kondapur
-
కొండాపూర్ లో సందడి చేసిన వైష్ణవి చైతన్య ,దిల్ రాజు సతీమణి వైగారెడ్డి (ఫొటోలు)
-
కడుపులోనే శిశువు.. కాసేపటికే తల్లి
కోనరావుపేట(వేములవాడ): ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. శిశువు కడుపులోనే చనిపోగా.. పరిస్థితి విషమించి, కాసేపటికే తల్లి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెంది సిద్దరవేణి బాబుకు కొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. గర్భిణి అయిన లాస్యను కుటుంబసభ్యులు ప్రసవం నిమిత్తం గురువారం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురై, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని చెప్పడంతో వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు లాస్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకోగా వైద్యులు ఆపరేషన్ చేసి, మృత శిశువును బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కాసేపటికే తల్లి లాస్య కూడా మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పల్లిమక్త, కొండాపూర్లలో విషాదం నెలకొంది. -
మహేంద్ర షోరూమ్లో అగ్ని ప్రమాదం
-
Hyd: కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. మంగళవారం సాయంత్రం వేళ కొండాపూర్లో(Kondapur)ని గాలక్సీ అపార్ట్మెంట్ తొమ్మిదొవ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి తీవ్రరూపం దాల్చాయి.అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలినప్పుడు ఇంట్లో ఒకరు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ప్రధానంగా ముందు సదరు మహిళను కిందకు దింపే ప్రయత్నాలు ప్రారంభించారు. -
కొండాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. ఢీ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి అరెస్ట్
-
కొండాపూర్లో రెస్టారెంట్ను ప్రారంభించిన సినీ నటి ‘హనీ రోజ్’ (ఫొటోలు)
-
హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. లేడీస్ స్పెషల్ ట్రిప్లో భాగంగా.. లేడీస్ స్పెషల్ బస్సులను మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ క్రమంలో.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. లేడీస్ స్పెషల్ బస్సును ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్రోడ్స్ మీదుగా కొండాపూర్కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇదిలా ఉంటే.. నగరంలో మహిళల ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు. గతంలోనూ ఆర్డినరీ బస్సులు సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో తిరుగుతుండేవి. కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. నగరవాసులు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అదే సమయంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయానికి బాగా గండికొట్టింది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో నగరవాసులు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రకరకాల స్కీమ్ల్ని తీసుకొస్తున్నారు. మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023 -
తవ్వి తీశారు.. అప్పగించటం మరిచారు
కొండాపూర్లో మ్యూజియాన్ని మూడేళ్లుగా మూసి పెట్టిన కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), అంతకంటే పెద్ద ఘనకార్యాన్నే చేసింది. పన్నెండేళ్ల క్రితం తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులను సంబంధిత ఉన్నతాధికారి ఇప్పటివరకు వాటిని మ్యూజియంకు హ్యాండోవర్ చేయలేదు. ఆ తవ్వకాల్లో ఏయే వస్తువులు లభించాయో నివేదికనూ అందజేయలేదు. తవ్వకాల్లో దొరికిన వస్తువులెన్ని? అవి ఎక్కడున్నాయి? వాటిల్లో అన్నీ ఉన్నాయా? లేదా? వంటి విషయాలేవీ బయటి ప్రపంచానికి చెప్పలేదు. నివేదిక ఇవ్వకున్నా ఏఎస్ఐ పన్నెండేళ్లుగా చేష్టలుడిగి చూస్తుండటం విడ్డూరం. పుష్కర కాలం కిందట ఆ తవ్వకాలకు నేతృత్వం వహించిన అధికారి, ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో తవ్వకాల్లో దొరికిన చారిత్రక సంపద విషయం గందరగోళంగా మారింది. సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డికి చేరువలో ఉన్న కొండాపూర్ అద్భుత శాతవాహన కేంద్రం. క్రీ.పూ.2వ శతాబ్దం–క్రీ.శ.2వ శతాబ్దం మధ్య ఇది వ్యాపార, ఆధ్యాత్మి క పట్టణం. 19వ శతాబ్ద ప్రారంభం, 1940, 1970ల్లో పలుమార్లు ఇక్కడ తవ్వకాలు జరిగాయి. చరిత్రపరిశోధకులు గొప్పవిగా భావించే అనేక ఆధారాలు వెలుగు చూశాయి. రోమన్లు వచ్చి ఇక్కడ స్థిరపడి అంతర్జాతీయస్థాయిలో వాణిజ్యాన్ని నిర్వహించినట్టు తేలింది. అగస్టస్ కాలం నాటి బంగారు నాణేలూ ఇక్కడ దొరి కాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న చైనా పోర్సలీస్ బొమ్మలను తలదన్నే బొమ్మలు అక్కడ 2 వేల ఏళ్ల నాడే మనుగడలో ఉన్నట్టు తేలింది. నాటి బంగారు ఆభరణాలు, మణులు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చల లాంటివెన్నో వెలుగు చూశాయి. ఓ పట్టణానికి సంబంధించిన అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ 86 ఎకరాల స్థలాన్ని ఏఎస్ఐ తన ఆధీనంలోకి తీసుకుని ఓ మ్యూజియంను నిర్మించింది. తవ్వకాల్లో వెలుగు చూసిన వాటిల్లోంచి కొన్నింటిని ప్రదర్శనకు ఉంచింది. మరోసారి తవ్వకాలు.. 2009 నుంచి 2011 వరకు ఏఎస్ఐ మరోసారి తవ్వకాలు జరిపింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తవ్వకాల విభాగం (4) సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మహేశ్వరి ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. అందులోనూ వేల సంఖ్యలో విలువైన వస్తువులు, శాతవాహన కాలం నాటి నాణేలు భారీ గా వెలుగు చూశాయి. అయితే.. ఏయే వస్తువులు దొరికాయి? వాటి ప్రత్యేకతలేంటి? అనే నివేదికను మాత్రం ఏఎస్ఐ బహిర్గతం చేయలేదు. ఎంతోమంది అడిగినా స్పందించలేదు. ఈలోపు అధికారి మహే శ్వరి వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఆమె నివేదిక పోవడం, లభించిన వస్తువులను ఇక్కడి అధికారులకు హ్యాండోవర్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటిని పెట్టిన గది తాళంచెవులు కూడా అప్పగించలేదు. దీంతో తవ్వి తీసినా కూడా అవి అజ్ఞాతంలోనే ఉండిపోయాయి. పరిశోధనలకు ఆస్కారమే లేక.. కర్ణాటకలోకి మస్కిలో తవ్వకాలు జరిపినప్పు డు 33 బంగారు నాణేలు వెలుగు చూశాయి. మస్కి తవ్వకాల్లో లభించిన 33 ఫనమ్ బంగారు నాణేల్లో కేవలం ఒకటి మాత్రమే హోయసల రాజ్యానిదని, మిగతావన్నీ అంతకు చాలా ముందుగా ఉన్న విష్ణుకుండినులు సహా ఇతర పాలకులు అని వాటిని పరిశోధించిన ప్రముఖ నాణేల నిపుణుడు డాక్టర్ రాజారెడ్డి తేల్చారు. అలాంటి కొత్త విషయాలు కొండాపూర్లో 2009లో జరిపిన తవ్వకాల్లో దొరికిన నాణేల్లోనూ ఉంటాయన్న ఉద్దేశంతో వాటి పరిశోధనకు కేంద్రప్రభుత్వం నుంచి 2015లో అనుమతి పొందారు. అయితే.. నాటి అధికారి వాటిని హ్యాండోవర్ చేయకపోవటంతో పరిశోధనకు కేటాయించలేమని అధికారులు చెప్పారు. అలా పరిశోధనలేవీ జరగలేదు. (చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన) -
కొండా‘పూర్’ మ్యూజియం: అదో పట్టణం, బౌద్ధ కేంద్రం కానీ..
కొండా‘పూర్’ మ్యూజియం అదో పట్టణం.. అందమైన ఇళ్లు, భూగర్భ గృహాలతో కళకళలాడింది. అదో వ్యాపార కేంద్రం.. అత్తరు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేది.. అందుకు ప్రత్యేకంగా కయోలిన్ క్లేతో అత్తరు బుడ్లను తయారు చేసేవారు.. ఈ వ్యాపారంలో ప్రముఖ పాత్ర రోమన్ వ్యాపారులదే. అదో బౌద్ధ కేంద్రం.. స్తూపం, చైత్యం, ఆధ్యాతి్మక మందిరాలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి. ఇదంతా ఎక్కడో కాదు, సంగారెడ్డి పట్టణానికి చేరువగా ఉన్న కొండాపూర్ కేంద్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు కాదు, క్రీ.పూ. 2వ శతాబ్దం– క్రీ.శ.2వ శతాబ్దం మధ్య కాలం నాటి సంగతి. సాక్షి,హైదరాబాద్: శాతవాహనులు పాలించిన ప్రాంతంలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో లభించిన నాణేల్లో సగానికంటే ఎక్కువ లభించిందిఈ కొండాపూర్ ప్రాంతంలోనే. రోమన్ చక్రవర్తి అగస్టస్ హయాంలో చెలామణిలో ఉన్న బంగారు నాణేలూ ఇక్కడ లభించాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి.. పులుమావి శాతకరి్ణ, యజ్ఞశ్రీ శాతకర్ణి లాంటి వారు అక్కడికి వచ్చి ఉంటారన్నది చరిత్రపరిశోధకుల మాట. ఇప్పుడు పోర్సోలిన్ అనగానే చైనా తయారీ బొమ్మలు గుర్తుకొస్తాయి. కానీ రెండు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ ఆ మట్టితో బొమ్మలు రూపొందించారు. ►ఇంత ఘనమైన చరిత్ర ఉన్న కొండాపూర్ ప్రాంతంలో 19వ శతాబ్దం నుంచి జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఎన్నో గొప్ప ఆధారాలను ప్రదర్శనకు ఉంచిన ఓ మ్యూజియం ఉంది. అయితే, అది మూడేళ్లుగా మూతపడి ఉంది. రాష్ట్రంలో కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న ఏకైక మ్యూజియం ఇదే కావటం గమనార్హం. ►ప్రచారం లేకపోవడంతో... మ్యూజియం భవనం నిర్వహణ బాగానే ఉన్నా, కట్టడ పటుత్వం దెబ్బతినటంతో రూ.2.5 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కానీ దానికి అనుమతి రాకపోవటంతో, ఉన్నదాన్నే బాగుచేసి, కొత్త గ్యాలరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇంతలో కోవిడ్ మహమ్మారి విస్తరించటంతో 2020లో దాన్ని మూసేశారు. ఆ తర్వాత మరమ్మతులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఫలితంగా మ్యూజియం మూసే ఉంది. దీంతో విలువైన, సున్నితమైన వస్తువులను చూసే వీలు లేకుండాపోయింది. అంత గొప్ప మ్యూజియం ఉందన్న ప్రచారం లేకపోవటంతో ప్రజలకు దాని గురించే తెలియకుండా పోయింది. ►విదేశాల్లో ఉంటే కిటకిటలాడేదేమో.. ముందస్తుగా ఫోన్ చేసి చెప్పి ఇటీవలే ఆ మ్యూజియాన్ని సందర్శించి అబ్బురపడ్డాను. 2 వేల ఏళ్ల క్రితమే మన చరిత్ర ఇంత గొప్పదా అనిపించే స్థాయి ఆధారాలు అక్కడ ఉన్నాయి. కానీ, వాటి ని చూసేందుకు జనమే రారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఇంత గొప్ప ఆధారాలతో విదేశాల్లో మ్యూజియం ఉంటే జనంతో కిటకిటలాడేది. – చిన వీరభద్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ►త్వరలో పునరుద్ధరిస్తాం కొండాపూర్ మ్యూజియం మన అద్భుత చరిత్రకు నిదర్శనం. దాని విషయంలో నిర్లక్ష్యం చేయం. కొత్త భవనం అనుకున్నా, ఉన్నదాన్నే బాగుచేద్దామని నిర్ణయించి పనులు జరుపుతున్నాం. త్వరలో మ్యూజియాన్ని పునరుద్ధరిస్తాం. – మహేశ్వరి, ఏఎస్ఐ రీజినల్ డైరెక్టర్ చదవండి: ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్తో అంతా ఉల్టా పల్టా! -
వీడియో: కొండాపూర్ ఐస్క్రీం పార్లర్లో విజయ్ దేవరకొండ సందడి
-
కొండాపూర్లోని ఐస్క్రీమ్ సెంటర్లో విజయ్ దేవరకొండ సందడి (ఫొటోలు)
-
డ్రగ్స్ స్వాధీనం.. ఒకరి అరెస్టు.
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్లో మాదక ద్రవ్యాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. కొండాపూర్లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్ వద్ద విశాఖపట్నంవాసి అశోక్ను గురువారం అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 30 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అశోక్ కొండాపూర్లో నివాసముంటున్నాడు. హైదరాబాద్లో రెండు డ్రగ్ కేసులు ఎదుర్కొంటున్న విశాఖవాసి మానుకొండ సత్యనారాయణ అలియాస్ సత్తి గోవాకు మకాం మార్చి అక్కడి నుంచి నగరానికి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తన ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఈ కేసు విచారణలో తేలిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఒక గ్రామ్ ఎండీఎంఏను రూ.5వేలు, ఎల్ఎస్డీ బ్లాట్ రూ.2,500 ధరతో విక్రయించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి, సీఐ మోహన్బాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
Hyderabad: ఐటీ కారిడార్కు మళ్లీ కోవిడ్ భయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఐటీ కారిడార్ను మళ్లీ కోవిడ్ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. చైనా, బ్రెజిల్, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీఎఫ్–7 వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్ వైరస్ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ‘బీఎఫ్7’ వేరియెంట్ నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్పట్లో ‘ఆల్ఫా’వేరియెంట్ హల్చల్ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్7’వేరియంట్ రూపంలో ఫోర్త్ వేవ్ మొదలైంది. బూస్టర్డోసుకు మళ్లీ డిమాండ్ తాజా వేరియంట్ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎయిర్పోర్ట్లో అలెర్ట్ దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఇవే.. ► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్హాళ్లు, రైల్వే, బస్స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. ► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్ హ్యాండ్కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. (క్లిక్ చేయండి: పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి) -
హైదరాబాద్ అంటే హైటెక్సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదు!
ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, రాంనగర్ డివిజన్లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, సనత్నగర్లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
Hyderabad: మంత్రి శ్రీనివాస్గౌడ్ మాజీ పీఏ కుమారుడి ఆత్మహత్య
గచ్చిబౌలి/మహబూబ్నగర్ క్రైం: మంత్రి శ్రీనివాస్గౌడ్ వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా పనిచేసిన రెవెన్యూ ఉద్యోగి దేవేందర్ కుమారుడు కేసిరెడ్డి అక్షయ్కుమార్ (23) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో చోటుచేసుకుంది. అక్షయ్ మహబూబ్నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ స్కాంలో నిందితుడని పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ గోనె సురేశ్ కథనం మేరకు వివరాలు ఇలా... మహబూబ్నగర్లోని మోనప్పగుట్టకు చెందిన అక్షయ్ కుమార్.. అమెజాన్ సంస్థలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు వచ్చాడు. కొండాపూర్లోని శిల్పవ్యాలీలో నివాసం ఉండే అక్క మల్లిక వద్ద ఉంటున్నాడు. ఈ నెల 19న అక్క మల్లిక, బావ నవీన్ ఊరికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్షయ్ని పిలిచారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో వారు మరో తాళం చెవితో తలుపు తీశారు. బెడ్ రూమ్లోకి వెళ్లి చూడగా అక్షయ్ చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సీఐ తెలిపారు. తన తండ్రికి చెడ్డ పేరు వస్తుందని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. అక్షయ్ తండ్రి ప్రస్తుతం మంత్రి వద్ద విధులు నిర్వహించడం లేదని పోలీసులు చెప్పారు. స్కాం ఏంటంటే... మహబూబ్నగర్లోని దివిటిపల్లిలో సయ్యద్ కలాం పాషా అనే వ్యక్తికి బి–120 నంబర్ గల డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. అయితే ఆ ఇల్లు సమాధి పక్కనే ఉండటంతో పాషాకు నచ్చలేదు. ఈ విషయాన్ని అక్షయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, తాను పనిచేసి పెడతానని చెప్పి రూ.30వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు కావాలనుకుంటే ఇప్పిస్తానని చెప్పడంతో ఇస్తాషాద్దీన్ అనే వ్యక్తి రూ.70 వేలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినా కూడా పనిచేయలేదంటూ పాషా, ఇస్తాషాద్దీన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మహబూబ్నగర్ రూరల్ పోలీసులు సెప్టెంబర్ 30న అక్షయ్కుమార్ను రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు అక్షయ్ ఆత్మహత్య చేసుకోవడం.. పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. -
ఒక్కసారిగా మారిన వాతావరణం..హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, కూకట్పల్లి, యూసుఫ్గూడ, అమీర్పేట, మల్కాజ్గిరి, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. Heavy Downpour In Hafeezpet ~Kondapur Road⛈️#HyderabadRains pic.twitter.com/cGDmwSrbyL — Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2022 హైదరాబాద్ లో భారీ వర్షం #HyderabadRains pic.twitter.com/K5RT6oTJm3 — Latha (@LathaReddy704) September 6, 2022 -
కొండాపూర్ పబ్లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్పై పిడిగుద్దులు
గచ్చిబౌలి(హైదరాబాద్): పబ్లలో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాల్సిన బౌన్సర్లే సహనం కోల్లోయి విచక్షణ రహితంగా దాడులుకు తెగబడుతున్నారు. వివరాలివీ... కూకట్పల్లి లోధా టవర్స్లో నివాసం ఉండే సంజీవ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు కొండాపూర్లోని కోమా పబ్కు వెళ్లారు. రాత్రి 1.30 సమయంలో టైం ముగిసిందని బయటకు వెళ్లాలని ఓ బౌన్సర్ సూచించారు. 5 నిమిషాల్లో వెళతానని చెప్పిన కొద్ది సేపటికే మరో బౌన్సర్ వచ్చి బయటకు వెళ్లాలని గద్దించాడు. బాధితుడు సంజీవ దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తరువాత పబ్ నుంచి బయటకు వెళ్లగా బౌన్సర్లు వెంబడించారు. బౌన్సర్లు పట్టుకోగా మరో వ్యక్తి ముఖంపై పిడి గుద్దులు కురించాడు. దీంతో సంజీవ ముఖంపై తీవ్ర రక్త స్రావం జరిగింది. శనివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బౌన్సర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. బయటకు వెళుతుండగా పార్కింగ్ వద్ద నలుగురు బౌన్సర్లు నన్ను పట్టుకోగా ఓ వ్యక్తి ముఖంపై దాడి చేశాడన్నారు. -
అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు..
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై గాయత్రి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తన అత్త చేసే ఆరోపణలు అసత్యమని తెలిపారు. గాయత్రి తండ్రి మరణం అనంతరం వాళ్లు గాయత్రి మీద కక్ష కట్టారన్నారు. చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి ఆస్తి పంపకాల్లో గాయత్రిని ఆమె తల్లి, సోదరే వేధించారన్నారు. గాయత్రి స్థలంలో తన తమ్ముడు ప్రదీప్ ఇళ్లు కట్టాలని చూశాడని.. దాన్ని గాయత్రి అడ్డుకుందని తెలిపారు. గాయత్రి కుటుంబంలో పరస్పరం అందరూ కేసులు వేసుకున్నారన్నారు. గాయత్రికి తాను సపోర్ట్గా ఉన్నందుకు తనపై కక్ష కట్టారని శ్రీకాంత్ తెలిపారు. గాయత్రి అరాచకాలపై తనకేమి తెలియదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై తనకు సమాచారం లేదని శ్రీకాంత్ అన్నారు. కాగా, సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. -
కొండాపూర్లో దారుణం.. యువతిని బంధించి, అత్యాచారయత్నం
-
భర్తపై అనుమానం .. యువతిపై కిరాతకం!
గచ్చిబౌలి (హైదరాబాద్): తన భర్తతో సంబంధం ఉందని అనుమానించింది. కోపంతో రగిలిపోతూ విచక్షణ కోల్పోయింది. తోటి యువతి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా పాశవికంగా వ్యవహరించింది. పిన్నీ అని పిలిచే ఆ యువతిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. దాన్ని వీడియో కూడా చిత్రీకరించింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఘోరం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు.. ప్రధాన నిందితురాలు సహా ఆరుగురిపై ‘అత్యాచారం’ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం ఈ అమానుష ఘటన వివరాలిలా ఉన్నాయి. సంబంధం లేదని తేల్చిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి (26) అశోక్నగర్లోని హాస్టల్లో ఉంటూ ఓ ఇన్స్టిట్యూట్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ బీ–బ్లాక్లో నివసించే శ్రీకాంత్ ఈమె సహ అభ్యర్థి. గతేడాది జరిగిన ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో వీరికి పరిచయమైంది. ఇతడు తొమ్మిదేళ్ల క్రితం గాయత్రిని (36) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గాయత్రి, శ్రీకాంత్లను పిన్ని, బాబాయ్ అని పిలిచే బాధిత యువతి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారి ఇంట్లోనే ఉంది. అప్పట్లో గాయత్రి ఆమెతో బాగానే ఉండేది. షాపింగ్లకూ తీసుకెళ్లేది. కానీ తర్వాత అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ యువతి వారి ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. అనుమానం వీడని గాయత్రి ఏప్రిల్ 22న ఆ మేరకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాయత్రితో పాటు శ్రీకాంత్ను, ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్ చేశారు. శ్రీకాంత్, ఆ యువతి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని తేల్చి పంపారు. భార్య అనుమానాల నేపథ్యంలో శ్రీకాంత్ ఆమెనే మరోసారి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అయినా ఆమెలో అనుమానం పోలేదు. సమస్య పరిష్కరించుకుందామని పిలిపించి .. సదరు యువతిని భయభ్రాంతులకు గురి చేయాలని, దారుణంగా హింసించాలని గాయత్రి పథకం వేసింది. దీనికోసం గతంలో తన వద్ద డ్రైవర్లుగా పని చేసి ప్రస్తుతం మసీద్బండలోని పాన్షాపులో పని చేసే మస్తాన్(25), ముజాహిద్లతో (25) పాటు వీరి స్నేహితులైన అయ్యప్ప సొసైటీకి చెందిన విష్ణు (22) మనోజ్ (22), కడపకు చెందిన మౌలాలిలతో కలిసి రంగంలోకి దిగింది. గత గురువారం బాధిత యువతికి ఫోన్ చేసి కొండాపూర్కు వస్తే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు న్యాయవాదులతో మధ్యాహ్నం 3 గంటలకు గాయత్రి ఇంటి వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఇంటికి తీసుకెళ్లి .. గాయత్రి ఇండిపెండెంట్ హౌస్కు సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్దకు వెళ్లిన వీళ్లు ఆ విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బయటకు వచ్చిన గాయత్రి మిగిలిన వారిని హోటల్ వద్దనే ఉంచి యువతిని తనతో తీసుకువెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఐదుగురు యువకులతో కలిసి యువతి నోట్లో గుడ్డలు కుక్కింది. వివస్త్రను చేసింది. సామూహిక లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. ఓ యువకుడు యువతి జననాంగంపై దాడి చేసి దారుణంగా హింసించాడు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘోరాన్ని గాయత్రి తన సెల్ఫోన్లో రికార్డు చేసింది. అంతసేపూ బయటే వేచి చూస్తున్న యువతి తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆమె రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటు దాటి, నాలుగు పెంపుడు శునకాలను తప్పించుకుని లోనికి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. అప్పటికి గాయత్రి సహా ఆరుగురూ ఇంటి వెనుక ఉన్న నిచ్చెన సాయంతో గోడ దూకి పారిపోయారు. అది కూడా అత్యాచారమే.. ఈ దారుణాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అదేరోజు గచ్చిబౌలి పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే మహిళ జననాంగంపై దాడి చేయడం కూడా అత్యాచారమే అని చట్టం చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరుగురిపైనా అత్యాచారం, నిర్భంధం, మహిళ ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. గాయత్రి సహా పరారీలో ఉన్న నిందితులను శనివారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నా కూతురికి ఏ శిక్ష వేసినా ఆనందమే ఓ ఆడపిల్లపై పాశవికంగా దాడి చేసిన నా కూతురుకు ఏ శిక్ష వేసినా ఆనందమే. ఆమె ఏ తప్పు చేసినా శ్రీకాంత్ గుడ్డిగా ప్రోత్సహిస్తుంటాడు. అతని ప్రోద్బలంతోనే గాయత్రి ఆ యువతిపై ఆ విధంగా దాడి చేసి ఉండవచ్చు. శ్రీకాంత్ను కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. – కృష్ణవేణి, గాయత్రి తల్లి చదవండి: వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్ చుట్టి.. -
లంచం అడిగిన డాక్టర్పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు
గచ్చిబౌలి (హైదరాబాద్): కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్కు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన డాక్టర్ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రి ఆస్పత్రికి వచ్చారు. కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్లో గెజిటెడ్ సిగ్నేచర్ కోసం సెక్యూరిటీ గార్డు ద్వారా సంప్రదిస్తే డాక్టర్ డబ్బు లు అడిగాడని ఓ వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును పిలిచిన హరీశ్, తమ సంభాషణను వీడియో తీయాల్సిందిగా అధికారులను ఆదేశించి.. ఏ డాక్టర్, ఎంత అడిగాడంటూ నిలదీశారు. మూర్తి (పీవీఎస్ఎన్ మూర్తి) అనే డాక్టర్ రూ.500 అడిగాడని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో అక్కడికక్కడే ఆ డాక్టర్ను సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధారణ ప్రసవాలు పెంచాలి తనిఖీల్లో భాగంగా అవుట్ పేషెంట్ విభాగంతో పాటు అన్ని వార్డుల్లో హరీశ్ కలియతిరిగారు. అందుతున్న వైద్య సేవలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందులు, స్కానింగ్తో పాటు ఇతర పరీక్షలు బయటకు రాయవద్దని ఆర్ఎంఓ డాక్టర్ విజయకుమారిని ఆదేశించారు. 60 శాతానికి పైగా సాధారణ డెలి వరీలు కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. గైనకాలజీ వార్డులో ప్రతిరోజూ స్కానింగ్లు చేయాలని ఆదేశిస్తూ మరో రెండు అల్ట్రా సౌండ్ మెషీన్లు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి తనిఖీలు నిర్వహించారు. -
Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది
హైదరాబాద్: ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఓ వైద్యుడిపై నేరుగా వెళ్లి మరీ చర్యలు తీసుకున్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నారని కొందరు బాధితులు మంత్రి హరీష్రావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన.. వివరాలు తెలుసుకుని సదరు డాక్టర్పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి అంతా పరిశీలించి.. పేషెంట్లతో మాట్లాడారు. మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce — Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022 -
గచ్చిబౌలి: మద్యం మత్తులో వీరంగం.. పోలీసులపై చిందులు తొక్కిన యువకులు
సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఇంజనీరింగ్ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల పై చిందులు వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటకు చెందిన కే.విజయ్(30), ఘట్కేసర్కు చెందిన సూర్య(28)లు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్ ప్రాంతానికి వచ్చారు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. దిల్సుఖ్నగర్లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్కు చెందిన నిహాల్రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అమెరికాలో వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్లోని నిహాల్ ఇంటికి వస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి వీరి ముందు బైక్పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు. వీరికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా కారు నడుపుతున్న నిహాల్కు 234 ఎంజీ, లోహిత్కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరలో 900కు పైగా ఐసీయూ పడకలు
గచ్చిబౌలి: రాష్ట్రంలో 900కు పైగా ఐసీయూ పడకలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం రూ.154 కోట్లు ఖర్చు చేయనున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్లో 1,300 పడకలను వివిధ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సర్కారు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. పిల్లల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 6 వేల పడకలతో పీడియాట్రిక్ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రహేజా మైండ్ స్పేస్ ఆధ్వర్యంలో కొండాపూర్లోని జిల్లా ఆస్పత్రిలో 120 బెడ్లతో ఏర్పాటు చేసిన కొత్త ఫ్లోర్ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి హరీశ్రావు బుధవారం ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కొండాపూర్ ఆస్పత్రిలో డయాలిసిస్ యూనిట్ కేసీఆర్ కిట్ల పంపిణీని ప్రారంభించాక ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల శాతం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం 52 శాతం డెలివరీలు సర్కారు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్ యూనిట్లు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోనూ త్వరలో డయాలిసిస్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో బెడ్ల ఏర్పాటుకు సహకరించిన మైండ్ స్పేస్ సీఈవోను అభినందించారు. ఆస్పత్రి మెయింటెనెన్స్ను కూడా మైండ్ స్పేస్ తీసుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల డిమాండ్ ఉన్నప్పుడు రహేజా ముందుకొచ్చిందని గుర్తు చేశారు. 100% వ్యాక్సినేషన్కు సహకరించాలి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే అందరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నగరంలో కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలన్నారు. రెండు, మూడు సార్లు ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలని సూచించారు. రాష్ట్రంలో రోజూ సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
Coronavirus: 500 డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాయం
సాక్షి, గచ్చిబౌలి: కరోనా టీకాల్లేక జనం ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఉన్న టీకాలకు సరైన భద్రతలేక దొంగలపాలవుతున్నాయి. హైదరాబాద్లోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 డోసుల కోవాగ్జిన్ వాక్సిన్ బాక్స్ మయమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలోని డెలివరీ వార్డులో గల ఓ గదిలో వ్యాక్సిన్లను భద్రపరిచా రు. ఇటీవల ప్రభుత్వం వ్యాక్సినేషన్కు విరా మం ప్రకటించడంతో మిగిలిన వ్యాక్సిన్లను అదే గదిలో ఉంచారు. బుధవారం ఆ గదిని తెరిచి చూడగా కొవాగ్జిన్ 50 వయల్స్(500 డోసులు) గల బాక్స్ కనిపించలేదు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యా దు చేయగా.. దర్యాప్తు చేపట్టారు. ఆ గది ఇన్చార్జి డాక్టర్ మహేశ్కు కోవిడ్ రావడంతో తాళాలను మణి అనే వ్యక్తికి అప్పజెప్పారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఓ వార్డ్బాయ్ వ్యాక్సిన్ ఉన్న గది వైపు వెళ్లినట్లు రికార్డు అయింది. అతను రెండు రోజులుగా ఆస్పత్రికి రావడం లేదని సమాచారం. గతంలోనూ ఓ వ్యక్తి వ్యాక్సిన్ దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇంటిదొంగలే అదను చూసి వ్యాక్సిన్ మాయం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: Coronavirus: ‘లాంగ్ కోవిడ్..’ లైట్ తీస్కోవద్దు! -
Hyderabad: నగరంలో ఆక్సిజన్ సమస్యకు చెక్
సాక్షి, హైదరాబాద్( గచ్చిబౌలి): కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ దొరక్క చాలా చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కొండాపూర్లోని ఏరియా ఆస్పత్రికి కోటి రూపాయల విలువ చేసే ఆక్సిజన్ ప్లాంట్ మంజూరయ్యింది. ఈ ప్లాంటు మంజూరుకు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య సేవల వివరాలను రంజిత్రెడ్డి ప్రభుత్వ వైద్యాధికారులతో మాట్లాడారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ఆయన ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆక్సిజన్ సిలెండర్ ప్లాంట్ నిర్మాణం కోసం రంజిత్రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సారథ్యంలో నడిచే భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఉన్నతాధికారులతో చర్చించి వారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు బీడీఎల్ సంస్థ అంగీకరించింది. దీంతో ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేకుండా పోతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్రెడ్డి పేర్కొన్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటును త్వరలో ఏర్పాటు చేసేందుకు బీడీఎల్ సంస్థ ముందుకొచ్చిందన్నారు. దీంతో భవిష్యత్లో ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల సహకారంతో అవసరమైన మేరకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల కు మెరుగై న సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. – రంజిత్రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ( చదవండి: కోవిడ్ బాధితుల కోసం ఉచిత ఆక్సిజన్ హబ్లు.. ) -
ఎయిర్ హోస్టెస్, ఏవియేషన్ సిబ్బంది ఫ్యాషన్ షో అదుర్స్
-
గోకుల్చాట్ యజమానికి కరోనా
సుల్తాన్బజార్: హైదరాబాద్లో పేరుపొందిన కోఠి గోకుల్చాట్ యజమాని (72)కి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. అధికారులు గోకుల్చాట్ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించారు. కరోనా పా జిటివ్ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సంఖ్యలోనే ప్రజలు గోకుల్చాట్ రుచులను ఆస్వాదిస్తుం టారు. దీంతో ఎక్కువ మంది వివరా లు సేకరించాల్సి రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోకుల్చాట్లో కట్లెట్, పావుబాజి, కుల్ఫీ వంటి పదార్థాలను ఎక్కువ మంది రుచిచూస్తారు. లాక్డౌన్తో మూతపడిన దుకాణం ప్ర భుత్వం సడలింపులు ఇవ్వడంతో తెరుచుకుంది. టేక్ అవే పేరుతో కట్లెట్, ఇతర స్నాక్స్ అందిస్తోంది. గోకుల్చాట్ యజ మానికి పాజిటివ్ రావడంతో ఇక్కడ స్నా క్స్ తిన్న వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ దుకాణంలో 40 మంది వరకు పనిచేసేవారు. కేంద్రం సడలింపులతో వారిలో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రస్తుతం సగం మందే విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ అధికారులు క్వారంటైన్కు తరలించారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కలకలం గచ్చిబౌలి: కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మరో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 10 మంది వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రికి వచ్చిన నలుగురి శాంపిల్స్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి పంపించగా పాజిటివ్గా తేలిం ది. వీరిలో ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, సెక్షన్ ఆఫీసర్, సె క్యూరిటీ గార్డు, జూనియర్ అసిస్టెంట్, వీసీటీసీ కౌన్సిలర్, అంబులెన్స్ డ్రైవర్, ఫార్మసిస్ట్తో పాటు ఆస్పత్రికి వచ్చిన మరో నలుగురు ఉన్నారు. ఇప్పటికే సూ పరింటిండెంట్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో కేసుల సంఖ్య 15కు చేరింది. వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరాడు న్యూమోనియాతో బాధపడుతున్న మా నాన్నను మూడు రోజుల క్రితం బంజారాహిల్స్లోని సెంచూరీ ఆసుపత్రిలో చేర్పించాం. సోమవారం రాత్రి అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. దీంతో మేమంతా హోం క్వారంౖ టెన్ అయ్యాం. మా దుకాణ సిబ్బందిని కూడా క్వారంటైన్లో ఉండాలని సూచించాం. లాక్డౌన్ తర్వాత నుంచి మా నాన్న బయటకు రావడం లేదు.. గోకుల్చాట్కు కూడా రాలేదు. కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – రాకేష్, గోకుల్చాట్ యజమాని కుమారుడు -
కొండాపూర్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు కరోనా
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని నగర వాసులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారించిన విషయం తెలిసిందే. తాజాగా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా సూపరింటెండెంట్ అధిక జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అదే హాస్పిటల్లో ఐసోలేషన్కు వెళ్లిపోయారు. సూపరింటెండెంట్తో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హాస్పిటల్ సిబ్బంది అందరికి రంగారెడ్డి ఆరోగ్య శాఖ కరోనా టెస్టులు నిర్వహించనుంది. (‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’) -
కొండాపూర్లో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొండాపుర్లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి మౌనిక (25) అనే యువతి నివాసముంటోంది. హరియాణా గురుగ్రామ్కు చెందిన ఆమె ఓయోలో ఉద్యోగం చేస్తోంది. మౌనిక మంగళవారం తన నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్కు కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్మార్టం నిమిత్తం మౌనిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీచైతన్యలో పుడ్ పాయిజన్..40మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : శ్రీచైతన్య కళాశాలలో పుడ్ పాయిజన్ జరిగి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. కొండాపూర్లో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో వంట చేసి అక్కడ నుంచి మాదాపూర్లో ఉన్న హాస్టల్కు తరలిస్తుంటారు. మంగళవారం రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకొని వెళ్తున్నారు. కాగా పుడ్ పాయిజన్ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చుతుంది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపిస్తున్నారు. పుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న హాస్టల్లోని మిగతా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
ఆఫ్రికా అందం
-
హైదరాబాద్లో డాగ్ పార్క్ ప్రారంభం
-
గండికోట ముంపువాసులపై ప్రభుత్వ దౌర్జన్యం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కొండాపురం రామచంద్ర నగర్లో టీడీపీ ప్రభుత్వం మరో సారి దౌర్జన్యానికి పాల్పడింది. గండికోట ముంపువాసులను అకస్మాత్తుగా హెచ్చరికలు జారీ చేసింది. కాలనీ ఖాళీ చేసీ వెళ్లాల్సిందిగా అధికారులు చాటింపు వేయించారు. ఇంకా కొన్ని గృహాలకు పరిహారం అందకుండానే నీటి నిల్వ పెంచుతున్నారు. కాలనీ సమీపంలోకి నీరు రావడంతో ఎటు వెళ్లాలో అర్థంకాక నిర్వాసితుతు బిక్కుబిక్కుమంటున్నారు. పరిహారం ఇచ్చే వరకు నీటిని నిలుపుదల చేసే వీలున్నా అధికారులు పట్టించుకోలేదు. అకాస్మాత్తుగా హెచ్చరికలు జారీచేయడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. -
కొండాపూర్ గర్భిణి హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
బొటానికల్ గార్డెన్ హత్యకేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : కొండాపూర్లో సంచలనం కలిగించిన గర్భిణీ హత్యకేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నాగ్పూర్కు చెందిన విజయ్కుమార్ భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో వివాహం చేసుకోవాలంటూ వత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి చూసిన విజయ్కుమార్ పధకం ప్రకారం ఆమెను హతమార్చాడు. గత నెల 28న ఆమెను హత్య చేసి చిన్న చిన్న ముక్కలుగా నరికి, గోనె సంచిలో కుక్కి, బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. హత్య చేసిన రెండు రోజులకే విజయ్ హైదరాబాద్ విడిచి పారిపోయాడు. మరో వ్యక్తి ఈ హత్యకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్లోని సిద్ధిక్ నగర్లోని విజయ్ ఇంటిని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీల ద్వారా ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు హంతకుల కోసం గాలింపు చేపట్టారు. విజయ్కుమార్ వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయమే ఈ కేసులో పోలీసులు అసలు నిందితులను గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు చివరకు కేసును ఓ కొలిక్కితీసుకొచ్చారు. -
యమహాపై వచ్చి.. శవాన్ని పడేసి
సాక్షి, హైదరాబాద్ : కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పలు కీలక ఆధారాలతో పాటు మృతురాలి వివరాలను సేకరించారు. ఈ హత్య కేసులో కీలక నిందితులను సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని ఏపీ 10 ఏఎల్ 9947 నంబర్ ఉన్న యమహా బైక్పై తీసుకువచ్చి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. బైక్ ఎవరిదని విచారించగా బౌద్దనగర్లోని ఆనంద్ కుటీర్కు చెందిన గర్డే విజయ్కుమార్కు చెందినదిగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గచ్చిబౌలి పోలీసులు మృతురాలు మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. కొండాపూర్తో పాటు నగరంలో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, అస్సాం వాసులను పోలీసులు విచారిస్తున్నారు. పదిరోజుల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్రితం మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసిన సంగతి తెలిసిందే. -
24 గంటల్లో ఐదు హత్యలు
-
వరుస హత్యలతో ఎరుపెక్కిన రాజధాని
-
మహిళను హత్య చేసి మూటలో పడేశారు
-
'పాలపిట్ట పార్క్ దేశానికే ఆదర్శం'
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో సైక్లింగ్ పార్క్ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్ను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ కాంక్రీటు జంగల్గా మారిపోతున్న సందర్భంలో హరిత వనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బొటానికల్ గార్డెన్ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంటే టీఆర్ఎస్ ఆడ్డుకున్నదని గుర్తు చేశారు. చెట్లను పెంచాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారన్నారు. బొటానికల్ గార్డెన్లో మొత్తం 7500 మొక్కలు నాటామన్నారు. హరితహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదన్నారు. సైక్లింగ్ పార్క్లో చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్కు ప్రకృతి, పచ్చదనంపై ప్రేమ ఉండటం వల్లే బొటానికల్ గార్డెన్ను కాపాడుకోగలిగామని మంత్రి ఈసందర్భంగా స్పష్టం చేశారు. సైక్లింగ్ పార్క్లోకి కార్లకు ఎంట్రీ ఇవ్వొదని అధికారులను మంత్రి ఆదేశించారు. -
సిటీ బస్లో ఇద్దరికి చార్జీ రూ.674!
► టికెట్.. ఇదో పెద్ద ఇష్యూ.. ► అడ్డగోలుగా చార్జీల ముద్రణ ► టిక్కెట్ నంబర్ లేకుండానే తెల్లకాగితాల విడుదల ► పలువురు కండక్టర్లపై సస్పెన్షన్ వేటు సాక్షి, సిటీబ్యూరో: ఎల్వీప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి కొండాపూర్కు ఆర్టీసీ చార్జీ ఇద్దరు ప్రయాణికులకు రూ.674 మాత్రమే. అవాక్కయ్యారా.. మీరే కాదు. చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ చార్జీలను చూసి నివ్వెరపోతున్నారు. నిజానికి ఎల్వీప్రసాద్ నుంచి కొండాపూర్కు మెట్రో ఎక్స్ప్రెస్ చార్జీ రూ.14 మాత్రమే. ఇద్దరు ప్రయాణికులకు రూ.28 తీసుకోవాలి. బుధవారం ఈ మార్గంలో ప్రయాణం చేసిన ఇద్దరు దంపతులకు మాత్రం కండక్టర్ ఏకంగా రూ.674 టిక్కెట్ చేతిలో పెట్టగానే ఆశ్యర్యపోయారు. ఆ తరువాత కండక్టర్ పొరపాటును సరిదిద్దినప్పటికీ తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సాధారణంగా ఆటోల్లో మాత్రమే కనిపించే మీటర్ ట్యాంపరింగ్ తరహాలో ఆర్టీసీ బస్సుల్లో ‘టిమ్స్ ట్యాంపరింగ్’ కావడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యంత్రాల్లో అసలు టిక్కెట్ చార్జీలు ప్రింట్ కాకుండానే తెల్లకాగితాలు బయటకు వచ్చేస్తున్నాయి. దాంతో కండక్టర్లే వాటిపై టిక్కెట్ నెంబర్, చార్జీల వివరాలు రాసి ప్రయాణికులకు అందజేస్తున్నారు. మరోవైపు ఇలాంటి టిక్కెట్ల కారణంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే నెపంపై కొందరు కండక్టర్లు సస్పెన్షన్కు గురవుతున్నారు. మొత్తంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో లోపభూయిష్టమైన టిమ్స్ యంత్రాలు ఇటు ప్రయాణికులను,, అటు కండక్టర్లను బెంబేలెత్తిస్తున్నాయి. కాలం చెల్లిన యంత్రాలు... సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా ఆర్టీసీ టిమ్స్ యంత్రాలకు శ్రీకారం చుట్టింది. దశలవారీగా నగరంలోని 29 డిపోల్లో ఈ యంత్రాలను ప్రవేశపెట్టారు. దీంతో అప్పటి వరకు ఉన్న మాన్యువల్ టిక్కెట్ల స్థానంలో కంఫ్యూటరైజ్డ్ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో అనలాగ్, క్వాంటమ్ సంస్థలకు చెందిన సుమారు 3800 టిమ్స్ యంత్రాలను వినియోగిస్తున్నారు. సంస్థ యాజమాన్యం ఒక్కో టిమ్స్ యంత్రానికి రూ.6.5 వేల చొప్పున సుమారు రూ.2.47 కోట్లు వెచ్చించి వీటిని కొనుగోలు చేశారు. యంత్రాల నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు క్వాంటమ్, అనలాగ్ సర్వీసింగ్ సెంటర్లు ఉన్నా సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, కాలం చెల్లిన యంత్రాల స్థానంలో కొత్త వాటిని సమకూర్చకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. మొదట్లో ఈ యంత్రాలు ఇటు ప్రయాణికులు, అటు ఆర్టీసీకి ప్రయోజనకరంగా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణలో జాప్యం చోటుచేసుకంటోంది. ఉద్యోగులపై వేటు... ఒకవైపు టిమ్స్ పని తీరు ఇలా ఉండగా, తెల్ల కాగితాలపై టిక్కెట్ నెంబర్లు, చార్జీలు రాసి ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆర్టీసీ పలువురు కండక్టర్లపైన సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో తాము చేయని తప్పునకు రోడ్డున పడాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాణిగంజ్ –1 డిపోకు చెందిన ఒక కండక్టర్ను ఇలాగే సస్పెండ్ చేశారు. ‘‘ రూ.8 రూపాయల టిక్కెట్ తెల్లకాగితంపై రాసి ఇచ్చాడనే కారణంతో అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతను ప్రతి నెలా రూ.45 వేల వేతనాన్ని కోల్పోవలసి వస్తుంది. దీంతో అతని కుటుంబం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. సిబ్బంది జీతభత్యాలను కొల్లగొట్టేందుకు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారేమో’’ నని పలువురు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టిమ్స్ యంత్రాలను మార్చకుండా తమపైన చర్యలు తీసుకోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు. వందల్లో ఫిర్యాదులు... సాధారణంగా మూడేళ్లకోసారి టిమ్స్ యంత్రాలను మార్చాలని నిబంధనలు ఉన్నాయి. వాటిలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. వివిధ రూట్లలో ఆర్టీసీ విధించే చార్జీలు కచ్చితంగా ప్రింట్ అవుతున్నాయా. లేక ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశంపై తరచూ తనిఖీలు నిర్వహించాలి. ఇందుకు ప్రతి డిపోలో ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని సైతం నియమించారు. అయితే ఇవేమీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పలు డిపోల్లో మూడేళ్లు దాటిన టిమ్స్ యంత్రాలనే వినియోగిస్తున్నట్లు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రాల్లో లోపాల కారణంగా కండక్టర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో డిపోలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇవీ సమస్యలు... టిక్కెట్ ప్రింట్ సరిగ్గా రావడం లేదు. అక్షరాలు కలిసిపోతున్నాయి. ట్యాంపరింగ్ కారణంగా అధిక చార్జీలు నమోదవుతున్నాయి. టిమ్స్ కీ బోర్డులు పని చేయడం లేదు. టిక్కెట్ కోసం వినియోగించే కాగితం నాసిరకంగా ఉండటంతో అక్షరాలు సరిగ్గా ప్రింట్ కావడం లేదు. కొన్ని డిపోల్లో మాత్రమే టిమ్స్ యంత్రాల్లో లోపాలు ఉన్న మాట నిజమే. కొన్ని డిపోల్లో మాత్రమే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని త్వరలోనే సరిదిద్దుతాం. మూడేళ్లు దాటిన యంత్రాలను మార్చి కొత్తవి అందజేస్తాం. టిమ్స్లో లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారనడం అవాస్తవం. ఇటీవల కొందరు కండక్టర్లు ఉద్దేశపూర్వకంగానే తెల్లకాగితాలపైన రాసి ఇచ్చారు. ఆ చార్జీలను తమ జేబుల్లో వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే సస్పెండ్ చేశాం. విచారణలో వాస్తవాలు తెలుస్తాయి. – పురుషోత్తమ్, ఈడీ -
కొండాపూర్లో 'పూరీ' విగ్రహం పెట్టారు
చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): సినీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్ ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే పూరీ జగన్నాథ్ వీరాభిమాని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్ తో ఆవిష్కరింపజేశాడు. అనంతరం విలేకరులతో పూరీ ఆకాశ్ మాట్లాడుతూ..దేశంలోనే ఒక సినీ డైరెక్టర్కు విగ్రహం ఏర్పాటు చేయడం అరుదని, అలాంటిది మా నాన్నగారి విగ్రహం కొండాపూర్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే కొండాపూర్ ప్రజలు ఎంతో అభిమానంతో మా నాన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఈ విషయంలో కొండాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే నా వంతుగా ఊరికి అభివృద్ధిలో సహకరిస్తానని చెప్పారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభాకర్కు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. -
మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు మృతి
-
మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి
మాదాపూర్: నగరంలోని మాదాపూర్ కొత్తగూడలో విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో భాగంగా భారీ సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తూ మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిని భారతవ్వ (35), కిష్టవ్వ (22)గా గుర్తించారు. శిథిలాల నుంచి నలుగురు కూలీలు త్రుటిలో బయటపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మట్టి పెళ్లల కింద మరికొందరు కూలీలు ఉన్నట్టు సమాచారం. భారీ భవన నిర్మాణంలో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపించనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదస్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్లనే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. కాగా, ప్రమాదస్థలిలో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించేందుకు ఒప్పుకోమంటూ వారు స్పష్టం చేశారు. -
కొండాపూర్లో ఆక్రమణల తొలగింపు
కొండాపూర్: కొండాపూర్లోని టీఎస్ఎస్పీ బెటాలియన్ రోడ్డులో పుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు ఆ ప్రదేశంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు ఆక్రమణలకు గురి అవుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
హైదరాబాద్: కొండాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మాదాపూర్లోని మెరీడియల్ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్న నవీన(19) తన స్కూటీపై విధులకు బయలుదేరింది. ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. కిందపడిన ఆమెను వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. తల నుజునుజ్జు కావటంతో నవీన అక్కడికక్కడే చనిపోయింది. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పొత్తూరి విజయ్ కుమార్(29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ్ కుమార్ సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని స్వర్ణ. ఉద్యోగ రీత్యా కొండాపూర్ బెటాలియన్ క్వార్టర్స్ లోని సీ-18లో నివాసం ఉంటున్న ఆయనకు భార్య సుమతి, ఇద్దరు పిల్లలు నిస్సీ, గిఫ్టీ లు ఉన్నారు. మంగళవారం రాత్రి ఒంటరిగా గదిలో పడుకున్న విజయ్ కుమార్ లుంగీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నీట మునిగిన పంటలు
రేగోడ్: మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొండాపురంలో వరి, కంది, తొగరి, పత్తి పంటలు 400 ఎకరాల్లో నీట మునిగింది. చెరువు అలుగు పొంగి ఇళ్ల వద్దకు వర్షపు నీరు చేరింది. రాయిలొంక తండాలో 15 ఎకరాల్లో పంటలు నీళ్లల్లో మునిగాయి. పెద్దతండా, జగిర్యాల, దుద్యాల, మర్పల్లి, లక్యానాయక్ తండా, రేగోడ్, చౌదర్పల్లి, ప్యారారం, సిందోల్, తాటిపల్లి, ఆర్.ఇటిక్యాల, గజ్వాడ, దేవునూర్, ఖాదిరాబాద్, నిర్జప్ల, ఉసిరికపల్లి తదితర గ్రామాలు, తండాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా పంటలు చేతికొచ్చే స్థితిలో లేవన్నారు. లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంటనష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతున్నారు. వర్షం కారణంగా మేడికుంద, ఆయా తండాల్లో శనివారం రాత్రి కరెంటు సరఫరా నిలిచింది. దీంతో ప్రజలు రాత్రి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మూగజీవాలకు అందని వైద్యం
సిబ్బంది కొరత.. ఇబ్బందుల్లో రైతన్నలు కొండాపూర్: మూగజీవాలకు వైద్య సేవలు కరువయ్యాయి. దీంతో పశు యజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు గానూ మారేపల్లి, కొండాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో మాత్రమే పశు వైద్యశాలలున్నాయి. మండలంలో ఆవులు 4,230, ఎడ్లు 2,531 ,గేదేలు 3,804, మేకలు 8,321, గొర్రెలు 4,231 ఉన్నాయి. పశువైద్యశాలలు ఉన్నప్పటికీ, కొండాపూర్, గొల్లపల్లి, మారేపల్లిలోని పశువైద్యశాలల్లో వైద్యులే లేరు. గొల్లపల్లిలోని వైద్యురాలు పుల్కల్ మండలానికి డిప్యూటేషన్పై వెళ్లి సుమారు రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు కేవలం అటెండరే అక్కడ అరకొర వైద్యం అందిస్తున్నారు.కొండాపూర్లోని డాక్టర్ కూడా మొబైల్ వ్యానులో డిప్యుటేషన్పై వెళ్లారు. ప్రస్తుతం కేవలం మూడు వైద్యశాలలకు కలిపి ఒక్క వైద్యుడే అందుబాటులో ఉన్నారు. మారేపల్లిలో లైవ్స్టాక్ ఆఫీసర్ ఉద్యోగ విరమణ పొంది ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఆయన స్థానంలో ఎవరూ రాలేదు. ప్రసుతతం కొండాపూర్లోని లైవ్స్టాక్ ఆఫీసరే మారేపల్లికి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.దీంతో గ్రామాల్లోని పశువులకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని చెప్పవచ్చు. అసలే వర్షాకాలం కావడంతో పశువులు నిత్యం అనారోగ్యాలకు గురై మృత్యువాత పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు ఉద్యోగుల పనితీరు సైతం రైతులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది.ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యసిబ్బంది కేవలం ఉదయం 9 రావడం 12 గంటలకే వెళ్ళిపోవడంతో ఏమాత్రం ప్రజలకు అందుబాటులో వుండడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా సిబ్బందిని నియమించి పశువులకు మెరుగైన వైద్యం అందించాలనీ రైతన్నలు కోరుతున్నారు. -
కొండాపూర్లో చోరీ
ఘట్కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘటేకేసర్ మండలం కొండాపూర్లో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది. మధుసూదనరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ మేరకు బాధితుడు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
‘పాపన్న’ జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి
కొండాపూర్: సర్దార్ పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. కొండాపూర్లో గల గౌడ సంఘం కార్యాలయంలో శనివారం గౌడ సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుండి 10 వరకు బస్సుయాత్ర ప్రారంభించామన్నారు. ఈ యాత్ర 7న మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుతుందన్నారు. 8న మెదక్, నర్సాపూర్, దౌల్తాబాద్ల మీదుగా సంగారెడ్డికి చేరుకుంటుందన్నారు.అనంతరం మద్యాహ్నం 12 గంటలకు సంగారెడ్డిలో గల ప్రెస్క్లబ్ల సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈయాత్రకు జిల్లాలోని నలుమూలల నుండి గౌడ కులస్థులు, కల్లుగీత కార్మికులు, టీసీఎస్, టీఎఫ్టగీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో బీసీ మండల అధ్యక్షుడు క్రిష్ణాగౌడ్, నాయకులు రామాగౌడ్, మల్లేశంగౌడ్, శ్రీనివాస్గౌడ్, శ్రీధర్గౌడ్, అంజాగౌడ్, రమేష్గౌడ్, యాదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నామమాత్రంగా హరితహారం
కొండాపూర్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నామమాత్రంగానే కొనసాగుతున్నది. ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి దానికనుగుణంగానే హంగూ ఆర్భాటంతో హరితహారం కార్యక్రమం ప్రారంభించింది. అయితే ఫలితం మాత్రం శూన్యం.మొక్కలను నర్సరీల ద్వారా గ్రామాల్లోకి పంపిణీ చేసినప్పటికీ వాటిని చెత్తకుప్పల్లోనూ, పంచాయతీ కార్యాలయ వెనుకభాగంలోను దర్శనమిస్తున్నాయి. గుంతలను తవ్వి 20 రోజులు దాటినా మొక్కలను మాత్రం నాటడంలేదు. దీంతో వర్షాలకు గుంతలు పూడ్చుకుపోతున్నా కనీసం పట్టించుకునే మండల అధికారులే కరువయ్యారు. మండలంలోని 22 గ్రామాలకు 8 లక్షల 80 వేల మొక్కలను ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇప్పటి వరకు మండలంలో కేవలం 3 లక్షల 33 వేల మొక్కలను మాత్రమే నాటారు. అనంతసాగర్లో 4,910, దొబ్బకుంటలో 5,150, గారకుర్తి 1,095, తొగర్పల్లి 4,510, తేర్పోల్లో 8,100, సైదాపూర్లో 4,960, మారేపల్లిలో 3,520, మాందాపూర్లో 6,560, గిర్మాపూర్లో 7,330 మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి అయితే కేవలం ఇవి పేపర్ ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, ఇప్పటివరకు ఏ గ్రామంలో కూడా కనీసం 5 వేల మొక్కలను కూడా నాటలేదని పలువురు పేర్కొంటున్నారు. పలు గ్రామాలలోని ప్రజలు విమర్శిస్తున్నారు.తేర్పోల్ గ్రామంలో నర్సరీల ద్వారా తెచ్చిన మొక్కలు సుమారు 150కి పైగా పంచాయతీ కార్యాలయం వెనుక వున్న ముళ్ల పొదల్లో పడేశారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. మారేపల్లి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొక్కలను నాటేందుకు గ్రామ శివారులో గల కొత్తకుంట కాలవ క్రింది భాగంలో గుంతలు తీసి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు మొక్కలు నాటలేదు. వర్షం వచ్చి గుంతలన్ని మూసుకుపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా మండల అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నాటిన మొక్కలైనా వాటిని సంరక్షిస్తే చాలనీ పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
16వ అంతస్తు నుంచి పడి.. యువతి...
హైదరాబాద్ : మాదాపూర్లోని మీనాక్షి స్కైలాంజ్ అపార్ట్మెంట్ 16వ అంతస్తుపై నుంచి పడి వెన్నెల (19) అనే యువతి మరణించింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వాచ్మెన్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిది ఆత్మహత్యా ? లేక హత్య ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు వెన్నెల స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గునుపూడి అని పోలీసులు తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
కొండాపూర్ (మెదక్ జిల్లా) : కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఓ యువకుడిని కొంతమంది వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. వివరాల ప్రకారం.. కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన సువర్ణ(45) అనే మహిళతో కొంతకాలంగా సుధాకర్(27) అనే యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన సువర్ణ భర్త ప్రభాకర్ పలుమార్లు సుధాకర్ను హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో సుధాకర్ను గ్రామానికి పిలిపించి చెట్టుకు కట్టేసి ప్రభాకర్, అతని బంధువులు చితకబాదారు. తీవ్రగాయాలకు సుధాకర్ మరణించడంతో వారు పరారయ్యారు. సుధాకర్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో పర్యటించిన మేయర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. నగరంలోని కొత్తగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. సదరు ప్రాంతంలో ట్రాఫిక్, రహదారి పరిస్థితిని ఆయన వెంట ఉన్న ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే, కేబీఆర్ పార్కు వద్ద వన్వే ఏర్పాటుపై కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు మేయర్ బొంతు రామ్మోహన్ పలు సూచనలు చేశారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా నివసిస్తున్న గుంటి మల్లయ్య (80), గుంటి రాజమ్మ(72) ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియ లేదు. ఆ విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. -
గురుకులంలో ‘సమ్మర్ సమురాయ్'
కొండాపూర్: విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని గుర్తించిన రంగారెడ్డి జిల్లా గురుకుల పాఠశాల వేసవిలో' సమ్మర్ సమురాయ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. విద్యా సంబంధ అంశాలతోపాటు ఆటపాటల్లో నిపుణులైన వారితో విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. మెదక్ జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలకు చెందిన 125 మంది విద్యార్థులను కొండాపూర్లోని గురుకుల ఉన్నత పాఠశాలలో వసతి సౌకర్యాలు కల్పించింది. ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా గురుకుల పాఠశాలల కో ఆర్డినేటర్ గణపతి తెలిపారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా విద్యార్థికి ఎంతో అవసరమని గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారని, ఆయన ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు పాఠశాల ప్రిన్సిపల్ గోదావరి తెలిపారు. -
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
కొండాపూర్ (మెదక్) : కుటుంబ పోషణ భారమై ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వికలాంగులైన ఇద్దరి పిల్లలను పొషించే స్థోమత లేక తల్లి తన ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిపై కిరోసిన్ పోసి అనంతరం తాను కూడా పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో ముగ్గురు పూర్తిగా కాలిపోయారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొండాపూర్ ఘటన పునరావృతమయ్యేదే...
సిటీబ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన తాళ్ల రవి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్తో కలిసి 2011 జనవరి 16న మాదాపూర్లోని సూరజ్ బార్ ముందు ఇండికా కారును దొంగిలించారు. అదే రోజు రాత్రి కారులో వచ్చి కొండాపూర్ సిలికాన్ వ్యాలీ ముందు మారుతి వ్యాన్పై దాడిచేసి రూ.36 లక్షలు దోచుకొని ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయారు. అదే గ్యాంగ్ 2011 అక్టోబర్ 5న అయ్యప్ప సొసైటీలో ఇండికా కారును దొంగిలించారు. మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు కొండాపూర్లోని బాలాజి వైన్స్ ముందుకు వచ్చారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు దుండగుల కారును గుర్తించి వెంబడించారు. పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. అప్పటి మాదాపూర్ ఎస్ఐ శివ కుమార్ ఎదురు కాల్పులు జరపడంతో తాళ్ల రవి కడుపులో బుల్లెట్ దిగి... పోలీసులకు చిక్కాడు. దీంతో సైబరాబాద్లో దోపిడీకేసులు ఓ కొలిక్కి వచ్చాయి. ముందస్తు సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మీర్జా గ్యాంగ్ను పట్టుకోకుంటే కొండాపూర్ ఘటనే పునరావృతమయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చిన్నారి మృతదేహం
-
కొండాపూర్లో ‘స్వైన్’కలకలం
మిరుదొడ్డి: మండలంలోని కొండాపూర్లో ‘స్వైన్ ఫ్లూ’ కలకలం సృష్టించింది. కొండాపూర్కు చెందిన భీమరి నర్సింహులుకు స్వైన్ఫ్లూ నిర్ధారణ కాగా, అతని భార్య, కూతురుకు కూడా స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. భీమరి నర్సింహులు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నిరోజులుగా హృద్రోగ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న నర్సింహులు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు అతన్ని సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఈనెల 25న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నర్సింహులుకు పరీక్షలు నిర్వహించి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పీహెచ్సీ డా. సునీతతో పాటు వైద్య సిబ్బంది సోమవారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. స్వైన్ఫ్లూతో చికిత్స పొందుతున్న నర్సింహులు భార్య వసంతను, కూతురు నిహారికకు పరీక్షలు నిర్వహించారు. తల్లీకూతుళ్లకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతేకాకుండా న ర్సింహులు ఇంటి పరిసరాల్లోని కుటుంబాల వద్దకు వెళ్లి వ్యాధి లక్షణాలపై ఆరా తీశారు. అనంతరం వైద్య బృందం గ్రావృుంలో ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. జ్వరం, జలుబు, ఎడతె రిపి లేకుండా వచ్చే దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
చిన్నారి సహా దంపతుల ఆత్మహత్య!
హైదరాబాద్ : ఘట్కేసర్ మండలం కొండాపూర్లో విషాదం చోటు చేసుకుంది. కొండాపూర్కు సమీపంలోని రైలు కిందపడి చిన్నారి సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు. కాగా దంపతులు మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ప్రజలపై మీడియా ప్రభావం అధికం
99 చానల్ ప్రారంభ సభలో వక్తలు హైదరాబాద్: కొండాపూర్లోని చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్లో 99 టీవీ చానల్ తెలంగాణ లైవ్ కార్యక్రమాన్ని టి. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ లైవ్ కార్యక్రమాన్ని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ లాం చింగ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు చానల్ లోగోను, ఎంపీ కేశవరావు ఫీచర్స్ను ప్రారంభించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ముధుసూదనాచారి మాట్లాడుతూ ప్రజల జీవితాలను భాగా ప్రభావితం చేసే శక్తి మీడియాకు ఉందన్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాలు సమాజహితం కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పరితపిస్తున్నట్లు కన్పిస్తుందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిజాన్ని నిర్భ యంగా చెప్పేందుకు జర్నలిజం ఉపయోగ పడాలన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉందని, సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేసేందుకు వీలులేదన్నారు. ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రావు, సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం నాయకులు మధు, ప్రముఖ సంపాదకులు ఏబీకె ప్రసాద్, కొమ్మినేని శ్రీనివాసరావు, తెల్కపల్లి రవి, దేవులపల్లి అమర్, శైలేష్రెడ్డి, విజయసాయిరెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. -
ఖాకీల హల్చల్
- అనంతసాగర్లోని పలువురి ఇళ్లలో తనిఖీలు - ఆందోళనలో గ్రామస్తులు - పోలీసుల తీరుపై ఆగ్రహం కొండాపూర్, న్యూస్లైన్: మండల పరిధిలోని అనంతసాగర్లో పోలీసులు హల్చల్ చేశారు. బుధవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 30 మంది పోలీసులు ఒక్కసారిగా గ్రామంలో హడావుడి చేశారు. పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. దీంతో స్థానికులంతా భయాందోళనలు చెందారు. ఇప్పటికే సీఐడీ పోలీసుల మం టూ పలువురు గ్రామంలోని తనిఖీలు చేపట్టడం... తాజాగా పోలీసులు కూడా వారిలాగే తనిఖీలు చేపట్టడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఎందుకు తనిఖీలు చేపడుతున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజుకొకరు వచ్చి గ్రామంలోని పలు ఇళ్లను తవ్వేస్తుంటే ఏం చేయాలో...ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు. వారంరోజులుగా తనిఖీల పరంపర ఈ నెల 1వ తేదీన 25 మంది వ్యక్తులు పోలీసు యూనిఫాం, సివిల్ దుస్తులు ధరించి స్కార్పియో వాహనాల్లో గ్రామానికి వచ్చారు. తాము సిఐడీ పోలీసులమని గ్రామస్థులకు చెప్పారు. ఓ కేసు విషయంలో విచారణ జరుపుతున్నామంటూ గ్రామానికి చెందిన సోమేశ్వర్ పాడుపడ్డ ఇంటి తలుపులు బద్దలుకొట్టి ఆ ఇంట్లోని దేవుడిగదిలో తవ్వకాలు జరిపారు. తిరిగి మంగళవారం రాత్రి రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన పలువురు వ్యక్తులు తాము సీఐడీ పోలీసులమంటూ మళ్లీ సోమేశ్వర్ ఇంటికే వచ్చారు. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు సిద్ధంకాగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అనంతసాగర్ చేరుకున్న ఎస్ఐ చంద్రయ్య ఆరుగురిని అరెస్టు చేయగా, మరికొందరు పరారయ్యారు. తన అదుపులో ఉన్న వారికి స్టేషన్కు తరలించిన ఎస్ఐ విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా, బుధవారం ఉదయం డీఎస్పీతో పాటు మరికొంత మంది పోలీసులు తహశీల్దారు గీత, గ్రామంలోని మటం మల్లేశం, అశోక్, ఇంద్రారెడ్డి, సోమేశ్వర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఎందుకు తనిఖీలు చేస్తున్నారో కూడా చెప్పకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఓ దశలో పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు ఇలా ఎవరో ఒకరు వచ్చి తనిఖీలంటూ తమను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు వెంటనే ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తహశీల్దారు ఎదుట బైండోవర్ తమ అదుపులో ఉన్న హైదరాబాద్కు చెందిన హరిబాబు, విజయ్కుమార్, కోల్కుంద నరేశ్, వినయ్మీర్ బాబు, గడ్డపల్లి శేఖర్, రాజ్కుమార్ నాయక్లను విచారించి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ చంద్రయ్య తెలిపారు. కూలీ పనులు చేసుకోడానికి తాము గ్రామానికి వచ్చినట్లు విచారణలో వారు చెప్పారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
డ్రైవింగ్ స్కూళ్ల నిలువుదోపిడీ
శిక్షణలో కొరవడుతున్న నాణ్యత ఆర్టీఏ ప్రోత్సాహంతో ఏజెంట్లుగా చలామణి శిక్షకుల నుంచి రూ.వేలల్లో వసూళ్లు విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్ల జారీ సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్లో పుట్టగొడుగుల్లా అక్రమంగా వెలుస్తున్న డ్రైవింగ్ స్కూళ్లు శిక్షకుల పాలిట శిక్షగా మారుతున్నాయి. కార్లు, బస్సులు,లారీలు వంటి వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవాలనుకొనే వినియోగదారుల అవసరాన్ని,ఆసక్తిని ఆసరా చేసుకొని నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. శిక్షణ ప్రమాణాలను, నాణ్యతను గాలికొదిలేసి కేవలం అక్రమార్జనే లక్ష్యంగా ఫక్తు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఆర్టీఏ అధికారులకు ఆదాయ మార్గమవుతున్నాయి. మరోవైపు ఈ డ్రైవింగ్ స్కూళ్లనే రాచమార్గంగా ఎంచుకొంటున్న కొందరు మోటారు వాహన తనిఖీ అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు రహదారి భద్రతా చట్టాలను, ప్రమాణాలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్లు ఇచ్చేస్తున్నారు. దాంతో డ్రైవింగ్లో ఎలాంటి ప్రావీణ్యం,రహదారి నిబంధనల పట్ల పెద్దగా అవగాహన లేకుండానే చాలామంది డ్రైవర్లుగా రోడ్డెక్కేస్తున్నారు. ఇది డ్రైవింగ్ స్కూళ్లు, ఆర్టీఏ అధికారుల ధనదాహం రహదారి భద్రతకే ముప్పుగా పరిణమిస్తోంది. నియంత్రణ ఇలాగేనా? .... గ్రేటర్లోని కొండాపూర్, మేడ్చెల్, ఉప్పల్, నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల నుంచి వాహనదారులకు రవాణాశాఖ డ్రైవింగ్ లెసైన్స్లను అందజేస్తోంది. ఇవి కాకుండా మిగతా ఖైరతాబాద్, అత్తాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బహదూర్పురా, మలక్పేట్ల నుంచి లెర్నింగ్ లెసైన్స్లు ఇస్తారు. నిబంధనల ప్రకారం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లు మొదట సమీపంలోని ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లెసైన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకోవాలి. అభ్యర్థులకు అరగంట రోడ్డు నిబంధనల పై పరీక్ష నిర్వహించి ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. దీంతో వారికి డ్రైవింగ్లో శిక్షణ పొందేందుకు అనుమతి లభించినట్లు లెక్క. ఎల్ఎల్ఆర్ పొందిన వారు డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా శిక్షణ పొందవచ్చు. లెర్నింగ్ లెసైన్స్ 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో అభ్యర్థులు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ శిక్షణ తీసుకొని శాశ్వతంగా డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు. మోటారు వాహన తనిఖీ అధికారులు వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యం పట్ల సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లెసైన్స్లు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదు. లెర్నింగ్ లెసైన్స్ల నుంచి పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ల వరకు అభ్యర్ధుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు ఆర్టీఏ అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. పరీక్షలు లేకుండానే డీఎల్స్ ... గ్రేటర్లో వేల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. రవాణాశాఖ నుంచి ఎలాంటి అనుమతి, ఆమోదం లేకుండానే వందలాది స్కూళ్లు పని చేస్తున్నాయి. వాహనదారులకు డ్రైవింగ్ లెసైన్స్లు (డీఎల్స్) ఇప్పించడమే లక్ష్యంగా పని చేస్తూ ఆర్టీఏ అధికారులు, సంబంధిత మోటారు వాహన తనిఖీ అధికారులకు నమ్మకమైన దళారులుగా వ్యవహరిస్తున్నాయి.ఇలాంటి డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా వచ్చే అభ్యర్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే డీఎల్స్ ఇచ్చేస్తున్నారు. డ్రైవింగ్ శిక్షణ, లెసైన్సుల పేరుతో అభ్యర్థుల నుంచి రూ.వేలల్లో వసూలు చేసినప్పటికీ చివరకు పెద్దగా శిక్షణ ఇవ్వకుండానే లెసైన్స్లు మాత్రం ఇప్పించడం గమనార్హం. ఇలా దోపిడీ... ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.60 చెల్లించి ఎల్ఎల్ఆర్ తీసుకోవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.465లు. కానీ డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ పేరిట తీసుకొనే వేలాది రూపాయలు కాకుండానే,కేవలం ఎల్ఎల్ఆర్,డిఎల్స్పై పై రూ.1200 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా శిక్షణ కోసం వచ్చే అభ్యర్థుల దగ్గర ఒక నెల రోజుల శిక్షణ పేరిట రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నాయి. లెసైన్స్లపై అక్రమ ఫీజులను బ్రోచర్లలో ముద్రించి వసూలు చేస్తున్నప్పటికీ రవాణా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాటిని మరింత ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ఈ స్కూళ్లు ఏ ఒక్క నిబంధన పాటించడం లేదు. ఐటీఐ పూర్తి చేసి,డ్రైవింగ్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే శిక్షణ ఇవ్వాలనే నిబంధన కానీ, ప్రతి ఐదేళ్లకోసారి స్కూళ్లు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు, డ్రైవింగ్ పై సైద్ధాంతిక శిక్షణనిచ్చే తరగతి గదుల నిబంధన గాలికి వదిలేసి డ్రైవింగ్ స్కూళ్ల పేరిట దళారులుగా మాత్రమే పని చేస్తున్నాయి. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
ఆయుర్వేదంపై ఆసక్తి
కొండాపూర్, న్యూస్లైన్: ఆయుర్వేద వైద్యానికి పల్లెల్లోని ప్రజలు మక్కువ చూపుతున్నారు. సహజంగా లభించే ఔషధ వనమూలికలు, వాయిదినుసులు ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ఆయుర్వేద వైద్యుల సహకారంతో సర్వ రోగాలకు నివారణిగా త యారుచేసిన సంజీవని చూర్ణాన్ని ప్రజ లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మండలంలో ఏకైక ఆయుర్వేద వైద్యశాల మారెపల్లిలో ఉంది. మిగతా 20 గ్రామాల్లో హైదరాబాద్ చెందిన మాన స ఆయుర్వేద ఆస్పత్రి, కృష్ణలాల్ మదన్లాల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వారు ఊరూర తిరుగుతూ గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బహిరంగంగా ఔషధ మూ లికలు, వాయిదినుసులు 168 రకాల ఆయుర్వేద వస్తువులను సమ భాగాలుగా తీసి రోలు కుందెనగడ్డ పారతో తయారుచేసి సర్వరోగ నివారణ కోసం గ్రామాల్లోనే ఇస్తున్నారు. పదేళ్ల పిల్లలకు 30 గ్రాముల చూర్ణం 11 రోజులు, పెద్దలకు 60 గ్రాముల చూర్ణం 21 రోజులు వాడాలని సూచిస్తున్నారు. వంకాయ, గోంగూర, గోరు చిక్కుడు, ఎండు చేపలు, బంగాళదుంపలు చూర్ణం వాడే సమయంలో ఉపయోగించవద్దని సూచి స్తున్నారు. గ్యాస్ ట్రబుల్, పక్షవాతం, బీ పీ, అల్సర్, మోకాళ్ల నొప్పులు, సొరి యాసిస్, ఆస్తమా, అలర్జీ, అజీర్ణం, ఉ బ్బసం, తిమ్మిర్లు, అర్శమొలలు, కిడ్నీలో రాళ్లు, దగ్గు తదితర దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేద చూర్ణం పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే ఆయుర్వేదంపై గ్రామాల్లో అవగాహన కలిగినవారు కొనుగోలు చేస్తున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఆయుర్వేద మందులతో రోగాలు పూర్తిగా నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆయుర్వేదంపై ప్రచారం చేసి మందులను అందుబాటులో ఉంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
శిథిలావస్థలో కల్వర్టులు
కొండాపూర్, న్యూస్లైన్: కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. అయినా అధికారులు మొద్దునిద్ర వీడడంలేదు. మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా నుంచి మునిదేవునిపల్లి వరకు ప్రమాదకరంగా నాలుగు కల్వర్టులు ఉన్నాయి. పెద్దాపూర్ నుంచి మారెపల్లి వరకు రెండు కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పంచాయతీరాజ్ రోడ్డుపై ఉన్న ఈ కల్వర్టుల మీదుగా ప్రతిరోజు మల్లెపల్లి శివారులోని పరిశ్రమల భారీ వాహనాలు సదాశివపే ట, సంగారెడ్డి పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు రాత్రింబవళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడంతో మళ్లీ యధాస్థితికి వస్తున్నాయి. ఇదిలా ఉండగా మండలానికి రెగ్యులర్ పీఆర్ ఏఈ లేకపోవడంతో పంచాయతీరాజ్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డివిజన్, జిల్లాస్థాయి అధికారులు సైతం మండలంలో పర్యటించిన దాఖలాలు లేవు. ఇన్చార్జి పీఆర్ అధికారులతో ఇబ్బందులు 2010 నుంచి నేటి వరకు అధికరులు తరుచూ బదిలీలు ఇంచార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో పంచాయతీరాజ్ పనులు సరిగ్గా చేయ డం లేదనే ఆరోపణలున్నాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు అధికారులు మండల పీఆర్ బాధ్యతలు నిర్వహించారు. ఏడాదిలో ఇద్దరు మార్పు చెందడంతో పనులు నత్తనడకన సాగడమే కాకుండా పర్సెంటేజ్లు తీసుకుని నాణ్యత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 2013 ఫిబ్రవరి 5 వరకు శశికుమార్ ఏఈగా పనిచేశారు. 6 నుంచి రత్నం 8 నెలల పాటు ఇన్చార్జిగా పనిచేశారు. అకస్మాత్తు గా రత్నంను ఇన్చార్జి బాధ్యతల నుంచి తొల గించగా ఓ నెలపాటు తిరిగి శశికుమార్ ఇన్చార్జి బాధ్యతలు చూశారు. ప్రస్తుతం సదాశివపేట పీఆర్ఏఈ మధుకర్ 1 డిసెంబర్ 2013 నుంచి ఇన్చార్జి పీఆర్ఏఈ బాధ్యతలు చూస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో హరిసింగ్ను వివరణ కోరగా మండలంలో పీఆర్ఏఈలు ఇన్చార్జిలుగా ఉండటంతో ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమన్నారు. పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు పంచాయతీరాజ్ కార్యాలయానికి తీసుకెళ్లారని, ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్ఏఈ రికార్డులు నమోదు చేస్తామన్నారు. -
విద్యుత్ సబ్స్టేషన్కు తాళాలు
కొండాపురం, న్యూస్లైన్: ట్రాన్స్కో అధికారుల తీరును నిరసిస్తూ మండలంలోని గుడవళ్లూరుకు చెందిన రైతులు మంగళవారం విద్యుత్ సబ్స్టేషన్ మెయిన్ గేటుకు, కార్యాలయానికి తాళాలు వేసి, కంప అడ్డం వేసి సిబ్బం దిని బయటకు గెంటేశారు. మూడు గంటల పాటు కలిగిరి, కొండాపురం రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదేవిధంగా సబ్స్టేషన్కు తాళాలు వేసి నిరసన తెలిపిన రైతులు రెండో దఫా నిరసనకు దిగారు. రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వ సూచించినా కనీసం నాలుగు గంటలు కూడా సరఫరా చేయడం లేదని, అది కూడా ఒక్కో దఫా గంట మాత్రమే ఇస్తుండటంతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు. వ్యవసాయానికి 7 గంటలు ఇవ్వవలసిన విద్యుత్ను సక్రమంగా ఇవ్వకుండా ఇదే సబ్స్టేషన్ పరిధిలోని ఉప్పులూరు గ్రామానికి ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆరోపించారు. తమకు 7 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లుగా రికార్డుల్లో రాస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎంతకూ ధర్నాను విరమించకపోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఏఈతో ఫోన్లో మాట్లాడి రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. -
పాత పంటలకు పూర్వ వైభవం
కొండాపూర్, న్యూస్లైన్: పాత పంటలకు పూర్వ వైభవం వచ్చింది. వాణిజ్య పంటల సాగులో ప్రతిఏటా నష్టపోతున్న రైతులు తిరిగి పాతపంటలపై దృష్టి సారించారు. నీటివినియోగం, పెట్టుబడులు తక్కువగా ఉండడం, ఆదాయం అధికంగా ఉండడంతో ఆహార పంటల సాగుకు వారం తా మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల క్రితం వరకు మండల పరిధిలోని మారెపల్లి, అనంతసాగర్, తొగర్పల్లి, మన్సాన్పల్లి, మునిదేవునిపల్లి, మల్కాపూర్, గిర్మాపూర్, గారకుర్తి తదితర గ్రామాల్లో మిరప, జొన్న, ఆముదం, వామ ఉల్లిగడ్డ, కంది, కుసుమ, కొర్ర, శనగ పంటలను విరివిగా సాగు చేసేవారు. సేంద్రియ ఎరువులు వాడటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించేవారు. కాలక్రమేణా బోరుబావుల తవ్వకాలు పెరిగి నీటి లభ్యత పెరగడంతో రైతులు చెరకు, వరి, పసుపు, మొక్కజొన్న పంటలను సాగుచేశారు. ఈ పంటలపై రసాయన మందులు పిచికారీ చేయడం తప్పనిసరి కావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దిగుబడి కూడా పెరిగినప్పటికీ రైతన్నలు మాత్రం నష్టాలపాలయ్యారు. దీంతో చా లామంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంకొంత మంది సాగుపైనే దృష్టి సారించినా అనుకున్న ఫలితం రాలేదు. దీంతో పునరాలోచనలో పడిన అన్నదాతలు ఇపుడు మళ్లీ పాతపంటలపై దృష్టిసారించారు. ప్రస్తుతం మండలంలో చాలామంది రైతులు మిరప, ఉల్లి, వామ, కుసుమ, కంది, జొన్న, ఆముదం, శనగ పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించడంతో అందరూ ఆహార ధాన్యాలైన పాత పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. -
ఐటీ కారిడార్కు మరిన్ని బస్సులు
సాక్షి,సిటీబ్యూరో: ఐటీ కారిడార్ బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అభయ ఉదంతం నేపథ్యంలో నగరంలోని వివిధ మార్గాల నుంచి ఐటీ కారిడార్కు ఆర్టీసీ 40 బస్సులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కొండాపూర్, వీబీఐటీ, వేవ్రాక్, ఫైనాన్షియల్ సిటీ, మణికొండ,మాధాపూర్ సాఫ్ట్వేర్ లేఅవుట్,తదితర ప్రాంతాల్లోని సుమారు 600 ఐటీ కంపెనీల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు సాఫ్ట్వేర్ నిపుణుల కోసం నెల క్రితం ప్రారంభించిన ఈ బస్సులు క్రమంగా ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. బాచుపల్లి-వేవ్రాక్, లింగంపల్లి- వేవ్రాక్, మెహదీపట్నం-క్యూసిటీ, మైత్రీవనం- వేవ్రాక్ మార్గాల్లో ఈ బస్సులు రోజు 200 ట్రిప్పులు తిరుగుతున్నాయి. 25 వేల నుంచి 35 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సులను ప్రవేశపెట్టిన మొదటి రెండు, మూడు వారాల్లో పెద్దగా ఆదరణ కనిపించకపోయినా, క్రమంగా పెరిగిందని, ప్రస్తుతం వేవ్రాక్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు ‘సాక్షి’తో చెప్పారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 11.30 వరకు అందుబాటులో ఉండేవిధంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఇక భయం లేదు ఆర్టీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బస్సులు మహిళా ప్రయాణికుల భద్రతకు భరోసానిస్తున్నాయి. అప్పటి వరకు ట్యాక్సీల్లో, షేరింగ్ ఆటోల్లో ప్రయాణిం చిన వాళ్లు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూ స్తున్నారు. మరోవైపు ఐటీ కంపెనీల యాజమాన్యాలతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు తరచుగా నిర్వహిస్తోన్న సమావేశాలు కూడా ఫలితాన్నిస్తున్నాయి. ఐటీ క ంపెనీలు తమ స్థలాల్లో బస్సులను ఆపేందుకు అవకాశం ఇ వ్వడంతో ప్రస్తుతం పార్కింగ్ ఇబ్బందీ తొలగిపోయిం ది. ఈ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 49 నుంచి 58 శాతం వరకు నమోదవుతోంది. సాధారణ బస్సుల్లో కిలోమీటర్కు రూ.37.80 చొప్పున ఆదాయం లభిస్తుండగా, ఐటీ బస్సుల్లో ప్రస్తుతం రూ.30 వరకు వస్తోంది. సురక్షితమైన, మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని అందజేస్తోన్న ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సంస్థ ఈడీ కోరుతున్నారు. త్వరలో సికింద్రాబాద్-వేవ్రాక్ సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం వీబీఐటీ వరకు నడుస్తున్న బస్సులను వేవ్రాక్ వరకు పొడిగించనున్నారు. కొత్తగా మరో 8 బస్సులు ఈ మార్గంలో నడపనున్నట్లు ఈడీ తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ రూట్లో బస్సుల సంఖ్యను పెంచుతున్నామని, ఒకటి, రెండు రోజుల్లో ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. -
తొలి వికెట్ పడింది
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటి వరకు హెచ్చరిస్తూ వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ ఇక చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హరిప్రసాద్ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని శుక్రవారం ఆమె డీఎంహెచ్ఓ రంగారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. హరిప్రసాద్ సరిగా విధులకు హాజరు కాకపోవడంపై కొండాపూర్ వాసులు ఫిర్యాదులు చేయడంతో కలెక్టర్ అతని పనితీరుపై విచారణ జరిపించారు. గ్రామస్తుల ఆరోపణలు నిజమని తేలడంతో అతన్ని సరెండర్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యుడి పోస్టు ఖాళీగా చూపిస్తూ కొత్త వైద్యాధికారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనంటూ ఇప్పటికే తేల్చిచెప్పిన కలెక్టర్, డాక్టర్ హరిప్రసాద్ను సరెండర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరోసారి హెచ్చరికలు పంపారు -
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
స్విమ్మింగ్పూల్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీటమునిగి మృతిచెందిన ఘటన హైదరాబాద్లోని కొండాపూర్లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు అరండల్పేటకు చెందిన చావలి పృథ్వీరాజ్ యాదవ్(31) బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన కొండాపూర్ ఆనంద్నగర్లోని తులీప్ లీ పార్క్ గృహ సముదాయంలోని ఒక ఫ్లాట్లో నివాసముంటున్నారు. చెన్నయ్లో సాఫ్ట్వేర్ ఇంజ నీర్గా పనిచేస్తున్న సోదరుడు కల్యాణ్చక్రవర్తి గురువారం పృథ్వీరాజ్ ఇంటికి రాగా.. సాయంత్రం ఇద్దరూ కలిసి తులీప్ లీ పార్కులోని స్విమ్మింగ్పూల్కు ఈతకెళ్లారు. ఈ సందర్భంగా ఈత కొడుతూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారు. కొద్దిసేపటి తరువాత చూసిన కల్యాణ్కు పృథ్వీరాజ్ కనిపించలేదు. అనుమానమొచ్చి స్విమ్మింగ్పూల్లోకి చూడగా పృథ్వీరాజ్ నీటిలో మునిగిపోయి కనిపించారు. వెంటనే అతన్ని మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుం డగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి నీటిలో మునగడంతో మరణించినట్టు భావి స్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, మూడు నెలల బాబు ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.