-
నా బాయ్ఫ్రెండ్ మోసం చేశాడు!
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్. తమిళంలో తిరునాళ్ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్ టిక్ టిక్, సంఘతమిళన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఒకరోజు తన బాయ్ఫ్రెండ్ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్ఫ్రెండ్ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్ రేసర్ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. -
నీలం డ్రస్లో మెరిసిన ‘నివేదా పేతురాజ్’ (ఫొటోలు)
-
ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్
ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు అంటే దాదాపు థ్రిల్లర్ కథలే ఉంటాయి. ఇప్పుడు అదే జానర్లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ 'పరువు'. రీసెంట్గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది కదా! అది ఈ సిరీస్ కోసమే. ఇప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?)హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'పరువు'. నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్గా చేసింది. సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!) -
పోలీసులతో నివేదా పేతురాజ్ వాగ్వాదం.. అసలు విషయం ఇదన్నమాట!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పరిచయం అక్కర్లేదు.చెన్నైకి చెందిన ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలోనూ మెరిసింది. అయితే ఇటీవల నివేదాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలైంది. కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారితీసింది. ఏకంగా పోలీసులతోనే వాగ్వావాదానికి దిగింది. ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. దీంతో అసలేం జరిగిందంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు. కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేయగా.. మరికొందరు ఇంకా ఏదో జరిగి ఉంటుందని ఎవరికీ వారు ఊహించేసుకున్నారు.తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. ఇదంతా మూవీ ప్రమోషన్లలో భాగమేనని తేలిపోయింది. తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేసింది. పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేదా పేతురాజ్ లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాను జూన్ 14నుంచి జీ5 స్ట్రీమింగ్ చేయనున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తేలడంతో నెటిజన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. Here you go! Not caught in the act, but really one for our latest original #PARUVUonZee5@GoldBoxEnt @sushkonidela @NagaBabuOffl #vishnulaggishetty @saranyapotla @Nivetha_Tweets @nareshagastya @patnaikpraneeta #AmitTiwari @pavansadineni @siddharth_vox @Rajvadlapati pic.twitter.com/z0ILXhKE7w— ZEE5 Telugu (@ZEE5Telugu) May 31, 2024 -
హీరోయిన్ డిక్కీలో ఏముంది
-
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
నివేతా పేతురాజ్.. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీ 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి మూవీతో ఇక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆపై విశ్వక్ సేన్తో కలిసి నటించిన పాగల్, దాస్ కా దమ్కీ చిత్రాలతో తన మార్క్ నటనతో ఫిదా చేసింది. అయితే, సుమారు రెండేళ్లుగా ఆమె నటించిన సినిమా ఏదీ కూడా తెరపై కనిపించలేదు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నివేతా పేతురాజ్ కారులో వెళ్తున్న సమయంలో చెకింగ్ పేరుతో పోలీసులు ఆపుతారు. కారు డిక్కీ ఓపెన్ చేయమని ఆమెను పోలీసులు కోరడంతో అందుకు ఆమె నిరాకరిస్తుంది. ఎందుకు ఓపెన్ చేయాలని చిన్నపాటి గొడవకు దిగుతుంది. పేపర్లు అన్నీ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి అంటూ వారిస్తుంది. 'కారు డిక్కి మాత్రం ఓపెన్ చేయను, అది నా పరువుకు సంబంధించిన అంశం. మీకు చెప్పినా అర్థం కాదు. నేను డిక్కీ మాత్రం ఓపెన్ చేయను అంటూ.. పోలీసులతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో వీడియో తీస్తున్న పోలీసును ఆమె అడ్డగిస్తుంది. ఈ వివాధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన ప్రేక్షకులు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఏదైనా సినిమా ప్రమోషన్ అయి ఉండవచ్చని చెబుతున్నారు. అదీ కాకుంటే తన నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ఒక సీన్ అయి ఉంటుందని ఆమె తెలుపుతున్నారు. పోలీసులుగా ఉన్న వారిలో ఒకరు సాధారణ చెప్పులు ధరించడాన్ని నెటిజన్లు గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తప్పకుండా షూస్ ధరిస్తారని తెలిసిందే. దీంతో ఇదంతా సినిమా స్టంట్ అని నెటిజన్లు చెబుతున్నారు. ఇంత చక్కగా అమ్మాయి నటిస్తుంటే ప్రమోషన్స్ ఎందుకు..? అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొత్త సినిమా అప్డేట్?నివేదా పేతురాజ్..మొన్నటి వరకు అటు తమిళ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ వరుస సినిమాలతో అలరించింది. టాలీవుడ్లో చివరగా ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ(2023)’ చిత్రంలో నటించింది. ఈ వెంటనే ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘కాలా’ కూడా రిలీజైంది. ప్రస్తుతం అటు తమిళ్లో కానీ ఇటు తెలుగు కానీ నివేదాకు సినిమాలు లేవు. దీంతో తన కొత్త సినిమా ప్రకటన అందరికి రీచ్ అవ్వాలనే ఇలాంటి ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. Actress #NivethaPethuraj argued and hesitated to open backside trunk of the car and scolded the recorded person...Her expressions made Policemen to doubt on herself...#Tollywood #NivethaPethuraj #Police pic.twitter.com/49W6DNPcdL— Anchor_Karthik (@Karthikkkk_7) May 29, 2024 -
చీరకట్టులో కేజీఎఫ్ భామ.. శోభిత రానా బోల్డ్ లుక్స్!
దుబాయ్లో శోభిత రానా హోయలు... ట్విన్ టవర్స్ వద్ద యషిక ఆనంద్ లుక్స్ వైరల్.. శారీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి స్మైలీ లుక్స్... అలాంటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోజులు.. ఆలయంలో నివేదా పేతురాజ్ పూజలు.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) -
టాలీవుడ్ హీరోయిన్కు సీఎం కుమారుడు ఖరీదైన గిఫ్ట్.. వైరలవుతోన్న ట్వీట్!
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంది. గతేడాది యంగ్ విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్గా అలరించిన భామ.. ఇప్పుడు బాలీవుడ్లోనూ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నటన, మోడలింగ్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. అంతేకాదు ఇటీవలే మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేసింది. మీరు ఏదైనా రాసేముందు దయచేసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి వాటితో తమ కుటుంబం ఒత్తిడిలో ఉందని.. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. నివేదా పేతురాజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే దీని గురించి మాట్లాడే బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించా. వాటి వల్ల కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత రాస్తూ.. 'నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా దుబాయ్లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను అడగలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదని' రాసుకొచ్చింది. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే నా అభిరుచి. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించా. అంతేకాదు.. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించని ఇప్పటికీ విశ్వసిస్తున్నందున చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక కుటుంబం ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరుతున్నా. అలాగే మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని మీడియా మిత్రులకు అభ్యర్థిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. కాగా.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life. My family and I have… — Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024 -
కప్ కొట్టిన తెలుగు హీరోయిన్.. ఈమెలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
హీరోయిన్లలో యాక్టింగ్ బాగా చేయడం సహజమే. కానీ అంతకు మించిన టాలెంట్స్ కూడా కొందరిలో ఉంటాయి. అవి టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. అలా తెలుగు హీరోయిన్ నివేతా పేతురాజ్లోని మరో ప్రతిభ ఇప్పుడు బయటపడింది. ఏకంగా కప్ కొట్టేయడంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఈమెలో ఏయేం టాలెంట్స్ ఉన్నాయి? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్.. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం తదితర సినిమాలు చేసింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈమె ఏం మూవీస్ చేస్తుందనేది తెలీదు. నటన-మోడలింగ్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్ షట్లర్లా మారిపోయింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. అలానే 'తర్వాత ఏంటి?' అనే ఓ క్యాప్షన్ పెట్టింది. అంటే మళ్లీ ఏదో పోటీలో టాలెంట్ చూపించబోతుందనమాట. (ఇదీ చదవండి: బిజినెస్ మొదలుపెట్టిన నటి సన్నీ లియోన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
కార్ రేసింగ్ గురించి నటి నివేతా పేతురాజ్
-
దాస్ కా ధమ్కీ వల్ల మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీ
-
దాస్ కా ధమ్కీ సీక్వెల్ వచ్చేస్తోంది...హీరో,హీరోయిన్లు ఎవరంటే?
-
విశ్వక్ సేన్ కి ధమ్కీ ఇచ్చిన నివేత
-
ముంబైలో ఇల్లు కొన్న 'దాస్ కా ధమ్కీ' బ్యూటీ నివేదా
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఇక రీసెంట్గా దాస్ కా ధమ్కీ సినిమాలో హీరోయిన్గా అలరించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్లోనూ నటించేందుకు సిద్ధమైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి ఆమెకు ఆఫర్స్ వచ్చినట్లు ఇటీవల దాస్ కా ధమ్కీ మూవీ సక్సెస్ మీట్లో తెలిపింది. దీంతో ఆమె త్వరలోనే బాలీవుడ్కు మకాం మార్చనుంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్లో భాగంగా నివేదా ముంబై ఓ ఇల్లు కొనుగోలు చేసిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దాస్ కా ధమ్కీ సక్సెస్ మీట్లో పాల్గొన్న నివేదా తాజాగా ముంబైలో తాను ఇల్లు కొన్నట్టు చెప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పలు బిజినెస్తో బిజీగా ఉన్నాను. అందుకే సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. వెబ్ సిరీస్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టి-సిరీస్ బ్యానర్లో ఓ సినిమాకు కమిట్ అయ్యాను. ఈ క్రమంలో ముంబైలో ఇల్లు కొన్నా. త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నా. హైదరాబాద్లో ఇల్లు కొనాలని అనుకొన్నాను. కానీ కుదర్లేదు. ముంబైలో ఇల్లు కొన్నాను’ అని తెలిపింది. -
‘దాస్ కా ధమ్కీ’ మూవీ రివ్యూ
టైటిల్: దాస్ కా ధమ్కీ నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, రోహిణి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మాత: విశ్వక్ సేన్ దర్శకత్వం: విశ్వక్ సేన్ సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు విడుదల తేది: మార్చి 22, 2023 టాలీవుడ్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్నుమా దాస్లో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ పడలేదు. మాస్ ఇమేజ్ని పక్కన పెట్టి నటించిన పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి తనకు అచ్చొచ్చిన మాస్ జోనర్ని ఎంచుకున్నాడు. ఆయన హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ‘మాస్ కా ధమ్కీ’ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘మాస్ కా ధమ్కీ’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) ఓ అనాథ. స్నేహితులు ఆది(హైపర్ ఆది), మహేశ్(రంగస్థలం మహేశ్)లతో కలిసి ఉంటూ.. ఓ స్టార్ హోటల్లో వెయిటర్గా పని చేస్తుంటాడు. అక్కడికి కస్టమర్గా వచ్చిన కీర్తి(నివేదా పేతురాజ్)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి కోటీశ్వరుడిలాగా నటిస్తాడు. కట్ చేస్తే.. అచ్చం కృష్ణదాస్ లాగే ఉండే సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) ఎస్సార్ ఫార్మా కంపెనీ స్థాపించి, క్యాన్సర్ని పూర్తిగా తగ్గించే డ్రగ్ కనిపెట్టడం కోసం తన బృందంతో కలిసి పోరాతుంటాడు. డ్రగ్ కోసం వ్యాపారవేత్త ధనుంజయ్(అజయ్)తో రూ. 10 వేల కోట్లు డీల్ కుదుర్చుకుంటాడు. ఓ కారణంగా సంజయ్ రుద్ర ప్లేస్లోకి కృష్ణదాస్ వస్తాడు. తన అన్న కొడుకు సంజయ్లా నటించమని స్వయంగా అతని బాబాయ్(రావు రమేశ్)కృష్ణదాస్ని తీసుకొస్తాడు. అతను ఎందుకు అలా చేశాడు? సంజయ్ ప్లేస్లోకి వచ్చాక కృష్ణదాస్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? డ్రగ్ కోసం సంజయ్ రుద్ర ఏం చేశాడు? అతని వేసిన ప్లాన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్లో ‘దాస్క్ కా ధమ్కీ’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమాకు కథ అందించింది బెజవాడ ప్రసన్న కుమార్. పాత కథలనే అటు ఇటు మార్చి దానికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి స్క్రీన్ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్కు బాగా అలవాటు. మొన్నటి బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ చిత్రంలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు మాస్క్ కా ధమ్కీలో కూడా అదే పని చేశాడు. తెలిసిన కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకరి ప్లేస్లోకి ఒకరు రావడం... చివర్లో వచ్చే ట్విస్టులు.. ఇవన్ని ‘ధమాకా’, ‘ఖిలాడీ’తో పాటు ఇంతకు ముందు వచ్చిన చాలా తెలుగు సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఇక లాజిక్స్ గురించి అసలే మాట్లాడొద్దు. కొన్ని ట్విస్టులకు కూడా ప్రేక్షకులు ఈజీగా పసిగడతారు. అలా అని సినిమా మొత్తం ఊహకందేలా రొటీన్గా సాగుతుందని చెప్పలేం. కొన్ని చోట్ల వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో కృష్ణదాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా సాగుతుంది. కీర్తితో ప్రేమాయణం రొటీన్గా ఉన్నప్పటికీ.. మధ్య మధ్యలో ఆది వేసే పంచులతో పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ను మాత్రం వరుస ట్విస్టులతో ప్లాన్ చేశారు. అయితే వాటిలో కొన్ని ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేయకుండా.. సహనానికి పరీక్షగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా ఊహించొచ్చు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొత్తదనం కోరుకోకుండా..కాస్త కామెడీగా ఉంటే చాలు అనుకునేవాళ్లకి ‘దాస్ కా ధమ్కీ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాతో నటన పరంగా విశ్వక్ సేన్ ఒక మొట్టు ఎక్కాడు. వెయిటర్ కృష్ణదాస్, డాక్టర్ సంజయ్ రుద్ర రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విశ్వక్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఒకవైపు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను వహిస్తూ.. ఇంత చక్కగా నటించిన విశ్వక్ సేన్ని అభినందించొచ్చు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. కీర్తి పాత్రకు నివేదా పేతురాజ్ న్యాయం చేసింది. సెకండాఫ్లో ఆమె ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సంజయ్ బాబాయ్గా రావు రమేశ్ తనదైన నటనతో మెప్పించాడు. హీరో స్నేహితులుగా ఆది, రంగస్థలం మహేశ్ల కామెడీ బాగుంది. ఒక తరుణ్ భాస్కర్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. మహేశ్, అతని మధ్య వచ్చే సీన్ బాగా పేలింది. రోహిణి, అజయ్, అక్షరా గౌడ, పృథ్విరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ మిరియాల సంగీతం అందించిన 'మావా బ్రో' తో పాటు మిగిలిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
దాస్ కా ధమ్కీ మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
బ్లాక్ శారీలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్ (ఫోటోలు)
-
‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ (ఫోటోలు)
-
కరీంనగర్ : అభిమానుల సమక్షంలో ‘దాస్ కా దమ్కీ’ ట్రైలర్ వేడుక (ఫోటోలు)
-
Das Ka Dhamki Movie Photos: విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ మూవీ స్టిల్స్
-
హీరోయిన్ నివేదా పేతురాజ్ గ్లామర్ ఫోటోలు
-
ఫార్ములా రేసింగ్ కారును ఆవిష్కరించిన సినీ నటి నివేదా (ఫొటోలు)
-
సినిమా ఆఫర్లు రాకపోతే ఉద్యోగం చేసుకుంటా: హీరోయిన్
Nivetha Pethuraj Comments On Heroine Career: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత బ్రోచేవారెవరురా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్' వంటి తదితర మూవీస్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల 'బ్లడీ మేరీ' చిత్రంతోనూ ఆకట్టుకుంది. నివేదాకు పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అయితే స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. హీరోయిన్ కన్నా నటిగా అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కథానాయికగా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి బౌండరీస్ పెట్టుకోలేదు. నటనకు ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేస్తాను. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా. అని తెలిపింది నివేదా పేతురాజ్. ఆమె నటించిన 'విరాట పర్వం' సినిమా జూలై 1న విడుదల కానుంది. చదవండి: సినిమాల్లోకి రాకముందు నటి నివేదా ఏం చేసేదో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంధురాలిగా నివేదా పేతురాజ్.. మేకింగ్ వీడియో వైరల్
Nivetha Pethuraj Bloody Mary Movie Making Video Released: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్' వంటి తదితర మూవీస్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం 'బ్లడీ మేరీ'. కార్తీకేయ, సవ్యసాచి ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో పూర్తి తరహా క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది 'బ్లడీ మేరీ'. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ అంధురాలిగా అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా 'బ్లడీ మేరీ' మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్ ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరిటీ దామరాజ్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఆ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమిళ బ్యూటీ..!
Nivetha Pethuraj In Chiranjeevi Mega 154 Movie Directed By Bobby: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. యంగ్ హీరోలకన్నా తనేమి తక్కువ కాదంటూ మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న చిరంజీవి మరో చిత్రం భోళా శంకర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక బాబీ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం ఒకటి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ఇందులో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అన్నదమ్ముల పాత్రల్లో చిరు, రవితేజ ? 'అన్నయ్య' మళ్లీ రిపీట్ ! మెగా 154వ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తున్నట్లు మహిళా దినోత్సవం రోజున మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో రవితేజకు జోడిగా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో చిరంజీవి, రవితేజ అన్నదమ్ముల పాత్రలో అలరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అన్నదమ్ముల రోల్స్లో కనిపించినట్లే. గతంలో అన్నయ్య చిత్రంలో చిరంజీవితో కలిసి రవితేజ నటించారు. చదవండి: సినిమా టికెట్ల రేట్ల సవరణ.. స్పందించిన చిరంజీవి