Land registration
-
ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
-
‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్: నిత్యం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ కార్యాలయం మూడు నెలలుగా దాదాపుగా వెలవెలబోతోంది. దీనికి కార ణం కేవలం ఒక్క పదమే కారణమంటే ఆశ్చర్యంగా ఉన్నా, అదే నిజం. ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో ‘మరియు’అనే పదం స్థానంలో ‘నుండి’ అనే పదం టైపింగ్ చేయడమే ఆ పరిస్థితికి కారణం. అప్పటి ‘నుండి’ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ ఒక్క పదంతో రెండు సర్వే నంబర్లకు బదులు ఏకంగా 168 సర్వే నంబర్లలోని వందల ఎకరాల స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. దీనికి హైడ్రా కూడా తోడవడంతో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రతిరోజు 100కుపైగా జరిగే రిజిస్ట్రేషన్లు సగానికి తగ్గిపోయాయి. ‘మరియు’కు బదులు ‘నుండి’ కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో 58, 226 సర్వే నంబర్లలో వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో వాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టరాదని వక్ఫ్ బోర్డు ఆగస్టు 27న ఆదేశాల జారీ చేసింది. ఆదేశాలలో 58 మరియు 226 సర్వే నంబర్లు అని టైపు చేయకుండా పొరపాటున 58 సర్వే నంబర్ నుండి 226 సర్వే నంబరు వరకు అని టైపు చేయడంతో ఏకంగా 168 సర్వే నెంబర్లపై ఈ ఎఫెక్ట్ పడింది. దీంతో వందల ఎకరాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు. చదవండి: మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!వాస్తవానికి నిలిపివేసిన సర్వే నంబర్లలో వక్ఫ్బోర్డ్ స్థలం మొత్తం కేవలం ఒక ఎకరం ఒక గుంట స్థలం ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 నెలల నుంచి నిలిచిపోవడంతో 50 కాలనీలు, పలు బస్తీల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వెంటనే ఆదేశాల్లో దొర్లిన పొరపాటును సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ‘రిజిస్ట్రేషన్లు సగం మేర తగ్గిపోవడంతో డాక్యుమెంట్ రైటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, 5 హోటల్స్, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్లు బోసిపోతున్నాయి’అని రవీందర్ ముదిరాజ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘భూ’చక్రం తిప్పేశారు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్లో అక్రమాల భూ‘చక్రం’ తిరిగింది. నిబంధనల ప్రకారం సీనియారిటీ ఉన్న సభ్యులకుగానీ, ప్రభుత్వానికి గానీ చెందాల్సిన భూమిని పాలకమండలిలోని ముఖ్యులు పక్కా ప్లాన్తో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. సొసైటీలోని ముఖ్యులతోపాటు అధికార యంత్రాంగం కూడా ఈ తతంగంలో భాగస్వామ్యం కావడం గమనార్హం. ప్రభుత్వం ఈ సొసైటీకి కేటాయించిన భూమి నుంచి 304/జీ/111 ప్లాట్ను 1988లో సభ్యత్వం నంబర్ 4153గా ఉన్న ఐఏఎస్ నటరాజన్కు కేటాయించారు. నటరాజన్ మరణించిన కొన్నేళ్లకు ఆయన కుమారుడు శంకర్ నారాయణన్ పేరుపై సభ్యత్వ బదిలీ జరిగింది. కానీ ఆయన ఇప్పటివరకు ప్రభుత్వ విలువను చెల్లించి ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.ఇలాంటప్పుడు సదరు ప్లాట్ను సీనియారిటీ మేరకు తర్వాతి లబ్ధిదారులకు బదిలీ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అలా చేయలేదు. 36 ఏళ్లు గడిచాయి. ఇప్పటి పాలకమండలి సభ్యులు ‘భూ’ చక్రం తిప్పారు. అతి ఖరీదైన ఈ ప్లాట్ను తొలుత శంకర్ నారాయణన్ పేరిట, ఆ వెంటనే సర్దార్ దల్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి పేరిట ఒక్కరోజులోనే గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది పూర్తిగా సొసైటీ నిబంధనలకు విరుద్ధం.ప్లాట్ ఓనర్ కాకుండానే..సొసైటీ పాలకవర్గం చకచకా స్థలాన్ని శంకర్ నారాయణన్ పేరు మీదకు, తర్వాత గంటల వ్యవధిలోనే దల్జీత్ సింగ్కు బదిలీ చేయడం గమనార్హం. శంకర్ నారాయణన్కు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వ విలువను సొసైటీకి చెల్లించాల్సిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని దల్జీత్ సింగ్ బదిలీ చేశారు. జూన్ 28న నారాయణన్ చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ కోసం రూ.25,89,735.. 29న రూ.60,80,550 చెల్లించారు. విచిత్రమేంటంటే అప్పటికి ఆయన ప్లాట్ ఓనర్ కానే కాదు. అలాగే సొసైటీకి చెల్లించాల్సిన రూ.3,40,67,600ను జూలై 1న బదిలీ చేశారు. డాక్యుమెంట్ నంబర్ 4244/2024తో 529 గజాల భూమి శంకర్ నారాయణన్ పేరు మీదకు మారింది. తర్వాత గంటల వ్యవధిలోనే ఆ భూమిని దల్జీత్ సింగ్ పేరిట మార్చే పని మొదలుపెట్టారు.ఇళ్లు నిర్మించకుండా అమ్మకం చెల్లదుసొసైటీలో భూమి పొందిన లబ్ధిదారులెవరైనా 18 నెలల్లో ఇల్లు నిర్మించకుంటే.. దాన్ని రద్దు చేసే అధికారం సొసైటీకి ఉంటుంది. అసలు ఇల్లు నిర్మించకుండా అమ్మడం చెల్లదనేది సొసైటీ నిబంధన కూడా. రిజిస్ట్రేషన్ పత్రాల్లోనూ ఈ విషయాన్ని పేర్కొంటారు. ఇవేమీ పట్టించుకోకుండా దల్జీత్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 4257/2024) మారిపోయింది. సాధారణంగా ఎవరైనా రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేశాక డాక్యుమెంట్లు రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేతికిచ్చారంటే.. అక్రమంలో అధికారుల పాత్ర ఏమిటో తెలిసిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణన్ పేరు మీది డాక్యుమెంట్ రాకుండానే సబ్ రిజిస్ట్రార్ దల్జీత్ పేరిట రిజిస్ట్రేషన్కు ఏర్పాట్లు చేయడం గమనార్హం. రిజిస్ట్రేషన్ సమయంలో రూ.8 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్న దల్జీత్.. రూ.4,25,42,665ను డీడీ రూపంలో నారాయణన్కు బదిలీ చేసినట్టు చూపారు. సొసైటీలోని భూమి నారాయణన్ పేరు మీదకు జూలై 1న రిజిస్ట్రేషన్ కాగా.. అదే రోజున దల్జీత్ పేరు మీదకు మారడం గమనార్హం.నిబంధనలను పక్కకు నెట్టి..హౌసింగ్ సొసైటీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం స్థలం మంజూరు చేస్తుంది. కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణం చేపట్టాలి. లేదంటే తిరిగి సొసైటీకి స్థలాన్ని అప్పగించాలి. అంటే శంకర్ నారాయణన్ పేరిట స్థలం మారినా.. అందులో ఎలాంటి నిర్మాణం చేపట్టకుండానే దల్జీత్కు విక్రయించడం సొసైటీ నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు.. స్థలం బదిలీకి ఒకట్రెండు సంవత్సరాలు వేచిచూడాలి, లేదా సొసైటీలోని తర్వాతి లబ్ధిదారులకు కేటాయించాలని చట్టం చెబుతోంది. దీన్ని సొసైటీ పాలకమండలి పూర్తిగా ఉల్లంఘించింది. రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో అధికారులకూ ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల అక్రమం!దల్జీత్సింగ్ తన పేరుమీదకు మారిన స్థలంలో నిర్మాణం ప్రారంభించేందుకు జూన్ 18న జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేశారు. సొసైటీ నుంచి నారాయణన్ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్లో 529 గజాల ప్లాట్కు గజానికి రూ.64,400 చొప్పున మొత్తం రూ.3,40,67,600గా లెక్కగట్టారు. రూ.25,89,720 స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. ఇదే ప్లాట్ను దల్జీత్ పేరిట మార్చిన రిజిస్ట్రేషన్లో మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.1,54,228 చొప్పున లెక్కించారు. స్టాంపు డ్యూటీగా రూ.60,80,550 చెల్లించారు. అంటే మొత్తం ప్లాట్ ధర రూ.8 కోట్లుగా చూపారు. (జూన్ 8న ఆర్టీజీఎస్ ద్వారా రూ.25,89,735.. జూన్ 29న ఆర్టీజీఎస్ ద్వారా రూ.3,40,67,600.. జూలై 1న డీడీ రూపంలో రూ.4,25,42,665.. టీడీఎస్కు రూ.8 లక్షలు చెల్లించినట్టు చూపారు). నిజానికి జూబ్లీహిల్స్లో బహిరంగ మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంది. అంటే ఈ భూమి విలువ రూ.16 కోట్లకుపైనే! అందులో రూ.8 కోట్లు లెక్కకు వచ్చిందని, మిగతా సొమ్ము సంగతి తేల్చాలనే డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారంపై పలువురు ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’ను ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. -
‘రికార్డు’ సంస్కరణలు ప్రజలకు చెబుదాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో.. మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రిజిస్ట్రేషన్ చేయకుంటే పెట్రోల్ పోస్తాం.. తహసీల్దార్కు బెందిరింపులు..
సాక్షి, వరంగల్: ‘భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్నాయక్తండాకు గుగులోత్ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్ఠిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్నాయక్తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్ బుక్ చేసుకున్నాం..రిజిస్ట్రేషన్ చేయండి.. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి’అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని తహసీల్దార్ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: రేవంత్కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
రైతు నిజాయితీ.. 15 గుంటలకు పట్టా పుస్తకం వచ్చినా కూడా తనకెందుకని..
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తూనే ఉన్నాం. కన్నవారిపైనే అమానుషానికి పాల్పడుతున్న వారసుల గురించి విన్నాం. కానీ, తనది కాని భూమి తనకెందుకని ఓ యువరైతు నిజాయితీ చాటుకున్నాడు. తన పేరుపై పొరపాటున నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా భూమిని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో వెలుగుచూసింది. పాలకుర్తి మండల పరిధి తిరుమలగిరి గ్రామంలో పొన్నం రాజు అనే రైతు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు బక్క సోమయ్యకు చెందిన 15 గుంటల పట్టా భూమి రికార్డుల్లో తప్పిదం కారణంగా పొన్నం రాజు పేరున నమోదైంది. అయితే, ఆ భూమి తనది కాదని సోమయ్యకు చెందినదని రాజు గుర్తించాడు. మండల తహసీల్దార్ పాల్సింగ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. స్వచ్ఛందంగా తహసీల్దార్ సమక్షంలో శనివారం సోమయ్యకు పట్టా చేయించి నిజాయితీ చాటుకున్నాడు. ఉప సర్పంచ్ నాగరాజుతో పాటు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు రాజును అభినందించారు. (చదవండి: బద్రినాథ్యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి) -
Andhra Pradesh: గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి : పారదర్శకత కోసం గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖల సమన్వయంతో రీసర్వే ప్రాజెక్టు ఫేజ్–1లోని 51 గ్రామ సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్–6 ప్రకారం నిర్దేశించిన గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రజత్ భార్గవ అధికారులను కోరారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సచివాలయ కార్యదర్శులకు అవసరమైన శిక్షణను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషగిరిబాబును ఆదేశించారు. సమావేశంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ ఉదయభాస్కర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై ‘సీఐడీ’ వేయండి
నరసాపురం: గత సర్కార్ హయాంలో అన్నదాతలను మోసం చేస్తూ టీడీపీ నేతలు చేసిన రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ కోరింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో లీజు ముగిసిన భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ అమాయకులైన రైతుల నుంచి డబ్బులు దండుకున్న వ్యవహారంపై సమగ్ర దర్యాపునకు ఆదేశాలివ్వాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ‘నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీ’ భూముల రిజిస్ట్రేషన్కు కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారాన్ని గతేడాది సెప్టెంబర్ 16న ‘టీడీపీ తీరంతా అవినీతి’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కుంభకోణంపై అప్పటి నరసాపురం సబ్ కలెక్టర్ విచారణ చేసి.. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిటిష్ హయాంలో ఇచ్చిన భూములు.. బ్రిటిష్ హయాంలో నరసాపురం తీర ప్రాంతమంతా ఇసుక భూములే. ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కలిసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. తమకు భూములిస్తే.. సాగు చేసుకుని ఉపాధి పొందుతామన్నారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. స్థానిక రైతులంతా కలిసి నరసాపురం అగ్రికల్చర్ కంపెనీగా ఏర్పడ్డారు. దర్భరేవు, మర్రితిప్ప, వేములదీవి ప్రాంతాల్లోని 1,811.33 ఎకరాలను ఈ కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1920లో ఆమోదం తెలిపింది. అమలు కాని జీవోను అడ్డంపెట్టుకొని.. మొత్తం 1,811.33 ఎకరాల్లో గట్లు, నీటి కుంటలను తీసివేయగా.. నికరంగా 1,754.49 ఎకరాలను 1,485 మంది రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లీజు గడువు ముగింపునకు వచ్చింది. ఈ భూములను ఉచితంగా ఇస్తామంటూ సాగుదారులకు టీడీపీ పాలకులు సరిగ్గా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 2019 జనవరి 24న జీవో కూడా విడుదల చేశారు. ఎకరాకు రూ.1,000 చొప్పున రైతులకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారాలు చూసేందుకు రైతులు సభ్యులుగా ఉన్న ‘కంపెనీ’ బోర్డుకు టీడీపీ నేత కోట్ల సాయి వెంకట రాజా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో కలిసి బోర్డు డైరెక్టర్లు, టీడీపీ స్థానిక నేతలు సజ్జా వీర వెంకట సత్యనారాయణ, మేకా శ్రీధర్ చౌదరి రంగంలోకి దిగారు. రైతుల నుంచి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. డబ్బులివ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసేది లేదంటూ బెదిరించారు. దీంతో 1,485 మంది సాగుదారుల్లో 760 మంది రూ.1.58 కోట్లు ఇచ్చారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవోను మాత్రం అమలు చేయలేదు.. రైతుల పేర్ల మీద భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ కుంభకోణాన్ని గతేడాది ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. బాధిత రైతులు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, అప్పటి సబ్ కలెక్టర్ విశ్వనాథన్కు ఫిర్యాదు చేశారు. రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు మా కుటుంబానికి కంపెనీ భూముల్లో 5 ఎకరాలున్నాయి. తరతరాలుగా వాటిని సాగు చేసుకుంటున్నాం. 2019 ఎన్నికలకు ముందు మీ భూములు మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాం.. ఎకరాకు రూ.21 వేలు కట్టాలని చెప్పారు. రూ.1,000 ప్రభుత్వానికి, మిగిలినవి ఖర్చులకని చెప్పి.. నా నుంచి రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు. మా నుంచి వసూలు చేసిన డబ్బులను బోర్డు పెద్దలే జేబులో వేసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే వారేమీ జవాబివ్వట్లేదు. సీఐడీ విచారణతో న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం. – జి.బంగార్రాజు, రైతు, దర్భరేవు -
ప్లాట్పై కన్నేసి.. నకిలీ పత్రాలతో స్థలం కబ్జా
హస్తినాపురం: ప్లాట్ యజమాని పేరుతో నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డులు తయారు చేసి కోటి రూపాయల ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు షేక్ హస్సన్(56)ను ఆదివారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని గౌలిగూడచమన్కు చెందిన బాలేశ్వర్ 1984లో పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సురాబాద్ జడ్జెస్ కాలనీలో సర్వే నంబర్–33లో 267 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్లాట్పై కన్నేసిన ఎన్టీఆర్నగర్కు చెందిన షేక్ హస్సన్ పథకం ప్రకారం వివిధ జిల్లాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో సదరు ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హస్సన్ మూడు నెలలకు పైగా పరారీలో ఉన్నాడని, అతడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
స్థలం ఒకరిది..రిజిస్ట్రేషన్ మరొకరిది
ఈ చిత్రంలో ఉన్న పెద్ద మనిషి పేరు కె.పుల్లయ్య. ఇతనిది వెల్దుర్తి మండలం ఎన్.వెంకటాపురం గ్రామం. ఇతను కర్నూలు సమీపంలోని 40వ జాతీయ రహదారి పక్కన వెంగన్న బావి వద్ద 98, 99, 116 సర్వే నంబర్లలో వేసిన వెంచర్లో 2000వ సంవత్సరంలో ప్లాట్ నంబర్ 99ఏ కొనుగోలు చేశాడు. ఏటా ఒకటి, రెండు సార్లు ప్లాటు వద్దకు వచ్చి చూసుకొని వెళ్లేవాడు. అయినా ఇటీవల తన ప్లాటు కర్నూలుకు చెందిన చిట్టిబాబు పేరుతో ఉందని తెలుసుకుని అతన్ని నిలదీశాడు. తాను కూడా కురువ మధు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశానని చిట్టిబాబు వివరణ ఇవ్వడంతో ఈసీ తీశాడు. అప్పటికే 15 మంది చేతులు మారిందని తెలుసుకొని నోరెళ్లబెట్టాడు. ‘నేనెవరికీ ప్లాటు విక్రయించకున్నా ఇలా ఎందుకు జరిగిందని రిజిస్ట్రేషన్ అధికారులను, వెంచర్ వేసిన వారిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు’ అ బాధితుడు వాపోతున్నాడు. సాక్షి,కర్నూలు(సెంట్రల్): మన పొలమో, ప్లాటో, ఇల్లో ఎక్కడికి పోతుందిలే అనుకుంటే పొరపాటే. డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయని, భూములు, స్థలాలు మన కళ్లెదుటే ఉన్నాయనుకొని ఇంట్లో కూర్చుంటే అక్రమార్కులు బరి తెగించి కొత్త మోసాలతో మాయ చేసేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇతరుల పేరుతో సొంతం చేసుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు రిజిస్ట్రేషన్ అధికారుల వ్యవహారంతో ఆస్తులు కోల్పోయి బాధితులు రోడ్డున పడుతున్నారు. పదే పదే రిజిస్ట్రేషన్.. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కొందరు మాఫియాగా ఏర్పడి భూములు, స్థలాలు, ఇళ్లను రాత్రికి రాత్రే ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వీరికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటున్నట్లు సమాచారం. ముందుగా భూమాయగాళ్లు ప్లాటు, స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా రిజిస్ట్రేషన్ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని తమ పేరుతో గానీ, తమకు తెలిసిన వారి పేర్లతో గానీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆ తరువాత అదే స్థలాన్ని పదే పదే రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ పోతారు. రిజిసే్ర్టషన్ సమయంలో స్థలం/పొలం/ఇంటి వద్దకు వెళ్లరు. మొదటి సారి ఆ ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్లు లింకు డాక్యుమెంట్ అడగకుండా మేనేజ్ చేస్తారు. తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించుకుంటూ పోతారు. ఈ ప్రక్రియలో ఎవరైనా ఆస్తిదారులు అప్రమత్తమైతే పంచాయితీకి రమ్మంటారు. ఏదో పొరపాటున జరిగి పోయిందని ఎంతో కొంత చెల్లిస్తే వెనక్కి ఇస్తామని, లేదంటే రిజిస్ట్రేషన్ చార్జీలను అయినా చెల్లించాలని కోరతారు. కె.పుల్లయ్య విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘సెటిల్ చేసుకుందామని పంచాయితీకి పిలుస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు’ అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. వెయ్యికి పైగా కేసులు.. జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో డబుల్ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం, పదే పదే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి కేసులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. విష యం తెలుసుకున్న లబ్ధిదారులు కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఐదేళ్లలో దాదాపు 1,000కి పైగా కేసులు వచ్చాయి. వీటిపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తరువాత దానిని రద్దు చేసే అధికారం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కేసులు కోర్టులకు ఎక్కుతున్నాయి. ఫలితంగా దీర్ఘకాలికంగా కొన్ని వందల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. కొందరు ఫిర్యాదు దారులు పంచాయితీల ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. -
Telangana: భూముల విలువ పెంపు!
►రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించి ఎనిమిదేళ్లవుతోంది. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. ►ప్రతి రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. ►రాష్ట్రంలో జరిగిన పాలనా సంస్కరణల కారణంగా.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు ఏర్పడ్డాయి. రియల్ బూమ్, రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు ముందుకు వచ్చింది. ►2019–20 లెక్కల ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,299 కోట్లు ఆదాయం వచ్చింది. కొత్త విలువలు అమల్లోకి వస్తే ఇది రూ.9,600 కోట్ల వరకు చేరొచ్చని అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ (కార్డ్ వ్యాల్యూ) పెంపునకు రంగం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల కేటగిరీల్లో 30 శాతం నుంచి 400 శాతం వరకు పెరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు చేరాయని.. ఆయన అంగీకరిస్తే ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. సవరణలు జరిగితే ప్రభుత్వానికి ఏటా సగటున రూ.3,400 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది. రిజిస్ట్రేషన్ లావాదేవీలు పెరిగితే మరింత అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. శాస్త్రీయ పద్ధతిలో అంచనాలతో.. భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించే దిశలో ప్రభుత్వం కసరత్తు చేసింది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన మ దింపు ఆధారంగా.. 2019–20 ఆర్థిక సంవత్సరం లో జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీల సగటును తీసుకుని లెక్కలు గట్టింది. సర్వే నంబర్ల వారీగా భూములు, నంబర్ల వారీగా ఇళ్లు, వెంచర్లను బట్టి ఫ్లాట్లు, ఖాళీ స్థలాల విలువలను నిర్ధారించే ప్రయ త్నం జరిగింది. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర, అంతర్ జిల్లా రహదారులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను నిర్ధారించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. కమిటీలు లేకుండానే ప్రక్రియ.. ప్రభుత్వ విలువల సవరణకు సంబంధించి గతంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్గా, జాయింట్ కలెక్టర్ చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసేవారు. అందులో ప్రాంతాన్ని బట్టి మున్సిపాలిటీ, హెచ్ఎం డీఏ, పంచాయతీరాజ్, ప్లానింగ్ అధికారులు సభ్యులుగా ఉండి మదింపు చేసేవారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఆయా జిల్లాల్లోని ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల విలువల సవరణ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేవారు. కానీ ఈసారి కమిటీలు ఏర్పాటు కాకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ప్రభుత్వం నిర్ణయించి నట్టు సమాచారం. గతంలో పలుమార్లు ఈ కమిటీల ఏర్పాటు ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ కస రత్తు చేసి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం అంగీకరించక పోవడంతో రిజిస్ట్రేషన్ విలువ లు మార్చలేదు. అయితే తాజాగా రాష్ట్ర ఆదాయా న్ని పెంచే దిశగా చర్యలు చేపట్టిన సర్కా రు రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై దృష్టి పెట్టింది. కాస్త జాప్యం జరిగినా కొత్త విలువలు ఈ ఏడాది చివరిలో గా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
Telangana: రిజిస్ట్రేషన్లకు ‘అంతుచిక్కని’ సమస్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేసే ప్రధాన సర్వర్లో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్లో సరి సంఖ్యలో నమోదై ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శుక్రవారం వరకు సజావుగానే పనిచేసినా, శనివారం సరి, బేసి సంఖ్యలో (రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల క్రమసంఖ్యలోని సరి, బేసి సంఖ్యలు) ఉన్న అన్ని కార్యాలయాలకూ సమస్య వచ్చింది. దీంతో శనివారం అరకొరగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొదలైన మూడురోజులకే.. లాక్డౌన్ వేళలు సవరించిన తర్వాత మే 31 నుంచే రిజిస్ట్రేషన్ లావాదేవీలు మళ్లీ మొదలయ్యాయి. రెండు, మూడు రోజుల పాటు సజావుగానే జరిగిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడింది. తొలుత చిన్నదే అనుకున్నా తర్వాత పెద్దది అయ్యింది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి వివరాల కోసం సబ్ రిజిస్ట్రార్ల లాగిన్లోని కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఏం జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో గచ్చిబౌలి స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్ నెట్వర్క్లో సాంకేతిక సమస్య వచ్చిందని తేలింది. తొలుత ఐటీ శాఖతో కలిసి ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆ సిబ్బంది చేసిన ప్రయత్నం మేరకు గురు, శుక్రవారాల్లో కొన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ప్రధాన సర్వర్లో సరి సంఖ్యతో ఉన్న కార్యాలయాల్లో ఇబ్బంది లేకుండానే కార్డ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక, బేసి సంఖ్యతో కూడిన కార్యాలయాల సమస్యను కూడా పరిష్కరించేందుకు సిబ్బంది యత్నించడంతో శనివారం సరి సంఖ్యలోని కార్యాలయాల్లో కూడా సర్వర్ డౌన్ అయినట్టు తెలుస్తోంది. సమస్య ఏమిటో తేలకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం రోజుకు సగటున 3,500కు పైగా లావాదేవీలు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం రోజుకు సగటున 900 వరకు మాత్రమే జరుగుతున్నాయి. శనివారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 500కు మించి జరగలేదని తెలుస్తోంది. అయితే ఆదివారం కల్లా సమస్య పరిష్కారమవుతుందని, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
కాళ్లరిగేలా తిరిగి కడుపు మండి.. మంత్రాలయలో బాంబు..
సాక్షి, ముంబై: స్థలం రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, ఇక పని కాదని ఏకంగా మంత్రాలయలోనే బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశాడు నాగ్పూర్కు చెందిన సాగర్ మాంఢరే అనే వ్యక్తి. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులతో మంత్రాలయలో సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఫేక్ కాల్గా భావించి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. స్థలం విషయంలో కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల అతడి మానసిక స్థితి దెబ్బతినడంతో బెదిరింపు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. కాగా, బెదిరింపు కాల్తో మంత్రాలయ భవనం ఆవరణలో, భవనం బయట భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అసలేం జరిగింది? మంత్రాలయ భవనంలో బాంబు ఉందని ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. అయితే 24 గంటలు పోలీసులు, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించే మంత్రాలయలో బాంబు పెట్టడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రితోపాటు కేబినెట్, సహాయ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలను తనిఖీ చేయనిదే మంత్రాలయ భవనంలోకి అనుమతించరు. ఇలాంటి పటిష్టమైన భద్రత ఉన్న మంత్రాలయలోకి సామాన్య వ్యక్తులు బాంబు తీసుకెళ్లి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఆదివారం మంత్రాలయకు సెలవు అయినప్పటికీ పోలీసులు ఈ బెదిరింపు కాల్ను సీరియస్గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన బాంబు నిర్వీర్యం బృందం, డాగ్ స్క్వాడ్ మంత్రాలయలో అణువణువూ గాలించారు. కానీ, ఎక్కడా ఎలాంటి బాంబు గాని అనుమానాస్పద వస్తువుగాని లభించలేదు. తరువాత ఈ బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని టెలిఫోన్ ఎక్ఛేంజీ నుంచి ఆరా తీయగా మహారాష్ట్ర ఉప రాజధాని నాగ్పూర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగ్పూర్ నుంచి ఫోన్ చేసిన సాగర్ మాంఢరేను అరెస్టు చేశారు. ముంబైలో స్థానిక మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగి.. నాగ్పూర్లో కోల్ ఫిల్డ్ స్టోన్ క్రషింగ్కు ఆనుకుని ఉన్న స్థలం తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడాని కి సాగర్ మాంఢరే అనేక సార్లు స్థానిక ప్రభుత్వం కార్యాలయాల చుట్టు తిరిగాడు. పని జరగకపోవడంతో తనకు న్యాయం చేయాలని తహశీల్దార్, జిల్లా కలెక్టర్, రీజినల్ కమిషనర్ తదితర ఉన్నత స్థాయి అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ, పరిపాలనా విభాగం రికార్డుల ప్రకారం ఆ స్థలం అస్థిత్వంలో లేదు. చివరకు కొద్ది నెలల కిందట ఆ స్థలానికి సంబంధించిన పత్రాలతో మంత్రాలయకు వచ్చి ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ విభాగానికి చెందిన కార్యదర్శులతో భేటీ అయ్యాడు. ఇక్కడ కూడా నిరాశే మిగలడంతో అధికారులను, కార్యదర్శులను అరెస్టు చేయాలని మంత్రాలయలో గొడవ చేశాడు. అంతటితో ఊరుకోకుండా అక్కడే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ బాంబు బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు. -
పాస్పోర్టు సేవలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేత
రాంగోపాల్పేట్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని రకాల పాస్పోర్టు సేవలను నిలిపివేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలతో పాటు సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో అన్ని సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ అపాయింట్మెంట్లను రీ షెడ్యూల్ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ ఆవరణలోనే ఉండే విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన బ్రాంచ్ సెక్రటేరియేట్ కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. లాక్డౌన్ కాలంలో నో రిజిస్ట్రేషన్.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. లాక్డౌన్ మినహాయింపు కేటగిరీలో రిజిస్ట్రేషన్ల శాఖను చేర్చకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి పాస్లు జారీ చేయరని, ప్రజలెవరూ రిజిస్ట్రేషన్ల కోసం రావొద్దని తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినందున రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచే ఉంటాయని, రిజిస్ట్రేషన్లు మాత్రం జరగవని వెల్లడించారు. -
రూ.50 లక్షలు, కళ్లకు గంతలు.. అసలేం జరిగింది..?
సాక్షి, రామగిరి(మంథని): రామగిరి మండలం లద్నాపూర్కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలు భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో శనివారం ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారు జామున ఇంటికి చేరుకున్నారు. అయితే తమను కొంతమంది కిడ్నాప్ చేసి డబ్బులు కాజేశారని చెబుతున్న తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భూ రిజిస్ట్రేషన్ కోసం రాజేశం, మల్లయ్య శనివారం రూ.50 లక్షలతో ద్విచక్ర వాహనంపై కాటారం బయలుదేరారు. మార్గమధ్యలో బట్టుపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనాన్ని ఆపి, మాస్క్ పెట్టుకోకుండా ఎక్కడి వెళ్తున్నారని ప్రశ్నించి వివరాలు నోట్ చేసుకున్నాడు. అయితే ద్విచక్ర వాహనాన్ని ఆపింది పోలీసు అనుకొని వీరు భయపడ్డారు. అంతలోనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి రాజేశం సెల్ఫోన్ లాక్కొని స్విచ్ఆఫ్ చేసి, ఇద్దరి కళ్లకు గంతలు కట్టి దాదాపు అరగంట కారులో ప్రయాణించిన తర్వాత ఒక ఇంట్లో బంధించారు. ఆదివారం అర్ధరాత్రి మళ్లీ కళ్లకు గంతలు కట్టి కారులో తీసుకువచ్చి రాజాపూర్ శివారు ఎల్–7 ఎస్సారెస్పీ కాలువ వద్ద వదిలిపెట్టడంతో ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ ఇంటికి చేరినట్లు వెల్లడించారు. వారు చెప్పిన కథనంలో అనుమానాలు రేకెత్తిస్తుండడంతో రామగిరి ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగిందో, బాధితులు చెప్పే కథనంలో ఎంతవరకు వాస్తవం ఉందో పోలీసుల విచారణలో తేటతెల్లం కానుంది. -
రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు
మంథని: భూ రిజిస్ట్రేషన్ కోసం రూ.50లక్షలతో ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరిన ఇద్దరు వ్యక్తుల అదృశ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్కు వెళ్లకుండా.. ఇంటికి రాకుండా.. మార్గంమధ్యలో ద్విచక్రవాహనం ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్కు చెందిన ఉడుత మల్లయ్య, చిప్ప రాజేశంలు నాలుగేళ్ల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం శివారులో బిల్క్ ఉన్నీసా బేగంకు (ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో ఉంటున్నారు) చెందిన భూమిని కొనుగోలు చేశారు. అయితే భూమికి సంబంధించి ఇరువర్గాల మధ్య మనస్పర్థలు రావడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. అయితే రాజేశం, మల్లయ్యలు కొనుగోలు చేయాలనుకున్న భూమిని సదరు భూయజమానులు వేరేవారికి విక్రయించారు. ఈ విషయమై పలుసార్లు పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలో రాజేశం, మల్లయ్యకు మరోచోట ఉన్న భూమిని ఎకరాకు రూ.10లక్షల చొప్పున సదరు భూయజమానులు విక్రయించేందుకు ఒప్పందం జరిగింది. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో ద్విచక్రవాహనంపై కాటారం బయలుదేరారు. అయితే రిజిస్ట్రేషన్ వద్దకు వెళ్లకపోవడం, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. కాగా ఆదివారం మంథని మండలం భట్టుపల్లి సమీపంలో మైసమ్మ ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం నిలిపి ఉందనే సమాచారం మేరకు పోలీస్ జాగిలాలతో గాలింపు చేపట్టారు. మంథని నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ పోలీస్స్టేషన్, కాటారం వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. సమీప అటవీ ప్రాంతాల్లో సైతం గాలింపు చేపడుతున్నారు. రూ.50లక్షలతో బయలుదేరిన విషయం ఎవరెవరికి తెలుసు, ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఎంత దూరం ద్విచక్రవాహనంపై వెళ్లారు, తర్వాత వారే వాహనం మార్చారా, ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ( చదవండి: మానవత్వం చాటిన మగువ..) -
రిజిస్టార్ను బురిడీ.. రూ.కోటిన్నర స్థలం హాంఫట్
సాక్షి, శంషాబాద్: నకిలీ పత్రాలతో ఇద్దరు వ్యక్తులు కోటిన్నర విలువ చేసే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఎంఓ పేరిట పలుమార్లు ఫోన్ చేసి రిజిస్టార్ను బురిడీ కొట్టించారు. జరిగిన తప్పు తెలుసుకున్న రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయంలో భూములు కోల్పోయిన బాధితులకు శంషాబాద్ పట్టణంలో ఎయిర్పోర్టు కాలనీలో సర్వే నంబర్ 626/1లో ప్లాట్లను 2003లో కేటాయించారు. వీటికి అప్పట్లో పట్టా సర్టిఫికెట్లను మాత్రమే జారీచేశారు. అయితే, ఇప్పటికీ కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై కన్నేసిన మోసగాళ్లు పెద్ద కుట్రకు తెరలేపారు. ఈ సంవత్సరం జనవరి నెలలో కుమ్మరి అమృత అనే మహిళ ఎయిర్పోర్టు కాలనీలో ప్రభుత్వం తనకు కేటాయించిన 360 గజాల ప్లాటును మొకరాల శ్రీనివాస్శాస్త్రికి విక్రయించేందుకు శంషాబాద్ సబ్రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లింది. ఆమె పేరిట ఉన్న పట్టాపై అనుమానం వ్యక్తం చేసిన శంషాబాద్ సబ్ రిజిస్టార్ సిద్ధిఖీ రిజిస్ట్రేషన్కు నిరాకరించారు. దీంతో అక్రమార్కులు నకిలీ పత్రాన్ని సృష్టించారు. ప్రస్తుత రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ జనవరి 19న కుమ్మరి అమృత సరైన లబ్దిదారు అంటూ నకిలీ పత్రాన్ని తయారు చేసి సబ్రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించారు. అంతేగాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) నుంచి అంటూ రిజిస్టార్కు పలుమార్లు ఫోన్లు కూడా చేయించారు. దీంతో సబ్రిజిస్టార్ వీటిపై పూర్తిగా విచారణ చేయకుండానే ఈ నెల 15న కుమ్మరి అమృత నుంచి శ్రీనివాస్శాస్త్రికి 360 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేశారు. కాగా కుమ్మరి అమృత పాత్రను కూడా కొనుగోలుదారులే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. అది బర్త్ సర్టిఫికెట్.. మోసగాళ్లు ఆర్డీఓ పేరిట తయారు చేసిన పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించగా అది నకిలీదిగా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు జారీ చేసే పత్రాలపై ఎక్కడా తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఎంబ్లం ఉండదని తేల్చిచెప్పారు. అంతేగాకుండా సదరు పత్రంలో వేసిన ఎస్డీసీఎల్ఈ(ఎల్ఏపీ) బి/691/2003 రికార్డుల పరిశీలనలో అప్పటి చేవెళ్ల ఆర్డీఓ పరిధిలో ఉన్న బాలానగర్ నివాసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఆర్డీఓ జారీ చేసినట్లుగా ఇచ్చిన పత్రం పూర్తిగా నకిలీదిగా తేలింది. కొనుగోలుదారుడైన వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఈ తంతంగాన్ని నడిపించారు. మరికొన్ని ప్లాట్లు కూడా ఇదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు పథకాన్ని రచించారు. కేసుల నమోదుకు సూచించాం.. విమానాశ్రయం భూ నిర్వాసితులకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం నుంచి అధికారులెవరూ లేఖలను ఇటీవల జారీ చేయలేదు. సదరు వ్యక్తులు సబ్రిజిస్టార్ కార్యాలయంలో ఇచ్చిన లేఖ నకిలీది. అధికారికంగా మేము జారీచేస్తున్న వాటిలో ఎక్కడ కూడా తెలంగాణ రాజముద్ర ఉండదు. లేఖలో వారిచ్చిన నంబరుపై ఇక్కడ మేము బర్త్ సరి్టఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాల్సిందిగా సబ్రిజిస్టార్కు సూచించాం. – చంద్రకళ, రాజేంద్రనగర్ ఆర్డీఓ నకిలీ డాక్యుమెంట్గా తేలింది తొలుత మేము పట్టా సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో పలుమార్లు సీఎంఓ నుంచి అంటూ ఫోన్లు చేయించారు. అంతేగాకుండా ఆర్డీఓ జారీ చేసినట్లు లబ్దిదారులు లేఖను అందజేయడంతో సరైనదేనని భావించి రిజిస్ట్రేషన్ చేశాం. అనంతరం పరిశీలనలో అది నకిలీ డాక్యుమెంట్గా తేలింది. కొనుగోలుదారుడే వాటిని మాకు సమర్పించాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – సిద్ధిఖీ, సబ్ రిజిస్టార్, శంషాబాద్ చదవండి: ఏ బస్సు ఎప్పుడొస్తుందో..? -
రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా..
సాక్షి, హైదరాబాద్ : రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత పది నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆస్తులను కాపాడేందుకు ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. అయితే గతంలో బ్రిటిష్, నిజాం కాలం నుంచి ఆస్తులకు భద్రత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. . ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులను జనం నిలదీశారని, సీఎం తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అధికారుల మాటలు విని సీఎం చెడ్డ పేరు తెచ్చకోవద్దని, ఎల్ఆర్ఎస్పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. (‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలేదు’) కరోనా కాలంలో ట్రీట్మెంట్కు ఆస్తులను కుదవ పెట్టుకుందామన్నా, ఆఖరికి పెళ్లిలకు కూడా డబ్బు అవసరమైతే.. ఆస్తులు అక్కరకు రాకుండా పోతున్నాయని ధ్వజమెత్తారు. ధరణి లోని ఆస్తులను చూపించి.. అప్పులు తెస్తారేమోనని అనుమానం కలుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. పాత పద్ధతి లో రిజిస్ట్రేషన్ ఉంటదని చెప్పి జీవోలో వంద కండీషన్లు పెట్టారు..ప్రభుత్వ తీరుతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందని ఆరోపించారు. తక్షణమే రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎల్.ఆర్.ఎస్ విషయంలో కూడా ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని, లేదంటే ప్రజల ఉసురు తగిలి ప్రభుత్వం కుప్పకూలుతుందని మండిపడ్డారు. (సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట) -
తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పులదండ
రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులనైనా.. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలనైనా సరే నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడేస్తున్నారు. ఆస్తికున్న విలువ అమ్మానాన్నకు ఇవ్వడంలేదు. కొడుకుపై ఉండే ప్రేమ కూతురిపై చూపించడంలేదు. విచిత్రమేమిటంటే.. ఏ కొడుకుల కోసం ఆడపిల్లలను వద్దని అనుకుంటున్నారో.. ఆ కొడుకులే తల్లిదండ్రులపాలిట కాలయములవుతున్నారు. రాష్ట్రంలో జరిగిన మూడు ఘటనలు చూస్తే అసలు మన సమాజం ఎక్కడికి వెళుతుందో అనే అనుమానం కలగకమానదు. డబ్బులివ్వడంలేదనే కోపంతో తల్లి మెడపైనే కాలేసి తొక్కి చంపడానికి ప్రయత్నించిన ప్రబుద్ధుడు ఒకడైతే.. ఆస్తి పంచడంలేదనే కారణంతో తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పులదండలేసి అవమానించిన పుత్రులు మరో ఇద్దరు. ఇవన్నీ చూస్తే.. ‘తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు..’అన్న వేమన పద్యం గుర్తురాక మానదు. సాక్షి, సూర్యాపేట : కని, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను ఇద్దరు కుమారులు ఘోరంగా అవమానించారు. అమ్మానాన్నలను చిత్రహింసలకు గురిచేయడమేకాకుండా వారి చిత్రపటానికి చెప్పులదండ వేసి కుటుంబ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా తండ్రిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని భగత్సింగ్ నగర్లో నివాసం ఉంటున్న తహసీల్దార్ సంజీవరావు, సరోజ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్దకొడుకు నూనె రవీందర్, మూడో కొడుకు నూనె దయాకర్లు ప్రభుత్వ ఉద్యోగులు. నాలుగో కుమారుడు ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగి. రెండో కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. కుమార్తె సుజాత వివాహం చేసుకుని హైదరాబాద్లో స్థిరపడింది. సంజీవరావుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో ఐదెకరాల భూమి ఉంది. ఈ భూమి పంపకాల విషయంలో రవీందర్, దయాకర్లు తండ్రితో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరూ కలిసి తల్లిదండ్రుల చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఫొటో తీశారు. దీనిని కుటుంబ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం సంజీవరావును కిడ్నాప్ చేసి రామన్నపేటకు తీసుకెళ్లి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చదవండి: టీచర్ కాదు.. టీచకుడు తల్లిదండ్రుల ఫోటోకు చెప్పులదండ వేసిన కుమారులు రవీందర్, దయాకర్ పోలీసులకు తల్లి ఫిర్యాదు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నాలుగో కుమారుడికి సాయం చేస్తుంటే తమపై దాడి చేస్తున్నారని తల్లి సరోజ ఆరోపించారు. రవీందర్, అతని కుమారులు నూనె ప్రశాంత్, నూనె భాస్కర్ల సహాయంతో తన భర్త సంజీవరావును కిడ్నాప్ చేశారని ఆమె ఈనెల 14న సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం పోలీసులు రవీందర్ను, ఆయన కుమారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే దయాకర్ను మిర్యాలగూడలో పోలీసులు పట్టుకొని సూర్యాపేట పోలీస్స్టేషన్కు తరలించారు. తండ్రి నుంచి ఆస్తులు బలవంతంగా రిజిసే్ట్రషన్ చేయించుకున్నట్టు విచారణలో వారు అంగీకరించడంతో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన ఇష్టపూర్వకంగానే కుమారుడు రవీందర్ ఇంటికి వెళ్లానని సంజీవరావు చెప్పడం గమనార్హం. మరోవైపు తల్లిదండ్రులను అవమానిస్తే ఊరుకోబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ ఎ.ఆంజనేయులు హెచ్చరించారు. (చదవండి: పుట్టిన కాసేపటికే కన్నుమూసిన పసికందులు) తల్లి మెడపై కాలేసి.. గణపురం: డబ్బులు అడిగినా ఇవ్వడంలేదనే కోపంతో కన్నతల్లినే చంపడానికి సిద్దపడ్డాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. డబ్బు కోసం ఆమెపైనే వేధింపులకు దిగి హత్య చేయబోయాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని ఎస్సీ కాలనీ(ఎర్రగడ్డ)లో మంగళవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బొట్ల సమ్మక్క(75)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు బొట్ల స్వామి వరంగల్లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి సమ్మక్క స్థానికంగా ఉన్న ఓ రైస్మిల్లులో పని చేస్తోంది. స్వామి తరచుగా తల్లి వద్దకు వచ్చి డబ్బు కోసం వేధించేవాడు. మంగళవారం తెల్లవారుజామున సమ్మక్కను తీవ్రంగా కొట్టి బంగారం, డబ్బు లాక్కోవడమే కాక మెడపై కాలుమోపి హత్యచేసే ప్రయత్నం చేశాడు. స్థానికులు ఇది గమనిం చి గట్టిగా అరవడంతో స్వామి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సమ్మక్కను ములుగు ఆస్పత్రికి తరలించారు. -
ఆస్తులు రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లోనే పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలో నే కొత్తగా ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతోంది. క్రయ, విక్రయదారుల నమోదు నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ వరకు అన్నీ ఆన్లైన్లో పూర్తి చేసి.. నిర్దేశిత సమయానికి సబ్రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే సులభంగానే ఈ ప్రక్రియ పూర్తవుతోందని తొలిరోజు పరిశీలన చెబుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది! వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సిటిజన్ లాగిన్, డెవలపర్స్, బిల్డర్స్కు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత పీ టిన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్)ను నమోదు చేయాలి. అయితే ఆ ఆస్తి లేదా భూమి వివరాలు ధరణి పోర్టల్లో నమోదై ఉంటేనే సదరు వివరాలు కన్పిస్తాయి. ఆ తర్వాత ఫ్లాట్ విస్తీర్ణం, నిర్మాణ విస్తీర్ణం కన్పిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువ మేర ఫీజు, మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడు స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ కాగానే క్రయ, విక్రయదారులు, సాక్షులు నిర్దేశిత సమయానికి సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ స్లాట్ అడ్వైజరీ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రయ, విక్రయదారులు, సాక్షుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. వెబ్సైట్ నుంచి సబ్రిజిస్ట్రార్లే ఒక ఫారంను డౌన్లోడ్ చేసి సంతకాలు చేయిస్తారు. మళ్లీ దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. మ్యుటేషన్ వివరాలు కూడా అందులో ఉంటాయి. సదరు ఆస్తికి సంబంధించిన ఈ–పాస్బుక్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ తర్వాత రూ.300 చెల్లిస్తే సదరు ఆస్తికి సంబంధించిన మెరూన్ రంగు పాసుపుస్తకం కొనుగోలుదారుడి ఇంటికి వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి స్టాంపు పేపర్ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ లోగో, మాస్టర్హెడ్తో తెల్లకాగితం మీదే డాక్యుమెంట్ వస్తోంది. అయితే, ఈ డాక్యుమెంట్తో పాటు మెరూన్ రంగు పాసుపుస్తకం ఉంటేనే చట్టబద్ధం అవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేదు. స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా అన్ని వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే స్లాట్ బుక్ అవుతుంది. ఆంగ్ల పరిజ్ఞానం లేని వారు, నిరక్షరాస్యులు మీ–సేవకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 పేజీల డాక్యుమెంట్ వస్తుంది. ఇందులో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు, క్రయవిక్రయదారులు, సాక్షుల వివరాలు, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, సేల్ డీడ్ వస్తున్నాయి. ఇక, పాసు పుస్తకం కూడా 2 పేజీలు వస్తుంది. డీఎస్కు ‘ధరణి’ కష్టాలు! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్కు ధరణి పోర్టల్ కష్టాలు తప్పలేదు. ఇటీవల తన వ్యవసాయ భూమిని విక్రయించిన ఆయన.. కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సోమవారం నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే, రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆధార్ వెరిఫికేషన్ కోసం వేలిముద్రలు, ఐరిస్ సంబంధిత పోర్టల్లో సరిపోలకపోవడంతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ రూరల్ మండలం సారంగపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న తన 3.5 ఎకరాల భూమిని ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆయన నవంబర్ 12న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు డీఎస్ వేలిముద్రలు, ఐరిస్ ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోలలేదు. దీంతో అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే వెనుదిరిగారు. డీఎస్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో ఐరిస్ ట్యాలీ కాలేదని భావించారు. దీంతో ఆయన ఇటీవల ఆధార్ కార్డులో తన వేలిముద్రలు, ఐరిస్ను అప్డేట్ చేసుకున్నారు. అప్డేట్ చేసిన ఆధార్ కార్డుతో సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాగా, ధరణి పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తన వేలిముద్రలు, ఐరిస్ మ్యాచింగ్ కాలేదు. పలుమార్లు వేలిముద్రలు, ఐరిస్కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రెవెన్యూ అధికారులు సాంకేతిక నిపుణుడి సాయం తీసుకోవడంతో ఎట్టకేలకు వేలిముద్రలు, ఐరిస్ మ్యాచ్ అయ్యాయి. దీంతో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డీఎస్ తహసీల్దార్ కార్యాలయానికి రావడం ఇది మూడోసారి.. తొలి రోజు రిజిస్ట్రేషన్లు 82 సాక్షి, హైదరాబాద్: మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగాయని, సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. స్లాట్ బుక్ చేసుకోకుండానే కొందరు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారని, స్లాట్ బుక్ చేసుకొని వారికి రిజిస్ట్రేషన్లు జరపబోమని స్పష్టం చేశారు. మంగళవారం 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు స్లాట్లు బుక్ అయ్యాయని వెల్లడించారు. అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంట్ సాక్షి, నెట్వర్క్: అమావాస్య సెంటిమెంట్కు తోడు సాంకేతిక సమస్యలతో తొలిరోజు ఆయా జిల్లాల్లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా కొనసాగింది. నిబంధనల మేరకు పలు పత్రాలను సమర్పించాల్సి ఉండటంతో చాలామంది వాటిని అందజేయలేక ఇబ్బందిపడ్డారు. సర్వర్ల మొరాయింపుతో పలుచోట్ల స్లాట్లు బుక్కాలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 21 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కరీంనగర్లో 1 రిజిస్ట్రేషన్ కాగా, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కటీ కాలేదు. అరగంటలోనే పనైంది.. నా భర్త పేరిట ఉన్న ఆర్సీసీ భవనం (బిల్డింగ్) నా పేరిట దానపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. గతంలో దీనికోసం 3 నెలలు తిరిగి వేసారిపోయాం. కొత్త విధానంలో ముందే స్లాట్ బుక్ చేసుకుని.. ఈరోజు దుబ్బాక ఆఫీస్కు వెళ్లగా అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. – కాస్తి యాదమ్మ రాములు, ధర్మాజీపేట, దుబ్బాక మున్సిపాలిటీ -
స్లాట్ బుకింగ్: మొరాయిస్తున్న వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ హై కోర్టు ప్రకటించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రస్తుతానికి స్లాట్ బుక్ చేసుకుని పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మరి కొద్ది సేపట్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈనెల 14 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. (చదవండి: వ్యవసాయేతర ‘రిజిస్ట్రేషన్లు’ షురూ..) ఇక పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేసినప్పటికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. స్లాట్ బుక్ చేసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ మొరాయిస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం (డిసెంబర్ 11) నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తులను గతంలో మాదిరే కంప్యూటర్ ఆధారిత విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. Hon’ble CM Sri KCR Garu has directed chief secretary to commence the registration activities of Non-Agricultural properties from tomorrow in accordance with the HC orders — KTR (@KTRTRS) December 10, 2020 ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అభ్యంతరం లేదన్న ధర్మాసనం తేల్చి చెప్పింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సీఏఆర్డీ పద్దతి కొనసాగించాలని పిటిషన్ తరపు న్యాయవాదులు కోరగా.. ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ గతంలో లాగా రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడలని అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్కు ప్రోపర్టీట్యాక్స్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని వాదించారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను ఆపిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. ధరణి వివరాలు మాత్రమే ఆపాలని చెప్పామని, రిజిస్ట్రేషన్పై ఎలాంటి స్టేలు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. స్లాట్ బుకింగ్తోపాటు పీటీఐఎన్(PTIN) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. ధరణి పోర్టల్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం తతుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. -
భూ మాయ!
సాక్షి, జనగామ: రూ.కోట్లు విలువైన భూమికి ఎసరు పెట్టారు. ఇతర రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేయడంతో 12 ఏళ్ల క్రి తం జరిగిన ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన భూ మాయపై రెవెన్యూ అధికారులు కూపీ లాగుతుండగా బాధిత రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్, లక్ష్మీతండా శివారు రామచంద్రగూడెంలో పలువురు రైతులకు చెందిన సర్వే నంబర్లతో ఓ వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని నడిపినట్లుగా తెలుస్తోంది. 2008 ఫిబ్రవరి 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కె.లక్ష్మారెడ్డి బూన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద ఇతర రైతుల సర్వే నంబర్ల పేరుతో జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇతర రైతుల సర్వే నంబర్లను వినియోగించడమే కాకుండా కొందరిని రైతులుగా చూపించి రెండు గ్రామాలకు చెందిన 30 మంది రైతుల సర్వే నంబర్లతో 118 ఎకరాల వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పట్లో సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఈ పన్నాగానికి పాల్పడినట్లు సమాచారం. దరఖాస్తు చేయడంతో వెలుగులోకి.. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న కె.లక్ష్మారెడ్డి మృతి చెందాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారు డు ఇటీవల పట్టాదారు పాసుపుస్తకాల కో సం రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. పాసుపుస్తకాల కోసం పొందుపర్చిన సర్వే నంబర్లను పరిశీలించిన వీఆర్ఏ సంబంధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ భూములు గతంలోనే రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. రెవె న్యూ రికార్డుల్లోని సర్వే నంబర్లలో ఇతర రైతు ల పేర్లు కనిపిస్తున్నాయి. ఈసీలో మాత్రం కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డి పేరు మీద భూమి ఉన్నట్లు వస్తోంది. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారనే విషయంపై ఆరా తీయడంతో రైతుల సర్వే నంబర్లతో ఓ బ్రోక ర్ మృతి చెందిన కె.లక్ష్మారెడ్డికి అమ్మకం చేసినట్లుగా తె లుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గుర్తి ంచడం కోసం రెవెన్యూ అధికారు లు రంగం లోకి దిగి విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది రైతుల సర్వే నంబర్లు వినియోగించా రు అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉన్న ఫొటోలు, సంతకాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. గుర్తించిన భూమి విలువ రూ.23.60 కోట్లు పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తులో పొందుపర్చిన భూమి విలువ రూ.23.60 కోట్లుగా ఉంటుంది. కె.లక్ష్మారెడ్డి కుమారులు సమర్పించిన పత్రాల్లో ఏడు డాక్యుమెంట్లను గుర్తించారు. వీటిలో 118 ఎకరాలుగా భూమి ఉంది. ఫతేషాపూర్, రామచంద్రాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం ఆ భూములు ఎకరానికి రూ.20 లక్షలపైనే ఉంది. ఇంకా బాధిత రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ భూముల సర్వే నంబర్లతో దళారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంపై బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసీలో తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భూమినే నమ్ముకున్న రైతులకు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దరఖాస్తు తీసుకోకుండా పంపించా.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు పట్టుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చే వరకు ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని చెప్పా. 25వ తేదీ వరకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లను మార్చే అధికారం మాకు లేదు. – భన్సీలాల్, తహసీల్దార్, రఘునాథపల్లి -
స్లమ్స్లో రూ.5కే క్రమబద్దీకరణ
సాక్షి, హైదరాబాద్: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజులో స్లమ్ పేరు ఉండాలి జీహెచ్ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
‘ఎల్ఆర్ఎస్’ ఊరట
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చార్జీలు తగ్గనున్నాయి. లే–అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల(ఎల్ఆర్ఎస్)–2020 ఉత్తర్వుల(జీవో 131)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం కొత్త ఉత్తర్వులు(జీవో 135) జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ల మార్కెట్ విలువ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తామని బుధవారం శాసనసభలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే.. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని కొత్త జీవో ద్వారా కీలక సవరణ జరపడంతో దరఖాస్తుదారులకు భారీ ఊరట కలగనుంది. తగ్గనున్న భారం.. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ మొత్తం ధరలో 14శాతాన్ని చెల్లించాలని జీవో 131లో ఉండటంతో దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరణ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలతో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులకు మాత్రం ఈ సవరణతో ఎలాంటి లబ్ధి ఉండదు. వారు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారం గానే.. 14 శాతాన్ని చెల్లించాల్సి రానుంది. అయితే, పాత జీవోలో పేర్కొన్న ప్రకారం 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే క్రమబద్ధీకరణ చార్జీలు వర్తించనున్నాయి. అదే విధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించా ల్సిన నాలా చార్జీలను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవస రం లేదని ప్రభుత్వం పేర్కొనడం మరో ఊరట కలిగించే అంశం. శ్లాబులు 4 నుంచి 7కి పెంపు.. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ చార్జీలను ప్రకటిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131 జారీ చేసింది. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న ప్లాటు మార్కెట్ విలువ ఆధారంగా ‘కనీస క్రమబద్ధీకరణ చార్జీ’ల్లో నిర్ణీత శాతాన్ని కనీస క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాలని తొలి జీవోలో పేర్కొంది. అలాగే క్రమబద్ధీకరణ చార్జీలను నాలుగు శ్లాబులుగా విభజించింది. సవరణ ఉత్తర్వుల ప్రకారం.. శ్లాబుల సంఖ్యను 4 నుంచి 7కు పెంచింది. ఆ మేరకు క్రమబద్ధీకరణ చార్జీల శాతాన్ని సైతం తగ్గించింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్–2015 పథకంలో పేర్కొన్న శ్లాబులనే తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో క్రమబద్ధీకరణ చార్జీల భారం దరఖాస్తుదారులపై తగ్గనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
క్రమబద్ధీకరణలో ఊరట
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులకు భారీ ఊరట లభించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయానికి ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగానే క్రమబద్ధీకరణ రుసుములు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 ఆగస్టు 28 తేదీన అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో (131)లో పేర్కొంది. చాలా ఏళ్ల కింద, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగాభారీగా క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. గడిచిన దశాబ్దకాలంలో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. తాజా మార్కెట్ విలువ ప్రకారం చాలా చోట్ల 200 గజాల స్థలానికి సైతం రూ.లక్షల్లో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమబద్ధీకరణ రుసుములు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండటాన్ని శాసనసభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తెచ్చారు. దీంతో ఎల్ఆర్ఎస్ (జీవో 131) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉప్రకమించింది. బుధవారం శాసనసభలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆయా స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే ఫీజులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈమేరకు సవరించిన ఉత్తర్వును గురువారమే వెలువరించనున్నట్టు ప్రకటించారు. తాము తీసుకున్న చర్యల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునేందుకు వెనకాడబోమని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం కింద భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉపశమనం లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎంత పాతది అయితే అంత ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. ఆరేళ్లుగా అదే మార్కెట్ విలువ.. మరోవైపు గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. అంటే గత ఆరేళ్లలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు యధావిధిగా భారీ మొత్తంలో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరించుకోకపోతే అనధికార, అక్రమ ప్లాట్ల క్రయావిక్రయాల రిజిస్ట్రేషన్లను జరపమని, వీటిల్లో భవన నిర్మాణాలకు సైతం అనుమతులు జారీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్లాట్లు, లేఅవుట్ల యజమానులు నిర్బంధంగా క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తమ ప్లాట్లను బేరానికి పెడుతున్నారు. కొనుగోలుదారులు బయానాగా క్రమబద్ధీకరణ చార్జీలు భరించాలని, ఆ తర్వాత మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్లో సమయంలో తీసుకుంటామని ప్లాట్ల యజమానులు ఆఫర్ చేస్తున్నారు. మురికివాడల్లో మినహాయింపు ఇవ్వాలి... భవన నిర్మాణ నిబంధనల ప్రకారం నోటిఫైడ్ స్లమ్స్లో భవన నిర్మాణ అనుమతుల జారీకి భారీ రాయితీలు, సడలింపులున్నాయి. ఇతర చోట్లలో వసూలు చేసే భవన నిర్మాణ చార్జీలతో పోల్చితే మురికివాడల్లో నాలుగో వంతు చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే విధంగా లేఅవుట్ అనుమతులు లేకపోయినా /ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ చేసుకోకపోయినా మురికివాడల్లోని ప్రజల నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతుల జారీ సమయంలో ఎలాంటి జరిమానాలు, చార్జీలు వసూలు చేయడం లేదు. తాజాగా ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం కింద మురికివాడల్లోని స్థలాల క్రమబద్ధీకరణకు చదరపు మీటర్కు రూ.5 చొప్పున కనీస క్రమబద్ధీకరణ చార్జీలకు తోడుగా, స్థలం మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాల్సి రానుంది. మురికివాడల్లోని పేదలకు ఇది భారం కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు
సాక్షి, కడప : రూ.10 కోట్ల 24 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు ఎగ్గొట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు.. కడప నగరం హబీబుల్లా వీధిలో నివాసముంటున్న జేకే రాజేష్సింగ్, అతని అన్న రమేష్సింగ్లకు కడప సమీపంలోని విశ్వనాథపురంలో 3 ఎకరాల 30 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వారు ప్రొద్దుటూరులోని బి.కొత్తపల్లె, వీఆర్ కాలనీకి చెందిన మణిప్రసాద్రెడ్డి భార్య కవితకు అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది అక్టోబర్ 24న రూ.2కోట్ల 50 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని అగ్రిమెంట్ రాయించారు. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 28న భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు కడప బాలాజీనగర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వారిని పిలిపించారు. అయితే వారు పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకురాకపోవడంతో ఈనెల 3వ తేదీకి రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాజేష్ సింగ్, రమేష్ సింగ్లు 3వ తేదీ మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ప్రొద్దుటూరుకు చెందిన కవిత, మణిప్రసాద్రెడ్డి, భాస్కర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, మురళి ఉన్నారు. వారంతా కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు తక్కువ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత డబ్బులు తక్కువ ఇస్తే ఎలా అని బాధితులు ప్రశ్నించగా ‘ మీకు డబ్బులు ఇచ్చేది లేదు.. మా జోలికి వస్తే చంపుతాం’ అంటూ బెదిరించి దాడికి పాల్పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించుకుని, తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. -
డబుల్ మోసం
సాక్షి,సిటీబ్యూరో: భూ కబ్జా వ్యవహారం ఓ నిండు ప్రాణం తీసింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్ కొనుగోలు చేసిన ఓ ఉపాధ్యాయుడు నిలువునా మోసపోయాడు. అప్పటికే ఆ ప్లాట్ వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయి ఉండడతో షాక్కు గురైన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కానీ న్యాయం జరగకపోగా అతనిపైనే ఎదురు కేసు నమోదైంది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన భర్త రాజేందర్రెడ్డి రియల్ ఎస్టేట్ మోసంతోపాటు పోలీసు అధికారుల బెదిరింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య జయలక్ష్మి ఆరోపించింది. నగరంలో భూ కబ్జాల వ్యవహారం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. రియల్టర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై అమాయకులను మోసం చేసి రూ. లక్షలు దండుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం అడ్డదారిలో వెళ్లే వారికి చట్టం సకాలంలో భరోసా కల్పించకపోవటంతో ఓ నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే కర్మాన్ఘాట్ మాధవనగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బి.రాజేందర్రెడ్డి దంపతులు పొదుపు చేసుకున్న డబ్బుతో రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఫిబ్రవరి 2106లో ప్లాటు కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు ఎల్ఆర్ఎస్ పాటు మున్సిపల్ అనుమతులు తీసుకున్నాడు. తీరా చూస్తే 2019 ఏప్రిల్15న అదే ప్లాట్ను వినోద్బాబు అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి ప్రహారీ నిర్మాణం చేపట్టాడు. ఈ విషయం తెలియడంతో రాజేందర్రెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిబ్బంది అక్కడికి వెళ్లి పనులను నిలిపివేయించారు. ఆపై కాగితాలు తీసుకురమ్మని ఆదేశించగా ఒరిజిల్స్ తీసుకువెళ్లిన దంపతులపై మే6న కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు సైతం రెండో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికే సహకరిస్తున్నారన్న అనుమానంతో కోర్టును ఆశ్రయించిన రాజేందర్రెడ్డి ఇంజెక్షన్ ఆర్డరు పొందారు. అయినా ఆ స్థలంలోకి వెళ్లేందుకు వీళ్లేదంటూ రాజేంద్రనగర్ పోలీసులు హుకుం జారీ చేయటం, ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చి ఇవ్వాలని ఆదేశించటంతో ఈ నెల 21న అన్ని సర్టిఫికెట్లు తీసుకువెళ్లి పోలీస్ అధికారికి అందజేశారు. సదరు అధికారి తీరుతో మనస్తాపానికిలోనైన రాజేందర్రెడ్డి ఈనెల 22న ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగిరాలేదు. తన భర్త కోసం గత వారం రోజులుగా గాలిస్తున్న జయలక్ష్మికి శనివారం మధ్యాహ్నం లింగంపల్లి సమీపంలో రైలు పట్టాలపై రాజేందర్రెడ్డి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందడంతో కుప్పకూలింది. పోలీసుల పాపమే: జయలక్ష్మి తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాటును తమకు కాకుండా చేసేందుకు ఒక వ్యక్తితో కుమ్మక్కైన పోలీసు అధికారి బెదిరింపు కారణంగానే తన భర్త మరణించాడని మృతుడు రాజేందర్రెడ్డి భార్య జయలక్ష్మి ఆరోపించింది. ఉస్మానియా మార్చురీలో గుర్తుపట్టరాని స్థితిలో ఉన్న భర్త శవం వద్ద బోరుగా విలపిస్తూ ఇంత దారుణం చేస్తారని ఊహించలేదని కన్నీరుమున్నీరైంది. తన భర్త మృతిపై విచారణ చేపట్టాలని ఆమె పోలీస్ ఉన్నతాధికారులను కోరింది. -
పోలీసులతో బయటకు నెట్టించి.. తొలి రిజిస్ట్రేషన్
తుళ్లూరు రూరల్ (తాడికొండ): రాజధాని అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుంటూరు జిల్లా తుళ్లూరులో శుక్రవారం ప్రారంభమైంది. ఐనవోలు గ్రామ రెవెన్యూ పరిధిలో ఈ స్థలాలను కేటాయించినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తొలి రిజిస్ట్రేషన్ చేయించుకోగా, చివరి రిజిస్ట్రేషన్ హోంశాఖ ప్రధాన కార్యదర్శి అనురాధ చేయించుకున్నారు. ప్రతి ఒక్క అధికారికి 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించగా, ఇప్పటివరకు దాదాపు 20 మంది అధికారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తుళ్లూరు కార్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు. కాగా, అధికారులకు స్థలాలు కేటాయించడం, వాటిని హుటాహుటిన రిజిస్ట్రేషన్ చేయడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన తమ సమస్యలను పరిష్కరించడంలేదు కానీ అధికారుల స్థలాలకు మాత్రం తొందరొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతి కావాలి రిజిస్ట్రేషన్ చేయించుకున్న అధికారుల వివరాలు తెలియజేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లేవు. సీఆర్డీఏ విజయవాడ కార్యాలయం నుంచి సేల్ డీడ్ పట్టాలను అధికారుల పేరు మీద విడుదల చేస్తున్నారు. వాటి ఆధారంగా సీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. – సీహెచ్ భీమాబాయ్, రిజిస్ట్రార్, తుళ్లూరు ఇంత శ్రద్ధ పేదలపై ఎందుకులేదు? పేదలకు రాజధానిలో ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు. పేదవాడి దగ్గర రెండింతలు కట్టించుకుంటున్నారు. అధికారులకు మాత్రం చదరపు గజం దాదాపు రూ.28 వేలు ఉన్న ప్రాంతంలో కేవలం రూ.4 వేలకే ఇస్తున్నారు. అధికారులపై ఉన్న శ్రద్ధ పేదలపై ఎందుకు లేదు? – బెజ్జం రాంబాబు, నిరుపేద గృహ లబ్ధిదారుడు మా భూములను ప్రభుత్వం అధికారులకు పంచుతోంది మా దగ్గర భూములు తీసుకుని ప్రభుత్వం అధికారులకు పంచుతోంది. మా సమస్యలు చెప్పుకోవడానికి గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వెళితే కలెక్టర్ శశిధర్ పోలీసులతో బయటకు నెట్టించారు. మూడు రోజులుగా రైతులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పట్టించుకున్న నాథుడు లేడు. భూములు పంచుతుంటే మాత్రం అధికారులందరూ వచ్చి తీసుకుంటున్నారు. – తిప్పనబోయిన ధనలక్ష్మి, రాయపూడి మహిళా రైతు -
భూమి ఉన్నా లేనట్లే!
సాక్షి, అమరావతి: తాత్కాలిక (నోషనల్) ఖాతాలున్న రైతులకు రెవెన్యూ శాఖ చుక్కలు చూపుతోంది. ఏళ్ల తరబడి తాత్కాలిక ఖాతాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటిని శాశ్వత ఖాతాలుగా మార్చి వెబ్ల్యాండ్లో తమ పేర్లు నమోదు చేసి ఇ–పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 13 లక్షలుపైగా నోషనల్ ఖాతాలున్నట్లు తేలడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. నోషనల్ (తాత్కాలిక) ఖాతాలను శాశ్వత ఖాతాలుగా మార్చాలంటూ అధికారులు, మంత్రులకు రైతులు వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ‘మీసేవ’, గ్రీవెన్స్ సెల్స్, రెవెన్యూ సదస్సులు, జన్మభూమి సమావేశాల్లో తమ కష్టాలను మొరపెట్టుకుంటున్నా ఆలకించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టినా.. తాత్కాలిక ఖాతాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న చిక్కులను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా ఉన్నప్పుడు గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, క్షేత్రస్థాయిలో అధికారులు చొరవ చూపకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. స్పెషల్డ్రైవ్లో 1.12 లక్షల తాత్కాలిక ఖాతాలు మాత్రమే శాశ్వత ఖాతాలుగా మారాయి. గత ఏడాది సెప్టెంబరులో 17.37 లక్షలున్న నోషనల్ ఖాతాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్ పూర్తయ్యేనాటికి 16.25 లక్షలకు తగ్గింది. తదుపరి కూడా సీసీఎల్ఏ ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి పెంచడంతో నెల క్రితం నాటికి తాత్కాలిక ఖాతాల సంఖ్య 13.08 లక్షలకు తగ్గింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అత్యధికంగా 2,36,789, శ్రీకాకుళం జిల్లాలో 2,25,360, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2,21,240 తాత్కాలిక ఖాతాలు ఉండటం గమనార్హం. అత్యవసరమై అమ్మాలన్నా కుదరదు... గతంలో తాత్కాలిక ఖాతా ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. క్రయవిక్రయాలకు ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత తాత్కాలిక ఖాతాల్లోని సర్వే నంబర్లలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్లు చేయరాదని, బ్యాంకులు ఈ భూములకు రుణాలు ఇవ్వరాదని అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆడపిల్లల పెళ్లిళ్లు, పిల్లల చదువులు, ఖరీదైన జబ్బులకు వైద్యం లాంటి అవసరాల కోసం భూమి అమ్ముకోవాలన్నా దీనివల్ల వీలుకాని పరిస్థితి ఏర్పడింది. నోషనల్ ఖాతాల్లోని భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 2016 ఆగస్టు 12న అన్ని సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలకు 3/6033/2016 నంబరుతో అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఇబ్బందులు వాస్తవమే : అధికారులు ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ‘తాత్కాలిక ఖాతాలవల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. ‘కొన్ని చోట్ల వాస్తవంగా ఉన్న భూమికి, రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్న, భాగపరిష్కారం చేసుకున్న భూ విస్తీర్ణానికి మధ్య తేడా ఉంది. సబ్ డివిజన్ చేయాలంటే సర్వేయర్ల కొరత ఉంది. కొన్ని చోట్లేమో న్యాయపరమైన చిక్కులున్నాయి. సబ్ డివిజన్ చేసినవి కూడా రిజిస్ట్రేషన్ కాని సంఘటనలూ ఉన్నాయి. రెవెన్యూ, స్టాంపులు – రిజిస్ట్రేషన్లు, సర్వే – సెటిల్మెంట్ శాఖలతో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలపై మార్గదర్శకాలు జారీ చేయాలి. సర్వేయర్ల కొరత పరిష్కరించనిదే ఇది సాధ్యం కాదు. వాస్తవంగా ఉన్న భూమికి రైతుల వద్ద రికార్డుల్లో రాసుకున్న భూమికి మధ్య తేడా ఉంటే వారే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటే తప్ప తాత్కాలిక ఖాతాలు రద్దు చేసి శాశ్వత ఖాతాలు ఇవ్వడం వీలుకాదు’ అని పేర్కొన్నారు. నోషనల్ ఖాతా అంటే..? కొనుగోలు, వంశపారంపర్యంగా, భాగ పరిష్కారం ద్వారా ఎవరికైనా భూమి సంక్రమించినప్పుడు రెవెన్యూ శాఖ వెంటనే శాశ్వత ఖాతా ఇవ్వదు. కొత్తగా భూమి పొందిన రైతు పేరుతో తాత్కాలిక ఖాతా నమోదు చేస్తుంది. దీన్నే నోషనల్ ఖాతా, అన్సెటిల్డ్ ఖాతా అని కూడా అంటుంటారు. ఆ భూమి యాజమాన్య హక్కులపై ఎలాంటి వివాదాలు లేవని రెవెన్యూ అధికారులు నిర్ధారించిన తర్వాత తాత్కాలిక ఖాతాను శాశ్వత ఖాతాగా మార్చాల్సి ఉంటుంది. శాశ్వత ఖాతాగా మారిన తర్వాతే రైతుకు ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, భూయాజమాన్య హక్కు పత్రం(టైటిల్ డీడ్) జారీ చేస్తారు. వెబ్ల్యాండ్లో భూమి హక్కుదారుగా నమోదు చేస్తారు. రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, సిబ్బంది స్వార్థం, విస్తీర్ణంలో తేడాలు తదితర కారణాల వల్ల లక్షల సంఖ్యలో నోషనల్ ఖాతాలు ఏళ్ల తరబడి శాశ్వత ఖాతాలుగా మారకుండా అలాగే ఉండిపోతున్నాయి. వాస్తవంగా రెవెన్యూ చట్టంలో నోషనల్ ఖాతా అనేది లేదు. చంద్రబాబు సర్కారు దీన్ని తెచ్చి రైతులను ఇబ్బందుల్లో పడేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవట్లేదు.. మాకు వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాం. రైతుల సదస్సు సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకం అడిగితే శాశ్వత ఖాతా లేదని అధికారులు పేర్కొనటంతో వెంటనే దరఖాస్తు సమర్పించా. మూడేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వలేదు. నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. భూమి అమ్మి పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే పాసు పుస్తకం లేనందున వీలు కావడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నానో లెక్కే లేదు. – కరణం అసిరినాయుడు, పాలవలస, సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. రెండేళ్లుగా పరిష్కారం కాలేదు.. రెండేళ్ల కిందట చిత్తూరు జిల్లా కురబలకోట మండలం పెద్దపల్లి పంచాయతీలో రెండెకరాల భూమి కొన్నా. అప్పట్లో తాత్కాలిక ఖాతా ఇచ్చారు. శాశ్వత ఖాతాగా మార్చి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో లెక్కే లేదు. ఆర్థిక సమస్యల వల్ల భూమి అమ్మాలని నిర్ణయించుకున్నా. బేరం కూడా కుదిరింది. వెబ్ ల్యాండ్లో నమోదు కానందున ఈ భూమి రిజిస్ట్రేషన్ కాదని అధికారులు చెబుతున్నారు. – జయచంద్రారెడ్డి, పెద్దపలి, కురబలకోట మండలం, చిత్తూరు జిల్లా శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు మూడేళ్ల క్రితం నాలుగెకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన కొనుగోలు చేసిన సర్వే నంబరులో వాస్తవంగా ఉన్న భూమి కంటే రెవెన్యూ రికార్డుల్లో ముగ్గురు హక్కుదారుల పేరుతో ఎక్కువ విస్తీర్ణం నమోదై ఉందంటూ అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో వెబ్ల్యాండ్లో తన పేరు నమోదు చేయాలంటూ ఆయన కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నారాయణస్వామి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బుతో రెండేళ్ల క్రితం ఐదెకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని వెబ్ల్యాండ్లో చేర్చాలని దరఖాస్తు చేసుకోగా అమ్మిన వ్యక్తి సోదరి సంతకం లేనందున భూయాజమాన్య హక్కు నమోదు చేయడం కుదరదంటూ రెవెన్యూ అధికారులు కొర్రీ పెట్టారు (బాధితుల కోరిక మేరకు పేర్లు మార్చాం). వారసత్వంగా, భాగస్వామ్య పరిష్కారం, కొనుగోలు ద్వారా భూములు పొందిన లక్షల మంది ఇలా సమస్యలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
సీడీలకు బడ్జెట్ లేదట!
సాక్షి,సిటీబ్యూరో : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో కొత్త సంస్కరణలు ఆచరణలో కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంటున్నా వినియోగదారులకు మాత్రం మెరుగైన సేవలు అందించడంలో కక్కుర్తిగా వ్యవహరిస్తోంది. అక్రమ దస్తావేజుల నమోదు, అడ్డదారులు, అక్రమ వసూళ్లు, రికార్డుల ట్యాంపరింగ్, తప్పుడు దస్తావేజులు నమోదు వంటి అభియోగాలను మూట కట్టుకున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పుడు సరికొత్త విధానాలకు తూట్లు పొడుస్తోంది. తాజాగా స్థిరాస్తి లావాదేవిల్లో పారదర్శకత కోసం అమల్లోకి తెచ్చిన ‘రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్‘కు సీడీల కొరత ఏర్పడింది. సీడీల కోసం ప్రత్యేక బడ్జెట్ లేదంటూ సీసీ కెమెరాల ద్వారా స్థిరాస్తి నమోదు ప్రక్రియను రికార్డు చేసి చేతులు దులుపుకుంటోంది. ఏడాది కాలంగా చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘వీడియో రికార్డింగ్’ విధానం విజయవంతం కావడంతో ఇటీవల అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు విస్తరించారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డింగ్.. పకడ్డందీగా చేయాల్సిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సీసీ కెమెరా ద్వారా రికార్డింగ్ చేస్తున్నారు. కానీ రికార్డింగ్ను సీడీలకు మాత్రం క్యాప్చర్ చేయడం లేదు. ప్రతి సబ్ రిజిస్టార్ ఆఫీస్కు రెండేసి చొప్పున సీసీ కెమెరాలు సరఫరా జరిగాయి. అందులో ఒకటి కార్యాలయంలోను, మరొకటి స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వినియోగించాలి. చిక్కడపల్లి ఎస్ఆర్వోలో విజయవంతంగా అమలవుతున్న మాదిరిగా సీసీ కెమెరాల ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రికార్డింగ్ చేసి, కొనుగోలుదారుడికి రికార్డింగ్ సీసీ కాపీని అందజేయాలని ఇటీవల సాక్షాత్తు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఐజీ, కమిషనర్ వాకటి కరుణ ఆజ్ఞలు జారీ చేశారు. సీసీ రికార్డింగ్ అమలుపై నివేదిక సమర్పించాలని జిల్లా రిజిస్ట్రార్లకు సూచించారు. కానీ సీడీ జారీ మాత్రం అమలు కావడం లేదు. ప్రతి రిజిస్ట్రేషన్ రికార్డింగ్ ఇలా రికార్డింగ్ విధానంలో ‘అమ్మకం దారులు ఫలానా భూమిని ఇష్టపూర్వకంగా అమ్ముతున్నానని, నగదు కూడా తీసుకున్నట్లు’ చెప్పాలి. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. కొనుగోలు దారులు, సాక్షులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయినా తర్వాత రికార్డింగ్ను సీడీలోకి మార్చి కొనుగోలుదారుడికి అందజేయాలి. అమ్మకందారుడు కూడా సీడీని తీసుకోవచ్చు. కానీ సీడీలకు బడ్జెట్ లేదంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా సీడీల జారీకి కక్కుర్తిగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. -
వీఆర్ఏల చేతివాటం..
చిలప్చెడ్(నర్సాపూర్)మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు పథకంలో కొత్త రకం అక్రమాలు వెలుగచూశాయి. మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలంలోని గౌతాపూర్ గ్రామంలో వీఆర్ఏలు చేతివాటం ప్రదర్శించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న వీఆర్ఏలు రాజు, శంకరయ్య, కిరణ్ వారి పేర్లపై సుమారు నాలుగు ఎకరాల భూమిని పట్టాచేసుకున్నారు. దీంతో వారిపేర్లపై నూతనంగా పాస్పుస్తకాలు, చెక్కులు వచ్చాయి. దీంతో వారికి ఇక్కడ లేని భూమిపై ఏవిధంగా పాస్ బుక్కులు, చెక్కులు వస్తాయని గ్రామస్తులు సోమవారం జరిగిన చెక్కుల పంపిణీలో అధికారులను నిలదీశారు. గ్రామస్తులు మట్లాడుతూ ఈ విషయం తహసీల్దార్కు తెలియకుండానే జరిగందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వీఅర్ఏలపై తహసీల్దార్ సాదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించాగా వారు సమాధానం చెప్పకపోవడంతో వీఆర్ఏ రాజుపై చేయిచేసుకున్నాడు. అదే విధంగా మిగతా వీఅర్ఏలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న ఆర్డీఓ వెంకటేశ్వర్లు గౌతాపూర్ గ్రామానికి వచ్చి అధికారులను ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వల్లే అక్రమాలు జరిగాయని, ఇంత జరుగుతున్న తహసీల్దార్ ఏం చేస్తున్నారని ఆర్డీఓను ప్రశ్నించారు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు వివరించారు. అలాగే ప్రజలు తీసుకున్న చెక్కులు, పాస్బుక్కుల్లో చాలా తప్పులున్నాయని వారు గుర్తించారు. దీంతో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో 315 వరకు ఫిర్యాదులు అందాయి. దీంతో రాత్రి 8 గంటల వరకు ఆర్డీఓ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆ ఫిర్యాదులను పరిశీలించి ఇన్ని తప్పులుంటాయా? అన్ని వారిపై మండిపడ్డారు. త్వరలోనే గ్రామంలో జరిగిన అన్ని తప్పులుసరిచేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. -
భూముల రిజిస్ట్రేషన్లకు ఇక టైం స్లాట్!
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. రిజిస్ట్రేషన్లకు టైం స్లాట్ విధానాన్ని తీసుకువస్తున్నామని.. ఇరుపక్షాలు ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే చాలని పేర్కొన్నారు. తొలుత ఐదు మండలాల్లో, అనంతరం 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త విధానంలోని లోటుపాట్లను గుర్తించి, పొరపాట్లకు ఆస్కారం లేకుండా మార్పులు చేర్పులు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇక ‘ధరణి’వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. బుధవారం రిజిస్ట్రేషన్ల అంశంపై ప్రగతి భవన్లో మంత్రులు తుమ్మల, జూపల్లి, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సీనియర్ అధికారులు, ఐఎల్ఎఫ్ఎస్ సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఖరారు చేశారు. స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ భూములు విక్రయిస్తున్న వారు, కొంటున్న వారు ఒక్క సారి మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే సరిపోయేలా.. పాస్బుక్కులు, రిజిస్ట్రేషన్ కాగితాలు కొరియర్లో నేరుగా ఇంటికే వచ్చేలా నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ఖరారు చేశారు. ‘‘భూమిని అమ్మేవారు, కొనేవారు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్మెంట్ కోరాలి. వారికి స్లాట్ కేటాయిస్తారు. ఆ స్లాట్ ప్రకారం ఇచ్చిన తేదీ, సమయానికి ఇద్దరూ కార్యాలయానికి చేరుకోవాలి. తమ సేల్డీడ్ను, పాసు పుస్తకాలను సమర్పించాలి. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అమ్మినవారి పాస్ బుక్కు నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని తీసేస్తారు. కొన్నవారి పాస్ పుస్తకంలో దానిని జమ చేస్తారు. కొత్తగా భూములు కొనేవారైతే కొత్త పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. అదే రోజు పాస్ పుస్తకాన్ని తహసీల్దార్కు పంపుతారు. ఎమ్మార్వో వెంటనే ఆ వివరాలను నమోదు చేసుకుని, సంతకం చేస్తారు. తర్వాత తహసీల్దార్ తన కార్యాలయంలోనే ఉండే ఐటీ అధికారికి ఈ వివరాలు అందచేస్తారు. ఐటీ అధికారి ఈ వివరాలను నమోదు చేసి, ధరణి వెబ్సైట్కు అప్లోడ్ చేస్తారు. అనంతరం సదరు పాస్ పుస్తకాన్ని తిరిగి సబ్ రిజిస్ట్రార్కు పంపుతారు. సబ్రిజిస్ట్రార్ ఎవరి పాస్ పుస్తకాన్ని వారికి, సేల్డీడ్ను భూమిని కొన్నవారికి కొరియర్ ద్వారా పంపుతారు..’’అని సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు. అందరికీ అందుబాటులో భూముల డేటా జూన్ నుంచి ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని, అవి లేని 443 మండలాల్లో తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. వారికి ఇప్పటికే ఒక దఫా శిక్షణ కూడా ఇచ్చామని, మరో విడత శిక్షణ ఇస్తామని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన డేటాను ఉపయోగించి ‘ధరణి’వెబ్సైట్ను రూపొందించాలని, ప్రతీ మండల కేంద్రంలో ఉండే ఐటీæ అధికారి తన మండలంలో ఏ రోజు జరిగే మార్పులను అదే రోజు అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇలా ధరణి వెబ్సైట్ నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటుందని.. అందులో భూములకు సంబంధించిన అన్ని వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో పూర్తి పారదర్శకత వస్తుందన్నారు. మే 7 నుంచి పైలట్ ప్రాజెక్టు.. ధరణి వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి మే 7వ తేదీ నుంచి ఐదు మండలాల్లో.. మే 19 నుంచి గ్రామీణ జిల్లాకొక మండలం చొప్పున 30 మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆయా చోట్ల ధరణి వెబ్సైట్ నిర్వహణలో వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేసి, పరిష్కారాలను సిద్ధం చేస్తారు. ఈ మేరకు మార్పులు, చేర్పులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల వివరాలతో ‘ధరణి’వెబ్సైట్ను నిర్వహిస్తారు. ఈ వెబ్సైట్ నిర్వహణ కోసం సర్వీసు ప్రొవైడర్లతో ఈ నెల 20న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. మొదటి విడతలో ఐదు మండలాలు మొదటి విడతలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కామారెడ్డి జిల్లా సదాశివనగర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో పైలట్ ప్రాజెక్టును చేపడతారు. రెండో విడత మండలాలు.. రెండో విడతలో చేర్యాల (సిద్దిపేట), మానకొండూరు (కరీంనగర్), మేడిపల్లి (మేడ్చల్), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), ఎల్లారెడ్డి (కామారెడ్డి), ఆసిఫాబాద్ (ఆసిఫాబాద్), నెన్నెల(మంచిర్యాల), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతకుంట (సిరిసిల్ల), రాయికల్ (జగిత్యాల), రామచంద్రాపురం(సంగారెడ్డి), రామాయంపేట (మెదక్), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), కేసముద్రం (మహబూబాబాద్), నర్సంపేట (వరంగల్ రూరల్), హసన్పర్తి (వరంగల్ అర్బన్), రఘునాథపల్లి (జనగామ), ముదిగొండ(ఖమ్మం), పాల్వంచ రూరల్ (కొత్తగూడెం), చివ్వెంల (సూర్యాపేట), కట్టంగూర్ (నల్లగొండ), తుర్కపల్లి(యాదాద్రి), బిజినేపల్లి (నాగర్కర్నూల్), పెబ్బేరు (వనపర్తి), ఐజ (గద్వాల), దేవరకద్ర (మహబూబ్నగర్), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), నవాబ్పేట (వికారాబాద్), గుడిహత్నూర్ (ఆదిలాబాద్) మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తారు. -
తహశీల్దార్లకే భూముల రిజిస్ట్రేషన్ అధికారం
-
ఆస్తులకు ఇక భూధార్!
కర్నూలు(అగ్రికల్చర్): పౌరులకు ఆధార్ సంఖ్య కేటాయించినట్లుగానే భూములకు, ఇతర స్థిరాస్తులకు భూధార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూధార్ విధానం ఇప్పటికే జగ్గయ్యపేట, ఉయ్యూరుల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలులో ఉంది. ఈ విధానం అమలుపై తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో త్వరలో జరగనున్న వర్క్షాపునకు కర్నూలు ఆర్డీఓ హుసేన్సాహెబ్ వెళ్లనున్నారు. ఆయన తిరిగొచ్చిన అనంతరం జిల్లాలో ప్రాజెక్టు అమలుపై ప్రాథమిక పనులు మొదలు కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లోపు అమలయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భూధార్లోనే అన్ని వివరాలు.. భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరును కేటాయిస్తారు. జిల్లాలో మొత్తం 4,67,243 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇవిగాక 60 లక్షలకు పైగా స్థిరాస్తులు అంటే ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆధార్ నంబర్ల తరహాలో భూధార్ నంబర్లు ఇవ్వనున్నారు. భూధార్లో భూ యజమానిపేరు, విస్తీర్ణం, భూమి మార్కెట్ విలువ తదితర 20 అంశాలు ఉంటాయి. ఇందులో ప్రతి సర్వే నంబరును జియోట్యాగింగ్ చేస్తుండటంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులకు విశిష్ట నంబరు.. ప్రభుత్వ భూములు, స్థలాలు మొదట రెండు సున్నాలతో విశిష్ట నంబరును కేటాయిస్తారు. వీటిని కూడా జియోట్యాగింగ్ చేయడం వల్ల ఆన్లైన్లో భూధార్ నంబరు కొట్టగానే ఆ భూమి ఎక్కడ ఉందో తెలుస్తుంది. జియోట్యాగింగ్ చేసిన తర్వాత భూములను ఎవరైన కొనుగోలు చేస్తే ఆటోమేటిక్గా మ్యుటేషన్ (మార్పులు) జరుగుతాయి. మ్యుటేషన్ కోసం మీసేవ కేంద్రాలు, రెవెన్యూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్లు, మోసపూరితంగా రుణాలు పొందే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కలకలం రేపుతున్న తహశీల్దార్ ఫోన్ బేరాలు !
-
‘సోలార్’కు సర్కారు భూమి రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లోని దేవాదాయ, సర్వీస్ ఇనాం, అసైన్డ్ భూములే కాకుండా వెట్టి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ఇచ్చిన భూముల్ని కూడా ప్రైవేట్ సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరిట అధికారులు రిజిస్ట్రేషన్లు చేసేశారనే వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు జిల్లాల్లోని కోట్లాది రూపాయల విలువైన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసేశారని పాలమూరు వలస కూలీల సంఘం ఈ పిల్ను దాఖలు చేసింది. దీనిని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది. ఈ మొత్తం భూ బాగోతంపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని, లేనిపక్షంలో న్యాయవిచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రైవేటు వ్యక్తుల భూములుగా పేర్కొంటూ ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్లు చేశారని పేర్కొన్నారు. ఈ భూ బాగోతం వెనుక ఆ రెండు జిల్లాల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల హస్తం ఉందన్నారు. తప్పుడు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగేందుకు అధికారులు సోలార్ పవర్ కంపెనీలకు పూర్తిగా సహకరించారని వాదించారు. -
500 కోట్లకు ‘సర్వే’ చేశాడు
సాక్షి,అమరావతి/పెదవాల్తేరు/కురుపాం/చోడవరం/వీరవాసరం: సస్పెన్షన్లో ఉన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ గేదెల లక్ష్మీగణేశ్వరరావు ఆస్తులపై శనివారం ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. గణేశ్వరరావు ఇంటితో పాటు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్లోను ఈ సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. విశాఖ భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లక్ష్మీగణేశ్వరరావుపై ఆనేక ఆరోపణలు రావడంతో ఇటీవల విధుల నుంచి తప్పించారు. విశాఖలోని సీతంపేటలో గణేశ్వరరావు తన బంధువు పేరిట 5 అంతస్తుల అపార్ట్మెంట్ను నిర్మిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.70 లక్షల విలువైన వోల్వో కారుతో పాటు హోండా 120, ఇన్నోవా కార్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో 3.2కిలోల వెండి సామగ్రి, కిలో బంగారు ఆభరణాలు, వివిధ స్థిరాస్తి పత్రాలు, పెద్ద సంఖ్యలో బ్యాంకు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీతో పాటు రూ. 25 వేల విలువగల రద్దయిన రూ. 500, రూ.1,000 నోట్లు, రూ.10 లక్షల విలువైన ఇంటి సామగ్రి, రూ.10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంట్లో రూ.34 వేల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. గణేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ తెలిపారు. బహిరంగ మార్కెట్లో రూ.500కోట్ల విలువైన ఆస్తులు మాజీ సర్వేయర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలు కీలక ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు, ఐదు ఫ్లాట్లు, 30.36 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆయనతో పాటు ఆయన భార్య సరిత, కుమారులు విజయశేఖర్, రాజశేఖర్, బినామీగా ఉన్న గుడాల సత్యనారాయణ తదితరుల పేరుతో ఉన్న ఆస్తుల మార్కెట్ విలువ పెద్దమొత్తంలో ఉండటంతో ఏసీబీ అధికారులు సైతం కంగుతిన్నారు. సోదాలకొస్తే.. శునకాలను వదిలారు విశాఖపట్నంలో దాడులకు వెళ్లిన ఏసీబీ అధికారులకు వింత అనుభవం ఎదురయింది. విశాఖలోని రామాటాకీస్ పక్కన శ్రీనగర్లోని సువర్ణ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని గణేశ్వరరావు ఇంటికి ఉదయం 8.30 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో సీఐ సుదర్శనరెడ్డి, ఇతర అధికారులు వెళ్లారు. తలుపులు తీసిన గణేశ్వరరావు ఏసీబీ అధికారులను చూసి వెంటనే మూసేశారు. ఏసీబీ నుంచి వచ్చామని తలుపులు తీయాలని కోరాక.. ఎట్టకేలకు తలుపులు తెరిచారు. అధికారులు ఇంట్లోకి ప్రవేశించగానే గణేశ్వరరావు కుమారుడు రాజశేఖర్ అధికారులు, మీడియా ప్రతినిధులపైకి రెండు పెంపుడు శునకాలను ఉసికొల్పాడు. దీంతో అధికారులు కంగారు పడ్డారు. డీఎస్పీ రమాదేవి.. గణేశ్వరరావుకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ద్వారక సీఐ రాంబాబు ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ వద్ద ఏసీబీ అధికారులకు రక్షణ కల్పించారు. ఏసీబీ దాడుల సందర్భంగా అధికారులపైకి ఇలా కుక్కలను ఉసికొల్పడం ఇదే తొలిసారని అంటున్నారు. సోదాలు జరిగిన సమయంలో గణేశ్వరరావు, అతని భార్య, ఇద్దరు కుమారులు ఫ్లాట్లో ఉన్నారు. టీడీపీ నేతలకు లింకులు విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని వలసబల్లేరు గ్రామ సర్పంచ్ ఆరిక విప్లవ్కుమార్ (బాలరాజు).. గణేశ్వర రావుకు బినామీగా సిట్ అధికారులు గుర్తించడంతో అతని ఇంట్లో కూడా ఏసీబీ సీఐ లక్మోజీ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఆయన పేరిట ఉన్న బ్యాంకు ఖాతా లు, లావాదేవీలు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను తనిఖీ చేశారు. చోడవరం తెలుగుదేశం పార్టీ నేత, స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన మాజీ ఎంపీపీ గూనూరు వెంకట సత్యనారాయణ (పెదబాబు) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల విశాఖపట్నం కొమ్మాదిలో పెద బాబు, ఆయన భార్య పేరున 50 ఎకరాల భూమి క్రయవిక్రయాలపై సిట్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. గణేశ్వరరావు ఈ క్రయవిక్రయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. భూములు, ఆస్తులకు చెందిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన గుడాల శ్రీనివాస్, కాయల నానిబాబు ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. గణేశ్వరరావు బంధువులైన వారిద్దరి ఇళ్లలో రాజమహేంద్రవరం, ఏలూరుకు చెందిన ఏసీబీ బృందాలు సోదాచేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. -
భూముల లెక్క తేలుద్దాం!
♦ రాష్ట్రంలో అన్ని భూముల పూర్తి వివరాల నమోదుకు సర్కారు నిర్ణయం ♦ సమగ్ర కుటుంబ సర్వే తరహాలో భారీ సర్వేకు కసరత్తు ♦ వేలాది మంది ఉద్యోగులు, సిబ్బందితో మూడు రోజుల పాటు నిర్వహణ ♦ ఆగస్టు చివరి వారంలో సర్వే చేపట్టాలని సీఎం యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని భూము ల వివరాలను పక్కాగా రికార్డు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ తరహా భూములు, వాటి విస్తీర్ణం, యజమానులు తదితర అన్ని అంశాలనూ నమోదు చేయనుంది. ఇందుకోసం సమగ్ర కుటుంబ సర్వే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరో భారీ సర్వేకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే 3 రోజుల పాటు రాష్ట్రమంతటా సమగ్ర భూముల సర్వే చేయిం చాలని సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయిం చారు. పల్లెల నుంచి పట్నం వరకు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది, ఎవరెవరి పేరట ఉంది, విస్తీర్ణం ఎంత, సాగు భూములెన్ని, హక్కుదా రులెవరు.. ఇలా ప్రతి అంగుళం భూమి వివరాలన్నీ సేకరించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇక వివాదాలకు చెక్.. ఈ సర్వే సందర్భంగా భూముల వివాదాలను పరిష్కరించి.. వాస్తవ యజమానులెవరో గుర్తించి, ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే సీఎం ఇప్పటికే ఈ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం కావడంతో ఆగస్టు 15 వరకు హరితహారం కార్యక్రమంపై దృష్టి సారించాలని... ఆ నెల చివరి వారంలో భూముల సమ గ్ర సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. సర్వే నిర్వహణకు ఉద్యోగులు సరిపోకపోతే.. 15 వేల మంది వరకు నిరుద్యోగ యువకులను వినియోగించుకోవాలని ఆదేశించారు. పెట్టుబడి పథకానికి ముందస్తు వ్యూహం! వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో కూడిన పథకం కావటంతో.. అవకతవకలకు తావు లేకుండా, పక్కాగా అమలు చేసేందుకు సర్కారు ముందస్తు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో సాగు భూముల సర్వే చేయించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ సర్వేలో దాదాపు 1.26 కోట్ల ఎకరాల సాగు భూములున్నట్లు తేలింది. అయితే తమ భూముల వివరాలు ఇంకా నమోదు కాలేదని, మరో అవకాశం ఇవ్వాలంటూ రైతుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. అంతేగాకుండా వివాదాలు, కోర్టు కేసుల్లో ఉండడం వంటి కారణాలతో మరో 12 శాతం భూముల వివరాల నమోదు పెండింగ్లో పడింది. ఈ నేపథ్యంలోనే సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం మొగ్గు చూపింది. యూనిక్ కోడ్తో టైటిల్ డీడ్ భూమి లెక్కలు తేలిన తర్వాత కొత్తగా టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకాలు ఇస్తారు. ప్రతి రైతుకు, పాస్ పుస్తకానికి ప్రత్యేక (యూనిక్) కోడ్ ఇస్తారు. భూరికార్డులన్నీ సరిచేసిన తర్వాత రూపొందించిన జాబితానే ప్రభుత్వం అనుసరిస్తుంది. అందులోని వివరాల ఆధారంగా.. ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందనే దాని ప్రకారం పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తుంది. ఇక రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలు, వారసత్వ బదిలీ, పేరు మార్పిడి విధానాలన్నీ అక్టోబర్ నెలాఖరులోగా సరళంగా, పారదర్శకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీ వంటివి నిర్ధారిత సమయంలోగా చేయకుంటే సంబంధిత అధికారికి జరిమానా విధించేలా కొత్త విధానాన్ని రూపొందించనున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణ.. ప్రచురణ నిజాం కాలంలో అమల్లోకి వచ్చిన రెవెన్యూ విలేజ్ విధానంలో నిర్ణయించిన గ్రామ శివార్లు, అప్పటి సర్వే నంబర్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం రెవె న్యూ శాఖ వద్ద, వ్యవసాయాధికారుల వద్ద భూమి రికార్డులున్నాయి. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోవటంతో భూవివాదాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే ద్వారా వివాదాలను పరిష్కరించనున్నారు. మొత్తం వ్యవసాయ భూముల రికార్డులన్నీ సర్వే వివరాలతో సరి పోల్చి, అవసరమైన సవరణలు చేస్తారు. అనంతరం ఆయా గ్రామాల వారీగా భూముల వివరాలు, వాటి యజమానులు, సర్వే నంబర్లు, సర్వే సందర్భంగా సవరించిన రికార్డుల వివరాలన్నీ ఓటర్ల జాబితాల తరహాలో అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామాల్లో ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, విచారణ జరుపుతారు. అవసరమైన సవరణలు, మార్పులు చేర్పులతో భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ తుది భూముల రికార్డుల్లోనూ ఏవైనా అభ్యంతరాలుంటే.. పరిశీలించి, సరిదిద్దుతారు. -
ఇక మేం చెప్పినట్టే!
♦ భూముల రిజిస్ట్రేషన్లకు అంగీకరించని రైతులు ♦ హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ ♦ టీడీపీ పెద్దల మోసాలతో విసిగిపోయిన రాజధాని వాసులు ♦ రైతులను ఒప్పించలేని సీఆర్డీఏ ఉన్నతాధికారులు ♦ ఏం చేయాలనే విషయమై అధికారుల మల్లగుల్లాలు ఎంతవరకైనా పోరాడతాం సీఆర్డీఏ రోడ్డు కోసం అధికారుల మాటలు విని మా ఇల్లు వదులుకునే ప్రసక్తే లేదు. పునరావాస కాలనీని పూర్తిగా నిర్మించి మాకు అప్పగిస్తేనే అంగీకార పత్రాలు ఇస్తాం. అప్పటివరకు ఇళ్ల జోలికి వస్తే సహించం. లేకపోతే ఎంత వరకైనా పోరాడతాం. – షేక్ షఫీ, నవులూరు సాక్షి, అమరావతి బ్యూరో : ‘మొదట మీరు చెప్పినవన్నీ చేయండి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ల సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి భూములు రిజిస్ట్రేషన్ చేసేది లేదు. భూమలు తీసుకోక ముందు మీరు చెప్పిందొకటి... ఇప్పుడు చేస్తున్నది మరొకటి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు ఇక నమ్మే పరిస్థితి లేదు. మాకు న్యాయం జరగకపోతే ఎంతవరకైనా వెళ్తాం. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం...’ అంటూ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు తేల్చిచెబుతున్నారు. మూడేళ్లుగా ఇదిగో అభివృద్ధి.. అదిగో ప్లాట్లు.. అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని సీఆర్డీఏ అధికారులపై మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ పెద్దలు తమకు తీరని అన్యాయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి... రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల నుంచి సుమారు 33వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో సమీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 27 గ్రామాల్లోని 22,400 మంది రైతులకు 56,920 వాణిజ్య, నివాసయోగ్యమైన ప్లాట్లు కేటాయించారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మాత్రం ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరగలేదు. ప్లాట్ల కేటాయింపు పూర్తయ్యాక రైతులు పూలింగ్కు ఇచ్చిన భూములను అధికారికంగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. అయితే, నెలలు గడుస్తున్నా... రైతులెవ్వరూ భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక సీఆర్డీఏ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయితేనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలు సీఆర్డీఏ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అప్పుడు హామీల వర్షం... ఇప్పుడు ఆధికార జులుం ! భూములు తీసుకునేముందు అనేక మంది ప్రజాప్రతినిధులు రాజధాని రైతులపై హామీల వర్షం కురిపించారు. కానీ, ఒక్కటీ నెరవేర్చకపోవడం.. మూడేళ్లవుతున్నా రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలు మినహా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీంతో భవిష్యత్లో తమకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లకు ససేమీరా అంటున్నారు. అందులో భాగంగానే.. ఇటీవల తాడేపల్లి, కృష్ణాయపాలెం గ్రామాల పరిధిలో అవగాహన సదస్సులను రైతులు బహిష్కరించారు. రిజిస్ట్రేషన్లు చేసి తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని అధికారులకు తేల్చి చెప్పారు. గురువారం నవులూరులో నిర్వహించిన గ్రామ సభలో కూడా రైతులు, ప్రజలు ఇదే తరహాలో ముందుగా హామీలు అమలు చేయాలని అధికారులను నిలదీశారు. ఇకపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం కష్టసాధ్యమవుతుందని సీఆర్డీఏ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ పెద్దలు అధికార బలం ఉపయోగించి రైతులను బెదిరించి రిజిష్ట్రన్లు చేయించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు... ♦ భూములు ఇచ్చిన మెట్ట రైతులకు రూ.30 వేలు, జరీబుకు రూ.50 వేలు చొప్పున ఏటా కౌలు ఇస్తాం. అలాగే ప్రతి సంవత్సరం 10శాతం కౌలు సొమ్ము పెంచుతాం. ♦ భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద కేటాయించే ప్లాట్లు అదే గ్రా>మంలో కోరినచోట.. కోరుకున్న విధంగా ఇస్తాం. ♦ ప్లాట్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అప్పగిస్తాం.. ♦ రైతు కూలీలకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున పింఛను చెల్లింపులు, కూలీలు అందరికీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చూపుతాం. ♦ ప్రతి గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు చొప్పున నిధులు కేటాయిస్తాం. ♦ రాజధాని రైతుల పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య, అన్ని కుటుంబాల వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తాం. ♦ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. లేదంటే నిరుద్యోగ భృతి అందజేస్తాం. ♦ గ్రామ కంఠాలు ఎవరి అనుభవంలో ఉంటే వారికే కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. ఇదీ ప్రస్తుత పరిస్థితి... ♦ ఏటా ఏప్రిల్ మొదటి వారంలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. కానీ, ఈ ఏడాది జూలై 13వ తేదీ వచ్చినా, ఇంత వరకు కౌలు చెల్లించలేదు. ♦ ఆన్లైన్ ద్వారా ప్లాట్ల కేటాయింపులో అడుగడుగునా మోసాలకు పాల్పడ్డారు. ♦ ఊరికి అవతల, పక్క గ్రామాలు, పొలిమేరల్లో విలువలేని ప్లాట్లను రైతులకు కేటాయించారు. ♦ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులకు మాత్రం కోరినచోట, కోరుకున్న విధంగా ప్లాట్లు కేటాయించారు. ♦ రైతులకు కేటాయించిన ప్లాట్లు ఇంత వరకు అభివృద్ధికి నోచుకోలేదు. ♦ కేవలం నేలపాడులో లే అవుట్ అభివృద్ధి పనులు ప్రారంభించినా, నేటికీ పూర్తికాలేదు. -
కేకే భూముల రిజిస్ట్రేషన్ రద్దు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ణయించింది. 22ఏ కింద డిక్లేర్ చేసిన భూముల్లో 36 ఎకరాలను గోల్డ్స్టోన్ ప్రసాద్ నుంచి కేకే కుటుంబీకులు కొన్నట్లు స్పష్టం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన రెవెన్యూ యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ రద్దు అంశాన్ని కూడా పొందుపరిచింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దీనిపై తదుపరి అడుగు వేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
కోలుకోని రిజిస్ట్రేషన్లు!
జనవరిలో 25 శాతం పడిపోయిన ఆదాయం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు దెబ్బ నుంచి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఇంకా కోలుకోలేదు. కేంద్రం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి మూడు నెలలైనా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఇంకా మెరుగుపడలేదు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు, అమ్మకాల జోరు తగ్గడంతో ఈ జనవరిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాది జనవరి కంటే భారీగా తగ్గింది. గతేడాది జనవరిలో రూ.232.53 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు సమకూరగా, ఈ ఏడాది కేవలం రూ.175.04 కోట్ల ఆదాయమే వచ్చింది. ఆదాయంలో పెరుగుదల శాతం –24.72గా నమోదు కావడం గమనార్హం. పాతనోట్ల మార్పిడితో వినియోగదారుల సొమ్మంతా బ్యాంకుల్లోనే ఉండిపోవడం, ఆస్తుల అమ ్మకం ద్వారా వచ్చిన సొమ్ముపై క్యాపిటల్ గెయిన్స్ కింద అమ్మకందారు భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి రావడం కూడా క్రయవిక్రయాల తిరోగమనానికి కారణాలు గా కనిపిస్తున్నాయి. క్యాపిటల్ గెయిన్స్పై 30 శాతం దాకా పన్ను ఉండడంతో కొనుగోళ్లు, అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడింది. గత సెప్టెంబర్ వరకు 32 శాతం పెరుగదలతో దూసుకెళ్లిన రిజిస్ట్రేషన్ల ఆదా యం తాజాగా జనవరిలో 24 శాతం తగ్గడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెలన్నర రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు నిర్ధేశించిన ఈ ఏడాది వార్షిక లక్ష్యం రూ.4,292 కోట్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు. భయమే కారణమా..! ఏ వ్యక్తి పేరిటనైనా ఒకటి కన్నా ఎక్కువ ఫ్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లయితే వాటిని విక్రయించేప్పుడు తప్పనిసరిగా క్యాపిటల్ గెయిన్స్ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అమ్మకందారులు బెంబే లెత్తుతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకున్న రెండు ఫ్లాట్లలో ఒకదాన్ని రూ.కోటికి అమ్మినట్లయితే, తొలి మూడేళ్ల లోనైతే అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో 30 శాతం అంటే దాదాపు రూ.30 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత అయినట్లయితే 20 శాతం అంటే రూ.20లక్షలు ఆదాయపుపన్నుగా చెల్లించాలి. అయితే, కేంద్రం ఇటీవల క్యాపిటల్ గెయిన్స్పై పన్ను విధానాన్ని సడలించిన నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి కాసింత సాంత్వన లభించనుంది. 30 శాతం పన్ను స్లాబ్ను మూడేళ్ల నుంచి రెండేళ్లకు కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం మూడేళ్లుగా సవరించకపోవడంతో బహిరంగ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో భూమి ధర చదరపు గజం రూ.3 వేలు ఉంటే, రిజిస్ట్రేషన్ విలువ రూ.వెయ్యికి మించి లేదు. దీంతో బహిరంగ మార్కెట్ ధర మేరకు సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో చెల్లించే దానికంటే చాలా ఎక్కువ అవుతుం డడం కూడా కొనుగోలుదారులు మొగ్గు చూపకపోవడానికి కారణంగా తెలుస్తోంది. -
నోట్లు రద్దుతో నిలిచిన భూముల రిజిష్ట్రేషన్లు
-
ఇచ్చుకో.. పుచ్చుకో..
* రైతులకు ఎన్వోసీ కష్టాలు * పిండుకుంటున్న అధికారులు * రాజధాని గ్రామాల్లో వసూళ్ల దందా * ఆందోళనలో అన్నదాతలు శాఖమూరుకు చెందిన ఓ రైతు కుమార్తె ఆపరేషన్కు రూ.5 లక్షలు అవసరమైంది. అప్పు పుట్టకపోవడంతో తనకున్న ఎకరంలో కొంత విక్రయించాలని నిర్ణయించారు. కొనేందుకు రియల్టర్లు సిద్ధంగా ఉన్నా.. భూమి రిజిస్ట్రేషన్కు ఎన్వోసీ తప్పనిసరి అన్నారు. ఆ రైతు సీఆర్డీఏ అధికారులను కలవగా రూ.65 వేలు డిమాండ్ చేశారు. చేసేది లేక రూ.10 వడ్డీతో రూ.65 వేలు తెచ్చి ముట్టజెప్పారు. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో అవినీతికి హద్దే లేకుండా పోతోంది. నీకు పని చేసిపెడితే నాకేంటి లాభం అన్నట్లుంది వ్యవహారం. కొంతమంది అధికారులు రైతులకు ఏ పని చేసిపెట్టాలన్నా వేలు, లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే ఆ రైతు మెడకు మరిన్ని సమస్యలను చుడుతున్నారు. ముఖ్యంగా నిరభ్యంతర పత్రాలకు (ఎన్వోసీ) డిమాండ్ ఏర్పడింది. తమ భూములను అవసరాలకు విక్రయించాలన్నా అధికారుల అనుమతిని తప్పనిసరి చేస్తూ టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో రైతుకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్వోసీ కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెపితే గానీ అధికారులు సంతకం పెట్టడం లేదు. తప్పని పరిస్థితుల్లో వారడిగింది సమర్పించుకు ఎన్వోసీ తీసుకుంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు లాక్కున్న విషయం తెలిసిందే. భూములిచ్చేందుకు ఇష్టం లేని రైతులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. రైతులు తమ భూములు సొంతంగా అమ్ముకుంటే ప్రభుత్వ పెద్దలకు ఉపయోగం ఉండదని భావించి రాజధాని ప్రాంతంలో ఏకంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయించారు. ఒకవేళ రైతులు తమ భూములు అమ్ముకోవాలంటే సీఆర్డీఏ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలని నిబంధన పెట్టింది. ప్రభుత్వం విధించిన ఈ నిబంధన రైతుల పాలిట శాపంలా మారింది. అధికారులు, ప్రభుత్వ పెద్దల బినామీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. దోచుకున్నోడికి దోచుకున్నంత.. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను లాక్కోవడం మొదలుపెట్టాక పంటల సాగును బలవంతంగా నిలిపివేసి అందులో నుంచి రైతులను గెంటివేసినంత పనిచేశారు. చేసిన అప్పులు, కుటుంబ అవసరాలు, అనారోగ్య సమస్య నుంచి గట్టెక్కేందుకు రైతుకు ఆదాయ మార్గాలు దూరమయ్యాయి.lఉన్న భూమిని విక్రయిస్తే తప్ప అవసరాలు తీరే పరిస్థితులు కనిపించలేదు. దీంతో భూములను విక్రయించేందుకు సిద్ధమెన రైతులు ఎన్వోసీల కోసం సీఆర్డీఏ అధికారులను కలిశారు. వారిలో కొందరు డబ్బులు డిమాండ్ చేశారు. రైతు అవసరాలను గుర్తించిన అధికారులు దందాను మరింత విస్తృతం చేశారు. వసూళ్లకు కొంతమంది దళారులను కూడా నియమించారు. దళారుల ద్వారా వస్తే కానీ సీఆర్డీఏ అధికారులు ఎన్వోసీ ఇవ్వడం లేదు. మొదట్లో రూ.వెయ్యి, రెండువేలు తీసుకునే అధికారులు ఇప్పుడు ఏకంగా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అవ్ మల్లన్నా
ప్రాజెక్టుకుమార్గం సుగమం! భూములిచ్చేందుకు రైతుల అంగీకారం ఒక్కొక్కటిగా ముందుకొస్తున్న ముంపు గ్రామాలు వేములఘాట్ మినహా అన్ని పల్లెలు ఓకే తాజాగా సరేనన్న సింగారం మంత్రి హరీశ్ మాటలే భరోసా అంటున్న జనం ఇప్పటి వరకు 3,067 ఎకరాలు రిజిస్ట్రేషన్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:నిన్నటి దాకా కంటి మీద కునుకు లేదు.. ఎవరిని పలకరించినా పుట్టి పెరిగిన ఊరిని పోగొట్టుకుంటున్నామన్న దిగులు.. ఆ ఆవేదనతో పిడికిళ్లు బిగించి పోరుబాట.. అదే జనం నేడు ‘ఊరునిస్తాం.. తీసుకోండి’ అంటున్నారు. లక్ష్మీపూర్.. బంజేరుపల్లి.. ఏటిగడ్డ కిష్టాపూర్.. పల్లెపహాడ్.. ఎర్రవల్లి.. తాజాగా సింగారం.. ఇలా ఒక్కో పల్లె త్యాగానికి సిద్ధమవుతోంది.మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూసేకరణలో ఎదురైన అవరోధాలు ఒక్కొక్కటే తొలగిపోతున్నాయి. ప్రాజెక్టుకు పునాదిగా నిలుస్తామంటూ ముంపు గ్రామాలు ముందుకొస్తున్నాయి. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 7 గ్రామాల్లో.. 5 గ్రామాల ప్రజలు భూములు, ఇళ్లు ఇవ్వడానికి అంగీకరించారు. నిన్నటి వరకు ఏ టెంటు కింద భూసేకరణకు ససేమిరా అన్నారో.. నేడు అదే టెంటు కింద తమ భూములను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేస్తూ సంతకాలు చేస్తున్నారు. ప్రాజెక్టు కింద మొత్తం 7,613 ఎకరాల పట్టా భూములు సేకరించాల్సిఉండగా, 3,067 ఎకరాలను ఇప్పటి వరకు సర్కారుకు అప్పగించారు. సేక‘రణా’నికి తెర.. గోదావరి నదిపై కాళేశ్వరం కింద 50 టీఎంసీలతో నిర్మిస్తున్న కొమరవెల్లి మలన్నసాగర్ ప్రాజెక్టు కోసం తొగుట మండల గ్రామాల్లో చకచకా భూసేకరణ జరుగుతోంది. లక్ష్మీపూర్, బంజేరుపల్లి, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, ఎర్రవల్లి గ్రామస్తులు తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వివిధ పార్టీలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా.. ముంపు గ్రామాల రైతులు మాత్రం భూసేకరణకు అనుకూలంగా మారుతున్నారు. 2013 భూ సేకరణ చట్టంపై కూడా వారు ఆసక్తి చూపించటం లేదు. భూములు కోల్పోయి మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదని రైతులు అంటున్నారు. ఎలాగు ప్రభుత్వం ప్రాజెక్టు కట్టాలనే దఢ నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఉద్యమాలు అనవసరమనే ఆలోచనకు వస్తున్నారు. ‘కొట్లాడి దుష్మన్ అయ్యే బదులు మంచిగ ఉండి సర్కారు చేత నాలుగు పనులు ఎక్కువ చేయించుకుంటం’ అని ఏటిగడ్డ కిష్టాపూర్కి చెందిన ఆంజనేయులు అన్నాడు. 123 జీఓ ఉత్తర్వుల ద్వారా నిర్ణయించిన ధర 15–30 రోజుల్లో చేతికి అందటం, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే ముంపు గ్రామాన్ని పోలిన కొత్త గ్రామాన్ని నిర్మించి ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఇస్తున్న హామీ.. ముంపువాసులకు భరోసానిస్తోంది. ఉద్యమం చేసిన ఊరే.. ముంపు వ్యతిరేక ఉద్యమానికి ముందు బీజం పడిన ఊరు ఏటిగడ్డ కిష్టాపూర్. ఈ ఊరును ఆదర్శంగా తీసుకొని మిగిలిన ఊళ్లు కూడా పోరుబాట పట్టాయి. ఇప్పుడు ఇదే ఊరు భూముల రిజిస్ట్రేషన్లో అందరి కంటే ముందుంది. ఇక్కడ మొత్తం 850 మంది పట్టా, 275 అసైన్డ్ భూములున్న రైతులున్నారు. 1,592 ఎకరాల పట్టా భూమి సాగులో ఉంది. ఇందులో 650 మంది రైతులు 1,150 ఎకరాలను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్∙చేశారు. మిగిలిన భూమిని వారంలోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటామని తొగుట తహసీల్దారు దేశ్యా నాయక్ తెలిపారు. మంత్రి హరీశ్రావు మాట మీద భరోసాతోనే ఊరును త్యాగం చేస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. ఊరుకు ఊరు కట్టిస్తా.. నా మాటపై నమ్మకం ఉంచి త్యాగానికి సిద్ధమైన రైతులకు వందనం. ముంపు ఊరుకు బదులు ఊరును కట్టిస్తాం. వాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టకుంటా. సాధారణ బైనామాలను పట్టా చేయటం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, గతంలో రైతులకు అసైన్డ్ చేసిన భూముల్లో చిన్నచిన్న వివాదాలు తదితర కారణాలతో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయి. రోజుకు 60 నుంచి వంద ఎకరాల కంటే ఎక్కువ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నాం. కొంత ఆలస్యమైనా సరే ఎలాంటి వివాదాలు లేకుండా, రైతులకు అన్యాయం జరగకుండా భూమి రిజిస్ట్రేషన్ జరగాలని అధికారులను ఆదేశించాను. -హరీశ్రావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తొలి సంతకం నాదే.. నాకున్న రెండు ఎకరాలు. మల్లన్నసాగర్కు అందరి కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసిన. రైతుకు ఎంత కష్టం ఉందో నాకు తెలుసు. నీళ్లు వస్తయి అంటున్నారు. నా పంట భూమి మునిగినా రైతు బతుకుతడనే ఆలోచించి మొదటి సంతకం పెట్టిన.రైతులు బాగుపడతరు.. – నేవూరి నర్సింహారెడ్డి, తిరుమలగిరి నాకు నాలుగు ఎకరాలున్నాయి. సాగు చేస్తే అప్పులే మిగిలాయి. అయినా భూమి మీద ఆశపోకున్నా అందరితో పాటు భూమిని వదులుకున్నా.. ప్రాజెక్టు నీళ్లొస్తే మిగిలిన రైతులైనా బాగుపడతరేమో చూడాలె.– మన్నెం కిష్టారెడ్డి, ఎర్రవల్లి, కొండపాక మండలం మంత్రి మాటపై గురి ఉంచిన.. మంత్రి హరీశ్రావుపై నమ్మకంతో ఏడెకరాల భూమిని మల్లన్నసాగర్కు ఇచ్చినం. ఇక నీళ్ల ముంచిన..పాల ముంచిన ఆయనదే భారం. ఇన్నాళ్లు సాగు నీరు లేక రైతులు ఉరిబెట్టుకొని సచ్చిపోయిండ్రు. నా ఏడెకరాల భూమి 700 ఎకరాలకు నీళ్లియ్యాల..– వంజరి సరోజన, మహిళా రైతు, ఏటిగడ్డ కిష్టాపూర్ ఊరు నిర్మిస్తామన్నారు.. సాగు భూములకు పరిహారంతో పాటు గ్రామానికి గ్రామం నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో నా మూడెకరాలు ఇచ్చాను. తిరిగి గ్రామస్తలందరికీ ఓకేచోట ఆవాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషం.– పోకల బాల్రాజు, లకా్ష్మపూర్ మల్లన్నసాగర్ భూ రిజిస్ట్రేషన్ ఇలా (పట్టా, అసైన్డ్ భూమి ఎకరాల్లో) గ్రామం రైతులు పట్టా అసైన్డ్ ఎల్లారెడ్డిపేట 86 65 70 తుక్కాపూర్ 445 240 286 తొగుట 954 1180 490 ఏటిగడ్డకిష్టాపూర్ 780 1150 250 పల్లెపహాడ్ వివరాలు అందలేదు లక్ష్మీపూర్ వివరాలు అందలేదు బంజేరుపల్లి వివరాలు అందలేదు -
భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు లేనట్లే!
- రెవెన్యూ లక్ష్యాన్ని చేరాలంటే పెంచక తప్పదన్న రిజిస్ట్రేషన్ల శాఖ - రూ.400 కోట్ల పెంపు ప్రతిపాదనలను తోసిపుచ్చిన సర్కారు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఈ ఏడాదికి పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భూముల ధరలను సమీక్షించడం తప్పనిసరని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. అయితే, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చిన ధరల పెంపు ప్రతిపాదనలను సర్కారు తాజాగా తోసిపుచ్చిందని, ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ధరల పెంపు అంశం ప్రస్తుతానికి వాయిదా పడినట్లేనని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి రెండేళ్లకోసారి భూముల ధరలను రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షించాలి. 2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం భూముల ధరలను సవరించింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడటం, మూడేళ్లుగా భూముల ధరల పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుండటం, వివిధ కారణాలతో ప్రభుత్వం వాటిని తిరస్కరిస్తుండటం జరుగుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడం, మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా మార్కెట్ వాల్యూ మరింత తగ్గడం.. తదితర అంశాలు రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతియేటా రెవెన్యూ వసూళ్లకు సంబంధించి లక్ష్యాలను పెంచుతున్న సర్కారు ఆ మేరకు భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచకపోతే లక్ష్యాలను చేరుకోవడం ఎలాగంటూ.. ఉన్నతాధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ ఏడాది లక్ష్యం రూ. 4,291 కోట్లు రిజిస్ట్రేషన్ శాఖకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.4,291 కోట్ల రెవెన్యూ వసూలు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, వివిధ కారణాలతో నాలుగేళ్లుగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేక ఆ శాఖ ప్రతియేటా చతికిల పడుతోంది. ప్రతియేటా అంతకుముందు సంవత్సరం కంటే ఎంతోకొంత ఆదాయం పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతేడాది రూ.3,700 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,100 కోట్ల(83.78 శాతం) రెవెన్యూ రాబట్టిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు..అంతకుముందు ఏడాది ఆదాయం కన్నా 22.59 శాతం పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచిన పక్షంలో మరో రూ.400 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని, గతేడాది మాదిరిగా వార్షికాదాయంలో 23 శాతం పెరుగుదల కనిపించిన పక్షంలో మరో రూ.713 కోట్లు రావచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. మొత్తంగా రూ. 1,113 కోట్ల ఆదాయం అదనంగా లభించినట్లయితే ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు భావించారు. అయితే..రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సమర్పించిన ధరల పెంపు ప్రతిపాదనను సర్కారు తాజాగా తోసిపుచ్చడంతో ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకోవడమెలాగని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తహశీల్దార్ కార్యాలయంలో ఇంటి దొంగలు..!
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ 16 సెంట్ల భూమి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్లకు సహకరించిన తలారీలు చక్రం తిప్పిన టీడీపీ మాజీ కార్పొరేటర్ కర్నూలు: కర్నూలు తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేయడం..ఒక వ్యక్తి పొలం ఇంకో వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం...ఇవే కాకుండా మిగులు భూమిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం ఇక్కడ సిబ్బందికే చెల్లింది. కర్నూలు సమీపంలోని జొహరాపురం గ్రామంలో 16 సెంట్ల స్థలం వివాదంగా మారింది. ఈ స్థలం పేరు మీద నలుగురు వ్యక్తులు పట్టాలు పుట్టించుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ వారు దాన్ని మిగులు భూమిగా ప్రకటించారు. తహశీల్దార్ కార్యాలయంలో కొందరు సిబ్బంది..ఈ భూమిపై కన్నేశారు. కర్నూలు నగరానికి చెందిన సువర్ణభాయ్ అనే మహిళ పేరుమీద ఆన్లైన్లో ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించారు. సబ్రి జిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంటేషన్ చేస్తుండగా.. విషయం బయటకి వచ్చింది. తహశీల్దార్ సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ పాత్ర ఉన్నట్లు తేలింది. నిందితులుగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు కిరణ్, బాష, రాజేష్ తదితరులను బుధవారం వరకు సస్పెండ్ చేసినట్లు తహశీల్దార్ రమేష్బాబు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్పై కేసు నమోదు కర్నూలు తహశీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న బాషాపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. కర్నూలు శివారుల్లోని నందికొట్కూరు రోడ్..యెల్కూరు ఎస్టేట్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో ఆ ఆపరేటర్ సహకరించాడని కర్నూలు తహశీల్దార్ వెంకటరమేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ సీఐ మధుసూదన్రావు తెలిపారు. కర్నూలు నగరానికి చెందిన సువర్ణబాయి, సతీష్కుమార్, అనసూయ తదితరులు యెల్కూరు ఎస్టేట్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అందుకు సంబంధించిన నకిలీ అడంగల్, డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు. రెవన్యూ రికార్డుల్లో పేర్లు మార్చేందుకు కంప్యూటర్ ఆపరేటర్ బాషా సహకరించినందున ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అక్రమాలకు ఉద్యోగుల సహకారం స్థలాన్ని ఆక్రమించండంలో నిందితులకు తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులే సహకరించినట్టు సమాచారం. నగరంలో, రూరల్ ప్రాంతాల్లో ఉన్న భూములను సర్వే పేరుతో వెళ్లి మిగులు భూములను ఆక్రమించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఆ మిగులు భూమిపై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇందులో తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆర్ఐ సహకారం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే టీడీపీ మాజీ కార్పొరేట్ చక్రం తిప్పినట్లు సమాచారం. సదరు ఆర్ఐపై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. బుధవారపేటలో ఒక మహిళకు తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ మహిళ తహశీల్దార్ కార్యాలయం ఎదుట గతంలో ధర్నా చేపట్టింది. జగన్నాథగట్టుపై అర్హలకు ఇళ్లు ఇవ్వకుండా అనర్హులకు, తమ బంధువులకు ఇళ్లు ఇచ్చారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. -
భూమికోసం పిల్లలను హత్య చేసిన తండ్రి
బీబీనగర్: భూమి రిజిస్ట్రేషన్కు అడ్డుగా ఉన్నారనే నెపంతో ఓ తండ్రి తన కూతురు, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో జరిగింది. కనగల్ మండలం బచ్చన్నగూడెంకు చెందిన కోయ కృష్ణారెడ్డి, అతడి సోదరుడు దామోదర్రెడ్డి వారసత్వ భూమిని పంచుకోవాలని అనుకున్నారు. కానీ దామోదర్రెడ్డితో సహా కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డి పేరుపై కాకుండా అతడి పిల్లలు రవళి(11), విత్తీష్(8)లపై భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో ఒప్పుకున్నాడు. దీంతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని శనివారం పిల్లలను తీసుకొని వెళ్లాడు. అనంతరం రిజిస్ట్రేషన్ చేయించకుండానే తన హోటల్కు వెళ్లాడు. ఆదివారం ఇద్దరు పిల్లలకు తొలుత విషం ఇచ్చి, అనంతరం బండకేసి కొట్టి హత్య చేశాడు. కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో భార్య, బంధువులు సోమవారం హోటల్ వద్దకు వచ్చారు. వారి అలికిడిని గుర్తించిన కృష్ణారెడ్డి.. పురుగులమందు తాగాడు. షట్టర్ను పగులగొట్టి చూడగా ఇద్దరు చిన్నారులు రక్తపుమడుగులో కనిపించారు. కృష్ణారెడ్డిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. -
'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు'
విజయవాడ : అమరావతిలో లంక గ్రామాల భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో కేఈ కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ... రిజిస్ట్రేషన్ శాఖలోని సేవలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఎన్నారై రిజిస్ట్రేషన్లను సులభతరం చేశామని తెలిపారు. రూ. వెయ్యిపైన స్టాంపుల కొనుగోలు ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో రూ. 3500 కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా బీసీలకు నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
ఆ స్థలం..ఆ చెట్టుదే!
జార్జియా: రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడం మనం చూస్తుంటాం.. కానీ ఈ వృక్షాన్ని మాత్రం తొలగించలేరు. ఎందుకంటే.. ఈ చెట్టున్న భూమి ఆ చెట్టుదే! అవును.. ఆ చెట్టు ఉన్న ల్యాండ్ తాలూకు లార్డ్ ఆ చెట్టే! మొదలు చుట్టూ ఉన్న దాదాపు 8 అడుగుల భూమి దానిదే. సొంత ఆస్తి కలిగిన చెట్టుగా పేరొందిన ఈ సింధూర వృక్షం అమెరికా జార్జియాలోని క్లార్క్ కౌంటీలో ఉంది. ఇంతకీ ఇదెలా సాధ్యం అంటే.. రింగులు తిప్పుకుంటూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లాల్సిందే. తొలిసారిగా ఈ విషయం గురించి 1890లో స్థానిక వార్తాపత్రికలో ఓ కథనం వచ్చింది. దాని ప్రకారం కల్నల్ విలియమ్ హెన్రీ అనే ఆయనకు ఈ ప్లేస్లో ఉన్న సింధూర వృక్షమంటే ఎంతో ఇష్టమట. తాను పోయిన తర్వాత కూడా ఈ చెట్టు ఇలాగే పచ్చగా ఉండాలని భావించిన ఆయన వెంటనే దీని చుట్టూ ఉన్న భూమిని కొనేసి.. దాని పేరిట రిజిస్టర్ చేయించేశారు. సరిగ్గా తెలియదు గానీ.. 1820-32 మధ్య కాలంలో ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని సదరు పత్రికలో పేర్కొన్నారు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను ఇప్పటివరకూ ఎవరూ చూడలేదు. వాటిని చూసిన ఏకైక వ్యక్తి 1890లో ఆ వార్తను రాసిన ఆయనేనట. అయితే.. ఆ పత్రాలు ఉన్నాయో లేవో ఎవరికీ తెలియనప్పటికీ.. ఆ రిజిస్ట్రేషన్ నిజంగా జరిగిందని.. అయితే పత్రాలు పోయి ఉంటాయని అందరూ బలంగా నమ్మారు. చివరికి స్థానిక అధికార యంత్రాంగం కూడా ఆ స్థలం ఆ చెట్టుదేనని ధ్రువీకరించేసింది. అయితే, విలియం హెన్రీ ఏ చెట్టుకయితే.. ఈ భూమిని రాసిచ్చారో ఆ చెట్టు ఇప్పుడు లేదు. 1942లో వచ్చిన తుపానుకు 100 అడుగుల ఎత్తుండే ఆ వృక్షం కూలిపోయింది. అయితే.. అదెక్కడయితే కూలిందో.. అక్కడ మళ్లీ చిగురు వేసిందట. ప్రస్తుతం ఉన్నది అప్పటి సింధూర వృక్షం తాలూకు వారసుడన్నమాట. దీంతో కామన్గానే వారసత్వంగా ఈ భూమి కూడా ‘సన్ ఆఫ్ ద ట్రీ’గా అక్కడి వాళ్లు పిలుచుకుంటున్న ప్రస్తుత చెట్టుకు కేటాయించేశారు. -
మార్కెట్ ధరకే భూ సేకరణ
- గన్నవరం భూముల రిజిస్ట్రేషన్కు అంగీకారం - పామాయిల్ చెట్టుకు రెట్టింపు రేటు - సుముఖత వ్యక్తంచేసిన సీఎం చంద్రబాబు - రైతులతో విడివిడిగా సమావేశం సాక్షి, విజయవాడ : పోలవరం కుడి ప్రధాన కాలువ కోసం రైతుల నుంచి సేకరించే భూములకు మార్కెట్ ధర ప్రకారమే పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. పోలవరం కుడికాలువ నిర్మాణం, గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం ఉదయం ఆయన సీఎం క్యాంపు కార్యాల యంలో తాను బసచేసిన బస్సులో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలను రైతులు ‘సాక్షి’కి వివరించారు. కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న తమకు మార్కెట్ ధర చెల్లించాలని కోరగా ముఖ్యమంత్రి అంగీకరించారని బాపులపాడు మండలం వేలేరు రైతు వేములపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పామాయిల్ చెట్టుకు రూ.6 వేలకు బదులు రూ.12వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. భూములు విక్రయించిన తరువాత వచ్చే మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కూడా సీఎం హామీ ఇచ్చారని నూజివీడు మండలం సీతారాంపురానికి చెందిన పర్వతనేని శ్రీనివాసరావు తెలిపారు. నష్టపరిహారం ఒకేసారి చెల్లించేందుకు సుముఖత వ్యక్తంచేశారన్నారు. రిజిస్ట్రేషన్లకు గ్రీన్సిగ్నల్ గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం సుమారు 700 ఎకరాల భూమి సేకరించనున్నారు. తొలి విడతగా 450 ఎకరాలు సేకరిస్తారు. ఇక్కడ రైతులకు ల్యాండ్ పూలింగ్లో భాగంగా రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో 1450 గజాల స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ప్రాంత భూముల ధర పెరిగింది. అయితే భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం తొలగిస్తే తుళ్లూరులో స్థలం కావాలనుకునేవారు ఈ ప్రాంత భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, దానివల్ల రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వంశీమోహన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ భూముల రిజిస్ట్రేషన్కు అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరువు రహిత రాష్ట్రం కోసం ప్రణాళికలు తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమైన చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎర్రకాలువ, కొవ్వాడ కాలువ ద్వారా లభించే 10వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణాడెల్టాలో వ్యవసాయ అవసరాలకు వాడుకుని, మిగులు జలాలను తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలకు మళ్లించాలని సూచించారు. ఇరిగేషన్ పనులు చేస్తున్న ప్రోగ్రెసివ్ కంపెనీతో తలెత్తుతున్న సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించాలని మంత్రి ఉమాను ఆదేశించారు. పొగాకు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కంపెనీలు కొనుగోలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని సీఎం హెచ్చరిం చారు. పొగాకు కొనుగోళ్లకు సంబంధించి రైతులు, కంపెనీ ప్రతినిధులతో ఒక కమిటీని వేయాలని పొగాకు బోర్డు డెరైక్టర్ సి.వి.సుబ్బారావును ఆదేశించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాబు.ఎ, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, పోలవరం ప్రధాన కుడికాలువ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు
- ఆగస్టు 1 నుంచీ కొత్త ధరల అమలుకు సర్కారు నిర్ణయం - జిల్లాల వారీగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల కసరత్తు - వచ్చే నెల 20 నుంచి వెబ్సైట్లో పెంపు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచేం దుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. జిల్లాల వారీగా చార్జీల పెంపు ప్రతిపాదనలను రూపొందించేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారులు(ఆర్డీవో)/ జాయింట్ కలెక్టర్ల(జేసీ) అధ్యక్షతన సబ్ రిజిస్ట్రార్లతో కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రభుత్వం సమీక్షించాల్సి ఉండగా, అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమిం చుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2013 ఏప్రిల్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. మార్కెట్ విలువ ప్రకారమే మార్కెట్ ధరలను బట్టే భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రతిపాదించాలని సబ్రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా ఆదేశించింది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో భూమి విలువను(10 నుంచి 70 శాతం వరకు) ఎంత శాతం పెంచవచ్చో ప్రత్యేక ఫార్మాట్ ద్వారా వివరంగా తెలపాలని సూచించింది. ధరలు పెరిగిన, ధరలు బాగా తగ్గిన ప్రాంతాలను కూడా ఫార్మాట్లో పేర్కొనాలని ఆదేశించింది. హైదరాబాద్ శివారులోని కొన్ని మండలాల్లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయినందున, ఆయా ప్రాం తాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపు నామమాత్రంగా ఉండవచ్చని రిజిస్ట్రేషన్శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు సంబంధించి ఆర్డీవో/జేసీల అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలు ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. వచ్చే నెల 20 నుంచి వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఉంచుతారు. వీటిపై వారం రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ధరలు అమల్లోకి వస్తాయి. -
భూముల రిజిస్ట్రేషన్కు రైతుల అంగీకారం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి పనుల్లో ముందడుగు పడింది. ఆలయం చుట్టూ ఉన్న గుట్టలను, కొండలనూ నవగిరులు, అభయారణ్యం, గ్రీన్పార్కులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రెండు వేల ఎకరాల స్థలం కావాల్సి ఉంది. అయితే దేవస్థానం పరిధిలో 1200 ఎకరాలు ఉండగా, మిగిలిన 800 ఎకరాలు రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేసీ సత్యనారాయణ సోమవారం యాదగిరిగుట్ట పరిసర గ్రామాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గుండ్లపల్లి, దాతారుపల్లి గ్రామ రైతులు 200 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేందుకు అంగీకరించారు. దేవస్థానం అభివృద్ధి మండలి సదరు రైతులకు ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చి భూములను రిజిస్ట్రేషన్ చేసుకోనుంది. ఈ నెల 23న ఈ 200 ఎకరాలు దేవస్థానానికి రిజిస్ట్రేషన్ చేసేందుకు రైతులు అంగీకరించినట్లు జేసీ తెలిపారు. స్వయం ప్రతిపత్తిగా యాదగిరిగుట్ట? తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట దేవస్థానం సైతం అటానమస్ (స్వయం ప్రతిపత్తి) క్షేత్రంగా మారే అవకాశాలు లేకపోలేదని దేవస్థానం అధికారులు అంటున్నారు. ఆలయం అభివృద్ధిపై తరచూ సమీక్షలు జరుపుతున్న సీఎం కేసీఆర్ గుట్ట దేవస్థానాన్ని స్వయం ప్రతిపత్తిగా ఎలా చేయాలని సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని తెలిసింది. స్వయం ప్రతిపత్తి అయితే దేవస్థానం ఈఓలుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియామకం చేసి పంపుతుంది. ఇప్పటి వరకు ఆర్జేసీ కేడర్ అధికారులను ఈఓలుగా గుట్టకు నియమిస్తున్నారు. స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఫైలు కూడా సీఎం టేబుల్పై ఉందని దేవస్థానం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి సీఎం యాదగిరిగుట్టకు వస్తే.. రోడ్డు వెడల్పు ఎన్ని ఫీట్లు, స్వయం ప్రతిపత్తి విషయం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
జీఓ398ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్: రిజిస్ట్రేషన్లను రెవెన్యూ శాఖతో లింకు పెడుతూ శుక్రవారం రాత్రి జారీ చేసిన జీఓ398ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఇప్పటికే జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అనుమతి తప్పనిసరని శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ప్రభుత్వం జీవో నంబరు 398ను విడుదల చేసింది. తక్షణమే ఈ జీవో అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో కొత్త నిబంధనలు తెలియక శనివారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలియక తలలుపట్టుకున్నారు. వ్యవసాయ భూములు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. 398 జీఓకు స్వపక్షంలోనూ వ్యతిరేకత! ఈ నేపధ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి 398 జీఓను రద్దు చేయాలని కోరారు. ఈ జీఓకు ప్రతిపక్షాలతోపాటు స్వపక్షం నుంచి కూడా వ్యతిరేకత రావడంతో దీనిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఓ 398ని నిలిపివేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు. రైతుల మనోభావాలు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ అధికారుల ధృవపత్రాలు అవసరంలేదన్నారు. ప్రస్తుత పద్ధతిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరుగుతుందని కృష్ణమూర్తి చెప్పారు. ** -
భూముల రిజిస్ట్రేషన్లకు ని‘బంధనాలు’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లకు నిబంధనలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. దీంతో ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆర్డీవో నుంచి నో అబ్జెక్షన్ ధ్రువపత్రాల (ఎన్ఓసీ)తో రిజిస్ట్రేషన్లు అయిన ప్రభు త్వ భూములకు కూడా ప్రస్తుతం మళ్లీ రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అలాగే పొరపాటున రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమోదైన ప్రయివేటు భూముల పరిస్థితి ఇలాగే ఉంది. వాస్తవ భూ పరిస్థితులను పరిశీలించకుండానే కొందరు సబ్ రిజిస్ట్రార్లు అడ్డుతగులుతున్నారు. దీంతో అవసరాలకు అమ్ముకునే వారు అవస్థ పడుతున్నారు. ఎన్ఓసీ కలెక్టర్ ఇవ్వాల్సిందే! భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి గతంలో ఆర్డీవో ఎన్ఓసీ ఇస్తే సరిపోయేది. కొత్తగా కలెక్టర్ మంజూరి చేసిన ఎన్ఓసీ, రిజిస్ట్రేషన్ డెరైక్టర్ జనరల్ ఆదేశాలతో అన్లైన్లో వివరాలు నమోదు చేస్తేనే భూముల రిజిస్ట్రేషన్ అని సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దీనిపై గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవో ను విడుదల చేసిందని వారంటున్నారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్ జరిగి, ఎటువంటి అభ్యంతరాలు లేని భూములకు ఎన్ఓసీ కోసం జిల్లాలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా కలెక్టరేట్లో 12 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూమి స్వరూపం ఇతర పరిస్థితులపై మండల రెవెన్యూ అధికారులు ఆర్డీవో సిఫార్సు చేసిన దరఖాస్తులే అవి. అయినా దరఖాస్తుల పరిశీలనలో ఉన్నతాధికారులు కొర్రీలు వేయడంతో కలెక్టరేట్లోనే మూలుగుతున్నాయి. నరసన్నపేట మండలానికి సంబంధించి రెండు, ఆమదాలవలస మండలం నుంచి రెండు, ఎచ్చెర్ల మండలం రెండు, శ్రీకాకుళం మండలం మూడు, కోట బొమ్మాళి, కొత్తూరు , పాలకొండ మండలాలకు సంబంధించి ఒక్కో దరఖాస్తు వీటిలో ఉన్నాయి. నేడు కలెక్టర్ సమావేశం ఈ మేరకు మంగళవారం జిల్లాలో భూమి రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ రిజిస్ట్రేషన్ అధికారులలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే పెండింగ్ దరఖాస్తులపై ఓ నిర్ణయానికి రానున్నట్టు దరఖాస్తుదారులు ఆశాభావంతో ఉన్నారు. నిబంధనలు సడలిస్తే తప్ప భూ క్రయ విక్రయాలు చేయలేమని పలువురు అంటున్నారు. -
పంపిణీ సరే...పట్టాలేవీ?
భూముల రిజిస్ట్రేషన్లలో ఎడతెగని జాప్యం - తొమ్మిది నియోజకవర్గాల్లోనే దళితులకు భూపంపిణీ అమలు - ప్రైవేటు భూముల కొనుగోలుపైనే తర్జనభర్జన - చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు నీలగిరి : కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో మందగించింది. పంద్రాగస్టునాడు శ్రీకారం చుట్టిన ఈ పథకానికి ఆది నుంచి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. మొదట్లో మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి భూమిలేని దళితులకు మూడెకరాలు పంపిణీ చేయాలని భావించారు. అది ఆచరణ సాధ్యంకాకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి అర్హులైన లబ్ధిదారులకు భూపంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల దృష్ట్యా కేవలం 9 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. మునుగోడు, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో భూములు కొరతతో లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కన పెట్టేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నప్పటికీ భూసమస్య వల్లనే అందరికి ఈ పథకం వర్తింపచేయలేకపోయారు. భూముల కొనుగోలు భారం పన్నెండు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో దళిత కుటుంబాలు 1489 మంది ఉండగా...వీరిలో అసలు భూమి లేని నిరుపేద కుటుంబాలు, పథకానికి అర్హులైన 260 మందిని గుర్తించారు. దీంట్లో 102 కుటుంబాలకు 247 ఎకరాలు భూ పంపిణీ చేశారు. అయితే మొత్తం పంపిణీ చేసిన దాంట్లో ప్రభుత్వ భూమి కేవలం 18 ఎకరాలకు మించి లేదు. మిగతా 229 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఇచ్చిందే. ప్రభుత్వ నిర్ణయించిన రేటు ప్రకారం ఎకరాకు రూ.3 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. కానీ ఇంతవరకు భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం చేయించలేదు. కేవలం పంద్రాగస్టు రోజున మంజూరు పత్రాలు ఇచ్చారు. ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల లభ్యతను బట్టి లబ్ధిదారులకు పత్రాలు ఇచ్చారు. చాలా చోట్ల భూములు ఉన్న గ్రామాల్లో లబ్ధిదారులు ఉండకపోవడం, లబ్ధిదారులు ఉన్న గ్రామాల్లో భూములు లభించకపోవడం వంటి సమస్యలు అధికారులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ప్రైవేటు భూము లు అమ్మేందుకు భూయజమానులు ముందుకు వస్తున్నా, ప్రభుత్వం నిర్ణయించిన ధరను అమ్మేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఈ పథకాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారన్నది వేచిచూడాల్సిందే. వచ్చేవారంలో పూర్తిచేస్తాం : శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రెవెన్యూ యంత్రాంగం సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో బిజీగా ఉంది. వచ్చే వారంలో లబ్ధిదారులకు భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం. చాలా చోట్ల భూమి కొరత ఉంది. పట్టాదారులు అమ్మేందుకు ముందుకు వస్తు న్నా, మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధర చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశానుసారం పథకాన్ని అమలు చేయడానికి కృషి చేస్తాం. -
పంట తొలగింపుపై ఆందోళన
- భూములను రిజిస్ట్రేషన్ చేయలేదన్న రైతులు - చేసినవేనని హిమామి సిమెంట్స్ యజమాన్యం వెల్లడి తంగెడ(దాచేపల్లి): మండలంలోని తంగెడ, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు, ముత్యాలంపాడు గ్రామాల్లో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోని పత్తి, మిరప పంటలను హిమామి సిమెంట్స్ సిబ్బంది శనివారం ట్రాక్టర్లు, పొక్లెయిన్తో తొలగించారు. దీంతో రైతులు పొలాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు పాడి రామకోటయ్య, మాదినపాడు జానీ, మాడుగుల సైదావలి, కందుల సాల్మాన్, కందుల ఏసు, లింగిరి నాగుల్మీరా, గోపి దావీదులు మాట్లాడుతూ 2010 నవంబర్లో హిమామి సిమెంట్స్ యాజమాన్యం తంగెడ, ముత్యాలంపాడు, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు గ్రామాల్లో 800 ఎకరాలను కొనుగోలు చేసేందుకు వచ్చిందని తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న భూములతోపాటు డీకే పట్టాలు, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను కూడా కొనుగోలు చేయాలని అంగీకారం కుదిరిందని తెలిపారు. కొందరి భూములకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించగా, మరికొంతమందికి ఎకరానికి రూ1.10 లక్షల చొప్పున అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారన్నారు. ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పామని తెలిపారు. 2011 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్కు రాగా మార్కెట్ ధర ఇవ్వాలని డిమాండ్ చేశామని, అప్పటినుంచి యాజమాన్యం కాలయూపన చేస్తోందని ఆరోపించారు. రెండు నెలల కిందట గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో కంపెనీ యజమాన్యంతో జరిపిన చర్చల సందర్భంగా భూములను సాగు చేసుకోమంటేనే పంటలు వేశామన్నారు. వేసిన పంటలను ఇప్పుడు యంత్రాలతో పీకేయటం దారుణమన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పూర్తిగా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేవరకు భూములు సాగు చేస్తామని స్పష్టం చేశారు. మా భూముల్లోని పంటలే తొలగించాం.. ఈ విషయమై హిమామి సిమెంట్స్ ప్రతినిధి ఏఎస్సార్ మూర్తి వివరణ కోరగా 800 ఎకరాలకు పూర్తిగా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. వీటిలో సుమారు 250 ఎకరాల్లో వేసిన పంటలను మాత్రమే తొలగించామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయని భూముల జోలికి పోలేదన్నారు. కొంతమంది వ్యక్తులు కంపెనీకి చెందిన పొలాలను కౌలుకు ఇస్తున్నారని, కంపెనీ ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ భూములను కాపాడుకునేందుకే పంట లను తొలగించామన్నారు. -
రోజుకు 6 వేల రిజిస్ట్రేషన్లు!
విజయవాడ: ఆగస్టు ఒకటో తేదీ నుంచి పొలాలు, స్థలాల విలువలు పెంచేందుకు ప్రభుత్వం సిద్దమైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పోటెత్తాయి. స్టాంప్ డ్యూటీ శుక్రవారం నుంచి భారీగా పెరుగుతుందన్న ఆందోళనతో భూముల రిజిస్ట్రేషన్ కు ప్రజలు బారులు తీరారు. గత మూడు రోజుల్లో ఒక్కో జిల్లాలో 6 వేలకు పైగా రిజిస్టేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. మామూలుగా గుంటూరు జిల్లాలో ప్రతిరోజు 700 రిజిస్ట్రేషన్లు నమోదవుతుంటాయి. సోమవారం 2200, బుధవారం 3 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కృష్ణా జిల్లాలోని చిన్నచిన్న గ్రామాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్లు పెరగడం విశేషం. ప్రతిప్తాడు, పెదకాకాని, నల్లపాడు గ్రామాలతో పాటు నందిగామ, జగ్గంపేట, గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. కాగా, భూముల, రిజిస్ట్రేషన్ల ధరల పెంపుపై రేపు కేబినెట్లో చర్చిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్ లో చెప్పారు. కేబినెట్ చర్చ తర్వాత పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత
* 19మండలాలకు వర్తింపు.. ఒకటి రెండురోజుల్లో ఉత్తర్వులు సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ-గుంటూరు పరిసరాల్లో భూముల రిజష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ ప్రాంతంలో భూముల ధరలు కొండెక్కాయి. అయినప్పటికీ ఆశించినంతగా ఖజానాకు ఆదాయం రావడంలేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినా రిజిష్ట్రేషన్ల విలువ తక్కువగానే ఉంటుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువలు ఎలా ఉందీ పరిశీలించాల్సిందిగా కొద్దిరోజుల క్రితమే రెండు జిల్లాల రిజిస్ట్రార్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ విలువకు దగ్గరగా ప్రభుత్వ విలువను నిర్ధారించడంద్వారా స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న కసరత్తులో భాగంగా రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 19 మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అరుునట్లు అధికారులు చెబుతున్నారు. ఒకటీ రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులూ వెలువడనున్నట్టు తెలిపారు. కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి, నూజివీడు మండలాలు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, తాడేపల్లి, అమరావతి, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, తుళ్లూరు, గుంటూరు అర్బన్, రూరల్ మండలాలను ‘రిజిస్ట్రేషన్ల నిలిపివేత’ పరిధిలో చేర్చినట్లు సమాచారం. భూముల ధరల పెరుగుదల ప్రభావం రాజధాని లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. -
ఏపీలో రిజిస్ట్రేషన్ బాదుడు!
* స్టాంపు డ్యూటీ ద్వారా రూ.1,000 కోట్ల అదనపు ఆదాయంపై కన్ను సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలు పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మార్కెట్ విలువలో సగానికి పైగానే ప్రభుత్వ విలువ ఉండేలా మార్పులు చేయాలని భావిస్తోంది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల అదనపు ఆదాయం లక్ష్యంగా ఈ కసరత్తు సాగుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఆయూ ప్రాంతాల్లోని భూములు, భవనాలు, స్థలాల మార్కెట్ విలువలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు గత కొద్దిరోజులుగా సేకరిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో భూములు, ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర నగరాలు, పట్టణాల పరిధిలో మార్కెట్ విలువలు అమాంతంగా పెరగడాన్ని గమనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడం ద్వారా స్టాంపు డ్యూటీతో లభించే ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలోని 267 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తమ పరిధిలోని ప్రైవేటు ఆస్తుల విలువలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ర్టంలో 13 జిల్లాలకు గాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 15 రోజుల క్రితం రూ.4,085 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ధారించారు. తాజాగా రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ధారించే అవకాశం ఉందని సమాచారం. భూముల విలువ పెంపు అంశంపై సీఎం చంద్రబాబు ఒకటీరెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. -
అనిశ్చితిలో ‘రియల్’ రంగం!
* స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు బ్రేక్ * రిజిస్ట్రేషన్ల ఆదాయం దారుణంగా కోల్పోయిన సర్కారు * ‘గ్రేటర్’లో భారీగా తగ్గిన లావాదేవీలు * కోస్తాంధ్రలో అదే తీరు.. 3 జిల్లాల్లో సంపన్నుల కొనుగోలు ఒప్పందాలు * మధ్యతరగతి ప్రజల్లో వేచిచూసే ధోరణి * ప్రభుత్వ సిబ్బంది సమ్మెతో సీమాంధ్రలో ఒప్పందాలకే పరిమితం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన సెగ రిజిస్ట్రేషన్ల శాఖను గట్టిగానే తాకింది. మాంద్యంతో సతమతమవుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని విభజన ప్రకటన మరింత దెబ్బతీసింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లపై ఈ ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి భారీగా పడిపోవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన ప్రకటన జూలై 31న వెలువడినప్పటికీ 2 నెలల ముందు నుంచే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి స్థిరాస్తి లావాదేవీల్లో స్తబ్ధత ఏర్పడింది. వేచి ఉండాలన్న ధోరణి ప్రబలడంతో అత్యధికులు స్థిరాస్తి కొనుగోళ్లకు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఆగస్టులో రూ.134.72 కోట్లున్న రంగారెడ్డి రెవెన్యూ జిల్లా ఆదాయం ఈ ఏడాది ఆగస్టులో రూ.86.29 కోట్లకు పడిపోయింది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది జూలైలో రాబడి 25 శాతం తగ్గింది. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో గత ఏడాది జూలైలో రూ. 71.16 కోట్లున్న ఆదాయం ఈ ఏడాది జూలైలో రూ.41.06 కోట్లకు పడిపోయింది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు రాబడి 40 శాతానికే పరిమితం కావడం గమనార్హం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై తీవ్ర ప్రభావం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి మాంద్యం ప్రభావం కంటే రాష్ట్ర విభజన దెబ్బే ప్రధాన కారణమని చెబుతున్నారు. ‘రంగారెడ్డి జిల్లాలో జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ అంతకు ముందు నెలల్లో కుదుర్చుకున్న కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించినవే. స్థలాలు, భవనాల కొనుగోళ్లకు సంబంధించి ధరలు మాట్లాడుకుని అధిక మొత్తంలో అడ్వాన్సులు చెల్లించిన వారు విధిలేక మిగిలిన మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కొద్దిమొత్తంలో అడ్వాన్సు చెల్లించిన వారు చాలామంది విభజన ప్రకటనతో అడ్వాన్సులను వదిలేసుకున్నారు’ అని రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద మొత్తంలో ఖాళీ స్థలాలున్న రంగారెడ్డి జిల్లాలో లావాదేవీలు గత 3 నెలల్లో దారుణంగా తగ్గిపోయాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఉన్నతాధికారి వివరించారు. సీమాంధ్రలోనూ అదే సీను.. సీమాంధ్ర ప్రాంతంలో కూడా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రభుత్వ సిబ్బంది సమ్మె, భూముల అధిక ధరలు సీమాంధ్రలో లావాదేవీలు తగ్గడానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. ‘సీమాంధ్రలోని చిన్న పట్టణాల్లో కూడా హైదరాబాద్ స్థాయిలో స్థలాల రేట్లు పెరిగిపోయాయని వినికిడి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు గతంలోనే ధరలను అమితంగా పెంచేశారు. పట్టణాలకు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ రియల్ వెంచర్లు వేసి.. సెంటు మూడు, నాలుగు లక్షలకు విక్రయించారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సెంటు రూ.రెండు, మూడు లక్షలకు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అంతకంటే ధర తగ్గించి విక్రయిస్తే భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతో లావాదేవీలు పూర్తిగా మందగించాయి. తిరుపతి వంటి చోట్ల అప్పట్లో కొన్న ధరకు 25 శాతం తగ్గించి అమ్ముదామనుకున్నా కొనే వాళ్లు లేని పరిస్థితి నెలకొంది. ‘..లేని బూమ్ను చూపించి గతంలోనే ధరలు పెంచారు. ఇప్పుడు పూర్తి నెగటివ్ బూమ్ ఉంది’ అని సీమాంధ్ర రిజిస్ట్రేషన్ అధికారులు ‘సాక్షి’కి వివరించారు. 3 జిల్లాల్లో కొనుగోలు ఒప్పందాలు రాష్ట్రం అనివార్యంగా విడిపోతే రాజధాని ఎక్కడ నిర్మితమవుతుంది? అనే అంశంపై ప్రస్తుతం కోస్తా ప్రాంతంలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దృష్టిపెట్టారు. డబ్బున్న వారు గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసి ఒప్పందాలు రాసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. మధ్యతరగతి వారు మాత్రం వేచి ఉండే ధోరణిని అవలంభిస్తున్నారని అంటున్నారు. సీమాంధ్రలోని ఇతర జిల్లాల్లో కొనుగోలు ఒప్పందాలూ పెద్దగా జరగడం లేదు. ఆగస్టు మొదటి వారంలో కోస్తా జిల్లాల్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినా.. సిబ్బంది సమ్మె వల్ల ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. -
నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు
ఆదిలాబాద్, న్యూస్లైన్ : ప్రభుత్వం పలు రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచింది. ఇవి సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. స్థిరాస్తి దానం, ఎన్కంబరెన్సీ సర్టిఫికెట్లు (ఈసీ), దస్తావేజు నకళ్లు (సర్టిఫైడ్ కాపీ) ఫీజులు కూడా పెరిగాయి. తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునేందుకు (రెక్టిఫికేషన్), ఒ ప్పందం (రాటిఫికేషన్) రద్దు (క్యాన్సలేషన్) ఫీజులను ప్రభుత్వం ఏకంగా పదిరే ట్లు పెంచేసింది. స్థలాన్ని అభివృద్ధి చేసేం దుకు కుదుర్చుకునే ఒప్పందాల రుసుము భారీగా పెరగడంతో బిల్డర్లు, స్థల యజమానులకు భారంగా మారనుంది. వీటితోపాటు వివిధ రకాల రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రభుత్వం పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సమయం, సందర్భం లేకుండా ఇష్టారీతిన పెంచడంపై విమర్శలు చేస్తున్నారు. గిఫ్ట్డీడ్ భారం.. రక్త సంబంధీకులకు స్థిరాస్తి దానం (గిఫ్ట్ డీడ్) ఇక భారం కానుంది. సెటిల్మెంట్ రాయించేందుకు రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోయేది. ఇకపై దీనికోసం స్థిరాస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (ఉదాహరణకు రూ.2 లక్షల విలువ ఉన్న స్థిరాస్తి దానం చేస్తే సెటిల్మెంట్ రాయించేందుకు 0.5 శాతంతో రూ.వెయ్యి చెల్లించాలి. అదే రూ.లక్ష విలువైన స్థిరాస్తి దానంలో 0.5 శాతంతో చూస్తే రూ.500 చెల్లించాల్సి ఉన్నా కనిష్టంగా రూ.వెయ్యి నిర్ధారించడంతో అంత పుచ్చుకోవాల్సిందే.) రూ.30లక్షలు ఉంటే సెటిల్మెంట్ రాయించేందుకు 0.5 శాతం విలువతో చూస్తే రూ.15వేలు చెల్లించాలి. అయితే గరిష్టంగా రూ.10 వేలు నిర్ధారించడంతో అంతే చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపు స్థిరాస్తి దానం చేసేవారిపై భారంపడనుంది. రూ.వెయ్యి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే చోట భారం అధికం కానుంది. ప్రస్తుతం స్థిరాస్తి విలువల దృష్ట్యా ఎక్కడా కనిష్ట విలువ అమలయ్యే పరిస్థితి లేదు. స్థిరాాస్తి దానంలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఫీజులతో అమితభారం మోయాల్సి వస్తుంది. ఇవికూడా భారమే.. భూమి, ఇల్లు, ఇంటిస్థలం కొనాలనుకునే వారు ముందుగా ఆ ఆస్తికి సంబంధించి గతంలో జరిగిన లావాదేవీల వివరాల కాపీ (ఎన్కంబరెన్సీ సర్టిఫికెట్) పొందేందుకు ఫీజు ప్రస్తుతం రూ.100 ఉంది. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. కాలాన్ని బట్టి ఈసీల కోసం రెండు రకాల ఫీజులను నిర్ణయించింది. 30 ఏళ్ల లోపు లావాదేవీల వివరాలతో ఈసీ కావాలంటే రూ.200, 30 ఏళ్లకు మించిన లావాదేవీల వివరాలు కావాలంటే రూ.500 చెల్లించాలని నిర్ణయించింది. దస్తావేజు నకళ్లు (సర్టిఫైడ్ కాపీ) ప్రస్తుతం రూ.50 ఉన్న సీసీ ఫీజును నాలుగు రేట్లు పెంచి రూ.200 చేసింది. ఇవి అమితభారం.. రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు వంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే (రెక్టిఫికేషన్) అవకాశం ఉంది. ఆస్తి వాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ సమయానికి రాలేకపోతే, పలాన తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ (రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటు ఉంది. ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలున్నా, రిజిస్ట్రేషన్ తర్వాత రద్దు (క్యాన్సలేషన్) చేసుకునే అవకాశం ఉంది. ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం పది రేట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం రూ.100 రుసుము ఉండగా, రూ.వెయ్యికి పెంచింది. స్థలాన్ని అభివృద్ది చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందాల రుసుము భారీగా రూ.2 వేలు ఫీజు ఉంటే.. రూ.20 వేలకు పెంచింది. అభివృద్ధి ఒప్పంద ఆస్తి విలువలో ఫీజు 0.5 శాతం గరిష్టంగా రూ.20 వేలకు పెంచారు. పరోక్షంగా ఇళ్ల కొనుగోలుదారులపై ఈ భారం పడనుంది. జిల్లాలో ఇప్పుడిప్పుడే అపార్ట్మెంట్ల సంస్కృతి ఊపందుకుంటుంది. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్లలో ఇప్పుడిప్పుడే స్థలాల అభివృద్ధి జరుగుతుండగా ఈ నిర్ణయం ఇటు బిల్డర్లు, అటు ఇళ్ల కొనుగోలుదారులను నిరాశకు గురిచేసింది. ఆదాయంపైనే దృష్టి.. ఆదాయం పెంచుకోవాలనే లక్ష్యంతోనే రిజిస్ట్రేషన్ శాఖ ఈ భారాన్ని మోపినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, బోథ్, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. 2012-13లో అమ్మకం దస్తావేజులు 34,370, ఇతర దస్తావేజులు 12,838 జరిగాయి. లక్ష్యం రూ.63 కోట్ల 64 లక్షల 55 వేలు కాగా, రూ.62 కోట్ల 79 లక్షల 61 వేలు సాధించారు. 2011-12 కంటే 25 శాతం అధికంగా లక్ష్యం సాధించారు.