light
-
వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!
అవార్డ్ విజేత, చిత్రకారుడు దీనా సో ఓతేహ్ నీడ– కాంతిలో విలక్షణతను చూపడంలో మాస్టర్. యునైటెడ్ స్టేట్స్లో ఉండే ఈ కళాకారుడి చిత్రాలు మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. చీకటి నుండి వెలువడే ప్రకాశవంతమైన చిత్రాలను మన కళ్లకు కడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాన్ని ‘చిత్రం’గా చూపుతాడు. గురువెవ్వరూ లేకుండానే తన ఊహల్లో నుండి పుట్టుకువచ్చిన కళ గురించి వివరిస్తుంటే వినేవారు చాలా అబ్బురంగా చూస్తారు. ‘‘మా అమ్మ చిన్నప్పటి నుండి నాలో కళాత్మక అభిరుచిని గుర్తించింది. దానిని పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. నేను మంచి కళాకారుడిగా మారుతానని ముందే అనుకున్నాను. కళను వృత్తిగా కొనసాగించాలనే ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. నాకు 12 ఏళ్ల వయసులో నా కుటుంబం యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. నాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలన్నీ నాన్న తనతో తీసుకెళ్లిపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో చదవుకు స్కాలర్షిప్కు అర్హత కోల్పోయాను. దీంతో ఎనిమిదేళ్లు వెయిటర్గా పనిచేశాను. అప్పుడు నా కెరీర్ వెయిటర్ అనే అనుకున్నాను. అనిశ్చితి నుంచి నైపుణ్యాలుమొదట నేను ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్ను కాదు. సరైన పత్రాలు లేక΄ోవడం వల్ల వలసదారునిగా ఎనిమిదేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాను. ఇష్టపడే పని చేస్తున్నప్పుడే స్థిరత్వం లభించడం ప్రారంభమైంది. నాకు నేను స్వయంగా ఇలస్ట్రేషన్స్ వేసేవాణ్ణి. ఈ సాధన ద్వారా ఇలస్ట్రేషన్ నా నైపుణ్యాలు పెరిగాయి. అది ఎంతగా అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్లో డిగ్రీ సాధించాను. మాస్టర్స్ ప్రోగ్రామ్ద్వారా స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్లో మరింత అధ్యయనం సాధ్యమైంది. అప్పుడే ఇలస్ట్రేషన్ నాకు సరిగ్గా సరి΄ోతుందనిపించింది. కథలు చెప్పడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, సృష్టించడం... ఇలా ప్రతీది నా మనో వికాసానికి, వృద్ధికి ఇలస్ట్రేషన్ ఆర్ట్ కొత్త తలుపులు తెరిచింది. చివరకు నాది అయిన మార్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా సాధ్యమైంది మా అమ్మ ద్వారా. ఆమే నన్ను నేను గర్వపడేలా చేసింది.నిశ్శబ్దం నుంచి...పరధ్యానాన్ని నివారించడానికి సాధారణంగా స్కెచ్ వేయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 4–5 గంటల సమయాన్ని ఎంచుకుంటాను. ఆ నిశ్శబ్ద సమయం, ప్రపంచం మేల్కొనే ముందు నేను చాలా సృజనాత్మకంగా ఉంటాను. పరధ్యానాల నుండి విముక్తి పొందుతాను. ఏదైనా ‘రంగు’లోనే ఆలోచిస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సృష్టికి కారణం అవుతుంది. అక్కడ నుంచి నా స్కెచ్లకు విస్తృతంగా పని దొరుకుతుంది. ఆరిస్ట్ మార్షల్ అరిస్కాన్ ఎప్పుడూ ఒక మాట చెబుతాడు ‘మీకు తెలిసిన వాటిని గీయండి’ అని. ఆ పదాన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. కానీ, కాలక్రమేణా అది స్పష్టమైంది. కాంతి–చీకటి మధ్య అంతర్గత పోరాటం నాకు తెలిసింది. నేను నా జీవితంలో చాలా చీకటి కాలాలను ఎదుర్కొన్నాను. పోరాటాలకు మించిన అందం వాటిలోనే ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంశంపై తగినంత అవగాహన లేకుండా పని మొదలుపెడితే ఆందోళన కలుగుతుంది. అయితే, ఆ క్షణంలో నేను నా అహం, ఊహాత్మక తీర్పులను, ఫెయిల్ అవుతానేమో అనే భయాలను వదిలేస్తూ ఆర్ట్లోకి ప్రయాణిస్తాను’’ అని వివరిస్తాడు ఈ చిత్రకారుడు View this post on Instagram A post shared by Nautilus Magazine (@nautilusmag) -
కన్ను తేటగా ఉంటే... దేహమంతయు వెలుగు
అనేకమంది యువతీ యువకుల కన్నులు పాపంతో నిండి వున్నాయి. ఈ విషయంలో యేసుప్రభువు తన కొండమీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపు చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడవుతాడని, సాధారణంగా కామం కంటిచూపుతోనే మొదలవుతుందన్నారు. శోధన అంతర్గతంగా బయలుదేరుతుంది. తర్వాత కార్యరూపం దాలుస్తుంది. కనుక కంటిని ఎంతో పవిత్రంగా కాపాడు కోవాలి. దేహానికి, ఆత్మకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయూ వెలుగు మయమై వుండును. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటిమయమవునని వాక్యం బోధిస్తున్నది (లూకా 11:33–34).ఒకరోజు యేసుప్రభువువారు గతిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని–నన్నువెంబడించుమని అతనికి చెప్పాడు.. ఫిలిప్పు నతనయేలును కనుగొని–ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానియేలు–నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడగ్గా –వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. యేసు నతానియేలు తన వద్దకు రావడం చూసి యితడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కటము లేదు. నన్ను నీవు ఎలాగైనా ఎరుగుదువని నతానియేలు యేసును అడగ్గా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, నీవు అంజూరపు చెట్టుకింద ఉన్నప్పుడే నిన్ను చూశానని అతనితో చెప్పాడు. నతానియేలు –బోధకుడా! నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసుక్రీస్తు అంజూరపు చెట్టుకింద కూర్చున్నావని చెప్పినందుకు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యక్రమాలు చూస్తావని అతనితో చె΄్పాడు. ఆయన (యేసు ప్రభువువారు) – మీరు ఆకాశం తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుటయు, దిగుటయు చూస్తారని మీతో నిశ్చయంగా చెబుతున్నానని అన్నాడు (యోహాను 1:43–51). కనుక మనకు ఇంత సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి వున్నందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కుల్లో పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్తయైన యేసుప్రభువు వైపు చూసి పందెంలో ఓపికతో పరుగెత్తవలెను. మీరు ΄ాపంతో ΄ోరాడటానికి రక్తం కారునంతగా ఎదిరింపలేరు. ఇంకో సంగతి నా కుమారులారా! ప్రభువు వేయు శిక్షను తృణీకరించవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించును.. అని కుమారులతో మాట్లాడినట్లు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు.మనం శరీర సంబంధీకులైన తలిదండ్రులతో భయభక్తులతో ఉన్నాడు కానీ, ఆత్మలకు తండ్రియైన దేవునికి మరింత ఎక్కువగా లోబడి బతుకవలెనని, అట్టి భయభక్తులు దేవునియందు కలిగి ఉండి, మంచిగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది (హెబ్రీ 12:1 –10). కనుక ఆ విధంగా ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొందురు గాక.– కోట బిపిన్ చంద్రపాల్ -
ఇంట్లో కూర్చుని.. అయోధ్యలో దీపం వెలిగించండిలా..
అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ నెల 30 భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్మెంట్ అధారిటీ శుభవార్త చెప్పింది.ఏ ప్రాంతంలోని వారైనా వారి ఇంటిలోనూ కూర్చొని అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరాముని పేరిట ఒక దీపం’ పేరుతో శ్రీరాముని భక్తులు తమ ఇంట్లో కూర్చొని దీపోత్సవంలో భాగస్వాములు కావచ్చు.ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దివ్య అయోధ్య యాప్ ద్వారా భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ఎంపికను ఇచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు దీపాలు వెలిగించవచ్చు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్కు హాజరుకాలేని భక్తులు ఇంట్లో కూర్చొనే దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘దివ్య అయోధ్య యాప్’ సాయంతో ఆన్లైన్ బుకింగ్ ద్వారా దీపం వెలిగించినవారికి డిజిటల్ ఫోటోతో పాటు అయోధ్య ప్రసాదం పంపిస్తామన్నారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
Ind vs SL: ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ కోహ్లి.. ఫొటోలు వైరల్
-
అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్కి దారి తీస్తుందని తెలిపారు. 2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్పోజర్కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు. -
మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!
పూలు ఘుమఘుమలాడటం సహజం. మరి పూలకు మిలమిలలు ఎక్కడివని కోప్పడిపోకండి. రాత్రివేళ మిణుగురుల్లా మిలమిల మెరిసే పూలను ఒక శాస్త్రవేత్త సృష్టించాడు. అమెరికా ప్రాంతాల్లో విరివిగా కనిపించే పిటూనియా మొక్కలకు జన్యుమార్పిడి చేసి, పిటూనియా పూలు మిణుగురుల్లా మిలమిలలాడేలా చేశాడు.అమెరికన్ కంపెనీ ‘లైట్ బయో’లో పనిచేస్తున్న డాక్టర్ కీత్ వుడ్ అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని సాధించాడు. మాలిక్యులర్ అండ్ కెమికల్ బయాలజీలో విస్తృత పరిశోధనలు సాగిస్తున్న డాక్టర్ కీత్ వుడ్, తొలుత పొగాకు మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టాడు. పొగాకు మొక్క చిన్నది కావడంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. తర్వాత పీటూనియా మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టి, అద్భుత ఫలితాలను సాధించాడు. పీటూనియా మొక్క ఎదిగిన తర్వాత దానికి పూసే పూలు రాత్రివేళ అచ్చంగా మిణుగురుల్లా మిలమిలలాడుతూ కనిపించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘లైట్ బయో’ కంపెనీ పెరటి తోటల్లో పెంచుకునేందుకు వీలుగా రాత్రివేళ మిలమిల వెలుగులు వెదజల్లే పీటూనియా మొక్కలకు ‘ఫైర్ ఫ్లై పీటూనియా’గా నామకరణం చేసి, వాటిని అమ్మడం ప్రారంభించింది. అమెరికన్ జనాలు ఈ మిణుగురు పూలమొక్కలను ఎగబడి మరీ కొంటున్నారు. (చదవండి: చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!) -
రాత్రిళ్లుమెరిసే మొక్కలు.. అమ్మకానికొచ్చాయ్!
రాత్రి అయిందంటే.. అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. మొక్కలు, చెట్లు, జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి. కానీ అక్కడక్కడా మిణుగురు పురుగులు (ఫైర్ఫ్లై) వెలుగులు చల్లుతూ తిరుగుతుంటాయి. కొన్ని రకాల పుట్టగొడుగులు (బయో ల్యూమినిసెంట్ మష్రూమ్స్) చిన్నగా కాంతిని వెదజల్లుతుంటాయి. ఇది చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి.. చీకట్లో కాంతిని వెదజల్లే మొక్కలను సృష్టించారు. పుట్టగొడుగుల్లో కాంతిని వెదజల్లే సామర్థ్యానికి కారణమైన జన్యువులను సేకరించి.. ‘పెటునియా’పూల మొక్కల్లో ప్రవేశపెట్టారు. వీటికి ‘ఫైర్ఫ్లై పెటునియా’అని పేరుపెట్టారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కల పూలు.. రాత్రిపూట ఆకుపచ్చని కాంతులు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడీ పూల మొక్కలను అమ్మకానికి కూడా పెట్టారు. ఒక్కో మొక్క ధర సుమారు రూ.2,500 మాత్రమే (30 డాలర్లు). ఈ ‘ఫైర్ఫ్లై పెటునియా’మొక్కలను అభివృద్ధి చేసినది అమెరికాలోని ఇడహో రాష్ట్రానికి చెందిన లైట్ బయో సంస్థ. 50వేల మొక్కలను అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఇవి అమెరికాలో మాత్రమే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఇవి జన్యుమార్పిడి మొక్కలు కావడంతో.. అనుమతులను బట్టి ఇతర దేశాల్లోనూ అమ్మేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం!
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. కోల్కతాలోని చర్చిలు రంగురంగుల దీపాలతో కళకళలాడాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. క్రిస్మస్తో పాటు రానున్న న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటక ప్రదేశాల్లో జనం రద్దీ మరింతగా పెరిగింది. #WATCH | Kerala: Streets of Thiruvananthapuram all decked up with decorative lights on #Christmaseve pic.twitter.com/kn8jam5yqj — ANI (@ANI) December 24, 2023 క్రిస్మస్కు ముందుగానే హిమాచల్లోని పర్యాటక ప్రదేశాలకు పర్యాటకుల రాక మొదలయ్యింది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో సోలాంగ్లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వందలాది వాహనాలు జామ్లో చిక్కుకున్నాయి. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు జామ్ కొనసాగింది. #WATCH | Tamil Nadu: Lighting and decorations at different churches in Ooty on #Christmas Eve. pic.twitter.com/WmM4zsfEDU — ANI (@ANI) December 24, 2023 కోల్కతాలోని పార్క్ స్ట్రీట్.. క్రిస్మస్ ఈవ్ వేడుకలతో సందడి చేస్తోంది. భారీ సంఖ్యలో జనం రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక సామూహిక ప్రార్థనలకు చర్చిలు దీపాలతో ముస్తాబయ్యాయి. పార్క్ స్ట్రీట్తో పాటు, హరీష్ ముఖర్జీ రోడ్తో సహా కోల్కతాలోని ఇతర ప్రదేశాలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ అలంకరణలు కనిపించాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చితో పాటు పలు చర్చిలను రంగురంగుల లైట్లతో అలంకరించారు. Uttar Pradesh: Historic Roman Catholic Church in Meerut's Sardhana decked up ahead of Christmas Read @ANI Story | https://t.co/ZTzFuB3dqQ#UttarPradesh #Christmas #RomanCatholicChurch pic.twitter.com/S8hvA0Uch6 — ANI Digital (@ani_digital) December 24, 2023 ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా అలంకరించారు. ఈ చారిత్రాత్మకమైన చర్చిని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ అని పిలుస్తారు. ఈ చర్చి ఉత్తర భారతదేశంలో అతిపెద్దది. యూరోపియన్ సైనికుడు వాల్టర్ రెయిన్హార్డ్ సోంబ్రేను వివాహం చేసుకున్న 14 ఏళ్ల ముస్లిం బాలిక బేగం సమ్రు ఈ చర్చిని నిర్మించారని చెబుతుంటారు. #WATCH | J&K: A church in Jammu lit up colourful lights and decorated on #ChristmasEve pic.twitter.com/6QAaKDt4Kr — ANI (@ANI) December 24, 2023 జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. చర్చిల్లో క్రిస్మస్ పాటలు వినిపిస్తున్నాయి. మిజోరంలోని అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. క్రిస్మస్.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే పండుగ. ప్రతీయేటా ఈ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! #WATCH | Sacred Heart Cathedral Catholic Church in Delhi lit up and decorated on #Christmas Eve. pic.twitter.com/6ijcMysVEA — ANI (@ANI) December 24, 2023 -
వీథి దీపం వెలగకపోతే...!!!
‘అచ్చమైన దీప సన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది...’. అంటున్నాడు త్యాగయ్య ఆ కీర్తనలో. కాంతినివ్వడం ఒక్కటే దీపశిఖ లక్షణం. దీపానికీ, ఈశ్వరుడికీ ఓ లక్షణం ఉంటుంది. వీథి దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో అక్కడేమయినా పామున్నా, తేలున్నా తెలుస్తుంది. గుంటలు, రాళ్ళురప్పా కనబడతాయి... అని చెప్పి ‘ఓ దీపమా! నా మార్గమును నిష్కంటకం చేసితివి, నాకు దారి చూపితివి. నీకిదే నా నమస్కారం..’ అంటూ ధ్యానశ్లోకాలంటూ ఏమీ ఉండవు దానికి. అయితే మనకు దారి చూపినందుకు దానికేసి గౌరవంగా చూస్తాం. ఓ రోజున ఒక ధూర్తుడు రాయి విసిరి దాన్ని పగలగొట్టాడు. ఇంతమందికి వెలుగిచ్చే దీపం, ఇంతమందికి దారిచూపే దీపం... అది మలిగిపోయేటట్లు చేస్తే ... రాయి విసిరినవాడిపై ఆ దీపమేమీ తిరగబడదు. ఆ వెలుగు ప్రయోజనాన్ని అనుభవిస్తున్న మనం దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ‘‘అది లేకపోయినా ఫరవాలేదు. మా బతుకు మేం బతికేస్తాం ...’’ అంటే దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు... మనకు మాత్రం ఆ చీకటే మిగులుతుంది, దానిలో దేవులాటే ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ‘నివాసవృక్షః సాధూనాం ఆపన్నానాం పరాగతిః/ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసః చ ఏకభాజనమ్’.. అంటారు కిష్కింధకాండలో. భగవంతుడున్నాడు.. అని నీవు నమ్మి బతకగలిగితే భగవదనుగ్రహం. ఆయనేమిటి ? ఆయనెందుకు?.. అని చెప్పి ఆయనను తిరస్కరిస్తే చీకటి మిగిలేది మనకే, ఆయనకు కాదు. ‘అచ్చమైన దీపశిఖ సన్నిధిని మరుగు అడ్డుపడి చెఱచినట్టున్నది...’ ఓ దట్టమైన బట్టలాంటిది అడ్డు వచ్చిందనుకోండి.. అప్పుడు ఆ వెలుతురూ ఉండదు. దాని సహాయంతో చూసే అవకాశమూ ఉండదు. కాబట్టి ఆ దీపశిఖ నాకు కనబడడం లేదు... అంటే ఆ దీప శిఖ మరేదోకాదు, పరబ్రహ్మమే. అది ఒక్కటే వెలుగుతోంది. ‘‘లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్’’ అంటారు పోతన గారు భాగవతంలో...అటువంటి వెలుగు ఇక్కడ వెలుగుతుంది. కానీ ఆ దీపం కనబడకుండా ఒక తెర అడ్డుపడుతున్నది. ఈ తెరను నేను తీయలేను ... అని ఆర్తితో వేడుకుంటున్నాడు త్యాగయ్య. ఇదెలా ఉందంటే...‘మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతియున్నది’ అని పోలికను చెబుతున్నాడు. చేప దానిదారిన అది పోతూ దారిలో కనిపించిన ఎరచూసి ఆశపడింది. దాన్ని కొరికింది. ‘మఛ్లీ జల్ కా రాణీ, ఉస్కా జీవన్ పానీ, హాథ్ లగావ్ తో డర్ జాయేగీ, బాహర్ నికాలేతో మర్ జాయేగీ’’.. ఇంకేముంది.. నీళ్ళలోంచి తీసి భూమ్మీద పడేస్తే చచ్చిపోయింది. అంటే తిందామనుకుని తినబడింది. ఈ మత్సరమను తెరతీయనంతకాలం నా పరిస్థితీ ఇంతే.. దీపం కనిపించదు.. స్వామీ ఆ తెరతీయి.. అంటే. అరిషడ్వర్గాల గురించీ నీ ద్వారా ఒక సందేశం లోకానికి అందాలని అనుకున్నాడేమో, ఆయన ఆ తెరనుదీసి దర్శనమిచ్చాడు. ఇదీ సంగీతంవల్ల, పాట పాడడం వల్ల, వినడం వల్ల ప్రయోజనం. అది ఆయనకే కాదు అందరి ఆత్మోద్ధరణకు కారణమయి నిలిచింది. అంత గొప్ప వాగ్గేయకారులు, లోకానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినవారు, దీప స్తంభాల వంటివారు.. మన మధ్య గడిపిన వారు కావడం మన అదృష్టం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? విమానాలకు సంబంధం ఏమిటి?
మీరు ఎప్పుడైనా ఏదైనా మహానగరంలో రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని ఎత్తైన భవనాల పైన ఎరుపురంగు లైట్లు కనిపిస్తాయి. ఈ రెడ్ లైట్లు అలంకారం కోసం కాదని, దీని వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహానగరాలు కాంక్రీట్ అడవులుగా ఎప్పుడో మారిపోయాయి. ఆ నగరాల్లో ఎత్తైన భవనాలన్నింటిపైనా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ లైట్లు భారీ భవనాలపైననే ఎందుకు కనిపిస్తాయి? ఓ మాదిరి భవనాలపై ఎందుకు కనిపించవు? దీని వెనుక ఏదైనా ప్రభుత్వ మార్గదర్శకం ఉందా లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భవనాల పైభాగంలో ఎరుపు రంగు దీపాలను అమర్చడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైట్లు లేదా ఎయిర్క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. ఆకాశహర్మ్యాలు, కమ్యూనికేషన్ టవర్లు, విండ్ టర్బైన్లు తదితర ఎత్తైన నిర్మాణాలు.. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా దృశ్యమానత తగ్గినప్పుడు, అననుకూల వాతావరణంలో రెడ్ లైట్లు నిరంతర ఫ్లాషింగ్ సిగ్నల్స్ను విడుదల చేస్తాయి. అవి విమాన పైలట్లకు సులభంగా కనిపిస్తాయి. ఇది విమానాలకు హెచ్చరికలా పనిచేస్తుంది. విమానయాన అధికారులకు ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇటువంటి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పలు దేశాలలో కఠినమైన నిబంధనలను ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ భద్రతను నిర్ధారించడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ లైట్లను అమర్చనిపక్షంలో భవన యజమానులు జరిమానాలతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎత్తైన భవనాలపైన ఉండే రెడ్ లైట్లు విమానాల కోసం నావిగేషనల్ ఎయిడ్స్గా కూడా పనిచేస్తాయి. వాటి స్థానాన్ని, దిశను గుర్తించడంలో సహాయపడతాయి. విమాన భద్రతతో పాటు, భవనాలపై కనిపించే ఎరుపురంగు లైట్లు సమీపంలోని ఎత్తైన నిర్మాణాలకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి: దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి? -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్కు ఎందుకు ద్వేషం? -
ఎలక్ట్రాన్ల ప్రపంచానికి కొత్త ‘కాంతి పుంజం’
ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్ భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్తినీ, జర్మనీలోని మాక్స్ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, లుడ్వింగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నె ఎల్ హుయిలర్ను ఈ బహుమతి వరించింది. 24 ఫ్రేమ్స్ గురించి మీరు వినే ఉంటారు. సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేమ్ల చొప్పున రీలు తిరిగితే తెరపై బొమ్మ, ఆట, పాట, మాట అన్నీ సవ్యంగా కనిపిస్తాయి! సినిమాకైతే ఇలా ఓకే కానీ పరమాణువుల్లోని ఎల్రక్టాన్లను చూడాలనుకోండి లేదా వాటి కదలికలను అర్థం చేసుకోవాలనుకోండి. అస్సలు సాధ్యం కాదు! ఈ అసాధ్యాన్నీ సుసాధ్యం చేయడంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే పియరీ అగోస్తినీ, ఫెరెంక్ క్రౌజ్, అనే ఎల్ హుయిలర్ చేసిన ప్రయోగాలకు ఈ ఏటి భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఇంతకీ ఏమిటీ ప్రయోగాలు? వాటి ప్రయోజనాలేమిటి? అట్టోసెకను ఫిజిక్స్ ఒక సెకను కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో మీకు తెలుసా? మూడు లక్షల కిలోమీటర్లకు పిసరంత తక్కువ. మరి అట్టోసెకను కాలంలో? సెకను.. అర సెకను.. పావు సెకను తెలుసు కానీ ఈ అట్టోసెకను ఏమిటి? 3,711 కోట్ల సంవత్సరాల కాలంలో ఒక సెకను ఎంతో సెకనులో అట్టోసెకను అంతన్నమాట! ఇంకోలా చెప్పాలంటే.. టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 18. గందరగోళం లేకుండా ఉండాలని అనుకుంటే.. సూక్ష్మాతి సూక్ష్మమైన కాలావధి అని అనుకుందాం. ఇంత తక్కువ సమయంలోనూ కాంతి 0.3 మైక్రోమీటర్లు లేదా ఒక వైరస్ పొడవు అంత దూరం ప్రయాణించగలదు. ఈ సంవత్సరం భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇంత సూక్ష్మస్థాయిలో కాంతి పుంజాలను విడుదల చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఎల్రక్టాన్ల కదలికలు, కాంతికి, పదార్థానికి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ అట్టోసెకను ఫిజిక్స్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. వీరి ప్రయోగాల పుణ్యమా అని అణువులు, పరమాణువుల లోపలి కణాలను మరింత క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. కాంతి పుంజాల విశ్లేషణ 2001లో అమెరికాకు చెందిన పియరీ అగోస్తినీ ఈ అట్టోసెకను కాంతి పుంజాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా సుమారు 250 అట్టోసెకన్ల కాలం ఉండే కాంతి పుంజాలను విశ్లేషించడంలోనూ విజయం సాధించారు. ఈ కాలంలోనే జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌజ్ కూడా ఈ అట్టోసెకను కాంతి పుంజాలపై పరిశోధనలు చేస్తూండేవారు. కాకపోతే ఈయన 650 అట్టోసెకన్ల కాలపు కాంతి పుంజాన్ని వేరు చేయడంలో విజయవంతం కావడం గమనార్హం. ఒకప్పుడు అసాధ్యం అని అనుకున్న ప్రాసెస్లను కూడా గమనించడం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల వల్ల ఇప్పుడు వీలైంది. ‘‘ఎలక్ట్రాన్ల ప్రపంచానికి ఈ ప్రయోగాలు తలుపులు తెరిచాయి. అట్టోసెకన్ ఫిజిక్స్ ద్వారా ఎల్రక్టాన్లలో జరుగుతున్న కార్యకలాపాలను గమనించడం వీలైంది. ఇకపై ఈ విషయాలను వాడుకోవడం ఎలా? అన్నది మొదలవుతుంది’’ అని నోబెల్ అవార్డు భౌతిక శాస్త్ర కమిటీ అధ్యక్షులు ఎవా ఓల్సన్ వ్యాఖ్యానించడం విశేషం. వ్యాధుల నిర్ధారణలోనూ ఉపయోగకరం ఈ అట్టోసెకను ఫిజిక్స్ను ఎల్రక్టానిక్స్లో సమర్థంగా ఉపయోగించుకునేందుకు అవకాశముంది. ఎల్రక్టాన్లు ఏ రకమైన పదార్థంతో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోగలిగితే.. అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకుని మరింత సమర్థంగా పనిచేయగల ఎల్రక్టానిక్ పరికరాలను తయారు చేయడం వీలవుతుంది. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం విద్యుత్తు అంటామన్నది తెలిసిందే. వేర్వేరు మూలకాలను గుర్తించేందుకు అట్టోసెకను కాంతి పుంజాలు ఉపయోగపడతాయి కాబట్టి.. భవిష్యత్తులో వ్యాధుల నిర్ధారణకు కూడా వీటిని వాడుకోవడం వీలవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 1987లో శ్రీకారం అట్టోసెకను కాలపు కాంతి పుంజాలతో ఫొటోలు తీస్తే అణువులు, పరమాణువుల్లో జరిగే కార్యకలాపాలేమిటన్నది స్పష్టంగా తెలుస్తాయి. ఈ అట్టోసెకను కాంతి పుంజాల తయారీకి 1987లో స్వీడన్కు చెందిన ఎల్ హుయిలర్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. అప్పట్లో ఈ శాస్త్రవేత్త జడ వాయువు గుండా పరారుణ కాంతిని ప్రసారం చేసినప్పుడు వేర్వేరు ఛాయలున్న రంగులు బయటకొస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ఛాయ పరారుణ కాంతి జడ వాయువులోని పరామాణువులతో జరిపిన పరస్పర చర్యల ఫలితం. కొన్ని ఎల్రక్టాన్లు ఈ లేజర్ కిరణాల ద్వారా అదనపు శక్తి పొంది దాన్ని విడుదల చేస్తూంటాయి అన్నమాట. ఈ అంశంపై ఎల్ హుయిలర్ తన ప్రయోగాలు కొనసాగించగా ఆ తరువాతి కాలంలో అనేక కీలకమైన ఫలితాలు లభించాయి. సెకను కంటే తక్కువ సమయాన్ని ఇలా సూచిస్తారు సెకనులో వెయ్యో వంతు... ఒక మిల్లీ సెకను మిల్లీ సెకనులో వెయ్యో వంతు.. ఒక మైక్రో సెకను ఒక మైక్రో సెకనులో వెయ్యో వంతు... ఒక నానో సెకను ఒక నానో సెకనులో వెయ్యో వంతు.. ఒక పికో సెకను ఒక పికో సెకనులో వెయ్యో వంతు.. ఒక ఫెమ్టో సెకను (లాసిక్ కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్థాయి లేజర్ కిరణాలను వాడతారు) ఒక ఫెమ్టో సెకనులో వెయ్యో వంతు.. ఒక అట్టో సెకను -
కలవరపెడుతున్న కాంతి
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్.. వాయు కాలుష్యం. అలాగే శబ్ద కాలుష్యం గురించి కూడా మనకు తెలుసు. వీటితో తలెత్తే అనర్థాలపైన కూడా అవగాహన ఉంది. అయితే కాంతి కాలుష్యం (లైట్ పొల్యూషన్) గురించి మాత్రం అంతగా తెలియదు. అయితే దీనితో కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాంతి కాలుష్యంపై తమ దేశంలో నిర్వహించిన పరిశోధనను చైనా తాజాగా వెల్లడించింది. కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసి అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ బాధితులుగా మారారని ఆ అధ్యయనం బాంబుపేల్చింది. వీరంతా చైనాలోని 162 నగరాల్లో నివసిస్తున్నారు. కాంతి కాలుష్యంతో ఏం జరుగుతుంది? అధిక కాంతి వల్ల కాంతి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు పండుగల సమయంలో రంగు రంగుల్లో మెరిసే దీపాలు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతుంటాయి. ఇవి కాంతి కాలుష్యానికి కారణమవుతున్నాయి. అలాగే అన్ని రకాల కృత్రిమ కాంతి, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఎల్ఈడీ, కారు హెడ్లైట్, హోర్డింగ్ల నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కూడా కాలుష్యాన్ని వెదజల్లుతోంది. ముఖ్యంగా ఈ కాంతి కాలుష్యం వ్యక్తి శరీరాన్ని క్రమంగా ప్రభావితం చేస్తోందని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా మధుమేహ బాధితులుగా మారుస్తోందని పరిశోధకులు వెల్లడించారు. వీధి దీపాలు, స్మార్ట్ ఫోన్లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం పెంచుతాయని స్పష్టమైంది. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మానవుల శరీర చక్రాన్ని మారుస్తాయని.. అంతేకాకుండా క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 80% మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలుష్యం బారిన పడుతున్నారని కూడా తెలిపారు. పరిశోధన ప్రకారం.. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి అజీర్తి సమస్యలు ఉన్నాయని తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఎక్కువసేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. మన దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే.. ప్రపంచంలో చైనా, అమెరికా, ఈయూల తర్వాత అధిక కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే మనదేశంలో అధిక జనాభా ఉండడం వల్ల తలసరి ఉద్గారాలు మిగతా ప్రధాన దేశాలతో పోలిస్తే తక్కువ. 2030 నాటికల్లా దేశ ఇంధన శక్తిలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచే పొందాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అదే సంవత్సరానికి కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించాలని నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సౌర విద్యుత్పై దృష్టి సారిస్తోంది. దాదాపు 43,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంతి కాలుష్యంపైనా భవిష్యత్తులో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. -
మనుషులు ఇలా కూడా ఉంటారా? గ్యాస్ లైటర్ సాయంతో రింగురింగుల జుట్టు..
పార్లర్కు వెళ్లడం ఖర్చుతో కూడిన పని. అందుకే అమ్మాయిలు/మహిళలు కొన్నిసార్లు ఇంట్లోనే హెయిర్ స్టైలింగ్, ఫేషియల్, ఫేస్ మసాజ్ లాంటి అందాలను ఇనుమడింపజేసే ప్రక్రియలను చేసుకుంటుంటారు. అయితే తాజాగా ఒక భర్త తన భార్యకు రింగురింగుల జుట్టును తీర్చిదిద్దేందుకు ఒక విచిత్రమైన విధానాన్ని అనుసరించాడు. దీనిని చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో @Madan_Chikna హ్యాండిల్లో పోస్ట్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 6 వేలకు పైగా వ్యూస్, లెక్కకుమించిన లైక్స్ వచ్చాయి. పలువురు యూజర్స్ ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రమాదకరమని కొందరు అంటున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గ్యాస్ స్టవ్పై ‘గ్యాస్ లైటర్’లోని మెటల్ భాగాన్ని వేడి చేయడం చూడవచ్చు. తరువాత ఆ వేడిచేసిన లైటర్ సాయంతో భార్య కురులను రోల్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్ని సెకెన్ల అనంతరం అతను ఆమె జుట్టును లైటర్ నుంచి వేరు చేసినప్పుడు, ఆ జుట్టు రింగురింగులుగా మారాడాన్ని గమనించవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఈ విధానం చాలా ప్రమాదకరమని, డబ్బు ఆదా చేయడమనే పేరుతో జుట్టుతో ఆడుకోవడం సరైదని కాదని సూచిస్తున్నారు. సరదాకి కూడా ఇలాంటివి చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని Showed this reel to my wife and she said yeh toh kuch bhi nahi hai and gave five similar examples how more precisely we used to do this 😲 pic.twitter.com/2h0PaZW4UA — Godman Chikna (@Madan_Chikna) September 15, 2023 -
అత్యంత తేలికైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్లు చాలా బరువుగా మారాయి. ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. రియల్ మీ నార్జో ఎన్ 53 (Realme Narzo N53) బరువు 182 గ్రాములు. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ Unisoc T612 SoC ప్రాసెసర్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ LED ఫ్లాష్తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 4GB + 64GB వెర్షన్ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్ ధర రూ. 10,999. మోటో జీ13 (Moto G13) బరువు 184.25 గ్రా 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్ 64GB/128GB స్టోరేజీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్లు, 8MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 4GB + 64GB మోడల్ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999. వివో వై 02 (Vivo Y02) బరువు 186 గ్రాములు. 6.51-అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్ 8MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999. రెడ్మీ 10ఎ (Redmi 10A) బరువు 194 గ్రాములు 6.53-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G25 ప్రాసెసర్ 3GB/4GB LPDDR4x ర్యామ్, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 3GB + 32GB మోడల్ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499. -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...
చాలామంది పలు రకాల ఆవిష్కరణలు సృష్టిస్తారు. అవన్నీ కూడా తాము ఎదర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆవిష్కరణలే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి విస్తుపోయేలా కళ్లు చెదిరే ఒక సరికొత్త ఆవిష్కరణ సృష్టించాడు. వివరాల్లోకెళ్తే....యూఎస్కి చెందిన బ్రియాన్ స్టాన్లీ అనే ఇంజనీర్ క్యాన్సర్ కారణంగా కన్నుని పోగొట్టుకున్నాడు. దీంతో అతను కృత్రిమ కన్నుని రూపొందించాడు. ఐతే అది మాములు కన్ను కాదు ఏకంగా లైట్లా వెలిగే కన్నుని తయారు చేశాడు. తానే స్వంతంగా ప్రోథెస్టిక్ కన్నుని రూపొందించాడు. తన కనుపాప ఫ్లాష్ లైట్లా వెలిగేలా రూపొందించాడు. ఈ కన్నుని టైటానియం సైబర్గ్ కన్నుగా పిలుస్తారు. ఇది ఒక హెడ్ల్యాంప్ లాగా పనిచేస్తుంది. అదేనండి బొగ్గుగనుల్లో ఉండేవాళ్లు పెట్టుకునే క్యాప్ల్యాంప్లా ఉంటుందన్నమాట. చీకటిలో సులభంగా చదవడానికి ఉపకరిస్తుందని, పైగా ఈ లైట్ వేడిగా ఉండదని చెబుతున్నాడు స్టాన్లీ. అంతేగాదు ఈ ఫ్లాష్ లైట్ కన్ను బ్యాటరీ 20 గంటలు వరకు పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు బ్రియాన్ తన ప్రోథిస్టిక్ కన్నుని ఎలా రూపొందించాడో వివరిస్తూ...వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ మేరకు నెటిజన్లు వావ్ వాట్ ఏ ఆవిష్కరణ, సైన్స్తో ఏదైన సాధించవచ్చు అంటూ స్టాన్లీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Brian Stanley (@bsmachinist) (చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్) -
పోలీసే దొంగలా కొట్టేస్తే ఏం చేసేది సామీ!
లక్నో: పోలీసే దొంగలా ఒక షాపు నుంచి ఎలక్ట్రిక్ బల్బ్ని కొట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన సీసీఫుటేజ్లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ రాజేష్ వర్మ మూసేసి ఉన్న షాపు వద్ద బల్బుని తీసేసి జేబులో పెట్టకుని వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి రాజేష్కి అక్టోబర్ 6న దసరా సంబరాలు జరుగుతున్న రోజు ఆ ప్రాంతంలో నైట్ డ్యూటీ పడింది. అప్పుడే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఐతే మరసటి రోజు షాప్ యజమాని వచ్చి చూడగా..బల్బు కనిపించకపోవడంతో సీసీఫుటేజ్ చెక్ చేసి చూశాడు. ఆ వీడియో ఫుటేజ్ చూసి ఆ షాపు యజమాని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ ఘటన తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు సదరు కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించారు. అతను ఈ మధ్యే ఫుల్పూర్ పోలీస్టేషన్కి బదిలిపై వచ్చాడు. ఐతే కానిస్టేబుల్ రాజేష్ మాత్రం తాను బల్బు దొంగలించ లేదని బల్బు ఊడిపోతుండటంతో తీసి మళ్లీ సరిచేసి పెట్టానంటూ సమర్థించుకనే యత్నం చేస్తున్నాడు. పైగా చీకటి కాబట్టి ఫుటేజ్ అలా కనిపిస్తుందని వాదిస్తున్నాడు. గతంలో యూపీలో ఇలానే ఒక పోలీసు మొబైల్ ఫోన్ని కొట్టేస్తూ పట్టుబడిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: కేరళ తరహా మరో నరబలి కలకలం.. మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తూ..) -
Prachand: రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
జైపూర్: భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్ ఇన్ ఇండియా ఘనత వచ్చి చేరింది. తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్(LCH) ‘ప్రచండ్’ను ఇవాళ(సోమవారం) ఇండియన్ ఎయిర్ఫోర్స్లోకి ప్రవేశపెట్టారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ను జోధ్పూర్ ఎయిర్బేస్లో జరిగిన కార్యక్రమంలో ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వ్ ధరమ్ ప్రార్థన సైతం నిర్వహించారు. Made-in-India light combat helicopters 'Prachand' inducted into IAF Read @ANI Story | https://t.co/S6zR9sWphB#LCH #Prakhand #RajnathSingh #IAF pic.twitter.com/nh36KANOdz — ANI Digital (@ani_digital) October 3, 2022 చాలా కాలంగా.. దాడుల కోసం తేలికపాటి హెలికాప్టర్ల అవసరం ఉంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆ అవసరాన్ని తీవ్రంగా భావించింది మన సైన్యం. LCH అనేది రెండు దశాబ్దాల పరిశోధన-అభివృద్ధి ఫలితం. ఇండియన్ ఎయిర్ఫోర్స్లోకి ప్రచండ్ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయి. ప్రచండ్ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకోగలదు. వివిధ రకాల మందుగుండు సామగ్రిని మోసుకెళ్ళగలదు. దానిని త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. ఇది వివిధ భూభాగాలలో మన సాయుధ దళాల అవసరాలను సంపూర్ణంగా తీరుస్తుంది. ఇది మన సైన్యం, వైమానిక దళం రెండింటికీ ఆదర్శవంతమైన వేదిక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి రాజ్నాథ్ సింగ్. For a long time, there was a need for attack helicopters & during the 1999 Kargil war, its need was felt seriously. The LCH is a result of research & development for two decades. And its induction into IAF is an important milestone in defence production: Defence Minister R Singh pic.twitter.com/zU5KrCUjwk — ANI (@ANI) October 3, 2022 ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో గణనీయంగా ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్ ల్యాండ్-టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం. There is no need to define ‘Prachand’, the LCH itself is capable of sending out a message to the enemy: Defence Minister Rajnath Singh after his LCH sortie at Jodhpur IAF airbase pic.twitter.com/KQoRtRjvfH — ANI (@ANI) October 3, 2022 అవసరమైన చురుకుదనం, యుక్తి, విస్తరించిన శ్రేణి, అధిక ఎత్తులో పనితీరు, అన్ని వేళలా.. వాతావరణం ఎలాంటిదైనా సరే పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రచండ్. భారత సైన్యం.. ప్రత్యేకించి వైమానిక దళం కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ప్రచండ్ ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని అధికారులు చెప్తున్నారు. మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి (LSP) తేలికపాటి యుద్ధ విమానాల సేకరణకు ఆమోదం తెలిపింది. IAF కోసం పది హెలికాప్టర్లు, భారత సైన్యం కోసం ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: 8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు -
అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!
మనం ప్రకృతిలో ఉండే కొన్ని రకాల వింతలను మన కళ్లతో నేరుగా చూడగలుగుతాం. అయితే ఒక్కొసారి అవి మనం నేరుగా కాకుండా వీడియోలో రికార్డు చేసినప్పుడు గమనిస్తూ ఉంటాం. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ విమానంలో ప్రయాణిస్తుండగా ఒక వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. (చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!) అసలు విషయంలోకెళ్లితే...పసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్న ఒక పైలెట్ వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చూశాడు. ఒక మూడు కాంతి చుక్కలు ఒకేరీతీలో కదులుతు ఉంటాయి. ఈ మేరకు కొంత దూరం వరకు వెళ్లి ఆ తర్వాత కనుమరుగవ్వడం గమినించాడు. ఈ మేరకు ఈ కదులుతున్న యూఎఫ్ఓ ఫ్లీట్ని కెమరాలో బంధించడమే కాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోని 39,000 అడుగుల ఎత్తులో తీశారు. దీంతో నెటిజన్లు ఇది ఇప్పటి వరకు వచ్చిన యూఎఫ్ఓ ఫ్లీట్ వీడియోలో అత్యుత్తమమైనదంటూ ఆ విచిత్రాన్ని చూసి అవాక్కవుతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽 The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳 What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq — Chillz TV (@ChillzTV) December 7, 2021 -
కళ్లు లేకున్నా కాంతిని గ్రహిస్తాయి!
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: కళ్లు లేకుండా కాంతిని గ్రహించవచ్చా? అంటే.. అవును అంటోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధన బృందం. కొన్ని క్రిములు (ప్లానేరియన్ ఫ్లాట్వారమ్స్) కళ్లు లేకుండానే కాంతిని గ్రహించగలుగుతున్నాయని హెచ్సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఆకాష్ గుల్యాని నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రిమి శరీరం అంచుల్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రొటీన్లతో కూడిన ఒక కంటి- స్వతంత్ర వ్యవస్థ (ఎక్స్ట్రాక్యులర్) ఇందుకు తోడ్పడుతున్నట్లు వారు గుర్తించారు. ఈ మేరకు హెచ్సీయూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తలను తొలగించినప్పటికీ ప్లానేరియన్లు బతికి ఉండగలవని, అంతేకాకుండా తక్కువ మోతాదుల్లో అతి నీలలోహిత వెలుగు పడినప్పుడు, ఆ కాంతి వనరు నుంచి పక్కకు వెళ్లిపోగలవని ఇంతకుముందు జరిగిన పరిశోధన స్పష్టం చేసింది. తాజాగా పరిశోధకులు.. దృష్టి లోపంతో బాధ పడుతున్నవారికి కంటి చూపునిచ్చేందుకు, అలాగే కాంతి సహాయంతో కణాల అంతర్గత పనితీరును నియంత్రించేందుకు, ఈ సహజ కాంతి గ్రాహక ప్రొటీన్లు ఉపయోగపడతాయా అని తెలుసుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ క్రిములు కళ్లు లేకుండా కాంతిని ఎలా గ్రహించ గలుగుతున్నాయి, అవి కాంతిని గ్రహించేందుకు ఇతర కాంతి గ్రాహక వ్యవస్థ ఏదైనా ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే గుల్యానీ నేతృత్వంలోని బృందం.. ఫ్లాట్వార్మ్స్ శరీర అంచుల వెంబడి ఉన్న కంటి–స్వతంత్ర వ్యవస్థ (ఐ–ఇండిపెండెంట్ సిస్టమ్ (ఎక్స్ట్రాక్యులర్), తల లేని క్రిమి సైతం తల ఉన్న క్రిమి మాదిరి నమ్మశక్యంకాని సమన్వయంతో కదిలేలా చేస్తోందని కనిపెట్టినట్లు ప్రకటన వెల్లడించింది. -
Chrysanthemum: ఎల్ఇడీ బల్బుల వెలుగులో చామంతి పూల సాగు!
మార్కెట్లో ఎప్పుడు ఏ పంట దిగుబడులకు గిరాకీ ఉంటుందో అప్పుడు ఆ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకొని పంటలు పండిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది అనటానికి విద్యాధిక యువ రైతు మంచిరెడ్డి శశికళాధరప్ప చామంతి సాగు అనుభవమే నిదర్శనం. అన్సీజన్లో చామంతి సాగుకు శ్రీకారం చుట్టి తక్కువ పెట్టుబడితో మంచి నికదాయాన్ని పొందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల తోడ్పాటుతో అన్సీజన్లో కృత్రిమ కాంతితో చామంతి పూల సాగు విధానాన్ని అమలుచేస్తూ శశికళాధరప్ప సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సాధారణంగా జూన్–జూలై నుంచి చామతి పూల సాగు చేపడుతారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శాఖీయోత్పత్తి జరుగుతుంది. నవంబరు నెల నుంచి పూలు కోతకు వస్తాయి. అయితే, రైతులందరూ ఈ సీజన్లో ఒకేసారి సాగు చేయడం, దిగుబడులు ఒకేసారి మార్కెట్లోకి వస్తుండటం వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించదు. ఈ సమస్యను అధిగమించి వేసవిలో పూల దిగుబడి వచ్చేలా శాస్త్రవేత్తల తోడ్పాటుతో శవికళాధరప్ప కృత్రిమ కాంతిని ఉపయోగించి దిగుబడులు తీస్తున్నారు. ఎల్ఈడీ బల్బుల వెలుగు.. శశికళాధరప్ప(31) ఎంసీఏ పూర్తి చేసి 2020–21లోనే కాడిపట్టి సేద్యానికి శ్రీకారం చుట్టారు. మిరప, ఉల్లి, సీజన్లో చామంతి సాగు చేపట్టి విశేషంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఎకరా విస్తీర్ణంలో పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ రకాల చామంతి పూల సాగు చేపట్టారు. చామంతిలో శాఖీయోత్పత్తిలో కొమ్మలు బాగా రావడానికి పగటి సమయం ఎక్కువగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది. శాఖీయోత్పత్తిని పెంచుకోవడానికి పగటి సమయం సరిపోకపోతుండటంతో కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకున్నారు. రూ.20 వేలు ఖర్చు చేసి చామంతి పొలం చుట్టూ మూడు మీటర్లకు ఒకటి చొప్పున 84 ఎల్ఇడీ బల్బులు అమర్చారు. దీంతో చామంతి పూల తోటలో రాత్రి సమయంలో కూడా పగటి పూట మాదిరిగా వెలుతురు పరుచుకుంది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకోవడంతో అన్ సీజన్లో కూడా చామంతిలో కొత్తగా ఇగుర్లు వచ్చాయి. 30 రోజులకు తలలు తుంచడంతో విశేషంగా కొమ్మలు వచ్చాయి. ఇప్పటికి ఒక సారి పూలు కోశారు. ప్లాస్టిక్ షీట్లతో కృత్రిమ చీకట్లు.. శశికళాధరప్ప ఈ నెలలో కృత్రిమంగా రాత్రి సమయాన్ని పెంచుకోనున్నారు. శాఖీయోత్పత్తి జరిగిన తర్వాత పూ మొగ్గలు ఏర్పడి పువ్వులు వచ్చేందుకు రాత్రి సమయం కనీసం 14 గంటలు అవసరం. 14 గంటలు రాత్రి/ చీకటి వాతావరణం ఉండాలి. ఇందుకోసం ఎకరాలోని చామంతి పూల తోటలో కర్రలు పాతి నల్లటి ప్లాస్టిక్ షీట్లు కప్పి కృత్రిమ చీకటిని సృష్టించుకోవడానికి రంగం సిద్ధం చేసుకోనున్నారు. వేసవిలో చామంతి పూల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద లేకుండా పోయింది. డ్రిప్ సదుపాయం కల్పించుకొని ఎరువులు వినియోగించారు. సూక్ష్మ పోషకాల నివారణకు పార్ములా–1, పార్ములా–2 మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కకోత పూలు వచ్చాయి. ఇంకా దాదాపు 50 రోజుల వరకు పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అన్సీజన్లో చామంతి పూలు లభిస్తుండటం వల్ల నికరాదాయం కనీసం రూ.2 లక్షల వరకు ఉండవచ్చని శశికళాధరప్ప అంచనా వేస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) రూ. 2 లక్షల నికరాదాయం ఆశిస్తున్నా! మాకు గ్రామం ప్రక్కనే 8.50 ఎకరాల సారవంతమైన భూమితోపాటు బోరు ఉంది. ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత గత ఏడాది వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచనలతో అన్సీజన్లో చామంతి పూల సాగు చేపట్టాను. అనువుకాని కాలంలో పూల సాగు చేపట్టి కృత్రిమ కాంతి, కృత్రిమ చీకటి కల్పించడం వల్ల పూల సాగు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడి రూ.90 వేలు అవుతోంది. రూ.2 లక్షల వరకు నికరాదాయం వస్తుందనుకుంటున్నా. – మంచిరెడ్డి శశికళాధరప్ప, రామళ్లకోట, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా (99669 98816, 91823 27249) ఇక్కడ చదవండి: కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు -
ఇవి తగినంత ఉంటే కరోనాకు చెక్
సాక్షి.హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో గాలి, వెలుతురు కూడా కీలకమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. సాధారణంగా బహిరంగ ప్రదేశాలతో పోల్చితే గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనే వెల్లడైన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో జనం గుమిగూడినప్పుడు మాట్లాడినా.. దగ్గినా.. తుమ్మినా వెలువడే తుంపర్లు సమీపంలో ఉన్న వారిని తొందరగా చేరుకుంటాయి. ఫలితంగా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి. అయితే, ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్–19’అధ్యయనంలో వెల్లడైంది. ఇదీ అధ్యయనం: గాలి ద్వారా ‘ఏరోసోల్స్’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్ మోడల్ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమై న మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలు జనసమూహాలు ఉండే ప్రదే శాల్లోనూ కోవిడ్ మహమ్మారి నియంత్రణకు ఉపయోగపడతాయని వారు పేర్కొంటున్నారు. చదవండి: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు -
నిమ్స్లో ‘లైటు లేక’ మూతపడ్డ ఆపరేషన్ థియేటర్
సాక్షి,సిటీబ్యూరో: ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక ఆపరేషన్లు వాయిదా పడిన సంఘటనలు మండలాల్లో జరుగుతుంటాయి. విద్యుత్ కోతలూ అక్కడ సర్వ సాధారణం కనుక వైద్యం వాయిదా పడుతుంది. కానీ ఆపరేషన్ థియేటర్లో లైటు లేక శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. ఈ సంఘటన ఎక్కడో మారుమూల గ్రామాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకుంటే పొరపాటే.. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లోనే జరిగింది. అదీ ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో జరగడం గమనార్హం. ఇక్కడ వైద్య పరికరాల లేమి, మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్లు న్యూరోసర్జరీ చికిత్సలకు పెద్ద అడ్డంకిగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై మెదడులో రక్తం గడ్డకట్టి, కణతులు ఏర్పడి, రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణాపాయ స్థితిలో ఇక్కడకు వస్తున్న బాధితులకు చేదు అనుభవమే ఎదరవుతోంది. నిమ్స్లో చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ల కొరత, వైద్య పరికరాల లేమితో సర్జరీలు వాయిదా పడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు అత్యాధునిక ‘ఓయాయ్, నావిగేషన్ టెక్నాలజీ, స్టీమోటాక్సీన్, ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ’ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని న్యూరోసర్జరీ చికిత్సల్లో దూసుకుపోతుంటే.. నిమ్స్లో మాత్రం ఇప్పటికీ డాక్టర్ రాజారెడ్డి హయాంలో సమకూర్చిన వైద్య పరికరాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొత్తవి కొనుగోలు చేయక పోగా పాత వాటికి మరమ్మతులు చేయించక క్లిష్టమైన చికిత్సలనూ వాయిదా వేయాల్సి వస్తోంది. ‘లైటు లేక’ మూతపడ్డ థియేటర్ న్యూరో సర్జరీ విభాగానికి రోజుకు సగటున 150 కేసులు వస్తుంటాయి. అత్యవసర విభాగం, న్యూరాలజీ విభాగం నుంచి రిఫరల్పై మరికొన్ని కేసులు వస్తుంటాయి. వీటిలో 15 శాతం మందికి సర్జరీలు అవసరం అవుతుంటాయి. మూడు యూనిట్లలో ఎమినిమిది మంది సీనియర్ ఫ్యాకల్టీలతో సహా 19 మంది రెసిడెంట్లు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు ఆపరేషన్ టేబుళ్లు కేటాయించారు. వీటిలోని ఓ ఓటీ లైటు నెల రోజుల క్రితం పాడైపోవడంంతో థియేటర్ను పూర్తిగా మూసివేశారు. దీంతో కీలకమైన సర్జరీలు కూడా వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 60 మంది వరకు ఈ చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మెదడులో ఏర్పడిన కణుతులను తొలగించే క్రమంలో వైద్యుడు ఏది టిఫ్యూనో.. ఏది కణితో గుర్తించాలి. ఇందు కోసం ప్రతి ఆపరేషన్ టేబుల్కు ఒక అత్యాధునిక మైక్రోస్కోప్ అవసరం కాగా, రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి పనిచేయడం లేదు. ఉన్నతాధికారే స్వయంగా అత్యాధునిక మైక్రోస్కోప్ల కొనుగోలుకు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరాకరిస్తున్నకార్పొరేట్ ఆస్పత్రులు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మెదడులో రక్తం గడ్డకట్టిన ‘ఆరోగ్యశ్రీ’ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో హెడ్ ఇంజూరీ బాధితులకు రూ.లక్ష లోపే ఇస్తున్నారు. సాధారణ చికిత్సతో పోలిస్తే ఇది కొంత క్లిష్టమైంది కావడం, సర్జన్ చార్జీలతో పాటు వెంటిలేటర్, ఐసీయూ, పడక ఖర్చులకు ఇవి ఏమాత్రం సరిపోకపోవడమే ఇందుకు కారణం. హెడ్, బ్రెయిన్ ఇంజూరీ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తుండడంతో వారంతా నిమ్స్ను ఆశ్రయిస్తున్నారు. నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే కేసుల్లో ఇవే ఎక్కువ. ప్రతిరోజూ వచ్చి పడుతున్న అత్యవసర కేసులకు తోడు మెదడులో కణుతులు, వెన్ను, మెడ నొప్పి బాధితులు కూడా చేరుతున్నారు. వీరందరికీ చికిత్స చేసే సదుపాయాలు ఆస్పత్రిలో లేక వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు. -
కాంతిని స్లోమోషన్లో చూడాలనుందా?
వాషింగ్టన్: కాంతిని అత్యంత స్లో మోషన్లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్ను కేప్చర్ చేయగలదని తెలిపారు. ఇంత వరకు అంతుచిక్కని కాంతి, పదార్థం మధ్య జరిగే చర్యల గురించి తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కెమెరాను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. కాంతి అధ్యయన శాస్త్రంలో ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త ఆవిష్కరణల వల్ల జీవ, భౌతిక శాస్త్రాల్లో అతి సూక్ష్మ విశ్లేషణలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. ఈ పద్ధతులను వినియోగించుకోవాలంటే, ఒకేసారి షార్ట్ టెంపోరల్ రిజల్యూషన్లో చిత్రాలను కచ్చితత్వంతో రికార్డు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజింగ్ పద్ధతుల ద్వారా అల్ట్రాషార్ట్ లేజర్ పల్సస్ పద్ధతి ద్వారా ఈ విశ్లేషణలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. కంప్రెస్డ్ అల్ట్రాఫాస్ట్ ఫొటోగ్రఫీ (కప్) టెక్నాలజీ కొంతమేరకు ఉపయోగకరంగా ఉన్నా.. పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఇప్పుడు ఈ టెక్నాలజీనే మరింత మెరుగుపర్చి నూతన సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేమ్స్ను బంధించే ఫెమ్టో సెకండ్ సామర్థ్యమున్న కెమెరాకు స్థిర చిత్రాలను బంధించే మరో కెమెరాను జతచేశారు. దీంతో అత్యంత నాణ్యమైన చిత్రాలను సెకనుకి 10 ట్రిలియన్ల ఫ్రేమ్స్ వరకు బంధించవచ్చని కాల్టెక్ ఆప్టికల్ ఇమేజింగ్ లాబోరేటరీ(కాయిల్) డైరెక్టర్ లిహాంగ్ వాంగ్ వెల్లడించారు. టీ–కప్గా పిలిచే ఈ నూతన కెమెరా సాయంతో బయో మెడికల్, మెటీరియల్ సైన్స్, ఇతర విభాగాలకు అవసరమైన కొత్తతరం మైక్రోస్కోప్లను అభివృద్ధి చేయవచ్చని వాంగ్ తెలిపారు. ఈ కెమెరాను ఉపయోగించి తొలుత 25 ఫ్రేములలో 400 ఫెమ్టో సెకన్ల వ్యవధిలోనే కాంతి పుంజం ఆకారం, తీవ్రత, పరావర్తన కోణాన్ని పరిశీలించినట్లు చెప్పారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. -
కడుపు కదిలించేందుకు... కాంతి!
ఉదయాన్నే కడుపు సాఫీగా కదలకపోతే ఎంత చికాకో.. కాఫీలతో కొందరు.. కాసేపు నడక లేదంటే గోరువెచ్చటి నీటితో ఇంకొందరు కడుపు ఖాళీ చేసుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. మరికొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని సాఫీగా అవదు. ఇలాంటి వారి కోసం కాంతి ఎంతో బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యపోవద్దు. అక్షరాలా నిజమే. కాంతి ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా గుండె చప్పుళ్లను క్రమబద్ధీకరిస్తుందని, కరెంటు షాకులతో గుండెలను మళ్లీ కొట్టుకునేలా చేసేందుకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగపడుతుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి. తాజాగా పెద్దపేవు ప్రాంతాల్లో నీలపు కాంతిని ప్రసరింప చేయడం ద్వారా అక్కడి నరాలు చైతన్యవంతమై మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తున్న లాక్సేటివ్లు దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపే అవకాశమున్నందున తాము కాంతిని ప్రత్యామ్నాయంగా గుర్తించామని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త నిక్ స్పెన్సర్ తెలిపారు. ఎలుకల పేవు గోడల్లో అతిసూక్ష్మమైన ఎల్ఈడీ బల్బులు వెలిగేలా చేసినప్పుడు కొన్ని నరాలు చేతన్యవంతమై ఆ పని పూర్తి అయ్యేలా చేసిందని చెప్పారు. అయితే మనిషి పేవుల్లోకి బల్బులు చొప్పించడం కాకుండా ఇతర మార్గాల ద్వారా వెలుతురును ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. -
కాంతి పుంజం..తీసింది ప్రాణం
తుమకూరు: మిరిమిట్లు గొలిపే కాంతి పుంజం ఒకరి మృతికి కారణమైంది. కారు హెడ్లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ట్రాక్టర్ను ఢీకొంది. ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో మహిళ గాయపడింది. ఈఘటన సోమవారం రాత్రి తుమకూరు జిల్లా, హులియూరు సమీపంలో చోటు చేసుకుంది. హులియూరు గ్రామ పంచాయతీ సభ్యుడు ఎస్ఎస్ఆర్ ధయానంద్ భార్య కళావతి(28) సోమవారం రాత్రి తన వదిన వినూతతో కలిసి తిపటూరు వెళ్లింది. తిరిగి వస్తుండగా హులియూరు వద్ద కారు ఎదురైంది. హెడ్లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ప్రమాదంలో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ వినూతకు తీవ్ర గాయాలయ్యాయి. హందనకెరె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
వీధి దీపాలకు బదులు.. కాంతినిచ్చే మొక్కలు..!
వాషింగ్టన్ : త్వరలో రోడ్లపై వీధి దీపాలకు బదులు వెలుగులు అందిస్తున్న మొక్కలు మీకు కనిపించొచ్చు!. అవును. ఈ దిశగా మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ముందడుగు వేశారు. కృత్రిమ కాంతి(బయో లుమినిసెంట్)ని అభివృద్ధి చేయాలనే యోచనలో భాగంగా చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వాటర్క్రెస్ మొక్కల ఆకులకు ప్రత్యేకమైన నానో పదార్థ తంత్రులను పూసిన పరిశోధకులు చీకట్లో అది వెలుగులు విరజిమ్మడాన్ని గుర్తించారు. నానో పదార్థ తంత్రుల ఎఫెక్ట్తో వాటర్క్రెస్ మొక్క దాదాపు నాలుగు గంటల పాటు వెలుగును ఇచ్చినట్లు చెప్పారు. మొక్క నుంచి వెలువడిన కాంతితో పుస్తకాన్ని చదవగలిగామని తెలిపారు. ఇదే తరహాలో పెద్ద మొక్కలపై ప్రయోగాలు చేసి పెద్ద ఎత్తున కృత్రిమ కాంతిని సృష్టించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎలా పని చేస్తుంది? ‘లుసిఫెరాసిస్’ అనే నానో పదార్థ తంత్రువు కృత్రిమ కాంతి సృష్టిలో కీలకపాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ఈ లుసిఫెరాసిస్ను స్వయం ప్రకాశిత జీవుల్లో పరిశోధకులు గుర్తించారు. దానిపై అనేక పరిశోధనలు జరిపి కెమికల్ రియాక్షన్ ద్వారా లుసిఫెరాసిస్ను ‘ఆక్సీలుసిఫెరిన్’గా మార్చారు. ఆక్సీలుసిఫెరిన్ నుంచి ఉద్దాతమైన కాంతి వెలువడుతుండటంతో కృత్రిమ కాంతిని సృష్టించొచ్చనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు. అనంతరం వాటర్క్రెస్ మొక్కలపై ప్రయోగాలు చేసి సఫలీకృతులయ్యారు. కృత్రిమ కాంతిని మానవాళికి అందుబాటులోకి తెస్తే వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ శాతాన్ని భారీగా తగ్గించొచ్చు. దీంతో గ్లోబల్ వార్మింగ్ మహమ్మారిని అరికట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. -
రేపు టీటీడీసీలో జాబ్మేళా
అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 22న టీటీడీసీలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. 18 నుంచి 21 ఏళ్లలోపు ఉన్న యువకులు ఎంపీసీ/బైపీసీలో 60 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. -
ఫోన్ లైట్తో సమస్యలు
హ్యూస్టన్: స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తెర నుంచి వెలువడే నీలం రంగు కాంతి నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తోందట. రాత్రిపూట స్మార్ట్ఫోన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర సమయాన్ని తగ్గించి శరీరంలో జరగాల్సిన అనేక క్రియలను నిలుపుదల చేస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపైకి అధికంగా సూర్యుడి నుంచి నీలం కాంతి వస్తుందని, అప్రమత్తత, శరీర అంతర్గత క్రియల నిర్వహణ, ఎప్పుడు నిద్రపోవాలో తెలపడం లాంటివి సూర్యుడి నుంచి వచ్చే ఈ నీలం రంగు కాంతి మనకు తెలుపుతుందని అన్నారు. అయితే స్మార్ట్ఫోన్స్ నుంచి వచ్చే నీలం కాంతి ఫొటో సెన్సిటివ్ రెటినాల్ గాంగ్లియాన్ కణాలను ఉత్తేజపరిచి నిద్రకు ఉపకరించమని తెలిపే శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే రాత్రిళ్లు ఈ బ్లూ లైట్ను నిరోధించే కళ్ల అద్దాలను ధరించిన వారిలో 58 శాతం మంది శరీరంలో మెలటోనిన్ విడుదల అధికమై నిద్రా సమయం పెరిగిందని తెలిపారు. -
విద్యుత్ మెరుపుల్లో మెరుస్తున్న ముంబై
-
ధ్వనితోనూ చూడొచ్చు!
లండన్: జీవకణాల లోపల చూడటానికి కాంతికి బదులు ధ్వనిని వాడే కొత్త పద్ధతిని పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని స్టెమ్సెల్ మార్పిడిలో, కేన్సర్ను కనుగొనడంలోనూ ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా నిర్మాణం, కణాల ద్వారా జరిగే క్రియలను కనుగొనవచ్చు. ప్రజల శరీరం లోపల చూడటానికి అల్ట్రాసౌండ్ను ఎలా ఉపయోగిస్తామో, పదార్థాల నిర్మాణాలను కనుగొనడానికి కూడా దాన్ని అలానే వినియోగించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఆప్టికల్ మైక్రోస్కోపీలో మనం చూడదగ్గ అతి చిన్న పదార్థం కాంతి తరంగదైర్ఘ్యం. కాంతిలా ధ్వనికి ఎక్కువ బరువుండదు. దీని వల్లే పరిశోధకులు చిన్న తరంగధైర్ఘ్యాలను ఉపయోగించి చిన్న పదార్థాలను చూడగలరు. -
కొబ్బరి పాలు... పెంచే కాంతి...
న్యూ ఫేస్ కొబ్బరి పాలతో చర్మానికి మెరుగైన సంరక్షణను అందజేయవచ్చు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరిపాలు మేలైన ఎంపిక. * పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, పాలు తీయాలి. ఈ పాలను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. చర్మానికి కొబ్బరి పాలలోని నూనె మంచి మాయిశ్చరైజర్లా పని చేసి, ముడతలను నివారిస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. * బాగా పొడిబారినట్టుగా ఉండే చర్మానికి రాత్రి పూట కొబ్బరి పాలతో మృదువుగా మసాజ్ చేసి వదిలేయాలి. మరుసటి రోజు ఉదయానే, సున్నిపిండితో స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేసినా చర్మం పొడిబారడమనే సమస్య దరిచేరదు. చర్మకాంతీ పెరుగుతుంది. * ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్లో ఉంచిన కొబ్బరి పాలను, దూదితో ఒళ్లంతా రాసుకొని, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. * రెండు టీ స్పూన్ల కొబ్బరి పాలలో నాలుగు బాదంపప్పులు వేసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బి దీంట్లో టీ స్పూన్ పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. కాంతి తగ్గదు. * మేకప్ని తొలగించుకున్న తర్వాత వాటిలో ఉండే గాఢ రసాయనాల వల్ల చర్మం దురద పెట్టడం, కాంతి తగ్గడం సహజం. ఇలాంటప్పుడు మేకప్ తొలగించగానే కొబ్బరి పాలను ముఖానికి, గొంతుకు, మెడకు పట్టించి మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి. * కొబ్బరి పాలలో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి మసాజ్ చేసుకుంటూ ఉంటే చర్మం మృదుత్వం, వర్చస్సు పెరుగుతాయి. -
మరణిస్తూ ఆరుగురి జీవితాల్లో వెలుగు
పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ బీటెక్ విద్యార్థి తాను మరణిస్తూ తన అవయవాలు దానం చేసి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. నిమ్స్ జీవన్ దాన్ ప్రతినిధుల కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన విజయ్కుమార్ (20) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 11న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రగాయాలైన విజయ్కుమార్ను వెంటనే రాయచూర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి 12న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్సపొందుతున్న విజయ్కుమార్ 14న బ్రెయిన్డెడ్ అయినట్టు వైద్యులు నిర్థారించారు. మృతుడి తండ్రి బసవరాజుకు జీవన్ దాన్ ప్రతినిధులు అవయవదానం ఆవశ్యకత వివరించారు. ఆయన ఒప్పుకోవడంతో విజయ్కుమార్ శరీరం నుంచి 2 కిడ్నీలు, 2 కళ్లు, కాలేయం సేకరించి అవసరమైన వారికి అమర్చారు. -
కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణతత్వం లోకానికి తన గీత ద్వారా జ్ఞానం అందించి వెలుగు చూపిన సారధి జగద్గురువు శ్రీకృష్ణుడు. పెనుచీకటికి ఆవల ఏకాకారుడై కోటి సూర్య సమప్రకాశ విరాజితుడు, సర్వేశ్వరుడైన గీతకారుడు లోకానికి గీత అందించి జ్ఞాన ప్రసూనాలు వికశింపజేసిన విజ్ఞాని. అధర్మం ఏర్పడినప్పుడు యథా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థా నమ ధర్మశ్య తదాత్మానం సృజామ్యహం!! అని ప్రవచించిన ఆది గురువు శ్రీకృష్ణుడు. కృష్ణతత్వమ్ అంటే సమానత్వం, ప్రేమ పరిపూర్ణ వికాస రూపం. శ్రీకృష్ణుని బోధనలు ధర్మ పరిరక్షణ, సమభావన, కర్తవ్య నిర్వహణ బాధ్యత, ఆది గురువుగా ఆయన జీవన విధానమే లోకానికి ఒక ప్రామాణికం. సామాన్య జనులకు, భక్తులకు ఊరట కలిగించే ధర్మం పక్షాన, పేదల పక్షాన నిలిచిన సామాన్యవాది. కులమతాలకు అతీతంగా ఎలా కలిసిపోవాలో తెలిపిన అభ్యుదయ మూర్తి. ధర్మ రక్షణకు పూనుకున్నవాడు. అధర్మం అంతు చూసినవాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అండగా నిలిచి స్త్రీ యొక్క శీలం కాపాడి స్త్రీ దైవస్వరూపం అని లోకుల కళ్ళు తెరిపించిన ఆదర్శమూర్తి. ధర్మం విలువ తెలుపుటకు, ధర్మం పక్షాన నిలుచుటకు వయోపరిమితి అడ్డుకాదు అని తెలిపిన ధర్మశీలి. స్నేహానికి సరైన నిర్వచనం ఏదైనా వుందీ అంటే అది కేవలం శ్రీకృష్ణుడు. కుచేలునిపై శ్రీకృష్ణుడు చూపిన వాత్సల్యం అతని స్నేహధర్మానికి పరాకాష్ఠ. అర్జునుడికి తాను చేయవలసిన కర్తవ్యాన్ని ఉపదేశించి అధర్మాన్ని ఎదుర్కోవడం ఎంత కష్టం అయినా ధర్మంతో పోరాటం చేస్తే కీర్తి లభిస్తుందని తెలిపిన తత్వదర్శి శ్రీకృష్ణపరమాత్మ. - శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి -
32 మండలాల్లో తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం 32 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి, పెద్ద్పపప్పూరు, శింగనమల, పామిడి, ఆత్మకూరు, విడపనకల్, కణేకల్లు, బెళుగుప్ప తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. -
బాలల చేతుల్లో కర్పూరం వెలిగించింది...
లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్): దొంగతనం నేరం మోపి.. నిజ నిర్ధారణ కోసమంటూ చిన్నారుల చేతుల్లో కర్పూరం వెలిగించి గాయపరిచిన ఘటన వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో వెలుగుచూసింది. గ్రామంలోని ప్రజాచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పది మంది బాలురతో ఆర్బీసీ స్కూల్ నడుస్తోంది. ఈ స్కూల్లో ఆశ్రయం పొందుతున్న ఓ బాలుడి డబ్బును ఎవరో దొంగిలించారు. ఈ విషయమై స్కూల్ అటెండర్ అన్నపూర్ణమ్మ ముగ్గురు బాలురను అనుమానించింది. శుక్రవారం సాయంత్రం వారి అరచేతుల్లో కర్పూరం ఉంచి వెలిగించింది. అది కాలితే దొంగతనం చేసినట్లు...లేకుంటే నిజాయితీపరులేనని వారికిపరీక్షపెట్టింది. అయితే,కర్పూరం మంటతోముగ్గురి చేతులకూ కాలినగాయాలయ్యాయి. ఈ విషయంలో బాధితుల తరఫు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చెన్నారెడ్డికి అధికార టీడీపీ నేతల అండదండలున్నాయని సమాచారం. -
చితికిన బతుకుల చీకటి వెలుగులు
వారు తమ జీవితం గురించి ఆలోచించడం లేదు. ఎవరైతే తమ జీవితాలను చీకట్లోకి నెట్టారో... వారిని తప్పు పట్టడం లేదు. ఎవరినీ నిందించడం లేదు. తమ వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి తాము చీకట్లో మగ్గిపోతున్నారు. చీకటి వెలుగులతో దోబూచులాడుతున్న వారంతా ఎలాంటి జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు? వారి ద్వారానే తెలుసుకుందాం... ‘చీకట్లో నన్ను నేను వేరొకరికి అప్పజెప్పుకుంటూ... ఇంట్లో నా బిడ్డ ఏ పరిస్థితిలో.. ఎలా ఉందో.. అని ప్రాణాలు అరచేతిలో నిలుపుకుంటుంటాను’ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి రెండు క్షణాలు ఆగింది పూర్ణ(పేరు మార్చాం). ఆమె వయసు 29. మనిషి మంచి ఒడ్డూ పొడుగుతో ఉంది. కాలం ఆమెకు చేసిన గాయాలను ఆ కళ ్లకింద వలయాలు చెప్పకనే చెబుతున్నాయి. పూర్ణ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది... ‘‘ఈ ‘పని’ చేయకపోతే ఎలా.. రేపటి మా ఆకలి తీరేదెలా... అని గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డ దగ్గరకు వెళ్లిపోతానా అని ఎదురుచూస్తుంటాను. తెల్లవారకముందే ఉరుకులు పరుగులతో ఇంటికి చేరుకుంటా. తాళం తీసి బిడ్డ ఏ మూల ఉందా అని వెతుక్కుంటా. చాలా సార్లు మా రమ్య (పేరు మార్చాం) పడుకునే కనిపిస్తది. ఒక్కోసారి ఆ చీకట్లో అరుస్తూ గోడకేసి తలబాదుకుంటూ ఉంటది. బిడ్డను గుండెలకదుము కొని... ఊరడించి పడుకోబెడతా. అది ఆకలికి తట్టుకోలేదు. ఏ పండో, బ్రెడ్డు ముక్కనో తినిపించి పడుకోబెడతా! దానికి మతిస్థిమితం లేదమ్మా! ’’ అంటూ ఏడుస్తూనే.. ‘‘నా గురించి ఇంకా ఏముంది చెప్పడానికి. రోత బతుకు. ఒక్కపూటలోనో, ఒక్కరోజులోనో ఈ దుఃఖం తీరిపోయేది కాదు. దేవుడి పిలుపు వచ్చేంతవరకు ఈ కష్టం తప్పదు...’’ అని కళ్లనీళ్లు తుడుచుకుంది. ‘‘మాది అమలాపురం దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అమ్మనాన్నలది కలిగిన కుటుంబమే. అన్న, ఇద్దరు అక్కలున్నారు. పదిహేనేళ్ల క్రితం ‘ప్రేమించాను..’ అని ఒకతను వెంటపడ్డాడు. నిజం అని నమ్మాను. ఇంట్లో వాళ్లకు చెబితే ఊరుకోరని... చెప్పాపెట్టకుండా వాడి చేత తాళి కట్టించుకొని, పట్నం వచ్చేశా. ఇంటి నుంచి తెచ్చుకున్న సొమ్ముతో మూడు నెలలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. కొన్ని రోజులు నా మొగుడు బేల్దారీ పని చేశాడు, కొన్ని రోజులు ఆటో నడిపాడు. ఆనందంగా సాగిపోతుందనుకున్నా. నెలరోజులుగా ఏ పనికీ పోలేదు. ఎందుకంటే ‘పని దొరకలేదు’ అంటుండేవాడు. నెల తప్పిన విషయం నా భర్తకు సంతోషంగా చెప్పా. కానీ, అతనేం మాట్లాడలేదు. ఓ రోజు చీకటి పడుతూనే నా భర్త తన స్నేహితుడు ఒకడిని తీసుకొచ్చాడు. ఆ రాత్రి అతడితో గడపమన్నాడు. చీదరించుకున్నాను, తిట్టాను, అరిచాను, కాళ్లావేళ్లాపడ్డాను. అయినా నా మొగుడి మనసు కరగలేదు. నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. వాణ్ని లోపలుంచి, బయట తాళం వేసుకొని వెళ్లిపోయాడు. రోజూ.. ఎవరినో ఒకరిని తీసుకొస్తూనే ఉండేవాడు. పగటి పూట పారిపోకుండా తలుపులకు తాళం వేసి బయటకు వెళ్లేవాడు. కడుపుతో ఉన్నానని కూడా కనికరం ఉండేది కాదు. నేనెప్పుడూ కాలు బయటపెట్టింది లేదు కాబట్టి చుట్టుపక్కల ఇళ్లవాళ్లకు ఇదేమీ తెలిసేది కాదు. ఈ పరిస్థితిలోనే కూతురు పుట్టింది. పచ్చిబాలింతనని.. అప్పటికైనా వదిలిపెట్టమని బతిమాలుకున్నాను. మా ఊరు వెళ్లిపోతానని కాళ్లు పట్టుకున్నాను. అప్పటికి ‘సరే’ అనేవాడు. రాత్రి అయ్యేవరకు తన అసలు రూపం చూపించేవాడు. బాగా తాగి, తను తీసుకొచ్చినవారి కోరిక తీర్చకపోతే బిడ్డకు పాలు కూడా కొనేవాడు కాదు. బిడ్డ ఆకలి చూసే శక్తి ఇవ్వని దేవుడు, మొగుడు పెట్టే హింసను భరించే శక్తిని ఎలా ఇచ్చాడో...!! చాలా సార్లు చచ్చిపోదామనుకున్నా. పసిదాని మొఖం చూసేసరికి ఏం చేయాలో తెలిసేది కాదు. బిడ్డ పదినెలల వయసున్నప్పుడు నా మొగుడు మంచాన పడ్డాడు. ఏమైందో తెలియదు... విపరీతమైన జ్వరంతో మూలిగేవాడు. ఉన్న కాసిన్ని డబ్బులతో మందులు కొనిచ్చినా తగ్గలేదు. వారం రోజులు తిరక్కుండానే చచ్చిపోయాడు. మున్సిపాలిటీ వాళ్లు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. ఇల్లు గలవాళ్లు ఇల్లు ఖాళీ చేయమన్నారు. చంటిబిడ్డనెత్తుకొని మా ఊరెళ్లాను. మావాళ్లంతా నన్ను ఛీత్కరించుకున్నారు. చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి వాళ్ల పరువు తీశానని. ‘పట్నంలో ఏ కూలో నాలో చేసుకొని పైసలు తెచ్చిస్తా. నా బిడ్డను చూసుకోమ’ని మావాళ్ల కాళ్లావేళ్లా పడ్డా. ‘మా పిల్లలే మాకు బరువు, ఇంక నీ పిల్లనేం చూస్తాం’ అన్నారు. ఇక చేసేదేమీ లేక బిడ్డనెత్తుకొని పట్నం వచ్చా. నాకు నా బిడ్డ, దానికి నేను... అంతే! మాకెవరూ లేరు. పని కోసం వెతికి వెతికి అలసిపోయా! ఆకలితో బిడ్డనెత్తుకొని రాత్రిపూట ఓ రోడ్డుపక్కగా నిల్చున్నా. ‘వస్తావా!’ అన్న మాటలకు ఉలిక్కిపడ్డ. బతకడానికి, బిడ్డను బతికించుకోవడానికి ఏ పనైనా చేయాల్సిందే! నా మొగుడు పుణ్యమా అని తెలిసిన దారే ఎంచుకున్నా! ఓ చిన్న రూము అద్దెకు తీసుకున్నా. ఏడాది దాటినా బిడ్డ తల నిలపడం లేదు. మాట లేదు, ముచ్చట లేదు. అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించా. బిడ్డకు మతిస్థిమితం లేదన్నారు. ఎప్పటికీ బాగవదన్నారు. కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఏం పాపం చేశానని... కడుపుతో ఉండగా నా మొగుడు తన్నిన తన్నులకు నా బిడ్డ ఇలా పుట్టిందా?! వచ్చీ పోయేవాళ్ల కారణంగా నా బిడ్డ ఇలా పుట్టిందా?! ఎవరిని తప్పు పట్టాలి?! ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయేదాన్ని. బతికినన్నాళ్లూ నా బిడ్డ కడుపుకింత తిండి పెట్టగలిగితే అంతే చాలు అనుకుంటున్నా.. ఇప్పుడు దానికి ఎనిమిదేళ్లు. నన్ను గుర్తుపట్టదు. కాస్త వదిలిపెడితే చాలు దారితెన్నూ లేకుండా వెళ్లిపోతుంది. ఒంటిసోయి తెలియదు. పొద్దంతా ఈ బిడ్డతోనే. చీకటిపడితే.. ఎక్కడో... !! నా భయం అంతా ఒకటే. మతిలేని బిడ్డకు ఒళ్లు గురించి తెలియదు. కానీ, దాని ఒళ్లు పెరుగుతోంది. చూడ్డానికి అందంగా కనిపిస్తోంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి?! ఎన్నాళ్లో ఇలా...!!’’ అంటూ ఏడుస్తూనే చేతులెత్తి కనపడని దేవునికి దణ్నం పెట్టుకుంది. పూర్ణ దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కానీ, తోటి సెక్స్వర్కర్లు ఆమెను అర్థం చేసుకున్నారు. అండగా ఉంటామని ఆమెను అక్కున చేర్చుకున్నారు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి జీవితానికి భరోసా! సెక్స్వర్కర్లు తమ భవిష్యత్తు గురించి తాము ఏ మాత్రం ఆలోచించరు. తమను నమ్ముకున్నవారికి విపరీతమైన సేవ చేస్తారు. ముందు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతాం. వీరిలో హెచ్.ఐ.వి. బాధితులు ఉంటారు. వ్యసనాల బారిన పడిన వారుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ‘మీరు ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో వాళ్లకు ముఖ్యంగా మీ పిల్లలకు దూరమైపోతార’ని చెబుతాం. సెక్స్వర్కర్లు తమ జీవితం మెరుగ్గా చేసుకునేందుకు కావల్సిన అవగాహన కల్పించడమే మా పని. పదేళ్లుగా 1400 మంది సెక్స్వర్కర్లకు వెన్నుదన్నుగా ఉంది మా ఫౌండేషన్. - బి. నారాయణస్వామి, టిఐ-ప్రాజెక్ట్ మేనేజర్, రాంకీ ఫౌండేషన్, హైదరాబాద్ నాదగ్గరే ఉండమ్మా అని ఏడుస్తుంది... నా కూతురు ఇప్పుడు ఏడవ తరగతి చదువుతోంది. బిడ్డ సదువుకు, తిండికయ్యే పైసలన్నీ నేనే ఇస్తా, దానికింత నీడనివ్వండని మా బంధువులకు మొక్కిన. వాళ్లు దయతలిచారు. మొదట్లో సెక్స్వర్కర్ గానే ఉన్నా. ఇప్పుడు హోటల్లో పని చేస్తున్నా. ఆరువేల రూపాయల నెల జీతం వస్తది. అవన్నీ నా బిడ్డకోసం పట్టుకెళతా! ఊరి నుంచి వచ్చేటప్పుడు ‘ఇక్కడే ఉండిపొమ్మా’ అని ఏడుస్తది. రొంపిలోంచి బయటపడ్డదాన్ని ఈ రొంపి గురించి నా బిడ్డకు తెల్వకూడదు. అందుకే, ఇంత దూరంలో ఉంటున్న. - మాలిని పిల్లల చదువులకు తప్పని జీవితం... నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త నయం కాని జబ్బుతో మంచాన పడ్డాడు. పూట గడవలేని పరిస్థితిలో ఓ వ్యక్తి ఈ రొంపిలోకి దించాడు. ఎప్పటికప్పుడు మానేద్దాం అనుకుంటాను. కానీ, నా బిడ్డ ఇప్పుడు బి.టెక్ చేస్తోంది. కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. వాళ్లు బాగా చదువా లంటే పైసలు కావాలి. అందుకే నేనీ పని చేయకతప్పదు. అష్టకష్టాలతోనే ఈ రొంపిలోకి వచ్చిన వాళ్లుంటారు. వారిని కనిపెట్టి, టెస్టులు చేయిస్తా! ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తుంటాను. నాలాంటి వారి మేలు కోసం కృషి చేస్తున్నా! - వసుమతి నియమాలు తప్పనిసరి... మాకు మేం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. 18 ఏళ్లు నిండని అమ్మాయిలు ఎవరైనా ఈ రొంపిలోకి వచ్చినట్టుగా గుర్తిస్తే వెంటనే ఫౌండేషన్ నిర్వాహకుల వద్దకు తీసుకురావాలి. అలాగే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి మళ్లీ వాళ్ల వాళ్ల దగ్గరకు పంపించేయాలి. అందుకు మేమే తలా కొంత డబ్బు వేసుకుంటాం. ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ఇప్పుడిప్పుడే మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మా బతుకులు మేం బతకడానికి టైలరింగ్ వంటివి నేర్చుకుంటున్నాం. - ఉష -
రోడ్లకు సోలార్ సిమెంట్ వెలుగులు
మెక్సికోః ఇకపై చీకట్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. విద్యుత్ అవసరం లేకుండానే రహదార్లు ప్రకాశవంతం కానున్నాయి. మెక్సికో సైంటిస్టుల సృష్టి.. వాహనదారులకు, ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. సూర్యరశ్మితో తయారయ్యే విద్యుత్ విధానమైన సోలార్ పవర్ ను కరెంటు లేని సమయంలో వినియోగించుకునే విధానంతో రోడ్లను నిర్మించే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు. తమ ప్రయత్నాలు ప్రయోగ స్థాయిని అధిగమించి విజయవంతమవ్వడంతో త్వరలో కొత్త రోడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెక్సికోలోని మికోకెన్స్ యూనివర్శిటీ ఆఫ్ శాన్ నికోలస్ హిడాల్గో (ఎంఎస్ఎన్ఎస్) కు చెందిన శాస్త్రవేత్తలు.. సోలార్ శక్తితో కూడిన రోడ్లకు రూపకల్పన చేశారు. సోలార్ విద్యుత్తును పీల్చుకోగలిగే సిమెంట్ తో రోడ్లను నిర్మించే విధానాన్ని కనిపెట్టారు. తొమ్మిదేళ్ళ క్రితం ప్రాజెక్టును ప్రారంభించిన సైంటిస్ట్ జోసే రూబియో.. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ లేకుండా రోడ్లపై కాంతిని ప్రసరింపచేసే కొత్త సిమెంట్ ను కనిపెట్టారు. జీబ్రా క్రాసింగ్స్ లోనూ, రెండు రోడ్లను విభజించేందుకు, డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఇప్పటిదాకా రేడియం పదార్థాన్ని, లైట్లను వాడుతుండగా ఇకపై స్వయం ప్రకాశిత సిమెంట్ ను వినియోగించి రోడ్లను కాంతివంతంగా మార్చే పద్ధతికి రూబియో శ్రీకారం చుట్టారు. కొత్తగా కనుగొన్న సిమెంట్ తో రోడ్లు వేయడం వల్ల... అవి పగటి పూట సూర్యరశ్మిని గ్రహించి, రాత్రి సమయంలో సోలార్ విద్యుత్ కాంతులను వెదజల్లుతాయి. ఈ సిమెంట్ తో నిర్మించిన రోడ్లపై ఆకుపచ్చ, నీలం రంగుల్లో కాంతి వెదజల్లుతుంటుంది. దీంతో రోడ్ లైట్స్ లేకుండానే వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాడే రేడియం వంటి స్వయం ప్రకాశిత పదార్థాలు కేవలం మూడు నాలుగేళ్ళపాటు మాత్రమే పనిచేసి, ఆ తర్వాత వాటి శక్తిని కోల్పోయే పరిస్థితిలో... ఈ స్వయం ప్రకాశిత సిమెంట్ మాత్రం... వందల ఏళ్ళైనా తన కాంతిని కోల్పోదు. అయితే రోడ్లకు ఈ సిమెంట్ వాడితే దానిపై పడే దుమ్ము, ధూళి వల్ల కాంతిని కోల్పోతాయన్న అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారని, సమస్యను అధిగమించేందుకు సిమెంట్ లో క్రిస్టల్స్ ను కూడ వినియోగించినట్లు రూబియో తెలిపారు. కొత్తరకం సిమెంట్ తో నిర్మించిన ఈ రోడ్లు ఒకరోజు మొత్తం సూర్యరశ్మిని గ్రహిస్తే దాదాపుగా వాటికి అందిన సోలార్ శక్తితో 12 గంటలపాటు ప్రకాశించగల్గుతాయి. అంతేకాక పర్యావరణ అనుకూలంగా ఉండటంతోపాటు, భూమికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగదని, రోడ్ల నిర్మాణంపై ప్రయోగాలు పూర్తిచేసిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పేటెంట్ పొందిన వెంటనే తమ ప్రాజెక్టుద్వారా రోడ్ల అభివృద్ధిని ప్రారంభిస్తామని రూబియో వెల్లడించారు. -
ఇక బట్టలు ఉతకక్కర్లేదట!
మురికి పట్టిన బట్టలు ఉతికి ఉతికి అలసిపోయారా? ఈ మరక పోయేదెలా అని బెంగపడుతున్నారా? ఇక ఆ అలసటకు, బెంగలకు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చని అంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. భారతీయ సంతతికి చెందిన పరిశోధకుడు రాజేష్ రామనాథన్, దిపేష్ కుమార్, విపుల్ బన్సల్ సహా పరిశోధక బృందం ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికింది. అతి తక్కువ ఖర్చుతో, అతి సునాయసంగా దుస్తులు శుభ్రం చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశామంటున్నారు. వాటంతట అవే శుభ్రం అయ్యే దుస్తులు తొందర్లోనే వచ్చేస్తున్నాయ్! కేవలం కొన్నినిమిషాల పాటు సూర్యకాంతి, లేదా బల్బ్ కాంతి కింద ఉంచడం ద్వారా వస్త్రాలు శుభ్రమయ్యే పద్ధతిని కనుగొన్నామని చెప్పారు. నానో స్ట్రక్చర్లు ఉన్న దుస్తులను కాంతికింద ఉంచినపుడు, అందులోని సేంద్రియ పదార్థాలు క్షీణిస్తాయని, ఫలితంగా కొన్ని నిమిషాల్లోనే బట్టలు వాటికవే శుభ్రపడతాయన్నారు. తమ పరిశోధనలో భాగంగా కాంతికి ఆకర్షించే వెండి, రాగికి సంబంధించిన నానో స్ట్రక్చర్లను పరిశీలించినట్టు చెప్పారు. తాము రూపొందించిన టెక్నాలజీ ప్రకారం కాంతిని స్వీకరించిన నానో స్ట్రక్చర్లు హాట్ ఎలక్ట్రాన్లను క్రియేట్ చేస్తాయి. తద్వారా మరింత శక్తి జనించి, సేంద్రియ పదార్థాన్ని కీణింపజేస్తాయి. దీంతో ఆరు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే వాటంతట అవే బట్టలు శుభ్రమవుతాయని పరిశోధనలో తేలిందన్నారు. తమ ఈ పరిశోధన నానో ఎన్హాన్స్డ్ వస్త్రాల తయారీకి మార్గం సుగమం చేస్తుందన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నామని, పారిశ్రామిక స్థాయిలో ఈ టెక్నాలజీని విస్తరింపచేస్తే భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని వారు తెలిపారు. టమాటా సాస్, వైన్ లాంటి వాటివల్ల ఏర్పడే మరకల్ని కూడా సాధ్యమైనంత త్వరగా శుభ్రం చేసే దిశగా తమ పరిశోధన సాగుతోందని, అది ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. తమ పరిశోధన పత్రం 'అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ ఇంటర్ ఫేసెస్ ' అనే జర్నల్ లో పబ్లిష్ అయిందని తెలిపారు. -
తెలుగే మన కంటి వెలుగు
రెండో మాట తెలుగు బోధనా భాషగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఘోరంగా పడిపోతున్నది. ఈ సంఖ్య ఇంకా పెరిగి, ప్రభుత్వ బడులు మూతపడే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిణామం మొత్తం పాఠశాలల్లో తెలుగును ‘ప్రోత్సహించడానికి’ పెద్ద ఆటంకమైంది. నిజానికి ఇప్పుడు తెలుగువాళ్లం ఇలా నెత్తిన పెట్టుకుంటున్న ఇంగ్లిష్, ఇంగ్లిష్వారు ఏం చేశారు? తమ భాష మీద మూడు వందల ఏళ్ల పాటు పెత్తనం చలాయించిన గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ భాషల పెత్తనాన్ని దుర్భరంగా భావించారు. ‘సీమ దేశాన చదవి వచ్చెదనటుంచు/ చేతిలో చేయి వైచి వంచించిపోయి మరలి రాదాయె నా సంపద్విభూతి..../అన్య భాషా మారుతాఘాతమున చేసి వన్నె తగ్గినది నా వాజ్మయంబు/ పరువు తూలిన నీ అనాదరణ కతన మేటి నీ భాష పొలిమేర దాటలేదు’ - మహాకవి జాషువ తెలుగు భాష తెలుగువారి అనాదరణ వల్లనే పొలిమేరలు దాట లేదని ఒకనాడు కొందరు బాధపడ్డారు. వన్నెచిన్నెలతో అనంతర దశలో తెలుగు భాష ఖండఖండాలలో ‘పాగా’ వేసిందని ఇంకొందరు అల్ప సంతోషంతో మురిసిపోయారు. కానీ నేడు తల్లి భాషకూ, దేశీయ చదువు లకూ ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎవరూ గమనించడం లేదు. వర్తక వాణిజ్యాల వ్యాప్తికోసం ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆంగ్ల మాధ్యమంతో మన ప్రజలని పరాయి భాషకు దాసానుదాసులుగా మార్చారు. ఇప్పుడు ప్రపంచీకరణ పేరుతో ప్రపంచ బ్యాంక్ ‘సంస్క రణల’మాటున పాత, కొత్త నయా వలస సామ్రాజ్య పెట్టుబడి ప్రయో జనాల రక్షణ కోసం ఇంగ్లిష్ ద్వారా గ్రామసీమలకు సైతం తమ వస్తువు లను పాకించడం సాధ్యమని భావిస్తున్నారు. ఇంగ్లిష్ను ప్రాథమిక విద్య స్థాయి నుంచి మాధ్యమిక దశ వరకు నిర్బంధంగా బోధించాలని శాసించడం దీని ఫలితమే. స్వతంత్ర భారతంలో ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా (కొఠారీ, రాధాకృష్ణన్ కమిషన్లు మినహా)పాలకులు విద్యా వ్యవస్థను అనుక్షణం మార్పులకూ, ప్రయోగాలకూ గురి చేస్తూ, అల్ల కల్లోలం చేస్తున్నారు. అవేవీ సామాజిక జీవితంతో ముడిపడినవి కావు కూడా. ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణల అమలులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆంగ్ల మాధ్యమం కేంద్ర బిందువుగా ఉన్న సంస్కరణలను శరవేగంగా ముందుకు నెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే భాషా మాధ్యమాన్ని కాకుండా అంటే మాతృభాషకు ప్రాధాన్యం కల్పించకుండా, ఆంగ్లానికే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే విభజన లేకుండా ఈ రెండు చోట్లా మాతృభాషకు బదులు, ఇంగ్లిష్నే ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చాయని ఈ నెల 15న ఒక వార్త వెలువడింది. ఇది పేరుకు ప్రైవేట్ ఒత్తిడే కానీ, బ్యాంక్ సంస్కరణల మేరకు ప్రభుత్వాలు రుద్దిన తాఖీదు. విభజన సమస్యలు ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు, అవి చాలవన్నట్టు ఒకటి నుంచి పదో తరగతి వరకు కూడా తెలుగు మాధ్యమానికి గండి కొడుతున్నారు. కొత్త మెకాలేలు వచ్చారు అరకొర ఆంగ్లంతో గుమాస్తా గిరీ విద్యావంతుల రూపకల్పనకు ఆద్యుడైన మెకాలే, ‘ఇంగ్లిష్ వాడి తిండికీ, వేషభాషలకూ అలవాటు పడిన భారతీ యులు మనకు శాశ్వతంగా బానిసలై ఉంటారు’ అని గట్టిగా విశ్వసిం చాడు. ఈ అంశంలో బ్రిటిష్ పాలకుల పాత్ర ముగిసినా, అమెరికన్ సామ్రాజ్యవాద పాలకులు అదే పాత్రను కొనసాగిస్తున్నారు. వందలాది మంది తెలుగు విద్యార్థులు సహా, ఇతర భారతీయ భాషలకు చెందిన విద్యార్థుల విషయంలో అమెరికా హెచ్-1బీ, ఎల్-ఐ వీసాల మంజూ రులో, ఫీజులను భారీగా పెంచడంలో అదే గుమాస్తా గిరీ విధానాన్ని అనుసరిస్తున్నది. భారత విద్యార్థులను అమెరికా ఆర్థికవ్యవస్థకు ఊడిగం చేసే వారిగా మలుచుకుంటున్నారు. ట్విన్టవర్స్ను ఉగ్రవాదులు కూల్చివేయడం ఏమిటి? అందుకు పరిహారంగా అమెరికా రూపొందించిన ఆరోగ్య నష్ట పరిహార చట్టం చాటున మన విద్యార్థుల హెచ్-1బీ, ఎల్-ఐ వీసాల ఫీజులను రెండేసి మూడేసి రెట్లు అమాంతం పెంచడం ఏమిటి? ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య మున్నెన్నడూ లేని విధంగా ఇప్పుడు 32 శాతం పెరగడం, అది కూడా ఒబామా-మోదీ పాలకులుగా ఉన్న సమయంలో ఈ పెరుగుదల నమోదు కావడం విశేషం. ప్రపంచ దేశాల నుంచి అమెరికా చేరుకుంటున్న విద్యార్థులలో భారతీయ విద్యార్థులు 13.6 శాతం (సుమారు 10 లక్షలు). వీరి కారణంగా అమెరికా ఆర్థికవ్యవస్థకు సమకూరుతున్న మొత్తం ఆదాయం 3.6 బిలియన్ డాలర్లు. అలాగే 1999-2014 మధ్య అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం మరో అంశం. అయినప్పటికీ బడుగు, వర్ధమాన దేశాల విద్యార్థులను వెట్టికి తాకట్టు పడే సరుకుగా అమెరికా భావిస్తున్నది. కాబట్టే తనిఖీల పేరుతో తెలుగు పిల్లలు అవమానాలను ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గమనంలోకి తీసుకో వలసిన సమయం ఇది. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడం మన పిల్లలు కంటున్న ఫలవంతమైన కల మాత్రం కాదు. అదో కాలిపోతున్న కల. నానాటికీ తీసికట్టు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ తెలుగు బోధనా భాషగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఘోరంగా పడిపోతున్నది. ఈ సంఖ్య క్రమంగా పెరిగి, ప్రభుత్వ బడులు మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిణామం మొత్తం తెలుగును పాఠశాలల్లో ‘ప్రోత్సహించ డానికి’ పెద్ద ఆటంకమైంది. నిజానికి ఇప్పుడు తెలుగువాళ్లం ఇలా నెత్తిన పెట్టుకుంటున్న ఇంగ్లిష్, ఇంగ్లిష్వారు ఏం చేశారు? తమ భాష మీద మూడు వందల ఏళ్ల పాటు పెత్తనం చలాయించిన గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ భాషల పెత్తనాన్ని దుర్భరంగా భావించారు. ఎట్టకేలకు 16, 17 శతా బ్దాలలో అధికార భాషగా ఇంగ్లిష్ను ప్రకటించుకున్నారు. నిజానికి తెలుగు పరిరక్షణకు అదే శిరోధార్యం కావాలి. హైదరాబాద్కు చెందిన తెలుగు విద్యార్థుల ఇంగ్లిష్ వ్యామోహం ఇటీవల ఎంతవరకు పోయిందంటే, ఇంగ్లిష్ నామవాచకాలూ, క్రియల ఉచ్చారణలో ప్రత్యేక శిక్షణ పొందే వరకూ వెళ్లింది. తెలుగు భాషను అవహేళన చేయడం, ఇంగ్లిష్ యాస సర్వసాధారణమైపోయింది. ఐటీ కంపెనీలతో పాటు, కాల్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులు తెలుగు వారు, లేదా ఉర్దూ తెలిసిన వారు ఆయా సంస్థల యజమానులు ఫోన్ చేస్తే సుబ్బయ్య అనో, ఇమామ్ అనో చెప్పరాదట. ఆ కంపెనీ వారు తగిలించిన ఫ్రాన్సిస్ అనో, రాబర్ట్ అనో చెప్పాలని శాసించడం కూడా జరిగింది. అవతలి వాళ్ల వ్యాపారం కోసం మన వాళ్లు సొంత పేర్లు కూడా వదులుకోవాలన్న మాట. నిజానికి ఇదంతా ఒక పిచ్చి, ఉన్మాదాల స్థాయికి చేరింది. మాతృభాషను కలలో కూడా ఉపయోగించనంత దూరంగా జరిగేటంతగా, ఇంగ్లిష్ను కలలో కూడా మరువనంతగా తయారుచేస్తున్నారు. అభిమానం, దురభిమానం ఈ మొత్తం నీలినీడలు తెలుగుకు విశిష్ట భాష ప్రతిపత్తి అంశం మీద కూడా పడుతున్నాయి. కేంద్రం ఆ హోదాను సాధించుకునే దాకా ఉద్యమం సాగింది. అయితే ఈ గుర్తింపును సవాలు చేస్తూ ఒక తమిళుడు మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశాడు. గత ఏడేళ్లుగా సాగుతున్న ఈ వివాదంలో కొద్దికాలం క్రితం చోటు చేసుకున్న మలుపు, విభజన నేపథ్యంలో ఒక తెలుగు వాడే ఆ తమిళుడితో చేతులు కలిపాడు. ఈ వివాదం ఇలా ఉండగానే తమిళనాడులో నివసిస్తున్న తెలుగు భాషకు చెందిన అల్పసంఖ్యాకులకు కనీస రక్షణ లేకుండా, పాఠశాలల్లో తమిళాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం చేసింది. ఈ అంశం మీద తెలుగు భాషా అల్పసంఖ్యాకుల వేదిక అధ్యక్షుడు సీఎంకే రెడ్డి అదే న్యాయస్థానంలో వ్యాజ్యం నడుపుతున్నారు. ఈ విషయంలో తన సూచనలను పెడ చెవిన పెడుతున్న తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి మందలించ వలసి వచ్చింది. ‘పరభాషను గౌరవించు- మాతృ భాషను సంరక్షించుకో’ అన్న నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆదర్శంగా తీసుకుందని గుర్తు చేసుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు మరొక ఉదంతం గుర్తుకు వస్తుంది. ఫ్రాన్స్ ఒకనాటి అధ్యక్షుడు జేక్విస్ షిరాక్ యూరోపియన్ శిఖరాగ్ర సదస్సులో (2006) పాల్గొన్నప్పటి ఘటన ఇది. ఒక ఫ్రెంచ్ వ్యాపారి మాతృభాషలో మాట్లాడకుండా ఇంగ్లిష్లో ఉపన్యసించినప్పుడు షిరాక్ తీవ్ర స్వరంతో, ‘ఒకే ఒక్క భాష - ఇంగ్లిష్ ద్వారా భవిష్యత్ ప్రపంచాన్ని నిర్మించలేరు. శాసించలేరు’ అని హెచ్చరించాడు. ఎస్ఎంఎస్ల తంటా ఇంటర్నెట్ ద్వారా మళ్లీ ఇంగ్లిష్ను వలస పెత్తందారీ రాజకీయాలకు ఆంగ్లో-అమెరికన్లు మాధ్యమంగా చేసుకున్నారు. అన్యభాషా సంపర్కం లేకుండా ఏ భాషకూ ఎదుగుదల ఉండదు. కానీ ప్రపంచంలోని 7,000 భాషలలో (ఆదివాసీ, అణగారిన జానపదుల ప్రాదేశిక భాషలు సహా) సుమారు 3,000 భాషలు ఇప్పటికే అంతరించడం వలస భాషల దాష్టీకం ఫలితమే. ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వాడకంలోకి వచ్చిన తరువాతి పరిణామం పట్ల క్వీన్స్ ఇంగ్లిష్ సొసైటీ, లండన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఆచార్య బెర్నార్డ్ లాంబ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘బ్రిటిష్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు కూడా ఇంటర్నెట్ ప్రవేశంతో కుప్పకూలి పోతున్నాయి. ఫలితంగా మా పిల్లలు తప్పుల్లేకుండా ఇంగ్లిష్ రాయలేక పోతున్నారు. ఉచ్చారణ తప్పులతడక. వర్ణక్రమం ఘోరం. పదాలు రాయడం, విరామ చిహ్నాలు వినియోగం దారుణంగా ఉంది. మా అండర్ గ్రాడ్యుయేట్ల పరిస్థితి మరీ అధ్వానం అని నా సర్వేక్షణలో రుజువైంది. కానీ ఇంగ్లిష్ మాధ్యమంతో సంబంధం లేని విదేశీ విద్యార్థులు మన విద్యార్థుల కన్నా (బ్రిటిష్ విద్యార్థుల కన్నా) చాలా తక్కువ తప్పులు చేస్తున్నారు’ అని అన్నారాయన. మాతృభాషను విస్మరిస్తే అదెంత వికృతంగా ఉంటుందో తెలుగువాడి మరో డొల్లతనం ద్వారా తెలుస్తుంది. బ్యాంకు ఖాతా ద్వారా ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ తెచ్చుకోవాలి. అయితే ఆన్లైన్ ద్వారా ఈ వ్యవహారం చేసుకోలేకుంటే, అలాంటి వారి పరిస్థితి దుర్భరం కాదా! కాబట్టి తల్లి భాషను కాపాడుకుంటేనే కంటికి వెలుగు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విద్యుత్ దీపాలతో విన్యాసాలు
-
ఫ్యానుకు లైటు!
భలే బుర్ర అవసరమే ఆవిష్కరణలకు తల్లి. అదే మన మెదడుకు పదును పెడుతుంది. అదే మనలోని శాస్త్రవేత్తను మేల్కొలుపుతుంది. వనరులతో పనిలేదు, పెద్దగా డబ్బూ దస్కం కూడా అక్కర్లేదు. పెద్దపెద్ద డిగ్రీలూ వగైరా అవసరం లేదు. కాస్త తెలివితేటలుంటే చాలు, జటిల సమస్యలకు కూడా తేలికపాటి పరిష్కారాలను వెదుక్కోగలం. శాస్త్రవేత్తల ఘనతను కాదు, సామాన్యుల తెలివిని పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఒక సామాన్యుడి తెలివికి ఇదొక ఉదాహరణ. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆసామి పేరు మహేశ్వరన్. బెంగళూరు వీధుల్లో కాల్చిన మొక్కజొన్నలు అమ్ముతూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. పగలంతా ఈ వ్యాపారానికి పెద్ద గిరాకీ ఉండదు. సాయంత్రమైతేనే కస్టమర్ల సందడి మొదలవుతుంది. బొగ్గుల మంటపై మొక్కజొన్న కండెలను కాలుస్తూ, వేడివేడిగా కస్టమర్లకు అందించాలి. వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని, చిల్లర లెక్క తప్పకుండా తిరిగివ్వాలి. చీకటి ముసురుకునే సమయంలో, సరైన వీధిదీపాలు లేని ప్రాంతాల్లో ఇదంతా మా చెడ్డ ఇబ్బంది. బండి మీద ఒక లైట్ అయినా ఏర్పాటు చేసుకోకపోతే పని జరగదు. అది మాత్రమేనా? బొగ్గులు రాజేసేందుకు జబ్బలు పీకేలా విసనకర్రతో విసురుతూ ఉండాలి, మరోపక్క కస్టమర్లనూ సంభాళిస్తూ ఉండాలి. చాలాకాలం ఈ సమస్యతో వేసారిపోయిన మహేశ్వరన్కు ఉన్నట్లుండి బుర్రలో బల్బు వెలిగింది. అంతే! ఉన్న వనరులతోనే తన అవసరాలకు తగిన టూ ఇన్ వన్ పరికరాన్ని రూపొందించుకున్నాడు. ఒక చిన్న బార్లైట్ ఫ్రేమ్కి, పాతబడ్డ టేబుల్ ఫ్యాన్ని కూడా ఫిక్స్ చేసి బండి మీద అమర్చుకున్నాడు. ఆ ఫ్యాన్ గాలితో నిప్పులు రాజేసి పొత్తులు కాలుస్తాడు. లైటు వెలుగులో డబ్బులు లెక్కపెట్టుకుంటాడు. వెలుగు, గాలి ఏకకాలంలో ఇచ్చే ఈ పరికరాన్ని బెంగళూరు జనాలు అబ్బురంగా చూస్తున్నారు. -
వెలుగునిచ్చే వేస్ట్ బాటిల్..!
పనికిరాని వస్తువులతో కళాఖండాలు తయారు చేయడం చూస్తాం. వేస్ట్ మెటీరియల్ ను ఉపయోగించి విద్యుత్ ను వెలికి తీయడం తెలుసు. రీ సైకిలింగ్ తో కొత్త వస్తువుల తయారీ జరుగుతుంది. కానీ పనికి రాని ప్లాస్టిక్ బాటిల్స్ ను.. వెలుగులు నింపే బల్బులుగా వాడొచ్చంటున్నారు బెంగుళూరుకు చెందిన పంకజ్, తృప్తిలు. చీకట్లో మగ్గుతున్న నిరుపేదల కళ్ళల్లో వెలుగులు చూడాలన్నదే వారి ఆశయం. అందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. వారి ఆలోచకు ఫలితాలే.. ప్రస్తుతం అక్కడ మురికి వాడలు, గిరిజన గ్రామాల్లో వెలుగులుగా మారుతున్నాయి. మా అమ్మాయికి ప్రమాద భయం లేదు. అబ్బాయి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండగల్గుతున్నాడు. మేమంతా ఎంతో ఆనందంగా హాయిగా ఇంట్లో గడుపుతున్నాం అంటుంది తన ఇంట్లో వేస్ట్ బాటిల్ వెలుగును పొందిన ఓ మహిళ. ఓ చిన్న ప్లాస్టిక్ పెట్ బాటిల్ వారి జీవితాల్లో వెలుగులు నింపిందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ.. మనం నీళ్ళు తాగిన తర్వాత ఖాళీ బాటిల్ ను అవతల పారేస్తుంటాం. కానీ ఆ పడేసే ప్లాస్టిక్ సీసాలే సోలార్ వెలుగులతో ఎన్నో ఇళ్ళల్లో కాంతిని నింపుతున్నాయి. విద్యుత్ కాంతులకు దూరంగా చీకట్లో నివసిస్తున్న మురికివాడలు, గిరిజన గ్రామాల్లోనూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్ళు సోలార్ విద్యుత్ దీపాలుగా మారాయి. నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు 2011లో ఇలాక్ డియాజ్.. లైటర్ ఆఫ్ లైట్ పేరున ప్రారంభించిన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ఆయన్నేపంకజ్, తృప్తిలు స్ఫూర్తిగా తీసుకున్నారు. బెంగళూరులో తమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంకజ్, తృప్తిలు కో ఫౌండర్లుగా బెంగుళూరులో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇళ్ళల్లో రూఫ్ కి చిన్నపాటి రంధ్రం చేసి, నీటితో నింపిన ప్లాస్టిక్ పెట్ బాటిల్ను అక్కడ బిగిస్తారు. పగలంతా సూర్యకాంతి ఈ బాటిల్ లోని నీటిపై పడి పరావర్తనం చెంది ఇల్లంతా వెలుగు ప్రసరింపచేస్తుంటుంది. ఈ ఐడియా చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రస్తుతం నాతోపాటు నాటీ టీమ్ ఈ కార్యక్రమంపై గ్రామాల్లో, పాఠశాలల్లో, పిల్లలు వారికి వారే ఈ లైట్ ను ఏర్పాటు చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నామంటున్నారు తృప్తి. అతి తక్కువ ధరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానికంగా దొరికే వేస్ట్ మెటీరియల్ ను వినియోగిస్తున్నారు. లైటర్ ఆఫ్ లైట్ మురికి వాడలు, ఇరుకు సందులు, చీకటిగా ఉండే ప్రాంతాల్లో ప్రవేశపెట్టి అక్కడి వారి కళ్ళల్లో వెలుగులు చూస్తున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అక్కడి వారు ఓ సంఘంగా ఏర్పడి తక్కువ ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకో గలితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ కాలుష్య రహిత లైటింగ్ సిస్టమ్ ను రాత్రీ, పగలు ఉండేలా గిరిజన గ్రామాల్లో, నగరాల్లో ఉండే మురికి వాడల్లో, పాఠశాలల్లోప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం తృప్తి, పంకజ్ ల టీమ్ పెట్ బాటిల్స్ తో సోలార్ బల్బ్ ను తయారు చేసే పనిలో ఉన్నారు. మొత్తం ఇరవై మంది ఉన్న టీమ్...35 ఇళ్ళలో పగలంతా ఉండేలా డేలైట్ బాటిల్స్ ను, మరో ఐదు నైట్ లైట్ బాటిల్స్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక్కోసారి మురికివాడల్లోని జనం తమ ఇళ్ళకు రంధ్రం పెట్టేందుకు ఒప్పుకోని సందర్భాలు ఉంటాయని, అటువంటప్పుడు సంయమనంతో వారిలో అవగాహన పెంచి, అర్థమయ్యేలా విషయాన్ని వివరించాల్సి వస్తుంటుందని తృప్తి టీం చెప్తున్నారు. 2015 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ గా మార్చేందుకు 'లైటర్ ఆఫ్ లైట్' టీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను కూడ నిర్వహిస్తోంది. స్కూళ్ళు, కాలేజీల్లో విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై వివరాలు అందిస్తోంది. 'లైటర్ ఆఫ్ లైట్' ను సేవాభావం ఉన్న ప్రతివారూ అమలు చేసి, విద్యుత్ కు దూరంగా ఉన్న గ్రామాల్లోనూ, చీకటి ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లోనూ వెలుగులు నింపొచ్చని ఈ టీమ్ చెప్తోంది. ముఖ్యంగా వేస్ట్ ను బెస్ట్ గా మార్చడానికి ఎంతో సృజన అవసరం. అంతకు మించి ఓ కొత్త రూపాన్ని సృష్టించాలన్న తపన కూడ ఉన్నప్పుడే ప్రతి విషయంలోనూ విజేతలుగా నిలుస్తారు. ఆకోవలో ప్రస్తుతం పంకజ్, తృప్తిలు కొనసాగుతున్నారు. -
పల్లెకు వెలుగు
- సంఘటితశక్తి చాటాలి.. అభివృద్ధికి బాటలు పరచాలి - ‘గ్రామజ్యోతి’పై అవగాహన సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం - గ్రామాల ప్రగతితోనే రాష్ట్రాభివృద్ధి.. ఇప్పటిదాకా - స్థానిక సంస్థల ద్వారా ఆశించిన అభివృద్ధి జరగలేదు - ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడమే ఇందుకు కారణం - గ్రామజ్యోతికి నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తాం - గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్లే మనకు ఆదర్శం - అక్షరాస్యత సాధనకు యువశక్తిని వినియోగించుకోవాలి - ప్రతి గ్రామంలో ఒకరోజు పవర్డే నిర్వహించాలి - ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండేలా చూడాలి - పల్లెల నుంచి గుడుంబాను తరిమికొట్టాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వెలుగులు నింపడమే గ్రామజ్యోతి లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. పల్లెల్లో మార్పు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మకమైన మార్పు ఆశించినంత స్థాయిలో రాలేదన్నారు. సంఘటితశక్తి గురించి ప్రజలకు బలంగా చెప్పలేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ద్వారా ఆశించిన మేరకు అభివృద్ధి జరగని పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు. గ్రామజ్యోతిలో మార్పు సాధకుల (చేంజ్ ఏజెంట్స్) పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. ఈనెల 17 నుంచి నిర్వహించ తలపెట్టిన ‘గ్రామజ్యోతి’పై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, మండలాల చేంజ్ ఏజెంట్లకు మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘స్థానిక సంస్థల ద్వారా వచ్చే నిధులను ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేయకపోవడం, గ్రామాభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములుగా చేయకపోవడం వల్లనే పల్లెల్లో అభివృద్ధి జరగలేదు. సరైన ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యంతో బాగుపడిన గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్ గ్రామాలు మన తెలంగాణలోనే ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ, సహకార వ్యవస్థలు ఈ గ్రామాల్లో పటిష్టంగా ఉన్నాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు ముందుకు పోవాలి. దేశంలోని చాలా గ్రామాలు ఈ మూడు గ్రామాలను చూసి ఎంతో నేర్చుకుంటున్నాయి. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు ‘తెలంగాణ రాష్ట్ర సాధనే’ ఉదాహరణ’’ అని సీఎం పేర్కొన్నారు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తాం గ్రామజ్యోతి ద్వారా రానున్న నాలుగేళ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చుపెడతామని సీఎం చెప్పారు. దీన్ని కేవలం సర్పంచుల కార్యక్రమంగా చూడొద్దని, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలంతా పాల్గొని గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకొనేలా ప్రణాళిక రూపొందించుకొని, ఆ గ్రామాన్ని మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు. ‘‘గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. గ్రామాల్లో చెత్తను సేకరించడానికి 25 వేల రిక్షాలను ప్రభుత్వం కొని ఇస్తుంది. ప్రతి 750 మంది జనాభాకు ఒక చెత్త రిక్షాను ఇస్తాం. అలాగే శ్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి. ఒకరోజును ‘పవర్డే’గా నిర్వహించి వంగిన విద్యుత్ స్తంభాలను, వేలాడే తీగలను సరిచేయాలి. ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండేలా చూడాలి. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి వారికి వైద్యం చేయించాలి’’ అని సీఎం అధికారులను కోరారు. కూనం రాజమౌళికి ఘన సన్మానం గంగదేవిపల్లి గ్రామాన్ని దే శంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కూనం రాజమౌళిని ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం చేసిన కృషిని రాజమౌళి వివరించారు. గ్రామజ్యోతిపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె.తారక రామారావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, హరీశ్రావు, తుమ్మల నాగేశ్వర్రావు, జోగురామన్న, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న ముల్కనూరూ బాగోలేదు ‘‘మొన్న నేను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరుకు వెళ్లా. అక్కడ కూడా పరిస్థితి ఏమీ బాగోలేదు. దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. మీరంతా గ్రామాలకు వెళ్లినపుడు కూడా ఇదే నిరుత్సాహ పరిస్థితి కనిపిస్తుంది. కానీ నీరు కారిపోవద్దు. గ్రామానికి వెళ్లగానే పరిస్థితిపై అంచనాకు రావాలి. అక్కడి ప్రజలతో కలిసి ప్రణాళికలు రూపొందించాలి. సంఘటిత శక్తిలో ఎంతో బలముందని ప్రజలకు చెప్పాలి. గ్రామానికి ఏమౌవసరం, మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి, తదితర అంశాలపై అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి’’ అని సీఎం వివరించారు. గ్రామజ్యోతికి మార్గదర్శకాలివీ.. గ్రామాల్లో వంద శాతం అక్ష్యరాస్యత సాధనకు చదువుకున్న యువతను వినియోగించుకోవాలి ప్రజలను చైతన్యపరచడం, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం మార్పు సాధకుల కర్తవ్యం మురికి కాలువల నుంచి వచ్చే నీటి కోసం ఊరి అవతల సోక్ ట్యాంకులు నిర్మించాలి గ్రామాల్లో గుడుంబా మహమ్మారి ఓ విష వలయంగా తయారైంది. గ్రామాల నుంచి దీన్ని తరిమికొట్టేలా ప్రజల్లో చైతన్యం తేవాలి గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల కోసం ఎస్టీ సబ్ప్లాన్ నిధులు, దళిత వాడల కోసం ఎస్సీ సబ్ప్లాన్ నిధులు వాడుకోవచ్చు గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల, పంచాయతీ సిబ్బంది వేతనాలను సవరించుకోవచ్చు. గతంలో ఉన్న 30శాతం ఆదాయాన్ని ఖర్చు చేసే వెసులుబాటు పరిమితిని తాజాగా 50 వేలకు పెంచాం. అధికారులు గ్రామసభల షెడ్యూల్ రూపొందించాలి గ్రామసభలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు తప్పనిసరిగా పాల్గొనాలి. నాలుగేళ్లకుగాను అభివృద్ధి ప్రణాళికను గ్రామసభలోనే రూపొందించాలి. గ్రామాల శక్తిని పరిపుష్టం చేయాలి -
నీరు + ఉప్పు = వెలుగు!
గ్లాసుడు నీళ్లు, రెండు చెమ్చాల ఉప్పు... ఫొటోలో కనిపిస్తున్న లాంతరు ఏకబిగిన ఎనిమిది గంటల పాటు వెలుగులు ఇచ్చేందుకు కావాల్సినవి ఇవి మాత్రమే! కరెంటు లేకపోయినా, బ్యాటరీల చార్జింగ్ అయిపోయినా ఫర్వాలేదు. ఈ ‘సాల్ట్’ బల్బ్ ఎక్కడైనా సరే వెలుగులు పంచుతుంది. ఫిలిప్పీన్స్ లోని సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్ క్లుప్తంగా ‘సాల్ట్’ అభివృద్ధి చేసిన ఈ లాంతరు వెలుగులతోపాటు అవసరమైనప్పుడు సెల్ఫోన్ బ్యాటరీలను చార్జ్ చేస్తుంది కూడా! దాదాపు ఏడువేల ద్వీపాలతో కూడిన ఫిలిప్పీన్స్లో 1.6 కోట్ల మందికి విద్యుత్ సౌకర్యం లేదట. ఈ సమస్యను ‘సాల్ట్’ తెలివిగా పరిష్కరిస్తుంది. ఎల్ఈడీ బల్బులతో కూడిన ఈ లాంతరు నిజానికి ఒక రకమైన బ్యాటరీ. ఉప్పునీటిని ఎలక్ట్రోలైట్గా వాడుకుంటూ కొంచెం తక్కువ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఎల్ఈడీ బల్బులు వెలుగుతాయి. భలే ఐడియా కదూ! -
సన్ ర్యాంపేజ్... స్కిన్ డ్యామేజ్
సూర్యుడి మెత్తటి కాంతిలో తళతళలాడే మన చర్మమే, ఆయన మండిపడుతూ తన కిరణాలతో బలంగా బాధిస్తుంటే విలవిల లాడుతుంది. సూర్యకాంతి చండప్రచండమైనప్పుడు మన చర్మాన్ని భానుడి బాదుడు నుంచి రక్షించుకొనేదెలాగో తెలిపేదే ఈ కథనం. తీక్షణమైన సూర్యుడి కిరణాలతో చర్మానికి నష్టం చేకూరడం తథ్యం. నిజానికి మన చర్మంపై స్వేదగ్రంథులతో పాటు నూనె గ్రంథులూ ఉంటాయి. మనం ఒంటిపైన బట్టలు కప్పిలేని చోట,్ల భానుడి కిరణాల తాకిడి నేరుగా పడుతూ ఉంటే ఆ నూనె ఎండిపోయి చర్మం పూర్తిగా పొడిబారిపోతుంది. దాంతో పాటు సూర్యుడినుంచి వచ్చే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాకిడితో చర్మం కమిలినట్లుగా నల్లబారిపోవడం కూడా మనందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇది చాలాకాలం పాటు జరుగుతూ పోతే మన చర్మం నిర్మాణతీరు (స్ట్రక్చర్)లోనే మార్పు వస్తుంది. భగభగలాడే కిరణాలతో చర్మానికి హాని చండప్రచండమైన వేడిమితో తీక్షణమైన కిరణాల వల్ల చర్మానికి అనేక రకాల నష్టాలు కలుగుతుంటాయి. వాటిలో కొన్ని... చర్మం పొడిబారడం: ఎండ వేడిమి వల్ల చర్మంపై ఉండే తేమంతా ఆవిరైపోతుంది. పైగా చర్మంపై ఉండే నూనె గ్రంథుల నుంచి వచ్చే స్రావాలు ఎండిపోయి వయసు కంటే ముందే చర్మంలో ముడుతలు వస్తాయి. దాంతో కొందరు కౌమారంలోనే వయసు పైబడినట్లుగా కనిపిస్తారు. సన్ బర్న్స్ : ఎండలోకి చాలాసేపు బయటకు వెళ్లి రాగానే చర్మం నల్లబారినట్లుగా కనిపించడం మనందరికీ అనుభవమే. తీక్షణమైన సూర్యకాంతి వల్ల తక్షణం కనిపించే ప్రభావమిది. అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై పడి చూపే ప్రభావం కారణంగా ఇది జరుగుతుంది. ఎండకు ఎంత ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయి ఉంటే చర్మం అంత నల్లబారుతుంది. అదే చాలాసేపు ఎండలో ఉంటే ఒక్కోసారి ఎర్రబారి ఆ తర్వాత అక్కడ చిన్న చిన్న బొబ్బల నుంచి పెద్ద పగుళ్ల వరకూ రావచ్చు. పీఎమ్ఎల్ఈ (పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్) : ఇది చాలాకాలం పాటు చర్మాన్ని ఎండవేడికి ఎక్స్పోజ్ చేస్తూ పోవడం వల్ల కలిగే దుష్పరిణామం. ఎండవేడిమిలో చాలాసేపు ఉన్న తర్వాత దాని దుష్ర్పభావం వెంటనే కనిపించకుండా... ఆ తర్వాత 48 గంటల నుంచి 72 గంటల తర్వాత కనిపిస్తుంది. ఇందులో చర్మంపై చిన్న చిన్న పొక్కుల్లా వస్తాయి. ఇవి వచ్చాక కూడా ఎండకు వెళ్తే వాటిల్లో దురద వస్తుంది. ఏక్టినిక్ కెరటోసిస్: ఇది చర్మంపై వచ్చే చిన్న పొక్కు. అచ్చం మొటిమలా అనిపిస్తుంది. ఒక్కోసారి ఇది మచ్చలాగా కూడా కనిపించవచ్చు. ఈ మచ్చ రంగు పింక్ / పసుపు / ఎరుపు / గోధుమ (బ్రౌన్) రంగుల్లో కూడా ఉండవచ్చు. దీంట్లో దురద దాదాపుగా ఉండదు. ఈ మచ్చలు కనిపించాక కూడా చర్మాన్ని రక్షించుకోకుండా అదేపనిగా మళ్లీ ఎండలకు వెళ్తుంటే అది చర్మక్యాన్సర్గా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. ఈ మచ్చలు సాధారణంగా నుదుటిపైన నల్లగా కనిపిస్తాయి. వీటిని ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అంటారు. ఎండకు వెళ్లివచ్చాక చర్మంపైన స్పర్శకు చెమటకాయల్లా గుచ్చుకున్నట్లుగా తగులుతాయి లేదా నల్లగా కనిపిస్తాయి. ఈ మచ్చను మెలాస్మా అంటారు. దీన్ని వాడుకభాషలో మంగు అంటారు. చర్మంపై ఉండే ప్రోటీన్లు తమ స్వరూపం కోల్పోయి ముడుతలు పడటం వల్ల వచ్చే వ్యాధిని ‘ఎమైలాయిడోసిస్’ అంటారు. అంచులు స్పష్టంగా కనిపించేలా ఏర్పడి, రంగుమారి కనిపించే మచ్చలను లెంటిజీన్స్ అంటారు. ఇది ఒక్కటే ఉంటే దీన్ని ‘లెంటిగో’ అంటారు. చికిత్సలు: భానుడి తీక్షణమైన కిరణాలతో వచ్చే అనేక సమస్యలకు చికిత్సలివే... పూతమందులు: చర్మపు సమస్యలకు అవసరాలను బట్టి కార్టికోస్టెరాయిడ్ క్రీములు వాడాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా సన్స్క్రీన్స్ వాడటం వల్ల ఎండలో తిరగడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లో చాలావాటిని నివారించవచ్చు. సన్స్క్రీన్స్ గురించి మరింత వివరంగా : తీక్షణమైన ఎండలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) 40 - 50 ఉన్నవి మేలు. పొడి చర్మం ఉన్నవారికి ఆయిల్ బేస్డ్ సన్స్క్రీన్స్ వాడటం అవసరం. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి వాటర్ బేస్డ్ లేదా జెల్ బేస్డ్ సన్స్క్రీలు మంచివి. మాయిశ్చరైజింగ్ క్రీములు: పొడి చర్మాన్ని రక్షించేందుకు వాడాల్సిన క్రీములివి. ట్యానింగ్ అంటే... చర్మం నల్లగా కావడాన్ని ట్యానింగ్ అంటారు. దీనికి కెమికల్ పీలింగ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. కెమికల్ పీలింగ్: గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, ఫెరులిక్ యాసిడ్స్ వంటివి ట్యానింగ్ కోసం ఉపయోగపడతాయి. చర్మరక్షణకు ఆహారం : సూర్యుడి తీక్షణ కిరణాలతో వయసుపైబడటానికి ముందే వృద్ధాప్యం వచ్చినట్లుగా చర్మం కనిపించడాన్ని నివారించడానికి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం మేలు విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మ జాతి పండ్లు అయిన నారింజ, కమలాలతో పాటు జామ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటివి తినాలి. ఇక కాలీఫ్లవర్ జాతికి చెందిన బ్రాకోలీ వంటివి కూడా మేనికి మేలు చేసేవే రోజూ తగినన్ని నీళ్లు తాగడం, తాజాపండ్ల రసాలు, మజ్జిగ కూడా చర్మాన్ని జీవం ఉట్టిపడేలా చేస్తాయి. ఇవన్నీ చర్మాన్ని బిగుతుగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి. దీంతో చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. -
చంద్రుడికో వరదగూడు!
చందమామ చుట్టూ రంగురంగుల కాంతివలయం ఏర్పడిన ఈ అద్భుత దృశ్యం సోమవారం బ్రిటన్లో కనువిందు చేసింది. అయితే ఇదంతా భూమి వాతావరణంలోని మంచు స్ఫటికాల మాయ! సుమారు 20 వేల అడుగుల ఎత్తులోని పలుచని మేఘాల్లోని మంచు స్ఫటికాలు చంద్రుడి కాంతిని వక్రీకరించి చూపడంతో ఇలా కనిపించింది. అన్నట్టూ... చంద్రుడి చుట్టూ ఇలా కాంతివలయం కనిపించడం అనేది.. వరదలొచ్చేంత భారీ వర్షాలకు సూచన అని భావిస్తారు. కానీ దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు. -
మేలుకొలుపు
ముక్కూముఖం తెలియకపోయినా ముంగిటకొచ్చేస్తారు. మనతో మనసారా ముచ్చట్లు పెట్టేస్తారు.వీనుల విందుగా పాడేస్తారు. వెలుగులు నింపాలని మన తరఫున దేవుడ్ని ప్రార్థిస్తారు. ముందుగానే పండుగ కళ తెచ్చేస్తారు. మధురానుభూతిని మిగిల్చి వెళ్లిపోతారు. అర్ధరాత్రిళ్లు వచ్చే అతిథులు వీరు. అను‘రాగాల’ బంధువులు వీరు. ..:: ఎస్.సత్యబాబు దేవుడు తనను తల్లిగా స్వీకరించనున్నాడని తెలియగానే మేరీ మాతకు పట్టలేని ఆనందం కలుగుతుంది. దాంతో ఆమె ఆ సంతోషాన్ని తన సోదరితో పంచుకోవడానికి మార్గంగా పాటను ఎంచుకుంది. అయితే అంతకు ముందే ఆమె సోదరి పాటతో ఆమెకు స్వాగతం పలికింది. ఏసుప్రభువు జన్మదిన సంబరాలకు, ఎల్లలెరుగని సంగీతానికి ఉన్న అనుబంధం బైబిల్ కథల్లో అడుగడుగునా ప్రస్ఫుటిస్తుంది. క్రిస్మస్ వచ్చిందంటే ఇళ్లన్నీ ఇంపైన సంగీత నిలయాలవుతాయి. ప్రార్థనా మందిరాలన్నీ పాటల వేదికలవుతాయి. వీటిలో అత్యంత ఆసక్తి కలిగించేవి అర ్ధరాత్రుల్లో సందడి చేసే కేరల్స్. పుట్టుక వెనుక... తొలుత క్రీస్తు రాక గురించిన సమాచారాన్ని ఏంజెల్స్ ద్వారా తెలుసుకున్న మూగజీవాలు ఆనందంతో వీధుల్లో తిరుగుతూ అందరికీ ఈ విషయాన్ని పాటల రూపంలో తెలియజేశాయట. ఈ కథను ఆధారం చేసుకుని ఆవిర్భవించినవే కేరల్స్ సంబరాలు. క్రిస్మస్ పండుగకు కొన్ని రోజుల ముందుగా (సుమారుగా 5 నుంచి వారం రోజులు) ప్రారంభమై డిసెంబర్ 23 రాత్రితో ఈ కేరల్స్ సందడి ముగుస్తుంది. చీకటిలో వెలుగుపాటలు సాధారణంగా డిసెంబర్ 15 తర్వాత ప్రారంభమవుతుంది కేరల్స్ సందడి. రాత్రి 9 గంటల ప్రాంతంలో కేరల్స్ గ్రూప్స్ వీధుల్లో సంచరిస్తాయి. ఇళ్లలో మేలుకొలుపు పాటలు అందుకుంటాయి. తెల్లవారుఝామున 5 గంటల వరకూ వీరి సందడి కొనసాగుతుంది. అందుబాటులో ఉండే ఇళ్లను ఎంచుకుని వారికి ముందస్తు సమాచారం ఇచ్చి ఆయా ఇళ్లకు వెళ్తారు. క్రిస్మస్ శుభవార్త చెప్పడం, పాటలు పాడడం, ఆనందాన్ని పంచడం, ఆయా కుటుంబీకుల క్షేమం గురించి ప్రార్థించడం, బైబిల్ ఇచ్చి వెళ్లడం.. ఈ బృందం పనులు. ‘చర్చి మెంబర్స్ ఇళ్లకు మాత్రమే కాక నాన్ చర్చి మెంబర్స్ ఇళ్లకూ వెళ్తుంటాం. ఒకచోట కార్యక్రమం జరుగుతుంటే పొరుగింటివాళ్లు వచ్చి అడుగుతారు. అప్పుడు అక్కడికీ వెళ్తాం’ అని సిటీలోని కేరల్గ్రూప్ సభ్యురాలైన అమూల్య షెరాన్ చెప్పారు. ఒక్కో ఇంట్లో అత్యధికంగా 15 నిమిషాలకు మించి గడపరు. రోజులో 10 నుంచి 15 ఇళ్ల వరకూ చుట్టేస్తారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు.. ఇలా పలు భాషల్లో పాటలు పాడతారు. అందరూ బంధువులే... అపరిచితుల్ని అను‘రాగ’బందీలుగా మారుస్తూ ఈ కేరల్స్ సంప్రదాయం నగరంలో అద్భుతంగా అల్లుకుపోతోంది. సాధారణంగా పాస్టర్ల అనుమతితో చర్చిలకు సంబంధించిన బృందాలు కేరల్స్ గ్రూప్స్గా ఏర్పాటవుతాయి. ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా కొందరు స్వచ్ఛందంగా బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పరిచయస్తులు, బంధువులు, మిత్రుల ఇళ్లకు ఒక్కోసారి అపరిచితుల ఇళ్లకు సైతం వెళుతున్నారు. ఈ బృందాల్లో విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్.. ఇలా భిన్న రంగాలకు చెందిన వారు సభ్యులుగా మారుతున్నారు. సింగర్స్, గిటారిస్ట్లు, కీబోర్డ్ ప్లేయర్స్, కాంగో ప్లేయర్స్.. ఇలా విభిన్న రకాల వాద్యాలు పలికించగల నేర్పు ఉన్నవారు తమ టాలెంట్ చూపించడానికి ఈ సందర్భం అద్భుతమైన అవకాశంగా మారుతోంది. కుల, మతాలకు అతీతంగా సంగీతాభిమానులను, వినూత్న వేడుకలను ఆస్వాదించే వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో కేరల్స్ గ్రూప్లలో సభ్యులవుతున్నారు. కొన్నిసార్లు కేరల్ గ్రూప్స్ మెంబర్స్ సంఖ్య ఎక్కువైపోతుండడంతో మినీ బస్సులు సైతం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇతరుల బాగు కోసం మా న్యూలైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చి తరపున కేర్సెల్ గ్రూప్స్ అని వ్యవహరిస్తాం. పారడైజ్ కేర్సెల్, అల్వాల్ కేర్సెల్.. అలా ఇవి లొకేషన్ వైజ్ డివైడ్ అవుతాయి. మా గ్రూప్లో 20 మంది ఉన్నాం. నేను 2012 నుంచి కేరల్ గ్రూప్తో వెళుతున్నా. చలిలో వెళ్లడం. కొత్త వ్యక్తుల్ని కలవడం, అపరిచితులైనా వారి బాగు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం.. ఇవన్నీ గొప్ప ఫీలింగ్ని అందిస్తాయి. కొంత మంది టీ, కాఫీ, బిస్కెట్స్ మాతో షేర్ చేసుకుంటారు. మాకు ఒక లీడ్ సింగర్, గిటారిస్ట్ ఐసెక్, ఫిమేల్ ఓకలిస్ట్ మీతీ ఉన్నారు. ప్రీతమ్, నేను కో ఆర్డినేట్ చేస్తాం. - అమూల్య షెరాన్ -
సేవా దీపం
వెలుగు , వెలిగించు ‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న పన్నెండవ కథనమిది... తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా.. పది మందికి అన్నం పెట్టేందుకు చేతులు రాని వారెందరో.. చేసిన దానానికి పదింతలు ప్రచారం చేసుకునే వారూ కోకొల్లలు. తనకున్న దాంట్లో పది మందికీ సాయపడేవారు కొందరే... వారు ప్రతిఫలం ఆశించరు. ఆ కోవలోకే వస్తారు ‘స్నేహదీపం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ఎమ్.నర్సయ్య. వెలుగు.. వెలిగించు ట్యాగ్ లైన్తో సేవబాట పట్టిన నర్సయ్య సాయం చేయడం అంటే వేలో.. లక్షలో దానం చేయడం కాదంటారు.‘అనాథ పిల్లలకు హెయిర్ కట్ చేయడం, యాచకులకు వస్త్రాలివ్వడం, నీకున్న పరిచయాలతో పది మందికీ ఆరోగ్య పరీక్షలు చేయించడం ఇవన్నీ గొప్ప సేవలే’ అంటారు. ‘స్నేహదీపం’ ద్వారా ఇవన్నీ చేస్తున్నారాయన. నర్సయ్య.. గీజర్లు, ఇన్వర్టర్లు అమ్ముకునే వ్యాపారి. తాను సంపాదించిన దాంట్లో అవసరాలకు పోగా.. పదో పరకో ఇతరులకు వెచ్చిస్తున్నాడు. ఆ సాయం పది మందికీ అందడానికి రెండేళ్ల క్రితం ‘స్నేహదీపం’ స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. ‘మొదట్లో ఒంటరి సేవకు సంస్థ ఎందుకు అనుకున్నాను. కానీ అలా చేస్తేనే పదిమందిలో స్పూర్తి నింపగలనని, నాలాంటి నలుగురిని కలుపుకుని పోవచ్చని అనుకుని 2012లో స్నేహదీపం చారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పాను. చిన్నప్పటి నుంచి పది మందికీ హెల్ప్ చేయాలని అనుకునేవాణ్ని. చదువు పూర్తయ్యాక వ్యాపారం చేసుకుంటూనే.. నల్లగొండ జిల్లా నూతన్కల్ మండలంలోని మా ఊర్లో ఉచితంగా చదువు చెప్పే పాఠశాలను పెట్టాను. ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మూసేశాను. హైదరాబాద్కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాక మళ్లీ తోచిన సాయం గురించి ఆలోచించాను. మొదట అనాథ పిల్లలపై దృష్టి పెట్టాను’ అని చెప్పారు నర్సయ్య. హెయిర్కట్ సాయం.. నెలలో మొదటి శని, ఆదివారాల్లో.. నర్సయ్య ఇద్దరు క్షురకులను తీసుకుని అనాథ పిల్లల ఆశ్రమానికి బయలుదేరుతారు. అక్కడున్న పిల్లలందరికీ హెయిర్కట్ చేయిస్తారు. ‘అనాథ పిల్లలకు వేళకు కటింగ్ కూడా చేయించరు. ఆ పని చేస్తే చాలనుకున్నాను. రెండేళ్లుగా అమ్మ ఫౌండేషన్, జనవికాస సొసైటీ సంస్థలకు చెందిన అనాథ పిల్లల హెయిర్కట్ బాధ్యతను తీసుకున్నాను. వీరితో పాటు కొన్ని ప్రభుత్వ బీసీ హాస్టళ్లకు కూడా వెళ్తుంటాను. నేను కూడా హెయిర్ కట్ చేయడం నేర్చుకున్నాను. పిల్లలు కొందరే ఉంటే నేను ఒక్కడ్నే చేస్తాను. నాతో వచ్చిన క్షురకులకు రోజుకి రూ.500 చొప్పున ఇస్తాను. నెలకు ఐదారువేలు ఖర్చు చేస్తుంటాను. ఇదేం పెద్ద మొత్తం కాకపోయినా.. నా పరిధిలో గొప్పగా భావిస్తాను’ అని చెప్పిన నర్సయ్య సేవలకు అనాథ పిల్లలకే కాదు.. ఆయన కంటపడ్డ యాచకులకు కూడా హెయిర్కట్ చేసి వస్త్రదానం చేస్తుంటారు. బాలకార్మికుల కోసం... చెత్త ఏరుకుని బతికే పిల్లలకు కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులను ఒప్పించి వారిని పాఠశాలలో చేర్పించే ప్రయత్నంలో నర్సయ్య చాలాసార్లు సక్సెస్ అయ్యారు. నిజానికి ఇది చాలా పెద్ద ఛాలెంజ్. బాలకార్మికులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఓ పట్టాన ఒప్పుకోరు. డంపింగ్ యార్డ్ల దగ్గర కనిపించే పిల్లల మనస్తత్వాన్ని మార్చడం చాలా కష్టం. ఈ పని చేయడానికి చాలా ఓపిక కావాలి. ‘నిజమే.. చెత్త ఏరుకునే పిల్లలు ఎవరినీ లెక్కచేయరు. వారి తల్లిదండ్రులకు కూడా పిల్లల సంపాదనే ముఖ్యం. అలాంటి వారిని ఒక్కరిని మార్చినా చాలా తృప్తి ఉంటుంది. ఈ మధ్యనే ఒకబ్బాయిని ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను’ అని చెప్పారు నర్సయ్య. హెల్త్ ముఖ్యం... మురికివాడల్లోని పేదలు ఆరోగ్య జాగ్రత్తలపై శ్రద్ధ చూపరు. వారి కోసం నర్సయ్య అప్పుడప్పుడు హెల్త్క్యాంపులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన క్యాంపులకే ప్రాధాన్యం ఇస్తూ తన పరిధిలోని కాలనీల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పాటు తన మనసు చలించే సంఘటనలపై కూడా దృష్టి పెట్టడం ఆయనకు అలవాటు. ఆ మధ్యన సరూర్నగర్ సర్కిల్లో ఉన్న గాంధీ విగ్రహానికి కుడిచెయ్యి విరిగింది. ఎంతమంది అధికారులకు ఆ సంగతి చెప్పినా ఎవరూ చెవిన పెట్టలేదు. ఇక లాభం లేదని నర్సయ్యే తన సొంతడబ్బులతో గాంధీ విగ్రహానికి కుడిచేయి పెట్టించి, రంగులు వేయించి క్షీరాభిషేకం చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఒక బాధ్యతగల పౌరుడికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే నర్సయ్యతో వీలైతే మనం కూడా చేతులు కలుపుదాం. ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
కంటిలో రంగులను గుర్తించేవి?
మాదిరి ప్రశ్నలు (కాంతి) 1. కిందివాటిలో పరావర్తన సూత్రానికి సంబం ధించి సరైంది ఏది? ఎ) పతనకోణం, పరావర్తన కోణం సమానం బి) పతన కిరణం, పతన బిందువు వద్ద గీసిన లంబం, పరావర్తన కిరణం, ఒకే తలంలో ఉంటాయి సి) ఎ, బి డి) ఏదీకాదు 2. కాంతి ఒక తలంలో ప్రయాణించేటప్పుడు పాటించే నియమం? ఎ) న్యూటన్ నియమం బి) ద్రవ్యనిత్యత్వ నియమం సి) ఫెర్మాట్ నియమం డి) శక్తినిత్యత్వ నియమం 3. కిందివాటిలో సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఏది? ఎ) నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది బి) మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది సి) ప్రతిబింబ దూరం, వస్తుదూరం సమానం డి) పైవన్నీ 4. సమతల దర్పణంలో ప్రతిబింబం కుడి, ఎడ మలుగా తారుమారవడాన్ని ఏమంటారు? ఎ) పార్శ్వ విలోమం బి) తలకిందులవడం సి) ప్రతిబింబ విలోమం డి) నిజ ప్రతిబింబం 5. సమతల దర్పణం ఉపరితలం నుంచి వస్తువును మన కంటి వైపుగా కదిలించినప్పుడు ఆ ప్రతిబింబ పరిమాణం? ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది సి) మారదు డి) అసలు ప్రతిబింబం ఏర్పడదు 6. గోళాకార దర్పణంలో దర్పణ ధ్రువానికి, వక్రతా కేంద్రానికి మధ్య ఉన్న దూరాన్ని ఏమంటారు? ఎ) నాభ్యంతరం బి) వక్రతా వ్యాసార్ధం సి) నాభి డి) ప్రతిబింబ దూరం 7. నాభ్యంతరం (జ) వక్రతా వ్యాసార్ధం (ట) ల మధ్య సంబంధం? ఎ) ట = జ/2 బి) జ = 2ట సి) ట = జ డి) ట = 2జ 8. పుటాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఏ స్థానంలో ఉంచాలి? ఎ) జ వద్ద బి) ఇ వద్ద సి) జ, ఇ ల మధ్య డి) ఇ కి ఆవల 9. నీటిలోని గాలి బుడగ ఏ కటకంలా పనిచేస్తుంది? ఎ) వికేంద్రీకరణ బి) కేంద్రీకరణ సి) ద్వినాభ్యంతర డి) సమతల 10. కిందివాటిలో పుటాకార దర్పణాల ఉపయోగం ఏమిటి? ఎ) దంత వైద్యులు ఉపయోగిస్తారు బి) వాహన చోదకులు వాడతారు సి) వెల్డింగ్ చేసేవారికి అవసరం డి) క్షౌరశాలల్లో వాడతారు 11. వాహన చోదకులు వెనుక నుంచి వచ్చే వాహనాలను చూడటానికి వినియోగించే దర్పణం? ఎ) సమతల దర్పణం బి) పుటాకార దర్పణం సి) కుంభాకార దర్పణం డి) ద్విపుటాకార దర్పణం 12. దర్పణ సూత్రం? ఎ) బి) జ = ఠ+ఠి సి) డి) 13. {పకాశవంతమైన ఇంద్రధనుస్సును చూడాలంటే నీటిబిందువులోకి ప్రవేశించే కిరణాలు బయటకు వెళ్లే కిరణాల మధ్య కోణం ఎంత ఉండాలి? ఎ) 0ని బి) 30ని సి) 45ని డి) 42ని 14. సోలార్ కుక్కర్ తయారీకి అనువైన దర్పణం ఏది? ఎ) కుంభాకార దర్పణం బి) పుటాకార దర్పణం సి) సమతల దర్పణం డి) దేన్నయినా వాడవచ్చు 15. {పతిబింబదూరం, వస్తుదూరానికి మధ్య నిష్పత్తిని ఏమంటారు? ఎ) నాభ్యంతరం బి) వక్రతావ్యాసార్ధం సి) ఆవర్తనం డి) ప్రతిబింబ పరిమాణం 16. పుటాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కు వగా ఉండే సందర్భం? ఎ) దర్పణ నాభి వద్ద వస్తువు ఉన్నప్పుడు బి) దర్పణ ధ్రువం, నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు సి) వక్రతాకేంద్రం వద్ద వస్తువు ఉన్నప్పుడు డి) వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు 17. కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం? ఎ) చిన్నది బి) నిటారైంది సి) మిథ్యాప్రతిబింబం డి) పైవన్నీ 18. గాలిలో/శూన్యంలో కాంతి వేగం ఇ=? ఎ) 3ప10ృ8 మీ/సె బి) 3ప106 మీ/సె సి) 3ప108 మీ/సె డి) 3ప10ృ6 మీ/సె 19. కిందివాటిలో కాంతివేగం దేంట్లో తక్కువ? ఎ) గాలి బి) బెంజీన్ సి) గాజు డి) వజ్రం 20. యానకం వక్రీభవన గుణకం ఎక్కువైతే, ఆ యానకంలో కాంతి వేగం? ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది సి) మారదు డి) వక్రీభవన గుణకానికి కాంతివేగానికి సంబంధం లేదు 21. కిందివాటిలో వక్రీభవన గుణకం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది? 1. పదార్థ స్వభావం 2. కాంతి తరంగదైర్ఘ్యం 3. కాంతి వేగం 4. కాంతిరంగు ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) ఏదీకాదు 22. ఒక గదిలోని మాటలు మరో గదిలోకి వినిపించడానికి కారణమైన ధర్మం? ఎ) పరావర్తనం బి) వక్రీభవనం సి) వ్యతికరణం డి) వివర్తనం 23. వక్రీభవన కోణం 90 అయినప్పుడు పతన కోణాన్ని ఏమంటారు? ఎ) కనిష్ఠ కోణం బి) సందిగ్ధ కోణం సి) గరిష్ఠ కోణం డి) గట్టు కోణం 24. ఎండమావులు ఏర్పడటానికి కారణమైన కాంతి దృగ్విషయం? ఎ) కాంతి పరావర్తనం బి) కాంతి వక్రీభవనం సి) సంపూర్ణాంతర పరావర్తనం డి) సందిగ్ధ కోణం ఏర్పడటం 25. కిందివాటిలో సంపూర్ణాంతర పరావర్తన అనువర్తనం ఏది? ఎ) వజ్రాలు ప్రకాశించడం బి) ఆప్టికల్ ఫైబర్లు పనిచేయడం సి) ఎండమావులు ఏర్పడటం డి) పైవన్నీ 26. కుంభాకార కటకాన్ని భూతద్దంగా వాడే సందర్భంలో వస్తువు స్థానం? ఎ) జ, ఞ ల మధ్య బి) జ, ఇ ల మధ్య సి) ఇ వద్ద డి) జ వద్ద 27. నిజ, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం? ఎ) పుటాకార కటకం బి) కుంభాకార కటకం సి) సమతల కుంభాకార కటకం డి) సమతల పుటాకార కటకం 28. స్పష్టదృష్టి కనిష్ఠ దూరం? ఎ) 20 ఛిఝ బి) 30 ఛిఝ సి) 25 ఛిఝ డి) 35 ఛిఝ 29. ఆరోగ్యవంతుడైన మానవుని దృష్టికోణం? ఎ) 30ని బి) 60ని సి) 45ని డి) 90ని 30. కంటిలో రంగులను గుర్తించేవి? ఎ) దండాలు బి) శంకువులు సి) సిలియారి కండరాలు డి) కంటినాడులు 31. కంటి కటక నాభ్యంతరాన్ని సర్దుబాటు చేయడంలో ఉపకరించేవి? ఎ) నేత్రోదక ద్రవం బి) దండాలు సి) శంకువులు డి) సిలియారి కండరాలు 32. {హస్వదృష్టి దోష నివారణకు వాడేది? ఎ) కుంభాకార కటకం బి) కుంభాకార దర్పణం సి) పుటాకార కటకం డి) పుటాకార దర్పణం 33. కంటికటకం కనిష్ఠ నాభ్యంతరం విలువ? ఎ) 2.5 ఛిఝ బి) 2 ఛిఝ సి) 2.27 ఛిఝ డి) 1.5 ఛిఝ 34. ఏ దృష్టిదోషం ఉన్నవారు ద్వినాభ్యంతర కటకాన్ని వాడతారు? ఎ) హ్రస్వదృష్టి బి) దీర్ఘదృష్టి సి) చత్వారం డి) వర్ణ అంధత్వం 35. కంటివైద్యుడు ఒక వ్యక్తికి 2ఈ కటకాన్ని వాడాలని సూచించాడు. ఆ కటక నాభ్యంతరం? ఎ) 20 ఛిఝ బి) 100 ఛిఝ సి) 200 ఛిఝ డి) 50 ఛిఝ 36. పట్టకం ద్వారా ప్రయాణించిన తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఎ) కాంతి పరావర్తనం బి) కాంతి వక్రీభవనం సి) కాంతి విక్షేపణం డి) కాంతి పరిక్షేపణం 37. కాంతివేగం ఎక్కువగా ఉండే యానకం? ఎ) విరళ యానకం బి) సాంద్రతర యానకం సి) విశ్వవ్యాప్త యానకం డి) ఈథర్ 38. ఇంద్రధనుస్సు ఏర్పడటంలో ఇమిడి ఉన్న కాంతి దృగ్విషయం? ఎ) పరిక్షేపణం బి) వక్రీభవనం సి) పరావర్తనం డి) విక్షేపణం 39. ఇంద్రధనుస్సు ఆకారం? ఎ) వృత్తాకారం బి) అర్ధవృత్తాకారం సి) త్రిమితీయ శంకువు డి) రేఖీయం 40. సూర్యోదయం, సూర్యాస్తమయ సమ యాల్లో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం? ఎ) కాంతి పరిక్షేపణం బి) కాంతి విక్షేపణం సి) కాంతి పరావర్తనం డి) కాంతి వక్రీభవనం 41. ద్రవాలు, వాయువుల్లో జరిగే కాంతి పరిక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త? ఎ) న్యూటన్ బి) సి.వి. రామన్ సి) హైగెన్స డి) మాక్స్ప్లాంక్ 42. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు? ఎ) న్యూటన్ బి) హైగెన్స సి) మాక్స్వెల్ డి) మాక్స్ప్లాంక్ 43. హైగెన్స సిద్ధాంతం ప్రకారం బిందు కాంతి జనకం నుంచి వెలువడే తరంగాగ్రాల ఆకారం? ఎ) రేఖీయం బి) దీర్ఘఘనాకారం సి) గోళాకారం డి) శంకువు ఆకారం 44. కాంతి ధర్మాలన్నింటినీ వివరించిన సిద్ధాంతం? ఎ) కణ సిద్ధాంతం బి) తరంగ సిద్ధాంతం సి) విద్యుదయస్కాంత సిద్ధాంతం డి) వికిరణ క్వాంటం సిద్ధాంతం 45. సంపూర్ణ గోళానికి ఘనకోణం విలువ? ఎ) ఞ స్టెరేడియన్లు బి) 2ఞ స్టెరేడియన్లు సి) 3ఞ స్టెరేడియన్లు డి) 4ఞ స్టెరేడియన్లు 46. కాంతి తరంగాగ్రాల అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు? ఎ) వక్రీభవనం బి) వివర్తనం సి) వ్యతికరణం డి) పరావర్తనం 47. లేజరులను ఉపయోగించే ప్రత్యేక త్రిమి తీయ ఫొటోగ్రఫీని ఏమంటారు? ఎ) క్రొమటోగ్రఫీ బి) రేడియోగ్రఫీ సి) హాలోగ్రఫీ డి) ఓషనోగ్రఫీ 48. లేజర్లకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానాన్ని అందించినవారు? ఎ) ఛార్లెస్ హెచ్ టౌన్స బి) క్రిస్టియన్ హైగెన్ సి) ఐజాక్ న్యూటన్ డి) మాక్స్ప్లాంక్ 49. లేజర్ కిరణాల ఏకవర్ణీయతకు కారణం? ఎ) అధిక పట్టీ వెడల్పు బి) అతిస్వల్ప పట్టీ వెడల్పు సి) దిశనీయత డి) తీవ్రత 50. కాంతి అభివాహానికి ప్రమాణం? ఎ) ల్యూమెన్ బి) కాండెలా సి) స్టెరేడియన్ డి) ల్యూమోన్/సెకను 51. తరంగాల అధ్యయనం ద్వారా కాంతి లక్షణాలను తెలుసుకోవడానికి తోడ్పడేది? ఎ) కుంభాకార కటకం బి) లేసర్ సి) రిపిల్ టాంక్ డి) పట్టకం 52. కాంతి వివిధ రంగులకు కారణం? ఎ) కాంతి వేగంలో మార్పు బి) కాంతి తరంగదైర్ఘ్యంలో మార్పు సి) కాంతి పౌనఃపున్యంలో మార్పు డి) కాంతి జనకాల్లో మార్పు 53. జ = ృ20 ఛిఝ అయితే ఆ కటకం? ఎ) కుంభాకార కటకం బి) పుటాకార కటకం సి) సమతల కుంభాకార కటకం డి) సమతల పుటాకార కటకం 54. పుటాకార దర్పణం ద్వారా వస్తు పరిమాణానికి సమాన పరిమాణం ఉన్న ప్రతిబింబం ఏర్ప డాలంటే వస్తువును ఉంచాల్సిన ప్రదేశం? ఎ) జ వద్ద బి) ఇ వద్ద సి) జ, ఇ ల మధ్య డి) ఇ కి ఆవల 55. ఇంద్రధనుస్సులో ఏర్పడే రంగుల్లో అధిక తరంగదైర్ఘ్యం దేనికి ఉంటుంది? ఎ) ఆకుపచ్చ బి) నీలం సి) నారింజ డి) ఎరుపు 56. ఒక పుటాకార దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబ ఆవర్తనం -6 అయితే ఆ ప్రతి బింబ లక్షణం? ఎ) తలకిందులుగా ఏర్పడుతుంది బి) నిజ ప్రతిబింబం సి) వస్తువు కంటే పెద్ద ప్రతిబింబం డి) పైవన్నీ సమాధానాలు 1) సి; 2) సి; 3) డి; 4) ఎ; 5) బి; 6) బి; 7) డి; 8) ఎ; 9) ఎ; 10) ఎ; 11) సి; 12) డి; 13) డి; 14) బి; 15) సి; 16) డి; 17) డి; 18) సి; 19) డి; 20) ఎ; 21) ఎ; 22) డి; 23) బి; 24) సి; 25) డి; 26) ఎ; 27) బి; 28) సి; 29) బి; 30) ఎ; 31) డి; 32) సి; 33) సి; 34) సి; 35) డి; 36) సి; 37) ఎ; 38) డి; 39) సి; 40) ఎ; 41) బి; 42) బి; 43) సి; 44) బి; 45) డి; 46) బి; 47) సి; 48) ఎ; 49) బి; 50) ఎ; 51) సి; 52) సి; 53) బి; 54) బి. 55) డి; 56) డి. -
దీపావళి నూలు వెలుగులు
దివ్వెల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోవాలి... బాణాసంచా మెరుపులలో తారల్లా తళుక్కుమనాలి... అమావాస్య చీకటిలో నిండు పున్నమిని తలపించాలి... మేని ముస్తాబు విషయంలో అతివల ఆలోచన పండగ వేళ ఇలాగే ఉంటుంది. పండగకు కొత్త వెలుగులు నింపడానికి సాధారణంగా రంగు రంగుల దుస్తుల ఎంపికకు పోటీపడుతుంటారు. నెటెడ్, జార్జెట్, బెనారస్, పట్టు, సిల్క్.. ఇలా అన్నీ మెరిసిపోయే వస్త్రాలతో మేనికి వన్నెలద్దుతుంటారు. ఇందుకు మగవారూ మినహాయింపు కాదు. పట్టు షేర్వాణి లేదా లాల్చీ ధోవతితో కొత్తగా కనిపించాలనుకుంటారు. అయితే, దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చే ఈ పండగ వేళ రెట్టింపు ఆనందాన్ని నట్టింటికి తేవాలంటే మగువలకైనా, మగవారికైనా రక్షణ చర్యలు తప్పనిసరి. అందమైన దుస్తులు అనుకోకుండా దీపాలకు తగిలినా... వెలుగులు విరబూసే చిచ్చుబుడ్లు, మిరుమిట్లు గొలిపే భూచక్రాలు పొరపాటున చీర అంచులకో, పరికిణీ, ఓణీలకో అంటుకున్నా ప్రమాదమే! అందుకే, సురక్షితంగా దీపావళి జరుపుకోవడానికి డ్రెస్ డిజైనర్లు అందిస్తున్న ప్రధాన సూచనలు ఇవి. వీటిని పాటిస్తే పండగ సంబరం రెట్టింపు కాదా మరి! నూరు శాతం కాంతి... ఈ పండగ వేళ నూలు వస్త్రాలు ధరించడం వల్ల రెండు విధాల మేలు కలుగుతుంది. మనదైన చేనేత దుస్తుల వల్ల హుందాతనపు నిండుతనం కలుగుతుంది. ప్రమాద భయమూ దరిచేరదు. అందుకే, కాటన్ దుస్తులకే ఓటేద్దాం! పిల్లలకు ప్రత్యేకం... పిల్లలకు బాణాసంచా అంటే అమితమైన ఇష్టం. ముద్దుగా ఉండే వారిని మరింత అందంగా తయారుచేయడానికి రకరకాల వస్త్రాలంకరణ చేస్తుంటారు పెద్దవారు. అయితే పిల్లలను పండగ వేళ నూటికి నూరు శాతం కాటన్ వస్త్రాలతో అలంకరించడం మేలు. కాటన్లోనూ బాందినీ ప్రింట్లు గలవి, రంగు రంగులున్నవి, అద్దాలు, చమ్కీలు, కుందన్స్తో కలిపి డిజైన్ చేసినవి లభిస్తున్నాయి. ఈ తరహా దుస్తులను పిల్లల ముస్తాబుకు కేటాయించాలి. అనువైన వస్త్రాలను ధరించి అత్యంత సురక్షితంగా.. దివ్వెల దీపావళిని అంతా ఆనందంగా జరుపుకోవాలి. ఎక్కువ కుచ్చులున్నవి వద్దు! అమ్మాయిల నుంచి అమ్మల దాకా ఇటీవల కాలంలో అతివలంతా డిజైనర్ లంగా ఓణీలు ధరిస్తున్నారు. ఇవి నెటెడ్వి కావడం, పెద్ద కుచ్చులతో విప్పార్చుకున్నట్టు ఉంటాయి. చూడటానికి ఇవి అందంగా, ఆకర్షణీయంగా కనిపించినా త్వరగా నిప్పు రవ్వలకు అంటుకునే అవకాశం ఉంటుంది. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలంటే ఈ తరహా మెటీరియల్ వస్త్రాలంకరణకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ధోతీ... ఆల్ ఇన్ వన్... నూలు వస్త్రాలతో పండగ కాంతి ఎలా.. అని ఆలోచించేవారికి ఎన్నో నూతన మార్గాలున్నాయి. అందులో ధోతీ స్టైల్ ప్యాంట్స్ ముఖ్యమైనవి. ఇవి పిల్లలకు, ఆడ, మగ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఏ వయసు వారైనా వీటిని ధరించవచ్చు. స్త్రీలు ధోతీ ప్యాంట్ లేదా హారెమ్ ప్యాంట్ ధరించి పైన షార్ట్ కలర్ఫుల్ కుర్తీ వేసుకుంటే అందంగా కనిపిస్తారు. పటియాల మాదిరి ఉండే ఈ ధోతీ ప్యాంట్స్ విభిన్న మోడల్స్లో లభిస్తున్నాయి. టపాసులు కాల్చేటప్పుడు వాటి వల్ల ప్రమాదం కలుగుతుందేమో అనే భయమూ ఎక్కువ ఉండదు. మగవారు ధోతీ ప్యాంట్ ధరించడం వల్ల సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే, స్టైల్గా ఉండవచ్చు. పైన పొడవాటి లాల్చీ ధరించవచ్చు. పిల్లలకూ ఈ తరహా దుస్తులు లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి -
బెంగళూరు అభివృద్ధికి గుజరాత్ వెలుగులు
సాక్షి, బెంగళూరు : గుజరాత్ అభివృద్ధి వెలుగులు బెంగళూరులో కూడా పూయించనున్నారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్-2015 కోసం కార్పొరేట్ ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతూ శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో రోడ్ షో నిర్వహించారు. దీనికి గుజరాత్ రాష్ట్ర ఆర్థిక, ఇంధన, పెట్రో రసాయనాల మంత్రి సౌరబ్భాయ్ పటేల్ నేతృత్వం వహించారు. నగరానికి చెందిన 300 మందికి పైగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 13 వరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో వైబ్రంట్ గుజరాత్ జరగనున్న విషయం తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ విదేశీ పారిశ్రామికవేత్తల్ని పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం పలుకుతూ ప్రారంభించిన వైబ్రంట్ గుజరాత్ ఎడిషన్లలో ఇది ఏడవది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. జపాన్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ దేశాల భాగస్వామ్యంతో వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమం జరుగుతోంది. రోడ్ షో సందర్భంగా గుజరాత్ ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక ప్రజెంటేషనిచ్చారు. గుజరాత్ అభివృద్ధితో పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నాయో ఈ ప్రజెంటేషన్లో వివరించారు. అనంతరం మంత్రి నగరానికి చెందిన వ్యాపారవేత్తల్ని విడివిడిగా కలుసుకున్నారు. అదనపు చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు) డి.జె.పాండ్యన్, ఇంధన, పర్యావరణ, విద్య, ఐటీ, పట్టణ ప్రణాళికా విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
2015 మార్చిలో కేటీపీపీ రెండో దశ వెలుగులు
తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు గణపురం: కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల రెండోదశ ప్లాంట్లో 2015 మార్చి31 నాటికి వెలుగులు విరజిమ్ముతాయని తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ప్రకటించారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీ రెండో దశ ప్లాంట్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభాకర్రావు విలేకరులతో మాట్లాడారు. రెండో దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడమే కాకుండా అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షిస్తున్నామని చెప్పారు. రెండో దశ ప్లాంట్ పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ... నాలుగు నెలలుగా పనులు పుంజుకున్నాయన్నారు. 2014 డిసెంబర్లో బాయిలర్ హైడ్రాలిక్ టెస్ట్ ఉంటుందని, 2015 మార్చిలో ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. వర్షాకాలంలో పనులు సక్రమంగా జరగని మాట వాస్తవ మేననని, నెలలో ఒకటి రెండు సార్లు ప్లాంటులో నిర్మాణ పనులను విద్యుత్ సౌధ అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇకపై తతాను నెలకోసారి వస్తానన్నారు. బొగ్గు కొరత రాకుండా తగిన ఏర్పాట్లల్లో ఉన్నామని, ప్రస్తుతం లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. కరీంనగర్ జిల్లా తాడిచర్లలోని జెన్కోకు చెందిన బొగ్గుబ్లాకు రద్దయిన విషయం అందరికి తెల్సిందేనని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ అవసరాల దృష్ట్యా తాడిచర్ల బ్లాక్ను తిరిగి జెన్కోకు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వ చ్చే ప్రయత్నంలో ఉందన్నారు. దుబ్బపల్లి గ్రామం తరలింపు పై దృష్టి సారించామని , పునరావాస ప్యాకేజీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే భూసేకరణ జరిగిందని, ములుగు ఆర్టీఓ ఖాతాలో రూ.27 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ అధికారులదే జాప్యమని, నాలుైగె దు చోట్ల భూములను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులను మందలించినట్లు సమాచారం. కాంట్రాక్టు కంపెనీలకు సైతం జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. జెన్కో డెరైక్టర్ సచ్చితానందం, కేటీపీపీ సీఈ శివకుమార్, సివిల్ సీఈ అజయ్, ఎస్ఈలు సురేష్బాబు, వెంకటేశ్వరరావు ,ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కేటీపీపీని సందర్శించిన క్రమంలో వార్తల కవరేజీకి వచ్చిన ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడీయా విలేకరులను ప్లాంట్లోనికి అనుమతించలేదు. దాదావు 8 గంటలపాటు అధికారులనుంచి పిలుపు రాకపోవడంతో ఆగ్రహించిన విలేకరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఈ విషయం సీఎండీ దృష్టికి తీసుకురాగా... ఇంకోసారి అలా జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. -
సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం!
గ్రంథపు చెక్క మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే విధానాలు రూపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మానవజీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది కూడా. ఆవిరియంత్రం, రైల్వే, విద్యుచ్ఛక్తి, కాంతి, టెలిగ్రాఫ్, రేడియో, ఆటోమొబైల్, విమానాలు, డైనమోలు మొదలైన పరిశోధనలు సైన్స్ఫలితాలే. ఈ పరిశోధనల ప్రయోజనం... అది మానవుని దుర్భర శారీరక కష్టాల నుండి దూరం చేస్తుంది. మనిషి జీవనానికి శారీరక కష్టం ఒకనాడు అనివార్యంగా ఉండేది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం లేదా అనువర్తిత శాస్త్ర విజ్ఞానం (అప్లయ్డ్ సైన్స్) అనేక సమస్యలను సృష్టిస్తుంది. మానవుని ఉనికి ఈ సమస్యల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పురోభివృద్ధి దూరాన్ని తగ్గించింది. నూతన విధ్వంసక సాధనాలను అది సృష్టించింది. ఇది మానవజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. అసలు మానవ ఉనికే ఇందువల్ల ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొత్తం భూగ్రహానికి న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు గల ఒకే శక్తి ఉండడం అవసరం. సాంకేతిక పురోగతిని మన ఉనికిని చాటుకునేందుకు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఆధునిక నిరంకుశత్వం, దాని విధ్వంసకశక్తికి నిదర్శనంగా మారింది. ఇక్కడ కూడా ఆయా పరిస్థితులను బట్టి అంతర్జాతీయ పరిష్కారం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు కావల్సిన మానసిక ప్రాతిపదికను ఇప్పటికీ ఏర్పాటు చెయ్యలేదు. ఆదిమ మానవుడు ప్రకృతి చట్టాలను పాక్షికంగా అర్థం చేసుకోవడం దెయ్యాలు, ఆత్మల పట్ల కూడా నమ్మకాన్ని సృష్టించింది. మానవ మేధస్సు ఆధారంగా అభివృద్ధి చెందుతూ సైన్స్ మానవుని అభద్రతాభావాన్ని అధిగమించింది.. - ‘ఆల్బర్ట్ ఐన్స్టీన్ సామాజిక రాజకీయ రచనలు’ పుస్తకం నుంచి. -
ప్రణాళిక తో పరుగులు
సాక్షి, హైదరాబాద్: సొంతింటి వెలుగులు జీవితాంతం ఆస్వాదించాలంటే స్థలం ఎంపికలో జాగ్రత్తగా అడుగులేయాలి. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడే సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించొచ్చు. ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే స్థిరాస్తిలో నష్టభయం తక్కువే. ఒక్కోసారి ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం గిట్టుబాటవుతుంది. అయితే మధ్యవర్తులు, రియల్టర్లు చెప్పే మాటలకు బోల్తాపడి తుది నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ప్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు తక్కువ సమయంలో అధిక రాబడిని అందుకోవడానికి పరుగులు పెట్టకూడదు. ఇది అన్ని వేళలా మెరుగైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. వీలైతే కనీసం ఐదేళ్ల పాటు ఆయా పెట్టుబడిపై రాబడిని ఆశించకూడదు. ఆ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. ప్రస్తుతం తక్కువ రేటుకు కొనేసి ఐదేళ్లయ్యాక అధిక రేటుకు అమ్ముకునేలా ప్రణాళికలుండాలి. అయితే స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రస్తుత పరిస్థితులపై చక్కటి అవగాహన పెంచుకోవాలి. తర్వాత పరిస్థితి ఎలా మారడానికి అవకాశముందో అంచనా వేయాలి. మరి, ఏయే సందర్భాల్లో స్థలాలపై అధిక రాబడి అందుకోవడానికి అవకాశముందో ఓసారి చూద్దామా.. అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ప్రాంతాల్లోనే స్థలాన్ని కొనాలి. ఒకవేళ ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కొందామంటే.. రేటు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అయినా అక్కడే కొనాలన్న నిర్ణయానికొస్తే విస్తీర్ణం తక్కువ గల స్థలం లేదా ఇంటితో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశమేమిటంటే.. ఇదివరకే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మనం ఊహించినంత వేగంగా రేట్లు పెరగకపోవచ్చు. అంతేకాదు కొంతకాలం అయ్యాక ధరలు అక్కడే స్థిరపడొచ్చు కూడా. అందుకే అభివృద్ధికి ఆస్కారమున్న చోట కొన్నారనుకోండి ఊహించిన దానికంటే అధిక రాబడి గిట్టుబాటవుతుంది. మౌలిక సదుపాయాలు.. మనం కొనాలని భావించే స్థలానికి చేరువలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా లేదా అనే విషయాన్ని చూడాలి. ఉదాహరణకు స్థలానికి చేరువలో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్, ఉద్యానవనాలు, స్విమ్మింగ్పూల్ వంటి సదుపాయాలున్నాయనుకోండి.. అక్కడ నివసించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఫలితంగా భవిష్యత్తులో ధరలూ పెరుగుతాయి. ప్రస్తుతం అలాంటి సదుపాయాలు లేకపోయినా రానున్న రోజుల్లో వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వపరంగా చర్యలేమైనా తీసుకుంటారా? లేదా ప్రైవేటు సంస్థలు అలాంటి సదుపాయాల్ని పొందుపరుస్తాయా? వంటి అంశాల్ని కనుక్కోవాలి. ఏదేమైనా కొన్నాళ్ల తర్వాత ఆయా ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నమ్మకం ఏర్పడాలి. కొన్ని స్థిరాస్తి సంస్థలు చెప్పే కబుర్లకు బోల్తాపడి మీ సొమ్మును పెట్టుబడిగా పెట్టకండి. వాస్తవాల్ని గమనించాకే అడుగు ముందుకేయాలి. ప్రజా రవాణా వ్యవస్థ.. మనం తీసుకునే స్థలం దాకా ప్రజా రవాణా వ్యవస్థ సదుపాయం లేకున్నా పర్వాలేదు. కనీసం రానున్న రోజుల్లో అయినా అట్టి సౌకర్యం అందుబాటులోకి వస్తుందా? ఈ అంశాన్ని పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్తులో ధర పెరిగే అవకాశముంటుంది. దగ్గర్లో రైల్లే స్టేషన్ లేకున్నా పర్వాలేదు. బస్డిపో లేకపోయినా పర్వాలేదు. నిత్యం రాకపోకలు సాగించడానికి బస్టాండ్ ఉంటే సరిపోతుంది. ఇదే అంశం ఆధారంగా చాలామంది ప్లాట్లను కొంటుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ప్లాట్ల ధరలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం.. మెట్రో రైలే. యమజోరుగా జరుగుతోన్న మెట్రో పనుల్ని చూసి ప్లాట్లను అమ్ముకోవడానికి ఎవరూ సాహసించట్లేదు. అయితే నగరంలో ఖాళీ స్థలాలు పెద్దగా లేవు కాబట్టి రానున్న రోజుల్లో ధరలు తగ్గే అవకాశమే లేదు. కాబట్టి స్థలాలు కొనేవారెవరైనా అభివృద్ధి చెందడానికి ఆస్కారముండి, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి మరి. పాఠశాలలు, ఆసుపత్రులు.. స్థలం కొనేముందు, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయా అనే అంశాన్ని గమనించాలి. ఇప్పుడే కాకపోయినా ఓ ఐదేళ్ల తర్వాతైనా అవి ఏర్పాటవ్వడానికి వీలుంటుందా అనే విషయాన్ని గమనించాలి. పేరు ప్రఖ్యాతలున్న పాఠశాలలుంటే భవిష్యత్తులో రేటు పెరగొచ్చు కూడా. బడా కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల్ని విస్తరించడానికి అవకాశముందనే విషయాన్ని వీలైతే తెలుసుకోండి. ఏదేని కొత్త ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల్ని కల్పించే సంస్థ ఏర్పాటైతే.. అక్కడి స్థలాల ధరలు పెరుగుతాయి. కొన్నిసార్లు సహజంగా పెరగకపోయినా.. మధ్యవర్తులు, రియల్టర్లు ఉంటారు కదా రేట్లు పెంచడానికి. అలా చేయడం వల్లే ప్రస్తుతం శంషాబాద్, మహేశ్వరం చుట్టుపక్కల స్థలాల్ని కొనేవారే కరువయ్యారు. కాబట్టి ప్లాట్ల రేట్లు సహజంగా తప్ప కృత్రిమంగా కాదు. -
ప్రస్థానం- తెరవెనుక కథ
-
జవాబు దొరకని ప్రశ్న
ఫొటో స్టోరీ వెలుగులు జిమ్మే చిన్ని చిన్ని కళ్లల్లో దిగులు తెరలా కమ్ముకుంది. పాలుగారే చెంపల మీద కన్నీరు చారికలై కదలాడుతోంది. నవ్వులు రువ్వే ఆ పెదవుల వెనుక ఒక ప్రశ్న దాగి దోబూచులాడుతోంది. ఆ ప్రశ్న ఏమిటో తెలుసా... ‘అమ్మ ఎక్కడుంది? మా అమ్మ ఎక్కడుంది?’ ఏప్రిల్ 24, 2013. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ‘రాణా ప్లాజా’ అకస్మాత్తుగా నేలకొరిగింది. ఎనిమిదంతస్తులు పేకమేడల్లా కూలిపోయాయి. వాటి కింద 1100 మంది ప్రాణాలు సమాధి అయిపోయాయి. శిథిలాల మధ్య నుంచి నుంచి తీసిన శవాల కుప్పల్లో తమవారిని గుర్తించేందుకు జనం ఆరాటపడ్డారు. అయినవారి జాడ కోసం అల్లాడిపోయారు. కనిపించకుండా పోయిన తమవారి ఫొటోలు చేతపట్టుకుని ‘వీరినెక్కడైనా చూశారా’ అంటూ కనిపించినవారందరినీ అడిగారు. అది చూసి ఫొటోగ్రాఫర్ తుర్జాయ్ చౌదరి చలించిపోయాడు. ఆటబొమ్మలుండాల్సిన చిట్టి చేతుల్లోకి వచ్చి చేరిన అమ్మ బొమ్మను చూసి అతడు కదిలిపోయాడు. దీనమైన చూపులతో అమ్మ జాడకోసం దిక్కులన్నీ వెతుకుతోన్న ఆ పసివాళ్లను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో నాటి దుర్ఘటనలో అమ్మలకు దూరమైన ఎందరో పిల్లల దయనీయ స్థితిని తెలిపింది. ప్రపంచంలోని ఎందరో అమ్మల గుండెల్ని పిండింది! -
పవిత్ర ఖురాన్ అవతరించిన శుభరాత్రి... షెబెఖద్
ఇస్లాం వెలుగు సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో అత్యంత శుభప్రదమైన, మంగళప్రదమైన విశిష్ట మాసం రమజాన్. ఇందులోని ప్రారంభ దశ, అంటే మొదటి రోజులు కారుణ్యభరితమైనవి. ఈ దశలో దైవ కారుణ్యం విశేషంగా వర్షిస్తుంది. రెండవ దశ క్షమాపణ, మన్నింపునకు సంబంధించినది. ఈ దశలో దైవం తన దాసుల తప్పుల్ని మన్నిస్తాడు. వారి పాపాలను క్షమించి తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. ఇక మూడవది నరకాగ్ని నుండి విముక్తి దశ. ఈ చివరి దశలో దైవం అసంఖ్యాక మానవులకు నరక జ్వాలల భయం నుండి విముక్తి కల్పిస్తాడు. ఇది చాలా కీలకమైన దశ. దీని ప్రాశస్త్యం చాలా గొప్పది. సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో రమజానుకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో ఈ మాసంలోని మూడు భాగాల్లో చివరి భాగానికి అలాంటి ప్రత్యేకత ఉంది. ఈ చివరి పది రోజుల్లోని ఒక రాత్రిలోనే ‘షబెఖద్’్ర ఉంది. దీన్నే ‘లైలతుల్ఖద్’్ర అని కూడా అంటారు. ఇది వేయి మాసాలకన్నా ఎక్కువ విలువైన రాత్రి. ఈ రాత్రిలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవ తరించింది. ఈ విషయాన్ని దైవం ఇలా ప్రకటించాడు: మేము ఈ ఖుర్ ఆన్ గ్రంథాన్ని ఒక విలువైన రాత్రిలో అవతరింపజేశాము. ఆ రాత్రి ఘనత ఏమిటో మీకు తెలుసా? అది వేయి మాసాలకన్నా అత్యంత విలువైన రాత్రి. దైవ దూతలు, ఆత్మ.. తమ ప్రభువు అనుమతితో, ప్రతి అనుజ్ఞతో ఆ రాత్రికి దిగివస్తారు. ఆ రాత్రి శుభోదయం వరకు శాంతియుతమైన రాత్రి (ఖుర్ఆన్ 97-1,5). అందుకే రమజాన్ చివరి పది రోజుల్లో ఆరాధనలు ఎక్కువగా చెయ్యాలని, ఇందులోనే ఈ శుభరాత్రి ఉంది కనుక దానిని పొందాలని ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. అయితే ఇక్కడ ఆ రాత్రి ‘ఫలానా రాత్రి’ అని కచ్చితంగా నిర్థారించబడలేదు. కానీ దానిని ఖచ్చితంగా ఎలా పొందవచ్చో ప్రవక్త మహనీయులు స్పష్టంగా వివరించారు. చివరి పది రోజుల్లోని బేసి రాత్రులలో దానిని అన్వేషించమని ఆయన ఉపదేశించారు. అంటే 21, 23, 25, 27, 29 రాత్రులన్న మాట. ఎవరైతే ఆత్మ సంతోషంతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ఆ రాత్రి ఆరాధనలో గడుపుతారో వారి పాపాలన్నీ మన్నించబడతాయి. ముఖ్యంగా వారు పవిత్ర ఖురాన్తో సంబంధాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మానవ మనుగడకు దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లనీ ఒక ఎత్తయితే, పవిత్ర ఖురాన్ అవతరణ మరో ఎత్తు. ఈ ప్రబోధనా జ్యోతి మానవులకు జీవితంలోని అన్ని రంగాల్లో మార్గ దర్శనం చేసింది. సామాజిక, సాంస్కృతిక , కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ తదితర సమస్త రంగాల్లో మానవుడు ఏ విధమైన జీవన విధానాన్ని అవలంబించాలో, ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలో సవివరంగా తెలియజేసింది. అందుకని ఈ పవిత్రమాసంలో ఖురాన్ను అధ్యయం చేయడానికి, అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారం ఆచరించడానికి శక్తివంచన లేని ప్రయత్నం చేయాలి. అల్లా సమస్త మానవులకూ పవిత్ర ఖురాన్ బోధనలు అర్థంచేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. - యం.డి.ఉస్మాన్ఖాన్ -
పదహారణాల పండగ
మూతిముడుచుకున్న మానులు సైతం... చైత్రంలో కొత్త చిగురులు తొడుక్కుంటాయి. మూగబోయిన కోకిల స్వరం వికసిత పుష్పమవుతుంది. అరమెరపుతో అల్లాడిన రేరాజు వెలుగుల రేడుగా విరాజిల్లుతాడు. ఓ వైపు గాలుల పరిమళం మరో వైపు పక్షుల కలస్వనం ఒకదానిని మించి ఒకటి పోటీపడుతుంటే ప్రకృతికాంత ఈ కొత్త సింగారాలతో హొయలుపోతుంది. కావ్యకాంత ఆ నయగారాలకు వంతపాడుతుంది. పచ్చని సిరులను పరికిణీలుగా కావ్యపు ఝరులను పయ్యెదగా మార్చి చిగురులకు సొబగులు అద్దేది మేమే సుమా అంటూ మగువలు ధీటైన సమాధానమిస్తే అది ఉగాది. నట్టింటికి కళ తీసుకువస్తే అది యుగాది. తెలుగింటి పండగకు తోరణమయ్యేపదహారణాల పడతులకు జయనామ సంవత్సరాన జయం... జయం..! 1- ఆమనికి కొత్త వెలుగు వచ్చినట్టుగా కనువిందు చేస్తోంది ఈ పరికిణీ, వోణీ. నీలిరంగు నెట్ లెహెంగాకు బ్రొకేడ్, వెల్వెట్ అంచులను జత చేసి పైన అంతా స్టోన్ వర్క్ చేశారు. అదే కాంబినేషన్లో వోణీని తీర్చిదిద్ది, బెనారస్ బ్లౌజ్ను జత చేశారు. 2- చూపుతిప్పుకోనివ్వని అమరికతో ఈ పరికిణీ వోణీ రాయంచకళతో ఆకట్టుకుంటోంది. గంధపు రంగు లెహెంగాకు చాకోలెట్ రంగు అంచు, దానిపైన యాంటిక్స్టోన్ వర్క్తో తీర్చిదిద్దారు. అదే రంగు బ్రొకెడ్ బ్లౌజ్ను, చాకోలెట్ రంగు నెట్ వోణీ జత చేశారు. 3- ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది వంగపండు రంగు లెహెంగా వోణీ! బెనారస్ నెట్ లెహెంగాపై జర్దోసి, పిస్తావోవర్క్ చేశారు. ఎరుపు రంగు నెట్ వోణీని, వెల్వెట్, గోల్డ్ టిష్యూ కాంబినేషన్ గల బ్లౌజ్ను జత చేశారు. 4- పసుపు రంగు బెనారస్ లెహంగాపైన వీవింగ్, ప్యారెట్ డిజైన్తో జర్దోసి, వైట్స్టోన్ వర్క్ చేశారు. గులాబీ రంగు నెట్ ఓణీపై గోల్డెన్ స్టోన్స్.. లంగాకు మ్యాచ్ అయ్యేలా యాంటిక్ బెనారస్ టిష్యూ బార్డర్తో అదనపు హంగులను అద్దారు. 5- గులాబీ రంగు లెహెంగాపై పువ్వులు లతలు వచ్చేలా జర్దోసీ వర్క్, అంచుకు యాంటిక్ స్టోన్ వర్క్ చేశారు. ఈ పరికిణీకి ఆకుపచ్చని వోణీ, బ్రొకేడ్ బ్లౌజ్ను జత చేయడంతో పండగ కళ వచ్చింది. కాంబినేషన్ ముఖ్యం ముందుగా ఫ్యాబ్రిక్, కాంబినేషన్ చూసుకోవాలి. లెహంగా వోణీల డిజైన్ సాధారణంగా ఉంటే జాకెట్టు పై వర్క్ ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. లావుగా ఉన్నవారు సింపుల్ ఉండే లంగా వోణీలను ఎంచుకోవాలి. సన్నగా ఉన్నవారు లెహెంగా కింది భాగంలో ‘క్యాన్క్యాన్’ మెటీరియల్ను వేయాలి. దీనివల్ల కుచ్చిళ్లు పరుచుకున్నట్లు కనిపిస్తాయి. -
కృతజ్ఞత ఉండాలి!
మానవుడి మనస్సు చాలా సంకుచితమైనది, చంచలమైనది. ఎంత ఉన్నా ఇంకా ఏదో ఒకటి లేదన్న వెలితి అతడి మనస్సు నిండా కెలుకుతూనే ఉంటుంది. ఒక్కసారి మనం సమాజం వైపు దృష్టి సారిస్తే, కళ్లు లేనివాళ్లు, కాళ్లు లేనివాళ్లు రకరకాల అంగవైకల్యం ఉన్నవారు, మానసిక స్థితి బాగా లేనివాళ్లు, కనీసం ఒక్కపూట తిండికీ నోచుకోనివాళ్లు, ఒంటినిండా బట్టలేనివాళ్లు, తలదాచుకోవడానికి గూడులేనివాళ్లు ఎంత దీనస్థితిలో బతుకులీడుస్తున్నారో మనకు అర్థమవుతుంది. వారితో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది. బుద్ధిజీవులమైన మనం ఈ విషయాలను గురించి ఆలోచించగలిగితే ఇలాంటి వారిపట్ల మన బాధ్యత ఏమిటో కూడా తెలుస్తుంది. అప్పుడే ప్రేమ, దయ, త్యాగం, పరోపకారం వంటి సద్గుణాల విలువ బాగా అర్థమవుతుంది. నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనకంటే పై వారిని, ప్రాపంచిక విషయాల్లో మనకంటే కిందిస్థాయిని చూడాలన్న దైవప్రవక్త ప్రవచనాన్ని గమనంలో ఉంచుకుంటే ఇహలోక జీవితం ప్రశాతంగా, పరలోక జీవితం ఫలవంతంగా సాగుతుంది. - యండి. ఉస్మాన్ఖాన్ -
జాగ్రత్తలతో దీపావళి
దీపాలు, మతాబుల కాంతుల్లో వెలిగిపోయే దీపావళి చిన్నాపెద్దకు సంబరాన్ని కలిగిస్తుంది. ఇంటిని వెలుగులు విరజిమ్మేలా అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాదు సురక్షితంగా పండగ జరుపుకోవడంలోనూ అత్యంత జాగ్రత్త వహించాలి. అప్పుడే పండగ ఆనందం అంబరాన్నంటుతుంది. అందుకోసమే ఈ చిన్ని జాగ్రత్తల చిట్టా... టపాసులను ఎక్కువగా ఇంట్లో స్టోర్ చేయకూడదు. వాటిని కాల్చేటప్పుడు ఆరుబయట, ఖాళీ ప్రదేశాల్లోనే కాల్చాలి. ఆ సమయంలో నీళ్ల బక్కెట్టు ఓ పక్కగా ఉంచితే, కాల్చేసిన టపాసులను, ఇనుప చువ్వలను ఆ నీటిలో వేయవచ్చు నూనె దీపాలు ఎక్కువశాతం ఇంటిలోపల ఉంచకూడదు. దీపాలు ఇంట్లో ఉంచితే పొరపాటున కర్టెన్లు, పేపర్లు, ధరించిన దుస్తులకు అవి అంటుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే దీపాల దగ్గరగా తిరిగేటప్పుడు ఏమరుపాటుగా ఉండకూడదు మంటలను ఆర్పే సాధనాలను అందుబాటులో ఉంచుకోవాలి మెట్లు, దారికి అడ్డంగా ఉండే చోట దీపాలు వెలిగించకూడదు. అప్పుడు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే త్వరగా బయటపడే వీలుంటుంది లైట్ల అమరిక కోసం ఎలక్ట్రిక్ సాకెట్లో ఎక్కువ హోల్డర్స్, కరెంట్ వైర్లు ఉపయోగించరాదు. ఒక క్రమపద్ధతిలో లైట్లను అమర్చుకుంటే దీపాల వెలుగులు ఆకట్టుకుంటాయి ఇంటి లోగిలిలోనూ, వాకిట్లోనూ దారికి అడ్డంగా వాహనాలను ఉంచరాదు. పొరపాటున మంటలు ఎగిసే సమయంలో పరిగెత్తడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి పొరపాటున కాలితే, ఆ గాయాలపై నెయ్యి, పౌడర్ వంటివి వేయకూడదు. ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను అందుబాటులో ఉంచుకోవాలి అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రి అవసరం వస్తే, దగ్గరలో ఉన్న హాస్పిటల్ నెంబర్లు కంటికి కనిపించేలా గోడపై లేదా పెద్ద షీట్పై రాసి ఉంచాలి. -
అమరిక : తారలు తలదించి చూడాలి!
ఇంటింటా దీపపు కాంతులతో ధగధగాయమానంగా శోభిల్లాలని కోరుకునే పండుగ దీపావళి. ఇందుకోసం ప్రమిదలను తెచ్చి ఇంటిని అందంగా అలంకరిస్తాం. ఈసారి పండుగను సాధారణ ప్రమిదలతో కాకుండా... రంగురంగుల కాంతులను వెదజల్లే ప్రమిదలతో పండుగ చేసుకుందాం... ప్రమిదలను తెచ్చి, వాటిని అందంగా అలంకరిద్దాం... మన శరీర అలంకరణతో పోటీ పడేలా చేద్దాం. ఇక్కడ మచ్చుకి కొన్ని దీపాల నమూనాలు ఇస్తున్నాం. వీటిని చూసి మీరు అలాగే చేయక్కర్లేదు. మీలోని సృజనకు పదును పెట్టండి. కొత్తకొత్త దీపాలతో దీపావళి పండుగను కళ్లు మిరుమిట్లు గొలిపేలా జరుపుకోండి. మీ దీపాలను చూసి చిచ్చుబుడ్లు ముఖం చిన్నబుచ్చుకోవాలి. తారాజువ్వలు తలదించి చూడాలి. కాకర పువ్వొత్తులు కారాలు మిరియాలు నూరాలి. ఇక ఆలస్యం దేనికి... పండగ వచ్చేస్తోంది!! -
కాంతితో ఇంటర్నెట్
* ఎల్ఈడీ బల్బులతో సమాచారాన్ని ప్రసారం చేసే ‘లైఫై’ టెక్నాలజీని అభివృద్ధి చేసిన చైనా శాస్త్రవేత్తలు * వ్యయం తక్కువ.. భద్రత ఎక్కువ * కేవలం ఒక వాట్ బల్బుతో నాలుగు కంప్యూటర్లకు నెట్ బీజింగ్: కేవలం కాంతి (లైట్)తో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేయగల సరికొత్త సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘వైఫై’ను పోలిన ఈ టెక్నాలజీని ‘లైఫై’గా పిలుస్తున్నారు. వైఫైలో రేడియో తరంగాలను ఉపయోగిస్తే.. ఈ ‘లైఫై’లో కేవలం కాంతిని మాత్రమే వినియోగిస్తారు. వైఫైలో వాడే పరికరాల ధర ఎక్కువ, వాటి విద్యుత్ వినియోగమూ ఎక్కువే. అదే ‘లైఫై’కి అయ్యే వ్యయం, విద్యుత్ వినియోగం చాలా తక్కువ. ‘లైఫై’ టెక్నాలజీ ద్వారా కేవలం ఒక వాట్ సామర్థ్యమున్న చిన్న ఎల్ఈడీ బల్బుతో ఏకంగా సెకనుకు 150 మెగాబిట్స్ వేగంతో నాలుగు కంప్యూటర్లకు ఇంటర్నెట్ను అందించవచ్చు. ఇందులో సమాచార భద్రత, ఇతర సౌకర్యాలూ ఎక్కువే. దీనితో నెట్ను అందుకోవడమే కాదు.. ప్రింటర్లు, స్కానర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి మధ్యా సమాచార మార్పిడి చేయవచ్చు.దీనిలో రేడియో తరంగాల వాడకం లేకపోవడంతో.. విమానాల్లోనూ, రేడియేషన్ ఉండే సున్నిత ప్రదేశాల్లోనూ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. అయితే, ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులూ ఉన్నాయి. కేవలం లైట్ ఆపేస్తే ఇంటర్నెట్ నిలిచిపోతుంది. గోడలు అడ్డుగా ఉండడం, ఎక్కువ దూరం లో ఉంటే పనిచేయకపోవడం దీనిలో లోపాలు. ‘లైఫై’ టెక్నాలజీని తొలుత బ్రిట న్కు చెందిన ఎడిన్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్త హరాల్డ్ హాస్ ప్రతిపాదించారు. దానిని తాజాగా చైనాకు చెందిన షాంఘై ఫుడాన్ వర్సిటీ ప్రొఫెసర్ చి నాన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే, ఈ ‘లైఫై’ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ప్రొఫెసర్ చి నాన్ చెప్పారు. చైనాలోని షాంఘైలో వచ్చే నెల 5న జరగనున్న అంతర్జాతీయ ఇండస్ట్రీ ఫెయిర్లో పది ‘లైఫై’ కిట్లను ప్రదర్శనకు పెట్టనున్నట్లు తెలిపారు. -
ఆజన్మం: చిందిపోయే కాంతి
స్నానం ఆలస్యం కావడానికి కారణాన్ని ఒక్కోసారి ఏం చెప్పీ నమ్మించలేం; వినేవాళ్లు మరీ చిన్నపిల్లలైపోతే తప్ప. అలా ఎగిరిపడిన నీళ్లు గుండ్రాలు గుండ్రాలుగా కిందికి జారుతూవుంటాయా! మూలన ఉన్న ఆరెంజ్ కలర్ జీరో బల్బ్ చూస్తుండగా నారింజ అవుతుంది; అది నిజమేనా అని తల కాస్త పెకైత్తగానే పొప్పడికాయ అవుతుంది; మళ్లీ తల వంచితే అరటిపండై కూర్చుంటుంది. అదే వరుసలో బిరడా కాగలుగుతుంది; ఇదేంటో చిత్రం అనుకునేంతలో ఈ ముడి అవతలి ముడిని తాకి ఎనిమిదై వయ్యారాలు పోతుంది; పాతరాతి యుగపు పనిముట్టు అవుతుంది; అంతలోనే నిండు చంద్రుడిని తలపిస్తుంది. నీడల నిష్పత్తులు మారినకొద్దీ ముద్దగా, ముద్దుగా, అప్పుడే ద్రవంలాగా, ద్రవపు కాంతిలాగా రూపాంతరం చెందుతూవుంటుంది. ఒక నీడ కూడా అంత అందంగా ఉండగలదని కొత్తగా నిరూపితమవుతూ ఉంటుంది. వెలుగంతా కింద చిందిపోయినట్టుగా, నీటి బిందువులుగా కాంతి విడిపోతుంది. పైనొక్కటే; కింద అనేకంగా దర్శనమిస్తుంది. చేపపిల్లలాగా ఈ బుడగ కాంతిని మోసుకుంటూ మరో కాంతిలో ఐక్యమైపోతుంది. నీళ్లన్నీ చుక్కలేకుండా కిందికి జారిపోయాక, మళ్లీ ఆ ఒక్కటే మిగిలిపోతుంది. ఇదొక వెలుగు నీడల క్రీడ! మనసులోకి జొరబడిపోయిన పెద్దరికాన్ని నీటిబుడగలు ఇట్టే చిట్లిస్తూవుంటాయి. మోకాళ్ల నొప్పుల జాడల్లేని చిన్నతనంలోకి లాక్కెళ్తూవుంటాయి. ఇది కదా సృజన, అనుకుంటాను పొద్దున. రాత్రెప్పుడో, విద్యుద్దీపాల వెలుగును ఆపేసి, నిద్రకోసం చీకటిని బతిమాలుతున్నప్పుడు, ‘బయ్యమైతుంది నానా,’ అని మా చిన్నోడు నాలోకి ఒదిగిపోతాడు. కనిపించే వెలుగులో కనబడనిది చూడటంలో ఏముంది? ఏమీలేని చీకటిలో ఏదో ఒకటి ఊహించడం కదా అసలైన సృజన! భయపడటం కూడా అంత అగౌరవ పరిచే అంశం ఏమీ కాదు సుమా! - పూడూరి రాజిరెడ్డి అరేయ్.. తురేయ్.. చిన్నప్పుడు నిజంగానే చిన్నగా ఉండివుంటాంగదా! ఆ వయసులోనే, దోస్తుల్ని ‘అరేయ్’ అని పిలుచుకునే ఆప్షన్ ఒకటి ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది! స్నేహం కోసం ఒక మర్యాద సరిహద్దును చెరిపేసుకోవాలన్న నియమాన్ని అప్పుడే ఎలా గ్రహించివుంటాం? మా రమేశ్ గాడు, హరీశ్ గాడు పరిచయమైన కొత్తలో నాతో మామూలుగా మాట్లాడుతూనే, ఎవరితోనైనా నా గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ ‘వీడు’ అనేవాళ్లు. ‘‘చందానగర్ల మన రాజిగాడు కనవడ్డడ్రా.’’ ‘నన్ను అరేయ్ అనగలిగేంత గొప్పోళ్లారా మీరు’ అని, ఆ సంబోధనను ఒప్పుకోలేక, నిరాకరించలేక సతమతమైమైమై... ఇక చివరకు, ‘నేను కూడా నిన్ను అంటాన్రోయ్’ అని చాటి చెప్పాలనుకుని, ముందు వినీ వినబడనట్టుగా ‘(అరే)య్’ అని, తర్వాత (అ)రేయ్ అని, అటుపై అరేయ్ దాకా వాళ్ల చెవుల్ని ట్యూన్ చేస్తూ వచ్చాను. పెద్దిరాజుగాడితో నాకు పరిచయం తక్కువ. అయినా వాడితో మాట్లాడిన ఒకట్రెండు సార్లకే మేము ‘అరేయ్’ ‘అరేయ్’ అని పిలుచుకోవడం మొదలుపెట్టాం. అలాగే కృష్ణారావుగాడు. ఇంకొందరుంటారు. వాళ్లతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంటుంది. చెప్పాలంటే పైవాళ్లతోకంటే ఒక లక్షరెట్లు ఎక్కువ పరిచయం ఉంటుంది, అయినా ఆ స్నేహం రేయ్లోకి పురోగమించదు; ఒకే వయసు అనే ప్రాథమిక అర్హత ఉన్నప్పటికీ. ఏ సంకోచం ఇక్కడ పనిచేస్తుంది? మర్యాద ముసుగును తొలగించి పారేసే ఏ కీలకం అక్కడ పనిచేసివుంటుంది? బహుశా, ఎవరో ఒకరు ఆ హద్దును తొలిసారి దాటడానికి అమర్యాదకర సాహసం చేయాలేమో! అసలు అలాంటి ప్రయత్నం కూడా జరిగినట్టు తెలియనంతగా గుట్టుచప్పుడు కాకుండా గుండె కోటలోకి దిగబడాలేమో!