ks bharat
-
అజేయ శతకాలతో చెలరేగిన కేఎస్ భరత్, అశ్విన్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో ఆంధ్ర జట్టు అదరగొడుతోంది. గ్రూప్-‘బి’లో భాగంగా మేఘాలయతో పోరులో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 10 వికెట్ల తేడాతో మేఘాలయ(Andhra vs Meghalaya )ను మట్టికరిపించింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన మేఘాలయ జట్టు 48.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ నిశాంత చక్రవర్తి (108 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... అర్పిత్ (90 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించాడు. దీంతో ఒకదశలో మేఘాలయ జట్టు 182/1తో పటిష్ట స్థితిలో కనిపించింది.యారా సందీప్ 5 వికెట్లతో అదరగొట్టాడుఅయితే ఆ తర్వాత ఆంధ్ర బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మేఘాలయ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. ఆంధ్ర బౌలర్లలో యారా సందీప్ 28 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ఆంజనేయులు, మహీప్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర 29.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 228 పరుగులు చేసింది.భరత్, అశ్విన్ అజేయ శతకాలుఆంధ్ర కెప్టెన్ శ్రీకర్ భరత్ (KS Bharat- 81 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో విజృంభించాడు. మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (Ashwin Hebbar- 96 బంతుల్లో 108 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) కూడా ‘శత’క్కొట్టడంతో ఆంధ్ర జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మేఘాలయ బౌలింగ్ను ఓ ఆటాడుకున్న భరత్... సిక్స్లతో చెలరేగిపోతే అశి్వన్ బౌండరీలతో హోరెత్తించాడు. వీరిద్దరూ పోటీపడి పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది.రెండో స్థానంలోగత మ్యాచ్లో సర్వీసెస్పై అజేయ అర్ధశతకాలతో వికెట్ నష్టపోకుండానే జట్టును గెలిపించిన భరత్, అశ్విన్... ఈసారి కూడా దాన్ని పునరావృతం చేశారు. 5 వికెట్లు తీసిన సందీప్నకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లాడిన ఆంధ్ర జట్టు 4 విజయాలు, ఒక పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర జట్టు తలపడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
రికీ భుయ్, కేఎస్ భరత్ మెరుపులు.. గోవాపై ఆంధ్ర ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ రికీ భుయ్ (38 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (38 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన గోవా నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్ (51 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా... అర్జున్ టెండూల్కర్ 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్, శ్రీకర్ భరత్ ధనాధన్ షాట్లతో కట్టిపడేశారు. అశ్విన్ హెబర్ (13), షేక్ రషీద్ (8) విఫలం కాగా... భరత్, భుయ్ మూడో వికెట్కు 98 పరుగులు జోడించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఆంధ్ర జట్టు 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర ఆడుతుంది. -
VIDAR Vs AP: నిరాశపరిచిన కేఎస్ భరత్.. ఆంధ్ర జట్టు ఓటమి
నాగ్పూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ సీజన్ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్ అభిషేక్ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.శశికాంత్ కాస్త పోరాడినావీరిద్దరు పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్ రికీ భుయ్ (26; 1 ఫోర్, 1 సిక్స్), శశికాంత్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడినా... కేఎస్ భరత్ (2), అశ్విన్ హెబర్ (3) నిరాశపరిచారు. విజయ్ (0), లలిత్ మోహన్ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్ అయ్యారు.చివరి వికెట్గా శశికాంత్ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్ దూబే (4/69), అక్షయ్ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్లో గుజరాత్ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
పంత్ వారసుడు దొరికేశాడు.. అరంగేట్రంలోనే అదుర్స్!?
ప్రస్తుతం తరంలో భారత టెస్టు వికెట్ కీపర్ బ్యాటర్లంటే మనకు టక్కున గుర్తు వచ్చేది డాషింగ్ ఆటగాడు రిషబ్ పంత్నే. ఒంటి చేత్తో భారత్కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ప్రత్యర్ధి బౌలర్ ఎంత మొనగాడైనా ఊచకోత కోయడమే అతడి నైజం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై మూడు చెరువుల నీరు తాగించిన ఘనత ఈ ఢిల్లీ చిచ్చర పిడుగుది. కానీ ఇదంతా 2022 ఏడాదికి ముందు. ఆ తర్వాత కథ వేరు. 2022 ఏడాదిలో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత పంత్ మెరుపులను టీమిండియా మిస్స్ అయ్యింది. ఎంతమంది వికెట్ల కీపర్లను మార్చినా అతడి లోటును ఎవరూ తీర్చలేకపోయారు. పంత్ రీ ఎంట్రీ వెయ్యికళ్లుతో ఎదురుచూస్తున్న తరుణంలో అతడినే మైమరిపించేలా ఒక యువ సంచలనం ఎంట్రీ ఇచ్చాడు. అతడే ఉత్తర్ ప్రదేశ్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్ అరంగేట్రంలోనే అదుర్స్.. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో 23 ఏళ్ల దృవ్ జురల్ అడుగుపెట్టాడు. తన కంటే సీనియర్ అయిన శ్రీకర్ భరత్ను కాదని జురల్కు మేనెజ్మెంట్ అవకాశమిచ్చింది. మేనెజ్మెంట్ నమ్మకాన్ని దృవ్ వమ్ముచేయలేదు. తన అరంగేట్ర మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. బ్యాటింగ్లో 46 పరుగులు చేసిన ఈ యూపీ ఆటగాడు. వికెట్ కీపింగ్ స్కిల్స్తో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ సెంచరీ హీరో బెన్ డకెట్ను దృవ్ రనౌట్ చేసిన విధానం కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అదే విధంగా కుల్దీప్, అశ్విన్, జడ్డూ వంటి వరల్డ్క్లాస్ స్పిన్నర్ల బౌలింగ్ను వికెట్ల వెనుక అతడు ఎదుర్కొన్న విధానం అద్బుతం. ఈ క్రమంలో రిషబ్ పంత్ వారసుడు దొరికేశాని అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. పంత్ ప్రస్తుతం శరవేగంతో కోలుకుంటున్నప్పటికీ భారత జట్టులోకి రీ ఎంట్రీకి మరి కొంత సమయం పడుతుంది. ఒక వేళ వచ్చినా గానీ వికెట్ కీపింగ్ చేయగలడన్నది అనుమానమే. భరత్ కథ ముగిసినట్లేనా..? శ్రీకర్ భరత్.. రిషబ్ పంత్ వారసుడిగా భారత టెస్టుక్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఈ ఆంధ్ర ఆటగాడు విఫలమయ్యాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్లు ఆడిన భరత్కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ క్రమంలో జురల్ తన తొలి మ్యాచ్లోనే అదరగొట్టడంతో భరత్కు ఇకపై జట్టులో చోటు కష్టమేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
Ind vs Eng 3rd Test: భరత్నే ఆడించండి.. అతడు వద్దు!
India vs England, 3rd Test: ఇంగ్లండ్తో మూడో టెస్టులో శ్రీకర్ భరత్నే టీమిండియా వికెట్ కీపర్గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కనపెడితే.. కీపర్గా భరత్ రాణిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశాడు. పిచ్లు కఠినంగా ఉన్న కారణంగానే కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా కాకుండా బ్యాటర్గా ఆడిస్తున్నారన్న ఆకాశ్ చోప్రా.. కాబట్టి భరత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంతో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించడంతో మరోసారి ఆంధ్ర క్రికెటర్ టీమిండియాలో భాగమయ్యాడు. ప్రొటిస్తో టెస్టుల తర్వాత ఇంగ్లండ్తో స్వదేశంలో ఆడుతున్న సిరీస్లోనూ కీపర్గా భరత్కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో అతడు 69 పరుగులు చేశాడు. అయితే, సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం భరత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 23 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మూడో టెస్టులో ధ్రువ్ జురెల్ అరంగేట్రానికి మేనేజ్మెంట్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భరత్ స్థానంలో వికెట్ కీపర్గా అతడికి ఛాన్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాత్రం భరత్నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ధ్రువ్ జురెల్ అరంగేట్రం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం.. భరత్నే కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది రెండే టెస్టులు. అతడు వికెట్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ అందరూ అతడి బ్యాటింగ్ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నారు. పిచ్లు కఠినంగా ఉంటాయనే కారణంగానే రాహుల్ను ప్యూర్ బ్యాటర్గా మాత్రమే బరిలోకి దించారు కదా. మరి భరత్ను స్పెషలిస్టు కీపర్గానే చూడాలి కదా. హైదరాబాద్ టెస్టులో అతడు బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. అయినా కూడా.. బ్యాటర్గానే అతడి సేవలు కావాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్లోనైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే తొందరపడకూడదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
Adudam Andhra: మహత్తర క్రీడా యజ్ఞం.. తొలి అడుగు విజయవంతం
గ్రామస్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూనే.. ఆరోగ్య విషయంలో ఆటలు ఎంత కీలకమో వివరిస్తూ.. ఆటలను జీవన శైలిలో భాగంగా మారుస్తూ.. గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం... ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం.. అంతటికే పరిమితంగాక.. వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు జగనన్న ప్రభుత్వం చేపట్టిన బృహత్తర క్రీడా యజ్ఞం.. ‘‘ఆడుదాం ఆంధ్రా’’. ఈ మహా క్రీడా సంబరంలో భాగంగా గ్రామ,వార్డు సచివాలయ స్థాయిలో మొత్తం 3.30 లక్షలు, మండలస్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గస్థాయిలో 7,346, జిల్లాస్థాయిలో 1,731, రాష్ట్రస్థాయిలో 260 మ్యాచ్లు నిర్వహించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. క్రీడాకారులకు దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించడమే గాకుండా.. రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు.. మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులను అందించేందుకు ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్ రాష్ట్రస్థాయికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తో పాటు వివిధ క్రీడా విభాగాలకు సంబంధించిన అసోసియేషన్లు, ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి ఫ్రాంచైజీలను టాలెంట్ హంట్కు ఆహ్వానించింది. తద్వారా ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే విజయవంతం ఇలా ఆడుదాం ఆంధ్రా ద్వారా.. వ్యాయామ ఆవశ్యకత, ఆరోగ్యపరంగా అది ఎంత కీలకమో గ్రామస్థాయి నుంచి చైతన్యం కల్పిస్తూ. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి, క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగనన్న ప్రభుత్వం.. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైందని చెప్పవచ్చు. నిదర్శనం ఇదే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు ఈ క్రీడా యజ్ఞంలో భాగం కావడమే ఇందుకు నిదర్శనం. ఈ పోటీలను 80 లక్షల మంది వీక్షించడం ఆడుదాం ఆంధ్రాకు దక్కిన ఆదరణకు తార్కాణం. మేటి ఆటగాళ్లు తాము సైతం అంటూ రాష్ట్రం నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ కోన శ్రీకర్ భరత్, టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని, బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు వంటి మేటి ప్లేయర్లు కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించడంలో భాగం కావడం విశేషం. ఇక మొత్తంగా 17,59,263 మంది పురుష, 7,81,709 మంది మహిళా ప్లేయర్లు ఈ క్రీడా సంబరంలో పాలుపంచుకున్నారు. కాగా ఆడుదాం ఆంధ్రా మొదటి సీజన్ విజయవంతంగా పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మెగా టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కూడా! 50 రోజుల పండుగ.. విశాఖలో ముగింపు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆటల పండుగ తుది అంకానికి చేరుకుంది. విశాఖపట్నంలో ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలు మంగళవారం జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ఆయన వీక్షిస్తారు. ఆ తర్వాత క్రీడాకారులు, క్రీడల ఆవశ్యకతను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇలా ఈ క్రీడా సంబరంలోని తొలి ఎడిషన్ పూర్తికానుంది. చదవండి: ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే -
ఇంగ్లండ్తో మూడో టెస్టు.. భరత్పై వేటు! సర్ఫరాజ్, దృవ్ అరంగేట్రం?
ఇంగ్లండ్తో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు పర్యాటక జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లండ్తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈమ్యాచ్లో గెలిచి సిరీస ఆధిక్యాన్ని పెంచుకోవాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు ఇంగ్లండ్ సైతం తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే భారత జట్టు రాజ్కోట్కు చేరుకోగా.. దుబాయ్లో ఉన్న ఇంగ్లీష్ జట్టు మంగళవారం రాజ్కోట్కు రానుంది. అయితే చివరి మూడు టెస్టులకు తాజాగా భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు కొన్ని అనూహ్య మార్పులు చేశారు. శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్ను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఆకాష్ దీప్ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. అదే విధంగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ మూడో టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ తుది జట్టు సెలక్షన్కు ముందు వారిద్దరూ తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు రెండో టెస్టుకు భారత జట్టులో కలిసిన సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్లను ఆఖరి మ్యాచ్ల దృవ్, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం ఇక రాజ్కోట్ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్, సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్పై వేటు వేసి, దృవ్ జురల్ను జట్టులోకి తీసుకోవాలని మేన్జ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో భరత్ నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో భరత్.. 41, 28, 17, 6 చేసిన స్కోర్లు ఇవి. ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్లు ఆడిన భరత్కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మరోవైపు వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన రజిత్ పాటిదార్ను కూడా పక్కన పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా రెండో టెస్టుకు దూరమైన పేసర్ సిరాజ్ కూడా తుది జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్ బెంచ్కే పరిమితం కానున్నాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ -
భరత్కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్గా ప్రస్తుతం కేఎస్ భరత్కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్ -
IND vs ENG: భరత్కు బైబై?.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!?
వికెట్ కీపింగ్.. టెస్టు క్రికెట్లో టీమిండియాను వేదుస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి. రిషబ్ పంత్ కారు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైనప్పటి నుంచి టీమిండియాలో తన లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. లోయర్డర్లో వచ్చి మెరుపులు మెరిపించే పంత్ స్ధానాన్ని ఇప్పటివరకు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. భరత్ అట్టర్ ప్లాప్ రిషబ్ పంత్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్.. వరుసగా విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ పరంగా కాస్త పర్వాలేదనప్పిస్తున్నప్పటికీ బ్యాటింగ్లో దారుణంగా విఫలమవతున్నాడు. కీలక సమయాల్లో బ్యాటింగ్కు వస్తున్న భరత్ ఒత్తడిని తట్టుకోలేక త్వరగా పెవిలియన్కు చేరుతున్నాడు. ఇటీవలే తన హోం గ్రౌండ్లో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులోనూ అదే ఆటతీరును భరత్ కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్లు ఆడిన భరత్కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దృవ్ జురల్ అరంగేట్రం!? అతడి స్ధానంలో యవ వికెట్ కీపర్ దృవ్ జురల్కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. జురల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లోయార్డర్లో వచ్చి బ్యాటింగ్ చేసే సత్తా దృవ్కు ఉంది. జురల్ 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 790 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ -
ఎంత పనిచేశావు భరత్.. ఈజీ స్టంపౌట్ మిస్! రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు చేయగా.. అనంతరం ఇంగ్లండ్ కూడా దీటుగా బదులిస్తోంది. 25 ఓవర్లకు ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(21), బెయిర్ స్టో(0) పరుగులతో ఉన్నారు. అయితే ఇంగ్లండ్ స్టారర్ బ్యాటర్ ఓలీ పోప్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ స్టంపౌట్ ఛాన్స్ను మిస్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ రెండో బంతికి డకెట్ను ఔట్ చేశాడు. అనంతరం పోప్ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్ విఫలమయ్యాడు. బంతి పోప్ బ్యాట్ను మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వేళ్లింది. వికెట్ కీపర్ భరత్ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఒకవేళ బంతిని అందుకుని బెయిల్స్ను పడగొట్టి ఉంటే పోప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చెరేవాడు. రిప్లేలో క్లియర్గా పోప్ క్రీజుకు బయట ఉన్నట్లు కన్పించింది. వెంటనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పనిచేశావు భరత్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కాగా తొలి టెస్టులో కూడా పోప్కు అవకాశాలు ఇవ్వడంతో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు మరోసారి ఛాన్స్ రావడంతో అందుకు టీమిండియా ఎంత మూల్యం చెల్లించుకుంటుందో వేచి చూడాలి. Early reprieve for Ollie Pope as KS Bharat missed a stumping chance! 👀#CricketTwitter #INDvENG #India #England #KSBharat pic.twitter.com/Z7dYmLHXTv — CRICKETNMORE (@cricketnmore) February 3, 2024 -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. శ్రీకర్ భరత్ను సన్మానించనున్న ఏసీఏ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర కెప్టెన్గా రాణించిన శ్రీకర్ భరత్.. తన హోం గ్రౌండ్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో సత్తాచాటాలని భరత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న భరత్ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. "వైజాగ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన శ్రీకర్ భరత్ను ఘనంగా సన్మానించనున్నాం. ఈ కార్యక్రమం గురువారం స్టేడియంలో నిర్వహించనున్నాం. ఇది అతడి విజయానికి దగ్గిన గౌరవం" అని న్యూస్ 18తో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్రెడ్డి పేర్కొన్నారు. బాల్ బాయ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా.. కేఎస్ భరత్ క్రికెట్ జర్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంతోనే ప్రారంభమైంది. 2005లో బాల్ బాయ్గా ఎక్కడైతే పనిచేశాడో.. అదే స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. తద్వారా సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా భరత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో భరత్ కంటే ముందు ఆంధ్ర దిగ్గజ ప్లేయర్ సీకే నాయుడు మొదటి ఆటగాడిగా ఉన్నారు. ఎమ్ఎస్కె ప్రసాద్, హనుమ విహారి భారత్ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్ రాలేదు. -
ఇంగ్లండ్ సిరీస్కు ముందు సూపర్ సెంచరీ.. తుది జట్టులో చోటు ఖాయమేనా?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్, మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్లో శ్రీకర్ భరత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో సెకెండ్ ఇన్నింగ్స్లో ఆజేయ శతకం సాధించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన భరత్.. 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ను 553/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం భారత్-ఏ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రజిత్ పాటిదార్(151) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో భారత్-ఎ జట్టు పుంజుకుంది. డ్రాగా ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో ఇండియా-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. భారత సెకెండ్ ఇన్నింగ్స్లో భరత్తో పాటు సాయిసుదర్శన్(97), మనవ్ సుతార్(89) సత్తాచాటారు. తుది జట్టులో చోటు ఖాయమేనా? ఇంగ్లండ్తో సిరీస్కు ఇదివరకే ప్రకటించిన తొలి రెండు టెస్టుల సిరీస్లో స్పెషలిస్టు వికెట్ కీపర్ కోటాలో భరత్ చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్ దృవ్ జురల్కు కూడా జట్టులో ఛాన్స్ లభించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు వికెట్ కీపర్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. ఈ సిరీస్లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్గానే ఆడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనాధికారిక టెస్టులో సెంచరీతో చెలరేగిన భరత్కు వికెట్ కీపర్గా తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. -
INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్!
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్తో ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ పాటిదార్కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి. 223 ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్ను ఆలౌట్ చేశారు. మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు. భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. సర్ఫరాజ్ను ఇకనైనా టీమిండియాలోకి? మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మిగిలిన మ్యాచ్లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
రాహుల్కు కఠిన సవాలు.. ఏం చేస్తాడో చూడాలి! మరి భరత్?
Ind vs SA 2023 Test Series: కేఎల్ రాహుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్గా, బ్యాటర్గా రాణిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ఓపెనర్గా పాతుకుపోయిన ఈ కర్ణాటక ఆటగాడు గత కొన్నేళ్లుగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీ శుబ్మన్ గిల్ మూడు ఫార్మాట్లలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో.. అవసరాన్ని బట్టి నాలుగు లేదంటే ఐదు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాడు. అంతేకాదు.. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లలో మొదటి ప్రాధాన్యంగా మారాడు. వన్డే వరల్డ్కప్-2023లో బ్యాటింగ్తో పాటు, అద్భుతమైన కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పంత్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అయితే, టెస్టుల్లో మాత్రం వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు మెరుగైన రికార్డు లేదు. ముఖ్యంగా రిషభ్ పంత్ జట్టులో ఉంటే అతడికి జట్టులో అసలు స్థానమే కరువయ్యే పరిస్థితి. కానీ.. రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ సుదీర్ఘకాలంగా ఆటకు దూరమైన నేపథ్యంలో వికెట్ కీపర్గా కాకపోయినా.. స్పెషలిస్టు బ్యాటర్గానైనా రాహుల్ జట్టులో చోటు సంపాదిస్తున్నాడు. ఆసీస్తో సిరీస్ నుంచి భరత్ వికెట్ కీపర్ పంత్ గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(ఆసీస్ వర్సెస్ ఇండియా) నుంచి ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో భరత్ను కాదని కేఎల్ రాహుల్కే కీపర్గా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు. ఇషాన్ ఇంకా నిరూపించుకోనే లేదు ఇషాన్ కిషన్ జట్టుతో లేడు కాబట్టి వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ మాత్రమే తమకు మిగిలి ఉన్న ఆప్షన్ అని పేర్కొన్నాడు. గత ఐదారు నెలలుగా రాహుల్ కీపింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకున్నాడన్న ద్రవిడ్.. సౌతాఫ్రికాలో అతడికి గట్టి సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. రాహుల్ వైపే మొగ్గు చూపిన ద్రవిడ్ అయితే, ఇక్కడ పెద్దగా స్పిన్ బౌలింగ్కు ఆస్కారం లేదు కాబట్టి.. కేఎల్ రాహుల్ మెరుగ్గానే కీపింగ్ చేస్తాడని భావిస్తున్నట్లు ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. రాహుల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. తప్పుబట్టిన మాజీ వికెట్ కీపర్ ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కేఎల్ రాహుల్ను టెస్టుల్లో కీపర్గా ఆడించడం సరికాదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. india’s test match wicketkeeper should be someone who is keeping regularly in ranji trophy or first class cricket….#imho #INDvSA #IndianCricket — parthiv patel (@parthiv9) December 24, 2023 భరత్కు పరోక్ష మద్దతు ‘‘రంజీ ట్రోఫీ లేదంటే ఫస్ట్క్లాస్ క్రికెట్లో తరచుగా కీపింగ్ చేసే ఆటగాడినే టీమిండియా టెస్టు మ్యాచ్ వికెట్ కీపర్గా తీసుకోవాలి’’ అని పార్థివ్ పటేల్ పరోక్షంగా కేఎస్ భరత్కు మద్దతునిచ్చాడు. అయితే, కేఎల్ రాహుల్ అభిమానులకు మాత్రం పార్థివ్ ఆలోచన నచ్చడం లేదు. రాహుల్- భరత్ బ్యాటింగ్ గణాంకాలు పోలుస్తూ అతడిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ ఏం చేస్తాడో? పేసర్ల బౌలింగ్లో అద్భుతంగా కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.. రవీంద్ర జడేజా లేదంటే రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్ విషయంలో ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్, బౌన్సీ పిచ్లు ఉన్న సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు మేలు చేస్తాయో చూడాలి! ఇషాన్ స్థానంలో భరత్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఎంపికైన ఇషాన్ కిషన్.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని కేఎస్ భరత్తో భర్తీ చేశారు టీమిండియా సెలక్టర్లు. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత-ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న భరత్ను ప్రధాన జట్టుకు ఎంపిక చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం?
Ishan Kishan- Mental Fatigue: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మానసికంగా అలసిపోయానంటూ 25 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ కొన్నాళ్ల పాటు క్రికెట్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా 2021లో టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్గా పలు అవకాశాలు దక్కించుకున్న ఇషాన్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ సెంచరీ, ఓ డబుల్ సెంచరీ ఉంది. ఆరంభంలో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ సహచర ఆటగాడు, తన స్నేహితుడు శుబ్మన్ గిల్ నుంచి ఎదురైన పోటీలో ఇషాన్ వెనుకబడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా గిల్ తన స్థానం సుస్థిరం చేసుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు మాత్రం అవకాశాలు సన్నగిల్లాయి. గిల్ సూపర్స్టార్గా ఎదుగుతున్నాడు.. ఇషాన్ మాత్రం కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో అతడికి ప్రాధాన్యం తగ్గింది. ఈ క్రమంలో సీనియర్ల గైర్హాజరీలో మిడిలార్డర్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇషాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు.. గిల్ మూడు ఫార్మాట్లలో సూపర్స్టార్గా ఎదుగుతుండగా.. ఇషాన్కు ఇంత వరకు టెస్టుల్లో తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదు. యశస్వి జైశ్వాల్ నుంచి గట్టిపోటీ కూడా ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది కాలంగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్నా.. తుదిజట్టులో పెద్దగా ఛాన్సులు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా రెండు మ్యాచ్ల సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆంధ్ర క్రికెటర్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ టీమిండియాతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్కు సంబంధించిన కీలక వార్త తెరమీదకు వచ్చింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే అతడు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘మానసికంగా అలసిపోయానని.. తనకు క్రికెట్ నుంచి కొన్నాళ్ల పాటు విరామం కావాలంటూ ఇషాన్ కిషన్ యాజమాన్యంతో చెప్పాడు. మేనేజ్మెంట్ కూడా ఇందుకు అంగీకరించింది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. గతేడాది కాలంగా విరామం లేకుండా జట్టుతో ప్రయాణించిన ఇషాన్ ప్రస్తుతం విశ్రాంతి కోరుకుంటున్నట్లు తెలిపింది. వన్డేల్లో దుమ్ములేపినా.. ఇక ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్టులు, 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ 52 పరగులు చేయగా.. 17 వన్డేల్లో కలిపి 456 పరుగులు సాధించాడు. టీ20లలో ఈ ఏడాది 207 రన్స్ తీశాడు. కాగా గతంలోనూ గ్లెన్ మాక్స్వెల్ వంటి చాలా మంది క్రికెటర్లు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆటకు విరామిచ్చిన విషయం తెలిసిందే. ఇషాన్ కూడా అలాగే కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Sanju Samson: వాళ్ల గురించి ఫిర్యాదు చేయను.. అనేక ఒత్తిళ్ల నడుమ: సంజూ -
క్రికెట్ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..
పాఠశాల స్థాయి నుంచే జగన్కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వైఎస్ జగన్.. క్రికెట్తో పాటు బాస్కెల్ బాల్ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబం బంజారాహిల్స్లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్.. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్ గ్యాంగ్లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్.. హెచ్పీఎస్లో హౌజ్ కెప్టెన్గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్ల జట్లను ఓడించి రెడ్ హౌజ్కు ఆల్రౌండర్ చాంపియన్షిప్ అందించారు జగన్. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎస్కే ముందుకు వచ్చేలా చర్యలు ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి. విజయవంతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లు అరంగేట్ర ఎడిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్ టైటిల్ సాధించింది. కాగా దేశవాళీ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది. క్రికెట్ దిగ్గజాలను ఆహ్వానిస్తూ 1983 వరల్డ్కప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం. ఏపీ సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్ పేరిట క్రికెట్తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. అంబాసిడర్గా అంబటి రాయుడు ఈ ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్ భరత్(క్రికెటర్) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది. -
ఐపీఎల్ 2024 వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న తెలుగు ఆటగాళ్లు వీరే..!
దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీరాజ్ యర్రాలకు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ యర్రా 2 ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు. హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్ ఆల్రౌండర్, 24 ఐపీఎల్ మ్యాచ్ల్లో 284 పరుగులు) కేఎస్ భరత్ (30) (వైజాగ్, వికెట్కీపర్ బ్యాటర్, 10 ఐపీఎల్ మ్యాచ్ల్లో 199 పరుగులు, ఓ హాఫ్ సెంచరీ) పృథ్వీరాజ్ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, 2 ఐపీఎల్ మ్యాచ్ల్లో (కేకేఆర్) ఓ వికెట్) రోహిత్ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) అనికేత్ రెడ్డి (23) (నిజామాబాద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్) రవి తేజ (29) (హైదరాబాద్, ఆల్రౌండర్) మనీశ్ రెడ్డి (24) (హైదరాబాద్, ఆల్రౌండర్) మురుగన్ అభిషేక్ (19) (హైదరాబాద్, స్పిన్ బౌలర్) ఎర్రవల్లి అవనీశ్ రావ్ (19) (హైదరాబాద్, బ్యాటర్) రక్షణ్ రెడ్డి (23) (హైదరాబాద్, మీడియ పేసర్) రాహుల్ బుద్ది (26) (హైదరాబాద్, బ్యాటర్, 2022లో ముంబై ఇండియన్స్ సభ్యుడు) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
SA Tour: ఉన్న పళంగా స్వదేశానికి బయల్దేరిన ఇషాన్ కిషన్
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా యంగ్ వికెట్కీపింగ్ బ్యాటర్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఉన్న పలంగా స్వదేశానికి బయల్దేరాడు. వ్యక్తిగత కారణాల చేత ఇషాన్ ఇండియాకు బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత టెస్ట్ జట్టులో ఇషాన్ స్థానాన్ని కేఎస్ భరత్ భర్తీ చేస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్న భరత్.. భారత టెస్ట్ జట్టుతో త్వరలోనే కలుస్తాడని పేర్కొంది. కాగా, సౌతాఫ్రికా పర్యటనలో టీ20, టెస్ట్ సిరీస్ల కోసం భారత సెలెక్టర్లు ఇషాన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కని ఇషాన్.. టెస్ట్ సిరీస్పై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఉన్నట్లుండి అతను ఇంటి వెళ్లిపోవడంతో అనూహ్యంగా కేఎస్ భరత్కు సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. భరత్.. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్కీపర్ ఛాయిస్గా టీమిండియాలో చేరతాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్కీపర్) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26-30 మధ్యలో జరుగనుండగా.. రెండో టెస్ట్ కేప్టౌన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 మధ్యలో జరుగుతుంది. -
టెస్టు మ్యాచ్లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
IPL 2024 Auction: ఫ్రాంఛైజీల కళ్లన్నీ అతడిపైనే! హాట్కేకుల్లా ఆ ఇద్దరు!
IPL 2024 Auction: ఐపీఎల్–2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 19న దుబాయ్లో వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో సోమవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీల కళ్లన్నీ అతడిపైనే ఇక వన్డే వరల్డ్కప్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్పై ఫ్రాంచైజీలన్నీ కన్నేశాయి. కమిన్స్, మిచెల్ స్టార్క్లు కూడా ఆసీస్ తరఫున హాట్ కేక్లు కానున్నారు. ప్రపంచకప్లో సెమీఫైనలిస్టుగా నిలిచిన న్యూజిలాండ్ తరఫున మెరిసిన రచిన్ రవీంద్రపై కూడా కోట్లు కురిసే అవకాశాలున్నాయి. 77 స్థానాలు.. కేకేఆర్కు అత్యధికంగా అదే విధంగా.. ఫ్రాంచైజీల విషయానికొస్తే మొత్తం 10 జట్లకు కావాల్సింది 77 మంది ఆటగాళ్లయితే ఇందులో 30 విదేశీ బెర్తులున్నాయి. ఇందుకోసం రూ. 262.95 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఖాళీల పరంగా చూస్తే అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ 12 మందిని కొనుక్కోవాల్సి ఉండగా... ఆ జట్టు చేతిలో రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. టైటాన్స్ వద్ద రూ.38.15 కోట్లు ఇక అత్యధిక మొత్తం రూ.38.15 కోట్లు గుజరాత్ వద్ద ఉంటే వారికి 8 మంది ఆటగాళ్లు కావాలి. కనిష్ట మొత్తం రూ. 13.15 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉండగా... వారు ఆరు బెర్తుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే! మరోవైపు.. ధోని టీమ్ చెన్నై ఖాతాలో రూ. 31.40 కోట్లు, కోహ్లి జట్టు బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు అందుబాటులో ఉండగా ఇరుజట్లకు ఆరుగురు చొప్పున ఖాళీలున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అభిషేక్ మురుగన్, రాహుల్ బుద్ధి, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, అరవెల్లి అవినాశ్రావు, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి... ఆంధ్ర నుంచి కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్, హనుమ విహారి, పృథ్వీరాజ్ వేలంలో ఉన్నారు. జట్టు- ఖాళీల సంఖ్య - మిగిలిన మొత్తం ►చెన్నై- 6- రూ. 31.4 కోట్లు ►ఢిల్లీ- 9 - రూ. 28.95 కోట్లు ►గుజరాత్- 8- రూ. 38.15 కోట్లు ►కోల్కతా - 12- రూ. 32.7 కోట్లు ►లక్నో- 6 - రూ. 13.15 కోట్లు ►ముంబై - 8 - రూ. 17.75 కోట్లు ►పంజాబ్- 8- రూ. 29.1 కోట్లు ►బెంగళూరు- 6 - రూ. 23.25 కోట్లు ►రాజస్తాన్ - 8- రూ. 14.5 కోట్లు ►హైదరాబాద్- 6- రూ. 34 కోట్లు ►మొత్తం- 77- రూ. 262.95 కోట్లు -
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత-ఏ జట్టు కెప్టెన్గా కేఎస్ భరత్
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సీనియర్లు రోహిత్, విరాట్ దూరంగా ఉండనుండగా.. చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ పర్యటన టీ20 సిరీస్తో మొదలుకానుంది. కాగా, భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగానే భారత-ఏ జట్టు కూడా పర్యటనలో భాగం కానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు సౌతాఫ్రికా ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. అలాగే సీనియర్ జట్టుతో ఓ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడుతుంది. భారత ఏ జట్టుకు ఆంధ్ర వికెట్కీపర్ కేఎస్ భరత్ నాయకత్వం వహించనున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్కు ముందు భారత-ఏ జట్టు తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఆడబోయే రెండో టెస్ట్కు ముందు రెండో మ్యాచ్ జరుగనుంది. తొలి మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో దేశవాలీ స్టార్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, దేవ్దత్ పడిక్కల్,సాయి సుదర్శన్లకు చోటు లభించింది. రెండో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో జాతీయ జట్టు ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలకు అవకాశం లభించింది. తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ప్రదోష్ రంజన్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, పుల్కిత్ నారంగ్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, తుషార్ దేశ్పాండే రెండో నాలుగు రోజుల మ్యాచ్కు భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, నవదీప్ సైనీ మూడు రోజుల ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ , ధ్రువ్ జురెల్ , ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పుల్కిత్ నారంగ్, హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ. వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్టౌన్) -
SMAT 2023: మూడో పరాజయం.. క్వార్టర్ ఫైనల్ అవకాశాలు లేనట్లే!
SMAT- 2023- Andhra vs Saurashtra- రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు మూడో పరాజయం చవిచూసింది. సౌరాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. షేక్ రషీద్ (39 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లు జైదేవ్ ఉనాద్కట్ (2/35), చిరాగ్ జానీ (2/35), ధర్మేంద్ర సింగ్ జడేజా (3/14) ఆంధ్ర జట్టును కట్టడి చేశారు. క్వార్టర్ అవకాశాలు గల్లంతు అనంతరం సౌరాష్ట్ర జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. హార్విక్ దేశాయ్ (51 బంతుల్లో 81; 13 ఫోర్లు, 2 సిక్స్లు), తరుణ్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రైల్వేస్తో జరిగే చివరి మ్యాచ్లో ఆంధ్ర జట్టు గెలిచినా క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం లేదు. చదవండి: BCCI: టీమిండియా హెడ్కోచ్గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
‘ఏపీలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ పేర్కొన్నారు. తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించడంతో పాటు ఏసీఏ(ఆంధ్రక్రికెట్ అసోసియేషన్) మంచి సహాయ సహకారాలు అందించిన కారణంగానే దేశం తరఫున ఆడే అవకాశం దక్కిందన్నాడు. శుక్రవారం విశాఖలో క్రికెటర్ భరత్ను మంత్రి గుడివాడ్ అమర్నాథ్, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మాట్లాడిన శ్రీకర్ భరత్.. ‘నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒకరికి ధన్యవాదాలు. నా తల్లి దండ్రులు ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ మంచి సహాయ సహకారాలు అందించింది. నా ఎదుగుదలలో ఏసీఏది కీలక పాత్ర. ఏసీఏ సహాయ సహకారాలు మర్చిపోలేనిది. పట్టుదలతో విజయం సాధించవచ్చు. దేశానికి ఆడడం గర్వంగా భావిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం జగన్ సార్ ను కలిశాను. సీఎం జగన్ సార్ ఎంతగానో ప్రోత్సహించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అనేది మంచి కార్యక్రమం’ అని భరత్ స్పష్టం చేశాడు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘దేశానికి గర్వకారణం భరత్. 140 కోట్ల మంది ప్రజల్లో భారత్ క్రికెట్ జట్టుకు భరత్ ఎంపిక కావడం సంతోషం. అడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను సీఎం వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు. వత భరత్, రాయుడును ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చెప్పారు. గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం, 1000 చదరపు గజాల స్థలం ఇవ్వడానికి సీఎం జగన్ నిర్ణయించారు. భరత్ అకాడమీ పెడితే సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధోనీలా భరత్కు మంచి భవిష్యత్ ఉంది. క్రికెట్ ఆడే యువతకు భరత్ ఆదర్శం’ అని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి పాయింట్స్ మాట్లాడుతూ.. ‘పట్టుదలతో శ్రీకర్ భరత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.దేశం గర్వించదగ్గ బిడ్డను మనకు భరత్ తల్లి దండ్రులు అందించారు.పట్టుదలతో వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో స్థానం సంపాదించారు.రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ భరత్కు ఉంది. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తారు. ఏసీఏ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అన్ని రకాల క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. -
ఇషాన్కు టాలెంట్ ఉంది.. వరుస అవకాశాలు ఇస్తూనే ఉంటాం: రోహిత్
Ind vs WI 2nd Test: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. వికెట్ కీపర్గా తుది జట్టులో స్థానం దక్కించుకున్న అతడికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇషాన్తో పాటు ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగడం, మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదడం టీమిండియాకు కలిసి వచ్చింది. విరాట్ కోహ్లి సైతం అర్ధ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా 421-5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అప్పటికి క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 20 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు తీసి అంతర్జాతీయ టెస్టు రన్స్ ఖాతా తెరిచాడు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంతో విండీస్ కుప్పకూలడంతో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇషాన్ వెరీ టాలెంటెడ్ ఈ మ్యాచ్లో ఇషాన్ బ్యాటర్గా ఆకట్టుకోలేకపోయినా వికెట్ కీపర్గా ఫర్వాలేదనిపించాడు. అయితే, జూలై 20న ఆరంభం కానున్న రెండో టెస్టులో అతడిని కొనసాగిస్తారా లేదంటే ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్కు అవకాశమిస్తారా అన్న చర్చ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ను ఉద్దేశించి.. ‘‘ఇషాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. టీమిండియా తరఫున ఏడాదిన్నర కెరీర్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్బుతంగా రాణించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇలాంటి టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడం మన బాధ్యత. అతడికి మేము కచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాటర్.. కాబట్టి అతడి వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. అతడికి దూకుడుగా ఆడటం ఇష్టం. అయితే, మేనేజ్మెంట్ తను ఎలా ఆడాలని కోరుకుంటుందో స్పష్టంగా వివరించాను. అలా అని అతడికి స్వేచ్ఛ హరించుకుపోదు. రాణించగల సత్తా ఉన్నవాడు. వరుస అవకాశాలు అతడికి కాస్త ఫ్రీడం ఇచ్చి.. వరుస అవకాశాలు ఇస్తే తనను తాను నిరూపించుకుంటాడు. విండీస్తో తొలి టెస్టులో అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులోనూ ఇషాన్ను కొనసాగిస్తామని కెప్టెన్ స్పష్టం చేశాడని, వరుస అవకాశాలు ఇస్తామని చెప్పాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి వాళ్లు? ఇషాన్తో పాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ సా, సర్ఫరాజ్ ఖాన్, భరత్ వంటి ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారని.. అయినా ఇషాన్వైపే మొగ్గు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత వికెట్ కీపర్గా ఎవరు ఉంటారంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా ట్రినిడాడ్లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియా విండీస్తో రెండో టెస్టులో తలపడనుంది. -
Ind Vs WI: ఇషాన్ అరంగేట్రం.. అందుకే భరత్పై వేటు! కానీ పాపం..
West Indies vs India, 1st Test: ఎట్టకేలకు ఇషాన్ కిషన్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ సందర్భంగా జట్టుకు ఎంపికైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్తో పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు. ఇక జూలై 12న టీమిండియా- విండీస్ మధ్య ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా 24 ఏళ్ల ఇషాన్.. విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్నాడు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లుగానే మరో యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ కూడా అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకున్న అతడు.. కెప్టెన్కు జోడీగా ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. అందుకే భరత్పై వేటు కాగా వికెట్ కీపర్గా ఇషాన్ జట్టులోకి రావడంతో ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్పై వేటు పడింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లు యశస్వి, ఇషాన్లకు అభినందనలు తెలుపుతూనే.. భరత్కు మరొక్క అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా భరత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. పటిష్ట ఆసీస్తో మ్యాచ్లో వికెట్ కీపర్గా రాణించినప్పటికీ.. బ్యాటర్గా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అదే విధంగా ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లోనూ తన మార్కు చూపలేకపోయాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ రెండు ఇన్నింగ్స్లో కలిపి మొత్తంగా 28 పరుగులు చేయగలిగాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ శ్రీకర్ భరత్ ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టును ఎదుర్కోవడం విశేషం. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రా తదితరులు భరత్కు అండగా నిలిచారు. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతలు సక్రమంగానే నెరవేరుస్తున్న భరత్ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాస్త వీక్గా ఉన్న విండీస్తో ఆడే అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ భరత్పై వేటు వేసిన యాజమాన్యం ఇషాన్కు ఛాన్స్ ఇచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఈ జార్ఖండ్ బ్యాటర్ తనను తాను నిరూపించుకుంటే భరత్ స్థానానికి ఎసరు తప్పదు! పంత్ స్థానంలో అప్పుడు ఇక యాక్సిడెంట్ కారణంగా ప్రధాన వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూరం కావడంతో అతడి స్థానాన్ని భరత్తో భర్తీ చేశారు. పంత్ త్వరగా కోలుకుని తిరిగి వస్తే ఇషాన్ కిషన్, భరత్లలో ఎవరో ఒకరికి మాత్రమే బ్యాకప్గా జట్టులో స్థానం లభిస్తుంది. మరోవైపు.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా భరత్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 5 టెస్టులాడి 129 పరుగులు సాధించాడు. చదవండి: మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి! ఫైనల్లో జట్టును.. Good 11, considering the squad. Slightly harsh on Bharat, but he did get 5 Tests and didn't really look convincing. No harm in trying out Kishan to see what he's got. Just hoping Pant will get fit by the SA series, because he'll be our most important batter there.#WIvIND https://t.co/xoeuzOuqjA — Shaan Waseem (@shaanwaseem2) July 12, 2023 Happy For them , Go Well Lads !#WIvIND #WTC pic.twitter.com/XjQXYZooxP — vinith (@CricVinith) July 12, 2023 Watch 📹📹- Proud moment for the two youngsters as they receive their Test caps from Captain Rohit Sharma and Virat Kohli.#WIvIND pic.twitter.com/D9QXRQvX35 — BCCI (@BCCI) July 12, 2023 -
వెస్టిండీస్తో టెస్టు సిరీస్.. ఇషాన్ కిషన్ అరంగేట్రం! ఆంధ్ర ఆటగాడికి నో ఛాన్స్
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన తమ ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టేసింది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా భారత్-విండీస్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా స్ధానిక జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ రెండు రోజులు(జూలై 5, 6) పాటు జరగనుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. విండీస్ తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడం భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది. ఎందకంటే ఈ సిరీస్కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడంతో ఆ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలో ఆర్ధంకాక మెనెజ్మెంట్ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఆ స్ధానంలో యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్ లేదా రుత్రాజ్ గైక్వాడ్కు అవకాశం ఇవ్వాలో తెలియక సందిగ్థంలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ దేశావాళీ క్రికెట్లో ఓపెనర్లగా ఆడిన అనుభవం ఉంది గానీ టాపర్డర్లో అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ వీరిద్దరూలో ఎవరో ఒకరు విండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. అది ఎవరన్నది తొలి టెస్టు వరకు వేచి చూడక తప్పదు కిషన్ అరంగేట్రం.. ఇక విండీస్తో తొలి టెస్టుతో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో యువ వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ విండీస్ టెస్టులకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం అనుమానమే. భరత్ వికెట్లు వెనుక అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన భరత్.. ఆ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడిన కేవలం 101 పరుగులు చేశాడు. దీంతో పాటు ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో కూడా కేఎస్ భరత్కి ఫైనల్లో అవకాశం లభించింది. అక్కడ కూడా బ్యాట్తో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని పక్కన పెట్టి కిషన్కు ఓ అవకాశం ఇచ్చి చూడాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: Kohli And Rohit Sharma: ‘అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్..’ -
టెస్ట్లు ఒక్కటే కాదు.. అన్ని ఫార్మాట్లకు సిద్ధం: కేఎస్ భరత్
సాక్షి, సిటీ బ్యూరో: వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నానని భారత జట్టు వికెట్ కీపర్, ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్ వ్యాఖ్యానించాడు. రాబోయే రోజుల్లో వన్డే, టి20 ఫార్మాట్లలోనూ భారత జట్టులో ఎంపిక కావడమే తన తదుపరి లక్ష్యమని భరత్ తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన రెటీనా పెయింట్స్ దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించడంలో భాగంగా క్రికెటర్ కేఎస్ భరత్ను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. దీనికి సంబంధించి ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో భరత్ మాట్లాడుతూ... వ్యక్తిగత వృద్ధి కన్నా సంస్థ అభివృద్దే లక్ష్యంగా పనిచేసే బృందమున్న రెటీనా పెయింట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనుండటం తన బాధ్యతను పెంచిందని అన్నాడు. 22 ఏళ్లుగా క్రికెట్తో ప్రయాణిస్తున్నానని, తిరిగి చూసుకుంటే ఇక్కడి గల్లీ క్రికెట్ అనుభవాలు గుర్తుకొస్తున్నాయని భరత్ పేర్కొన్నాడు. ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ రాహుల్ ద్రవిడ్, ధోనీని అభిమానిస్తానని అన్నాడు. తనకు తెలుపు రంగు అంటే ఇష్టమని... దానికి తగ్గట్టుగానే మొదటగా టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందన్నాడు. ఈ కార్యక్రమంలో రెటీనా పెయింట్స్ ఎండీ రాకేష్ కూడా పాల్గొన్నారు. -
భరత్ ని బలిపశువును చెయ్యొద్దు
-
భరత్ కు షాక్...విండీస్ టూర్ కు సన్ రైజర్స్ వికెట్ కీపర్
-
పంత్ లేకపోవడం తీరని లోటే.. కానీ భరత్ను బలిపశువును చేయొద్దు: మాజీ కెప్టెన్
KS Bharat: ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్కు భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అండగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఓటమికి అతడిని కారణంగా చూపడం సరికాదంటూ మద్దతు ప్రకటించారు. దయచేసి అతడిని బలిపశువును చేయవద్దంటూ మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశారు. ఆసీస్తో టెస్టు సిరీస్తో కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు కేఎస్ భరత్. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్గా అవకాశం దక్కించుకున్న అతడు తన విధులను చక్కగా నిర్వర్తించాడు. కానీ కొంతమంది మాత్రం అతడు బ్యాటర్గా పంత్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడంటూ విషం చిమ్మారు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో భరత్ బ్యాటింగ్ తీరుపై కూడా పెదవి విరిచారు. ఏడో స్థానంలో కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన భరత్ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులకే అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 23 పరుగులు చేయగలిగాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఎస్ భరత్ బ్యాటింగ్ ప్రదర్శనపై అనవసరపు విమర్శల నేపథ్యంలో అంజుమ్ చోప్రా అతడికి మద్దతు ప్రకటించారు. జూలై 12న మొదలుకానున్న వెస్టిండీస్ పర్యటనకు భరత్ స్థానంలో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ లేకపోవడం తీరని లోటే.. కానీ ఈ మేరకు న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటే. కానీ అతడిని దృష్టిలో పెట్టుకుని కేఎస్ భరత్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. నిజానికి వికెట్ కీపర్గా అతడు తన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నాడు. తన ప్రైమరీ జాబ్ కూడా వికెట్ కీపింగే కదా! రిషభ్ పంత్ మాదిరే అతడు కూడా బ్యాటింగ్ అదరగొట్టాలని భావించడం పొరపాటే అవుతుంది. తన పని తాను చేస్తున్నాడు భరత్ లోయర్ ఆర్డర్లో ఆడుతున్నాడు. వాస్తవానికి.. టాపార్డర్ బ్యాటింగ్ బాధ్యతను నెత్తినవేసుకోవాలి.. మిడిలార్డర్ వాళ్లకు సపోర్టుగా ఉంటుంది.. ఇక లోయర్ ఆర్డర్ వీరందరికీ తమ వంతు సహకారం అందిస్తుందంతే!! ఈ విషయాలను మనం కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ బ్యాటింగ్ సరిగా లేదంటూ అతడిని విమర్శించడం సరికాదు’’ అని అంజుమ్ చోప్రా చెప్పుకొచ్చారు. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ రాణిస్తున్నాడని.. అతడిని అదే కోణంలో చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్లో పర్యటించనుంది. ఇక కోన శ్రీకర్ భరత్ ఇప్పటి వరకు భారత్ తరఫున 5 టెస్టులాడి 129 పరుగులు సాధించాడు. చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! టీమిండియా కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ! శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్గా! -
#MSKPrasad: 'క్రికెట్ కు సంబంధించి దేశానికి ఏపీ రోల్ మోడల్'
టీమిండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఒక చానెల్కు ఇంటర్య్వూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ''క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని సగర్వంగా చెప్పగలను. క్రికెట్లో కేఎస్ భరత్ లాంటి యంగ్ క్రికెటర్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. అదే విధంగా ఇతర క్రీడలో సాత్విక్ సాయిరాజ్, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులు బ్యాడ్మింటన్లో.. టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశానికి వివిధ కేటగిరీల్లో పతకాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిస్తున్నారు. ఇక క్రీడల్లో మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్వన్గా ఉంది. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. '' అంటూ చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడా మౌలిక సదుపాయాలు ఇంటర్నేషనల్ స్టేడియంలు 2 క్రికెట్ అకాడమీలు 4 ఫస్ట్ క్లాస్ క్రికెట్ గ్రౌండ్ లు 18 ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు? ఇక ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. ''దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే), కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్లున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి కోల్కతా నైట్రైడర్స్ ఒక్కటే ఉంది. ఐపీఎల్ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి కానీ, ప్రాంతం తరపున కాదు. ఆ మధ్య రెండు కొత్త జట్లను ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్చంద్రా రెడ్డి కూడా 3,500 కోట్లకు బిడ్ వేశారు. కానీ, ఎక్కువ కోట్ చేసిన వేరేవాళ్లకు ఆ జట్లు వెళ్లాయి. ఒకదశలో వైజాగ్, అమరావతి అన్న పేరుతో ఫ్రాంచైజీ వస్తుందన్న టాక్ నడిచింది. ఐపీఎల్ కమర్షియల్ టోర్నమెంట్.ఇలాగే ఉంటే కొన్నిరోజులకు బీసీసీఐకి కూడా నష్టం జరుగుతోంది. ఒక రకంగా ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ లేకపోవడమే మంచిది. ఫుట్బాల్లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే, ప్రీమియర్ లీగ్లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు. '' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు. ఇక వికెట్ కీపర్ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ టీమిండియా తరపున ఆరు టెస్టుల్లో 106 పరుగులు, 17 వన్డేల్లో 131 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థశతకం ఉంది. ఇక 2016 నుంచి 2020 వరకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా విధులు నిర్వర్తించాడు. చదవండి: #ViratKohli: పుష్కర కాలం పూర్తి.. లెక్కలేనన్ని ఘనతలు సొంతం -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్
సాక్షి, అమరావతి: టీమిండియా క్రికెటర్, భారత టెస్ట్ జట్టు సభ్యుడు (వికెట్ కీపర్) కోన శ్రీకర్ భరత్ ఇవాళ (జూన్ 15) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భరత్.. టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్లు చేసిన జెర్సీని సీఎంకు బహుకరించారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినందుకు గాను సీఎం జగన్ భరత్ను అభినందించారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం భరత్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ నుంచి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన మొదటి క్రికెటర్ను నేనే కావడం చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఈ విషయాన్ని సీఎంతో షేర్ చేసుకోగా, సంతోషం వ్యక్తం చేశారని తెలిపాడు. తన లాంటి ఎంతో మంది యువ క్రికెటర్లకు సీఎం జగన్ స్పూర్తిగా నిలుస్తారని చెప్పుకొచ్చాడు. దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం సూచించారని తెలిపాడు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని, స్పోర్ట్స్ ప్రమోషన్ చాలా బాగుందని పేర్కొన్నాడు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుందని, ఇలాంటి ప్రోత్సాహం లభించడం వల్ల నాలాంటి చాలామంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్పుకొచ్చాడు. కాగా, సీఎం జగన్తో జరిగిన సమావేశంలో కేఎస్ భరత్తో పాటు అతని తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్ క్రిష్ణారావు, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. -
AP: ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడా సంబురాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబురాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఏటా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. పోటీల కోసం ప్రతీ మండలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తారు. బాలురు, బాలికలకు పోటీలతో పాటుగానే, 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్లు జరుగనున్నాయి. మొత్తం 46 రోజులపాటు ఆటలు కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు జరుగనున్నాయి. సీఎం జగన్ ఏమన్నారంటే.. – ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలి: – క్రికెట్ లాంటి ఆటలో సీఎస్కే మార్గదర్శకం చేస్తుంది, నిర్వహణలో పాల్గొంటారు. – భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటాం. – ప్రస్తుతం చెన్నై సూపర్కింగ్స్కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తాం. – భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకుసాగాలి. – దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది. – అంబటిరాయుడు, కేఎస్ భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులు. – వీరి సేవలను మనం వినియోగించుకోవాలి. – మొదట జిల్లాస్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలి. – ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలకోసం ప్రతి మండలంలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలి. – ఈ పోటీల్లో మండలస్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలి. – గ్రామస్థాయిలో ఆడేవారికి కూడా క్రీడా సామగ్రిని అందించాలి. – ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలి. – భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలి. – ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలి. – హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడాసామగ్రిని ఏర్పాటు చేయాలి. – ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులుశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జి.వాణీమోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎస్ఎఎపీ) ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండీ కె.హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, జియో టవర్లను వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్ -
ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ తీవ్ర నిరాశపరిచాడు. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్.. వికెట్ కీపింగ్ పరంగా పర్వాలేదనిపించినప్పటికీ, బ్యాటింగ్లో మాత్రం అకట్టుకోలేకపోయాడు. మూడో రోజు ఆటలో అజింక్య రహానేకు భరత్ సపోర్ట్గా నిలుస్తాడని అంతా భావించారు. కానీ ఆటప్రారంభమైన కొద్దిసేపటికే భరత్ 5 పరుగులు చేసి స్కాట్ బోలాండ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. భరత్ను అద్భుతమైన ఇన్స్వింగర్తో బోలాండ్ బోల్తా కొట్టించాడు. బోలాండ్ వేసిన డెలివరీకి భరత్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి మిడిల్ స్టంప్ను గిరాటేసింది. దీంతో భరత్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. అంతకముందు భారత తమ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే, (89 పరుగులు), ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోర్నైనా అందుకుంది. ఇక మొత్తంగా ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: WTC Final: బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
పీకల్లోతు కష్టాల్లో భారత్.. భారం మొత్తం అతడిపైనే! లేదంటే అంతే సంగతి
ఆస్ట్రేలియాతో జరగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా టాపర్డర్ కుప్పకూలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. ఇక టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు. అయితే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(48) కౌంటర్ అటాక్ చేయడంతో టీమిండియా 150 మార్క్ అయినా దాటగలిగింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. 327/3 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. మరో 142 పరుగులు ఆదనంగా చేసి తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలతో చెలరేగారు. భారం మొత్తం అతడిపైనే.. ఇక 151 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడిన టీమిండియాను గట్టెక్కించే భారమంతా సీనియర్ రహానేపైనే ఉంది. ఇంగ్లండ్ పిచ్లపై ఆడిన అనుభవం ఉన్న ఈ వెటరన్ ఆటగాడు కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం మరోసాకి ఏర్పడింది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన రహానే.. తన అనుభవాన్ని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మరో బ్యాటర్ భరత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే బాధ్యతను రహానే తీసుకోవాలి. కనీసం తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులు మార్క్ను భారత జట్టు అందుకుంటే.. ఆసీస్కు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాగా ఈ మ్యాచ్లో రహానేకు ఇప్పటికే ఓ ఛాన్స్ కూడా లభించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కమిన్స్ బౌలింగ్లో రహానే ఎల్బీడబ్ల్యూ అయినా... అదృష్టవశాత్తూ అది నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఈ అవకాశాన్ని రహానే సద్వినియోగపరుచుకుంటాడో లేదో వేచి చూడాలి. చదవండి: WTC Final: వాళ్లకేమో అలా.. మనకెందుకిలా?! -
WTC Final: కేఎస్ భరత్పై నమ్మకం లేదు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు టీమిండియా మేనేజ్మెంట్కు ఓ విషయం పెద్ద సమస్యగా మారింది. ఫైనల్ మ్యాచ్లో వికెట్కీపర్గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై వారు తలలు పట్టుకుని కూర్చున్నారు. ఈ విషయంపై విశ్లేషకులు, మాజీలు, అభిమానులు ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. అయినా మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి స్పందించాడు. తొలుత భారత వికెట్కీపర్గా కేఎస్ భరత్ బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన భజ్జీ.. తాజాగా తన యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ మాట మార్చాడు. భరత్తో పోలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. 4 మ్యాచ్ల్లో కేవలం 101 పరుగులు చేసిన భరత్పై అంత నమ్మకం కలగడం లేదని, అతని కంటే ధాటిగా బ్యాటింగ్ చేయగల ఇషాన్ను ఆడించడమే సమంజసమని అన్నాడు. ఇషాన్కు రిషబ్ పంత్లా అగ్రెసివ్గా ఆడే సామర్థ్యం ఉందని, అతను ఇంత వరకు టెస్ట్ అరంగేట్రం చేయలేదని కారణం చూపి ఆడించకపోతే టీమిండియాకే లాస్ అవుతుందని తెలిపాడు. పైగా ఇషాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మంచి టచ్లో ఉన్నాడని, ఐదు, ఆరు స్థానాల్లో అతను బరిలోకి దిగితే రెండో కొత్త బంతితో ఆడుకుంటాడని పేర్కొన్నాడు. వికెట్కీపింగ్ విషయానికొస్తే తన ఓటు భరత్కే అయినప్పటికీ.. అందుకోసం ఓ బ్యాటర్ను కోల్పోలేమని చెప్పుకొచ్చాడు. ఫైనల్గా డబ్ల్యూటీసీ ఫైనల్కు తన ఛాయిస్ ఇషానే అని చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్లో ఎవరెన్ని గెలిచారు..? -
WTC Final: భరత్ వద్దు.. అతడే బెటర్ ఆప్షన్..!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఎలా ఉండాలో విశ్లేషకులు ఇప్పటి నుంచే అంచనా వేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్.. టీమిండియా ఎలా ఉండాలో తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మెజారిటీ విశ్లేషకులు టీమిండియా ఎలా ఉండాలని అనుకున్నారో, పాంటింగ్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే వికెట్ కీపర్ విషయంలో మాత్రం పాంటింగ్ కాస్త భిన్నంగా స్పందించాడు. కేఎస్ భరత్తో పోలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్, గిల్ ఓపెనింగ్ స్థానాల్లో ఎలాగూ ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఆరో స్థానంలో ఇషాన్ బెటర్ ఛాయిస్ అవుతాడని అన్నాడు. ఓవల్ పిచ్ బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో యాజమాన్యం సైతం ఇషాన్ పేరునే పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు. వేగంగా ఆడటం ఇషాన్కు అదనంగా కలిసొచ్చే అంశమని అన్నాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: ఫామ్లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
వరల్డ్ కప్ కి రిషబ్ పంత్ రీఎంట్రీ ..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఇషాన్ కిషన్ కంటే అతడు ఎంతో బెటర్
ఆస్ట్రేలియాతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే రెండు బ్యాచ్లగా లండన్కు చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్ను షురూ చేసింది. అదే విధంగా ఐపీఎల్-2023 ఫైనల్ ముగిశాక శుబ్మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్లు ఇంగ్లండ్కు చేరుకోనున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో గాయపడిన భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ప్రస్తుత జట్టులో వికెట్ కీపర్లగా కిషన్తో పాటు శ్రీకర్ భరత్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లేయింగ్ ఎలెవన్లో భరత్కు బదులుగా కిషన్కు ఛాన్స్ ఇస్తే మంచింది అని కొంతమంది అభిప్రయాడుతుంటే.. మరికొంతమంది భరత్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో వికెట్ కీపర్గా కిషన్ కంటే భరత్ మంచి ఎంపిక అని కార్తీక్ తెలిపాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్గా కెఎస్ భరత్ను ఎంపిక చేయడం బెటర్. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇప్పటివరకు టెస్టుల్లో ఆడిన అనుభవం లేదు. అతడు తొలిసారి టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. అది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి మ్యాచ్లో ఆడడం చాలా కష్టం. ఈ మ్యాచ్లో భరత్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో మరోసారి ఆకట్టుకుంటాడని ఆశిస్తున్నా" అని ఐసీసీ షేర్ చేసిన వీడియోలో కార్తీక్ చెప్పుకొచ్చాడు. చదవండి: #MS Dhoni: 15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు.. అయినా ప్రతిసారీ ధోని గురించే ఎందుకు? జీవితాంతం: టీమిండియా దిగ్గజం -
కేఎస్ భరతా.. ఇషాన్ కిషనా..? డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్కీపర్ ఎవరు..?
జూన్ 7న ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరనే అంశంపై ఇప్పటి నుంచి డిబేట్లు మొదలయ్యాయి. కేఎస్ భరతా లేక ఇషాన్ కిషనా అన్న విషయంపై బెట్టింగ్లు సైతం జరుగుతున్నాయి. టీమిండియా యాజమాన్యం.. కాస్తో కూస్తో అనుభవం (4 టెస్ట్లు) ఉన్న కేఎస్ భరత్వైపు మొగ్గు చూపుతుందా లేక ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయని ఇషాన్ కిషన్కు అవకాశం ఇస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వికెట్కీపింగ్ వరకు పర్వాలేదని ఇదివరకే నిరూపించుకున్న భరత్ను తుది జట్టులో ఆడిస్తారా లేక వన్డేల్లోనే డబుల్ సెంచరీ (గతేడాది బంగ్లాదేశ్పై) సాధించిన ఇషాన్ కిషన్కు తొలి అవకాశం ఇస్తారా అనే అంశంపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ అంశంపై ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెబుతుండగా.. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం తన మనసులో మాటను బయటపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 మొత్తం ఆడిన భరత్కే డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కుతుందని జోస్యం చెప్పాడు. అదనపు బ్యాటర్ కావాలనిపించినా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటే మంచిదనిపించినా ఇషాన్ కిషన్కు అవకాశం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. ఆఖరి నిమిషంలో సమీకరణలు ఎలా ఉన్నా తన ఫస్ట్ ఛాయిస్ మాత్రం కేఎస్ భరతేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. చదవండి: చెన్నైని ‘ఢీ’కొట్టేదెవరు? -
డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ల వెనుక మనోడే
విశాఖ స్పోర్ట్స్: ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) టైటిల్ పోరులో భారత్ జట్టు వికెట్ కీపర్గా విశాఖకు చెందిన కె.ఎస్.భరత్ ఎంపికయ్యాడు. ప్రస్తుత సీజన్లో తొలిసారిగా టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన ఈ 30 ఏళ్ల కీపర్ బ్యాటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్లు ఆడాడు. ఇవన్నీ భారత్లోనే జరిగాయి. కానీ విదేశీ గడ్డపై జరగనున్న ఈ చాంపియన్ప్లో ఆడేందుకు సెకండ్ ఫ్రంట్లైన్ వికెట్కీపర్గా ఉన్న భరత్కు అనూహ్యంగా అవకాశం అందివచ్చింది. పంత్ గాయపడి అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మంగళవారం ప్రకటించిన భారత్ 15వ మెంబర్ స్క్వాడ్లో వికెట్కీపర్గా అవకాశం దక్కింది. అయితే జట్టులో మరో వికెట్కీపర్ బ్యాటర్ కె.ఎల్.రాహుల్ ఉన్నా.. వికెట్ల వెనుక భరతే నిలిచే అవకాశాలు ఉన్నాయి. లండన్లో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే టైటిల్ పోరులో ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది. భారత్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. మొదటి టెస్ట్లో భరత్ తొలి స్టంపౌట్గా లబుషేన్ను వెనక్కి పంపాడు. సిరీస్లో భాగంగా నాలుగు మ్యాచ్ల్లో తొలి టెస్ట్లో ఓ స్టంపౌట్, ఓ క్యాచ్ పట్టిన భరత్.. మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఆరు క్యాచ్లు పట్టాడు. నాలుగో టెస్ట్లో 44 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్తో మొత్తంగా 101 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 67, ఏడో స్థానంలో వచ్చి 26, ఎనిమిదో స్థానంలో వచ్చి 8 పరుగులు చేశాడు. -
బీసీసీఐ కాంట్రాక్ట్ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు షాక్.. భరత్కు చోటు
BCCI Central Contract 2022-2023- ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించింది. గత ఏడాది ‘ఎ’ గ్రేడ్లో ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రమోషన్ సాధించి ‘ఎ ప్లస్’ గ్రేడ్లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్లో ఉండగా, ఇప్పుడు ‘బి’కి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న అక్షర్ పటేల్కు ‘ఎ’ గ్రేడ్లోకి ప్రమోషన్ లభించింది. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్కు తొలిసారి బోర్డు కాంట్రాక్ట్ (సి గ్రేడ్) దక్కడం విశేషం. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లు తమ కాంట్రాక్ట్లు కోల్పోయారు. కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. -
డబ్ల్యూటీసీ ఫైనల్కు కేఎల్ రాహుల్ వద్దు.. భరత్ సరైనోడు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ పర్వాలేదనపించాడు. తొలి మూడు టెస్టులో పెద్దగా ఆకట్టుకోపోయిన భరత్.. ఆఖరి టెస్టులో మాత్రం 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ విషయం పక్కన పెడితే.. వికెట్ల వెనుక మాత్రం భరత్ అద్భుతంగా రాణించాడు. రివ్యూల విషయంలో కూడా కెప్టెన్ రోహిత్ శర్మకు విలువైన సూచనలు చేశాడు. ఈ నేపథ్యంలోనే భరత్ను ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లోనూ కొనసాగించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొంత మంది అతడి స్థానంలో కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. కాగా ఆసీస్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో అతడు ఆఖరి రెండు టెస్టులకు జట్టులో స్థానం కోల్పోయాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అదరగొట్టాడు. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత జట్టులో రాహుల్ చోటు దక్కడం ప్రస్తుతం ప్రశ్నర్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెఎస్ భరత్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరిన్ని అవకాశాలు టీమిండియా అవకాశాలు ఇవ్వాలని కరీం సూచించాడు. హిందూస్తాన్ టైమ్స్తో కరీం మాట్లాడుతూ.. "డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో ఎవరు ఉంటారన్నది మేనేజ్మెంట్ నిర్ణయిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో భారత జట్టు మేనేజ్మెంట్ చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అది భారత క్రికెట్కు శుభసూచికం. ముఖ్యంగా కేఎస్ భరత్ వంటి ఆటగాడు టీమిండియా తరపున అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే అరంగేట్ర సిరీస్లోనే ఎవరూ అద్భుతాలు సృష్టించలేరు కదా. కాబట్టి కెఎస్ భరత్కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. భారత పరిస్థితుల్లో రాణించడం అంత సులభం కాదు. అతడు స్టంప్ల వెనుక కూడా చాలా చురుకుగా ఉన్నాడు. భరత్ నెమ్మదిగా తన ఆటతీరును మార్చుకుంటున్నాడు. కాబట్టి అతడికి కాస్త సమయం ఇస్తే అతడు అద్భుతాలు సృష్టిస్తాడు. ఒక వేళ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కేఎల్ రాహుల్ ఉన్న భరత్నే వికెట్ కీపర్గా కొనసాగించాలి అని అతడు పేర్కొన్నాడు. కాగా లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7- 11 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. -
WTC Final: భరత్ వద్దు.. అతడే సరైనోడు అంటున్న టీమిండియా దిగ్గజం! ఎందుకిలా?
WTC Final 2023- India Vs Australia: స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ కంగారూ జట్టును ఢీకొట్టబోతోంది. డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్ తుదిపోరులో ఇంగ్లండ్ గడ్డ మీద ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7- 11 వరకు ఇరు జట్ల మ్యాచ్కు ఇప్పటికే ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో కమిన్స్ బృందంతో తలపడే భారత జట్టుపై అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అదరగొట్టిన గిల్ తొలి టెస్టులో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ఈ కర్ణాటక బ్యాటర్ను ఢిల్లీ మ్యాచ్లోనూ కొనసాగించడంతో సెలక్టర్ల తీరుపై విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో మూడో టెస్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఇండోర్ టెస్టులో పెద్దగా రాణించనప్పటికీ ఆఖరిదైన నిర్ణయాత్మక అహ్మదాబాద్ టెస్టులో శతకంతో చెలరేగాడు. విలువైన 44 పరుగులు గిల్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీల కారణంగా చివరి టెస్టును డ్రా చేసుకున్న రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ నాలుగు మ్యాచ్ల సిరీస్తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్.. ఆరంభంలో ఆకట్టుకోలేకపోయినా.. చివరి టెస్టులో 44 విలువైన పరుగులు చేసి డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్గా గిల్, వికెట్ కీపర్గా కేఎస్ భరత్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని.. డబ్ల్యూటీసీ ఫైనల్లో వీరిని కొనసాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సునిల్ గావస్కర్ మాత్రం కేఎల్ రాహుల్ పేరును తెరమీదకు తెచ్చాడు. భరత్ వద్దు.. అతడే సరైనోడు ‘‘ఫైనల్లో రాహుల్ను వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడించవచ్చు. ఓవల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో అతడిని ఆడిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. గతేడాది ఇంగ్లండ్లో రాహుల్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే ఈ మాట అంటున్నాను. లార్డ్స్లో అతడు సెంచరీ సాధించాడు. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టును ఎంపిక చేసేటపుడు తప్పకుండా రాహుల్ పేరును పరిగణనలోకి తీసుకోవాలి’’ అని గావస్కర్ స్పోర్ట్స్తక్తో వ్యాఖ్యానించాడు. ఎందుకు సర్ ఇలా అంటున్నారు? ఇక కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవాలన్న గావస్కర్.. ‘‘ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో కేఎస్ భరత్ ఉంటాడా లేదా అన్నది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయం. అయితే, నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లండ్ పిచ్లపై వికెట్ కీపింగ్ చేయాలంటే కేఎల్ రాహుల్ వంటి అనుభవజ్ఞులు అవసరం. లేదంటే ఇషాన్ కిషన్ పేరును కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే భరత్ కంటే అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు’’ అని పేర్కొన్నాడు. దీంతో గావస్కర్ మాటలపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో.. టెస్టుల్లో అరంగేట్రం చేయని ఇషాన్ను ఆడించాలి.. చాన్నాళ్లుగా విఫలమవుతున్న రాహుల్ను ఎంపిక చేయాలి.. కానీ తనను తాను నిరూపించుకుంటున్న భరత్ను మాత్రం పక్కనపెట్టాలా?’’ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ వివక్ష ఎందుకో అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ పంత్ గతేడాది యాక్సిడెంట్కు గురైన కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో భరత్ బీజీటీ-2023 ద్వారా అరంగేట్రం చేశాడు. చదవండి: ఖరీదైన 6 బెడ్ రూమ్ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..? విలియమ్సన్, సౌతీలకు ఊరట.. ఐపీఎల్ కోసం..! -
IND VS AUS 4th Test Day 4: సువర్ణావకాశాలను చేజార్చుకున్న భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆట చివరి రోజైన రేపు (మార్యి 13) భారత బౌలర్లు ఆసీస్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసి, ఆ తర్వాత నిర్ధేశించబడిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలిగితే సిరీస్తో (3-1) పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు కూడా భారత్ వశమవుతుంది. నాలుగో రోజు చివర్లో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాల కారణంగా, ఆసీస్పై ఇవాల్టి నుంచే పట్టుబిగించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఆ జట్టు తాత్కాలిక ఓపెనర్ మాథ్యూ కుహ్నేమన్ (0) ఇచ్చిన క్యాచ్లను తొలుత కేఎస్ భరత్, ఆతర్వాత పుజారా జారవిడిచారు. ఒకవేళ ఈ రెండు అవకాశాల్లో భారత్కు ఒక్క వికెట్ లభించినా ఆసీస్ను పూర్తిగా ఒత్తిడిలోని నెట్టే అవకాశం ఉండేది. అందులోనే ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఈ సమీకరణలన్నీ భారత్కు కలిసొచ్చి ఉండేవి. భరత్, పుజారాలు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించి ఉండినా పరిస్థితి వేరేలా ఉండేది. భారత్కు గెలుపుపై ధీమా పెరిగేది. ఇప్పటికైన మించిపోయిందేమీ లేదు. ఆఖరి రోజు తొలి బంతిని నుంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి తేగలిగితే, టీమిండియా గెలుపుకు ఢోకా ఉండదు. ఆసీస్ను 150 పరుగుల లోపు ఆలౌట్ చేసి, ఆతర్వాత 60, 70 పరుగుల టార్గెట్ను ఛేదించడం టీమిండియాకు అంత కష్టం కాకపోవచ్చు. అయితే ఇదంతా సాధ్యపడాలంటే భారత స్పిన్నర్లు రేపు తొలి బంతి నుంచే చెలరేగాల్సి ఉంటుంది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇది అంత ఈజీ కూడా కాకపోవచ్చు. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కోహ్లి (186)తో పాటు శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
Ind VS Aus: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇలా ట్రీట్ చేస్తావా? వైరల్
Virat Kohli Death Stare At KS Bharat Viral: కోన శ్రీకర్ భరత్.. ఈ ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో నాగ్పూర్ టెస్టుతో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్ నుంచే తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకున్నాడు భరత్. అయితే బ్యాటర్గా మాత్రం రాణించలేకపోయాడు. అరంగేట్ర టెస్టులో 8, ఢిల్లీ టెస్టులో వరుసగా 6, 23 నాటౌట్.. మూడో మ్యాచ్లో మొత్తంగా 20 పరుగులు మాత్రమే చేశాడు. ఆరోస్థానంలో వచ్చి.. అయితే, నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో భరత్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో దూరం కావడంతో ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు భరత్. రవీంద్ర జడేజా అవుట్ కావడంతో క్రీజులో వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి 50 పరుగుల పైచిలుకు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 1993లో ఇంగ్లండ్తో మ్యాచ్ తర్వాత ఐదో వికెట్కు ఈ మేర పార్ట్నర్షిప్ నమోదు కావడం విశేషం. ఇదే అత్యధిక స్కోరు ఈ క్రమంలో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 136.4వ ఓవర్లో నాథన్ లియోన్ బౌలింగ్లో భరత్ హ్యాండ్స్కాంబ్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 88 బంతుల్లో రెండ ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 44 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్లో భరత్కు ఇదే అత్యధిక స్కోరు. ఇదిలా ఉంటే... 109వ ఓవర్లో టాడ్ మర్ఫీ బౌలింగ్లో కోహ్లి- భరత్ మధ్య సమన్వయం లోపించింది. పరుగు తీసేందుకు కోహ్లి కాల్ ఇవ్వగా.. నిరాకరించిన భరత్ మందకొడిగా కదిలాడు. అప్పటికే పిచ్ మధ్య వరకు వచ్చిన కోహ్లి వేగంగా వెనక్కి పరిగెత్తుకు వెళ్లాడు. కొద్దిలో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భరత్పై సీరియస్ అయిన కోహ్లి దీంతో కోహ్లి కోపం నషాలానికి అంటింది. భరత్ను సీరియస్గా చూస్తూ ఏదో తిట్టినట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘పాపం భరత్.. మరీ ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు కోహ్లి.. మొన్న అలా.. ఇప్పుడిలా? నువ్వు కూడా సింగిల్ విషయంలో చూసుకోవాలి కదా! ప్రతిదానికి ఎదుటివాళ్లను బాధ్యుల్ని చేయడం సరికాదు’’ అని కామెంట్లు చేస్తున్నారు. అది మాత్రం కనిపించలేదా? కాగా సమయంలో 68 పరుగులతో ఉన్న కోహ్లి 155 పరుగులు పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. మరికొందరేమో కోహ్లికి సపోర్టు చేస్తూ.. ‘‘కీలక సమయంలో ఇలాంటి తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే తను అలా స్పందించాడు. అందులో తప్పేముంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను హైలైట్ చేస్తున్నవాళ్లు.. ఆ తర్వాత మెరుగైన ఇన్నింగ్స్ ఆడిన భరత్ను కోహ్లి అభినందించిన దృశ్యాలు కూడా షేర్ చేయాలంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: WTC Final: టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక.. కివీస్ అద్భుతం చేస్తేనే.. Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది! WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్! This is very shameful reaction from Virat Kohli towards youngster KS Bharat Sad to see a youngster being Demotivated by someone's Ego💔pic.twitter.com/ygg3eDhcZl — Immy|| 🇮🇳 (@TotallyImro45) March 12, 2023 Virat Kohli appreciating KS Bharat knock. pic.twitter.com/vbo4nrVe4F — Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2023 Virat Kohli is on song here. Back to back boundaries by him to get to his 150.#INDvAUS #TeamIndia @imVkohli pic.twitter.com/rEHsp7QvG8 — BCCI (@BCCI) March 12, 2023 -
'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్కు కోహ్లి ఆదేశం
అహ్మదాబాద్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆటలో కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా 300 పరుగుల మార్క్ను అందుకుంది. సెంచరీ భాగస్వామ్యంతో పటిష్టంగా తయారైన ఖవాజా, గ్రీన్ జోడిని విడదీయడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 112 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఖవాజా 138, గ్రీన్ 71 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. తొలిరోజు ఆటలో భాగంగా కోహ్లి కేఎస్ భరత్పై సీరియస్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజా పట్ల భరత్ తీరును తప్పుబడుతూ అతన్ని క్షమాపణ కోరమని ఆదేశించాడు. కోహ్లి తప్పుబట్టేలా కేఎస్ భరత్ ఏం చేశాడో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ వార్త చదివేయండి. తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 71వ ఓవర్ షమీ వేశాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులతో ఆడుతుంది. ఖవాజా క్రీజులో ఉన్నాడు. షమీ వేసిన బౌన్సర్ను ఖవాజా తప్పించుకోవడంతో బంతి కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో పడింది. అయితే బంతిని షమీకి విసిరే ప్రయత్నంలో ఖవాజా చేతి వేలికి బలంగా తాకింది. దీంతో వెనక్కి తిరిగిన ఖవాజా..ఇదేంటి అన్నట్లుగా చూశాడు. భరత్ చర్యను తప్పుబట్టిన కోహ్లి.. వెళ్లి క్షమాపణ చెప్పు అని పేర్కొన్నాడు. దీంతో ఖవాజా దగ్గరికి వెళ్లిన కేఎస్ భరత్ అతన్ని క్షమాపణ కోరాడు. ''పర్లేదు.. కానీ కొంచెం పైనుంచి విసిరితే సరిపోయేది'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక నాలుగో టెస్టులో ఖవాజా సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. అతనికి టెస్టుల్లో ఇది 14వ సెంచరీ అయినప్పటికి టీమిండియాపై ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. అందుకే తొలిరోజు ఆట ముగియగానే ఖవాజా మాట్లాడుతూ ఎమెషనల్ అయ్యాడు. ''ఈ సెంచరీ చాలా విలువైనది.. గతంలో రెండుసార్లు టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను.. జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ ఈసారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నా. ఈ సెంచరీ నాకు ప్రత్యేకమైనది'' అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. pic.twitter.com/7TTea4zG4t — MAHARAJ JI (@MAHARAJ96620593) March 9, 2023 చదవండి: బ్యాటింగ్లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్లో ఇదే తొలిసారి పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత -
ఎంత పని చేశావు భరత్.. ఈజీ క్యాచ్ డ్రాప్! వీడియో వైరల్
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియంకు వచ్చారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, హెడ్లు భారత పేసర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. కాగా 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వదిలేయడంతో హెడ్ బతికిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఐదో బంతిని హెడ్ ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అయితే సునాయాస క్యాచ్ను అందుకోవడంలో భరత్ విఫలమయయ్యాడు. ఇక భరత్ విడిచి పెట్టిన క్యాచ్కు టీమిండియా ఎంత మూల్యం చెల్లించుకుంటుందో వేచి చూడాలి. తుది జట్లు భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్) శుబ్మన్ గిల్ ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), పీటర్ హ్యాండ్స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్కీపర్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియాన్ -
ఇషాన్ కిషన్ వద్దు.. కేఎస్ భరత్ను పక్కకు పెట్టొద్దు, కోహ్లి, పుజారా ఏం చేశారని..?
BGT 2023 IND VS AUS 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉండబోతున్నదానిపై మేనేజ్మెంట్ ఇప్పటికే కొన్ని సంకేతాలు వదిలింది. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుందని, సిరాజ్ స్థానంలో షమీ, వికెట్కీపర్ కేఎస్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉంటారని కోచ్ రాహుల్ ద్రవిడే పరోక్షంగా క్లూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వికెట్కీపర్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్కు ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. నాలుగో టెస్ట్లో భరత్ను పక్కకు పెట్టొదని జట్టు మేనేజ్మెంట్కు సూచించాడు. ఇషాన్ కిషన్ ప్రస్తావన తేకుండా భరత్ను తుది జట్టులో కొనసాగించాలని కోరాడు. బ్యాట్తో రాణించలేదన్న కారణంగా భరత్ను పక్కకు పెట్టడం సహేతుకం కాదని, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, పుజారా, శ్రేయస్ అయ్యర్ ఫెయిలైన చోట భరత్ బ్యాట్తో రాణించాలని ఆశించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. Do you agree with Aakash Chopra?#CricTracker #AakashChopra #INDvAUS pic.twitter.com/aiFlSw6u0M — CricTracker (@Cricketracker) March 8, 2023 ఢిల్లీ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. బ్యాట్తో ప్రతి ఇన్నింగ్స్లో రాణించడలేదని భరత్ను బెంచ్కు పరమితం చేస్తే, ఇంతకు మించిన అపహాస్యం ఇంకోటి ఉండదని అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే భరత్ వికెట్ల వెనక ఔట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడని, బ్యాట్తో ప్రూవ్ చేసుకునేందుకు అతనికి మరికొన్ని అవకాశాలు ఇస్తే మెరుగవుతాడని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, నాలుగు మ్యాచ్ల BGT 2023లో ఇప్పటివరకు జరిగిన 3 టెస్ట్ల్లో భారత్ 2 (తొలి రెండు), ఆసీస్ ఒక మ్యాచ్ (మూడో టెస్ట్) గెలుపొందిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్ల్లో గెలిచి జోరుమీదుండిన భారత్.. అనూహ్యంగా మూడో టెస్ట్లో ఓటమిపాలై చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్లో నాథన్ లయోన్ 11 వికెట్లతో పేట్రేగిపోవడంతో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్ట్ల్లో బ్యాటింగ్లో పర్వాలేదనిపించిన భారత్.. మూడో టెస్ట్లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్లో లయోన్ వీరలెవెల్లో విజృంభించడంతో (8/64) 163 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (197) పరిమితమైన ఆసీస్.. టీమిండియా నిర్ధేశించిన 78 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు భారత్.. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 132 తేడాతో, రెండో టెస్ట్లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ను మట్టికరిపించింది. నాలుగో టెస్ట్ అనంతరం భారత్, ఆసీస్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే 19న విశాఖలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతుంది. -
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. భరత్కు నో ఛాన్స్! కిషన్ అరంగేట్రం
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. ఇండోర్ టెస్టులో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తిగా తేలిపోయింది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో విజయం సాధించి.. సిరీస్తో పాటు ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అరంగేట్ర సిరీస్లో దారుణంగా విఫలమైన ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ను నాలుగో టెస్టుకు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో మరో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టెస్టు అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. కాగా వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో అందరని అకట్టుకున్న భరత్.. బ్యాటింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్లు ఆడిన భరత్.. వరుసగా 8, 6, 23(నాటౌట్), 17, 3, మొత్తం 57 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు పడడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు మూడో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్ టెస్టుకు సిరాజ్కు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో జట్టు మెనెజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం -
మీ ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉంది సర్: కేఎస్ భరత్
ఆంధ్రా వికెట్కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ ఎట్టకేలకు టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు తుది జట్టులో భరత్కు చోటు దక్కడంతో అతడి రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారత వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదగా టీమిండియా క్యాప్ను భరత్ అందుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన భరత్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపిన విషయం విధితమే. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జగన్ ఆకాంక్షించారు. సీఎం జగన్ ట్వీట్కు రిప్లే ఇచ్చిన భరత్ సీఎం జగన్ చేసిన ట్వీట్కు కేఎస్ భరత్ రిప్లే ఇచ్చాడు." మీ అభినందనలు, ఆశీస్సులను అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎల్లవేళలా కష్టపడుతూ దేశానికి, తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకు వస్తాను" అని భరత్ బదులు ఇచ్చాడు. చదవండి: IND vs AUS: ఈజీ క్యాచ్ ఇచ్చిన రాహుల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్ Very humbled and blessed to receive your appreciation and blessings Sir 🙏🏻 Will always work hard and make our India and Telugu Flag fly higher 🇮🇳@ysjagan https://t.co/18Bx8r0aXt — KonaSrikarBharat (@KonaBharat) February 9, 2023 -
వారెవ్వా భరత్.. ధోనిని గుర్తుచేసేలా స్టంపౌట్! వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అరంగేట్ర టెస్టులోనే తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో అందరిని అకట్టుకుంటున్నాడు. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో భరత్ అద్భుతమైన స్టంపౌట్తో మెరిశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుషేన్ను మెరుపు వేగంతో స్టంప్ చేసి పెవిలియన్కు పంపాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 36 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్లో ఐదో బంతికి లాబుషేన్ ఫ్రంట్ఫుట్కు వచ్చి కవర్డ్రైవ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ భరత్ చేతికి వెళ్లింది. బంతిని అందుకున్న భరత్ రెప్పపాటు వేగంలోనే బెయిల్స్ను పడగొట్టాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. పలు కోణాల్లో పరీశీలించిన థర్డ్ అంపైర్.. లాబుషేన్ క్రీజుకు దూరంగా ఉండటంతో ఔట్గా ప్రకటించాడు. దీంతో 49 పరుగులు చేసిన లాబుషేన్ పెవిలియన్కు చేరక తప్పలేదు. భరత్ స్టంపింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని భరత్ గుర్తుచేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ KS Bharat: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ శుభాకాంక్షలు KS Bharat Wicket no 3#BorderGavaskarTrophy #kholi#smith pic.twitter.com/PxpiOgzRIh — Days since kohli hundred (@viratkafann) February 9, 2023 -
అమ్మను హత్తుకున్న మధురజ్ఞాపకం! ఆయన వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం
India vs Australia, 1st Test- KS Bharat: ‘‘నేను ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి వరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. సుదీర్ఘ ప్రయాణంలో.. ఇప్పుడిలా.. నా టెస్టు జెర్సీని చూసిన క్షణాలు అత్యంత విలువైనవి. నాకిది గర్వకారణం! ఈ ప్రయాణం భావోద్వేగాలతో కూడుకున్నది’’ అంటూ వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ ఉద్వేగానికి లోనయ్యాడు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యుల నడుమ టీమిండియా క్యాప్ అందుకున్న భరత్.. తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన వల్లే ఇదంతా.. ఈ నేపథ్యంలో భరత్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ‘‘నేనిక్కడివరకు వచ్చానంటే అందుకు కారణం మా కోచ్ జై క్రిష్ణారావు. నాపై నాకు నమ్మకం లేని సమయంలో ఆయన నాపై విశ్వాసం ఉంచారు. నిజానికి నాపై నాకంటే ఆయనకే ఎక్కువ నమ్మకం. ఆయన వల్లే ఇదంతా! ఒక్కరోజులో ఇదేమీ సాధ్యం కాలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను. 2018లో ఇంగ్లండ్తో ఇండియా-ఏ తరఫున ఆడినపుడు రాహుల్ సర్ నన్ను మొదటిసారి చూశారు. చాలా సేపు మేము మాట్లాడుకున్నాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటమే నాకు ముఖ్యం. నేనెప్పుడూ అలాగే ఆలోచించాలని ఆయన నాతో చెబుతూ ఉంటారు’’ అని 29 ఏళ్ల కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ KS Bharat: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ శుభాకాంక్షలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Ind Vs Aus: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ ట్వీట్
CM YS Jagan Tweet On KS Bharat Debut: భారత క్రికెట్ జట్టులో కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా భరత్ ఫొటో షేర్ చేస్తూ అభినందనలు తెలియజేశారు. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో గురువారం ఆరంభమైన తొలి టెస్టుతో ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. భరత్తో పాటు టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున తొలి టెస్టు ఆడుతున్నాడు. Our very own @KonaBharat is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him. The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF — YS Jagan Mohan Reddy (@ysjagan) February 9, 2023 శ్రీకర్ భరత్ గురించి ఆసక్తికర విషయాలు ►ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన శ్రీకర్ భరత్ 1993, అక్టోబరు 3న జన్మించాడు. ►2012లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడు అరంగేట్రం చేశాడు. ►29 ఏళ్ల శ్రీకర్ భరత్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటున్నాడు. ►2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్లో భరత్ 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్ సెంచరీ సాధించి.. రంజీల్లో ఈ ఘనత సాధించిన తొలి కీపర్గా నిలిచాడు. ఐపీఎల్లో.. ►దూకుడైన బ్యాటర్గా పేరొందిన శ్రీకర్ భరత్ను ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. 20 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అంతకుముందు అతడు ఢిల్లీ డేర్డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ►ఐపీఎల్-2021 సీజన్లో కోహ్లి కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భరత్ 191 పరుగులు సాధించాడు. ►ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించాడు. ►ఐపీఎల్-2023 వేలంలో గుజరాత్ టైటాన్స్ భరత్ను కొనుగోలు చేసింది. 1.2 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. అప్పుడు ఎంపికైనా.. 2021లో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో భరత్కు మొదటిసారి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. రెండో మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా.. ఇటీవల బంగ్లాదేశ్తో పర్యటన సందర్భంగా టెస్టు జట్టుకు ఎంపికైనా.. రెండు మ్యాచ్లలోనూ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న భరత్.. ఎట్టకేలకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టెస్టుతో జాతీయ జట్టు తరపున ఆడుతుండటం విశేషం. చదవండి: T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం Debut in international cricket for @KonaBharat 👍 👍 A special moment for him as he receives his Test cap from @cheteshwar1 👌 👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/dRxQy8IRvZ — BCCI (@BCCI) February 9, 2023 -
KS Bharat: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు
Ind Vs Aus 1st Test Playing XI: టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు ఫలించింది. అదే విధంగా జాతీయ జట్టుకు ఆడాలన్న ఆంధ్ర రంజీ ప్లేయర్ కోన శ్రీకర్ భరత్ చిరకాల ఆకాంక్ష నెరవేరింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరు అరంగేట్రం చేశారు. గిల్కు మొండిచేయి.. ఓపెనర్గా రాహుల్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో గురువారం ఆరంభమైన తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. సహచరుల కరతాళ ధ్వనుల నడుమ టీమిండియా క్యాప్ అందుకుని మురిసిపోతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక తొలి టెస్టులో ఇక కేఎస్ భరత్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. కేఎల్ రాహుల్.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనింగ్ చేయనున్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు మొండిచేయే ఎదురైంది. టాస్ ఓడి ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. ఇద్దరు పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్తో బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఈ సిరీస్ మాకు అత్యంత ముఖ్యమైనది ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము టాస్ గెలిస్తే కచ్చితంగా బ్యాటింగే ఎంచుకునే వాళ్లం. పిచ్ కాస్త పొడిగా అనిపిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనిపిస్తోంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్వభావం బోధపడుతుంది. ఈ సిరీస్ మాకు అత్యంత ముఖ్యమైనది.. గత ఐదారురోజులుగా మేము నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చాం. పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈ మ్యాచ్లో మేము ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. భరత్, సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేస్తున్నారు’’ అని వెల్లడించాడు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు తుది జట్లు: టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్ Debut in international cricket for @KonaBharat 👍 👍 A special moment for him as he receives his Test cap from @cheteshwar1 👌 👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/dRxQy8IRvZ — BCCI (@BCCI) February 9, 2023 As @KonaBharat gets set for the biggest day in his life, the Test debutant recalls his long journey to the top 👍 👍 - By @RajalArora FULL INTERVIEW 🎥 🔽 #TeamIndia | #INDvAUS https://t.co/BLCpG0eOns pic.twitter.com/mih3f2AdIk — BCCI (@BCCI) February 9, 2023 SKY makes his TEST DEBUT as he receives the Test cap from former Head Coach @RaviShastriOfc 👏 👏 Good luck @surya_14kumar 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/JVRyK0Vh4u — BCCI (@BCCI) February 9, 2023 -
అలా అయితే టీమిండియా భారీ మూల్యం చెల్లించకతప్పదు: పాక్ మాజీ కెప్టెన్
India Vs Australia - BGT 2023: రిషబ్ పంత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న అంశంపై క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ల రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లు ఉండగా.. మేనేజ్మెంట్ ఎవరివైపు మొగ్గుచూపుతుందోనన్న ఆసక్తి పెరిగింది. కాగా, దేశవాళీ క్రికెట్లో తమ జట్టు తరఫున రెగ్యులర్గా కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఆంధ్ర ఆటగాడు భరత్. అతడు ఈ సిరీస్తో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కీలక సిరీస్ నేపథ్యంలో సీనియర్, వైస్ కెప్టెన్ రాహుల్కే కీపర్గా అవకాశం ఇస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పార్ట్ టైమ్ వికెట్ కీపర్ను నమ్ముకుంటే టీమిండియా భారీ మూల్యం చెల్లించకతప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘పిచ్ స్వభావం గురించి పక్కన పెడితే.. టెస్టు మ్యాచ్లో పార్ట్ టైమ్ వికెట్ కీపర్తో ప్రయోగాలు చేయకూడదు. ఈ తప్పిదం కారణంగా మ్యాచ్ మాత్రమే కాదు.. ఏకంగా సిరీస్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. రెగ్యులర్గా కీపింగ్ చేసే వ్యక్తిని కాదని వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. కాగా కేఎస్ భరత్కు వికెట్ కీపర్గా తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. చదవండి: BGT 2023: ఆసీస్తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఇషాన్ కిషన్..! Rohit Sharma: 'పిచ్పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి' WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం!
నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి9 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అయితే తొలి టెస్టుకు ముందు జట్టు కూర్పు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వికెట్ కీపర్ ఎవరని ఎంపిక చేయాలన్న విషయంలో జట్టు మెనేజెమెంట్ తర్జన భర్జన అవుతోంది. ఎందుకంటే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆసీస్తో టెస్టు సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను తొలిసారి టెస్టులకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా దాదాపు రెండేళ్ల నుంచి టెస్టు అరేంగట్రం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్కు కూడా ఆసీస్తో టెస్టు జట్టులో చోటు దక్కింది. భరత్ గత కొంత కాలంగా జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కడం లేదు. ఇక భారత స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ మరో వికెట్ కీపర్గా జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం కేఎల్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పే సూచనలు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో వికెట్ కీపర్గా కిషన్ కంటే శ్రీకర్ భరత్వైపే జట్టు మెనేజెమెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. శ్రీకర్ భరత్ అరంగేట్రం.. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయం అన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు భారత తుది జట్టులో భరత్ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లగా కేఎల్ రాహుల్ అనేక సార్లు గాయాల బారిన పడ్డాడు. కాబట్టి టెస్టుల్లో వికెట్ కీపింగ్ అతడికి సరికాదు. టెస్టులకు స్పెషలిస్టు వికెట్ కీపర్లు అవసరం. ప్రస్తుతం జట్టులో భరత్, ఇషాన్ కిషన్ స్పెషలిస్టు వికెట్ కీపర్లగా ఉన్నారు. అయితే వీరిద్దరిలో భరత్కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు. న్యూజిలాండ్పై తొలి సారిగా.. 2021లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భరత్కు తొలి సారిగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో సబ్స్ట్యూట్గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో అందరిని అకట్టుకున్నాడు.అదే విదంగా ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా భరత్కు చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్లకు కూడా బెంచ్కే పరిమితమ్యాడు. ఇక భరత్కు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. చదవండి: SA20: క్లాసెన్ సూపర్ సెంచరీ.. 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ భారీ విజయం -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పంత్ దూరం! ఆంధ్రా ఆటగాడు అరంగేట్రం..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే అతడు పూర్తి స్థాయిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్కు దూరం కావడం దాదాపు ఖాయమనిపిస్తోంది. దీంతో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా ఆస్ట్రేలియా సిరీస్ సమయానికి సిద్దంగా ఉండాలని భరత్కు బీసీసీఐ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా భారత జట్టుకు భరత్ ఎంపిక అవుతున్నప్పటికీ.. కేవలం బ్యాకప్ వికెట్ కీపర్గా మాత్రమే ఉండిపోయాడు. 2021లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భరత్కు తొలి సారిగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో సబ్స్ట్యూట్గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో అందరిని అకట్టుకున్నాడు. అదే విదంగా ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా భరత్కు చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్లకు కూడా బెంచ్కే పరిమితమ్యాడు. ఇక భరత్కు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కూడా భరత్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇషాన్ కిషన్ టెస్టు ఎంట్రీ.. బంగ్లాదేశ్పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు భరత్కు బ్యాక్ఆప్ వికెట్ కీపర్గా కిషన్ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశంలో భారత జట్టు నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్లో భారత్ విజయం సాధిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంటుంది. చదవండి: Rishabh Pant: ఐసీయూ నుంచి ప్రైవేటు గదికి రిషభ్ పంత్.. కారణమిదే? -
బంగ్లాదేశ్లో పర్యటించే టీమిండియా ఇదే.. తెలుగు ఆటగాడికి అవకాశం
IND Tour OF BAN 2022: 3 వన్డేలు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఈ ఏడాది డిసెంబర్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో పర్యటించనుంది. డిసెంబర్ 4 నుంచి 26 వరకు సాగే ఈ పర్యటన కోసం సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించింది. ఈ పర్యటనకు ముందు జరిగే న్యూజిలాండ్ టూర్కు రెస్ట్ తీసుకునే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టుతో చేరతారు. బంగ్లా పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్లకు రోహిత్, కేఎల్ రాహుల్లు కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. టెస్ట్ జట్టులో తెలుగు ఆటగాడు, వికెట్కీపర్ కమ్ బ్యాటర్ కేఎస్ భరత్కు అవకాశం దక్కగా.. మరో తెలుగు ఆటగాడు హనుమ విహారికి ఉద్వాసన పలికారు. కాగా, ఈ పర్యటనలో భారత్ తొలుత వన్డే సిరీస్ ఆతర్వాత టెస్ట్ సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 14, డిసెంబర్ 22 తేదీల్లో టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. బంగ్లాదేశ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్ బంగ్లాదేశ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్ -
Ind A vs NZ A: న్యూజిలాండ్తో సిరీస్.. కెప్టెన్గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన
New Zealand A tour of India, 2022- Unofficial ODI Series- Sanju Samson: న్యూజిలాండ్- ఏ జట్టుతో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్ల సిరీస్కు కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు తెలిపింది. కేఎస్ భరత్, తిలక్ వర్మ ఈ జట్టులో కూడా! ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన 16 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టులో తెలుగు క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్కు స్థానం దక్కింది. అదే విధంగా హైదరాబాదీ తిలక్ వర్మను కూడా ఈ జట్టుకు ఎంపిక చేశారు. కాగా వీరిద్దరు టెస్టు జట్టుకు కూడా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సైతం ఈ వన్డే జట్టులో భాగంగా ఉన్నాడు. కాగా మూడు టెస్టు, మూడు వన్డేల అనధికారిక సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ఏ జట్టు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా.. తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో టెస్టు రెండో రోజు(శుక్రవారం) ఆట కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్ తర్వాత సెప్టెంబరు 22, 25, 27 తేదీల్లో వన్డే సిరీస్లో భారత ఏ జట్టు.. కివీస్ ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ తమిళనాడులోని చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022కు ప్రకటించిన జట్టులో కనీసం స్టాండ్ బై ప్లేయర్గా కూడా సంజూకు అవకాశం దక్కలేదన్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐపై సంజూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఏ’ జట్టుకు అతడిని కెప్టెన్గా నియమించడం పట్ల స్పందిస్తూ.. ‘బాగానే కవర్ చేశారులే’ అంటూ మరోసారి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఇండియా- ఏ జట్టు: సంజూ శాంసన్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైనీ, రాజ్ అంగద్ బవా. చదవండి: కోహ్లి, రోహిత్లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని.. వెంకటేశ్ అయ్యర్కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్ వచ్చినప్పటికీ! -
ఐపీఎల్ మెగా వేలంలో రాజోలు కుర్రాడు
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు బండారు అయ్యప్ప అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున వేలం బరిలో నిలిచిన అయ్యప్పను 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే, అయ్యప్పకు ఇంతవరకు లీగ్లో అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. 2011 నుంచి ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 29 ఏళ్ల అయ్యప్ప.. 2015–16 రంజీ సీజన్లో ముంబై జట్టుపై ఆరు వికెట్లు తీసి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దీంతో అతనికి 2018–19లో ఇండియా బ్లూ జట్టు నుంచి ఆహ్వానం లభించింది. మీడియం పేస్ బౌలర్గా, రైట్ హ్యాండ్ బ్యాటర్గా రాణిస్తున్న అయ్యప్ప, త్వరలో జరగనున్న వేలంలో భారీ ధర సొంతం చేసుకోవాలని ఆ ప్రాంతవాసులు ఆకాంక్షిస్తున్నారు. కెరీర్లో ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 31 లిస్ట్ ఏ మ్యాచ్లు, 37 టీ20లు ఆడిన అయ్యప్ప.. మొత్తం 167 వికెట్లు పడగొట్టాడు. వేలం బరిలో ఉన్న ఇతర తెలుగు క్రికెటర్ల విషయానికొస్తే.. హైదరాబాద్కు చెందిన భావనక సందీప్(ఎస్ఆర్హెచ్), రామచంద్రాపురంకు చెందిన కేఎస్ భరత్(ఆర్సీబీ), వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన హరిశంకర్ రెడ్డి(సీఎస్కే)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతేడాది ఐపీఎల్లో వీరిని కనీస బేస్ ధర 20 లక్షలకు ఆయా జట్లు సొంతం చేసుకున్నాయి. త్వరలో జరిగే మెగా వేలంలో వీరంతా భారీ ధర ఆశిస్తున్నారు. వీరిలో ఒక్క కేఎస్ భరత్కు మాత్రమే ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. 2021 సీజన్లో భరత్ ఆర్సీబీ తరఫున 8 మ్యాచ్లు ఆడి 122కు పైగా స్ట్రయిక్ రేట్తో 191 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఈసారి వేలంలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరిలో 370 మంది భారత క్రికెటర్లు కాగా, 220 మంది విదేశీయులు ఉన్నారు. చదవండి: IPL 2022: అందుకే ఐపీఎల్ మెగా వేలానికి దూరం: స్టార్ ప్లేయర్ -
KS Bharat: మరోసారి శ'చి'తక్కొట్టిన ఆంధ్రావాలా..
KS Bharat Blazing Hundred Against Gujarat: విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో ఐపీఎల్ స్టార్లు(దేశీయ ఆటగాళ్లు) రెచ్చిపోతున్నారు. వరుస సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఐపీఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) 5 మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలతో విధ్వంసం సృష్టించగా.. తాజాగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు, ఆంధ్రా బ్యాటర్ కేఎస్ భరత్ టోర్నీలో వరుసగా రెండో భారీ శతకం(138 బంతుల్లో 156; 16 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు సవాల్ విసిరాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్.. కెప్టెన్ భరత్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ ఆంధ్ర బౌలర్ల ధాటికి 172 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆంధ్ర జట్టు 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇదిలా ఉంటే, విజయ్ హజారే ట్రోఫీ 2021లో కేఎస్ భరత్కు ఇది వరుసగా రెండో సెంచరీ. అంతకుముందు, హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో భరత్ 109 బంతుల్లో 16 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 161 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన భరత్ 2 సెంచరీల సాయంతో 370 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో రుతురాజ్(5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 603 పరుగులు), భరత్తో పాటు మరో ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్(5 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 349 పరుగులు) కూడా రాణిస్తున్నాడు. చదవండి: బ్రేక్ తీసుకోవచ్చు.. కానీ.. ! రోహిత్, కోహ్లిలపై విరుచుకుపడ్డ భారత మాజీ కెప్టెన్ -
‘శత’క్కొట్టిన శ్రీకర్ భరత్.. అశ్విన్ సెంచరీ.. ఆంధ్ర జట్టు విజయం
Vijay Hazare Trophy: Andhra Beat Himachal Pradesh Hyderabad Lost To Uttar Pradesh: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్తో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది. భారత జట్టు రిజర్వ్ వికెట్ కీపర్, ఆంధ్ర జట్టు కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 109 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్లతో 161 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ (132 బంతుల్లో 100; 10 ఫోర్లు) కూడా సెంచరీ సాధించాడు. ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు సాధించింది. అనంతరం 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి నాలుగు వికెట్లు తీశాడు. మళ్లీ ఓడిన హైదరాబాద్ మరోవైపు మొహాలీలో ఉత్తరప్రదేశ్తో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఏడు వికెట్లతో ఓడింది. తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 42.5 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. చదవండి: Vijay Hazare Trophy MP VS CG: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీసిన వెంకటేశ్ అయ్యర్ -
విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం..
KS Bharat Slams Century In Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో దేశీయ ఐపీఎల్ స్టార్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఈ దేశవాళీ టోర్నీలో ఐపీఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) హ్యాట్రిక్ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు, మధ్యప్రదేశ్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ రెండు సూపర్ శతకాలతో శివాలెత్తాడు. తాజాగా ఆర్సీబీ ఆటగాడు, ఆంధ్రా బ్యాటర్ కేఎస్ భరత్ సైతం భారీ శతకం(161) సాధించి.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సత్తా చాటాడు. హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో భరత్ 109 బంతుల్లో 16 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 161 పరుగులు సాధించాడు. భరత్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతనిపై కన్నేశాయి. గత ఐపీఎల్ వేలంలో బేస్ ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో భారీ ధర పలికే అవకాశం ఉంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించిన ఈ ఆంధ్రా కుర్రాడు ఒక్క మ్యాచ్తో హీరోగా మారిపోయాడు. వికెట్కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన భరత్.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్గా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: Venkatesh Iyer: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీశాడు.. -
Ind Vs NZ 1st Test: ఏం ఆడుతున్నావయ్యా.. ఇకనైనా భరత్ను తీసుకుంటారా?
Twitter reacts after Wriddhiman Saha was dismissed against New Zealand: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. రెండో రోజు ఆటలో భాగంగా 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా నిష్క్రమించగా 88వ ఓవర్లో సాహా క్రీజులోకి వచ్చాడు. కివీస్ బౌలర్ సౌథీ బౌలింగ్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ.. అతడు 93వ ఓవర్లో ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక పరుగు సాధించి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో సాహా ఆట తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సాహాను జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో కేఎస్ భరత్ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘ఏం ఆడుతున్నావయ్యా! ఆటపై కాస్త దృష్టి పెట్టు! సాహాను ఇంకా జట్టులో కొనసాగించడం ఎందుకు? ఇప్పటికైనా అతడిని కాదని రిషభ్ పంత్ను ఎందుకు తీసుకుంటారో అర్థమవుతోందా! సాహా ఫామ్లో లేడు కదా! బైబై చెప్పేయండి! సాహాకు బదులు కేఎస్ భరత్ను జట్టులోకి తీసుకోండి!’’ అని ట్రోల్ చేస్తున్నారు. కాగా రిషభ్ పంత్కు విశ్రాంతినివ్వడంతో... తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ను న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: అరంగేట్ర మ్యాచ్లో రికార్డులు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. Throw out that Saha from team and play with KS Bharat . — Sowmya (@SowmyaVirat18) November 26, 2021 Why is W saha still in the team ? #indvs — Name cannot be blank (@infinity9191) November 26, 2021 #saha pic.twitter.com/p9EEwBGAjX — Cricket 🏏 memes 😁 (@Lakshay48215862) November 26, 2021 Time for India to move away from Saha even as a backup keeper, he is the best "Wicket-keeper" but time to give that backup option to KS Bharat or someone to groom from the Sri Lanka Test series. — Johns. (@CricCrazyJohns) November 26, 2021 -
IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు
Match Won By Last-ball Six IPL History.. క్రికెట్ మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎంఎస్ ధోని ఆఖరిబంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్ అందించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ ఒక్క సిక్స్ అభిమానుల్లో ధోని పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసింది. అలా లాస్ట్బాల్ సిక్స్ కొట్టడం అంతకముందు జరిగాయి.. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కీలక మ్యాచ్లో ఆఖరి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్లోనూ చాలానే చూశాం. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లోనూ ఇలాంటివే పునరావృతమవుతున్నాయి. అందులో ఒక మూడు మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోతాయి. అవేంటో చూద్దాం. కెఎస్ భరత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2021 Courtesy: IPL Twitter తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి ఆర్సీబీకి ఉత్కంఠ విజయాన్ని కట్టబెట్టాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. అయితే భరత్ మొదట డివిలియర్స్, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి ఇన్నింగ్స్ నడిపించాడు. ఇక ఆఖరి ఓవర్లో ఆర్సీబీ గెలుపుకు 15 పరుగులు అవసరమయ్యాయి. మొదటి ఐదు బంతుల్లో ఆవేశ్ ఖాన్ 9 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఒత్తిడిలో ఆవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో ఈక్వేషన్ ఒక బంతికి ఐదు పరుగులుగా మారింది. ఈ దశలో ఆవేశ్ ఖాన్ వేసిన లో ఫుల్టాస్ను భరత్ లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్గా ఆర్సీబీ- డీసీ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్లో కేఎస్ భరత్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఎంఎస్ ధోని( రైజింగ్ పుణే సూపర్ జెయింట్, 2016) Courtesy: IPL Twitter ఎంఎస్ ధోని అంటే మొదటగా గుర్తుకు వచ్చే పదం మ్యాచ్ ఫినిషర్. అయితే ఎంఎస్ ధోని ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్పై ఆఖరిబంతికి సిక్స్ కొట్టి గెలిపించాడు. కానీ 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరపున పంజాబ్ కింగ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆఖరి బంతికి ధోని సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆ మ్యాచ్లో 173 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ధోనితో పాటు అశ్విన్ ఉన్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో ధోని స్ట్రైక్ తీసుకున్నాడు. తొలి బంతికి పరుగు రాలేదు. ఐదు బంతుల్లో 23 పరుగులు. అక్షర్ వైడ్ వేశాడు. అయితే ఆ తర్వాత అక్షర్ వేసిన నాలుగు బంతులను ధోని వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే పుణే విజయానికి ఆఖరి బంతికి సిక్స్ కావాలి. అక్షర్ పటేల్ ఫుల్ డెలివరీ వేశాడు. అంతే ధోని ఫ్రంట్ఫుట్ వచ్చి మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టడంతో రైజింగ్ పుణే జట్టులో సంబరాలు షురూ అయ్యాయి. డ్వేన్ బ్రావో(చెన్నై సూపర్కింగ్స్, 2012) Courtesy: IPL Twitter ఐపీఎల్ చరిత్రలో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన తొలి బ్యాటర్గా డ్వేన్ బ్రావో నిలిచాడు. 2012లో లీగ్ దశలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో బ్రావో ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. ధోనితో పాటు బ్రావో క్రీజులో ఉన్నాడు. రజత్ బాటియా వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి బ్రావో సింగిల్ తీశాడు. రెండో బంతికి ధోని బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేయడంతో సీఎస్కేకు ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో బాటియా వేసిన ఫుల్టాస్ డెలివరీని లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదడంతో సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు జరుపుకుంది. -
'ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది ఎన్నో ఏళ్ల కల'
KS Bharart... ఐపీఎల్ లీగ్ చివరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు విశాఖ కుర్రాడు శ్రీకర్ భరత్. కోహ్లీతో సహా మరో ఓపెనర్ ఆరుపరుగుల స్కోర్కే పెవిలియన్కు చేరిన దశలో టాప్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మరుపురాని ఇన్నింగ్స్తో వికెట్ కీపర్ భరత్ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ మ్యాచ్లో భరత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భరత్ షార్జా నుంచి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడాడు. Courtesy: IPL Twitter ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఎన్నో ఏళ్ల నుంచి కల కంటున్నానని చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి ఐదు పరుగులు కావల్సిన స్థితిలో లాంగ్ఆన్ మీదుగా భారీ సిక్సర్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయల్స్పై 44, ముంబైపై 32, సన్రైజర్స్పై 12 పరుగులు చేసిన భరత్ లీగ్ చివరి మ్యాచ్లో(78నాటౌట్) మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది తానేంటో చూపించి విశాఖ కీర్తిని ఇనుమడింపజేశాడు. నాకవుట్లో 11న నైట్రైడర్స్తో షార్జాలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతున్నాడు. Courtesy: IPL Twitter చదవండి: KS Bharat: కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం Virat Kohli Celebration: సిక్స్తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ -
కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం
Srikar Bharat Comments On Virat Kohli.. ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి కోన శ్రీకర్ భరత్ ఒక్కసారి హీరోగా మారిపోయాడు. అంతేగాక 52 బంతుల్లోనే 78 పరుగులు చేసిన భరత్ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా భరత్ ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కీలక సమయంలో ఒక మంచి ఇన్నింగ్స్తో మెరిసినందుకు సంతోషంగా ఉంది. యంగ్స్టర్స్ను ప్రోత్సహించడం కోహ్లికి ఉన్న గొప్ప అలవాటు. ఈసారి ఐపీఎల్ టైటిల్ కొట్టి కోహ్లి బాయ్కి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎల్ టైటిల్తో పాటు కేక్పై చెర్రీ పెట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లికి ఇదే ఆఖరి సీజన్. అందుకే కోహ్లికి గిఫ్ట్గా టైటిల్ను అందించాలనుకుంటున్నా.'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 10,11,13 తేదీల్లో క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనుండగా.. అక్టోబర్ 15వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: T20 World Cup 2021: రోహిత్ భయ్యా.. మాకు రెండు టికెట్స్ ఇప్పించవా శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
తెలుగు క్రికెటర్పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్వెల్, కోహ్లి
Maxwell And Kohli Praises Srikar Bharat: తెలుగు క్రికెటర్, విశాఖ కుర్రాడు కోన శ్రీకర్ భరత్పై ఆర్సీబీ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్లో ఆర్సీబీ వికెట్కీపర్గా రాణిస్తున్న భరత్.. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సంయమనంతో బ్యాటింగ్ చేసి 35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 44 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును మ్యాక్సీతో పాటు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం కొనియాడారు. భరత్ అసలు సిసలైన టాప్ క్లాస్ బ్యాటర్ అని వీరు కితాబునిచ్చారు. భరత్ బ్యాటింగ్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, అవి పొట్టి క్రికెట్లో చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. భరత్.. బ్యాటర్గానే కాకుండా వికెట్కీపర్గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని, భవిష్యత్తులో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని అశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, నిన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో భరత్ సహా మ్యాక్స్వెల్(30 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), పడిక్కల్(17 బంతుల్లో 22; 4 ఫోర్లు), కోహ్లి(20 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించడంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కేఎస్ భరత్ బ్యాటింగ్తో పాటు కీపింగ్(క్యాచ్, స్టంప్ అవుట్) లోనూ రాణించాడు. భరత్ను ఈ ఏడాది ఐపీఎల్కు ముందే ఆర్సీబీ 20 లక్షల బేస్ ప్రైస్కు దక్కించుకుంది. చదవండి: Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... ఎట్టకేలకు మౌనం వీడిన అశ్విన్! -
కేఎస్ భరత్ మోగలేదు..
చెన్నై: ఈ ఐపీఎల్ వేలం ముందువరకూ ఆంధ్రప్రదేశ్కు చెందిన వికెట్ కీపర్ కేఎస్ భరత్పై భారీ అంచనాలే ఉన్నాయి. దేశవాళీ మ్యాచ్ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే ఇందుకు కారణం. భారత్ తరఫున కొన్ని మ్యాచ్లకు స్టాండ్ బైగా జట్టులో కొనసాగిన శ్రీకర్ భరత్.. తాజా ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలను మాత్రం ఆకర్షించలేకపోయాడు. ఈ వేలంలో అతని కనీస ధర 20 లక్షలు ఉండగా, కనీసం రెండు కోట్ల వరకూ వెళతాడని విశ్లేషకులు అంచనా వేశారు. చాలామంది అనామాక క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టిన క్రమంలో కేఎస్ భరత్పై విశ్లేషకుల అంచనాను తప్పుబట్టలేం. కానీ అనూహ్యంగా కేఎస్ భరత్ కనీస ధరకే అమ్ముడుపోవడం చర్చనీయాంశమైంది. కేఎస్ భరత్ను 20 లక్షల రూపాయల కనీస ధరకే ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ బిడ్కు వెళ్లగా ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దాంతో 20 లక్షలకే ఆర్సీబీ సొంతమయ్యాడు భరత్. ఇప్పటివరకూ 78 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన కేఎస్ భరత్.. 4283 పరుగులు చేయగా, లిస్ట్-ఎ క్రికెట్లో 51 మ్యాచ్లు ఆడి 1351 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో 48 మ్యాచ్లకు గాను 730 పరుగులు నమోదు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 9 సెంచరీలు 23 హాఫ్ సెంచరీలు ఉండగా, లిస్ట్-ఎ క్రికెట్లో 3 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 క్రికెట్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు భరత్. ఇక్కడ చదవండి: ఏడేళ్ల తర్వాత పుజారా మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం -
పంత్ నువ్వు వెళ్లిపోవచ్చు: సెలక్టర్లు
కోల్కతా: బంగ్లాదేశ్తో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ టెస్టు నుంచి టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ను సెలక్టర్లు తప్పించారు. అతడి స్థానంలో వృద్దిమాన్ సాహాకు బ్యాకప్గా ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ను ఎంపిక చేశారు. స్వదేశంలో బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టుకు పంత్ను తుది జట్టులోకి తీసుకోలేదు. దీంతో తొలి రోజు రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే వెస్టిండీస్తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్కు ఎంపికైన పంత్ ప్రాక్టీస్ కోసం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం సెలక్టర్లును కోరాడు. పంత్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో టెస్టు ఆట ఇంకా నాలుగు రోజులు ఉండటంతో అతడి స్థానంలో కేఎస్ భరత్ను ఎంపిక చేశారు. పంత్తో పాటు రెండు టెస్టుల సిరీస్కు బ్యాకప్ ఓపెనర్గా జట్టులోకి తీసుకున్న శుభ్మన్ గిల్కు కూడా దేశవాళీ టోర్నీ ఆడుకునేందుకు అవకాశం ఇచ్చింది. గిల్ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇక గత కొంత కాలంగా ఫామ్లో లేక తంటాలు పడుతున్న పంత్ వెస్టిండీస్ సిరీస్పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దీని కోసం ముస్తాక్ అలీ టోర్నీని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ టోర్నీలో రాణించి మునపటి ఫామ్ను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో కీపర్గా, బ్యాట్స్మన్గా పంత్ తీవ్రంగా నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. దీంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువుత్తుతున్నాయి. ఇప్పటికే టెస్టు జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిన సమయంలో పొట్టి క్రికెట్లో స్థానం కాపాడుకోవాలనే ఆలోచనలో అతడు ఉన్నాడు. దీంతో వెస్టిండీస్ సిరీస్ అతడికి చావోరేవోగా మారింది. ఇక ఈ టోర్నీలో ఢిల్లీ తరుపున పంత్, పంజాబ్ తరుపున గిల్ ఆడనున్న విషయం తెలిసిందే. పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనభవం ఉంది ఇక కోల్కతా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సాహా బ్యాకప్గా అనూహ్యంగా జట్టుకు ఎంపిక కావడం పట్ల భరత్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘జట్టుతో చేరమని సెలక్టర్ల నుంచి కాల్ వచ్చింది. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు జట్టుతో చేరాను. విరాట్ భాయ్ వంటి స్టార్ క్రికెటర్తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆడినా ఆడకపోయినా టీమిండియాతో ట్రావెల్ చేయడం ఎంతోకొంత నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. దులీప్ ట్రోఫీ-2015లో భాగంగా పింక్ బాల్ క్రికెట్ ఆడిన ఆనుభవం ఉంది. అవకాశం లభిస్తే నా సత్తా చాటుతా’అంటూ కేఎస్ భరత్ పేర్కొన్నాడు. -
భారత ‘ఎ’ జట్టులో భరత్, రికీ భుయ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ లయన్స్తో జరిగే తొలి అనధికారిక టెస్టులో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు కేరళలోని వాయనాడ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. 14 మంది సభ్యుల బృందానికి మహారాష్ట్ర క్రికెటర్ అంకిత్ బావ్నె సారథ్యం వహిస్తాడు. ఆంధ్ర రంజీ ఆటగాళ్లు కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్లకు ఈ జట్టులో చోటు లభించింది. ప్రస్తుత రంజీ సీజన్లో రికీ భుయ్ ఎనిమిది మ్యాచ్లు ఆడి నాలుగు సెంచరీలతో కలిపి మొత్తం 775 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ అయిన భరత్ హైదరాబాద్తో జరిగిన రంజీ మ్యాచ్లో 178... బెంగాల్పై 61... పంజాబ్పై 76 పరుగులు చేశాడు. -
కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీ
ఒంగోలు: గోవాతో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్ లో ఆంధ్రా ఆటగాడు కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం ప్రారంభమైన తొలి రోజే డబుల్ సెంచరీ చేసిన భరత్.. రెండో రోజు కూడా తనదైన శైలిలో ఆడి ట్రిపుల్ సెంచరీ(308)పరుగులు నెలకొల్పాడు. దీంతో ఆంధ్రా భారీ స్కోరు నమోదు చేసింది. తొలిరోజు 400 పరుగులకు పైగాసాధించిన ఆంధ్రా ఆటపై మరింత పట్టుబిగించింది. గోవా బౌలర్లను చితక్కొట్టిన ఆంధ్ర బ్యాట్స్మెన్ దాదాపు 4.53 రన్రేట్తో పరుగులు సాధించడం విశేషం.