old women
-
హవ్వ.. అవ్వ
-
భలే చోరీ చేసినవ్ అవ్వ..
-
హంతకుడు ఎక్కడ..?
-
తిరుపతిలో వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడి కోసం గాలింపు
-
కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకులు
-
తగ్గేదేలే..జగనన్న పాటకు అవ్వ డాన్స్
-
మీ కళ్లు చల్లబడ్డాయా.. ముసలవ్వ ఎమోషనల్ వీడియో..
-
అవ్వ డప్పుకు అడుగు కదిపిన సీతక్క
-
90 ఏళ్ల వయసులోనూ “తగ్గేదే లే” అంటున్న బామ్మా
-
ఈ అవ్వ మాటలకు మంత్రి రజని ఫిదా
-
పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్ ఫిదా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా. చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాడు. తండ్రికి తగ్గట్లే పిల్లలు అన్నట్లుగా.. మహేశ్ కొడుకు, కూతురు కూడా సామాజిక సేవలో ముందుంటారు. ముఖ్యంగా సితార అయితే తన వయసుకు మించిన సహాయాన్ని అందిస్తూ.. అందరి మనసులు గెలుచుకుంటుంది. పెద్దలు అంటే ఆమెకు ఎనలేని గౌరవం. ధన, పేద అనే తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది. తాజాగా జరిగిన సంఘటననే దానికి ఉదాహారణ. అసలేం జరిగింది? తాజాగా సితార హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. చాలా మంది వృద్ధ మహిళలు ఆ బహుమతులు అందుకోవడానికి వచ్చారు. అయితే ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది. ఇది గమనించిన సితార.. వెంటనే స్టేజ్ పై నుంచి దిగొచ్చి.. ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. అనంతరం..అక్కడి వారందరితో ప్రేమగా మాట్లాడింది. సితార మంచి మనసుకు మురిసిపోయిన వృద్ధురాలు.. అపురూపంగా ఆమెను ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘తండ్రి లాగే సితారది కూడా మంచి మనసు’అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురి ప్రేమ❤️ చూడండి @urstrulyMahesh #Sitara ❤️ pic.twitter.com/VHSSNLlCfp — Nagendra (@mavillanagendra) October 1, 2023 -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇంకా తెల్లవెంట్రుక కూడా రాలేదట
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ఈమె పేరు అమంతినా దోస్ శాంటోస్ డువిర్జెమ్. ప్రస్తుతం ఈమె వయసు 123 ఏళ్లు. ఈమె 1900 జూన్ 22న జన్మించింది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొంది. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు ఈమేనని బ్రెజిల్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బ్రెజిల్లోని పరానా రాష్ట్రానికి చెందిన సెర్రాగాయాస్ పట్టణంలో ఈమె ఒంటరిగా తన కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటోంది. పెండలం దుంపల పిండితో తయారు చేసిన కేకు, ఉడికించిన గుడ్లు ఈమెకు ఇష్టమైన ఆహారం. శతాధిక వృద్ధురాలైనా ఇప్పటికీ ఈమెకు డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఇప్పటివరకు మందులు వాడాల్సిన అవసరం తనకు రాలేదని, కనీసం తలనొప్పి కూడా ఎరుగనని చెబుతోందీమె. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఈమె తల నెరవకపోవడం మరో విశేషం. ఈమె నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన స్థానిక అధికారులు వారం రోజుల ముందుగానే ఈమె పుట్టినరోజు పార్టీని ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అధికారులు ఈమెకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేశారు. అందువల్ల గిన్నిస్బుక్ ఈమెను గుర్తించలేదు. గిన్నిస్బుక్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం అత్యంత వృద్ధమహిళ వయసు ఈ ఏడాది మార్చి 4 నాటికి 116 ఏళ్లు. అమెరికాలో స్థిరపడిన ఆ స్పానిష్ మహిళ పేరు బ్రాన్యాస్ మోరేరా. అయితే, గిన్నిస్ అధికారులు గుర్తించినా, లేకున్నా అమంతినానే ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ అని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
కన్న తల్లినే కాదని గెంటేశారు !
-
నేను మళ్ళీ జగనన్నే గెలవాలని ప్రార్ధన చేస్తున్నా
-
జగన్ దేవుడు అంటూ ఫ్లెక్సీకి మొక్కుతున్న మహిళ
-
బామ్మ సాహసం.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: రైలు పట్టాలపై ఓ పెద్ద చెట్టు విరిగిపడింది. అంతలోనే ఆ పట్టాలపై రైలు వస్తోంది. మరికొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం జరిగేదే. కానీ.. ఓ బామ్మ ఎరుపు రంగు వస్త్రంతో దేవతలా వచ్చి ఆ రైలును ఆపేసింది. ఇదేదో సినిమాలో సీన్ కాదు. నిజంగా జరిగిన ఉదంతం. ఈ ఘటన మంగళూరు–పడీల్ జోకెట్ట మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందారలో మార్చి 21వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మార్చి 21న మధ్యాహ్నం 2.10 గంటలకు రైలు పట్టాలపై ఒక భారీ వృక్షం విరిగి పడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ రైలు వస్తోంది. దీన్ని గమనించిన 70 ఏళ్ల వృద్ధురాలు చంద్రావతి ఇంట్లోంచి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి రైలుకు ఎదురుగా వెళ్లి జెండాలా ఊపుతూ నిలబడింది. దీనిని పసిగట్టిన లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు చంద్రావతిని అభినందించారు. ‘ఏం చేయాలో పాలుపోలేదు’ ఈ ఘటనపై చంద్రావతి మాట్లాడుతూ ‘ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి బయట కూర్చొన్నాను. మా అక్క ఇంట్లోనే నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఇంటి ఎదురుగా ఉన్న పట్టాలపై పెద్ద చెట్టు విరిగిపడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి రైలు వెళుతుందనే విషయం గుర్తుకొచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరికైనా ఫోన్ చేసి చెబుదామని ఇంటి లోపలికి వెళ్లాను. అంతలోనే రైలు హారన్ వినిపించింది. వెంటనే ఇంట్లో ఉన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని పట్టాల వద్దకు పరుగు తీశాను. నాకు గుండె ఆపరేషన్ అయింది. అయినా లెక్కచేయలేదు. రైలు వస్తున్నప్పుడు పట్టాల పక్కన నిలబడి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఊపాను. వెంటనే రైలు నెమ్మదించి ఆగిపోయింది. సుమారు అరగంట పాటు పట్టాలపై రైలు ఆగింది. స్థానికుల సహకారంతో ఆ చెట్టును తొలగించారు’ అని చెప్పింది. చంద్రావతి చేసిన సాహస కార్యాన్ని ప్రజలంతా అభినందించారు. -
67 ఏళ్ల వయసులో అదరగొట్టిన బామ్మ.. శారీతో రోప్ సైక్లింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!
-
కొడుకు ఒడికి చేరిన తల్లి
కర్లపాలెం(బాపట్ల): ఊరు కాని ఊరు.. భాష రాక, తిరిగొచ్చే దారి తెలీక నాలుగేళ్ల క్రితం తప్పిపోయి ఓ మారుమూల రాష్ట్రంలో నరకయాతన అనుభవిస్తున్న 62ఏళ్ల వృద్ధురాలికి బాపట్లకు చెందిన ఓ వ్యక్తి జవాను ఆదుకున్నాడు. ఆమెను తన కుమారుడి దగ్గరకు చేర్చాడు. తెలంగాణలోని గద్వాల్ జిల్లా కుర్తిరవాళ్ గ్రామానికి చెందిన సోంబార్ నాగేశమ్మ 2018లో తన ఇంటి నుంచి అదృశ్యమై అసోంలోని చకోర్ జిల్లా చిల్చార్ సిటీకి చేరుకుంది. అక్కడి భాష రాక మానసిక వేదనతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. అయిన వారు లేక నాగేశమ్మ రోజురోజుకీ మానసికంగా కుంగిపోతోంది. ఇంతలో ఓ రోజు అక్కడే జవానుగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నక్కలవానిపాలెం గ్రామానికి చెందిన ఎన్. వెంకట నరేష్ తోటి జవాన్లతో కలిసి ఆ వృద్ధాశ్రమానికి ఈ నెల 21న వెళ్లాడు. అక్కడున్న వృద్ధ మహిళల మంచిచెడులు తెలుసుకుంటుండగా నాగేశమ్మ గురించి తెలిసింది. ఆమెను నరేష్ తెలుగులో పలకరించి ధైర్యం చెప్పాడు. ఆమె వివరాలు తెలుసుకుని తెలంగాణలోని ఓ న్యూస్ చానెల్ ప్రతినిధికి తెలియబర్చి వారిద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. వీడియో కాల్ ద్వారా తన తల్లిని గుర్తించిన ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు హుటాహుటిన అసోం వెళ్లి తన తల్లిని తీసుకుని వచ్చాడు. -
బామ్మ డాన్స్ వీడియో వైరల్
-
సోషల్ మీడియాను షేక్ చేసిన బామ్మ.. వీడియో చూస్తే విజిల్ పడాల్సిందే..
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా, ఈ వేడుకల్లో భక్తులు భారీ రేంజ్లో దహీ హండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టిన వారికి భారీ నజరానా సైతం ఉంటుంది. ఇక, దహీ హండీ వేడుకల్లో ఓ వృద్ధురాలు చేసిన ఫీట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఉట్టి కొట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. వీడియో ట్రెండింగ్లో నిలిచింది. అయితే, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారి దీపాన్ష్ కాబ్రా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కొందరు మహిళలు మానవ పిరమిడ్లో ఏర్పాడ్డారు. ఈ క్రమంలో మహిళలపైకి ఎక్కి ఓ వృద్ధురాలు దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను(ఉట్టి)ని తన తలతో బద్దలు కొట్టింది. అనంతరం ఎంతో సేఫ్గా కిందకు దిగింది. కాగా, ఈ వీడియోపై స్పందించిన దీపాన్ష్ కాబ్రా.. "ది ఇన్క్రెడిబుల్ దాదీ" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సునామీ సృష్టించింది. కొద్ది సమయంలోనే 1,87,000 కంటే ఎక్కువ వ్యూస్ను, దాదాపు 10,000 లైక్లను సాధించింది. వీడియో చూసిన నెటిజన్లు వృద్ధురాలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. The Incredible Dadi! pic.twitter.com/QiwPHeYYUx — Dipanshu Kabra (@ipskabra) August 20, 2022 ఇది కూడా చదవండి: గేదె ముందు యువతి కుంగ్ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
65ఏళ్లుగా ఒకే రూట్లో ఎయిర్హోస్టెస్గా..
ఒకే కంపెనీలో 20 ఏళ్లు పనిచేయడం కష్టం. ఎందుకంటే ప్రయివేటు ఉద్యోగాల్లో ఉద్యోగికి కోపం వచ్చినా, యజమానికి కోపం వచ్చినా పోయేది ఎంప్లాయ్ జాబే. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఒకచోట కాకుండా వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. కానీ, 65 ఏళ్లుగా ఒకే సంస్థలో, ఒకే రూట్లో సేవలందిస్తూ... అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్హోస్టెస్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిందో మహిళ. బోస్టన్లోని మసాచుసెట్స్కు చెందిన బెట్ నాష్కు ఇప్పుడు 86 ఏళ్లు. 1957లో అమెరికన్ ఎయిర్లైన్స్లో ఎయిర్హోస్టెస్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆరున్నర దశాబ్దాలుగా న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీ వయా బోస్టన్ రూట్లోనే సేవలందిస్తోంది. ప్రయాణికుల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించే బెట్... తరచుగా ఆ మార్గంలో ప్రయాణించే ఎంతోమందికి అభిమాన ఎయిర్హోస్టెస్గానూ మారిపోయింది. వేరే మార్గాన్ని ఎంచుకునే అవకాశమున్నా ఆమె ఆ రూట్లోనే పనిచేయడానికో కారణం ఉంది. అది ఆమె కొడుకు. వైకల్యంతో బాధపడుతున్న అతడికి తల్లి అవసరం ఎంతో ఉంది. ఇక ఆ రూట్ అయితే రాత్రికల్లా ఇంటికి చేరుకుని కొడుకును చూసుకునే సౌలభ్యం ఉంది. ఇన్నేళ్లుగా ఇటు ఉద్యోగాన్ని, అటు కొడుకు బాధ్యతలను అవిశ్రాంతంగా కొనసాగిస్తోంది. ఒకే కంపెనీలో 84ఏళ్లుగా సేవలందిస్తున్న వ్యక్తిగా ఇటీవలే వందేళ్ల వయసున్న బ్రెజిల్కు వ్యక్తి వాల్టేర్ ఆర్థ్మన్ రికార్డు సాధించాడు. -
ఆపరేషన్ చేసి కుట్లు మరిచారు
యశవంతపుర: వృద్ధ మహిళకు డాక్టర్ ఆపరేషన్ చేసి, కుట్లు వేయకుండా మరిచిపోయారు. ఈ సంఘటన దావణగెరెలో జరిగింది. దావణగెరె తాలూకా బుల్లాపురకు చెందిన అన్నపూర్ణమ్మ (65) కడుపునొప్పితో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. కానీ కోత కోసిన చోటకుట్లు వేయకుండా వదిలేశారు. ఆమె నొప్పితో బాధపడుతుండడంతో కొడుకు గమనించి వైద్యులను ప్రశ్నించగా ఏదో సాకు చెప్పారు. ఆపరేషన్ చేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకూ గాయం మానలేదని బాధితులు తెలిపారు. డాక్టర్లు అడిగినంత ఫీజులు చెల్లించామని చెప్పారు. చివరకు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. (చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు) -
చనిపోయిందనుకుని టెంట్ వేసి కూర్చొబెట్టారు...ఆ తర్వాత
తగరపువలస (భీమిలి): జీవీఎంసీ రెండో వార్డుకు చెందిన లక్కోజు అన్నపూర్ణ అనే 74 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం వృద్ధాప్యం కారణంగా ఇంటి వరండాలో పడిపోయి చనిపోయింది. దీంతో ఇంటి ముందు టెంట్ వేసి వారి సాంప్రదాయం ప్రకారం కూర్చొబెట్టారు. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. పగలంతా ఎండ తీవ్రంగా ఉండటంతో మధ్యాహ్నం 3.30 సమయంలో ఆమె భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు స్నానం చేయిస్తుండగా శరీరంలో కదలికలు కనిపించాయి. వెంటనే పల్స్మీటర్తో తనిఖీ చేయగా సాయంత్రం 4.30 గంటల వరకు ఆమె స్పందించింది. 70 నుంచి 90 వరకు పల్స్ రేట్ చూపించడంతో అప్పటి వరకు విషాదం అలుముకున్న ఆ ఇంట సంభ్రమాశ్చర్యాలు చోటుచేసుకున్నాయి. వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అనంతరం స్పూన్తో టీ తాగించగా గుటకలు వేసింది. ఆమె స్పందిస్తున్నందుకు సంతోషంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహన సిబ్బందికి ఫోన్ చేశారు. వారు సాయంత్రం 5 గంటలకు వచ్చి తనిఖీలు చేయగా చనిపోయినట్టు నిర్ధారించారు. అంతలోనే మళ్లీ వారింట విషాదం అలముకుంది. అనంతరం ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు. (చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?) -
సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఎర్రావారిపాళెం(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా బావుందని చెప్పారు. చదవండి: జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా.. ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ అవ్వను అడిగారు. తనకు చూపు తక్కువని ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
చింతకాయల కోసం వెళ్లి.. చిక్కుకుపోయి.. చివరికి..
పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): చింతకాయల కోసం ఓ వృద్ధురాలు అడవికి వెళ్లింది. దారి తప్పి 2 రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా వృద్ధురాలి ఆచూకీ కనిపెట్టి క్షేమంగా అప్పగించారు. బుక్కపట్నం మండలం కొత్తకోటలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. కొత్తకోటకు చెందిన రామన్న భార్య నరసమ్మ (60) ఈ నెల 22న గ్రామానికి సమీపంలోని అడవిలో ఉన్న తోపులో చింతకాయల కోసం వెళ్లింది. మధ్యాహ్నం వరకూ చింతకాయలు కోసుకొని ఇంటికి బయలు దేరింది. గ్రామానికి వచ్చే దారి తప్పి అడవిలోనే ఉండిపోయింది. రాత్రయినా తల్లి ఇంటికి రాకపోవడంతో కుమారుడు చంద్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించినా ఆచూకీ లభించలేదు. రెండు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో చంద్ర ఆదివారం బుక్కపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నరసింహుడు సిబ్బందితో కలిసి అడవికి వెళ్లి వృద్ధురాలి కోసం గాలించారు. వీరికీ ఆచూకీ లభించలేదు. దారి చూపిన సెల్ఫోన్ సిగ్నల్ అడవిలో దారి తప్పిన నరసమ్మ వద్ద సెల్ఫోన్ ఉందని తెలియడంతో ఎస్ఐ, సిబ్బంది సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కోసం ప్రయతి్నంచారు. ఫోన్ స్విచాఫ్లో ఉన్నా సిగ్నల్ ఆధారంగా కొత్తకోట అడవిలోని శీనప్ప కుంట దగ్గర వృద్ధురాలు ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని క్షేమంగా ఆమెను ఇంటికి చేర్చారు. వృద్ధురాలు అడవిలో 12 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఎస్ఐకి ఘన సన్మానం నరసమ్మ ఆచూకీ కనిపెట్టి క్షేమంగా బంధువులకు అప్పగించిన ఎస్ఐ నరసింహుడు, సిబ్బందిని గ్రామస్తులు ఘనంగా సన్మానించి పూలవర్షం కురిపించి ఊరేగించారు. కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, వైఎస్సార్సీపీ నాయకుడు కొత్తకోట కేశప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
బామ్మ నా మజాకా! గంగూబాయి పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ..
Age is just a number Prove This Dance Video: డ్యాన్సులకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. కొత్త పెళ్లికూతురు వరుడుని ఇంప్రస్చేసే ప్రయత్నంలో వివాహ వేడులకలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా "బుల్లెట్ బండి" పాటకు డ్యాన్స్ చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. అంతెందుకు చిన్న పిలల్లు దగ్గర నుంచి పెద్దల వరకు తమ నాట్య ప్రతిభతో అలరించిన వారెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ డ్యాన్స్ చేసింది. అందులో పెద్ద విశేషమేమిటి అనే కదా! వివరాల్లోకెళ్లే...74 ఏళ్ల బామ్మ గంగూబాయి కతియావాడి చిత్రంలోని ప్రసిద్ధ 'ధోలిడా' పాటకు చక్కగా డ్యాన్స్ చేసింది. ఎంత బాగా చేసిందంటే టీనేజర్ల కంటే కూడా చాలా బాగా ఆ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేసింది. పైగా డ్యాన్స్ చేయాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించింది కూడా. ఈ మేరకు ఆ డ్యాన్స్కి సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు బామ్మ డ్యాన్స్ చూసి ఫిదా అవ్వడమే కాక వావ్ బామ్మ అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఏనుగు ముందు ఎందుకలా పరిగెడుతున్నాడు..? Age is just a number and it is appropriately proven by this 74-year-old woman dancing on the famous 'Dholida' song from the film Gangubai Kathiawadi. #Gangubai #Dholida #Gujarat #AliaBhatt #NewsMo #ITVertical pic.twitter.com/EA5kQWUXIr — IndiaToday (@IndiaToday) March 24, 2022 -
నిద్రలోనే మహిళ సజీవ దహనం
సాక్షి,మెదక్ రూరల్: విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో మహిళ సజీవ దహనం కాగా తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పోలబోయిన నర్సింహులు, మంగమ్మ(35) దంపతులకు ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు రవి ఉన్నాడు. ఇద్దరూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి ఇంటికొచ్చి రోజూ మాదిరిగానే నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 1 గంటకు నిద్రలో ఉండగా విద్యుత్ షాక్ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమై తేరుకునే లోపే క్షణాల్లో పూరి గుడిసె మంటల్లో పూర్తిగా కాలిపోయింది. గుడిసెలో నిద్రిస్తున్న మంగమ్మ సజీవదహనం కాగా మృతురాలి భర్త నర్సింహులు, కుమారుడు రవికి 50 శాతానికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు మెదక్ డీఎస్పీ సైదులు, రూరల్ ఎస్ఐ మోహన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో నిత్యావసర వస్తువులు, బట్టలు, ధాన్యం, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సర్పంచ్ లక్ష్మితో కలిసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని పంచనామా నిర్వహించారు. -
నీరు కావాలని ఇంట్లోకి ప్రవేశించి.. టీవీ సౌండ్ పెంచి.. కత్తితో
అనంతపురం క్రైం: నగర శివారులోని ఒక ఇంటి వద్దకు అపరిచిత వ్యక్తి వెళ్లాడు. దాహం వేస్తోంది.. నీరివ్వండని ఇంట్లోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడపై కత్తి పెట్టి బంగారు గొలుసు లాక్కుని ఉడాయించాడు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్రెడ్డి తెలిపిన మేరకు... కక్కలపల్లి కాలనీ సమీపంలోని రజాక్ ఫంక్షన్ హాలు వెనుకవైపున ఎల్.రామసుబ్బారెడ్డి, జి.విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. రామసుబ్బారెడ్డి కనగానపల్లి మండలం కొండంపల్లిలో ఉపాధ్యాయుడిగాను, విజయ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల పాఠశాలలో హెచ్ఎంగాను విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు వీరిద్దరూ విధులకు వెళ్లిపోయారు. కుమార్తె దీక్షితను స్కూలుకు పంపించారు. ఇంట్లో రామసుబ్బారెడ్డి తల్లి ఎల్.నారాయణమ్మ (88 సంవత్సరాలు) ఉంది. ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎవరంటూ నారాయణమ్మ లోపలినుంచే ప్రశ్నించగా.. మీ అబ్బాయికి డబ్బు ఇవ్వాల్సి ఉందని అతడు సమాధానమిచ్చాడు. అయితే అబ్బాయికే ఫోన్ చేయి అంటూ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ఫోన్ తగల్లేదని చెప్పాడు. అయితే పై అంతస్తులో మా బంధువు ప్రశాంత్ ఉంటాడు అతడిని కలువు అని తెలిపింది. సరే అని బయటకు వచ్చి మొదటి ఫ్లోర్ వరకు మెట్లు ఎక్కి.. అక్కడ ఎవరూ లేరని కిందకు వచ్చాడు. మంచి నీరు కావాలని.. పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన అపరిచిత వ్యక్తి మంచి నీరు కావాలని కోరగా.. నారాయణమ్మ వాకర్ సాయంతో మెల్లగా తలుపు తీసింది. అలా లోనికి వెళ్లిన తర్వాత టీవీ ఆన్ చేయాలని కోరాడు. ఆ తర్వాత రిమోట్ తీసుకుని తనే సౌండ్ పెంచాడు. అలా ఆమాటా.. ఈమాటా మాట్లాడుతూ ఎవరైనా వస్తున్నారా? అని అప్పుడప్పుడు బయటకు వచ్చి తొంగి చూశాడు. అలా బయటకు వెళ్లి బైక్ బ్యాగ్లో ఉంచుకున్న కత్తిని తీసుకొచ్చి ఇంట్లోని వృద్ధురాలి నారాయణమ్మ మెడపై పెట్టి అరిస్తే చంపుతానని బెదిరించాడు. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పై పోర్షన్లో ఉన్న వివాహిత నాగలక్ష్మి కిందకు వచ్చింది. జరిగిన విషయం తెలుసుకుని రామసుబ్బారెడ్డి దంపతులకు సమాచారం అందించింది. రామసుబ్బారెడ్డి డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసుల అప్రమత్తం బంగారు గొలుసు దోపిడీ విషయం తెలియగానే డీఎస్పీ వీరరాఘవరెడ్డి జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల వారిని సెట్లో అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రం ప్రవేశమార్గాలు, ప్రధాన కూడళ్లలో వాహనాల తనీఖీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్, తదితర తనిఖీలు చేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. -
మానవత్వం చాటిన వైఎస్సార్ సీపీ నేత
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి): ఎన్నికల ప్రచారంలో ఓటు అభ్యర్థించేందుకు వెళ్లిన సమయంలో పూరి గుడిసెలో దయనీయ స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని చూసి చలించిన 15వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెస్లీ ఆమెకు గూడు కల్పించేందుకు శ్రీకారం చుట్టి తన మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారికి చేర్చి, జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా పాడుబడిన పూరి పాకలో వృద్ధురాలు బొమ్మిడి లక్ష్మీ నివసిస్తోంది. భర్త చనిపోగా బంధువులు పట్టించుకోవడం మానేశారు. దివ్యాంగురాలైన కుమార్తెతో కలిసి వృద్ధురాలికి వచ్చే పింఛను సొమ్ముతోనే జీవిస్తున్నారు. అవ్వతో కొబ్బరికాయ కొట్టించిన నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి ఇదిలా ఉండగా, ఇటీవల నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారానికి వచ్చిన కటికతల జాన్ వెస్లీ వృద్ధురాలిని ఓటు అడిగేందుకు వచ్చారు. ఆ సమయంలో శిథిలమైన పూరిపాకలో వర్షానికి తడిసిపోయి ఇంటి ముందు బురద, దుర్వాసనలో జీవిస్తుండటాన్ని గమనించి చలించిపోయారు. ఎన్నికల అనంతరం తాను గెలిచినా, ఓడినా వృద్ధురాలికి గూడు నిర్మిస్తానని సంకల్పించారు. అనంతరం కౌన్సిలర్గా గెలుపొందగా, గురువారం చైర్పర్సన్ జామి హైమావతితో కలిసి జాన్ వెస్లీ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పూరి గుడిసె స్థానంలో షెడ్డు నిర్మాణానికి వృద్ధురాలితోనే కొబ్బరికాయ కొట్టి కొత్త నిర్మాణం ప్రారంభించారు. రెండు రోజుల్లో నిర్మాణం పూర్తవుతుందని, ఇందుకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుందన్నారు. వృద్ధురాలి కుమార్తెకు దివ్యాంగ పింఛను మంజూరుకు కృషి చేస్తానన్నారు. -
వ్యాక్సిన్ వేస్తే.. ఉరేసుకుంటా.. చుక్కలు చూపించిన బామ్మ
-
వృద్ధురాలి బ్యాగ్లో 13 బుల్లెట్లు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ఒక వృద్ధురాలి బ్యాగ్లో 13 బుల్లెట్లు దొరికాయి. విశాఖ నగరానికి చెందిన త్రిపురాణి సుజాత (70) బ్యాగ్లో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్ను స్కానర్లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు. ఆమెను ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ విచారించారు. తమ పాత ఇంట్లో వస్తువులు సర్దానని, ఈ క్రమంలో పాత బ్యాగ్లో కొన్ని దుస్తులు పెట్టుకుని హైదరాబాద్ బయలుదేరానని ఆమె తెలిపారు. గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనవై ఉంటాయని చెప్పారు. బ్యాగ్లో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయట పడినప్పుడే చూశానని తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అవ్వనూ వదలని అంకుల్: కాళ్లు చేతులు కట్టేసి మరీ
లక్నో: 65 ఏళ్ల అవ్వపై ఓ అంకుల్ కక్ష సాధించాడు. ఆమె ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పినా వెళ్లకపోవడంతో ఆమెపై అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అని చూడకుండా ఆమెపై బలత్కారం చేశాడు. దారుణాతి దారుణంగా కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం కారం పొడి చల్లి క్రూరంగా ప్రవర్తించాడు. చివరకు ఆమెను కట్లు విప్పకుండానే వెళ్లిపోయాడు. దీంతో ఆమె అచేతనంగా పొలంలో పడి ఉండగా గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. మహోబా జిల్లా కబ్రాయ్ పట్టణంలో 65 ఏళ్ల వృద్ధురాలి నివసిస్తోంది. ఆమెకు సమీపంలోనే నివసించే భరత్ కుశ్వహ శనివారం అర్ధరాత్రి వృద్ధురాలిని బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జననాంగాల వద్ద తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం కారం పొడి చల్లి క్రూరంగా ప్రవర్తించాడు. అతడికి సేవాలాల్ అనే వ్యక్తి కూడా సహకరించాడు. ఆమె కనిపించకపోవడంతో ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు వెతుకుతుండగా పొలం వద్ద వృద్ధురాలు తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉంది. వెంటనే వారు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే తమ వివరాలు చెబితే చంపేస్తామని హెచ్చరించారని కూడా బాధితురాలు పోలీసులకు చెప్పింది. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు. వారిపై పలు కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపారు. అయితే తమ ఆనవాళ్లు లభించకుండా వృద్ధురాలిపై కారం చల్లినట్లు తెలుస్తోంది. వారు చేసిన గాయాలపై కారం చల్లడంతో ఆమె తీవ్రంగా అల్లాడిపోయింది. ఈ పరిస్థితిని పోలీసులకు వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాను ఉంటున్న ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లాలని ఒత్తిడి చేసినట్లు.. కొన్ని రోజుల కిందట దాడికి కూడా పాల్పడినట్లు తెలిపింది. వినకపోవడంతో ఇలా చేశారని తెలిసింది. -
‘వాసాలమర్రి’ ఆగవ్వకు అస్వస్థత
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఈనెల 22న నిర్వహించిన గ్రామసభ, సహపంక్తి భోజనాల్లో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్న ఆకుల ఆగవ్వ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. వాసాలమర్రిలో సభ ముగించుకొని ఇంటికి వెళ్లాక ఆగవ్వకు తీవ్ర కడుపునొప్పి రావడంతో భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కడుపునొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత గురువారం ఇంటికి పంపారు. ఎండ లో తిరగడంతో ఆమె అస్వస్థతకు గురైందని జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. కాగా, గ్రామంలో దాదాపు 20 మంది సైతం అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
60 ఎకరాలు పంచింది..బుక్కెడు బువ్వకు దిక్కు లేదు..!
మరిపెడ రూరల్: తన కష్టార్జితంతో నలుగురు కుమారులకు 60 ఎకరాలు సంపాదించి పెట్టినా.. తనకు వృద్ధాప్యంలో కనీసం బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లాతండాకు చెందిన భూక్య నాజీ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్ కలెక్టరేట్కు వచ్చిన ఆమె.. కలెక్టర్ వీపీ గౌతమ్, మంత్రి సత్యవతి రాథోడ్కు ఫిర్యాదు చేసింది. భూక్యతండాకు చెందిన నాజీ, సోమ్లా దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. భార్యాభర్తలు వంశపారంపర్యంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి కష్టపడి 60 ఎకరాలకు పెంచారు. నలుగురు కుమారులకు 13 ఎకరాల చొప్పున పంచి ఇచ్చారు. కుమార్తె వివాహం ఘనంగా జరిపించారు. కొడుకులకు పంచగా మిగిలిన 6 ఎకరాల భూమి నాజీ పేర ఉన్నది. నాజీ భర్త సోమ్లానాయక్ 2009లో మృతి చెందడంతో చిన్నకుమారుడు లక్ష్మాజీ వద్ద కొన్నేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో లక్ష్మాజీ కుమారుడు భూక్య చందులాల్ సాదాబైనామాలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తన తల్లి పేరున పట్టా చేయించుకున్నాడని, అప్పటి నుంచి కొడుకు కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని నాజీ వాపోయింది. తనను బయటకు గెంటేశారని, మిగతా కొడుకులు కూడా అన్నం పెట్టడం లేదని వాపోయింది. తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని మంత్రిని, కలెక్టర్ను వేడుకుంది. -
వృద్ధురాలి పై గురుమూర్తి అనే వ్యక్తి దాడి
-
కరోనాను జయించిన వందేళ్ల బామ్మ
హైదరాబాద్: కరోనాను జయించిన ఈ బామ్మ పేరు ఆండాళ్లమ్మ. సరూర్నగర్లోని వికాస్నగర్లో నివసిస్తున్న ఈమె శత వసంతాలు పూర్తి చేసుకుంది. కొద్దిగా వినికిడి సమస్య మినహా బీపీ, షుగర్ వంటి అనారోగ్య ఇబ్బందులు లేకపోవటం గమనార్హం. మహారాష్ట్రలో ఉండే మనుమరాలు, ఆమె భర్తకు కరోనా సోకటంతో హైదరాబాద్ తీసుకొచ్చి వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఇటీవల ఆండాళ్లమ్మ కోవిడ్ బారినపడ్డారు. అయితే కరోనా వచ్చిందని తెలిసినా ఆమె ఏమాత్రం భయపడలేదు. మనోనిబ్బరంతో డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడి కరోనాను జయించింది. ఆమె ధైర్యంగా ఉండటమే కాక, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇలా వందేళ్ల వయసులోనూ కరో నాను జయించిన బామ్మను చూసి చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. చదవండి: కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం? -
దగ్గరి బంధువులే దోపిడి చేశారు
సాక్షి, హైదరాబాద్(చాదర్ఘాట్): వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన కేసు మిస్టరీని చాదర్ఘాట్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీరే దారిలేక సొంత పెద్దమ్మ ఇంట్లోనే భర్తతో కలిసి యువతి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాలు.. అజంపురా ఉస్మాన్పురాలో నివసించే నికారున్నీసా (65) గురువారం ఇఫ్తార్ ముగించి భర్త బయటకు వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో బురఖాలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి ఆమెను కట్టేసి కత్తితో బెదిరించి బీరువాలోని రూ.2 లక్షల నగదు, బంగారు చైను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చాదర్ఘాట్ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. నికారున్నీసా సోదరి కుమార్తె అజంపురాకు చెందిన సాదివి ఇదాయాత్ (32), ఆమె భర్త అక్సర్ (43) లను నిందితులుగా గుర్తించారు. దంపతులకు అప్పులు ఎక్కువ కావటంతో దోపిడీకి పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని రూ.1.70 లక్షల నగదు, బంగారు చైను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. ( చదవండి: కూకట్పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు ) -
ముళ్లపొదల నుంచి ఏడుపులు.. అసలేం జరిగింది..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తొమ్మిది నెలలు మోసి, పాలిచ్చి పెంచిన తల్లి..కుమారులకు భారమైంది. రెండు కాళ్లు కదపలేక వృద్ధాప్యంతో బాధపడుతున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపకుండా ముళ్లపొదల్లో పారవేసి వదిలించుకున్నారు. మనసున్న కొందరు మహిళలు ఆ మార్గంలో వెళుతూ గమనించి ఆదుకోగా ప్రభుత్వ ఆస్పత్రిలో అనాథలా గడుపుతోంది. వివరాలు.. తిరుళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం కున్నమంజేరి గ్రామానికి చెందిన కొందరు మహిళలు సమీపంలోని చెరువుకు వెళుతుండగా మార్గమధ్యంలోని ముళ్లపొదల నుంచి మహిళ ఏడుపులు, మూలుగుల శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా రెండు కాళ్లు అచేతన స్థితిలో సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు పడిఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారంతా కలిసి వృద్ధురాలిని ముళ్లపొదల్లో నుంచి మోసుకొచ్చి పోలీసుల సమాచారం ఇచ్చారు. ఆమెను అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనలి చెక్కోడుకు చెందిన ఆ వృద్ధమహిళ కాంతిమతి పోలీసులకు తనగోడు చెప్పుకున్నారు. తనకు భర్త రాధాకృష్ణన్, రవి, శంకర్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుమారులిద్దరూ కూలీపనులకు వెళుతుంటారు. కుమారులు తనను సరిగా చూసుకునేవారు కాదు. తనను పోషించడం భారంగా భావించారు. చిన్నకుమారుడు శంకర్ మాయమాటలతో గురువారం రాత్రి మోటార్సైకిల్పై తీసుకొచ్చి జనసంచారం లేని ప్రాంతంలోని ముళ్లపొదల్లో తోసివేసి వెళ్లిపోయాడని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. వృద్ధురాలు కాంతిమతి కుటుంబం గురించి మరిన్ని వివరాలు చెప్పలేకపోవడంతో సమాచారం రాబట్టేందుకు పోలీసులు శ్రమపడుతున్నారు. పూర్తి సమాచారం రాబట్టిన తరువాత కుమారులపై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయిస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మనసు మార్చుకుని కుమారులు వస్తారు, అక్కున చేర్చుకుంటారని ఆ అమాయక తల్లి ఆశగా ఎదురుచూస్తోంది. చదవండి: దోషం పోతుందని బిడ్డను బలిచ్చిన తల్లి కేసులో కొత్త విషయాలు దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి -
తప్పయింది క్షమించమ్మా...
బొబ్బిలి: అనారోగ్యంతో నాటు వైద్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మృతి చెందిన వృద్ధుడి మృత దేహాన్ని ఆర్టీసీ సిబ్బంది ఈ నెల 22న బస్సు నుంచి కిందికి దించేయడంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సంఘటనపై పత్రికల్లో వచ్చిన వార్త చూపి ఆర్టీసీ అధికారులపై సీరియస్ అయ్యారు. బస్సుల్లో ప్రయాణించే వారిపై సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలన్నారు. చేసిన తప్పును తెలుసుకుని విజయనగరం, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్లు సాలూ రు బంగారమ్మ కాలనీలో దాసరి పైడయ్య ఇంటికి బుధవారం వెళ్లి అతని భార్య పోలమ్మను పరామర్శించారు. జరిగిన సంఘటనకు తాము పశ్చాత్తాప పడుతున్నామనీ, క్షమించమని ఆమెను కోరారు. చదవండి: ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు.. పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు -
కాల్మనీ ముఠా వేధింపులతో వృద్ధురాలి మృతి
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరపాలక సంస్థలో 30 ఏళ్ల పాటు పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన బండి చిననూకమ్మ అనే వృద్ధురాలు కాల్మనీ ముఠా వేధింపులు తాళలేక మనోవేదనతో సోమవారం రాత్రి మరణించింది. వివరాల్లోకి వెళితే.. వించిపేటకు చెందిన చిననూకమ్మ భర్త నాగరాజు ఆర్టీసీలో పనిచేసేవాడు. అతడు కాల్మనీ వ్యాపారి రాంపిల్ల పాపారావు నుంచి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. 2017లో అతడు మరణించగా.. భర్త చేసిన అప్పును తాను తీరుస్తానంటూ కాల్మనీ వ్యాపారికి చిననూకమ్మ ప్రామిసరీ నోటు రాసిచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి అప్పు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేసింది. అయితే, కాల్మనీ వ్యాపారి ఆ ప్రామిసరీ నోట్లను ఆమెకు తిరిగివ్వలేదు. ఇదిలావుంటే.. గత ఏడాది జూన్ 30వ తేదీన చిననూకమ్మ రిటైరైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కోసం ఆమె ఎదురు చూస్తుండగా.. కాల్మనీ వ్యాపారి రాంపిల్ల పాపారావు ముఠాకు చెందిన పలతోటి మరియరాజు (మంగళగిరి), జాదూ నాగేశ్వరి (గుణదల) రూ.14 లక్షలు చెల్లించాల్సిందిగా చిననూకమ్మకు లీగల్ నోటీసులు పంపించారు. ఆమెకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కూడా తీసుకోనివ్వకుండా ఆమె బ్యాంక్ అకౌంట్ను గతేడాది ఆగస్టులో ఫ్రీజ్ చేయించారు. అప్పటినుంచి మనోవేదనతో మంచం పట్టిన చిననూకమ్మ సరైన వైద్యం చేయించుకోలేని స్థితిలో సోమవారం ప్రభుత్వాస్పత్రిలో చేరగా.. అదే రోజు రాత్రి మృతి చెందింది. ఈ విషయమై చిననూకమ్మ కుమారుడు వడ్డాది బోన మాట్లాడుతూ.. కాల్మనీ ముఠా వేధింపుల వల్లే తన తల్లి మంచం పట్టి మరణించిందని వాపోయాడు. -
‘చేప చిక్కింది.. లక్షలు తెచ్చింది’
కోల్కతా : పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధురాలు అదృష్టం తలుపుతట్టడంతో రాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యారు. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం చక్పుల్ధుబి గ్రామంలో పుష్పాకర్ అనే వృద్ధురాలికి నదిలో భారీ చేప పట్టుబడటంతో దాన్ని ఆమె రూ 3 లక్షలకు విక్రయించారు. ఆమెకు 52 కిలోల చేప చిక్కడంతో స్ధానిక మార్కెట్లో దానికి కిలో 6200 రూపాయలు పలికింది. తనకు దక్కిన చేప తనకు జాక్పాట్లా మారిందని, ఈ చేపను హోల్సేల్ మార్కెట్లో రూ 3 లక్షలకు పైగా విక్రయించానని పుష్ప వెల్లడించారు. ఇంత పెద్ద చేపను తన జీవితంలో తాను ఎన్నడూ చూడలేదని, బెంగాలీలో ఈ చేపను భోలా ఫిష్గా పిలుస్తారని మహిళ పేర్కొన్నారు. నది నుంచి ఈ భారీ చేపను బయటకు తీసుకువచ్చి గ్రామంలోకి తీసుకురావడానికి వృద్ధురాలు చాలా కష్టపడ్డారని స్దానికులు తెలిపారు. వారి సాయంతోనే ఆమె భారీ చేపను ఫిష్ మార్కెట్కు తీసుకువెళ్లారు. నౌకను ఢీ కొనడంతో ఈ చేప మరణించిందని గ్రామస్తులు చెప్పారు. చేప డీకంపోజ్ కావడం మొదలవకుండా ఉంటే మరింత ధర పలికేదని స్ధానిక వ్యాపారులు తెలిపారు. బ్లబ్బర్గా పిలిచే ఈ చేప కొవ్వును అధిక ధరలకు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని వారు వెల్లడించారు. చదవండి : మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా చేప.. -
‘ఎలాగైనా వెళ్లు’ అని అమ్మని పొమ్మన్నాడు
శనివారం నాడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట కొన్ని గంటలుగా ఓ వృద్ధురాలు దిగాలు ముఖంతో కూర్చొని ఉన్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె వివరాలు కనుక్కుని, రాజధాని ఎక్స్ప్రెస్లో ఏసీ టూ టైర్ టిక్కెట్ బుక్ చేసి ఆమెను ఢిల్లీ పంపించారు! 68 ఏళ్ల ఆ పెద్దావిడ పేరు లీలావతి కేశవ్నాథ్. పెద్దకొడుకు ముంబైలో ఉంటాడు. నాలుగు నెలల క్రితం తన ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేస్తే పరుగుల మీద ఆ తల్లి జనరల్ కంపార్ట్మెంట్లో ఢిల్లీ నుంచి ముంబై చేరుకుంది. ఈ నాలుగు నెలలూ కొడుక్కి సేవలు చేసింది. ఆరోగ్యం కుదుటపడ్డాక.. ‘ఇక నువ్వెళ్లు’ అన్నాడు కొడుకు! లాక్డౌన్లో ఎలా వెళ్తుంది? ‘ఎలాగైనా వెళ్లు’ అని ఇంట్లోంచి తరిమేస్తే రైల్వేస్టేషన్కి వచ్చి కూర్చుంది. ఇప్పుడీ సంగతులన్నీ ఢిల్లీలోని తన చిన్న కొడుక్కి కంట తడితో ఆమె చెబుతూ ఉండి ఉండొచ్చు. -
వైరల్: చెవిలో గూడు కట్టిన ‘స్పైడర్’
చైనా: సాధారణంగా చెవిలోకి చీమలు, చిన్నగా ఉండే పురుగులు దూరితే చాలా ఇబ్బంది పడతాం. వాటిని చెవి నుంచి తీసే వరకు నొప్పి భరించలేము. అయితే తాజాగా చైనాలోని ఓ వృద్ధ మహిళ చెవిలో సాలీడు ఏకంగా గూడు కట్టుకుంది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లోని ఓ వృద్ధ మహిళకు చెవి నొప్పి, దురదగా ఉండటంతో పాటు, ఏదో మోగుతున్న శబ్దం రావటంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో ఆ మహిళ స్థానిక మియాన్యాంగ్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ లియూ.. ఆమె చెవిని పరిశీలించి.. చెవిలో పట్టు బంతి మాదిరిగా ఏదో ఉన్నట్లు గుర్తించారు. దీంతో చెవిలో ఏం ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో వృద్ధ మహిళ చెవిలో ఓ స్పైడర్ ఉన్నట్లు, అది చెవిలో చేరి గూడు కట్టుకున్నట్లు డాక్టర్ నిర్ధారణ చేశారు. (కరోనా కాలంలో ట్రంప్ ఊహించని నిర్ణయం) దీంతో ఆ డాక్టర్ ఆమె చెవిలో.. చెవిని శుభ్రపరిచే రసాయనాన్ని చుక్కలుగా వేశారు. దీంతోపాటు ఆ స్పైడర్ను ప్రాణాలతో చెవి నుంచి బయటకు తీశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదృష్టవశాత్తు ఆ మహిళ చెవి దెబ్బతినలేదు.ఇక చెవిలోకి వెళ్లిన స్పైడర్ చాలా చిన్నదని, లేదంటే ఆమెకు వినికిడి లోపం కలిగేదని డాక్టర్ లియూ పేర్కొన్నారు. ‘నేను ద్రాక్షతోటలో పని చేస్తుంటాను. అదే సమయంలో నాకు ఎటువంటి స్పృహ లేకుండా ఆ సాలీడు నా చెవిలోకి దూరినట్టుంద’ని ఆ మహిళ తెలిపారు. కాగా, ఈ ఘటన ఏప్రిల్ 22న చోటు చేసుకుంది. -
వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ
సాక్షి, రాజంపేట: పట్టణంలోని ఎర్రబల్లి(ఆరీ్టసీ సర్కిల్)లో నర్రెడ్డి సుమిత్రమ్మ(55) హత్య మిస్టరీకి ఏడాది తర్వాత బ్రేక్ పడింది. గురువారం అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వివరాలను వెల్లడించారు. గతేడాది మార్చి 3న సుమిత్రమ్మ వియ్యంకురాలు వెలిచెలమల ఇందిరమ్మ, మరో ఇద్దరు కలిసి హత్యచేశారన్నారు. సుమిత్రమ్మ కోడలు నరెడ్డ్రి శ్వేతను హింసిస్తున్నట్లు తల్లి ఇందిరమ్మకు తెలిపిందన్నారు. దీంతో ఇందిరమ్మ ఓర్సునాగరాజుకు తన కుమార్తెను అత్త (సుమిత్రమ్మ)వేధిస్తోందని, సుమిత్రమ్మను హతమార్చాలని కోరిందన్నారు. (వృద్ధురాలి హత్య) నాగరాజు, మల్లికార్జున, రమేష్లు కలిసి వెళ్లి గొంతు నులిమి ముఖంపై దిండు పెట్టి, ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించుకొని వెళ్లిపోయారన్నారు. కాగా మల్లికార్జున 15రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడన్నారు. మిగిలిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 62 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. హత్యకు పాల్పడిన వారంతా అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పశ్చిమ నడింపల్లె, దేవరపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
భారత్లో మూడో మరణం
న్యూఢిల్లీ: భారత్లో మంగళవారం మూడో కరోనా మరణం నమోదైంది. ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చిన ఆ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 39 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో కేరళ(26 కేసులు) ఉంది. హరియాణా, యూపీలో చెరో 15, ఢిల్లీలో 8, లద్దాఖ్లో 6, కశ్మీర్లో 3 కేసులు కరోనా పాజిటివ్గా తేలాయి. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి కోవిడ్ బాధితుల సంఖ్య 137కి పెరిగింది. వాటిలో సోమవారం రాత్రి నుంచి 12 కేసులు నమోదవడం గమనార్హం. ఈ 137 మందిలో 24 మంది విదేశీయులున్నారు. కర్ణాటకలోని కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ కోవిడ్తో మరణించడం తెల్సిందే. ముంబైలో మంగళవారం మరణించిన వ్యక్తి భార్యకు కరోనా వైరస్ సోకింది. ఆమె కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొత్త కేసుల్లో రెండు నోయిడాలో, రెండు బెంగళూరులో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన రెండు కేసులతో కలిపి కర్ణాటకలో నమోదైన కేసుల సంఖ్య 11కి పెరిగింది. అలాగే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి, చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 14 అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా సోకిన 137 మందితో సన్నిహితంగా ఉన్న దాదాపు 52 వేల మందిని గుర్తించామని, వారిని ఐసోలేట్ చేసి, వైద్య పరీక్షలు జరుపుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక పరిశీలన, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం సహా కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో థర్మల్ స్క్రీనింగ్ను ఏర్పాటు చేయాలని, సందర్శకుల పాస్లను రద్దు చేయాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఫ్లూ లక్షణాలున్న వారిని తక్షణమే వేరుగా ఉంచి, నిర్ధారణ పరీక్షలు జరపాలని సూచించింది. అనవసర పర్యటనలను రద్దు చేసుకోవాలని, వీలైన ప్రతీసారి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని అధికారులను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశించింది. ఫ్లూ లక్షణాలున్నవారికి సెలవుల మంజూరులో అలసత్వం చూపొద్దంది. ఎయిడ్స్కు వాడే మందులు కోవిడ్ సోకినవారికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వాడే యాంటీవైరల్ ఔషధాలైన లోపినవైర్, రొటినవైర్ కాంబినేషన్ను ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యులకు సూచించింది. ఒక్కోకేసు తీవ్రత, లక్షణాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. 60 ఏళ్ల వయసు దాటిన, మధుమేహం, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు ఉన్న హై రిస్క్ గ్రూప్లో ఉన్నవారికి లోపినవైర్, రొటినవైర్ కాంబినేషన్ ఇవ్వాలని సూచించింది. ‘క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్–19’ పేరుతో మంగళవారం ఒక మార్గదర్శక ప్రకటన విడుదల చేసింది. ఎయిమ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. లోపినవైర్, రొటినవైర్ కాంబినేషన్ను హెచ్ఐవీ చికిత్సకు వాడతారు. -
గుడ్మాణింగ్ టీచర్
క్లాసులోకి రాగానే పిల్లలందరూ ఆమెకు ‘గుడ్మాణింగ్’ చెబుతారు. పిల్లలతో పాటు తొంభై ఏళ్లు దాటిన ఆమె వయసు కూడా ఆమెకు గుడ్మాణింగ్ చెబుతున్నట్లే ఉంటుంది. చేతికర్ర కూడా ఆమెను నడిపిస్తున్నట్లు ఉండదు. ఆమే చేతికర్రను నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ వయసులో లక్ష్మికి ఎక్కడిది ఆ శక్తి! ఆ చురుకుదనం!! లక్ష్మీ కల్యాణ సుందరం వయసు 91. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దేవుణ్ని ప్రార్థిస్తారావిడ. ఆ ప్రార్థనలో లక్ష్మి.. దేవుణ్ణి కోరే కోరిక ఎప్పుడూ ఒకేలా ఉంటుంది! తొంభై దాటిన వయసులో దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప, కోరుకోవడానికి ఇంకా ఏం మిగిలి ఉంటుందని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆమె గురించి పూర్తిగా తెలిస్తే ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఈ వయసులోనూ ఆమె ఎలా పని చేయగలుగుతున్నారు!.. అని. అవును, లక్ష్మి జాబ్ చేస్తున్నారు! బెంగళూరులోని ఒక మానసిక వికలాంగ విద్యార్థుల పాఠశాలలో ఆమె టీచర్. ఇరవై నాలుగేళ్లుగా ఆమె అక్కడి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మిగిలిపోయిన శక్తి భర్త చనిపోయినప్పుడు తన 67వ ఏట ఉద్యోగంలో చేరారు లక్ష్మి. విశ్రాంతి తీసుకోవలసిన వయసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు ఆమె. ‘‘ఎలా చెయ్యగలుగుతున్నారు మీరు?’’ అని అడిగినప్పుడు ఆమె చెప్పే సమాధానం కూడా కప్పు కాఫీలోని ఒక చప్పరింపు ఇచ్చే చురుకుదనాన్ని ఇస్తుంది! ‘‘నేనెప్పుడూ పని చేయలేదు. ఆ శక్తి అంతా నాలో అలాగే ఉండిపోయింది’’ అంటారు నవ్వుతూ. ‘నేనెప్పుడూ పని చేయలేదు’ అనే ఆ మాటలో.. ‘నాకెప్పుడూ పని చేసే అవకాశం రాలేదు’ అని చెప్పడమూ ఉంది! పద్నాల్గవ ఏట కల్యాణసుందరంతో వివాహం అయింది లక్ష్మికి. బయటికి వెళ్లాలని, రకరకాల మనుషుల్ని కలవాలని ఆమెకు ఉండేది. బాగా చదువుకున్నారు కానీ, బయటికి వెళ్లి చదువుకోలేదు. ఉద్యోగార్హతలు సంపాదించారు కానీ బయటికి వెళ్లి సంపాదించలేదు. డాక్టర్ అయి, అనారోగ్యాలను తొలగించాలని ఉండేది. అదీ అవలేదు. అప్పట్లో ఆడపిల్లను ఇల్లు దాటనిచ్చేవాళ్లే కాదు. చివరికి భర్తే పోతూ పోతూ తన జ్ఞాపకాల లోకం నుంచి బయటపడక తప్పని పరిస్థితిని ఆమెకు కల్పించి వెళ్లాడు. టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు లక్ష్మి. బయటికి అడుగేయాలి టీచర్గా చేస్తున్నప్పటికీ డాక్టర్గా చేయాలన్న తన కల సగం పూర్తయినట్లుగానే భావిస్తారు లక్ష్మి. డాక్టర్ అయి ఉంటే వైద్యసేవలు అందించేవారు. టీచర్గా ఇప్పుడు ‘స్పెషల్ చిల్డ్రన్’ మనసుల్ని వికసింపజేస్తున్నారు. తనకు ఎంతగానో సంతృప్తిని ఇస్తున్న బాధ్యత ఇది. తననే కాదు, స్వయంశక్తితో నిలబడడం కోసం ఇంటి నుంచి బయటికి వచ్చి పనిచేసే ఏ మహిళను చూసినా ఆమె మనసుకు తృప్తిగానే ఉంటుంది. తన ఇంట్లోనే ఒక పెద్ద మహిళావని ఉండటం కూడా ఆమెకు మరింతగా సంతృప్తినిచ్చే విషయం. లక్ష్మికి ముగ్గురు ఆడపిల్లలు. ఐదుగురు మనవరాళ్లు, ఇద్దరు మునిమనవరాళ్లు. చిన్న మునిమనవరాలు ప్రతి ఒక్కళ్లనీ కొట్టేస్తుంటుందని మురిపెంగా చెప్పుకుంటారు. ఇంత సంతృప్తికరమైన జీవితంలోనూ ఆమె ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు దేవుణ్ని ప్రార్థిస్తూ.. ‘దేవుడా.. రేపు ఉదయం నన్ను నిద్ర లేవనివ్వకు’ అని కోరుకుంటారు. ఉదయం లేవగానే తన కాఫీని తనే పెట్టుకుని తాగుతారు. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం తన పనుల్ని, తన ఉద్యోగాన్నీ తనకు తోడుగా ఉంచుకోదలచారు లక్ష్మీ కల్యాణసుందరం. -
విషాదం మిగిల్చిన ‘దీపం’
నిజాంసాగర్(జుక్కల్): దీపం మంటలకు ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో సోమవారం వేకువజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాలే విఠవ్వ (80) ఆదివారం రాత్రి ఇంట్లో దీపం వెలిగించి మంచం పక్కన పెట్టుకుని నిద్రకు ఉపక్రమించింది. ప్రమాదవశాత్తు మంటలు బట్టలకు అంటుకున్నాయి. అవి క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైంది. గమనించిన స్థానికులు ఫైరింజన్కు, పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అప్పటికే మంటలకు వృద్ధురాలు సజీవ దహనమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భయమెరగని బామ్మ
బెదిరిస్తే ఏమవుతుంది..? ఏమీ కాదు అలా బెదిరించిన వారే తోకముడుస్తారు.. అంటూ సమస్యల పరిష్కారానికై ముందుకు సాగుతోంది 92 ఏళ్ల ఈ చెన్నై బామ్మ. పేరు కామాక్షి. చెన్నై బెసెంట్ నగర్లో ఉంటున్న ఈ బామ్మను కలిస్తే చాలు మనం మరిచిపోయిన ఎన్నో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సమస్యల పరిష్కారానికి మనమూ కదలాలనిపించేలా చేస్తుంది. ‘నేను ముసల్దానినైపోయాను. అలాగని ఇప్పుడప్పుడే ఈ లోకాన్ని విడిచివెళ్లాలనుకోవడం లేదు. నేను భోజనం చేయడానికి ఇప్పుడు నా పళ్లెంలో చాలా పనులున్నాయి. ముందు వాటి సంగతి చూడాలి’ అంటోంది కామాక్షి పాటి. చుట్టుపక్కల కాలనీవాసులే కాదు కార్పొరేషన్ అధికారులు కూడా ఆమెను చూస్తే జంకుతారు. ఆమె బాధ్యతను తెలుసుకొని ప్రేమగా పలకరిస్తారు, గౌరవిస్తారు. పరిచయం లేని వారికి కూడా మన ఇంట్లోని బామ్మలాగానే కనిపిస్తారు. అది ఎంతవరకు అంటే.. చుట్టుపక్కల ఎవరైనా పౌర ప్రమాణాల ఉల్లంఘనకు పాల్పడనంతవరకే. తెల్లవారు ఝాము నుంచి రాత్రి పది వరకు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కామాక్షి పాటి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి వెనకాడరు. ఈ వయస్సులో కూడా ఆమెకు నచ్చని ప్రభుత్వ ప్రతిపాదన ఏదైనా వస్తే దానిని నిరసిస్తూ వీధుల్లోకి వస్తారు లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న అధికారినైనా నిలదీస్తారు. ఇంతకీ ఈమె ఎవరంటారా .. తంజావూరులో పుట్టిన కామాక్షి పాటి బెంగుళూరులో చదువుకుంది. పెళ్లై ఢిల్లీ వెళ్లింది. ‘ఢిల్లీలో ఆ మూడు దశాబ్దాలు నా జీవితంలో ఉత్తమమైనవి. 1948లో అక్కడికి వెళ్లాను. నవజాత దేశంలో అల్లకల్లోల రాజకీయాల సమయం. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండేవి. కానీ, ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు’ అని నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ‘1981లో తిరిగి చెన్నైకి వచ్చాను. ఇక్కడ మారిన వాతావరణం, సంస్కృతి చూసి షాక్ అయ్యాను. సర్దుబాటు చేసుకోవడానికి కొన్నాళ్లు పట్టింది’ అని చెబుతారు. అనుకోకుండా కార్యకర్తగా.. చెన్నై బెసెంట్నగర్లోని కామాక్షి ఉంటున్న ఇంటి ముందు రహదారి ఓ సమస్యగా మారింది. ప్రజలు దీనిని బహిరంగ మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. చనిపోయిన జంతుకళేబరాలను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఖననం చేసేవారు. ఇళ్లలోని వ్యర్థాలను పోసి వెళుతుండేవారు. విసిగిపోయిన కామాక్షి పదే పదే అధికారులకు విజ్ఞప్తులు చేసేది. అధికారులు ఆ విజ్ఞప్తులను తీసుకునేవారు. కానీ, ఏదో సాకు చెప్పి అప్పటికి తప్పించుకునేవారు. ‘రహదారికి ఇరువైపులా చెట్లు ఉండాలి’ అని వారికి గుర్తు చేసేది. మూడేళ్లు నిరంతర విజ్ఞప్తులు, నిరసనల తర్వాత కార్పొరేషన్ అధికారులు రహదారిని అందంగా తీర్చిదిద్దడంతోపాటు రోడ్సైడ్ పార్క్ను నిర్మించడంతో ఆమె తన మొదటి విజయాన్ని సాధించింది. కామాక్షి పాటి: అలుపెరుగని అవిశ్రాంత కార్యకర్త ఆమె 80వ పుట్టినరోజు సందర్భంగా అప్పటి చెన్నై కమిషనర్ ఈ పార్కు ఆధునీకరణ బాధ్యతను ఆమెకు అప్పగించారు.అప్పటికి ఆమె కార్పొరేషన్ అధికారులు, స్థానిక చట్టసభ సభ్యులతో పరిచయాలను ఏర్పరుచుకుంది. కామాక్షి పర్యవేక్షణ ఎంత బాగుంటుందో 12 ఏళ్లుగా ఆమె నిర్వహిస్తున్న పార్క్ చెబుతుంది. ‘నేనెప్పుడూ అలవాటు ప్రాముఖ్యతను చెబుతాను. ఒక స్థలాన్ని పునరుద్ధరించినా, ఒకసారి శుభ్రపరిచినా అంతటితో ఏమీ ముగిసిపోదు. దానిని నిరంతరాయంగా కొనసాగించాలి. ఒక బాధ్యతగా తీసుకోవాలి’ అని ఆమె సలహా ఇస్తారు. రోడ్డు, పార్క్ పని పూర్తయింది. ఇక పౌర సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు కామాక్షి. బెసెంట్ నగర్లోని చుట్టుపక్కల వాసులు తమ మనోవేదనలను, పరిపాలనకు సంబంధించి సమస్యలు పరిష్కరించేలా చూడమని కామాక్షికి దగ్గరకు వచ్చేవారు. దీంతో ఆమె తరచూ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఆమె సాధించిన విజయాలలో బెసెంట్ నగర్ బీచ్లోని కార్ల్ జెష్మిత్ మెమోరియల్ పునరుద్ధరణ అతి ముఖ్యమైనది. శిథిలావస్థలో ఉన్న ఈ మెమోరియల్లో మద్యం సేవించడం, గోడలపై పిచ్చి రాతలు రాయడం, స్మారక చిహ్నంపై మూత్రవిసర్జన చేయడం వంటివి గమనించిన పాటి అది పూర్తిగా బాగయ్యేంతవరకు అధికారులను వదిలిపెట్టలేదు. బెదిరింపులు బేఖాతరు కామాక్షి పాటి విజయం.. రహదారులు, ష్మిత్ మెమోరియల్ పునరుద్ధరుణతో ఆగలేదు. ఫుట్పాత్లను ఆక్రమించే షాపులను అడ్డుకోవడం, కాలిబాటలను విస్తరించే విధానాల కోసం బెసెంట్ అవెన్యూలో నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. రాత్రి 10 దాటిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు ఆపాలని, పిల్లలు, వృద్ధుల నిద్రకు అవరోధం కలిగించకుండా చూడాలని కోరుతుంది. బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఉండటం ఇష్టమైన కామాక్షికి అవినీతి వైఖరులకు పాల్పడే వారితో ఎప్పుడూ గొడవగానే ఉంటుంది. నా విధానాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇచ్చేవారున్నారు. కానీ, వారెవరూ ఇటువంటి బాధ్యత తీసుకోరు. వీధుల్లో చెత్త వేయద్దని నిలదీస్తే యువకులు స్పందించే తీరు బాధిస్తుంటుందని కామాక్షి తెలుపుతుంది. నిరసన తెలపడం కష్టమైన పనికాదు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి’ అని కోరుతుంది కామాక్షి. కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాళ్లు ఏం చేస్తారులే అనుకోవద్దు. తలుచుకుంటే కొండను కూడా పిండిచేయగలమని నిరూపించగలరు. ముళ్ల మార్గాలనూ నందనవనంగా మార్చగలరు. – ఆరెన్నార్ -
చనిపోతే అరిష్టమని..
కాజీపేట: తన ఇంట్లో అద్దెకు ఉన్న ఓ వృద్ధురాలు చనిపోతే అరిష్టమని భావించి ఓ యజమానురాలు బయటకు గెంటేసింది. తీవ్ర ఒత్తిడికి గురైన వృద్దురాలు రోడ్డుపైనే తనువు చాలించింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రసూల్బీ (67) కొన్నేళ్లుగా పెద్దపెండ్యాలలోని అద్దె ఇంట్లో ఉంటోంది. వారం క్రితం అస్వస్థతకు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే ఇంట్లో చనిపోతే అరిష్టంగా భావించిన ఇంటి యజమానురాలు.. రసూల్బీని మంచంతో సహా బయట పడేసింది. ఈ విషయం తెలుసుకున్న సహృదయ ఆశ్రమ నిర్వాహకులు యాఖూబీ, ఛోటులు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడానికి అంబులెన్స్ను సిద్ధం చేస్తున్న క్రమంలో రసూల్బీ తుది శ్వాస విడిచింది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకురాలు తెలిపారు. -
మంత్రగత్తె ముద్రవేసి..
గంజాం : మనలాంటి మనిషే అయినా కేవలం 20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లతో జన్మించినందుకు 63 ఏళ్ల వృద్ధురాలిని నాలుగు గోడలకే పరిమితం చేసిన ఘటన ఒడిశాలోని గంజాంలో వెలుగు చూసింది. గంజాం జిల్లా కదపడ గ్రామంలో 63 ఏళ్ల మహిళ నయక్ కుమారి తాను చేయని పాపానికి వివక్షకు గురైంది. తనను మంత్రగత్తె ముద్ర వేసి ఇరుగు పొరుగు వారు తనను ఇల్లు కదలనీయడం లేదని ఆమె వాపోయింది. తాను పుట్టుక లోపంతోనే ఇలా ఉన్నానని, పేదరికం కారణంగా చికిత్స చేయించుకోలేదని తనను మంత్రగత్తెగా స్ధానికులు భావిస్తూ దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు తమది చిన్నగ్రామమని, ఇక్కడి ప్రజల్లో మూఢనమ్మకాలు పేరుకుపోయాయని, దీంతో ఆమెను మంత్రగత్తెగా అందరూ భావిస్తున్నారని కుమారి దీనగాధను అర్ధం చేసుకున్న మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకటి రెండు వేళ్లు అధికంగా ఉండటం అసాధారణమేమీ కాదని సర్జన్ డాక్టర్ పినాకి మహంతి చెప్పారు. అయితే 20 కాలి వేళ్లు, 12 వేళ్లు ఉండటం అరుదని, జన్యుపరంగా ఇలాంటివి జరగవచ్చని, ప్రతి ఐదు వేల మందిలో ఒకరిద్దరికి ఇలా జరుగుతుందని తెలిపారు. వైద్య పరమైన విషయంలో సామాజిక వివక్ష తగదని ఆయన పేర్కొన్నారు. -
అందరూ ఉండి అనాథైన బామ్మ
ఎనిమిది పదులు దాటిన ఆ ముదుసలికి కడుపులో ఆకలి బాధలకంటే కన్నపేగు మిగిల్చిన ఆవేదనలే ఎక్కువయ్యాయి. ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. రెండెకరాల పొలం, ఇంటి స్థలం.. 20 ఏళ్ల క్రితం ఇంటాయన తనకు మిగిల్చిన ఆస్తులు. కన్న బిడ్డలకు అమ్మకంటే ఆస్తులపై మమకారం పెరిగింది. తల్లిని కర్మకాండల భవనం పాలు చేసింది. ఇరవై రోజులుగా తినీతినక కట్టెగా మారిన ఆ శరీరం..గురువారం తాడేపల్లి వద్ద కాలువలో కాలుజారి పడింది. ఇప్పటి వరకు జీవచ్ఛవంగా బతుకీడుస్తున్న ఆమె నిర్జీవంగా మారింది. తాడేపల్లి పోలీసుల చొరవతో చివరకు మృతదేహంగానైనా ఆమె బిడ్డల చెంతకు చేరింది. సాక్షి, తాడేపల్లి : ఆ బామ్మ పేరు రాఘవమ్మ. వయస్సు 85 ఏళ్లు. కట్టుకున్న భర్త 20 ఏళ్ల కిందట మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త చనిపోయాక ఆమెకున్న ఆస్తిని వాటాలేసుకుని పంచుకున్నారు తప్పా ఆమె బాగోగులు ఎవరూ ఆలోచించలేదు. చివరకు ఓ కర్మకాండ భవనంలో నివాసముంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పొరపాటున కాలుజారి కాలువలో పడి గురువారం మృతి చెందింది. సేకరించిన వివరాల ప్రకారం.. కుంచనపల్లి గ్రామానికి చెందిన దాసిశెట్టి వెంకయ్య, రాఘవమ్మ ఇద్దరూ భార్యాభర్తలు. 20 ఏళ్ల కిందట వెంకయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం రాఘవమ్మ తనకున్న రెండు ఎకరాల పొలాన్ని, ఇళ్ల స్థలాన్ని కూతుర్లు, కొడుకుకి పంచింది. 40 ఏళ్ల కిందట కుమారుడైన సాంబశివరావు ఇల్లు వదిలిపెట్టి విజయవాడ చిట్టినగర్లో నివాసముంటున్నాడు. దీంతో రాఘవమ్మ కూతుళ్ల దగ్గరే జీవిస్తోంది. కొంతకాలం కిందట కుంచనపల్లిలో ఉండే మొదటి కూతురు వెంకాయమ్మ , రాణీగారితోటలో ఉండే రెండో కూతురు వెంకాయమ్మతో విభేదాలు వచ్చాయి. దీంతో తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్టపై ఉండే చిన్నకూతురు సుబ్బలక్ష్మి దగ్గర నివాసముంటోంది. ‘అస్తమానం మా వద్దే ఎందుకు ఉంటున్నావూ...కొడుకు దగ్గరకు వెళ్లొచ్చు గదా’ అని ఆమె అనడంతో అనడంతో రాఘవమ్మ మనస్తాపం చెంది గత 20 రోజుల నుంచి రాఘవమ్మ తాడేపల్లి బకింగ్ హామ్ కెనాల్ పక్కనే ఉన్న కర్మకాండ భవనంలో నివాసముంటోంది. అక్కడకి వచ్చిన వారు పెట్టిన తిండి తిని అక్కడే జీవనం కొనసాగిస్తోంది. రోజు ఉదయం స్నానం చేసి అక్కడే ఉన్న వినాయకుడి గుడిలో పూజలు నిర్వహిస్తుందని స్థానికులు చెబుతున్నారు. గురువారం కూడా అదే విధంగా నిద్రలేచి కాలువలో దిగి పొరపాటున కాలు జారి కొట్టుకుపోయింది. ఆమె చీర ముళ్ల పొదలకు పట్టుకోవడంతో మృతదేహం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారించగా రాఘవమ్మ కుటుంబ సభ్యులున్నారని నిర్ధారించారు. మృతదేహాన్ని బయటికి తీసిన తరువాత కూడా ఎవరూ రాకపోవడంతో పోలీసులు బంధువుల వివరాలు సేకరించారు. రాఘవమ్మ కొడుకు విజయవాడలో ఉంటాడని తెలుసుకుని అతనికి సమాచారం ఇచ్చారు. అతడు రావడానికి సుముఖత చూపకపోవడంతో పోలీసులు మానవతాన్ని చాటుకుని ‘మీరు చేస్తారా.. మమ్ముల్ని అంత్యక్రియలు చేయమంటారా ? ’ అనడంతో ఎట్టకేలకు కొడుకు తాడేపల్లి స్టేషన్కు వచ్చాడు. అతడి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి వృద్ధురాలి మృతదేహాన్ని అప్పగించారు. -
ఇంత లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో
ఒక జీవి మరో జీవికి జన్మనివ్వడం సహజం.సంతానానికి జన్మనివ్వకపోవడాన్ని మనిషి అసంపూర్ణత్వంగా భావిస్తాడు.సంతానం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే అలాంటి అన్ని ప్రయత్నాలూ సరైనవేనా? లేక చర్చకు ఆస్కారమిచ్చేవా? మాతృత్వంలోని మధురిమలు అనిర్వచనీయమైనవి. తల్లి కావడం ఒక తీయని అనుభూతే. కానీ బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అన్న వాడుక కూడా మనలో ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మ గురువారం కవల పిల్లలకు జన్మనిచ్చారు. పుట్టిన ఆడ శిశువులు ఇద్దరూ 1.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇది చాలా సంతోషదాయకమైన అంశం. అయితే ఇంత లేటు వయసులో గర్భధారణ అన్నది చాలా రకాలైన ముప్పులతో కూడి ఉంటుంది. డెబ్బయి నాలుగేళ్ల వయసును పక్కన ఉంచితే... గర్భధారణ విషయంలో అసలు 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి. ఇందులోని కొన్ని వైద్యపరమైన అంశాలతో పాటు అటు నైతిక, ఇటు సామాజిక అంశాలనూ ఒకసారి పరికిద్దాం. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంటుంది. అందుకే రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా ఒక మహిళలో ఇంకా మిగిలి ఉన్న అండాల సంఖ్యను (ఒవేరియన్ రిజర్వ్) తెలుసుకుంటారు. దాన్ని బట్టి వారికి అవసరమైన సంతాన సాఫల్య ప్రక్రియ ఏమిటన్నది నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇలా చేసే పరీక్షల ఫలితాలన్నీ ఉజ్జాయింపుగా ఉంటాయే తప్ప... నిర్దిష్టంగా ఏ పరీక్ష కూడా వంద శాతం కచ్చితత్వంతో ఉండదు. ఇక గర్భధారణ జరిగినా పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాదు... గర్భస్రావం అయ్యే అవకాశాలూ హెచ్చుతాయి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆలస్యంగా గర్భధారణ జరిగే వారిలో గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. గర్భస్రావం అయ్యే అవకాశాలు 35 ఏళ్ల కంటే చిన్నవయసు ఉన్నవారిలో 13 శాతం ఉంటాయి. అదే 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లలో అవి 54 శాతానికి పెరగవచ్చు. గర్భధారణకు పురుషుడి లోపాలూ దోహదం ఇక ఆలస్యంగా గర్భధారణ జరిగే ప్రక్రియలో పురుషుడి వీర్య సంబంధమైన లోపాలు కూడా గర్భధారణను సంక్లిష్టం చేస్తాయి. వయసు మీరిన పురుషుడికి సెమన్ అనాలసిస్ పరీక్ష చేసినప్పుడు అందులో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటి కదలికలు సరిపడనంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదే జరిగితే... అడ్వాన్స్డ్ స్పెర్మ్ అనాలిసిస్, టెస్టిక్యులార్ బయాప్సీ, జనెటిక్ టెస్ట్, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, కేరియోటైప్ టెస్ట్ వంటి మరికొన్ని పరీక్షలూ అవసరమవుతాయి. పుట్టే పిల్లలకూ ఏర్పడే ముప్పులు ఆలస్యంగా గర్భధారణ జరిగిన మాతృమూర్తులకు పుట్టే పిల్లల్లోనూ జన్యుపరమైన కొన్ని లోపాలు తలెత్తేందుకు అవకాశం ఉంది. అదెలా జరుగుతుందో చూద్దాం.తల్లిదండ్రుల తాలూకు ఈ లక్షణాలన్నింటినీ బిడ్డలకు వచ్చేలా చేసే మౌలిక అంశాలను క్రోమోజోములు అంటారు. తల్లి నుంచి ఒక 23, తండ్రి నుంచి మరో 23... ఇలా ఈ రెండు 23 జతలు కలగలసి 46 క్రోమోజోములు పిండంలోకి చేరితేనే అది పూర్తిస్థాయిలో లోపాలు లేని ఒక మానవ పిండంగా ఎదుగుతుంది. పుట్టబోయే బిడ్డలందరిలోనూ ఇవే 23 జతల క్రోమోజోములుంటాయి. ఉండాలి కూడా. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లల్లో మాత్రం ఈ క్రోమోజోముల సంఖ్యలో తేడా వస్తుంది. అప్పుడు ఆ బిడ్డలో దేహనిర్మాణపరమైన లోపాలు, ఇతరత్రా లోపాలు రావచ్చు. అలా ఆ లోపాలతోనే బిడ్డ పుట్టేందుకు అవకాశం ఉంది.బిడ్డ పుట్టాక లోపాలను కనుగొంటే చేయగలిగేందేమీ ఉండకపోవచ్చు. అయితే బిడ్డ పుట్టకముందే వాటిని కనుగొనగలిగితే తల్లిదండ్రులకూ, కొన్నిసార్లు పుట్టబోయే బిడ్డకు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఇలా బిడ్డలోని క్రోమోజోముల సంఖ్యలో తేడా వచ్చినప్పుడు బిడ్డకు వచ్చే వ్యాధుల్లో ఒక ప్రధానమైన సమస్యే ‘డౌన్స్ సిండ్రోమ్’. ఏమిటీ డౌన్స్ సిండ్రోమ్? మానవుల్లో 23 జతల క్రోమోజోములకు బదులు ఒక క్రోమోజోము అదనంగా వచ్చి చేరినప్పుడు పెరిగే పిండం బిడ్డగా రూపొందితే అప్పుడు పుట్టే బిడ్డ కొన్ని లోపాలతో పుడుతుంది. అలా పుట్టే బిడ్డను ‘డౌన్ సిండ్రోమ్’తో పుట్టిన బిడ్డగా చెబుతారు. ఈ లోపాన్నే ‘ట్రైజోమీ 21’ అని కూడా అంటారు. బిడ్డలోని 21వ క్రోమోజోముకు అదనంగా మరో క్రోమోజోము చేరడం వల్ల ఇలా డౌన్ సిండ్రోమ్తో బిడ్డ పుడతాడు. ఇలా డౌన్స్ సిండ్రోమ్తో పుట్టిన బిడ్డలో మెదడు ఎదుగుదల తక్కువ. కాబట్టి ఆ బిడ్డలో నేర్చుకునే శక్తి, మానసిక ఎదుగుదల ఇవన్నీ తక్కువగా ఉంటాయి. కొందరిలో గుండె లోపాలు కూడా రావచ్చు. తల్లిలో గర్భధారణ చాలా ఆలస్యంగా జరిగినప్పుడు ఇలా డౌన్స్ సిండ్రోమ్తో బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 1140 మంది మహిళల్లో ఒకరికి డౌన్స్ సిండ్రోమ్తో బిడ్డ పుట్టే అవకాశం ఉండగా... 30 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 720 మహిళల్లో ఒకరికీ, అదే 40 ఏళ్ల వయసు తర్వాత గర్భధారణ జరిగితే ప్రతి 65 మందిలో ఒకరికి ఇలా డౌన్స్ సిండ్రోమ్తో బిడ్డ పుట్టవచ్చు. కవలల తండ్రి డౌన్స్ సిండ్రోమ్ను ముందుగానే తెలుసుకోవచ్చా? కొన్ని పరీక్షలతో డౌన్స్ సిండ్రోమ్, మరికొన్ని జన్యుపరమైన సమస్యలను తెలుసుకోవచ్చు. ఇందులో మొదటిది స్క్రీనింగ్ పరీక్ష. ఈ స్క్రీనింగ్ పరీక్షలో.. సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలితే, ఆ తర్వాత చేసేది నిర్ధారణ పరీక్ష. ఇందులో స్క్రీనింగ్ పరీక్షను హైరిస్క్ ఉన్న ప్రతి గర్భవతీ చేయించుకోవడం మంచిది. గర్భిణి పిండంలో ఏదైనా ముప్పు (హైరిస్క్) ఉందా అని తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న సాధారణ రక్త పరీక్ష మాత్రమే. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నది.ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్ష (డబుల్ మార్కర్ టెస్ట్, క్వాడ్రపుల్ టెస్ట్)లో ఏదైనా సమస్య ఉండే అవకాశమున్నట్లు ఫలితం వస్తే అప్పుడు పూర్తి స్థాయి నిర్ధారణ కోసం మరో పరీక్ష అంటే కోరియానిక్ విల్లస్ బయాప్సీ, అమ్నియోసెంటైసిస్ పరీక్ష (ఉమ్మనీరు పరీక్ష) అవసరమవుతాయి.ఇవేగాక ఆలస్యంగా గర్భధారణ జరిగిన తల్లిదండ్రులకు పుట్టే బిడ్డలు చాలా రకాల అవయవ లోపాలతోనూ, ఇంకా అనేక రకాల జన్యుపరమైన సమస్యలు, మెటబాలిక్ సిండ్రోమ్స్తో పుట్టవచ్చు. మూగ, చెవుడు, ఆటిజమ్ వంటి సమస్యలు రావడం కూడా ఎక్కువే. ఇలాంటి చాలా సమస్యలు ఎంత అడ్వాన్స్డ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవన్నీ కచ్చితంగా తెలియకపోవచ్చు. పుట్టిన తర్వాత, బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తెలుస్తాయి. ఇక ఇంత లేట్ వయసులో తల్లిలో క్యాల్షియం తగ్గడం, ఎముకలు అరిగిపోవడం, రక్తం గూడు కట్టుకుపోయే ముప్పు, గర్భధారణ సమయంలో సాధారణంగా రక్తపోటు పెరగడం, జెస్టెషనల్ డయాబెటిస్ వంటి అనేక ముప్పులు కలుగుతాయి. ఇవన్నీ వైద్యపరమైన ముప్పుల్లో కొన్ని మాత్రమే. కాగా ఇక నైతికంగా, సామాజికంగానూ, ఆర్థికపరమైన ముప్పులు కూడా ఉంటాయి.ఈ ముదిమి వయసులో పిల్లలు కలగాలనే తమ గాఢమైన తాపత్రయాన్ని నెరవేర్చుకుని సేఫ్గా ఆరోగ్యకరమైన పిల్లలను కన్న తల్లిదండ్రులనూ, బిడ్డలనూ అభినందించి తీరాలి. అలాగే ఈ వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పే ఫీట్ను అత్యంత సురక్షితంగా నెరవేర్చిన వైద్యబృందానికీ అభినందన దక్కాలి. అయితే... బిడ్డలను ఏ వయసులో కనాలి, అంత వయసు వారికి గర్భధారణ కోసం కృత్రిమ ప్రక్రియలు అవలంబించవచ్చా, ఏ వయసు వారి వరకు గర్భధారణ ప్రక్రియలు పాటించవచ్చు అనే విషయంలో స్పష్టమైన చట్టాలేమీ లేవు. నైతికతలను స్వచ్ఛందంగా పాటించే మనలాంటి దేశాల్లో ఉండవు కూడా. కాబట్టి ఇందులో ఎదురయ్యే సమస్యలూ, వాటి పరిష్కారాలు, వాటి ఆధారంగానే ముందుకు వెళ్లడం... ఇవన్నీ వారి వారి విచక్షణ మేరకే ఉంటాయి. కాబట్టి అటు వైద్యులూ, ఇటు తల్లిదండ్రులూ ఈ విషయంలో ఎవరికి వారే విచక్షణతో మెలగాలి. అలాంటి విచక్షణలతో కూడినది కనుకనే ఈ వార్త ఇప్పుడు మనందరిలోనూ, వైద్యవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఏమైనా అద్భుతాలు అరుదుగా మాత్రమే జరుగుతాయి. అద్భుతాలతో పాటు కాంప్లికేషన్లు ముడిపడి ఉంటాయి. సఫలమైనప్పుడు మాత్రమే అది అద్భుతం అవుతుంది. అందరూ ప్రతిసారీ తమ విషయంలో అద్భుతాన్ని ఆశించడం అంత సమంజసం కాకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ముందుకెళ్లాలి. ఆర్థికపరమైనఅంశాలు సాధారణంగా తల్లిదండ్రులు పెద్ద వయసులో ఉన్న వారు కావడం, కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు పుట్టినందున, కవలలు అయినందున కొన్ని రకాల వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అటు తల్లిదండ్రులకూ, ఇటు బిడ్డలకూ రావచ్చు. వారు బాగా కలిగినవారే అయినప్పటికీ ఇప్పుడు వైద్యం చాలా ఖరీదైన నేపథ్యంలో ఇది ఖర్చు పరంగా కాస్తంత ఆర్థిక భారంగా పరిణమించేందుకే అవకాశాలు ఎక్కువ. నైతికపరమైన అంశాలు పిల్లలను పొందడం అన్నది ఒక భావోద్వేగపరమైన అంశం. ప్రతివారికీ తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లలపై అపేక్ష, ప్రేమ, అనిర్వచనీయమైన అనుబంధం ఉంటాయి. ఆ హక్కును కాదనలేం. కానీ గర్భధారణ జరిగిన మహిళకు ఏదైనా ముప్పు వచ్చి, తల్లీబిడ్డలిద్దరిలో తల్లిని రక్షించాలా, బిడ్డను రక్షించాలా అన్న సంశయం వస్తే... పెద్దప్రాణానికే విలువనివ్వడం మన గమనానికి వచ్చే అంశమే. అలాంటప్పుడు 74 ఏళ్లు వయసులో బిడ్డ ఆరోగ్యంగానే పుడతాడా... ఒకవేళ పుట్టినా ఈ కేసులో అవసరమైనట్లే సిజేరియన్ అవసరమైతే ఆ మహిళకు శస్త్రచికిత్సలకు తట్టుకునే శక్తి ఉంటుందా... తల్లికి గండంగా పరిణమించే ఇంత రిస్క్ అవసరమా అన్నది ఆలోచించాల్సిన అంశం. ఇక మన మంగాయమ్మ గారి విషయంలో అదృష్టవశాత్తూ బిడ్డల్లో జన్యుపరమైన లోపాలేవీ తలెత్తలేదు. కానీ ఒకవేళ ఇంత పెద్ద వయసులో డౌన్స్ సిండ్రోమ్కు స్పష్టమైన అవకాశాలు ఉన్నందున అదేజరిగితే అది అటు తల్లిదండ్రులతో పాటు ఇటు సమాజంపై కూడా భారం పడేదే. ఇక ఇప్పుడు తల్లి వయసు 74 ఏళ్లు, మరి తండ్రి వయసు తప్పక అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తండ్రి వయసు కూడా కాసేపు అంతే అనుకుందాం. ఉదాహరణకు ఆ పిల్లలను సాకే విషయంలో ఎదురయ్యే ఒక చిన్న అంశాన్ని చూద్దాం. ఆ పిల్లలిద్దరూ పదవ తరగతి, ఇంటర్కు చేరే సమయానికి వారి వయసు 89, 92కి చేరుతుంది. దాదాపు 90 ఏళ్ల నాటికి కూడా టీనేజీకి చేరని ఆ పిల్లలను ఆ తల్లిదండ్రులు సమాజానికి భారం కాకుండా బాధ్యతగా సాకగలరా అనేది మరో అంశం. డా‘‘ వేనాటి శోభ,సీనియర్ గైనకాలజిస్ట్బర్త్రైట్ బై రెయిన్బో,హైదర్నగర్, హైదరాబాద్ -
సాహోరే బామ్మలు.. మీ డాన్స్ సూపరు!
మనిషి జీవితంలో అత్యంత మధురమైన దశ బాల్యం. చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తే ఎంత పెద్దవారైనా పిల్లలైపోతారు. బడిలో చదువులు, చిన్ననాటి అల్లర్లు ఏనాటికి మర్చిపోలేము. అందుకే కాబోలు ఈ బామ్మలు కూడా తమ బాల్యమిత్రులను చూడగానే హుషారుగా నృత్యాలు చేశారు. చిన్ననాటి సంగతులను తలుచుకుని ఎంతో మురిసిపోయారు. కర్ణాటకలోని మంగళూరులో ఇటీవల జరిగిన పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొంత మంది బామ్మలు ఉత్సాహంగా గడిపిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. స్కూల్ రోజులను గుర్తుచేసుకుని వారంతా చిన్నపిల్లల్లా మారిపోయారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడిపారు. 70 ఏళ్లు పైబడిన వయసులోనూ పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేసి ఔరా అనిపించారు. ఈ వీడియోను నాంది ఫౌండేషన్, అరకు కాఫీ సీఈవో మనోజ్ కుమార్ ట్విటర్లో షేర్ చేశారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన బామ్మలను చూసిన వారంతా వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల వయసు వచ్చాక తాము కూడా ఇలాగే గడుపుతామని కొంతమంది అంటే.. తమ చిన్ననాటి స్నేహితులను కలిసినప్పుడు ఇలాగే సరదాగా ఉంటామని మరికొందరు వెల్లడించారు. మనిషి జీవితంలో సంతోషానికి సాటి ఏదీ లేదని చాలా మంది వ్యాఖ్యానించారు. (చదవండి: వీళ్లు పిల్లలు కాదు పిడుగులే..!) -
హత్యా..ఆత్మహత్యా?
కాశీబుగ్గ: వృద్ధురాలు అనుమానాస్పదంగా సీలింగ్ ఫ్యానుకు వేళాడుతూ మృతి చెందిన సంఘటన పలాస పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిని 23వ వార్డు రాజమ్మకాలనీకి (గాంధీనగర్) చెందిన తంగుడు లక్ష్మి(63) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలు చేశారు. లక్ష్మి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఆమె ఇద్దరు కుమారులు రామచంద్రరావు (రాజు), కిశోర్లు వేర్వేరు ఇళ్లల్లో కాపరం ఉంటున్నారు. రామచంద్రరావు (రాజు) ఇంట్లో లక్ష్మి ఉంటోంది. జీడిపప్పు వ్యాపారం చేస్తున్న రాజుకు 2007 మార్చిలో శ్రీకాకుళం పట్టణంలోని మంగువారితోట ప్రాంతానికి చెందిన జామి సూర్యారావు కుమార్తె సౌజన్యతో వివాహం జరిగింది. కోడలు సౌజన్య తన పిల్లలతో ఆదివారం శ్రీకాకుళంలోని కన్నవారింటికి చేరుకుంది. తండ్రి సూర్యారావుకు పిల్లలను అప్పగించి నగరంలోని కొత్త వంతెన (నాగావళి)పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తండ్రి జామి సూర్యారావు శ్రీకాకుళం టూ టౌన్ పోలీసు స్టేషన్లో అత్త లక్ష్మి(మృతురాలు), ఆడపడుచులు పావని, ప్రియ వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం టిఫిన్ సిద్ధం చేసిన అనంతరం 9:30 నిమిషాలకు ఫ్యానుకు మృతదేహం వేళాడుతున్నట్లు సమాచారం బయటకు రావడంతో విషయం అందరికీ తెలిసింది. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆస్పత్రికి తరలించారు. ఆమె కడుపునొప్పిని తాళలేక ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని కాశీబుగ్గ సీఐ చంద్రశేఖరం కేసు నమోదు చేశారు. మృతురాలు వృద్ధురాలు కావడంతో ఎత్తైన ఫ్యానును ఎలా ఉరి వేసుకుంటుందని, పూర్తిగా కాలు భూమికి తాకడం చూసిన బంధువులు, పరిసర ప్రాంతీయులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. -
ఓటేసిన శతాధిక వృద్ధురాలు
జార్ఖండ్ : లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు సోమవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులుతీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జార్ఖండ్లోని హజారిబాగ్లో ఓ వ్యక్తి తన 105 సంవత్సరాల తల్లిని ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. -
ఓటేసి మురిసిన 107 ఏళ్ల బామ్మ
గ్యాంగ్టక్ : లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇక సిక్కింలో 107 సంవత్సరాల సుమిత్రా రాయ్ దక్షిణ సిక్కింలోని పాక్లోక్ కమ్రాంగ్ పోలింగ్ కేంద్రానికి వీల్ ఛైర్లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె ఉత్సాహంగా తన ఓటరు గుర్తింపు కార్డును ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. మరోవైపు 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన 126 ఏళ్ల చంద్రవదియ అజిబెన్ సిదభాయ్ అత్యధిక వయసు కలిగిన ఓటరుగా నిలిచారు. -
బామ్మ బాట.. బంగారం పంట
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: ఉద్యోగ విరమణ పొందాక ఆమె విశ్రాంతిని కోరుకోలేదు. వ్యవసాయం చేస్తూ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఎనిమిది పదుల వయస్సులోనూ సాగుబాట పట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమే జంగారెడ్డిగూడెంకు చెందిన కేసనపల్లి లక్ష్మీకాంతం. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా తండ్రి శ్రీరాములు వ్యవసాయదారుడు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయంపై ఆసక్తి ఏర్పడింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో 1954లో ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరాను. పోలవరం, కోండ్రుకోట, లక్ష్మీపురం, పైడిపాక, చేగొండపల్లి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1992లో ఉద్యోగ విరమణ పొందాను. బాధ్యతలన్నీ తీరిపోవడంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో నాకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాను. సేంద్రియ ఎరువులతోనే పామాయిల్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు వేసి వ్యవసాయాన్ని ప్రారంభించాను. జామను ఒడిశాలో కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం పామాయిల్, కోకో పంటలు సాగుచేస్తున్నాను. పొలానికి నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం తదితర పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయమే నా ఆరోగ్య రహస్యం. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పనులు ముగించుకుని పొలానికి వెళ్తుంటాను.’ -
బతుకు పోరాట దీక్ష
కన్నవారు ఇచ్చిన ఆస్తిని లాక్కున్నారు. భృతి ఇవ్వాలని న్యాయం ఆదేశించినా.. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో రామాలయంలో ఐదు నెలలుగా వృద్ధురాలు తలదాచుకుంటోంది. తన దీన స్థితిని గమనించి అధికారులు న్యాయం చేయాలని బుధవారం ఆమరణ దీక్ష చేపట్టారు మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన దేవకివాడ మహాలక్ష్మి! బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రేగిడి : బూరాడ గ్రామానికి చెందిన శీర రాధాకృష్ణంనాయుడుకు ముగ్గురు కుమారులు, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన దేవకివాడ అప్పారావుతో మహాలక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో తనకున్న ఆస్తిని నలుగురికీ సమానంగా పంచారు. ఇందులో మహాలక్ష్మి వాటాగా రెండు ఇళ్లు, 15 ఎకరాల భూమి వచ్చింది. వీటిని పెళ్లి సమయంలో పసుపు–కుంకుమ కింద ఇచ్చారు. వీరికి కుమార్తె కల్యాణి ఉంది. అయితే బూరాడకు చెందిన మహిళతో అప్పారావు సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో అప్పారావు, మహాలక్ష్మి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆమె నిరాదరణకు గురవుతూ వస్తోంది. భర్త నుంచి జీవనభృతి ఇప్పించాలని రాజాం సీనియర్ సివిల్ జడ్జి కోర్టును మహాలక్ష్మి 2014లో ఆశ్రయించింది. ఆమెకు ప్రతినెల రూ.25000 చెల్లించాలని భర్త అప్పారావును కోర్టు ఆదేశించింది. ప్రతినెల తాను రూ.25000 ఇవ్వలేనని జిల్లా కుటుంబ న్యాయస్థానానికి ఆయన తెలిపారు. ఆమెకు ప్రతి నెల రూ.10వేలు జీవనభృతి ఇవ్వాలని 2016 నవంబర్లో జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అప్పారావు.. రెండు నెలలు చెల్లించారు. అనారోగ్యంతో ఆయన ఏడాది క్రితం మృతిచెందారు. అనంతరం తన ఆస్తిని సహజీవనం చేస్తున్న మహిళ కుమారులు దేవకివాడ చిన్నప్పలనాయుడు, దేవకివాడ కృష్ణ, దేవకివాడ కూర్మినాయుడు, కుమార్తె కెంబూరు ఈశ్వరమ్మ లాక్కుని తనను నిరాశ్రయురాలిని చేసి కట్టుబట్టలతో ఇంటి నుంచి గెంటివేశారని మహాలక్ష్మి వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో జీవనాధారం లేక బుధవారం నుంచి పోరాట దీక్ష చేపట్టానన్నారు. ఈ పోరాటానికి గ్రామంలోని మహిళలు, యువత మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ తరఫున మం డల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, జిల్లా దళిత హక్కుల నాయకులు, విజిలెన్స్ కమిటీ మెంబర్ బత్తిన మోహనరావు మహాలక్ష్మి దీక్షకు సంఘీభావం తెలిపారు. తనకు అన్యాయం జరి గిందని మహిళ పోరాటం చేస్తుంటే.. సర్పంచ్ వావిలపల్లి వరలక్ష్మి పట్టించుకోక పోవడం దారుణ మన్నారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఈ దీక్ష విరమించేదిలేదని మహాలక్ష్మితో పాటు ఆమె కుమార్తె కల్యాణి మొరపెట్టుకున్నారు. సంక్షేమ పథకాలు నిలుపుదల ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డు, పింఛన్ను అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు నిలుపుదల చేయడంతో మహాలక్ష్మి బోరున విలపిస్తోంది. బతికేందుకు కూడా వీలులేకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తనను తీవ్ర మానసిన వేదనకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్పీ త్రివిక్రమవర్మ వద్దకు వెళ్లి విన్నవించుకున్నామని తెలిపారు. -
ఓటెయ్యలేదని పింఛన్ ఇవ్వలేదయ్యా!
అనంతపురం రూరల్: ‘టీడీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో మాకు పింఛన్లు అందకుండా చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఎదుట పలువురు వృద్ధులు వాపోయారు. కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీలో మంగళవారం ఉదయం ‘ప్రకాష్తో ప్రతి ఉదయం’ కార్యక్రమాన్ని ప్రకాష్రెడ్డి నిర్వహించారు. కాలనీలోని వీధివీధినా తిరుగుతూ స్థానికులతో సమస్యలపై ఆయన ఆరా తీశారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు.. కాలనీ ఏర్పడి మూడు దశాబ్దాలు అవుతోందని, ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, అయినా ఈ నాలుగేళ్లలో ఒక్క ఇంటిని కూడా టీడీపీ ప్రభుత్వం మంజూరు చేయలేదంటూ ప్రకాష్రెడ్డితో కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తీరని నీటి ఎద్దడి కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పలువురు ఆరోపించారు. బిందెడు నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు. అందుతున్న అరకొర నీరుతో కనీస అవసరాలు తీరడం లేదన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని అన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటామన్నా.. మంజూరు చేయడం లేదని తెలిపారు. చాలా వీధుల్లో వీధి దీపాలు వెలగడం లేదని తెలిపారు. జగన్ సీఎం అయితే సమస్యలు పరిష్కారం ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చిస్తానని అన్నారు. మాయ మాటలతో ఓట్లు వేయించుకున్న వారికి తిరిగి అదే ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పీఏబీఆర్ పైప్లైన్ ద్వారా కాలనీ వాసులకు తాగునీటిని అందిస్తామంటూ ఎన్నికలకు ముందు పరిటాల సునీత హామీనిచ్చారని, అయితే నేటికీ నెరవేర్చలేకపోయారని అన్నారు. అయితే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ట్యాంకర్లు ఏర్పాటు చేసి కాలనీ వాసుల దాహార్తిని తీరుస్తున్నట్లు గుర్తు చేశారు. కక్కలపల్లి కాలనీని కార్పొరేషన్లోకి విలీనం చేస్తే ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. పేదలకు అండగా నిలిచిన తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కాలనీలో ప్రతి ఇంటికీ పీఏబీఆర్ ద్వారా నీటిని అందిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయనరేంద్ర( రాజారాం), మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, మండల యువజన కన్వీనర్ వరప్రసాదరెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాసులు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు మాధవరెడ్డి, శ్రీనివాసులువడ్డే, వడ్డుపల్లి గోపాలరెడ్డి అక్కంపల్లి మాధవరెడ్డి, గుగ్గిళ్ల జయకృష్ణారెడ్డి, వడ్డే లింగమయ్య, బండి రవికుమార్, æఆనంధరెడ్డి, నాగభూషణరెడ్డి, చిన్నపరెడ్డి, రామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, బిస్కెట్ వెంకటేష్, యువరాజ్, కార్తిక్ రెడ్డి, రామిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రామాంజినేయులు, కేశవరెడ్డి, సిండికేట్ నగర్ ఆంజినేయులు(బండా), రాము, హనుమంతు, ఎద్దులపల్లి నారాయణస్వామి, శివ, రాము పాల్గొన్నారు. -
పూల కోసం.. అత్తను చావబాదింది
కోల్కతా : తన అనుమతి లేకుండా పెరట్లోని పూలు కోసిందనే కారణంతో వృద్ధురాలనే కనికరం లేకుండా అత్తను చావబాదిందో కోడలు. విషయాన్ని గమనించిన ఇంటి పక్కన వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అత్తను హింసించిన కోడల్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యశోదాపాల్ అనే 75 ఏళ్ల వృద్ధురాలు భర్త మరణించడంతో కొడుకు, కోడలితో పాటు గారియాలో నివాసం ఉంటోంది. యశోదకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. కోడలు నిత్యం ఆమెను హింసిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే బుధవారం పెరట్లోకి వెళ్లి పూలు కోస్తున్న యశోదను చూసిన కోడలు కోపంతో ఆమెపై దాడి చేసింది. ‘నా అనుమతి లేకుండా పూలు కోస్తావా’ అంటూ జుట్టు పట్టి ఈడ్చుకుంటూ అత్తను చావబాదింది. ఇందుకు సంబంధించిన వీడియోను కోల్కతా పోలీసులు అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. A video was viral today in which a elderly lady was tortured by her daughter in law. Team #BANSDRONI PS traced the tormentor and arrested her. pic.twitter.com/wSUrenYWGc — DCP Jadavpur Divn Kolkata (@KPSouthsubnDiv) May 30, 2018 -
వృద్ధురాలనే కనికరం లేదా?
బషీరాబాద్(తాండూరు): ఏడు పదులు దాటిన వృద్ధురాలు గం గమ్మ. 40ఏళ్ల కిందట కట్టుకున్న భర్త వదిలేయడంతో నాటి నుంచి పుట్టిన ఊరులోనే నివాసముంటుంది. అయితే రోడ్డు విస్తరణకు ఆ వృ ద్ధురాలి ఇల్లు అడ్డుగా ఉందని గ్రామ సర్పంచ్ భర్త జేసీబీతో ఇంటిని కూల్చేశాడు. దీంతో కట్టుబట్టలతో ఆ వృద్ధురాలు రోడ్డుపాలైంది. ఆ ఇంటి పక్కనే రోడ్డుపై నిర్మించిన ఇళ్ల జోలికి పోలేదు. ఆ వృద్ధురాలికి పలువురు గ్రామ స్తులు బాసటగా నిలిచారు. ఆలస్యంగా వెలు గు చూసిన ఈ సంఘటన బషీరాబాద్ మండ లం ఎక్మాయి గ్రామంలో చోటుచేసుకుంది . సర్పంచ్ భర్తకు అధికారం ఎక్కడిది.. గ్రామానికి చెందిన మ్యాదరి గంగమ్మ(70)కు భర్త, పిల్లలు ఎవరూ లేకపోవడంతో అనాథగా జీవితం కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్యే గ్రామానికి ఈజీఎస్ నిధుల ద్వారా సీసీరోడ్డు మంజూరైంది. రోడ్డు నిర్మాణం కోసం గంగమ్మ ఇల్లు అడ్డం వస్తుందని గ్రామ సర్పంచ్ లావణ్య భర్త శ్యామప్ప ఈ నెల 24న జేసీబీతో ఇంటిని నేలమట్టం చేశాడు. కూల్చవద్దంటూ ప్రాధేయపడిన సర్పంచ్ భర్త కనికరించలేదని గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు సర్పంచ్ భర ్తకు అధికారం ఎక్కడిదని పలువురు గ్రామసు ్తలు ప్రశ్నిస్తున్నారు. చిన్న గల్లీలో అంతర్గత రో డ్డు వేయడానికి ఇల్లు కూల్చడం అవసరం లేద ని చెబుతున్నారు. చివరకు మంగళవారం గ్రా మస్తులే మీడియాకుసమాచారంఅందించారు. -
సీఎంకు నా బాధ చెప్పుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: తన అధీనంలో ఉన్న భూమిని కొంతమంది టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారంటూ వరంగల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు రెండు రోజులుగా అసెంబ్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలవాలని పోలీసులను అభ్యర్థిస్తూ ఉస్మానియా గేటు బస్టాండులో నిరీక్షిస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రం శివారులోని జక్కులొద్ది గ్రామానికి చెందిన వెంకటమ్మ, తన తాతముత్తాతల నుంచి అధీనంలో ఉన్న టెనెన్సీ భూములను టీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని నాలుగేళ్లుగా పోరాటం చేస్తోంది. దీనిపై ఎంఆర్వో నుంచి ఉపముఖ్యమంత్రి వరకు అందరికీ ఫిర్యాదు చేసింది. హైకోర్టులో కేసు కూడా తనకే మద్దతుగా వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. ఈ విషయంపై సీఎం కేసీఆర్కే విన్నవించుకునేందుకు వచ్చానని మంగళవారం అసెంబ్లీ గేటువద్ద పోలీసులతో మొరపెట్టుకుంటూ ‘సాక్షి’కి కనిపించింది. పాస్లేకుండా తాము పంపించలేమని పోలీసులు చెప్పడంతో కన్నీరుమున్నీరైంది. వెంకటమ్మతో సాక్షి మాట్లాడగా, సీఎం ఇంటి వద్దకు వెళ్లి కలిసేందుకు ప్రయత్నించానని, అయితే బలవంతంగా పోలీసులు రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దింపారని తెలిపింది. రెండు రోజుల నుంచి అసెంబ్లీ దగ్గరే ఉంటున్నానని చెప్పింది. తనకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే కొండా సురేఖకు విన్నవించుకుందామని వెళితే పట్టించుకోలేదని వెంకటమ్మ ఆరోపించింది. సీఎం మాత్రమే తనకు న్యాయం చేస్తారని, ఆయనను కలిసిన తర్వాతే ఇంటికి వెళ్తానని వెంకటమ్మ చెబుతోంది. -
చెక్క డబ్బాలో మాతృమూర్తి దయనీయస్థితి
-
వృద్ధురాలి దారుణ హత్య..
విశాఖపట్నం: పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలో రామలక్ష్మి(68) అనే వృద్ధురాలు మంగళవారం దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి దిండును ముఖానికి అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఓ కుమారుడు విజయవాడలో ఉంటుండగా..మరో కుమారుడు గ్రూప్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటూ హైదరాబాద్లో ఉంటున్నాడు. కుమార్తె ప్రహ్లాదపురంలోనే నాలుగు ఇళ్ల అవతల ఉంటోంది. ఈ ఘటనపై క్రైం డీసీపీ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలంలోకి డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
బామ్మకు టోకరా
ఖండవల్లి (పెరవలి) : మనవడు ఇచ్చిన సొమ్ము బ్యాంకులో వేద్దామని వచ్చిన ఓ బామ్మకు సినీఫక్కీలో మస్కా కొట్టి ఓ దొంగ సొమ్ముతో ఉడాయించిన ఘటన పెరవలి మండలం ఖండవల్లి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మూరి లక్ష్మమ్మ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి ఈ బామ్మ వద్దకు వచ్చి ‘నేనూ బ్యాంకులోనే పనిచేస్తున్నాను.. ఫారం రాసి ఇస్తాను..’ అని చెప్పి ఒక ఫారం రాసి ఇచ్చాడు. ఆ వృద్ధురాలు అదే నిజమని నమ్మి నగదు తీసి లెక్కిస్తుండగా ‘నేను లెక్కపెడతాను.. ముందు బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకురా’ అని చెప్పి బామ్మ వద్ద నుంచి రూ.60 వేలు తీసుకుని ఆమెను బయటకు పంపించేశాడు. ఆమె అలా వెళ్లగానే ఇచ్చిన సొమ్ముతో ఉడాయించాడు. జిరాక్స్ కాపీతో బ్యాంకు లోపలికి వచ్చిన బామ్మ ఆ గుర్తు తెలియని వ్యక్తి కనిపించకపోయే సరికి జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంది. బ్యాంకులోని వారంతా విషయాన్ని గ్రహించి చుట్టుపక్కల గాలించినా దొంగ ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటానా స్థలానికి పెరవలి ఎస్సై పి.నాగరాజు చేరుకుని బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజీని పరిశీలించారు. దొంగను పట్టుకోవటానికి ప్రత్యేక టీమ్ను పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
91 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి
మవెలిక్కర: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేరళలో అలప్పుజ జిల్లా ఒరివిక్కాడ్లో ఈ దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 91 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు(24) ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం ఆమె కూతురు ఇంటికి రాగా ఒంటినిండా గాయాలతో తన తల్లి కింద పడిపోయి కనిపించింది. విషయం గ్రహించిన ఆమె..వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధురాలి ఇంటికి సమీపంలోనే ఉండే యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. -
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
బాపట్ల: ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధురాలిని పోలీసులు రక్షించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం నందిరాజుతోటకు చెందిన ఓ వృద్ధురాలు నాగరాజు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇది గమనించిన బాపట్ల రూరల్ ఎస్సై చల్లా సురేష్ తన సిబ్బందితో కలిసి ఆమెను కాపాడారు. అయితే ఆ వృద్ధురాలు తన పేరును కానీ, ఆత్మహత్యకు యత్నించిన కారణం గానీ చెప్పడానికి నిరాకరిస్తున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు ఆమె వివరాల కోసం ఆరా తీస్తున్నారు. -
అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కూరాడలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు తగలబడి అప్పాయమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. ఆరు పశువుల పాకలు దగ్ధం కాగా రెండు పశువులు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. -
ఆ పండుటాకుకొచ్చింది.. 111వ వసంతం
కొత్తపేట : సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్న ఓ పండు వృద్ధురాలికి ఆమె తరతరాల వారసులు శుక్రవారం 110వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవతాళ్ళపాలెంకు చెందిన మాకా మంగమ్మ 1907 జనవరి 15న జన్మించారని, ఈ నెల 15న 111వ ఏట అడుగు పెడతారని వారసులు తెలిపారు. మంగమ్మకు చిల్లా ముసలమ్మ, ఏలూరి లక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన ముసలమ్మ వయసు 85 ఏళ్లకు పైబడింది. మంగమ్మ చాలాకాలంగా కొత్తపేట మండలం పలివెల శివారు వీరభద్రచౌదరిపురంలోని ముసలమ్మ వద్దే ఉంటున్నారు. ఆమె వారసులు 42 మందిలో అనేకులు ఉపాధి, ఉద్యోగాల పేరిట వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ వారు చౌదరిపురం వచ్చి మంగమ్మ బాగోగులు చూసి, తమ వద్దకు తీసుకువెళ్తుంటారు.110వ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు వారంతా వచ్చి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసారు.ఆమెతో కేక్ కట్ చేయించారు. ఆమెతో కలిసి అందరూ భోజనం చేశారు. -
బ్యాంకు ఉద్యోగినంటూ వృద్ధురాలికి టోపీ
-
పెద్ద నోట్లు రద్దు తర్వాత చెలరేగిన దోంగలు
-
అవ్వకు ఎంత కష్టం!
శ్రీకాకుళం: ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సవర బూదమ్మ. ఈమె వయస్సు 75 సంవత్సరాలు. ఈమెకు నా అంటూ ఎవరూ లేరు. భర్త ఎప్పుడో మృతి చెందాడు. సంతానం లేదు. దీంతో ఒంటిరిగా ఈ వయస్సులో అష్టకష్టాలు పడుతూ జీవనాన్ని నెట్టుకొస్తుంది. ఈమెకు నిబంధనల మేరకు పీటీజీ కావడంతో అంత్యోదయ కార్డు ఉండాల్సి ఉంది. కానీ అందరిలాంటి రేషన్కార్డు ఉండడంతో నెలకు కేవలం ఐదు కిలోల బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీంతో నెలంతా సాగలేక అష్టకష్టాలు పడుతూ ఇబ్బందుల పాలవుతుంది. తాను నివసిస్తున్న ఓ రేకుల షెడ్డుకు మరమ్మతులై వర్షానికి కారుతుండడంతో ఇలా సిమెంటు రాసేందుకు ఇంటి పైకప్పు మీదకు ఎక్కి తన పని తాను చేసుకుంటూ శుక్రవారం సాక్షి కెమెరాకు చిక్కింది. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అవ్వకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. –సీతంపేట -
గుర్తు తెలియని వృద్ధురాలి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం : అంతర్జాతీయ ఆత్మహత్యల వ్యతిరేక దినం రోజునే ఓ వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కోటిలింగాల ఘాట్లోని కోటిలింగేశ్వర స్వామి గుడి ఎదురుగా 65 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. సంచిలో పురుగు మందు తెచ్చుకున్న వృద్ధురాలు.. కూల్ డ్రింక్లో దానిని కలుపుకొని తాగింది. అపరస్మాకర స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగా ఆమె మరణించింది. ఆమె వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలిన గాయాలతో ఒకరి మృతి
కాజీపేట : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైన ఓ వృద్ధురాలు చికిత్సపొందుతూ సోమవారం ఎంజీఎం ఆసుపత్రిలో మృతిచెందింది. సీఐ రమేష్కుమార్ కథనం ప్రకారం.. కాజీపేట పట్టణానికి చెందిన గున్నా లింగమ్మ(82) ఈనెల 24న పొయ్యి వద్ద కూర్చోగా ప్రమాదవశాత్తు బట్టలకు నిప్పంటుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతురాలి మనుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
మహబూబాబాద్ : రైలు ఢీకొని గుర్తుతెలి యని వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మానుకోట రైల్వేస్టేçÙన్ సమీపంలో శుక్రవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధురాలు మానుకోట రైల్వేస్టేçÙన్ సమీపంలో ఆగిఉన్న గూడ్సు రైలు నుంచి కింది నుంచి పట్టాలుదాటి, ఆ తర్వాత లూప్లైన్ దాటుతుండగా అదే సమయంలో ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్(డౌన్లైన్లో) రైలు ఆ వృద్ధురాలిని ఢీకొట్టింది. రైలుకింద పడటంతో ఆమె కాలు విరిగి అక్కడికక్కడే మృతిచెందిం ది. ఆమె వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఆమె చేతిపై పచ్చబొట్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మృతదేహాన్ని వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృ తురాలి బంధువులుగానీ కుటుంబ సభ్యులుగానీ స్థానిక ఏరియా ఆస్పత్రిలో లేక జీఆర్పీ పోలీస్స్టేçÙన్లో సంప్రదించాలాన్నారు. -
అవ్వకు ఎంత కష్టం
గుణదల : నా.. అన్నవారు ఎవరూ లేరు.. కట్టుకున్నవారు.. కన్నవారు గతించారు.. మిగిలింది నేనొక్కదానే.. మాది శ్రీకాకుళం జిల్లా వండవ... అని చెబుతున్న ఆవాల అప్పల నర్సమ్మ (75) ఒక్కరే పిండ ప్రదానం చేస్తుంటే... అయ్యో ఈ ముసలవ్వకు ఎంత కష్టం వచ్చింది అని పలువురు కళ్లొత్తుకున్నారు. సోమవారం పద్మావతి ఘాట్లో తన భర్త, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్లకు ఆమె పిండ ప్రదానం చేసింది. గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తన కుటుంబీకులందరూ చనిపోయారని, తాను ఒక్కదాన్నే మిగిలానని, అకాల మరణం చెందిన తన కుటుంబ సభ్యుల ఆత్మలు శాంతించాలని పిండ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నుంచి ఒక్కదాన్నే వచ్చాచని ఆమె తెలిపారు. -
పట్టపగలే వృద్ధురాలి హత్య
నర్సంపేట : పట్టణ శివారులోని సర్వాపురంలో ఓ వృద్ధురాలిని పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి నగలు దోచుకెళ్లిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సర్వాపురానికి చెందిన కోల పూలమ్మ(65) నర్సం పేట– మహబూబాబాద్ ప్రధాన రహదారికి సమీపంలో నివా సం ఉంటోంది. భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందడంతో ఒంటరి గా జీవిస్తోంది. పెద్ద కుమారుడు అశోక్ ఖమ్మం జిల్లా పాల్వం చలో నివాసముంటుండగా, చిన్న కుమారుడు శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డాడు. కూతురు అరుణ కేసముద్రంలో ఉం టోంది. ప్రతి రోజు పూలమ్మ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి వచ్చేదని, మధ్యాహ్నం నుంచి కనిపించలేదని చుట్టు పక్కల వారు తెలిపా రు. పూలమ్మ ఉంటున్న ఇంట్లోని పక్క గదిలో మరో మహిళ వలపదాసు వసంత అద్దెకు ఉంటూ, బీడీలు చుట్టేందుకు బయటకు వెళ్లి సాయంత్రం వస్తోంది. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న వసంత పక్కగది తలుపులు దగ్గరికి వేసి ఉండడంతో అనుమానం వచ్చి తెరిచి చూడగా పూలమ్మ మృతి చెంది కని పించింది. దీంతో ఆమె చుట్టుపక్కలవారికి తెలపగా పోలీసుల కు సమాచారమిచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుతోపాటు చెవి కమ్మలు దోచుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ఇం ట్లో చొరబడి హత్యచేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. తెలిసినవారే హతమార్చారా ? ఒంటిరిగా ఉంటున్న పూలమ్మ గ్రామంలో ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ ఉండేదని, మెడలో బంగారు గొలుసుతోపాటు చెవులకు బంగారు కమ్మలు ఉండటాన్ని చూసిన దుండగులే నగల కోసం హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గదిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి వద్దకు తెలిసిన వ్య క్తులు వెళ్లడం వల్లనే ప్రతిఘటించలేదని, నగలు తీసుకున్న వ్య క్తులు తమను గుర్తుపట్టి ఉంటుందని, బయటకు తెలియకుండా ఉండేందుకు తలపై బాది గదిలో ఉన్న బియ్యం మూటను ముఖంపై అదిమి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. క్లూస్ టీంతో తనిఖీలు వృద్ధురాలి అనుమానాస్పద మృతి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ దాసరి మురళీధర్, సీఐ బోనాల కిషన్, ఎస్సై హరికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీంను రప్పించి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. -
1944లో పుష్కరాల్లో విమానం చూశా
గోదావరి పుష్కరాల్లో స్నానమాచరించిన రాజరాజేశ్వరి 94 ఏళ్ల వయసులో స్వయంగా దైనందిన కార్యకలాపాలు అంత్య పుష్కర జలాల్లోనూ ఓలలాడతానంటున్న ముదివగ్గు ఎనిమిదో ఏటే పెళ్ళయింది.. పశ్చిమ గోదావరి జిల్లా పరిమెళ్ల గ్రామంలో 1922 ఏప్రిల్ 8వ తేదీన జన్మించాను. తండ్రి కొలిచన అగ్నిహోత్రుడు, తలి ్లప్రకాశమ్మ. నాలుగో తరగతి వరకుచదువుకున్నాను. ఎనిమిదవ ఏటే 1930లో పెళ్ళి అయింది. భర్త దుర్భా వెంకటకృష్ణారావు. అప్పుడు ఆయన 9వ తరగతి చదువుతూండేవారు. తరువాత ఆయన సి.పి.డబ్లు్య.లో ఇంజినీరుగా ఉద్యోగపర్వంలోకి అడుగుపెట్టారు. ఆయనతో పాటు దేశమంతా తిరిగాను. తమిళ, కన్నడభాషలు నేర్చుకున్నాను. మాకు ఏడుగురు సంతాన.. అయిదుగురు అబ్బాయిలు,ఇద్దరు అమ్మాయిలు. ఆఖరి అబ్బాయికి తప్ప అందరికి షష్టిపూర్తి వేడుకలు జరిగాయి. అందరూ కేంద్రప్రభుత్వ సంస్థల్లో పని చేశారు. మా వారు 1967లో కాలం చేశారు. రాజమహేంద్రవరం కల్చరల్: ‘ఇప్పటికి ఎనిమిది పుష్కరాలు చూశాను. పవిత్ర గోదావరిలో స్నానాలు చేశాను. ఈ అంత్యపుష్కరాలకు కూడా గోదావరీ జలాలలో స్నానమాచరిస్తాను’ ఆత్మ విశ్వాసంతో అన్నారు 94 సంవత్సరాల దుర్భా రాజరాజేశ్వరి. శతాబ్ది ప్రాయానికి దరిదాపుల్లో ఉన్నా.. నేటికీ తన దైనందిన కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునే ఆ గోదావరి జిల్లాల ఆడపడుచు తన తొమ్మిదిన్నర దశాబ్దాల జీవనయానంలో వచ్చిన పుష్కరాలు, నేటి తరానికి అచ్చెరువు కలిగించే తన జీవనసరళిని, కుటుంబ వివరాలను సోమవారం స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని తన గృహంలో ‘సాక్షి’కి ఇలా వివరించారు.. ఒకప్పుడింత హడావిడి లేదు.. నాకు పదేళ్లప్పుడు 1932లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. తర్వాత 1944, 1956, 1967, 1979, 1991, 2003, 2015 సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు చూశాను. ఒకప్పుడు ఇంతమంది జనం, హడావిడి ఉండేవి కావు. 1944 పుష్కరాల్లో విమానాల్లో ప్రజలను గిరికీలు కొట్టించేవారు. పెద్దవాళ్ళకు అయిదు రూపాయలు, పిల్లలకు మూడు రూపాయలు టిక్కెట్టు నిర్ణయించారు. విమానం చూడటం అదే మొదటిసారి. నిఘంటువులో డాక్టర్లు లేరు.. డాక్టర్లు, వైద్యాలు నా నిఘంటువులో లేవు. జలుబు చేస్తే మిరియాల రసం, జీర్ణశక్తి బాగా లేకపోతే కాస ్తపంచదార కలుపుకొని వాము తీసుకుంటాను. పైత్యంగా ఉందనిపిస్తే అల్లంముక్క నోట్లో ఉంచుకుని నములుతాను. ఇవి నా దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటాను. సాంప్రదాయాలకు దూరమైతే అనర్థాలు చేరువ మన సాంప్రదాయాలకుదూరం అయితే, అన్ని అన ర్థాలూ మన వెంటే ఉంటాయని నమ్ముతాను. ప్రతిరోజూ విష్ణుసహస్రనామాలు చదవుతాను. భాగవతం, ఆనందరామాయణం చదువుకున్నాను. గోదావరీ తీరంలో నివసించడం, ఇన్ని పుష్కరాల్లో తీర్థస్నానాలు చేయడం నా సుకృతంగా భావిస్తున్నాను. అన్నీ తినడమే ఆరోగ్యరహస్యం .. అన్నీ తినడమే నా ఆరోగ్యరహస్యం. నా విషయంలో– అన్నంలో కూర కలుపుకొంటాను అనడం కన్నా..కూరలో అన్నం కలుపుకొంటాను అనడం కరెక్టు. అన్నం తక్కువ, కూరలు ఎక్కువగా తీసుకుంటాను. చిన్నప్పటి నుంచీ నెయ్యి, పెరుగు బాగా అలవాటు. మామిడిపళ్ళ సీజనులో ప్రతిరోజూ వాటిని తీసుకుంటాను. మిగతా సమయాల్లో ఆయా సీజన్లలో లభ్యమయ్యే పళ్ళు తప్పని సరి. కార్తికమాసంలో ప్రతిరోజు నక్షత్రదర్శనం అయ్యేవరకు ఉపవాసం చేస్తాను. రాత్రి ఒక్కపూటే ఆహారం తీసుకుంటాను. ప్రతి ఏకాదశికి ఉపవాసం తప్పనిసరిగా చేస్తాను. -
80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
ధర్మవరం అర్బన్ : మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ధర్మవరం పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహాత్మగాంధీ కాలనీలో 80 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె ఎప్పుడూ ఇంటి బయటే ఉంటుంది. అటువంటి ఆమెపై సోమవారం తెల్లవారుజామున ఫకృద్దీన్ అలియాస్ ఫకృ అనే యువ ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. స్థానికులు, బంధువులు గమనించి ఆటోడ్రైవర్ను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. రాత్రి ఏడు గంటల సమయంలో పోలీసులకు అప్పగించారు. ఆటోడ్రైవర్ అంటే కాలనీలో చాలామందికి గిట్టదని, ఆ క్రమంలోనే వృద్ధురాలిపై అత్యాచారం చేసినట్లు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశారని సీఐ విజయభాస్కర్గౌడ్ పేర్కొన్నారు