సలహాల కోసం.. బాధ చెప్పుకోవడం కోసం మాత్రమే వస్తాడమ్మా.. మీరే నోరు తెరిచి మీ మనసులో ఉన్నది చెప్పాలి.. వచ్చినప్పుడే మాట్లాడండి.. పోట్లాడండి.. రానప్పుడు మాత్రం ఇలా నీరసంగా కూర్చోకండి’ అని అక్కడ నుంచి వెళ్లగానే.. మోనిత తనలో తను నవ్వుకుంటుంది. ‘పిచ్చి ప్రియమణీ నేను సైలెంట్గా ఎందుకు ఉన్నానో తెలుసా? చెవులు పగిలిపోయే సౌండ్ వినిపించాలని’ అంటూ పకపకా నవ్వుకుంటుంది. ఇదిలా ఉండగా దీప ఇంటికి బయలుదేరిన మురళీ కృష్ణ స్కూటీ పెట్రోల్ అయిపోవడంతో మధ్యలో ఆగిపోతుంది. స్కూటీని తోసుకుంటూ వెళుతుంటే మధ్యలో కార్తీక్ చూసి కారు ఆపుతాడు. మురళీ కృష్ణ అలసిపోయి తూలి పడిపోబోతుండగా.. అప్పుడే కార్తీక్ స్కూటీని పట్టుకుని సాయం చేస్తాడు. గతంలో ఎన్నోసార్లు ఆయన్ని అవమానించిన సన్నివేశాలను తలుచుకుంటూ చిన్నబోతాడు కార్తీక్. ‘బాబు మీరా.. మీ దగ్గరికే బయలుదేరాను బాబు.. పెట్రోల్ చూసుకోకుండా వచ్చాను.. పెట్రోల్ పోయించుకుని వస్తాను’ అంటూ స్కూటీ పట్టుకుని కదలబోతాడు మురళీ కృష్ణ. కార్తీక్ వెంటనే బండి సైడ్కి పెట్టండంటు స్కూటీని పక్కకు తీసుకెళ్లి పార్క్ చేస్తాడు. వారణాసికి చెప్పి పెట్రోల్ పోయించి తీసుకుర్మమని చెప్తా అంటాడు. అలా అయితే నేను ఎలా రావాలి బాబు అని అడగ్గానే మన కారులో వేళదామనడంతో మురళీ కృష్ణ షాక్ అవుతాడు. వెంటనే కార్తీక్ మురళీ కృష్ణ రెండు చేతుల్ని పట్టుకుని మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచిందని క్షమాపణలు కోరతాడు. షాక్లో ఉన్న మురళీ కృష్ణ తన చేతుల్ని వెనక్కి లాక్కుని ఏంటిది బాబు.. అనగా.. ఏం లేదు.. రండి మామయ్యా అని పిలుస్తాడు. దీంతో మురళీ కృష్ణ అయోమయంగా చూస్తూ.. ‘మీరు.. నన్ను.. మామయ్యా అని..’ అంటూ కన్నీళ్లుపెట్టుకునేసరికి.. ‘నేను మీ పెద్ద అల్లుడ్ని మామయ్యా.. రండి’ అంటూ కారులోంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇస్తాడు. ‘బాబూ.. దీప.. బాగానే ఉంది కదా’ అని మురళీ కృష్ణ అగడంతో.. ‘బాగుంది.. బాగుంటుంది. నేను ఉండగా దీపకు ఏం కాదు.. కానివ్వను అంటాడు. దీంతో మురళీ కృష్ణ ‘దీప ఆరోగ్యానికి ప్రమాదామా బాబు’ అని అడగ్గా.. దీప ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది.. నా మాట నమ్మండి అని నచ్చజెప్పి కారు ఎక్కమంటాడు. దాంతో మురళీ కృష్ణ.. ‘ఏంటి ఈయన ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు? నా కూతురు సంతోషంగా ఉంటుంది అంటున్నాడు’ అని ఆలోచించుకుంటూ ఉండగా.. కార్తీక్.. ‘మామయ్యా ఎక్కండి’ అని మరోసారి పిలుస్తాడు. ఇద్దరు కలిసి ఇంటికి బయటుదేరుతారు. ఇదిలా ఉండగా.. సౌందర్య దీపని పిలిచి టాబ్లెట్స్ వేసుకోమని ఇస్తుంది. దీప వేసుకుని.. తన పవిత్రతని నిరూపించుకోలేనందుకు బాధపడుతూ సోఫాలోకి పడిపోతూ సృహ కోల్పోతుంది. కట్ చేస్తే దీపను హాస్పిటల్కు తీసుకువెళ్లిన సీన్ను తరువాయి భాగంలో చూపిస్తారు. దీప ఇదే తన చివరి క్షణం అన్నట్లుగా కార్తీక్తో మాట్లాడుతూ.. ఇప్పటికైన నమ్మానని చెప్పండి డాక్టర్ బాబు ప్రశాంతంగా వెళ్లిపోతానంటూ కళ్లుమూస్తుంది. -
‘కార్తీకదీపం’ పై మంచు లక్ష్మీ ట్వీట్.. రిప్లై ఇచ్చిన ‘డాక్టరు బాబు’
Karthika Deepam : బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ చూస్తామా? అని తహతహలాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. టీఆర్పీ రేటింగ్ విషయంలో ఇంతవరకు ఏ సీరియల్ కానీ, షోలు కానీ ‘కార్తీక దీపం’ని అందుకోలేకపోయాయంటే ఈ సీరియల్కి ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచీ పాజిటివ్ టాక్తో టాప్ రేటింగ్ రాబడుతూ దేశంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మొదటి సీరియల్గా నిలిచింది. ఈ సూపర్ హిట్ సీరియల్కి సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఫాన్స్గా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. Karthik from #karthikadeepam cried for the first time anta. My mom is finally happy.. — Lakshmi Manchu (@LakshmiManchu) May 22, 2021 ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సీరియల్పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉండే మంచు లక్ష్మీ.. ‘కార్తీక దీపం సీరియల్తో డాక్టర్ బాబు దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చాడట.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది’అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘మీరు కూడా వంటలక్క అభిమానేనా లక్ష్మీగారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మంచు లక్ష్మీ ట్వీట్ని డాక్టరు బాబు(నిరుపమ్ ) షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు. We too are happy for this tweet!! ❤ https://t.co/XUlxvIGWGX — starmaa (@StarMaa) May 22, 2021 చదండి: కారీక దీపం.. దీప ముందు మనిషిలా నిలబడగలనా!: కార్తీక్ -
Karthika Deepam: దీప ముందు మనిషిలా నిలబడగలనా!: కార్తీక్
సౌందర్య పిల్లపై కోపపడుతుంది. నా కొడుకు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాడని ఎలా అనుకున్నారే అంటు కాస్త కోపం చూపిస్తుంది. దీంతో హిమ, శౌర్యలు సారీ చెబుతారు. ఆ తర్వాత పిల్లలు నాన్న, అమ్మ ఇద్దరు అసలు సరిగా ఉండటం లేదని చెప్పడంతో సౌందర్య పిల్లలకు అర్థమయ్యే భాషలో వారి మధ్య ఉన్న సమస్య గురించి వివరిస్తుంది. మీ అమ్మకు నాన్నకు మధ్యలో కాలుష్యం ఉందని, అది తొలగిపోతే అంతా సంతోషమే అంటు చెప్పు కొస్తుంది. తర్వాత పిల్లల్ని గుండెలకు హత్తుకుని. ‘మీ అమ్మని ఎంత ఖర్చు అయినా సరే బతికించుకుని తీరాలి’ అని తనలో తనే అనుకుంటు కన్నీరు పెట్టుకుంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్.. కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ.. డాక్టర్ చెప్పిన నిజం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. మీరు అబద్దం అనేది నిజం.. మీరు నిజం అనుకునేదే అబద్దం.. ఈ నిజానికి అబద్దానికి మధ్య ఉన్న తేడా చెరిగిపోవాలంటే కావాల్సింది నా మీద నమ్మకమని దీప వాదించిన మాటలను, దీప నిప్పురా.. విహారీకి పిల్లలే పుట్టరని తెలిశాక ఇక దీప తప్పు లేనట్లే కదా అన్న సౌందర్య మాటలను గుర్తు చేసుకుంటూ కారు సడన్గా ఆపేస్తాడు. ఏడుస్తూ కారు దగ్గర దీప, అమ్మ ఎన్ని చెప్పిన నేను వినలేదు అంటూ పశ్చాత్తాప పడుతాడు కార్తీక్. దీప ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పటి తర్వాత తనకు ఇద్దరు కవలలు పుట్టారనే నిజం తెలుసుకున్న దీప, ఆ విషయాన్ని కార్తీక్తో సంతోషంగా చెప్పుకుంటుంది. వారిని నీ కన్న బిడ్డలుగా అక్కున చేర్చుకొమ్మని వారిని అనాథలను చేయకండంటు కార్తీక్ కాళ్లు పట్టుకుని ఏడ్చిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ ‘విహారి గాడితో ఇద్దరు పిల్లలను కని, వాడిని అన్న అని పిలిచేంతగా దిగాజారావా.. నీతి మాలిన దానా.. అవతలికి పో’ అంటు దీపను కాలితో తన్నిన ఆ సన్నివేశాన్ని తలచుకుంటు కుమిలిపోతాడు. అంతేగాక ‘మమ్మీ నేను తప్పు చేశాను మమ్మీ.. నువ్వు ఎంత చెప్పినా నమ్మకుండా దీపకు నరకం చూపించాను మమ్మీ.. చిత్రవధ చేశాను.. గాయపడిన మనసుకు మళ్లీ మళ్లీ ఎన్నో సార్లు గాయం చేశాను.. నిజంగా దీపా భూదేవి లాంటిదే మమ్మీ.. అది దీప కాబట్టి.. ఇంకా ఇంకా నన్ను ప్రేమిస్తోనే ఉంది. మారతానన్న నమ్మకంతోనే ఉంది’ అని ఏడుస్తూ చాలా మదనపడతాడు. ‘ఎంతో మంది పతివ్రతలు శీల పరీక్ష కోసం అగ్ని ప్రవేశం చేశారు.. అది ఒక్కసారే.. కానీ నేను పదేళ్లగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నా డాక్టర బాబు’ అని దీప అన్న మాటల్ని తలుచుకుని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు కార్తీక్. ‘దీపా.. ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుందని.. ఆ రోజు నీకంటే నేనే ఎక్కువ బాధపడతానని ఎన్నో సార్లు అన్నావ్.. అది నిజం దీపా.. నాకు నిజం తెలిసింది. కానీ ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాల్చేస్తుంది. నా అహంకారాన్ని బూడిద చేస్తోంది. నేను తప్పు చేశాను.. ఘోరమైన పాపం చేశాను.. అమానుషంగా ప్రవర్తించాను.. నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయివాళ్లలా చూశాను.. నీ మాతృత్వాన్ని చాలా అవమానించాను.. ఏం చేస్తే.. ఈ పాపనికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది? నా చదువు, నా సంస్కారం, నా సర్వస్వం ఇవన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయని లోలోపల విలపిస్తాడు. ఇవన్ని నన్ను పేదవాడ్ని చేశాయి దీప, ఉత్త చేతులతో నీ ముందు నిలబడతాను వస్తున్నాను దీపా.. నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ కార్తీక్ కారు స్టార్ట్ చేసి బయలుదేరతాడు. ఇక తరువాయి భాగంలో దీప కళ్లు తిరగిపడిపోవడం, తాను చనిపోతే డాక్టర్ బాబు మోనితను పెళ్లి చేసుకుంటాడా అత్తయ్యా అని దీప భయపడుతుంది. చిన్నప్పుడు నేను సవతి తల్లి దగ్గర పెరిగి నరకం చూశాను అత్తయ్యా.. నా బిడ్డలకు ఆ నరకం వద్దు అంటునే సోఫాలో కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత కార్తీక్, పిల్లలు, సౌందర్య, మురళీ కృష్ణ దీపను లేపే ప్రయత్నం చేస్తారు. కానీ దీప లేవదు, కార్తీక్ నీళ్లు తాగించిన ఆ నీరు బయటకు రావడంతో కార్తీక్ షాకవుతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: క్షీణించిన దీప ఆరోగ్యం, పశ్చాతాప పడుతున్న కార్తీక్
కార్తీకదీపం మే 21: సౌందర్య దీపని ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. మీ ఇద్దరు ఒకరినినొకరు సరిగ అర్థం చేసుకోవడం లేదని, మిమ్మల్ని అలా వదిలేస్తే మీరే తేల్చుకుంటారనుకొని నేను, మీ మామయ్య ఇంటినుంచి వెళ్లిపోయాం, చివరకు ఇదా నువ్వు తేల్చుకుంది. ఏంటే నా కొడుకు నీకు అవసరం లేదని ఇక్కడకు వచ్చావా అంటు సౌందర్య దీప మీద చిటపటలాడుతుంది. దీంతో దీప ఏ స్త్రీ భర్తను చివరి వరకు వద్దనుకొదు అత్తయ్య అంటుంది. మరేంటి ఇది.. నువ్వు ఇక్కడకు ఎవరు అవసరం లేదని వచ్చావా అనగానే, దీప దీనంగా సౌందర్య వైపు తిరగి ఏడుస్తూ ఆమో కాళ్లపై పడుతుంది. మీ లాంటి పుణ్య స్త్రీలు మనసారా దీవిస్తే అది జరుగుతుంది అత్తయ్యా, నేను నిండు నూరేళ్లు జీవించాలని మనసారా దీవించండి అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దీప. అది తెలిసి సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. సోఫాలో కూర్చుని గతంలో కార్తీక్తో దీపకు నిజం చెప్పు అంటూ తను చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత వాడు నాతో చెప్పనని చెప్పి, నీతో చెప్పాడా అంటుంది. అంటే మీకు కూడా తెలుసా అని దీప అనగానే తెలుసు అంటూ వణుకుతున్న గొంతుతో సమాధానం ఇస్తుంది. నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమమైపోతారు అత్తయ్య అంటు దీప సౌందర్య ఒళ్లో తల పెట్టి ఏడుస్తుంది. దీంతో వాడు(కార్తీక్) నిన్ను పెళ్లి చేసుకుని డాక్టర్ బాబు కాలేదే, నిన్ను కాపాడుకోవడానికే వాడు డాక్టర్ అయ్యాడు, నిన్ను ఎలాగైనా బతికించుకుంటాడు అంటు దీపను ఒదారుస్తుంది. లేదు అత్తయ్యా.. ఆయన నాకు వైద్యం చేయిస్తారు.. అది నిజమే కానీ నేను బతకాలి కదా? ఒకవేళ నా పవిత్రత రుజువు చేసుకోకుండానే చచ్చిపోతానా అత్తయ్య అంటూ దీప కుమిలిపోతుంది. మరోవైపు మోనిత ‘ప్రియమణి అన్నట్లుగా కార్తీక్ దీపని పసిపాపలా చూసుకుంటున్నాడా? నన్ను అవైడ్ చేస్తున్నాడా?.. అంటే దీపకి విహారీకి సంబంధం అంటగట్టి నేను విజయం సాధించాననుకుంటే.. ఇప్పుడు ఆ సంగతే మరిచిపోయి. దీప చచ్చిపోతుందని తెలియగానే.. చేరదీసి సేవ చేస్తున్నాడా? ఇదంతా చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను కార్తీక్.. నా కళ్లల్లో నిప్పులు పోసుకుంటాను.. నిన్ను నావాడ్ని చేసుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను.. నాప్రేమ నిజం.. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే పుట్టాను అన్నదీ నిజం.. చూస్తా.. ఎలా రాకుండా ఉంటావో చూస్తాను.. ఎంతకాలం దీప దగ్గరే ఉంటావో చూస్తాను..’ అని తనలో తనే రగిలిపోతుంది. దీప సర్జరీ విషయమై కార్తీక్ హాస్పిటల్కు వెళతాడు. అక్కడ ఈ విషయమై డాక్టర్తో మాట్లాడుతుండగా తులసి(విహారి భార్య) రిపోర్ట్స్ చూస్తు ఏడుస్తూ వెళుతుంది. ఆవిడకు ఏమైందని కార్తీక్ అడగడంతో డాక్టర్ అసలు విషయం చెప్తాడు. వారికి పిల్లలు పుట్టరని ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితమే చెప్పానని, అయినా నన్ను నమ్మకుండ ఎక్కడెక్కడో టెస్టులు చెయించుకున్నారంటాడు ఆ డాక్టర్. చివరకు అమెరికా వెళ్లి కూడా పరీక్షలు చేయించుకున్నారంటాడు. అక్కడ కూడా లాభం లేకపోయే సరికి ఏవో చెట్ల మందులు వాడారు.. మళ్లీ టెస్టు చేయించుకుంది. అవే రిజల్ట్స్ వచ్చాయని ఆ డాక్టర్ కార్తీక్తో చెబుతాడు. దీంతో కార్తీక్ లోపం ఎవరీలో ఉందని తడబడుతూ అడగ్గా.. ఆవిడ భర్తలోనే అని చెప్తాడు డాక్టర్. దీంతో కార్తీక్ గుండె ఒక్కసారిగా బద్దలవుతుంది. వెంటనే దీపను బిడ్డలకు తను తండ్రి కాదని, అంతేగాక పలుమార్లు తులసితో అసభ్యంగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంటాడు. ఇంతలో దీపకు సీరియస్ అవుతుంది. నేను పోతే ఆయన మోనితని పెళ్లి చేసుకుంటారా అత్తయ్యా? అని కుమిలిపోతుంది. రేపటి భాగంలో కార్తీక్ ‘నేను తప్పు చేశాను దీప నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయి వాళ్లలానే చూశాను’ అంటు పశ్చాత్తాపంతో కూలబడిపోతాడు. మరోవైపు దీప ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింతో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్
కార్తీకదీపం మే 20 : కార్తీక్, దీపకు టిఫిన్ పెట్టి టాబ్లెట్ ఇస్తాడు. ఆ తర్వాత వారణాసిని పిలిచి బయట హోటల్ నుంచి డైలీ క్యారెజ్ తీసుకురమ్మంటాడు. దీంతో దీప ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఓపిక వచ్చింది నేనే చేస్తాను మీరు బయట ఫుడ్ తినలేరు కదా డాక్టర్ బాబు అంటుంది. దీంతో కార్తీక్ నన్ను పరాయి వాడిలా చూడకు, మీతోనే ఉంటున్నా కదా మీలాగే నేను ఉంటాను అంటాడు. ఇదిలా ఉండగా తనతో ప్రియమణి ‘పదహారేళ్లు కాదు కదా నూట పదహారేళ్లు వచ్చినా మీకు కార్తీక్ అయ్యకు పెళ్లి జరగదు’ అన్న మాటలను తలుచుకుంటుంది మోనిత. వెంటనే నవ్వుకుంటూ ఈ మోనిత అంటే పూర్తిగా నీకు తెలియదు ప్రియమణీ. నువ్వు చూసింది నాణానికి ఒకవైపే. రెండోవైపు నీకు తెలియదని మనసులో అనుకుంటుంది. నేను చదువులో ఫస్ట్.. గేమ్స్లో ఫస్ట్.. కుట్రలు చేయడంలో కూడా ఫస్టే అలాంటిది పదహారేళ్లుగా కార్తీక్ని ప్రేమిస్తున్న లవ్లో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతాను? నా లెక్కలు నాకున్నాయి. నా అంచనాలు నాకున్నాయి. నేను ప్రయోగించే పద్దతులు నాకున్నాయి. ఇంక కార్తీక్తో నా పెళ్లి ఖాయం అని అనుకుని నవ్వుకుంటుంది. మరోవైపు మురళీ కృష్ణ, భాగ్యంలు దీప ఇంటికి నేను వెళతానంటే నేను వెళతానని అని వాదించుకుంటారు. మురళీ కృష్ణ వెళ్లి ఏడుస్తూ ఇంకా దీపలో బాధ పెంచుతాడని భాగ్యం వద్దు తానే వెళతానడంతో.. నువ్వు వెళ్లి సమస్యను పరిష్కరించకపోగా ఇంకా పెద్దది చేస్తావని మురళీ కృష్ణ అంటాడు. ఇక చివరకు ఇద్దరం వెళ్లొద్దని చెప్పుకుని మనసులో ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లాలనుకుంటారు. ఇక శౌర్య, హిమలు అమ్మ ఎందుకు అంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నాన్న బాగానే చూసుకుంటున్నాడు కదా అయినా ఎందుకు డల్గా ఉంటుందని అనుమాన పడుతుంటారు. నాన్న మనం లేనప్పుడు అమ్మను తిడుతున్నాడా? అలా అయితే మనం ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోరు కదా అని మాట్లాడుకుంటారు. ఏదో జరుగుతోంది అదేంటో నేను తెలుసుకుంటానని శౌర్య, హిమతో అంటుంది. ఏం తెలుసుకుంటావు అని అనగానే, నేను ఆ రహస్యాలను ఈజీగా తెలుసుకోగలను, నాన్న మా నాన్నే అన్న నిజం తెలుసుకోలేదు, నువ్వు మా అమ్మ కూతురివే అనే నిజం కూడా నీకంటే మొదట నేనే తెలుసుకున్నాను, అన్ని తెలుసుకున్న దాన్ని ఇది తెలుకోలేనా అంటుంది శౌర్య. అయితే అదేంటో తొందరగా కనిపెట్టు మనం నానమ్మకు చెబుతాం అంటుంది హిమ. కార్తీక్కు దీప కాఫీ తీసుకువస్తుంది. ఏంటి నిన్ను పెట్టొద్దన్నాను కదా అని వారించే లోపు మీరు పెట్టిందే డాక్టర్ బాబు ఫ్లాస్క్లో ఉన్నది పోసుకొచ్చాను అంటుంది. ఆ తర్వాత కాఫీ గ్లాసు తీసుకుని తాగతూ.. కాసేపు ఆగి మజ్జిగ తాగు చేసిపెట్టాను అంటాడు. దాంతో దీప మజ్జిగ నేను చేసుకోలేనా డాక్టర్ బాబు. మజ్జిగ చేసినా చచ్చిపోతానా అనడంతో నవ్వు ఇబ్బంది పడకూడదని చేసిపెట్టానని, అయినా నువ్వు పదే పదే చావు గురించి మాట్లాడకు అని అంటాడు కార్తీక్. మీరు ఆ మాట ఒక్కసారే చెప్పారు, కానీ చచ్చిపోయేది నేను కదా విని వదిలేయలేను అంటుంది దీప. నువ్వు అంత బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే రేపో ఎల్లుండో నీకో చిన్న సర్జరీ చేస్తారు అది అయిన వెంటనే ఇంటికి పంపించేస్తారు. మందులు వాడుతూ జాగ్రత్తగా ఉంటే చాలంటాడు కార్తీక్. దీంతో మీరే దగ్గరుండి సర్జరీ చేయిస్తారా? డాక్టర్ బాబు అంటుంది, అవును అయినా అదేం ప్రశ్న అని కార్తీక్ అనగానే.. నిజం చెప్పండి డాక్టర్ బాబు ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నారా అంటుంది దీప. చాలు అనవసరమైన ఆలోచనలేం పెట్టుకోకు అంటు అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. మోనిత ధీనంగా కూర్చుని ఉంటే.. ప్రియమణి వచ్చి ఏంటమ్మా ఏదో జరుగుతోందని అర్థమవుతుంది అంటుంది. వెంటనే మోనిత ఏంటీ అనగడంతో కార్తీక్ అయ్య దీపమ్మని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చిన్నారిపాపలా చూసుకుంటుంటే. మీరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు అనుకున్నా అని అడుగుతుంది. మీ కడుపు బగ్గున మండిపోతుంది అనుకున్నా.. అలాంటిది ఏం జరగకుండా మీరు కూర్చున్నారంటే ఇదంతా నాకు మింగుడు పడటం లేదు అంటుంది. నువ్వు మాట్లాడేవన్నీ నిజలే ప్రియమణీ ఏదో జరుగుతుంది, అదే ఏంటని ప్రియమని అడగ్గా, అదే నిజం అంటుంది మోనిత, అదే ఏం నిజమనగానే మోనిత ‘కార్తీక్ నా కాళ్ల దగ్గరికి వచ్చే’ నిజం అంటు సిరీయస్గా అంటుంది మోనిత. దీంతో ప్రియమని భపడుతూ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు భయంగా ఉందంటు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా సౌందర్య దీప దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి ఎందుకు వచ్చేశావ్ అని దీపకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత సౌందర్య వంకే ధీనంగా, బాధతో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ డాక్టర్ ద్వారా అసలు నిజంగా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: తల్లిపై దిగులు పెంచుకున్న శౌర్య, హిమ
కార్తీకదీపం మే 19: దీప డాక్టర్ బాబును కార్తీక్ అని పిలుస్తుంది. ఇది కూడా తన పదేళ్ల కోరిక అని మిమ్మల్ని ఎప్పుడైన కార్తీక్ అని పిలవాలనిపించేది డాక్టర్ బాబు అని చెబుతుంది. అంతేగాక వారం, పది రోజుల్లో పోయేదాన్ని ఇప్పుడే ఇలాగే మీ ఒడిలో తలపెటుకుని కన్నుమూయాలనుంది అంటూ ఏమోషనల్ అవుతుంది. దీంతో కార్తీక్.. డాక్టర్లు, మందులు ఉన్నవి మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తుండటానికి కాదు అని అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లి స్నానం చేసి వస్తే టిఫిన్ పెడతాను, ఆ తర్వాత టాబ్లెట్ ఇస్తా అంటూ దీప చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ తీసుకుని వెళతాడు. ఆ తర్వాత డాక్టర్ బాబు తనను చేతితో తాకడానికి కూడా ఆలోచిస్తున్నాడంటే.. ఇదంత తన మీద ప్రేమతో కాదని జాలితో చేస్తున్నాడనుకుంటుంది. ఆ తర్వాత దీప స్నానానికి వెళ్లడంతో కార్తీక్ పిల్లలతో కలిసి టిఫిన్ చేస్తాడు. ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తుంటే శౌర్య, హిమలు మమ్మీ కూడా మనతో కలిసి టిఫిన్ చేస్తే బాగుండు అనుకుంటారు. అమ్మ రోజు పొద్దున్నే లేచి ఇళ్లు ఉడిచి, ముగ్గు పెట్టి మాకోసం టిఫిన్ తయారు చేసి అప్పడు లేపేది. ఇలా అమ్మను ఎప్పుడు చూడలేదంటు దిగులు పడుతుంటారు పిల్లలు. దీంతో కార్తీక్ మమ్మీకి ఏం కాలేదు కాస్తా నిరసంగా ఉందంతే. టాబ్లెట్స్ వేసుకుని, కొన్ని రోజులు వంట దగ్గరికి రాకుండ ఉంటే చాలు అంటాడు. దీంతో హిమ అయితే మాకు ఇప్పుడు నువ్వు వంట పనుల్లో కొంచం సాయం చేస్తే చాలు, పెద్దాయ్యాక మాకెవరి సాయం లేకుండా మేమే వంట చేస్తామని కార్తీక్తో అంటుంది. అంతేగాక అప్పుడు అమ్మను కుర్చోబెట్టి తనకు ఇష్టమైనవన్ని చేసి పెడతామని, అమ్మకు నచ్చిన సినిమాలు, పుస్తకాలు కొనిపెడతామంటూ ఇద్దరూ అంటుంటే.. కార్తీక్ దీప బతకదు అని డాక్టర్ భారతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. ఇదిలా ఉండగా మోనిత చాలా హుషారుగా కనిపిస్తుంది. ప్రియమణి టీ తీసుకురావడానికి ముందే మోనిత లేచి స్నానం చేసి దేవుడికి దీపం ముట్టిస్తుంది. అది తెలుసుకుని ప్రియమణి షాక్ అవుతుంది. మీరేంటి దీపం ముట్టించడమేంటి అమ్మగారు.. అలా మీరు దేవుళ్లను ఇరకాటంలో పెడితే ఏలా అమ్మగారు అంటు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంది. ఎప్పటికైనా చేయాలి కదా ప్రియమణి.. రేపు కార్తీక్ని పెళ్లి చేసుకున్నాక పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ కప్పుతో కార్తీక్ను లేపాలి కదా అంటు మురిసిపోతుంది. ప్రియమణి కారు కడుగుతుంటే, మోనిత టీ తాగుతూ బయటకు వస్తుంది. ఆడవాళ్లు ఇలా కారు కడగడం మొదటిసారి చూస్తున్నానని మోనిత అనగానే.. ఆడవాళ్లతో కారు కడిగించే వాళ్లను కూడా నేను ఇప్పుడే చూస్తున్నా అంటుంది. నా దగ్గర పని చేస్తే వాళ్లు ప్రపంచంలో ఎక్కడైన బతుకుతారంటూ మోనిత గర్వంగా చెబుతుంది. హా.. నేను పెళ్లి చేసుకుని వెళ్లాక మీకు ఎలాంటి పనివాళ్లు దొరుకుతారో చూస్తా అంటుంది ప్రియమణి. దీంతో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా చేసుకోను అన్నావ్ కదే అని అంటుంది మోనిత. అప్పుడు అలా అన్నాను కానీ ఇప్పుడు చేసుకుంటా అంటుంది. నా పెళ్లి అయ్యే వరకు నువ్వు పెళ్లి చేసుకునేది లేదు అనగానే ప్రియమణి.. ఏంటమ్మా మీ పెళ్లి అయ్యాకా నేను చేసుకోవాలా.. అప్పటికి నా వయసు కూడా అయిపోతుంది.. మీ పెళ్లి జరుగుతుందనే అనుకుంటున్నారా, కార్తీక్ అయ్య దీపమ్మను తెచ్చి ఇంట్లో పెట్టి.. దీపా పాపా అంటూ మందులు పట్టుకుని ఆవిడ వెనకాలే తిరుగుతూ ఉంటే..మీ పదహారేళ్ల ప్రేమకు 116 ఏళ్లు వచ్చినా మీ పెళ్లి మాత్రం జరగదు అని వాదిస్తుంది . ప్రియమణి మాటలకు మోనిత రగిలిపోతుంది. అయినప్పటికీ కోపాన్ని ఆపుకుంటు ఈ టైంలో అసలు కోపం తెచ్చుకోవద్దు, చూద్దాం ఏం జరుగుతుందో అని మనసులో అనుకుంటుంది. ఇక దీప స్నానం చేసి రెడీ అయ్యి రాగానే కార్తీక్ టిఫిన్ పెట్టి, టాబ్లెట్స్ ఇస్తాడు. ఆ తర్వాత దీప ఇదంతా నా మీద ప్రేమతో కాకుండా జాలితో చేస్తున్నారు కదా డాక్టర్ బాబు అని అడుగుతుంది. దీంతో నేటి ఎపిసోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: దీప పదేళ్ల కోరిక తీర్చిన డాక్టర్ బాబు
కార్తీకదీపం మే 18: దీప శ్రీరాంనగర్ బస్తీలో కార్తీక్తో కలిసి ఉందని తెలిసి మొరళీ కృష్ణ సంతోష్తిస్తాడు. దీప ఎక్కడికి వెళ్లలేదు, ఈ ఊర్లోనే.. అదే ఇంట్లో ఉందంటూ భాగ్యంతో చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తాడు. దీంతో భాగ్యం దానికి ఇంత ఆత్మగౌరం ఎందుకండి, డాక్టర్ బాబే కదా ఇంటికి తీసుకు వచ్చింది హాయిగా అత్తింట్లో ఉండకుండా దానికి ఇదేం పిచ్చి అంటుంది. దీంతో మొరళీ కృష్ణ.. డాక్టర్ బాబులో ఇంకా అనుమానం అలాగే ఉందని, తల్లికి కోడలిగా, పిల్లలకు తల్లి అవరమని ఇంకా దాని ఆరోగ్యం గురించి ఆలోచించి తీసుకువచ్చాడని, అత్తింట్లోనే ఓ అతిథిగా ఉండటమంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది భాగ్యం అని మురళీ కృష్ణ అంటాడు. అవునండి మీరు చెప్పింది కూడా నిజమే.. కానీ దీప ఎప్పుడు ఇలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే డాక్టర్ బాబు కూడా ఎన్నాళ్లని ఓపిక పడతాడని, ఇలా చేస్తే విసుగొచ్చి ఆ మోనిత దగ్గరికి వెళ్లిపోతే, ఆమెనే పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అంటుంది. దీంతో మురళీ కృష్ణ కూడా నిజమేనంటు ఆలోచిస్తాడు. అంతేగాక దీప, కార్తీక్లు ఎప్పుడెప్పుడు విడిపోతారాని ఎదురు చూస్తుంది ఆ మోనిత అంటు గుర్తు చేస్తాడు. అందుకే ఈసారి వెళ్లినప్పడు దీపతో అత్తింట్లో సర్ధుకునిపోవాలని కాస్తా గట్టిగా చెప్పండని అంటుంది భాగ్యం. ఇదిలా ఉండగా కార్తీక్ దీప గురించి ఆలోచిస్తుంటాడు. దీప తప్పు చేసిందో లేదో పక్కన పెడితే మనిషిగా తనను హ్యాపీగా చూసుకోవాలని, దీప రక్షించుకోవాలని అనుకుంటాడు. అందుకు దీపను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. ఇక తెల్లారినా దీప లేవకపోవడంతో పిల్లలు (శౌర్య, హిమ) రెడీ అయ్యి కార్తీక్ కోసం టిఫిన్ తయారు చేయడానికి వంటగదిలోకి వెలతారు. శౌర్య దోశ వేస్తుంటే హిమ పక్కనే ఉండి చూస్తుంటుంది. అంతేగాక ఇంకా చట్నీ కూడా చేయాలి ఏం చేద్దామని అడుగుతుంది శౌర్యను. ఇదిలా ఉండగ పెనం మీద వేసిన దోవ దానికి అతుక్కుపోయి మాడిపోతుంది. శౌర్య దాన్ని తీసేందుకు కాస్త బలం ఉపయోగించడంతో దోశ ఎగిరి నెలపై పడుతుంది. దీంతో పిల్లలు అయ్యో అని అరవగానే కార్తీక్ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వంటగదిలో శౌర్య, హిమలను చూసి ఏమైంది అలా అరిచారని అడగడంతో అమ్మ ఇంకా లేవలేదని, మీకు పొద్దున్నే టిఫిన్ చేసే అలవాటు కదా మీ కోసం దోశ చేసిపెడదామని వచ్చామని చెప్పగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నా పిల్లలు నాకోసం టిఫిన్ చేస్తారా, ఏం అక్కర్లేదు మీ చిట్టి చేతులకు గాయాలైతే ఈ నాన్న తట్టుకుంటాడా అంటాడు. మీరు వెళ్లండి ఈ రోజు నేను టిఫిన్ చేస్తా అనగానే.. పిల్లలు సరే నాన్న నువ్వు దోశలు వేయి మేం చట్నీకి అవసరమైనవి రెడీ చేస్తామంటారు. ఇక కార్తీక్ దోశలు వేసి దీప కోసం కాఫీ తీసుకుని వెళతాడు. దీపను లేపి కాఫీ చేతికిస్తాడు. లేచారా డాక్టర్ బాబు రాత్రి దోశల పిండి రుబ్బి పెట్టాను టీఫిన్ వేస్తా అనేలోపు.. కార్తీక్ నేనే దోశలు వేశాను. అందరి కోసం వేశాను, దోశలు వేసి హాట్ బాక్స్లో పెట్టాను, నువ్వు స్నానం చేసి టిఫిన్ చేశాక టాబ్లెట్స్ ఇస్తా అంటాడు. ఇక అక్కడ నుంచి బయటకు వస్తుంటే దీప డాక్టర్ బాబు అని పిలిచి కూర్చోమంటుంది. నాకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉందని, ఒకే గ్లాస్లో మీతో కాఫీ పంచుకోవాలని పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. పెళ్లైన కొత్తలో మీకు చెబుదామంటే భయం, ఇక దూరమయ్యాక అడిగే అవకాశం రాలేదు. ఇప్పుడు ఎలాగు వెళ్లిపోతున్నాను కదా అందుకే అడుగుతున్న అని కార్తీక్తో అంటుంది దీప. వెంటనే దీప చేతిలోని కాఫీ గ్లాస్ తీసుకుని కొంచం తాగి దీపకు ఇస్తాడు కార్తీక్. అది తాగి దీప మురిసిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: ఈ దేవుడే కాదు.. ఆ దేవుడు కూడా దగా చేశాడు: దీప
కార్తీకదీపం మే 17: నువ్వు ఇలానే బాధపడుతుంటే పిల్లలకి తెలిసిపోతుంది. అప్పుడు పిల్లలు తట్టుకుంటారా అని కార్తీక్ దీపతో అంటాడు. గుర్తుంచుకో నీకు వైద్యం చేయించడానికి నేను ఉన్నాను భయపడకంటూ కార్తీక్ దీపకు ధైర్యం చెబుతుంటే.. కనీసం ఇప్పుడైన నన్ను ముట్టుకోవాలనిపించడం లేదా డాక్టర్ బాబు అని అంటుంది. ఇక కార్తీక్ అదేంలేదు ఏదో ఆలోచిస్తున్నానంటూ దీప భుజం తట్టగా.. కార్తీక్ చేతిని దీప తన చేతిలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత.. ‘ఉన్నంతకాలం చేయి వదిలేశారు. ఈ రోజు దాకా దూరంగానే ఉన్నారు. కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా ఉన్నారు. కాపురంలో కలిసి నడవకపోయినా.. నా అంతిమ యాత్రలో కలిసి నడిచి తుది వీడ్కోలు చెప్పడానికైనా పక్కనే ఉన్నారు థాంక్స్ డాక్టర్ బాబు’ అంటు దీప భావోద్యేగానికి లోనవుతుంది. ఆ తర్వాత లేచి బెడ్రూంకి వెళ్లిపోతుంది. మరోవైపు దీపకు ఏదో జరిగినట్లు మురళీ కృష్ణకు పీడకల రావడంతో ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తాడు. అలాగే షాక్లో ఉండిపోయిన మురళీ కృష్ణకు భాగ్యం నీళ్లు తాగించి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఏమైందయ్యా అని ఆమె అడగ్గా.. ఇలా దీప గురించి కల వచ్చిందిని చెప్తాడు. ‘నా వల్ల కాదు. నా కూతురి కోసం బాధపడుతూ ఇక్కడే ఉండలేను’ అంటాడు. వెంటనే దీపను వెతకడానికి బయలుదేరుతానంటూ మురళీ కృష్ణ కదులుతుండగా.. భాగ్యం.. ‘ఆగండి కోడలును వెతకడానికి కోట్లు ఖర్చపెట్టైనా వాళ్ల అత్తగారు వెతుకుతారు. కానీ, నీకేమైనా అయితే నేను ఒంటరి దాన్నిఅవుతాను‘అంటూ మురళీ కృష్ణను ఆపుతుంది. ఆ తర్వాత దీప ఫోన్ చేస్తానంటూ భాగ్యం ఫొన్ తీసుకుని దీప నంబర్కు కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో కార్తీక్, దీపలకు మెలకువ వస్తుంది. అర్థరాత్రి తండ్రి నుంచి కాల్ రావడంతో నాన్నకు ఏమయినా అయిందేమో మా పిన్ని చేస్తున్నట్టుంది ఫోన్ ఎత్తండి డాక్టర్ బాబు అంటుంది దీప. కార్తీక్ ఫొన్ లిఫ్ట్ చేసి హాలో అనడంతో.. భాగ్యం ఎవరో మగ గొంతు వినిపిస్తుందయ్యా అంటుంది. ఆ తర్వాత మురళీ కృష్ణ ఫోన్ తీసుకుని మాట్లాడగా.. హాలో నేను కార్తీక్ అని చెప్పడంతో అతడికి ఒక్కసారిగా ప్రాణం లేచస్తుంది. ఇక దీప దగ్గరే ఉన్నారా అనగా అవునంటాడు. దీప ఎక్కడుందో చెప్పి.. మీ నాన్నతో మాట్లాడమని దీపకు ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీప ఫోన్ తీసుకుని ‘ధగా పడ్డావని ఎవరికీ చెప్పకుండా వెల్లిపోయావమ్మా అని మురళీ కృష్ణ అనడంతో. ‘అవును నాన్నా ఈ దేవుడే కాదు.. నన్ను ఆ దేవుడు కూడా దగా చేశాడని’ మనసులో అనుకుంటుంది. అంత కష్టపడటం దేనికమ్మా.. మనంటికి రామ్మా.. నీకోసం నీ పుట్టింటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటాడు మురళీ కృష్ణ. అందరికీ భారంగా ఉండకూడదనే ఇక్కడికి వచ్చాను నాన్న అంటుంది దీప. వెంటనే మురళీ కృష్ణ.. ‘సరే ఈ రాత్రికి ఆ మాటలెందుకులే ప్రశాంతంగా పడుకోమ్మా అనగానే దీప.. ఇక నుంచి నాకు అంతా ప్రశాంతతే నాన్న’ అని మనసులోనే అనుకుంటుంది దీప. చాలా సంతోషం తల్లీ నువ్వు ప్రశాంతంగా ఉండటమే కావాలి అంటు ఫొన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: హిమ దూరంగా వెళ్లిపోతావా అనగానే ఉలిక్కి పడ్డ దీప
కార్తీకదీపం మే 15: దీప పడుకొకుండా ఆలోచిస్తుంటే.. అమ్మా! నాన్న మమ్మల్ని పంపించమంటే పంపిస్తావా అని హిమ అడుగుతుంది. దీంతో దీప, లేదు అన్నట్లు తల ఊపుతుంది. మరెందుకమ్మ మమ్మల్ని అక్కడే వదిలేసి వచ్చావు, విజయనగరం వెళ్లినట్టు ఈసారి అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతావా అని హిమ అనగానే దీప ఉలిక్కిపడుతుంది. దూరంగా.. ఎక్కడికో వెళ్లిపోతానంటుంది.. మీ అందరిని వదిలేసి దూరంగా ఎప్పటికీ తిరిగి రాని చోటుకు అంటూ దీప మనసులోనే ఆవేదన చెందుతుంది. ఇక కార్తీక్తో మాట్లాడి సౌర్య బెడ్రూంకి వస్తుంది. ఏంటి ఇంకా పడుకోలేదా అని అడుగుతుండగా.. హిమ నిద్ర పట్టకుంటే సౌర్యకు కథ చెప్పేదానివట కదామ్మా, ఈ రోజు ఎందుకో నిద్ర రావడం లేదు కథ చెప్పమని అడుగుతుంది. దీంతో సౌర్య, హిమలు కలిసి దీపను కథ చెప్పమని మారాం చేస్తారు. దీప ఆవు-దూడ కథ పేరుతో తనను ఉద్దేశిస్తూ చెబుతుంది. ఓ ఆవు అడవి గుండా వెళుతుంటే దానికి పెద్దపులి ఎదురవుతుంది. దీంతో ఆవు భయపడుతుందని, అది చచ్చిపోతానని కాదు, తల్లి లేకపోతే దూడ తల్లిలేనిది అవుతుదని చెబుతుంది. దీంతో ఆవు పెద్దపులితో ‘నేను నీకు ఆహారం కావడం కోసమే పుట్టానని నాకు ఇప్పుడే అర్థమైంది. అలాగే అవుతాను కానీ నా ఆఖరి కోరిక ఉంది తీరుస్తావా అని అడగడంతో పులి సరేనంటుందని చెబుతుంటే హాల్ నుంచి కార్తీక్ కథ వింటు ధీనంగా చూస్తుంటాడు. ఇక దీప ‘ఆవు పులితో.. నాకో బిడ్డ ఉంది. తోటి దూడలతో ఆడుకుంటూ ఈ అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుంటుంది. పసిబిడ్డ ఆకలితో ఉంటుంది. నేను వెళ్లి దాని కడుపునిండా పాలిచ్చి. తోటి దూడలతో ఎలా మెలగాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పి వస్తానంటూ పులిని ఆవు వెడుకుంటుంది. అది విని కరిగిపోయిన పులి మళ్లీ రావాలని చెప్పి పంపిస్తుంది. ఆవు దూడ దగ్గరకు వెళ్లింది. ఆఖరిసారి కదా తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. కడుపు నిండా పాలిచ్చింది.. జాగ్రత్తలు చెప్పింది. మందతో వెళ్లినప్పుడు విడిగా వెళ్లొద్దు అని చెప్పింది. అందరితోనూ ప్రేమగా ఉండాలని చెప్పింది. అమ్మ లేదని దిగులు పడొద్దు, నేను ఇంకెప్పటికీ తిరిగి రానంటూ ఆవు, దూడకు చెప్పి వెళ్లిపోతుంది’ అని చెబుతూ దీప కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఆవు తిరిగి రావడంతో పులి దాని నిజాయితికి మెచ్చుకుని వదిలేస్తుందని చెబుతంది దీప. అలాగే ఈ కాలంలో అలా వదిలేస్తుందా’ అని దీప అన్న మాటలు కార్తీక్ గుండెల్లో గుచ్చుకుంటాయి. దీప మనసులో పులిలా పొంచి ఉన్న మృత్యువు.. ఈ అమ్మని జాలి తలిచి వదిలేయకపోతే.. మీరేమైపోతారు అమ్మా అంటు సౌర్య, హిమలను హత్తుకుంటుంది. ఇక మొరళి కృష్ణ కూతురు కనిపించడంలేదనే బాధలో మద్యం తాగుతుంటాడు. దీంతో భాగ్యం వచ్చి ఈ సారి దీప కనిపిస్తే పిల్లలను, దాన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం అంటూ మురళీ కృష్ణకు ధైర్యం చెబుతుంది. మరోవైపు దీప మెట్ల దగ్గర కూర్చోని తాను చిన్నతనంలో సవతి తల్లితో పడిన బాధలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటే కార్తీక్ పక్కనే కూర్చుని ఊరుకో అంటూ ఓదారుస్తాడు. దీంతో దీప ‘ఎందుకో ఈ గమ్యం లేని ప్రయాణం.. ఎందుకో.. ఈ పుట్టుక చావు’ అంటూ వైరాగ్యంతో మాట్లాడుతుంటే కార్తీక్ దీపనే జాలిగా చూస్తుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్లో చుద్దాం. చదవండి: karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప డాక్టర్ బాబుకు హీరో చాన్స్ అలా మిస్సయిందట.. -
karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప
కార్తీకదీపం మే 14: కార్తీక్ తిరిగి ఇంటికి వెళ్లిపోతూ దీపతో టాబ్లెట్స్ వేసుకో, బాగా విశ్రాంతి తీసుకో జాగ్రత్తగా ఉండని చెబుతూ బయలుదేరుతాడు. దీంతో దీప నన్ను భార్యగా చూడనప్పుడు నా జీవితానికి ఎందుకు అడ్డుపడుతున్నారని కార్తీక్ను నిలదీస్తుంది. దీనికి కార్తీక్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే అడ్డుకుని నాకు సమధానం కావాలంటుంది. కార్తీక్ చెప్పకుండా దాటేస్తుంటే ఇలా నన్ను బాధపెట్టెకంటే ఒక్కసారిగా చంపేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది దీప. అంతేగాక కార్తీక్ చేతులను పట్టుకుని చంపేయండి, చంపేయండి అంటూ అరుస్తుంది. దీంతో కార్తీక్ తన చేతులను విడిపించుకుని.. భావోద్యేగంతో అసలు విషయం బయట పెడతాడు. ‘నిన్ను ఎవరూ చంపనవసరం లేదే.. నువ్వే చావబోతున్నావంటూ’ విలపిస్తాడు. దీంతో దీప అయోమయంగా చూస్తూ నేను చావడం ఏంటి, అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన చెందుతుంది. సమయానికి మందులు వేసుకోవాలి, మంట సెగ తగలనివ్వకూడదు, ఆవిరి పీల్చకూడదు అలాగే ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలి, ఇప్పటికే చావు అంచులదాక వెళ్లావు అంటూ దీపను హెచ్చరిస్తాడు కార్తీక్. అలా షాక్లో ఉండిపోయన దీప... అయినా నేను శారీరకంగానే చచ్చిపోతున్నాను, మానసికంగా మీరు చంపేస్తూనే ఉన్నారు కదా అంటుండగా.. కార్తీక్ నీ పేరులోని దీపం వేడి కూడా నిన్ను కాల్చేసి చంపేస్తుందే అని అంటాడు. అలా కార్తీక్ మాట్లాడుతుంటే దీప అత్తింట్లో తనతో డాక్టర్బాబు ప్రవర్తించి తీరు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత దీపతో మన ఇంటికి వెళదాం పదా అని అడుగుతుంగా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ చేతులు జోడించి అడుగుతుంది దీప. దీంతో బయటక వెళ్లిపోతాడు కార్తీక్. ఇదిలా ఉండగా మోనితకు నిద్ర పట్టక సతమతవుతుంది. ‘ఎందుకు నేను ఒంటరిదానిలా ఫీలవుతున్నా.. కార్తీక్ మళ్లీ దీప ఇంటికి వెళ్లాడనా, లేక కార్తీక్, భారతిలు ఎలాగైన దీపను బతికిస్తారనా’ అని తనలో తనే అనుకుంటుంది. ఇక కార్తీక్ నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఎన్నో సార్లు అవమానించాడు, దీప వాళ్లు అవమానించేలా మాట్లాడినా ఏం అనకుండా చూసేవాడు. ఇక నుంచి కార్తీక్ అసలు నాఅంతట నేను ఫోన్ చేయను, ఎలాగైనా కార్తీక్ నా చూట్టు తిరిగేలా చేసుకుని, నా వాణ్ణి చేసుకుంటానంటూ తనని తాను సముదాయించుకుని పడుకుంటుంది. ఇక దీప ఇంట్లోనే హాల్లో కార్తీక్ సోఫాలో పడుకుని ఉండగా జరిగిందంతా గుర్తు రావడంతో నిద్ర నుంచి లేస్తాడు. ఇంతలో వాటర్ కోసం అటు వచ్చిన సౌర్య కార్తీక్ను చూసి నిద్ర పట్టలేదా నాన్న అని అడుగుతుంది. అవును రౌడి అంటూ.. ఇక్కడ నన్ను సడెన్గా చూసి భయం వేయలేదా అడగ్గా.. రౌడీని కదా వేయలేదంటుంది. ఇక మీ అమ్మ పడుకుందా అని అడుగుతాడు కార్తీక్, దానికి సౌర్య లేదు నాన్న కూర్చోని ఆలోచిస్తూనే ఉందని చెబుతుంది. ఇంతలో బెడ్రూంలో హిమ, దీపలు పడుకుని ఉంటారు. హిమ అమ్మ ఎందుకని అన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో ఉండకుండా ఏ సౌకర్యాలు లేని ఈ ఇంటికి వచ్చేసింది. అక్కడ అయితే కొత్త బెడ్షిట్స్, కొత్త బెడ్లు ఇంట్లో పనివాళ్లు ఉంటారు అక్కడ ఉండక.. ఎందుకు పాత బెడ్లు, పాత బెడిషిట్ ఉన్న ఈ ఇంటికి తిరిగి వచ్చిందని ఆలోచిస్తుంది. ఇటూ కార్తీక్ సౌర్యతో సర్లే వెళ్లి పడుకో ఎలాగోలా ఇక్కడే పడుకుంటానని, మీ అమ్మతో నేను ఇక్కడే ఉన్నట్లు చెప్పకు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
డాక్టర్ బాబుకు హీరో చాన్స్ అలా మిస్సయిందట..
డాక్టర్ బాబు.. ప్రస్తుతం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. కార్తీకదీపం సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్న నిరుపమ్ పరిటాల బుల్లితెర శోభన్బాబుగా పేరు తెచ్చుకున్నాడు. మొదట చంద్రముఖీ సీరియల్తో బుల్లితెరపై నటుడిగా అరంగేట్రం చేసిన నిరుపమ్ ఆ తర్వాత స్టార్ నటుడికి ఎదిగాడు. ప్రస్తుతం నిరుపమ్ కార్తీకదీపంతో పాటు పలు సీరియల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య మంజూలతో కలిసి ఓ షోకు అతిథిగా రానున్నాడు నిరుపమ్. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో డాక్టర్ బాబు చెప్పిన ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. షో హోస్ట్ నిరుపమ్తో ‘అష్టాచమ్మా’ మూవీలో హీరో చాన్స్ ఎలా మిస్సయిందని అడగ్గా.. ‘ముందు ఈ మూవీ కోసం డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ అడిషన్స్కు పిలిచారు. ఆ తర్వాత మరుసటి రోజు కాల్ చేస్తే ఆడిషన్ లేదు నన్ను రావొద్దన్నారు. తీరా ఈ మూవీ కోసం కొత్త కుర్రాడిని తీసుకున్నట్లు తెలిసింది. బాహుశా అప్పుడు నేను సీరియల్స్లో నటిస్తుండం వల్ల ఆడిషన్కి పిలవలేదేమో అనుకున్నా’ అంటూ చెప్పకొచ్చాడు డాక్టర్ బాబు. కాగా 2008లో వచ్చిన అష్టాచమ్మా మూవీతో న్యాచులర్ స్టార్ నాని హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన నాని ఈ మూవీతో హీరోగా మారి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. -
karthika Deepam: మోనిత గుట్టు తెలుసుకున్న భారతి
కార్తీకదీపం 10 మే: సౌందర్య సలహా మేరకు కార్తీక్ అసలు నిజం దీపకు చెప్పాలని నిర్ణయించుకుని డాక్టర్ భారతిని తన క్లినిక్కు పిలుస్తాడు. భారతితో దీపకు అసలు నిజం చెప్పే సమయం వచ్చిందనడంతో ఆమె షాక్ అవుతుంది. ఒక పెషేంట్తో స్వయంగా బ్రతకని చెప్పడం ప్రమాదం. డాక్టరుగా ఆ పని నువ్వు నేను ఇద్దరం చేయలేం అంటుంది. పెషేంట్ టెన్షనతో నరాలు చిట్లిపోతాయి, తట్టుకొలేరు దానివల్ల ఇంకా ప్రమాదమని భారతి కార్తీక్తో అంటుంది. కానీ దీప వినడం లేదు ఎంత వద్దని చెప్పినా పట్టుబట్టి వంటగదిలోనే ఉంటుంది. వంటచేస్తానంటోందని కార్తీక్ చెప్పడంతో.. అయితే చెప్పాల్సిందే అంటుంది భారతి. దీంతో కార్తీక్ ఈ విషయం నువ్వే దీపతో చెప్పాలనడంతో భారతి కంగుతింటుంది. దీపతో నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడమే కరెక్ట్ కార్తీక్ అంటుంది భారతి. నువ్వు చెప్తేనే ఇన్నాళ్లు నువ్వు అలా ప్రవర్తించడానికి కారణం దీప అర్థం చేసుకుందుటుందని, దీంతో మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయని భారతి కార్తీక్తో చెబుతుంది. ఇక అక్కడి నుంచి భారతి మోనిత ఇంటికి వెళుతుంది. దానికంటే ముందు మోనిత సీరియస్గా దీప రీపోర్ట్స్ చూసి, ఆ తర్వాత అక్కడే ఓ పక్కన పెడుతుంది. భారతి రాగానే మోనితతో తలనొప్పిగా ఉందని, టీ కావాలంటుంది. ఒకే ఇప్పుడే తెస్తానంటూ టీ తీసుకురావడానికి వెళ్తుంది మోనిత. ఆ తర్వాత భారతి పాపం ఇన్నాళ్లు మోనిత ఒంటరిగా ఉండటమంటే గ్రేట్ అంటు మనసులో అనుకుటుండగా.. ఇంతలో ఎదురుగా ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ఫైల్ భారతి కంట పడతాయి. అవి వెళ్లి చూసేసరికి ఏంటి నా హాస్పిటల్ రిపోర్ట్స్లా ఉన్నాయి ఇక్కడికి ఎలా వచ్చాయని అనుకుంటు రిపోర్ట్స్తెరిచి చూసేసరికి భారతి షాక్ అవుతుంది. ‘దీప రీపోర్ట్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి, మరో కాపి తీసుకుని ఉంటుందా? అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా, ఈ రెడ్ మార్స్ ఏంటి, దీప వెనక మోనితా ఎమైనా కుట్ర చేస్తోందా’ అనుకుంటూ మోనితా రావడం గమనించి మళ్లీ అక్కడే పెట్టెస్తోంది. ఇక మోనిత టీ ఇవ్వగానే ఆలోచనలో పడుతుంది భారతి. ఏమైంది చెప్పు అంటూ భారతి నుంచి కార్తీక్ పిలిచిన విషయం గురించి ఆరా తీస్తుంది మోనిత. దీంతో భారతి.. కార్తీక్ తన భార్య ఆరోగ్యంపై బాగా దిగులు పెంచుకున్నాడు. అంటూ జరిగిన విషయం చెబుతుంది. దీంతో నువ్వు నా ప్రేమకు సపోర్టు చేయకుండా భార్యభర్తులు ఇద్దరూ కలిసే సలహాలు ఇస్తావేంటని భారతిపై మోనిత మండిపడుతుంది. దీంతో ‘భార్య భర్త విషయం ప్రతిసారి నీతో మాట్లాడే కుసంస్కారం నాకు లేదని, ఇక నుంచి నీ ప్రేమకు నేను సాయం కాదు కదా కనీసం మద్దతు కూడా ఇవ్వనంటుంది. అంతేగాక దీప రిపోర్ట్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయని నిలదీస్తుంది. నీది ప్రేమ కాదు, ఉన్మామని, ఆ ఉన్మాదనం వల్ల నీకే ప్రమాదం జాగ్రత్త’ అంటూ మోనితను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది భారతి. దీప తిరిగి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. మళ్లీ డబ్బావాలాగా మారడం కాకుండా పెళ్లిళ్లకు, శుభాకార్యాలకు వంటలు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. -
karthika Deepam: కార్తీక్కు సౌందర్య ట్విస్ట్, షాక్లో డాక్టర్ బాబు
కార్తీకదీపం మే 8: దీప మొండితనం చూసి కార్తీక్ అసహనం కోల్పోతాడు. ‘అందరిని బద్ద శత్రువుల్లానే చూస్తోంది. ఏం కోరుకుంటుందో, ఇంకా ఏం ఆశిస్తుందో నాకు తెలియదు. పిల్లల కోసం ఓపిక పడుతున్నాను. వారి మొహం చూసి భరిస్తున్నానని.. ఇంకా నన్ను రెచ్చగొడితే..’ అంటూ ఆగిపోయి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో దీప సౌందర్యను నిలదీస్తుంది. మీ సుపుత్రుడు మీరు బాగానే ఉన్నారు మధ్యలో నేనే అక్కరకు రాని చుట్టంలా ఉన్నానంటు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక సౌందర్య కార్తీక్ దగ్గరికి వెళ్లీ.. దీపకు నిజం చెప్పే సమయం వచ్చింది పెద్దడో అంటుంది. అదేంటని కార్తీక్ షాక్ అవుతాడు. అవును కార్తీక్ దానికి నిజం చెప్పాల్సిందే.ఇంట్లో వాళ్లందరిని శత్రువల్లా చూస్తోంది. అసలు విషయం చెప్తే తప్పా అర్థం చేసుకునేలా లేదంటుంది. అలాగే ఈ విషయం దీపకు చెప్పే బాధ్యత కూడా నిదేనని, తను చెప్పలేనంటూ.. దీప ఆత్మగౌరవం చూసి అత్తగా కంటే తల్లిగా దాన్ని ఎక్కువగా ప్రేమించాను. అలాంటి నువ్వు ఇక బతకవే అని చెప్పే ధైర్యం నాకు లేదురా అంటు కన్నీటి పర్యంతరం అవుతుంది. అంతేగాక కార్తీక్కు మరో ట్వీస్ట్ ఇస్తుంది. నేను, మీ నాన్న కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకుంటున్నామని చెప్పడంతో కార్తీక్ మరోసారి షాక్ అవుతాడు. ఇలాంటి సమయంలో ఏంటి మమ్మీ ఈ నిర్ణయమని అడగ్గా.. తప్పదు వెళ్లాల్సిందేనంటూ ఇళ్లు, ఇంటి ఇల్లాలు జాగ్రత్త అని బెబుతుంది. దీంతో కార్తీక్ సౌందర్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప నేను ఏం చెప్పిన నమ్మదు.. సో డాక్టర్ భారతితోనే చెప్పిస్తా అని అనుకుంటాడు.ఇదిలా ఉండగా..మోనితా మరో ప్లాన్తో డాక్టర్ భారతీ దగ్గరకు వెళుతుంది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో కార్తీక్ భారతికి ఫోన్ చేస్తాడు. మోనిత అక్కడే ఉండి కూడా తను వచ్చినట్లు కార్తీక్కి చెప్పోద్దని చెబుతుంది. ఇక భారతి ఫొన్ లిఫ్ట్ చేయగానే కార్తీక్ క్లీనిక్ నుంచి బయలుదేరావా? అని అడుగుతాడు. ఇప్పడే బయలుదేరబోతున్నానంటుంది భారతి. అయితే నా క్లీనిక్ దారి మధ్యలోనే కదా నువ్వు వస్తే నీతో ఓ విషయం చెప్పాలంటాడు. దానికి భారతి అరగంటలో వస్తానని చెప్పి ఫోన్ పెట్టెస్తుంది. ఇలా కార్తీక్ దీపకి అసలు విషయం చెప్పి తనన కాపాడుకొవాలని చూస్తుంటే మరోవైపు దీప బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ వంటలక్కగా మారిపోతుంది. మరి తనని కార్తీక్ తిరిగి ఇంటికి తీసుకువస్తాడా, అసలు సౌందర్య, ఆనందరావులు ఎందుకు ఇంటి నుంచి దూరంగా వెళుతున్నారనేది సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: మోనితకు దొరికిన క్లూ, ఏంటది..
కార్తీకదీపం మే 7: దీప విషయంలో ఆదిత్య.. కార్తీక్ను నిలదీయాలనుకుని పిలుస్తాడు. అదిత్య క్లాస్ పీకడానికే పిలిచాడని కనిపెట్టిన కార్తీక్ శౌర్యను వెంట తీసుకని వెళ్తాడు. శౌర్య ఉండగా ఏం మాట్లాడలేననే అన్నయ్య కావాలని శౌర్య తీసుకువచ్చాడని అనుకుని నువ్వు చాలా తెలివైనోడివి అన్నయ్య అంటాడు. దీంతో శ్రావ్యకు ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాలి నువ్వు వచ్చి శౌర్యను తీసుకెళ్లు అని చెబుతాడు. ఇక కార్తీక్ ఆదిత్యతో నువ్వు నాకంటే తెలివైనోడివారా అంటూ శౌర్యను పిలిచి శ్రావ్య పిన్ని పిలుస్తుందట వెళ్లు అని చెబుతాడు కార్తీక్. ఆదిత్య కార్తీక్తో ‘వదినను వేరుగా చూస్తు ఎందుకు అలా అవమానిస్తున్నావు. తను ఈ ఇంటికి పెద్ద కొడలు’ అంటూ కార్తీక్ని నిలదీస్తాడు. ఈ విషయంలో ‘నేను ఇలాగే ఉంట. ఇదేదో నాకు చెప్పడం కంటే మా అన్నయ్య చెప్పిట్లు వినొచ్చు కదా అని మీ వదినకే చెప్పోచ్చు కదా’ అంటూ అసహనంగా అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోతాడు. దీంతో ఆదిత్య అన్నయ్య ఇలా ప్రవర్తించడానికి ఇంకేదో బలమైన కారణం ఉంది ఏంటది అని మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉండగా మోనిత దేశాన్ని జయించినంత ఆనందంలో ఉంటుంది.. పుస్తకాలన్ని ఎదురుగా వేసుకుని ఏదో వెతుకుతూ ‘హా దొరికింది. కార్తీక్ నువ్వు ఇక ఎక్కడికీ పోలేవు.. నా పట్ల అటెన్షన్ ప్లే చేసే టైం వచ్చింది. కార్తీక్ను నేను సాధించా అని తెగ పొంగిపోతుంటుంది’ మరుసటి రోజు ఉదయం కార్తీక్ రేడి అయ్యి కిందకు వస్తాడు. హాల్లో సౌందర్య పేపర్ చదువుతూ ఉంటుంది. మరోవైపు వంటగదిలోనే ఉన్న దీప.. కార్తీక్, సౌందర్యలను గమనిస్తూ ఉంటుంది. ఆమె ఆ సామ్రాజ్యాన్ని (వంటగది) ఏలుతూనే ఉంటుందా? అని కార్తీక్ సౌందర్యతో అనడంతో.. నేను మీ ఇద్దరి మధ్య ఎంత నలిగిపోతున్నానో నీకు తెలుస్తుందా కార్తీక్ అని అంటుంది. కార్తీక్ ఏదో చెప్పబోతుండగా.. దీపని చూసి ఆగిపోతారు. ఇంతలో దీప వచ్చి కాఫీ అందిస్తుంది.. అయిష్టంగా కాఫీ తీసుకుంటారు కార్తీక్. ఆ తర్వాత మీకు ఉల్లిపెసరట్టు చేస్తా.. ఉప్మా చేస్తా.. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి రావాలి.. లేదంటే నేను బాక్స్ తీసుకుని వంటలక్కలో హాస్పటల్కి వచ్చేస్తా.. అని అనడంతో కార్తీక్ కోపంతో ఊగిపోతాడు. ఇంట్లో ఏమైనా ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారా నేను చెప్పింది చేయరు.. వద్దన్నదే చేయాలని డిసైడ్ అయ్యారా అని కార్తీక్ ఫైర్ అవుతాడు. ఇక సౌందర్య కూడా ఎందుకు దీప ఇలా చేస్తున్నావని, వాడు ఒకటి అంటాడు.. నువ్వు ఇంకోటి అర్థం చేసుకుంటావ్.. వాడు వద్దన్న పనిని పంతంతో ఎందుకు చేస్తున్నావు, సర్ధుకుపోతే సరిపోయేదానికి ఇంత మొండిగా చేయడం దేనికి అని దీపతో అంటుంది సౌందర్య. దీంతో దీప.. అనారోగ్యం అనే వంకతో నన్ను అన్ని పనులకు దూరంగా పెట్టి.. ఒక వస్తువుగా చూస్తుంటే సర్దుకుని పోవాలా. ఇంట్లో ఈ ఖరీదైన వస్తువుల్లో ఏ వస్తువుగా ఉండను అత్తయ్య అంటూ అసహనాకి లోనవుతుంది. మీ కొడుక్కి భార్యగా వద్దుకానీ.. ఈ ఇంటికి ఓ దిక్కుమాలిన కోడలు కావాలని తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశారని వాదిస్తుంది. దీంతో సౌందర్య వాడు అనడం కాదే.. నేనే అంటున్నా నువ్వు మనుషుల్ని అంచనా వేయడంలో పూర్తి ఫెయిల్ అవుతున్నావు.. అందర్నీ శత్రువుల్లాగే చూస్తున్నావు. ఇది నీకు కరెక్ట్ కాదు.. కొద్దిరోజులు ఓపిక పట్టు అని వేడుకుంటుంది. నా ఓపిక మొత్తం ఖర్చయిపోయింది అత్తయ్యా.. అందుకే ఈ రోజు మాట్లాడుతున్నా అని దీప అనడంతో మూర్ఖులతో మనం వాదించలేం మమ్మీ వదిలెయ్ అని అంటాడు కార్తీక్. అవును మూర్ఖురాలినే నన్ను మీరు ఆ రోజు దిగజారిపోయిన నెరజాన అన్నా కూడా నా భర్త నా కోసం వచ్చాడని మనసు మార్చుకుని మీతో వచ్చేశాను అందుకు నేను మూర్ఖురాలినే అంటూ దీప కడిగిపారేస్తుంది. అది కాదు దీపా.. ఒక్కసారి అపార్థాల తెరలు తొలగించి చూడు.. నిస్వార్థంగా నీ కోసం ఆలోచించే వాళ్లు కనిపిస్తారు.. మీ అత్తింటిలో ఉన్నవాళ్లంతా నీ ఆత్మీయులే అని నీ మనసు గుర్తిస్తుందే అని సౌందర్య దీపని బతిమిలాడుతుంది. అయినా సరే దీప మాత్రం తన మొండి వాదనను కంటిన్యూ చేస్తుంది.చివరికి కార్తీక్ కలగజేసుకుని.. ఇప్పటికే ఇది చాలా మాట్లాడేసింది మమ్మీ.. భరిస్తే ఇది మనల్ని బద్దశత్రువుల్లాగే చూస్తుంది. ఆమె ఏం కోరుకుంటుందో.. ఏమి ఆశిస్తుందో.. పిల్లల కోసం నేను ఇవన్నీ భరిస్తున్నా.. నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడితే మాత్రం అంటూ దీపకి వేలు చూపిస్తూ హెచ్చరిస్తాడు కార్తీక్. ఇక తర్వాత ఏం జరిగింది, దీప ఎలాంటి నిర్ణయం తీసుకొనుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: మోనితతో చేతులు కలిపిన డాక్టర్ భారతి
కార్తీక దీపం మే 6: డాక్టర్ బాబు తనను గెస్ట్లా చూస్తూ.. గెస్ట్ రూంలో ఉంచుతూ పరాయి వ్యక్తిలా చూస్తూన్నాడంటూ దీప బాధపడుతుంటే సౌందర్య ఒదార్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికి దీప సౌందర్య మాటలు వినిపించుకోకుండా మీరు మీ అబ్బాయి తరపునా మాట్లాడుతున్నారా అని సౌందర్యను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ‘నాకు నేనుగా ఇంట్లోనుంచి వెళ్లెపోవాలనే డాక్ట బాబు ఇలా చేస్తున్నారు. నేను చచ్చినా వెళ్లను, ఇది నా ఇళ్లు చస్తే ఇక్కడే చస్తాను’ అంటూ బాధతో వెళ్లిపోతుంది. ఇక మోనిత డాక్టర్ భారతిని తన ఇంటికి డిన్నర్కు పిలుస్తుంది. విషయమేంటో చెప్పు ఎదో ఇంపార్టెంట్ విషయం అన్నావ్ ఏంటదని భారతి మోనితతో అంటుంది. దీంతో మోనితా ‘నేను కార్తీక్ పడే బాధచూడలేకపోతున్నాను భారతీ.. దీప పరిస్థితి అస్సలు బాగోలేదా’ అని అడుగుతుంది. బాగోలేదు.. నేను అంతా కార్తీక్కి వివరంగా చెప్పాను మోనితా.. అది ఆ భార్యభర్తలకు సంబంధించిన విషయం.. నేను నీతో డిస్కర్స్ చెయ్యడం అంత మంచిది కాదేమో’ భారతి అడనడంతో.. కార్తీక్ ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నాడని, చాలా బాధపడుతున్నాడని కార్తీక్ వచ్చిన విషయం దీప గురించి బాధపడుతున్న విషయం చెబుతుంది. నువ్వే చూశావ్ కదా తను ఎంత మొండిదో.. అందుకే అసలు విషయం దీపకే చెబితే అయిపోతుందని మోనిత భారతితో కూడా చెబుతుంది. అదేంటి.. మనం పేషెంట్కి డైరెక్ట్గా చెప్పేస్తామా’ అంటుంది భారతి కాస్త కఠినంగా. చెప్పేస్తే ప్రాణం మీద తీపితో మందులు వాడుతుందని, వాడకపోతే పీఢపోతుంది తనలో ఉన్న ఆలోచనను బయటపెడుతుంది మోనిత. అది విన్న భారతి అవేం మాటలు.. దీప ఇద్దరు పిల్లల తల్లి.. వాళ్ల కోసమైనా ఆమె బతకాలి అంటుంది. దీంతో మనసులోనే మోనితా హా మరి నేనేం అయిపోవాలి సన్యాసం పుచ్చుకోవాలా అనుకుంటుంది. మోనిత. వెంటనే.. ‘నేను చెప్పేదే నిజం అనిపిస్తోంది.. కార్తీక్ బాగా నలిగిపోతున్నాడు. ఏదో ఇంటర్ పాస్ అయిన దాన్ని చేసుకున్నాడు. ఆవిడకి మంట దగ్గర మగ్గిపోవడం ఓ వ్యసనం.. ఈ దేశోద్దారకుడెమె పాపం నగిలిపోతున్నాడని అంటోంది. ఇక భారతి నవ్వుతూ ‘ప్రకృతి చెబితే నమ్మలేదు.. చూస్తుంటే నిజమే అనిపిస్తోంది’ అంటుంది. వెంటనే మోనిత ‘ఏంటి.. నేను కార్తీక్ని ప్రేమిస్తున్నానని చెప్పిందా అని అడగ్గానే ‘పెళ్లి అయిన మగాడ్ని ప్రేమించడం తప్పు కదా’ అంటుంది భారతి. ‘పెళ్లికి ముందే ప్రేమించాను. ప్రేమించాకే పెళ్లి అయ్యింది. అది నా తప్పు కాదు కదా.. నా సంగతి వదిలెయ్.. దీప సంగతి నాతో క్లియర్గా చెప్పు.. ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు.. దీప పోతే నాకు ఆ ప్లేస్ దొరుకుతుందనే ఆశతో అడగడం లేదు.. కార్తీక్ అంత బాధపడుతున్నాడంటే దీప బతకడానికి అవకాశం ఉందా’ అని అనుమానంగా అడుగుతుంది మోనిత. ‘పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇక అంతా కార్తీక్ చేతుల్లోనే ఉంది’ అంటుంది డాక్టర్ భారతి. ఇక దీప వంట గదిలో పని చేస్తుంటే కార్తీక్ అక్కడికి వచ్చి అంతా చుట్టు చూసి దీప వంట చేయడం చూసి కోపంగా వెళ్లిపోతాడు. అయితే దీప అది గమనించుకోదు. పిల్లలు వచ్చి చెబితే.. ‘బాగానే వాదిస్తున్నాను’ అని తనని తాను పొగుడుకుంటుంది దీప. ఇక డిన్నర్ అయిపోయాక భారతి, మోనిత నవ్వుకుంటున్నట్లు చూపిస్తారు. ఇంకే భారతి ఇంటికి తిరిగి వెళ్లిపోతుండగా.. నువ్వు చెప్పినట్లే చేద్దామని మోనితతో అంటుంది. దీంతో మోనితా థాంక్యూ భారతి ఫ్రెండ్కి ఫ్రెండే కదా సాయపడాలి అంటుంది. ‘నో డౌట్ నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది’ అని భారతి మోనితకు అభయం ఇస్తుంది. దీంతో మోనితా భారతికి థాంక్యూ చెబుతుంది. ‘థాంక్స్ ఎందుకు ఫ్రెండ్కి ఫ్రెండే కదా సాయం చెయ్యాలి, నీ ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది’ అంటుంది భారతి. ‘నీకు అర్థమైతే చాలు’ అంటూ మోనితా సబ్బరపడితుంది. ‘థాంక్యూ ఫర్ నైస్ ట్రీట్.. గుడ్ నైట్’ అని భారతి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత ఏమౌతుందో రేపటి ఎపిసోడ్లో చుద్దాం. -
Karthika Deepam: అసలు ట్విస్ట్ చెప్పేసిన మోనిత!
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఇప్పటికి 1000 ఎపిసోడ్లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్ను దర్శకుడు రోజురోజుకు ఆసక్తికరంగా మలుస్తున్నాడు. దీప అనారోగ్యం, మోనితా ప్రగ్నెంట్ సస్పెన్స్ ప్లాన్తో రసవత్తవరంగా సాగుతోన్న ఈ సీరియల్ నేడు (2021 మే 5)న 1031 ఎపిసోడ్కు చేరుకుంది. కార్తీక్ దీప అనారోగ్యం విషయం సౌందర్యకు చెప్పిన సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్లో దీప వంట చేయద్దొన్నా కార్తీక్ మీద కోపంతో మొండిగా పట్టుబట్టి వంటలు చేస్తుంది. అంతేగాక పొద్దున్నే టిఫీన్ కూడా చేస్తుంది. దీంతో కార్తీక్ ఎలా రియాక్ట అయ్యాడు, సౌందర్య దీపకు ఏం చేబుతుందో ఈ రోజు ఎపీసోడ్లో తెలుసుకుందాం. కార్తీక్ వద్దన్నా దీప ఉదయం దోసెలు వేస్తుంది. వంట చేయనిస్తేనే టాబ్లెట్స్ వేసుకుంటాను అని కండీషన్ పెడుతుంది. దీంతో కార్తీక్ ఏం చెయ్యలేక.. బయట నుంచి టిఫీన్ తెచ్చుకుని దీప ముందే తింటూ ఆమెకు చేసిన ముట్టుకోకుండా బుద్ధి వచ్చేలా చేస్తాడు. అంతే కాకుండా ‘నేను మాత్రం దాని చేతి వంట తినను. నేను తినకుండా ఎన్ని వంటలు చేస్తే ఏం లాభం మమ్మీ’ అని దీపకు అర్థమయ్యేలా చేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మోనిత బుద్ధిగా సోఫాలో కూర్చుని ఏదో రాస్తూ నవ్వుకుంటూ.. ఊహించుకుంటూ మురిసిపోతూ కనిపిస్తుంది. ఇంతలో ప్రియమణి కూరగాయలు పట్టుకుని అక్కడికి వచ్చి కూర్చుని.. ‘ఏంటమ్మా ఏం రాసుకుంటున్నారని అడుగుతుంది. దీంతో మోనితా పుట్టబోయే బిడ్డ పేర్లు అని సమాధానం ఇస్తుంది. అది విన్న ప్రియమణి ఎవరికి పుట్టబోయే బిడ్డ పేర్లు అయోమయంగా అనగానే.. నీకే.. నీకు పుట్టబోయే బిడ్డే పేర్లు అంటుంది మోనిత కోపంగా. ప్రియమణి ఏం అర్థం కానట్లు చూస్తుంది. ‘రేపు నేను కార్తీక్ని పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే.. ఆడపిల్ల అయితే ఏ పేరు పెట్టాలి. మగపిల్లాడైతే ఏ పేరు పెట్టాలని రాసుకుంటున్నాను’ మోనిత మెలికలు తిరుగుతూ అంటుంది. ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని భలే రాసుకుంటున్నారమ్మా’ అంటు వ్యంగ్యంగా అంటుంది ప్రియమణి. వెంటనే మోనితకి కార్తీక్ పిల్లలు పుట్టే రిపోర్ట్ మార్చి. తను చెప్పిన అబద్దాలు గుర్తు చేసుకుని.. ‘నేను ఆడిన అబద్దం నా మెడకే చుట్టుకుంటుందా.. హా ఇంకో అబద్దం చెప్పి నమ్మించేస్తే పోలా’ అని అనుకుంటుంది కూల్గా. ఇదిలా ఉండగా మొరళి కృష్ణ, భాగ్యంలా సీన్ వస్తుంది. భాగ్యంతో మొరళి కృష్ణ ‘దీప ఇంటికి వెళుతున్న, వీలైతే దీపను పిల్లలను తీసుకువస్తానడంతో.. అది అసలు వస్తుందా.. అయినా నీ సరదా నేను ఎందుకు కాదానాలి వెళ్లండి’ అంటుంది. ఇక కార్తీక్ మోనిత ఇంటికి వెళ్లి దీప కావాలనే కిచెన్లో ఉంటోంది. వేడి సెగలో మగ్గిపోతుంది. నాకు టెన్షన్ పెరిగిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. దీంతో ‘మరీ మీ అమ్మగారు ఏం చెయ్యట్లేదా.. అసలే కోడలి కొంగుపట్టుకుని తిరిగే అత్తగారు’ అంటూ వెటకారం చేస్తుంది మోనిత. ‘మధ్యలో మా అమ్మను అనకు. ఆవిడ మా మధ్య నలిగిపోతుంది’ అంటాడు కార్తీక్. ‘నువ్వు అందరినీ బాగానే అర్థం చేసుకుంటావ్ కార్తీక్.. నీ అతి మంచితనమే నిన్ను బాధపెడుతుంది.. ఈ టెన్షన్ అంతా దేనికీ కార్తీక్.. దీపేం చిన్నపిల్లకాదుగా.. దీపకి తన పరిస్థితి గురించి చెప్పెయ్.. పిల్లల కోసమైనా బతకాలని అనుకునే అవకాశం ఉంది కదా.. చెప్పేస్తే నీ టెన్షన్ పోతుంది’ అంటూ మోనితా కార్తీక్కు సలహా ఇస్తుంది. దీంతో ఏ డాక్టర్ నేరుగా పెషెంట్కు మీరు బతకరని చెప్పరు. అలా చెబితే ఒత్తిడి పెరిగిపోయి జీవితం మీద ఆశపోతుంది. భయంతోనే బతుకుతారు. తిండి తినలేరు.. నిద్రపోలేరు. అధికంగా ఆలోచిస్తే తలలో నరాలు చిట్లిపోతాయి’ అంటాడు కార్తీక్. ‘భారతీకంటే ఎక్కువగా నువ్వే దీప కేసు స్టడీ చేస్తున్నట్లున్నావ్.. చేసిన తప్పులన్నీ పక్కనపెట్టి మరీ భార్యని పూలల్లో పెట్టుకుని చూసుకుంటున్నావ్’ అంటూ వెటకారం చేస్తుంది మోనిత. దాంతో కార్తీక్ కోపంగా.. ‘తప్పులు ఆలోచించే టైమ్ కాదు.. గతాన్ని గుర్తుచేయడం కరెక్ట్ కాదు’ అంటూ ఫైర్ అవుతాడు. ఇటూ దీప బాధతో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే.. సౌందర్య అక్కడికి వచ్చి.. ‘పదేళ్లుగా నిన్ను వాడు అపార్థం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు వాడిని అపార్థం చేసుకుంటూ వస్తున్నావా’ అంటుంది. ‘నేను డాక్టర్ బాబుని అపార్థం చేసుకుంటూ వస్తున్నానా’ అంటుంది దీప. మరి లేకపోతే ఏంటే. వాడు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పడం కూడా తప్పేనా.?’అనడంతో ‘రెస్ట్ కాదు.. గెస్ట్ అనండి..’ అనే దీప డైలాగ్తో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. -
karthika Deepam : మోనిత ప్లాన్ సక్సెస్, కన్నీరు పెట్టుకున్న కార్తీక్
‘కార్తీకదీపం’.. ఈ సిరీయల్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. వంటలక్క, డాక్టర్ బాబుల కలయిక అనే ఒక్క థీమ్తో సీరియల్ను రోజురోజుకు ఎంతో రక్తి కట్టిస్తున్నాడు డైరెక్టర్. ఇప్పటి వరకు 1000 ఏపీసోడ్లకు పైగా ఈ సీరియల్ టెలికాస్ట్ అయినప్పకీ డాక్టర్ బాబు, వంటలక్కలు కలిసింది లేదు. ప్రస్తుతం దీప ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో డాక్టర్ బాబు కాస్తా దిగి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే డాక్టర్ పూర్తిగా ఎప్పుడు మారతాడో, లేదంటే ఆలోపే దీప చనిపోతుందేమో అనే ఆందోళన ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ క్రమంలో గత మూడు రోజుల ఎపీసోడ్ల్లా నుంచి మోనితా దీపను చంపేందేకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగానే కార్తీక్యే ఈ టాబ్లెట్ను దీపకు ఇచ్చేల మోనిత చేసింది. ఇక నేటి ఏపిసోడ్లో మరి మోనిత ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజు ఏపీసోడ్లో.. కార్తీక్ మోనిత ఇచ్చిన హైడోస్ డ్రగ్ టాబ్లెట్ను దీపను వేసుకొమ్మని కోరడంతో ఆమె వేసుకుంటుంది. ఆ తర్వాత సీతారాముల కల్యాణం జరిపించడానికి కార్తీక్తో కలిసి దీప పీటల మీద కుర్చుంటుంది. ఈ నేపథ్యంలో కాసేపటికి దీప కళ్లు తిరిగుతూ వింతగా ప్రవర్తించడం చూసి మోనితా తన పని ఇంత ఈజీ అయిపోతుందని తెగ సబ్బరపడిపోతుంది. ఇంతలో దీప కళ్లకు మైకం రావడంతో కార్తీక్పై పడిపోతుంది. ఆ తర్వాత డాక్టర్బాబు కంగారు పడుతూ దీపను తట్టి లేపుతుంటాడు. ఇంతలో దీపను ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందే కార్తీక్ అని డాక్టర్ భారతి చెబుతుంది. దీంతో కార్తీక్ దీపను ఆస్పత్రికి తీసుకుని బయలుదేరుతాడు. అయితే సౌందర్య కూడా వస్తానడంతో కార్తీక్ తల్లిని వద్దని చెప్పి తాను మాత్రమే వెళతాడు. ఇక వారు అటు బయలుదేరగానే.. సౌందర్య మనసులోనే మధనపడుతూ.. ‘వుడా నా కోడలుకు ఏమైంది. తన వెనకా ఎదో కుట్ర జరుగుతుంది. అదెంటో కార్తీక్ రాగానే నిలదీస్తా’ అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అనంతరం సౌందర్య, ఆనందరావు, ఆదిత్యలు కుర్చోని అప్పటి వరకు బాగానే ఉన్న దీప కళ్లు తిరిగి పడిపోవడం ఏంటి అని ఆలోచిస్తారు. ఇంతలో ‘వదినకు మోనిత ఇచ్చిన టాబ్లెట్ వల్లే ఇలా జరిగిందనిపిస్తోంది’ అని అంటాడు ఆదిత్య. ఆ వెంటనే సౌందర్యకు.. మోనిత టాబ్లెట్ విషయంలో ఆమె చేసి హడావిడి ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది. ఇదిలా ఉండగా సాయంత్రానికి ఆస్పత్రి నుంచి దీపను ఇంటికి తీసుకుస్తాడు కార్తీక్. మరోవైపు.. దీప బతికిపోవడంతో మోనితలో అలజడి మొదలవుతుంది. ‘ఇక దీప చనిపోతుందని అనుకుంటే కార్తీక్ చావనిచ్చేట్టుగా లేడు, కార్తీక్ తలుచుకుంటే దీప బతకడం ఖాయం. అతనిలో దీప మీద జాలి కాదు.. ప్రేమ కనిపిస్తుంది.. ఎంతైనా కట్టుకున్న భర్త కదా.. దీపను బతికించడం తన బాధ్యత అనుకుంటాడు.. అదే నిజమైతే.. దీప బతికితే.. నా పరిస్థితి ఏంటి’ అంటూ పెద్దగా అరుస్తూ రచ్చ చేస్తుంది మోనిత. ఇక రేపటి ఎపిసోడ్లో సౌందర్య.. దీపి ఆరోగ్యానికి సంబంధించిన రహస్యంపై కార్తీక్ను ప్రశ్నిస్తుంది. ‘చెప్పారా ఏ సమస్య నిన్ను చిత్ర విచిత్రంగా ఉండేట్టు చేస్తుంది.. ఎందుకు నిజాన్ని దాస్తున్నావు. నా కోడలికి ఏమైంది’ అని కాలర్ పట్టుకుని నిలదీస్తుతంది తల్లి. దీంతో కార్తీక్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతూ.. ‘ఎందుకంటే నీ కోడలు బతకదని డాక్టర్లు చెప్పారు కాబట్టి’ అసలు రహస్యాన్ని సౌందర్యతో చెబుతూ కన్నీరు పెట్టుకుంటాడు. అటూ దీప కూడా ‘నాకు ఏమౌతుందని.. ఎప్పటినుంచో ఉన్న అనారోగ్యాన్ని వీళ్లు ఎందుకు బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అసలు నాకెమైందని, నేను ఎంత మొండిదాన్నో చూపిస్తా’ అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. మరి దీప బతకదనే విషయం తెలుసుకున్న సౌందర్య ఏం చేస్తుంది.. దీపకి చెప్తుందా? అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
మోడ్రన్ వంటలక్కను చూశారా?
-
వినోదానికి కేరాఫ్గా మారిన స్టార్ మా
సాక్షి, హైదరాబాద్: మారుతున్న సాంకేతికత, కంటెంట్ లభ్యతతో టెలివిజన్ వినోదం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవ వేళ సాధారణతకు భిన్నంగా అసాధారణ ప్రయాణాన్ని ఆరంభించి ట్రెండ్ సెట్టర్గా నిలిచిన స్టార్ మా ప్రయాణాన్ని చుట్టేసొద్దాం.. తెలివైన, శక్తివంతమైన వినోదంతో విజయ ప్రయాణాన్ని ఆరంభించిన స్టార్ మా గత నాలుగు సంవత్సరాలలో వినోదానికి కేరాఫ్గా మారింది. ఒక వారాన్ని మించి మరో వారం అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తెలుగు వినోద ఛానెల్గా విశిష్ట గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు వినోదాన్ని పునర్నిర్వచించిన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోల సమ్మేళనమిది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కావాల్సిన సంపూర్ణ వినోదాన్నిఅందిస్తున్నందుకు స్టార్ మా గర్విస్తోంది. (చదవండి: ఐపీఎల్ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప) 2017 అక్టోబర్లో నెంబర్ 1 షో కార్తీక దీపంను స్టార్ మా లో ప్రారంభించారు. ఈ కథ కోట్లాది మంది ప్రేక్షకులను రంజింపజేస్తూనే, భారతదేశపు అభిమాన సీరియల్గా నిలిచింది. తమ నాల్గవ సీజన్లో ఉన్న బిగ్బాస్, ప్రతి సంవత్సరం టెలివిజన్ వీక్షకుల నడుమ ఆసక్తిని రేకిత్తిస్తోంది. కార్తీక దీపంలో దీప అయినా, గృహలక్ష్మిలో తులసి; మౌనరాగంలో అమ్ములు లేదా కేరాఫ్ అనసూయలో అనసూయ అయినా స్టార్ మా లోని ప్రతి క్యారెక్టర్, మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రతిబింబిస్తూనేఉంటుంది. స్టార్ మా యొక్క ట్యాగ్లైన్ ‘మీ తో మేము, మా తో మీరు’ను స్ఫురిస్తూనే ఉంటుంది.ఇక స్టార్ మా.. స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ ఛానళ్లను కూడా నడుపుతున్న విషయం తెలిసిందే. -
‘అనసూయ’గా వంటలక్క అత్తమ్మ!
‘కేరాఫ్ అనసూయ’తో మరో పవర్ఫుల్ పాత్ర ద్వారా ‘స్టార్ మా’ ప్రేక్షకుల ముంగిటకొస్తున్నారు అర్చన అనంత్. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క దీపకు అత్తమ్మ సౌందర్యగా తెలుగు లోగిళ్లలో సుపరిచితమైన వ్యక్తి అర్చన అనంత్. ఐపీఎల్ను మించిన క్రేజ్ కార్తీకదీపం సీరియల్కు తెలుగునాట ఉన్నా సీరియల్లో అత్తమ్మగా తప్ప వ్యక్తిగతంగా అర్చన గురించి తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే! ఫ్యాషన్ డిజైనర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిన అర్చన ఇప్పుడు నటిగా మాత్రం విశ్వరూపం చూపుతున్నారు. కార్తీకదీపంలో తనదైన నటనతో ప్రతి హృదయాన్నీ తట్టిలేపిన ఆమె ఇప్పుడు కేరాఫ్ అనసూయ అంటూ ‘స్టార్ మా ’ ఛానెల్లో అక్టోబర్ 12వ తేదీ నుంచి మధ్యాహ్నం 2గంటలకు తెలుగు లోగిళ్లను పలుకరించబోతున్నారు. నటనా రంగం వైపు మళ్లడం దగ్గర నుంచి అనసూయగా తాను చేయబోయే పాత్ర వరకూ అనేక అంశాలను ‘సాక్షి’ తో ముచ్చటించారు. అలా మొదలైంది.. డాక్టర్ కాబోయి యాక్టర్ అని చాలామంది అంటుంటారు కానీ, దానికి భిన్నం అర్చన కెరీర్ ప్రయాణం. అసలు తానెన్నడూ నటి కావాలని అనుకోలేదనే అంటుంటారామె. నటిగా మారడానికి గల కారణాలను ఆమె చెబుతూ ‘‘ఫ్యాషన్ డిజైనర్గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరడం జరిగింది. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్లో పాల్గొన్నాను. ఆ తరువాత నటించే అవకాశం వచ్చింది. చెబితే మీరు నవ్వుతారు కానీ, నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. నో డైలాగ్స్... నో ఎక్స్ప్రెషన్స్. అదీ ఓ షార్ట్ఫిలిం కోసం! ఆ చిత్ర కెమెరామెన్ మా నాన్నకు స్నేహితులు కావడంతో నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఆయన అయితే ఏం లేదు.. మీరు శవంలా పడుకుంటే చాలన్నారు. అలాగే పడుకున్నాను.. అదిగో అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు. సినీ కుటుంబమే కానీ.. అర్చన కుటుంబ నేపథ్యం సినిమానే. నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటులు అనంత వేలు. తమ ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కానీ తనకు దానిమీద ఆసక్తి మాత్రం పెద్దగా ఉండేది కాదు. నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన పరపతి ఉపయోగించి తనన్ను ఎక్కడా రికమెండ్ చేయలేదాయన అని వెల్లడించిన అర్చన... అన్నట్లు తమ నాన్నే తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. కల నెరవేర్చుకోవడానికి పదేళ్లు పట్టింది.. నటిగా మారిన తరువాత తెలుగు వినోద పరిశ్రమలోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు అర్చన. నిజానికి తన తొలి ప్రాజెక్ట్ కన్నడ అని చెప్పిన ఆమె కన్నడ, తమిళ, మలయాళ భాషలలో బిజీగా మారిన తరువాతనే తెలుగుకు రావడం జరిగిందన్నారు. తాను ఓ తెలుగు ప్రాజెక్ట్ కోసం వచ్చి తమిళ ప్రాజెక్ట్కు ఎంపికయ్యానని, అలాగే మలయాళంలో కూడా చేశానన్న ఆమె నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన అదృష్టమన్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్కు అభిమానులున్నారిప్పుడు. తనను సౌందర్యగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ క్యారెక్టర్లో ఇమిడిపోవడానికి తన నిజ జీవిత సంఘటనలు కూడా కారణమంటూ తన అమ్మ తమతో ప్రవర్తించే రీతిలోనే.. దీపతో సౌందర్య ఆ సీరియల్లో ప్రవర్తిస్తుందన్నారు. ఇకపై అనసూయ అనే అంటారు..? ‘కేరాఫ్ అనసూయ’ తెలుగులో తాను చేస్తోన్న తాజా సీరియల్ అని చెప్పారు అర్చన. సౌందర్య క్యారెక్టర్లాగానే అనసూయ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనసూయ క్యారెక్టరైజేషన్ గురించి ఆమె వెల్లడిస్తూ మనందరికీ డబ్బు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికా ఉంటుంది. దానికోసం ఒకొక్కరూ ఒక్కోలా శ్రమిస్తారు. పేదింటి పిల్ల అయిన అనసూయ కూడా అంతే ! డబ్బున్న వ్యక్తిని పెళ్లాడితే తాను కోరుకున్న జీవితం వస్తుందని అలాగే చేస్తుంది. అంతేకాదు, తాను అనుభవిస్తున్నట్లుగానే విలాసవంతమైన జీవితం తన కుమార్తెలు కూడా అనుభవించాలనుకుని ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో జరిగే సంఘటనలే ‘కేరాఫ్ అనసూయ’. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే క్యారెక్టర్ ఇది. ‘స్టార్మా’ లోనే తాజా సీరియల్ వస్తుండటం, అదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రతి గృహిణినీ కదలించబోతుండటం పట్ల ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇకపై మీ మీ అత్తమ్మ... అనసూయగా మారుతుండటాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారనే నమ్ముతున్నాను. కార్తీకదీపం లాగానే స్ట్రాంగ్ క్యారెక్టర్తో సినీ రంగానికి... కన్నడంలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశాను. కానీ తెలుగులో ఓ బలీయమైన క్యారెక్టర్తో రావాలని కోరుకుంటున్నాను. అదీ ఓ పవర్ఫుల్ పోలీసాఫీర్గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్లో కూడా నటించాలనుకుంటున్నాను. టీవీ, సినిమా రెండూ వైవిధ్యమైన మాధ్యమాలు. రెండూ గొప్పవే అని అన్నారు. సహజసిద్ధంగా నటన ఉండాలనేది తన భావన అన్న అర్చన, కళ్లతోనే నటించడమే తన దృష్టిలో అసలైన నటనగా వెల్లడించారు. చక్కటి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా చేయడానికి అభ్యంతరం లేదన్నారామె.