olx
-
Hyderabad: ఘరానా సైబర్ నేరగాడి ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: యజమాని అతడు కాదు... విక్రయించేది–ఖరీదు చేసేదీ కూడా అతగాడు కానేకాదు... అయినప్పటికీ ఈ–కామర్స్ సైట్లో ఫోన్లకు సంబంధించిన పోస్టులు చేసిన వారిని సంప్రదించి డిలీట్ చేయిస్తాడు... ఆపై అవే వివరాలను తాను పోస్టు చేస్తాడు...క్రయవిక్రయాలు చేసే వారిని ఓ ‘ప్లాట్ఫామ్’ పైకి తీసుకువస్తాడు..ఆ ఇద్దరినీ కలిపి తాను ‘లాభపడతాడు’. కేవలం ఐఫోన్లనే టార్గెట్గా చేసుకుని, ఈ వినూత్న పంథాలో తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని మోసం చేసి రూ.60 లక్షలు స్వాహా చేసిన ఘరానా మోసగాడు మరిశర్ల బాలాజీ నాయుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ఎస్.మోహన్కుమార్ ప్రకటించారు. ఇన్స్పెక్టర్ బి.శోభన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్... ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన బాలాజీ నాయుడు అక్కడి ఎస్వీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చిన ఇతగాడు తొలినాళ్లల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేశాడు. జల్సాలు, బెట్టింగ్స్, ఆన్లైన్ గేమింగ్స్కు జీతం డబ్బులు చాలకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరబాట పట్టాడు. ఇందులో భాగంగా వివిధ పేర్లతో సిమ్కార్డులు తీసుకునే ఇతగాడు తరచు తన ఫోన్లు మారుస్తూ ఉంటాడు. 2018 నుంచి మోసాలు చేయడం మొదలెట్టిన బాలాజీ ఇప్పటి వరకు 30 ఫోన్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించడానికి ఉపకరించే ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్ ఆధారంగా మోసాలు ప్రారంభించాడు. ఆ సైట్/యాప్ను ఆద్యంతం గమనించే బాలాజీ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లు పెట్టిన పోస్టుల్ని గుర్తిస్తాడు. వాటిలో కొన్ని ఎంపిక చేసుకుని అందులోని ఫొటోతో పాటు ఇతర వివరాలు కాపీ చేసుకుని భద్రపరుచుకుంటాడు. వారితో తీయించి తాను పోస్టు చేసి... ఆపై ఆ పోస్టు చేసిన వ్యక్తిని సంప్రదించే బాలాజీ ఏమాత్రం బేరసారాలు లేకుండా ఆ ఫోన్ తాను ఖరీదు చేస్తున్నట్లు, త్వరలోనే సంప్రదించి కలుస్తానని చెప్తాడు. అలా వారి నమ్మకాన్ని పొంది ఓఎల్ఎక్స్ నుంచి పోస్టు తీసేలా చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్ద ఉన్న ఫొటో, వివరాలతో తానే ఆ ఫోన్ విక్రయిస్తున్నట్లు అదే ఓఎల్ఎక్స్లో పోస్టు చేసే బాలాజీ..తక్కువ రేటు పొందుపరుస్తాడు. ఈ పోస్టును చూసిన వాళ్లల్లో ఆకర్షితులైన వాళ్లు ఫోన్ ద్వారా బాలాజీని సంప్రదిస్తారు. వారితో బేరసారాలు పూర్తి చేసే అతగాడు..ఫలానా చోట తనను కలిసి, నగదు చెల్లించి, ఫోన్ తీసుకువెళ్లాలని సూచిస్తాడు. అదే సమయంలో ఫోన్ అసలు యజమానికి సంప్రదించే బాలాజీ అతడినీ ఆ ప్రాంతానికి రమ్మని, నగదు చెల్లించి ఫోన్ తీసుకుంటానని చెప్తాడు. అలా ఫోన్ యజమాని, తన ప్రకటన చూసి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన వ్యక్తి కలుసుకోవడానికి కొద్దిసేపటి ముందు వారిని మరోసారి సంప్రదిస్తాడు. తాను రాలేకపోతున్నానని, తన సోదరుడు వస్తున్నాడని చెప్పి, ఫోన్ రేటు విషయం చెప్తే అంత డబ్బు పెట్టి ఎందుకు కొంటున్నావు? అని మందలిస్తారంటూ వారికి చెప్తాడు. ఈ కారణంగానే రేటు విషయం చర్చించ వద్దంటూ ఇద్దరికీ చెప్తాడు. ఇలా ఆ ఇద్దరూ కలిసిన తర్వాత ఖరీదు చేసే వ్యక్తిని బుట్టలో వేసుకుని యజమాని వద్ద ఫోన్ చూసిన వెంటనే నగదు తనకు బదిలీ చేసేలా చేస్తాడు. ఆపై తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుంటాడు. క్రయవిక్రేతలు మాత్రం కొద్దిసేపు ఘర్షణ పడి, అసలు విషయం తెలుసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇలా ఇతగాడు తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని ముంచి రూ.60 లక్షలు స్వాహా చేశాడు. ఈ డబ్బును డప్ఫాబెట్, సారా, రమ్మీటైమ్, రమ్మీ సర్కిల్ వంటి గేమింగ్, బెట్టింగ్ యాప్స్లో పెట్టడం, జల్సాలు చేయడం చేసి ఖర్చు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో బాధితులకు నేరుగా ఆయా యాప్స్కు సంబంధించిన క్యూర్కోడ్స్ పంపి, నేరుగా డబ్బు వాటికే పంపేలా చేశాడు. ఇతగాడిని కటకటాల్లోకి పంపిన పంజగుట్ట పోలీసులు రెండు ఫోన్లు, మూడు సిమ్కార్డులు స్వాదీనం చేసుకున్నారు. బాలాజీపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 138 ఫిర్యాదులు, తెలుగు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల పంజగుట్టలో 3, మధురానగర్లో మరో 3 కేసులు నమోదు కాగా..మరో 25 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తాను ఉపయోగించిన బెడ్ను విక్రయించడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 68 లక్షల నష్టాన్ని చవిచూశాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసం ఉంటూ నగరంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ మోసానికి బలైపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన 36 సంవత్సరాల ఇంజినీర్ రూ. 15000లకు బెడ్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్ యాప్లో ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఇది చూసి కొనుగోలు చేయాలనుకున్న ఓ వ్యక్తి (మోసగాడు), బెడ్ అమ్మాలనుకున్న ఇంజినీర్కు ఫోన్ చేసాడు. ఇంజినీర్ వెల్లడించిన ధరకే కొనుగోలు చేస్తానని చెప్పిన మోసగాడు UPI లావాదేవీకి సంబంధించిన సాంకేతిక సమస్యలున్నట్లు, పరిష్కరించుకోవడంలో భాగంగా తనకు రూ. 5000 పంపాలని వెంటనే తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మోసగాని మాటలు విన్న టెకీ రూ. 5వేలు పంపించాడు. మోసగాడు మొదట్లో రూ. 10వేలు పంపించాడు. ఇలాగే మళ్ళీ రూ. 5వేలు, రూ. 10వేలు, రూ. 15వేలు డిమాండ్ చేస్తూ మొత్తానికి భారీగానే సబ్బు గుంజేసాడు. ఇదీ చదవండి: ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ డబ్బు పంపించే క్రమంలో మోసగాడు టెకీకి రూ. 30000 షేర్ చేసాడు. మోసగాడు టెక్కీని లింక్ను ఉపయోగించి డబ్బును తిరిగి ఇవ్వమని, OTPని షేర్ చేయమని కోరాడు. ఇంజనీర్ OTP ట్రాప్లో పడిపోగానే, అతను ఏకంగా 68 లక్షల రూపాయల కోల్పోయాడు. రూ. 68 లక్షలు పోగొట్టుకున్న టెకీ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సైబర్ లేదా ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా మోసాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. -
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన కిరణ్కుమార్ కృష్ణానగర్లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓఎల్ఎక్స్లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత
నెదర్లాండ్కు చెందిన ప్రోసస్ కంపెనీ క్లాసిఫైడ్స్ వ్యాపార విభాగమైన ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 800 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ గ్రూప్నకు చెందిన ఓఎల్ఎక్స్ ఆటోస్ కార్యకలాపాలను కొన్ని దేశాల్లో మూసివేస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్ఎక్స్ గ్రూప్ టెక్ క్రంచ్ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్స్టర్డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. ‘ఈ సంవత్సరం ప్రారంభంలో ఓఎల్ఎక్స్ ఆటోస్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచే సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం’ అని కంపెనీ టెక్క్రంచ్ వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రకటనలో తెలిపింది. అర్జెంటీనా, మెక్సికో, కొలంబియాలో కంపెనీ తన కార్యకలాపాలను మూసివేసింది. ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ప్రోసస్ సంస్థ తన క్లాసిఫైడ్స్ వ్యాపారం ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
ఓఎల్ఎక్స్లో భారీగా ఉద్యోగ కోతలు: కారణం ఏంటంటే?
సాక్షి,ముంబై:ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఖర్చులనుతగ్గించుకునే పనిలో దిగ్గజ సంస్థలు కూడా వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తున్నారు. ప్రతీ రోజు ఏదో ఒక కంపెనీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తోంది. తాజాగా వస్తువుల కొనుగోలు, అమ్మకాల సంస్థ, నాస్పర్స్ యాజమాన్యంలోని ఆన్లైన్ గ్రూప్ ప్రోసస్ క్లాసిఫైడ్స్ యూనిట్ ఓఎల్ఎక్స్ గ్రూప్ 15 శాతం సిబ్బందిని ఇంటికి పంపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,500 మందిని తొలగించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను నియంత్రించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. భవిష్యత్తు ఆశయాల రీత్యా కంపెనీ అంతటా వర్క్ఫోర్స్ను తగ్గిస్తునట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా, ఓఎల్ఎక్స్ గ్రూప్ తన ఇండోనేషియా కార్యకలాపాలను తగ్గించు కోవాలని చూస్తోందట. ఇప్పటికే ఆటో వ్యాపారాన్ని అమ్మకానికి ఉంచిందని డీల్స్ట్రీట్ ఆసియా గత వారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా, ఓఎల్ఎక్స్ 10,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. -
రూ. 4.4 లక్షల కోట్లకు ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నాళ్లుగా కొత్త కార్ల మార్కెట్ను మించి ప్రీ–ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోంది. రాబోయే ఐదేళ్ల వ్యవధిలో (2022–27) ఇది వార్షికంగా 16 శాతం మేర పెరిగి రూ. 4.4 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఇదే వ్యవధిలో కొత్త కార్ల మార్కెట్ వృద్ధి వార్షికంగా 10 శాతంగానే ఉండనుంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్లో ఓఎల్ఎక్స్ రూపొందించిన 6వ విడత ఓఎల్ఎక్స్ ఆటోస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో లాక్డౌన్ల కారణంగా సరఫరా తగ్గి ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్ కాస్త మందగించినా .. 2022 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ కోవిడ్–పూర్వ స్థాయికి చేరింది. కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగపడుతుండటం, కార్యాలయాలు తెరుచుకోవడంతో ప్రయాణాలు పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రీ–ఓన్డ్ వాహనాల మార్కెట్ మరింత పుంజుకోగలదని ఓఎల్ఎక్స్ ఇండియా సీఈవో అమిత్ కుమార్ తెలిపారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో ప్రీ–ఓన్డ్ కార్ల విక్రయాలు విలువపరంగా 2.5 రెట్లు, పరిమాణంపరంగా రెండు రెట్లు పెరగనున్నట్లు పేర్కొన్నారు. ప్రీ–ఓన్డ్ మార్కెట్లో చిన్న కార్ల ధరలు సగటున రూ. 2–4 లక్షలు, సెడాన్లు రూ. 5–6 లక్షలు, యూవీలు రూ. 7–9 లక్షల శ్రేణిలో ఉంటున్నాయి. యూవీలకు ప్రాధాన్యం.. నివేదిక ప్రకారం ప్రీ–ఓన్డ్ కార్ల అమ్మకాలు 2022 ఆర్థిక సంవత్సరంలో 41 లక్షలుగా ఉండగా 2027 నాటికి రెట్టింపై 82 లక్షలకు చేరనున్నాయి. అదే వ్యవధిలో కొత్త కార్ల విక్రయాలు 9–11 శాతం వృద్ధితో 48 – 50 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. మిగతా రకాలతో పోలిస్తే యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతోంది. ప్రీ–ఓన్డ్ కార్ల విభాగం తీసుకుంటే 2017–2022 మధ్య కాలంలో వీటి మార్కెట్ వాటా 17 శాతం నుండి 22 శాతానికి పెరిగింది. రాబోయే అయిదేళ్లలో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 32 శాతానికి చేరవచ్చని అంచనా. ఓఎల్ఎక్స్ ప్లాట్ఫాం డేటా ప్రకారం హ్యుందాయ్ క్రెటా, మారుతీ బ్రెజా, మారుతీ ఎర్టిగా, మహీంద్రా ఎక్స్యూవీ 500లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అటు కొత్త కార్ల విభాగంలోను యూవీల హవా కొనసాగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి 49 శాతం మార్కెట్ వాటాతో చిన్న కార్లు (45 శాతం), సెడాన్లను (3 శాతం) కూడా అధిగమించాయి. చిన్న కార్లు, సెడాన్ల తగ్గుదల.. ప్రీ–ఓన్డ్ విభాగంలోని మొత్తం కార్లలో 58 శాతం వాటాతో చిన్న కార్లదే ఆధిపత్యం ఉన్నప్పటికీ రాబోయే అయిదేళ్లలో ఇది స్వల్పంగా 2 శాతం తగ్గి 56 శాతానికి చేరవచ్చని అంచనా. ఈ విభాగంలో హ్యుందాయ్ ఎలీట్ ఐ20, రెనో క్విడ్, మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మొదలైన వాటికి ఎక్కువగా ఆదరణ ఉంటోంది. మరోవైపు, సెడాన్ కార్ల విభాగం మార్కెట్ వాటా గణనీయంగా తగ్గనుంది. ఇది 12 శాతం నుండి 7 శాతానికి పడిపోవచ్చని అంచనా. కొత్త కార్ల మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు తగ్గుతుండటం, కొత్తగా వచ్చే మోడల్స్ తక్కువగా ఉంటుండటం, కస్టమర్లు యూవీలవైపు మొగ్గు చూపుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం కానున్నాయి. యూవీల్లోనూ కొత్త మోడల్స్ వచ్చే కొద్దీ పాతవాటిని చాలా వేగంగా మార్చేస్తున్నారు. దీంతో నిన్న, మొన్న ప్రవేశపెట్టినవి కూడా ప్రీ–ఓన్డ్ సెగ్మెంట్లోకి వచ్చేస్తున్నాయి. మిగతా కార్లకు కూడా ఇదే ధోరణి విస్తరిస్తోంది. దీంతో 2027 నాటికి ప్రీ–ఓన్డ్ మార్కెట్లో సగటు వయస్సు 0–7 ఏళ్ల స్థాయిలో ఉండే వాహనాల వాటా 58 శాతం పైగా ఉంటుందని, ఇప్పుడున్న స్థాయికి 2.2 రెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఎక్కువగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ప్రీ–ఓన్డ్ కార్లకు డిమాండ్ ఉంటోంది. ► మొత్తం కస్టమర్లలో తొలిసారి కొనుగోలు చేసే వారి వాటా 40–45 శాతంగా ఉంటోంది. ► మహిళా కొనుగోలుదారుల వాటా మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో 10 శాతంగాను, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో 5 శాతం లోపు ఉంటోంది. ► ట్రాఫిక్ కారణంగా మెట్రోల్లో ఎక్కువగా ఆటోమేటిక్ వెర్షన్లకు డిమాండ్ ఉంటోంది. -
సైబర్ క్రిమినల్స్ కేరాఫ్ రాజస్తాన్
రాజస్తాన్ రాష్ట్రం సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఆర్థికాంశాలతో ముడిపడిన ఈ నేరాలు చేస్తూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గత ఏడాది సిటీ సైబర్ కాప్స్ అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే 20 శాతం వరకు ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 344 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 86 మంది ఉండగా.. మిగిలిన 258 మందిలో రాజస్తాన్ వాసుల సంఖ్య అత్యధికంగా 50 ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ వాసులు) దాదాపు 99 శాతం ఈ కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులై ఉంటున్నారు. అడ్డంగా దోచేసే ఆర్థిక నేరగాళ్లు సైబర్ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా వస్తువులు విక్రయిస్తామని, ఖరీదు చేస్తామని ఎర వేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ... ఆపై అందినకాడికి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. న్యూడ్ కాల్స్ చేయించి బ్లాక్ మెయిల్ చేయడమూ వీరి మోసాల్లో ఒక పంథా. ఇక ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీ, నోయిడా, గుర్గావ్లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా కాల్సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లూ పెద్ద సంఖ్యలో... పెద్ద మొత్తాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోయాలియా వంటి ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్కు వచ్చి నగరాల్లో నివసిస్తున్న ఈ నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారూ మనీమ్యూల్స్గా మారి సహకరిస్తున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు. ఓటీపీలతో జార్ఖండ్ నేరగాళ్ల టోపీ బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి...డెబిట్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి...అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్లోని జమ్తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్తార యువత ఇప్పుడు ‘కాల్ సెంటర్లను’ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. డెబిట్ కార్డును ఆధార్తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. -
ఆన్లైన్ మోసానికి గురయ్యారా? వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి
పాత వస్తువులను అమ్మకానికి పెట్టాలన్నా... చవగ్గా కొనాలన్నా ఇప్పుడు ఆన్లైన్ పద్ధతినే చాలా మంది ఎంచుకుంటున్నారు. ఇది సులువైన ప్రక్రియ కావడం కూడా ఇందుకు కారణం. ఇటీవల ఆన్లైన్ మార్కెట్ప్లేస్ ఓఎల్ఎక్స్లో తమ పాత మనీ కౌంటింగ్ మిషన్ను రూ.5000కు అమ్మకానికి పెట్టింది శ్రీజ(పేరు మార్చడమైనది). ఇమేజ్ అప్లోడ్ చేసిన గంట లోపు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తాను, తన అడ్రస్కు కొరియర్ చేయమని సూచించాడు. అందుకు సరే అంది శ్రీజ. అతను తనకు ఆర్మీ అకౌంట్ ఉందని, ముందుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేనని, శ్రీజ నే రూ.100 లు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సరే అనుకున్న శ్రీజ అతను చెప్పిన అకౌంట్కు ఆన్లైన్ పే యాప్స్ ద్వారా రూ.100 ట్రాన్స్ఫర్ చేసింది. అతను తిరిగి రూ.200 ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత తన ఖాతా నుంచి డబ్బు సెండ్ అవడం లేదని, ఇతరుల నుంచి డబ్బు తన ఖాతాకు రావడం లేదని మరోసారి శ్రీజ నే కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అలా ఫోన్ మాట్లాడుతూనే అతను చెప్పిన సూచనలతో తనకు తెలియకుండానే డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది శ్రీజ. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. ట్రాన్సాక్షన్స్ మెసేజ్లు చూసుకున్నాక శ్రీజకు దిమ్మతిరిగిపోయింది. తన అకౌంట్ జీరో బ్యాలెన్స్ చూపిస్తోంది. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే, స్విచ్డాఫ్ వస్తోంది. చివరకు తను మోసపోయానని అర్ధమైంది. ఆన్లైన్ మోసం.. హెల్ప్లైన్ కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్లు కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అలాగే, ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక మార్గంలో వినియోగదారులు/అమ్మకందారుల ఆశను ఎరగా చేసుకొని స్మూత్గా డబ్బు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసుల్లో మోసపోయిన వ్యక్తులకు సాయం అందించడానికి 155260 హెల్ప్లైన్ అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేస్తే బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ► ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్లైన్ ఆన్లైన్, ఆఫ్లైన్... రెండు విధాలా సేవలు అందిస్తుంది. ► సూచించిన పోర్టల్లో .. మోసం లావాదేవీ వివరాలు (ఖాతా నంబర్, వాలెట్, యుపిఐ, లావాదేవీ జరిపిన ఐడీ, తేదీ, డెబటి/క్రెడిట్ కార్డ్ నంబర్లు.. మొదలైనవి), వ్యక్తిగత ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ► బాధితుల బ్యాంక్ లేదా మోసం చేసి డబ్బు జమ అయిన బ్యాంక్/వాలెట్.. వంటివి నోట్ చేయాలి. ► మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్లో 24 గంటల్లోగా ఉంచాలి. ఆ వెంటనే బాధితుడు నమోదు చేసిన ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ► పోర్టల్లో సంబంధిత బ్యాంక్, అంతర్గత సిస్టమ్ల వివరాలను తనిఖీ చేస్తుంది. ► బాధితుడి డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయ్యిందో చూసి, ఆ డబ్బును హోల్డ్లో ఉంచుతుంది. అంటే, మోసగాడు ఆ డబ్బును పొందలేడు. మోసగాళ్ల చేతికి డబ్బు చేరకుండా తిరిగి పొందేంతవరకు ఈ ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుంది. ► సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సూచించిన అనేక బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు విత్డ్రా చేసినట్లయితే, తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. భద్రతా సూచనలు... ► ఫోన్ సంభాషణల్లో ఉన్నప్పుడు ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదు. ► క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా ఓటీపీ, యుపీఐఎన్, బ్యాంక్ కార్డ్ సీవీవీ నంబర్లు షేర్ చేయడం అంటే మీ ఖాతా నుండి డబ్బును మీరే వదులుకుంటున్నారని అర్ధం. ► కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ ఇంజిన్లలో ఎప్పుడూ శోధించవచ్చు. సరైన కస్టమర్ కేర్ నంబర్ కోసం సంబంధిత యాప్ లేదా అప్లికేషన్ వెబ్సైట్ను ఓపెన్ చేసి, తెలుసుకోవాలి. ► అన్ని ఇ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల కోసం రెండు రకాల ఫోన్ నంబర్లు వాడటం శ్రేయస్కరం. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఓఎల్ఎక్స్లో.. రూ. 50 వేలకే పల్సర్ బైక్ ఇప్పిస్తానని చెప్పి..
సాక్షి, జిన్నారం(మహబూబ్నగర్): సెకండ్ హ్యాండ్ బైక్ను కొనుగోలు చేసే విషయంలో రూ.50వేలు నష్టపోయానని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలో ఆదివారం జరిగింది. బొల్లారం సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా విపన్నగాండ్ల గ్రామానికి చెందిన మాండ్ల సురేశ్(26) భార్య సౌందర్యలతో కలిసి బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్పబస్తీలో నివాసం ఉంటున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మాండ్ల సురేశ్ గత కొంత కాలంగా ఓఎల్ఎక్స్లో విధులు నిర్వహిస్తున్న అశోక్కుమార్తో పరిచయం పెంచుకున్నాడు. రూ. 50వేలకే సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ను ఇప్పిస్తానని అశోక్కుమార్ చెప్పాడు. రెండు నెలల నుంచి దశల వారీగా సురేశ్ రూ. 50వేలను అశోక్కుమార్కు అప్పజెప్పాడు. అనంతరం పది రోజుల నుంచి అశోక్కుమార్ ఫోన్ లేపటం లేదు. ఫోన్ స్విచ్ఆఫ్ రావటంతో తాను నష్టపోయానని భావించిన సురేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ ప్రశాంత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బీఅలర్ట్: స్కాన్ పేరుతో స్కామ్!
శ్రీకాకుళం: నట్టింటికి నెట్ వచ్చినప్పటి నుంచి వలలో వేయడం, పడడం తేలికైపోయింది. వస్తువులు అ మ్మాలన్నా కొనాలన్నా చాలా మంది ఓఎల్ఎక్స్/క్వికర్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా ఒక అవకాశంగా మలచుకొని ప్రజలను మోసగిస్తున్నారు. ఎలా మోసం చేస్తారు..? ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో వస్తువులను అ మ్మదలచి పోస్ట్లను పెడితే, సైబర్ నేరగాళ్లు ఆర్మీ/ నేవీ లేదా పారా మిలటరీకి చెందిన ఉద్యోగులమని నమ్మించి ఆ వస్తువులను కొనడానికి అంగీకరిస్తారు. డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేస్తామని చెప్పి ఎప్పటి దో రశీదు కావాలనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. డబ్బులు రాలేదని గ్రహిస్తే.. ఏదో టెక్నికల్ కారణం వల్ల పేమెంట్ ఆగి ఉంటుందని, ఈసారి క్యూఆర్ కోడ్ను పంపిస్తున్నామని స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ పొందాలని సూచిస్తారు. అలా చేస్తే మన అకౌంట్లో డబ్బులు పడడం బదు లు మన డబ్బులే పోతాయి. పోయాక కూడా అటువైపు వ్యక్తితో మాట్లాడితే ఇదే ప్రాసెస్ను రెండు మూ డు సార్లు చేయాలని చెప్పి అందిన కాడికి దోచేస్తారు. డబ్బు చేతికి అందిన వెంటనే కనెక్షన్ కట్ చేసేస్తాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి నేరాలు చేసే వారు అవతలి వ్యక్తిని నమ్మించేందుకు ఆర్మీ/నేవీ/పారా మిలటరీ ఫోర్స్కు చెంది న ఉద్యోగులుగా ఫేక్ ఐడెంటిటీ కార్డులు లేదా పత్రా లు సృష్టించి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో పాత వస్తువులను కొనే ముందు లేదా అమ్మే ముందు అవతలి వ్యక్తి వివరాలు నిశితంగా పరిశీలించి సంప్రదింపులు జరపాలి. ఇలాంటి లావాదేవీల విషయంలో అడ్వాన్స్ పేమెంట్స్ చేయడం గానీ లేదా అంగీకరించడం గా నీ చేయకూడదు. అలాగే లింక్స్ క్లిక్ చేయడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం అంటే మోసపోవడమే. పిన్ నంబర్ను డబ్బులు పంపడానికే తప్ప రిసీవ్ చేసుకోవడానికి వాడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమ్మే వ్యక్తి/కొనే వ్యక్తి అనవసరమైన కంగా రు లేదా తొందర పెడుతుంటే మోసమని గ్రహించాలి. -
ఓఎల్ఎక్స్ మోసం.. దొంగ దొరికేశాడుగా!
సాక్షి, కుత్బుల్లాపూర్: ఓఎల్ఎక్స్ వేదికగా మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుచిత్ర సమీపంలోని కృష్ణమూర్తినగర్కు చెందిన ఇవాన్ రాజు ఫ్లూటర్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగి. కాగా ఏప్రిల్ 20న ఓఎల్ఎక్స్ యాప్లో ఓ వ్యక్తి ప్లే స్టేషన్–5 అనే వస్తువును విక్రయానికి పెట్టగా అది చూసిన ఇవాన్రాజు తన ఫోన్ నంబర్ను షేర్ చేశాడు. వెంటనే అతడికి రంజిత్రెడ్డి (ఫోన్ నం. 790837947)అనే వ్యక్తి కాల్ చేశాడు. గూగుల్ పే ద్వారా అకౌంట్ నం. 6281673654కు రూ.15 వే లు పంపితే ‘ప్లే స్టేషన్–5’ను పంపుతానని చెప్పా డు. అంతేకాకుండా తన ఆధార్ కార్డు ఫొటోను సైతం షేర్ చేశాడు. దీంతో అతడిపై నమ్మకం కలిగి ఇవాన్రాజు రూ.15 వేలు పంపాడు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చుల నిమిత్తం మరో రూ.6,500 పంపాలని కోరగా.. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ నంబర్ అంటూ 830 9520268 పంపాడు. అయితే, సదరు వస్తువును ఎంతకీ డెలివరీ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గత నెల 25న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు న మోదు చేశారు. ఫోన్ నంబర్, ఆధార్ కార్డుల ఆధా రంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసానికి పా ల్పడిన వ్యక్తి బాగ్అంబర్పేట్ రామకృష్ణనగర్కు చెందిన రంజిత్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశానుసారం రంజిత్ను సోమవారం రిమాండ్కు తరలించారు. -
వంట మనిషి పేరిట యువకునికి టోకరా..
సాక్షి, జీడిమెట్ల: వంట మనిషి కోసం ఓఎల్ఎక్స్లో యాడ్ ఇచ్చిన ఓ వ్యక్తి రూ.11,500లు మోసపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం... అపురూపకాలనీకి చెందిన లంక గణేష్ చంద్ర(20) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ తన స్నేహితుడు అనిల్తో కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాలని అనుకున్నాడు. వంట మనిషి కావాలంటూ ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టాడు. ఇది చూసిన ఓ వ్యక్తి గణేష్కు ఫోన్ చేసి తాను విజయవాడ ఎస్ఎన్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. రెండు వారాల్లో వంట మనిషిని పంపిస్తానని, తాను చెప్పే బ్యాంక్ అకౌంట్లో రూ.11, 500 జమ చేయాలని అన్నాడు. దీనికి ఒప్పుకున్న గణేష్ అతను చెప్పి అకౌంట్కు డబ్బు పంపించాడు. వంట మనిషిని పంపకపోవడంతో మళ్లీ అతడికి ఫోన్ చేయగా రెండు రోజుల్లో పంపిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఒకసారి మోసపోయిన గణేష్ మరోసారి వంట మనిషి కావాలని ఓఎల్ఎక్స్లో యాడ్ పోస్ట్ చేశాడు. ఈసారి అదే గొంతుతో మరో నంబర్ నుంచి కాల్ వచ్చింది. గుర్తు పట్టిన గణేష్ సదరు వ్యక్తిని నిలదీయగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సోఫా కొంటాను రూపాయి పంపమన్నాడు, నిండా ముంచేశాడు
సాక్షి, చందానగర్: ఓఎల్ఎక్స్లో సోఫా అమ్మకం కోసం పెట్టిన వ్యక్తిని మోసగించి రూ.25 వేలు కాజేసిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. చందానగర్ అపర్ణ లేక్ బ్రిజ్ అపార్ట్మెంట్లో నివాసముండే జోసెఫ్ అంగర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతను ఓఎల్ఎక్స్లో తన సోఫా విక్రయానికి పెట్టగా, ఫోన్ నం. 9090045860 నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. రూ. 15 వేలకు సోఫా కొనుగోలు చేస్తానని, తనకు ఒక రూపాయి క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి కోరారు. జోసెఫ్కు క్యూ ఆర్ కోడ్ పంపించాడు. ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన జోసెఫ్ ఒక రూపాయి పంపగా, తిరిగి రూ. 2 వచ్చాయి. అలా ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల వరకు పంపగా అవి రెట్టింపు అయ్యి జోసెఫ్కు వచ్చాయి. ఇది నిజమని నమ్మిన జోసెఫ్ పేటీఎం అకౌంట్ నుంచి రూ.5 వేలు గుర్తు తెలియని వ్యక్తికి పంపగా, సాంకేతిక కారణాలు చెప్పి జోసెఫ్ నుంచి ఆ కేటుగాడు దఫా దఫాలుగా మొత్తం రూ. 25 వేలు రాబట్టాడు. తనకు డబ్బులు తిరిగి రాకపోగా గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరిట టోకరా చందానగర్: కేవైసీ అప్డేట్ పేరుతో రూ.39,999 కాజేసిన ఘటన చందానగర్ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం.. డోయన్స్ టౌన్షిప్ కాలనీలో నివాసముండే చల్లా శ్రీనివాస్రెడ్డి ఎల్ఐసీ ఏజెంట్. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడికి కాల్ చేశాడు. మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి లింక్ పంపించాడు. ఆ లింక్ను ఓపెన్ చేయగా క్లిక్ సపోర్ట్ అనే యాప్ డౌన్లోడ్ అయ్యింది. మరో లింక్ పంపుతానని గూగుల్ క్రోమ్ ద్వారా దానిని ఓపెన్ చేసి, రీచార్జ్ కోసం ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన విధంగా శ్రీనివాస్రెడ్డి చేయగా, అందులో టాప్ హెడ్లైన్ ద్వారా రీఛార్జ్ రూ.32 చేయాలని ఉంది. ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేసిన మరుక్షణమే శ్రీనివాస్రెడ్డి అకౌంట్లో ఉన్న మొత్తం రూ.39,999లు డెబిట్ అయినట్లు మెసెజ్ వచ్చింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత -
ఓఎల్ఎక్స్: 8 సార్లు బకరాను చేశారు..
సాక్షి, సిటీబ్యూరో: తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్ ద్వారా రూ.6,500 అమ్మాలని భావించిన మారేడ్పల్లి వాసి సైబర్ నేరగాడి చేతికి చిక్కి రూ.1.96 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్పల్లి ప్రాంతానికి చెందిన సుశీల్ తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాడు ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సుశీల్ను సంప్రదించారు. ఆ సోఫా తమకు నచ్చిందని, రూ.6,500 గూగుల్ పే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. దీనికి సుశీల్ అంగీకరించడంతో ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. దీన్ని సుశీల్ స్కాన్ చేయగా... రూ.6,500 తన ఖాతాలోకి రావాల్సింది పోయి... ఆ మొత్తం కట్ అయింది. దీంతో ఆయన సైబర్ నేరగాడికి ఫోన్ ద్వారా సంప్రదించారు. ఏదో పొరపాటు జరిగిందంటూ చెప్పిన అతడు ఈసారి మొత్తం రూ.13 వేలకు క్యూఆర్ కోడ్ పంపుతున్నట్లు చెప్పాడు. అలా వచ్చిన దాన్ని స్కాన్ చేయగా... రూ.13 వేలు కట్ అయ్యాయి. ఇలా మొత్తం ఎనిమిది సార్లు కోడ్స్ పంపి స్కాన్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశాడు. మరోసారి కోడ్ పంపిస్తానంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: రూ.1.04 కోట్ల ఆభరణాల పట్టివేత -
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్కతా సమీపంలోని డమ్డమ్లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
‘జర జాగ్రత్త’లో యాంకర్ వర్షిణి
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు ఫిర్యాదులు అందగానే కేసులను ఛేదించి నిందితులను పట్టుకుంటున్న పోలీసులు...అసలు మోసం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో ‘డిజిటల్ ప్లాట్ఫామ్’ను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సెకండ్ హ్యాండ్ వస్తువులకు వేదికైన ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాలపై ఏకంగా లఘుచిత్రాన్ని నిర్మించారు. ‘బివేర్ ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అండ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్’ పేరుతో ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి, కాలేజీ విద్యార్థిని సింధు సంగం కలిసి నటించిన ఈ షార్ట్ఫిల్మ్ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ లఘుచిత్ర లింక్ను సైబరాబాద్ పోలీసుల సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా పోస్టు చేశారు. ఇవీ గమనించండి... ► సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో క్రయవిక్రయాలు జరిపే ఆన్లైన్ పోర్టల్స్ను సైబర్ నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగులమని, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మిస్తారు. ► కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా..చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ► సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు. వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు. నగదు వెనక్కి ఇస్తామంటే అస్సలు నమ్మొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తులు, ఓఎల్ఎక్స్ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్ కోడ్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. ► అడ్వాన్స్ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు. ప్రత్యక్షంగా కలవండి. పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించండి. ► ఏదేని ఫిర్యాదు కోసం డయల్ 100, 9490617444 వాట్సాప్ నంబర్ను సంప్రదించాలని సీపీ సజ్జనార్ అన్నారు. -
ప్రధాని మోదీ ఆఫీస్ను అమ్మబోయారు!
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యవహారాల కార్యాలయాన్ని కొందరు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాలు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని రూ.7.5 కోట్లకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. ఈ యాడ్ ప్రకారం లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇందులో నాలుగు బెడ్ రూమ్లు, నాలుగు బాత్రూమ్లు మొత్తంగా 6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. రెండు అంతస్థులు, రెండు కార్ల పార్కింగ్కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంవోగా తెలిపారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ముందుగా అవాక్కయ్యారు వెంటనే ఆ యాడ్ను తొలగించారు. బెలుపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలు పాల్పడ్డాయని వారణాసి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా నలుగురికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
సెల్ఫోన్లు కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో పెట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రహదారుల సమీపంలోని మొబైల్ షాపుల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వీటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తారు. ఇదీ అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా పని. వీరిని ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఠాణా పరిధిలోని రిలయన్స్ డిజిటల్ షాపులో గత నెల 14న తెల్లవారుజామున 119 సెల్ఫోన్లు తస్కరించి ముంబైకి తీసుకెళ్లిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 113 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్లతో కలిసి సీపీ సజ్జనార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ప్రధానంగా వీటిపైనే దృష్టి.. ⇔ ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ తాబ్రేజ్ దావూద్ షేక్ నాగ్పూర్లో చోరీ కేసుల్లో 2016లో జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో మరో నిందితుడు రాజు పాండురంగతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఫర్హాన్ ముంతాజ్ షేక్, రషీద్ మహమ్మద్ రఫీక్ షేక్, మహమ్మద్ షుఫియాన్ షేక్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ⇔ కర్ణాటకలోని బ్రహ్మపురంలో 80 సెల్ఫోన్లు, సూరత్లోని ఓ మొబైల్ షాప్లో 180 సెల్ఫోన్లు అపహరించారు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో నేరాలు చేస్తే దొరికిపోతామనే భయంతో హైదరాబాద్కు అద్దె వాహనం (ఇన్నోవా)లో వచ్చారు. ⇔ నంబర్ ప్లేట్ను ఏపీ09గా మార్చి గత నెల 13న నగరానికి చేరుకున్నారు. ప్రధాన రహదారి వెంట సెల్ఫోన్ షాప్లను పరిశీలించారు. 14వ తేదీ వేకువ జామున మియాపూర్లోని రిలయన్స్ డిజిటల్ షాప్ షెట్టర్లను గడ్డపార, ఇతర సామగ్రితో పగులగొట్టి తెరిచారు. 119 సెల్ఫోన్లు సంచిలో వేసుకొని కారులో వెళ్లారు. ⇔ పంజాగుట్ట ఓ షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచి ఖజానాలో ఉన్న రూ.4వేలు తీసుకున్నారు. అనంతరం పటాన్చెరులోని వైన్స్ దుకాణం షెట్టర్ పగులగొట్టి రూ.700 నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ముంబై పోలీసుల సహకారంతో... ⇔ సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు నిందితులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని గుర్తించి సమీప రాష్ట్రాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. ⇔ షోలాపూర్ టోల్ప్లాజా నుంచి ముంబైకి వెళ్లినట్టుగా తెలిసింది. వెంటనే మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు బృందాలు ఏర్పడి 20 రోజులకుపైగా అక్కడే తిష్ట వేశారు. ముంబై పోలీసుల సహకారంతో అయిదుగురిని పట్టుకున్నారు. ⇔ ‘గతంలో చోరీ చేసిన సెల్ఫోన్లను ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు విక్రయిస్తామని, నగరంలో చోరీ చేసిన సెల్ఫోన్లను సైతం అలాగే విక్రయిద్దామనుకున్నాం’ అని నిందితులు విచారణలో వెల్లడించినట్లు, వీరిని ట్రాన్సిట్ వారెంట్పై మంగళవారం నగరానికి తీసుకొచ్చినట్లు సీపీ వివరించారు. -
ఇలా కూడా మోసం చేస్తారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో విక్రయానికి పెట్టిన వస్తువులు కొంటామని, మరికొన్నింటిని అమ్ముతామంటూ పోస్టింగ్స్ పెట్టి అందినకాడికి దండుకునే కేసుల్ని తరచు చూస్తునే ఉంటున్నాం. అయితే ఈ యాప్ కేంద్రంగా జరిగిన ఓ వెరైటీ సైబర్ క్రైమ్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందులో బాధితుడు, ‘బాధితుడి లాంటి వ్యక్తి’ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. (అల్లుడితో సంబంధం.. వేధింపులు భరించలేక) అసలేం జరిగింది? నగరంలో పశ్చిమ మండల పరిధిలో ఉన్న ఎస్సార్నగర్ ప్రాంతానికి చెందిన పవన్ అనే యువకుడు తన వద్ద ఉన్న ఫోన్ను విక్రయంచాలని భావించాడు. దీనికోసం అతడు దాని ఫొటో, వివరాలతో పాటు తన ఫోన్ నెంబర్ను పొందుపరుస్తూ ఓఎల్ఎక్స్ యాప్లో ఒక యాడ్ పోస్టు చేశాడు. అందులో ఆ ఫోన్ రేటును రూ.27 వేలుగా పేర్కొన్నాడు. తిరుపతి సమీపంలోని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న బాలాజీ అనే నిందితుడు ఈ యాడ్ని చూశాడు. అందులోని ఫోన్ ఫొటో, వివరాలు కాపీ చేసి మరో యాడ్గా పోస్ట్ చేశాడు. ఈ యాడ్ను గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మోహన్ అనే వ్యక్తి చూశాడు. ఆ ఫోన్ ఖరీదు చేయాలని భావించిన అతగాడు ‘కాపీ–పోస్ట్’ యాడ్లో ఉన్న నెంబర్ ఆధారంగా బాలాజీని సంప్రదించాడు. బేరసారాల తర్వాత ఆ ఫోన్ను రూ.20 వేలకు ‘విక్రయించడానికి’ బాలాజీ అంగీకరించాడు. అయితే తాను ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉన్నానని, ఎస్సార్నగర్ వెళితే తన సోదరుడు ఫోన్ చూపిస్తాడంటూ చెప్పి పవన్ నెంబర్ ఇచ్చాడు. ఆ వెంటనే పవన్కు ఫోన్ చేసిన బాలాజీ... ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేసిన ఫోన్ తనకు నచ్చిందని, అయితే తాను వేరే ఊరిలో ఉండటంతో తన స్నేహితుడు వచ్చి దాన్ని పరిశీలించి వెళతాడని చెప్పాడు. అతడికి ఫోన్ చూపించాలని, నచ్చితే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్తాడని పవన్తో నమ్మబలికాడు. ఈ విషయం నమ్మిన పవన్ వచ్చిన వ్యక్తిని కలిసి ఫోన్ చూపించాలని నిర్ణయించుకున్నాడు. బాలాజీ చెప్పిన ప్రకారం పవన్ను అతడి సోదరుడిగా భావించిన మోహన్ ఎస్సార్గనర్ వచ్చి ఫోన్ చేశాడు. తనకు ఫోన్ చేసింది బాలాజీ ఫ్రెండ్గా భావించిన అతడు వెళ్ళి కలిసి ఫోన్ చూపించాడు. వీరిద్దరూ కలిసి ఉండగానే మోహన్కు కాల్ చేసిన బాలాజీ... ఫోన్ నచ్చిందా? అంటూ ప్రశ్నించాడు. అదే సమయంలో ఆ ఫోన్ను పవన్ నుంచి తీసుకుని పరిశీలిస్తున్న అతడు ఔనంటూ సమాధానం ఇచ్చాడు. ఫోన్లోనే బేరసారాలా తర్వాత రూ.20 వేలకు విక్రయించడానికి అంగీకరించాడు. ఆ వెంటనే తన పథకాన్ని అమలులో పెట్టిన బాలాజీ తొలుత రూ.12 వేలు తనకు ఫోన్పే చేయాలని, మిగిలిన మొత్తం పంపడానికి మరో ఖాతా చెప్తానన్నాడు. పవన్ ఎదురుగానే ఉన్న మోహన్ తన ఫోన్ నుంచి బాలాజీకి ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఆ తర్వాత ఫోన్ తీసుకుని వెళ్తుండగా అడ్డుకున్న పవన్ డబ్బు చెల్లించకుండా ఎలా తీసుకువెళ్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఖంగుతిన్న మోహన్ ఇప్పుడే మీ అన్నయ్య బాలాజీకి బదిలీ చేశానని చెప్పగా... అతడు మీ స్నేహితుడు కదా? అంటూ పవన్ ప్రశ్నించాడు. ఇలా ఇద్దరూ చర్చించుకున్న నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తామిద్దరం బాలాజీ చేతిలో మోసపోయామని భావించారు. బాలాజీకి ఫోన్ చేసిన మోహన్ దీనిపై ప్రశ్నించగా... పరిస్థితి బాగోలేక, డబ్బు అవసరం ఉండి అలా చేశానని, రెండు రోజుల్లో తిరిగి ట్రాన్స్ఫర్ చేస్తానంటూ నమ్మబలికాడు. ఇలా నాలుగు రోజుల పాటు వేచి చూసిన మోహన్ మంగళవారం పవన్ను తీసుకుని సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఫిర్యాదు ఇచ్చాడు. దీని ఆధారంగా ఆరా తీస్తున్న అధికారులు బాలాజీగా చెప్పుకున్న వ్యక్తి బ్యాంకు ఖాతా తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. అతడు అక్కడే ఉండి ఈ నేరం చేశాడా? లేక నగరంలో ఉండి డబ్బు కాజేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిర్ధారించడానికి సాంతికేతిక ఆధారాలు సేకరిస్తున్నాడు. -
హైదరాబాద్ పోలీసుల సాహసం..
సాక్షి, హైదరాబాద్: అది రాజస్తాన్ సరిహద్దుల్లోని మేవాట్ ప్రాంతం.. భరత్పూర్ జిల్లాలో ఉన్న మూడు పక్కపక్క గ్రామాలు.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు అక్కడి అధికారులతో కూడిన బృందం.. ‘ఓఎల్ఎక్స్ కేటుగాళ్ల’కోసం గ్రామాల్లో వేట మొదలెట్టింది.. ప్రతిఘటించిన నేరగాళ్లు, వారి కుటుంబీకులు ఎదురుదాడి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి 18 మంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా ‘ఖాకీ’సినిమాను తలపించింది. వీరిని శుక్రవారం హైదరాబాద్ తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్లు సీసీఎస్ విభాగం డీసీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. ఈ నెల 9న కూడా మరో 8 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. అమ్ముతామంటూ.. కొంటామంటూ.. భరత్పూర్ జిల్లాకు చెందిన చాలా గ్రామాల్లో ఈ ఓఎల్ఎక్స్ కేటుగాళ్ల అడ్డాలు ఉన్నాయి. ఆర్మీ అధికారుల మాదిరిగా ఫొటోలకు పోజులిస్తూ.. ఓఎల్ఎక్స్ వంటి ఈ–యాడ్స్ వెబ్సైట్లలో వివిధ ప్రకటనలు ఇస్తుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పేర్కొంటారు. వాటిని చూసి సంప్రదించిన వారి నుంచి అడ్వాన్సుల రూపంలో వీలున్నంత దోచేస్తారు. మరోపక్క ఆయా వెబ్సైట్లలో సామాన్యులు పెట్టిన సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం ప్రకటనలకు స్పందించి వాటిని విక్రయిస్తామని కూడా డబ్బు స్వాహా చేస్తారు. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు.. రెండేళ్లుగా భరత్పూర్ జిల్లాలోని గ్రామాలపై దాడి చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేచి చూస్తున్నారు. ఇటీవల తమ వద్ద ఉన్న కేసుల రికార్డులు సిద్ధం చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్.. ఆపరేషన్ కోసం ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్, ఎస్సై రమేశ్ల నేతృత్వంలో 10 మంది పోలీసులు ఈ నెల మొదటి వారంలో అక్కడకు పంపించారు. తొలుత పాడ్లా ప్రాంతంలో దాడి చేసి 8 మంది దుండగులను అరెస్టు చేశారు. ఆ తర్వాత చుల్హేరా, కల్యాణ్పూర్, ఖరీక గ్రామాల్లో అసలు నేరగాళ్లు ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో భరత్పూర్ ఎస్పీ అమరీందర్ సింగ్ను సంప్రదించిన ఇక్కడి అధికారులు.. ప్రత్యేక బలగాలను సమీకరించుకున్నారు. 100 మంది పోలీసులు 30 వాహనాల్లో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ మూడు గ్రామాలను దిగ్బంధం చేశారు. తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న నేరగాళ్లు, వారి కుటుంబీకులు చుట్టుపక్కల వారితో కలసి పోలీసులపై దాడికి దిగారు. కర్రలు, కారం పొడితో అధికారులపై దాడి చేశారు. మూడు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు కొందరు పోలీసులను గాయపరిచారు. దీంతో భాష్పవాయు గోళాలు ప్రయోగించి 10 మంది నేరగాళ్లను గుర్తించి పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని శుక్రవారం హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. రెండు దశల్లో అరెస్టయింది వీరే.. ఆరిఫ్ ఖాన్, ధీను ఖాన్, ఇలియాస్ ఖాన్, పుష్పేంద్ర సింగ్, రాధేశ్యాం, మోహన్ సింగ్, హకీం ఖాన్, విజిబ్ ఖాన్, సాహిల్, షహీద్, ఉమర్ ఖాన్, సత్యవీర్ సింగ్, ఇర్ఫాన్, తరీఫ్, ఆరిఫ్ ఖాన్, మోహన్ సింగ్, అజారుద్దీన్, రాహుల్. పోలీసుల జోలికే రావడంతో.. హైదరాబాద్లో ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ ఓఎల్ఎక్స్ క్రైమ్దే ప్రథమ స్థానం. రోజుకు దాదాపు ఐదారుగురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేరగాళ్ల అడ్డా.. భరత్పూర్ జిల్లా అని రెండేళ్ల కిందటే పోలీసులు గుర్తించారు. రెండుసార్లు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి దాడులు చేశారు. అయితే స్థానిక పోలీసుల నుంచి సహకారం లేకపోవడంతో మన పోలీసులు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఈ ‘ఓఎల్ఎక్స్ కేటుగాళ్లు’పోలీసులను టార్గెట్గా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది అధికారుల పేర్లతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, వారి స్నేహితులలో చాటింగ్ చేస్తూ డబ్బు గుంజారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసుల నుంచి భరత్పూర్ అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అక్కడి అధికారుల వైఖరిలో మార్పు వచ్చింది. -
ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్ అమ్మకాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న భరత్పూర్ గ్యాంగ్ను సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ మార్కెటింగ్ల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. 9 మంది నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. వారి నివాసాల నుంచి సంచుల కొద్ది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ దాపు 800 పైగా సిమ్ కార్డులు ఉంటాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు. (చదవండి: పాదరసం.. అంతా మోసం ) -
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి మిగ్-23 విమానం
లక్నో: ఓఎల్ఎక్స్లో ఎవరైనా మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నిచర్ అమ్మకానికి పెడతారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న యుద్ధ విమానం మిగ్-23నే అమ్మకానికి పెట్టాడు. అది కూడా 9.99 కోట్ల రూపాయలకు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఈ విమానాన్ని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 2009 లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బహుమతిగా ఇచ్చింది. క్యాంపస్లో విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఐఏఎఫ్ దీన్ని యూనివర్సిటీకి ఇచ్చింది. (అమ్మకానికి పటేల్ విగ్రహం..!) ఇంతటి చరిత్ర కలిగిన ఈ మిగ్-23 యుద్ధ విమానాన్ని ప్రస్తుతం ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచడంతో సంచలనం రేపుతోంది. ఎవరో కావాలనే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి విమానం ఫోటోను ఓఎల్ఎక్స్లో పెట్టారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ.. ‘మా యూనివర్సిటీకి చెందిన వారు ఎవరూ ఆ విమానాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టలేదు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని’ అని తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీం అలీ వెల్లడించారు. అంతేకాక సదరు విమానం ఫొటోను వెబ్సైట్ నుంచి తీసేశామని తెలిపారు. -
నేరగాళ్ల అడ్డా..!
-
ట్రెడ్ మిల్ అమ్మబోతే..!
సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ ట్రెడ్ మిల్ విక్రయించాలని ప్రయత్నించిన నగర వాసిని సైబర్ నేరగాళ్ళు నిండా ముంచారు. ఈయనకు క్యూఆర్ కోడ్స్ పంపిన క్రిమినల్స్ రూ.1.5 లక్షలు కాజేశారు. ఆదివారం బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాసబ్ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది తన ఇంట్లో ఉన్న పాత ట్రెడ్ మిల్ను విక్రయించాలని భావించారు. దీంతో దాని ఫొటో, తన ఫోన్ నెంబర్ ఇతర వివరాలను ఓఎల్ఎక్స్లో పొందుపరిచారు. దీనికి స్పందిస్తున్నట్లు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఆర్మీలో పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఎదుటి వ్యక్తి మాటలు నమ్మిన న్యాయవాది బేరాలు కూడా పూర్తి చేశారు. సదరు ట్రెడ్ మిల్ను రూ.10 వేలకు అమ్మడానికి రేటు ఖరారైంది. ఆపై అసలు కథ ప్రారంభించిన సైబర్ నేరగాడు తన ఫోన్కు గూగుల్ పే ద్వారా రూ.5 పంపాలని, ఆ వెంటనే రూ.10 వేలు మీ ఖాతాలోకి వస్తాయంటూ చెప్పాడు. న్యాయవాది అలానే చేయడంతో ఆయన ఖాతాలోకి డబ్బు వచ్చింది. ఇలా తమకు రూ.5 వేలు పంపిస్తే రూ.10 వేలు ఖాతాలోకి వస్తాయంటూ నమ్మించారు. పలు దఫాలుగా క్యూఆర్ కోడ్స్ పంపిన సైబర్ నేరగాళ్ళు న్యాయవాది ఖాతా నుంచి రూ.1.5 లక్షలు కాజేశారు. ఈయన సెల్ఫోన్ నెంబర్కు గూగుల్ పే ఖాతాకు మూడు బ్యాంకు ఖాతాలు అనుసంధానించి ఉన్నాయి. వాటిలో రెండు ఖాతాల నుంచి ఈ డబ్బు పోయింది. అయితే తాను సైబర్ నేరగాళ్ళు సూచించినట్లు చేయలేదని, అయినా డబ్బు పోయిందని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ యాడ్స్పై ఓఎల్ఎస్, క్వికర్లకు హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఒఎల్ఎక్స్, క్వికర్లు తమ వెబ్సైట్లలో రిలయన్స్ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పొందుపరచడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్లను ఆదేశించింది. జియో జాబ్స్, రిలయన్స్ ట్రెండ్స్ జాబ్స్ అనే వర్డ్స్ను ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రతిష్ట, గుడ్విల్ దెబ్బతింటాయని ఆర్ఐఎల్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో ఆర్ఐఎల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు అనుకూలంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మధ్యంతర ఊరట కల్పిచని పక్షంలో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ముక్తా గుప్తా రెండు వేర్వేరు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జియో, రిలయన్స్ ట్రేడ్మార్క్లకు తాము సొంతదారులమని ఓఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లు తమ గుడ్విల్కు, ప్రతిష్టకు తీరని హాని కలిగించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్ఐఎల్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : మరో మెగాడీల్కు జియో రెడీ -
అమ్మకానికి పటేల్ విగ్రహం..!
గాంధీనగర్ : భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన ఐక్యత విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. విగ్రహం ధరని రూ.30వేల కోట్లుగా నిర్ధారించారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో బాధితులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల నిర్మాణానికి ఈ నిధులను ఉపయోగించాలని భావించారు. అయితే పటేల్ విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో పెట్టింది ఓ నెటిజన్. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఓఎల్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఎమర్జెన్సీ... స్టాచ్చూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును. ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది’ అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో.. ఫేక్ పోస్ట్గా గుర్తించి ఒఎల్ఎక్స్ సంస్థ ఆ పోస్ట్ను వెంటనే తొలగించింది. కాగా పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. కాగా ఓఎల్ఎక్స్ లో దీని ఖరీదుని రూ.30వేల కోట్లుగా నిర్ధారించడంతో తొలుత చూసిన వారంతా షాక్కి గురయ్యారు. భారత్ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ దీవిలో దీన్ని నిర్మించారు. కాగా దీనిని ఆవిష్కరించిన దగ్గర నుంచి పర్యటకులు ద్వారా ఇప్పటి వరకు 82 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని నిర్వహకులు తెలుపుతున్నారు. -
టార్గెట్.. ఓఎల్ఎక్స్ యూజర్స్
సాక్షి, సిటీబ్యూరో: ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా శుక్రవారం ఇందులో ఆర్మీ అధికారులుగా సైబర్ నేరగాళ్ళు పోస్ట్ చేసిన వాహనాల ఫొటోలకు స్పందించి. వాటిని ఖరీదు చేద్దామని భావించి సంప్రదించి రూ.3 లక్షల వరకు నష్టపోయారు. వీళ్ళు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ♦ చాదర్ఘాట్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఖరీదు చేయాలని భావించాడు. ఓఎల్ఎక్స్లో ఆర్మీ అధికారి మాదిరిగా దాన్ని పోస్టు చేసిన వ్యక్తి రూ.65 వేలు ధర నిర్ణయించాడు. అతడిని సంప్రదించిన బాధితుడు తాను ఖరీదు చేసుకుంటానని చెప్పాడు. అంగీకరించిన నేరగాడు ముందుగా గూగుల్ పే ద్వారా రూ.5100 పంపాలని సూచించాడు. ఆ తర్వాత రూ.20,100 పంపిస్తే వాహనం నేరుగా ఇంటికే డెలివరీ ఇస్తామని చెప్పాడు. దీన్ని రూ.2,100గా భావించిన బాధితుడు ఆ మొత్తం బదిలీ చేశాడు. అయితే తాను కోరింది రూ.20,100 అని చెప్పడంతో మిగిలిన రూ.18 వేలు పంపాడు. ఇలా వేర్వేరుగా పంపిస్తే సిస్టం అంగీకరించదని, మరోసారి ఒకే మొత్తంగా పంపాలని, ఇప్పుడు చెల్లించింది తిరిగి ఇచ్చేస్తానంటూ సైబర్ నేరగాడు చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు. అప్పటికీ వాహనాన్ని పంపని అతగాడు మరో రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అనుమానించిన బాధితుడు చెల్లించడం ఆపేయగా.. ఇప్పటి వరకు మీరు చెల్లించింది ఆర్మీ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, తక్షణం రూ.15 వేలు కట్టకపోతే వాహనంతో పాటు అప్పటి వరకు కట్టిన మొత్తమూ క్యాన్సిల్ అవుతాయని బెదిరించాడు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ♦ ఓఎల్ఎక్స్లో ఆర్మీ అధికారి మాదిరిగా పోస్టు పెట్టిన ఓ యాక్టివాను ఖరీదు చేయాలని నగరానికి చెందిన యువకుడు భావించాడు. వెంటనే అందులో ఉన్న నెంబర్కు సంప్రదించాడు. ఇతడితో సంప్రదింపులు కొనసాగించిన సైబర్ నేరగాడు రూ.24 వేలకు ఆ వాహనం అమ్మడానికి అంగీకరించాడు. ఆపై అనేక పేర్లు చెప్తూ డబ్బు దండుకుంటూ పోయాడు. వాహనం ఖరీదును మించి రూ.65 వేల వరకు గూగుల్ పే ద్వారా బాధితుడు చెల్లించేశాడు. ప్రతి సందర్భంలోనూ సైబర్ నేరగాడు వాహనం విలువ మినహా మిగిలిన మొత్తం రీఫండ్ వస్తుందంటూ చెబుతుండటంతో బాధితుడు నమ్మి మోసపోయాడు. ఎట్టకేలకు తనకు జరగిన నష్టం తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ♦ నగరానికి చెందిన మరో వ్యక్తి ఓఎల్ఎక్స్ నుంచి కారు ఖరీదు చేయడానికి ప్రయత్నించాడు. ఇతడి నుంచి సైబర్ నేరగాళ్ళు రూ.1.95 లక్షలు కాజేయడంతో పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
రూ.20 వేల బండికి రూ.55 వేలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ హ్యాండ్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఓఎల్ఎక్స్ యాప్లో పోస్ట్ చేయడం... ఆకర్షితులై స్పందించిన వారి నుంచి అడ్వాన్సుల పేరుతో అందినంతా కాజేయడం... ఇప్పటి వరకు ఈ పంథాలో రెచ్చిపోయిన ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు తాజాగా కొత్త ఎత్తులు వేస్తున్నారు. నైజీరియన్లు మాదిరిగా ఈ వ్యవహారాల కేసుల్లో ట్విస్ట్లు తీసుకువస్తున్నారు. ఈ పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తాలు స్వాహా చేస్తున్నారు. ఓఎల్ఎక్స్లో రూ.20 వేలకు ఓ వాహనం ఖరీదు చేద్దామంటూ భావించి, సంప్రదింపులు ప్రారంభించిన బాధితుడు రూ.55 వేలు పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు మరో రూ.5 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తుండటంతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నల్లగొండకు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటూ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. తాను తిరిగేందుకు ఓ సెకండ్ హ్యాండ్ బైక్ ఖరీదు చేయాలని భావించిన సదరు యువకుడు దాని కోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశాడు. విజయవాడలో పని చేస్తున్న ఆర్మీ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్కు ఆకర్షితులయ్యాడు. అతడిని సంప్రదించి, బేరసారాలు పూర్తి చేసిన తర్వాత రూ.20 వేలకు సదరు ద్విచక్ర వాహనాన్ని ఖరీదు చేయడానికి సిద్ధమయ్యాడు. ఓ సందర్భంలో బాధితుడితో ఫోన్లో మాట్లాడిన నిందితుడు తాను ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో (సీఐఎస్ఎఫ్) పని చేస్తున్నానని, విజయవాడ విమానాశ్రయంలో డ్యూటీ చేస్తున్నానని నమ్మించాడు. రూ.20 వేలను గూగుల్ పే ద్వారా పంపితే వాహనాన్ని పార్శిల్ చేస్తానంటూ చెప్పి తన గుర్తింపుకార్డులు అంటూ నకిలీవి పంపించాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు ఆ మొత్తం బదిలీ చేశాడు. ఇది జరిగిన తర్వాతి రోజు ఓ వాహనాన్ని పార్శిల్ చేస్తున్న ఫొటోను కూడా వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ రెండు రోజులకు మళ్లీ బాధితుడికి కాల్ చేసిన సైబర్ నేరగాడు వాహనం పార్శిల్ను విజయవాడలో రైల్వే పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. పూర్తి స్థాయి క్లియరెన్స్ లేకుండా ఆర్మీ వాహనాన్ని బయటకు పంపిస్తున్నందుకు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. అర్జంటుగా రూ.35 వేలు చెల్లించకపోతే నీ మీద కూడా కేసు నమోదు చేస్తారని భయపెట్టాడు. ఈ మాటల వల్లో పడిన బాధితుడు మరో రూ.35 వేలు గూగుల్ పే ద్వారా పంపాడు. అప్పటికీ ఆగకుండా మరో రూ.5 వేలు కావాలంటూ ఫోన్లు చేస్తుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బా«ధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ రూ.75 వేలకే..
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు. మొదట గూగుల్పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్పోర్ట్లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్ఎక్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్క్రైమ్ విభాగానికి కేసు అప్పగించారు. -
అద్దెకు తీసుకుని తాకట్టు పెడతాడు
సాక్షి, సిటీబ్యూరో: తేలికపాటి వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను అద్దెకు తీసుకుంటానంటూ యజమానులను నమ్మించి, అనంతరం వాటిని తాకట్టుపెట్టి జల్సాలు చేస్తున్న కేసులో ఓ యువకుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ ఓఎల్ఎక్స్ ఆధారంగా దందాలు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నగరానికి చెందిన దాలె దుర్గాప్రసాద్ తన కారును అద్దెకు ఇస్తానంటూ ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన మహబూబ్నగర్ జిల్లా, బాలానగర్కు చెందిన నానావత్ సంతోష్, అతడి బంధువు పథకం ప్రకారం రంగంలోకి దిగారు. దుర్గాప్రసాద్ను సంప్రదించిన వారు వాహనం అద్దెకు కావాలని చెప్పారు. నెలకు రూ.18 వేల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దుర్గాప్రసాద్కు తన ఆధార్ కార్డు కాపీ, రెండు ఖాళీ చెక్కులు, రూ.50 బాండ్ పేపర్పై ష్యూరిటీ ఇచ్చారు. అడ్వాన్స్గా రూ.5 వేలు చెల్లించిన నిందితులు వాహనం తీసుకువెళ్లారు. ఆపై మిగిలిన మొత్తం, నెల వారీ అద్దె చెల్లించడం మానేశారు. తనకు రావాల్సిన డబ్బు కోసం దుర్గాప్రసాద్ ఫోన్లు చేస్తే బెదిరించడం మొదలెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏటీఎం టీమ్ ఇన్స్పెక్టర్ పి.ఆంజనేయులు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన ఎస్సై పి.శ్రీనివాసులు తదితరులు నిందితుల్లో ఒకరైన సంతోష్ను గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి ఐదు తేలికపాటి వాహనాలు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇదే తరహాలో మరో తొమ్మిది మందిని మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలను నిందితులు తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. -
దక్షిణాదివారికి ఆశ ఎక్కువ..
సాక్షి, సిటీబ్యూరో: ‘దక్షిణాది వారికి ఆశ ఎక్కువ సార్..! వీళ్లను మోసం చేయడం చాలా తేలిక. ఒకవేళ కేసులు నమోదైనా మమ్మల్ని పట్టుకోవడం కోసం ఉత్తరాది వరకు వచ్చే పోలీసులు తక్కువ. అందుకే ఇక్కడి వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాం’సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఓఎల్ఎక్స్ నేరగాడు విచారణలో వెల్లడించిన విషయం ఇదీ. ♦ ‘రజోర్పే’ సంస్థ అధ్యయనం ప్రకారం డిజిటల్ కరెన్సీ వాడకం, ఆన్లైన్ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముంబై పుణే నిలిచాయి. ♦ సైబర్ క్రైమ్ పోలీసుల అభిప్రాయం ప్రకారం సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల విశాఖపట్నం, విజయవాల్లోనూ ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ♦ కంటికి కనిపించకుండా అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లు ప్రధానంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులనే టార్గెట్గా చేసుకుంటున్నారు. ఉత్తరాదిలో మకాం వేసి దక్షిణాదిని టార్గెట్గా చేస్తున్న ఈ ముఠా లు నమ్మి న వారిని నిలువునా ముంచేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా వీరి వల్లో పడి మోసపోతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. వివిధ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా తక్కువ ధరకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాల బారినపడుతున్న వారి సంఖ్య మరీ పెరిగిందని వివరిస్తున్నారు. ప్రధానంగా ఓఎల్ఎక్స్, ఓటీపీ నేరాలే.. సైబర్ క్రైమ్ పోలీసులు రిజిస్టర్ చేసే సైబర్ నేరాల్లో 18 రకాలైనవి ఉన్నాయి. అయితే హైదరాబాద్కు సంబం«ధించి నమోదు అవుతున్న వాటిలో ఓఎల్ఎక్స్, ఓటీపీ క్రైమే అధికంగా ఉంటోందని పోలీసులు పేర్కొంటున్నారు. రాజస్థాన్లోని భరత్పూర్, అల్వార్, హర్యానాలోని మేవత్, ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్, ఫిరోజ్పూర్ జిక్రా ఒకే రీజియన్లో పక్కపక్కనే ఉంటాయి. ఈ ప్రాంతాలకు చెందిన ముఠాలు ఆర్మీ ఉద్యోగుల మాదిరిగా నటిస్తూ ఈ కామర్స్ సైట్స్లో కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఓటీపీ క్రైమ్ ఉంటోంది. బ్యాంకు అధికారులుగా చెప్పుకుని ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు నో యువర్ కస్టమర్ (కేవైసీ) అప్డేట్ చేయాలని, ఆధార్ లింకేజ్ పేరుతో మాట్లాడుతున్నారు. వినియోగదారుల నుంచి వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్ సైతం సంగ్రహించి అకౌంట్లోని డబ్బు దోచేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారిలో జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తార వాసులే ఎక్కువగా ఉంటున్నారు. చదువుకున్న వారే.... ఈ తరహా సైబర్ నేరగాళ్ల వల్లో పడుతున్న వారిలో నిరక్షరాస్యులు/తక్కువగా విద్యనభ్యసించిన వారి కంటే చదువుకున్న వారు, విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అంతగా చదువుకోని వారు ఈ కామర్స్ యాప్స్ జోలికి పోవట్లేదని, ఈ కారణంగానే ఆ సంబంధిత నేరగాళ్లు వీరిని టార్గెట్ చేయలేకపోతున్నారని పేర్కొంటున్నారు. తక్కువ చదువుకున్న వాళ్ళు ఏటీఎం కార్డులను వినియోగిస్తుంటారు. అయితే కేవలం కార్డ్ స్వైప్ చేసి, పిన్ నెంబర్ ఎంటర్ చేసి లావాదేవీలు పూర్తి చేయడం వరకే వీరికి తెలుస్తోంది. ఈ కారణంగానే ఎవరైనా బ్యాంకు అధికారులం అంటూ ఫోన్లు చేస్తే వీరు స్పం దించట్లేదు. అవతలి వ్యక్తులు అడిగే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఈ కేటగిరీకి చెందిన వారు చెప్ప లేకపోతున్నారు. ఈ కారణంగానే సైబర్ నేరగాళ్లు వారి జోలికి వెళ్లడం లేదని వివరిస్తున్నారు. విద్యాధికు లు, స్మార్ట్ఫోన్, యాప్స్ వినియోగిస్తున్న వారే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారినపడి ఆర్థికంగా నష్టపోతున్న ట్లు తెలిపారు. ఓఎల్ఎక్స్ నేరాల బారిన పడిన వారిలో అన్ని వయసుల వారు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఆరు నగరాల్లోనే ఎక్కువ సైబర్ నేరాలబారిన పడుతున్న వారిలో దక్షిణాది వారే ఎక్కువగా ఉంటున్నారు. ఉత్తరాది వారికి ఎవరైనా బ్యాంకు మేనేజర్లమంటూ ఫోన్ చేసి ఓటీపీ వంటివి అడిగితే వారు తిట్టి ఫోన్ పెట్టేస్తుంటారు. దక్షిణాది వారి విషయంలో ఇలా జరగట్లేదు. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్లోనూ వీరు ఎలాంటి తనిఖీలు లేకుండా నగదు అడ్వాన్స్గా డిపాజిట్ చేస్తున్నారు. సైబర్ నేరాల బాధితుల్లో దేశంలోనే బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నా వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో మోసం పోవడం ఎంత తేలికో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం అంత కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో లావాదేవీలు వద్దు. పరిచయం లేని వారు చెప్పిన మాటలు నమ్మి ఒక్క రూపాయి కూడా కోల్పోవద్దు. – సైబర్ క్రైమ్ పోలీసులు స్మార్ట్ ఫోన్ వినియోగదారులే ఎక్కువ... వివిధ రకాలైన నేరాల్లో సైబర్ నేరగాళ్లకు టార్గెట్గా మారుతున్న వారిలో స్మార్ట్ఫోన్ వినియోగదారులే ఎక్కువగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్, వీసా మోసం సహా ఏదైనా ఫోన్ నుంచే ప్రారంభమవుతోందంటున్నారు. ఒకప్పుడు ఇంటర్నెట్ వాడటానికి కంప్యూటర్ తప్పనిసరి. అయితే స్మార్ట్ఫోన్ వినియోగంలోకి వచ్చాక ‘అరచేతి’ నుంచే యాక్సిస్ చేస్తున్నారు. మరోపక్క సెల్ఫోన్ సర్వీసు ప్రొవైడర్ల మధ్య పోటీ పెరగటంతో ఒకరిని మించి ఒకరు తక్కువ ధరకు మొబైల్ డేటాను అందిస్తుండటంతో అవసరం ఉన్నా, లేకపోయినా నెట్ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇలా అనవసరంగా కొన్ని యాప్స్ను వినియోగిస్తూ మోసగాళ్ల బారినపడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. తమ వద్దకు వస్తున్న ఫిర్యాదుదారుల్లో 95 శాతం ఫోన్ నుంచి ఇంటర్నెట్ను యాక్సస్ చేస్తూ మోసపోయిన వారే ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ విషయమే తీసుకుంటే కంప్యూటర్ ద్వారా ఆ సంస్థ సైట్ను చేరుకుని మోసపోయిన వారు నూటికి ఇద్దరు ముగ్గురు కూడా ఉండట్లేదని తెలిపారు. స్మార్ట్ ఫోన్లో యాప్ వాడుతూ బుట్టలో పడిన వారే ఎక్కువని సైబర్ క్రైమ్ అధికారులు పేర్కొన్నారు. -
ఓఎల్ఎక్స్ పేరుతో ఆగని మోసాలు
ఆన్లైన్ మోసాలకు అంతే ఉండటంలేదు. కారుచౌక బేరమని ప్రకటనలు గుప్పిస్తూ అమాయకులను మాటలతో బురిడీ కొట్టిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లలో టూవీలర్స్, ఫోర్వీలర్స్ తదితరాలను తక్కువ ధరలకు సెకండ్ సేల్ అని ప్రకటనలు గుప్పిస్తూ ఆకర్షిస్తారు. అందులోని నంబరును సంప్రదిస్తే మాటలతో మాయచేసి ఆన్లైన్ ద్వారా నగదు అందుకుని మాయమవుతున్నారు. సాక్షి, అమరావతి : ‘మారుతీ స్విఫ్ట్.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్.. తక్కువ ధరలకే ఇస్తున్నాం..’ అంటూ ఓఎల్ఎక్స్ పేరిట వెబ్సైట్లో వచ్చిన ప్రకటనలను నమ్మి మోసపోతున్న ఘటనలకు అడ్డుకట్ట పడటంలేదు. ఓఎల్Šఎక్స్ పేరిట వస్తున్న ప్రకటనల్లో 90 శాతం తప్పుడువని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు మోసగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. అమాయకులు నష్టపోతూనే ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని మిలటరీ కార్యాలయాల్లో పనిచేస్తున్నామని నేరస్తులు తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. మోసపోతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏడాదికి సగటున ఎనిమిది మంది బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నంబర్లే.. రాజస్థాన్, హరియాణ రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరస్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బైక్లు, కార్ల ఫొటోలను ప్రకటనల్లో ఇస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయాల్లో రిజిస్టరైన కార్లు, బైకుల ఫొటోలు సేకరిస్తారు. అసలు ధరలో 50 నుంచి 60 శాతానికే ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు బయానా పుచ్చుకున్నాక వాహనాన్ని పంపుతున్నామని, మిగిలిన డబ్బులు పంపించేయాలని సూచిస్తున్నారు. కార్లు కొనుగోలు చేసిన వారికి గన్నవరం విమాశ్రయం పార్కింగ్లో వాహనం ఉందని.. వెళ్లి తీసుకోండని సూచిస్తున్నారు. తక్కువ ధరలకే కార్లు వస్తున్నాయన్న ఆశతో కొందరు సైబర్ నేరస్తులు సూచించిన ఖాతాల్లో నగదు బదిలీ చేసి మోసపోతున్నారు. ‘కారు’మేఘం భవానీపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ప్రేమ్కుమార్ ఈ నెల 3వ తేదీన వెబ్సైట్లో ఐ10 కారు విక్రయ ప్రకటన చూశారు. ప్రకటనలో ఉన్న నంబరుకు ఫోన్ చేయగా.. తనను తాను మిలటరీ రిటైర్డ్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. రూ.80 వేలకు కారు ఇస్తానని అవతలి వ్యక్తి చెప్పాడు. మిలటరీ కొరియర్ ద్వారా కారును విజయవాడ విమానాశ్రయానికి పంపుతానన్నాడు. ముందస్తుగా కొరియర్ చార్జీల కింద రూ.16,150 పంపించాలని సూచించాడు. అంతా బాగుందనుకున్న ప్రేమ్కుమార్ నిందితుడి ఖాతాలో నగదు జమ చేశాడు. ఆ నగదు తన ఖాతాలో పడగానే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ‘బుల్లెట్’ వేగంతో మాయం పెనమలూరు మండలం పోరంకికి చెందిన కరణం సాయికుమార్కు బుల్లెట్ అంటే ఇష్టం. జనవరి నెలలో వెబ్సైట్లో ప్రకటన చూసి.. ప్రకటనకర్తను సంప్రదించాడు. రూ.1.79 లక్షలకు బుల్లెట్ ఇస్తానని అతను చెప్పాడు. ముందుగా రూ.లక్ష ఇస్తే రిజి్రస్టేషన్ చేయిస్తానని నమ్మించాడు. అతని ఖాతాలో సాయికుమార్ రూ.లక్ష జమ చేశాడు. బుల్లెట్ కోసం ఫోన్ చేయగా.. అవతల రింగే కాలేదు. మోసపోయానని తెలుసుకున్న సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు పంపిస్తున్నానని.. గూడవల్లిలో నివాసముంటున్న శ్రీనివాసరావు ఏప్రిల్ నెలలో ఓఎల్ఎక్స్లో మారుతీ స్విఫ్ట్ కారు అమ్మక ప్రకటనను చూశాడు. రూ.2.75 లక్షలకే కారు విక్రయిస్తానంటూ ఓ వ్యక్తి ప్రకటించడంతో అతని నంబర్కు ఫోన్ చేశాడు. తాను హైదరాబాద్లో ఉంటున్నానని ఆర్మీ కంటోన్మెట్లో ఉద్యోగమని అవతలి వ్యక్తి చెప్పాడు. బయానాగా రూ.27,500 నగదు జమ చేస్తే.. కారు అప్పగిస్తానన్నాడు. అతడి మాటలు నమ్మిన శ్రీనివాసరావు నగదు నిందితుడి ఖాతాలో జమ చేశాడు. గంటలు.. రోజులు గడిచినా అతడు రాలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందుగా డబ్బు చెల్లించొద్దు ఓఎల్ఎక్స్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వస్తున్న ప్రకటనలు చూసి మోసపోరాదు. వాహనం చూడకుండా ముందుగా విక్రయదారులకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించవద్దు. మిలటరీలో పనిచేస్తున్నామంటూ ఇటీవల చాలా మంది మోసకారులు తప్పుడు ప్రకటనలు పెడుతున్నారు. వాటిని చూసి మోసపోకండి. వాహనం ప్రత్యక్షంగా చూసి నచ్చాకే.. రికార్డులు పరిశీలించుకుని కొనుగోలుకు ముందుకెళ్లాలి. – కె.శివాజీ, సీఐ, సైబర్ క్రైం -
అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..
చిక్కడపల్లి: షార్ట్ ఫిలింలు తీస్తున్నామని పరిచయం చేసుకుని ఓఎల్ఎక్స్లో కెమెరాలు అద్దెకు తీసుకొని వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.45లక్షల విలువైన 10 కెమెరాల స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో సీఐ శివశంకర్రావు, డీఐ ప్రభాకర్తో కలిసి ఏసీపీ చల్లా శ్రీధర్ వివరాలు వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన సైమన్ అనే వ్యక్తి తన కెమెరాలను అద్దెకు ఇస్తానని ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన గచ్చిబౌలి రాజీవ్నగర్కు చెందిన టాక్సీ డ్రైవర్ సారిన్ హర్షవర్ధన్, బాలానగర్కు చెందిన ఆనంద్కుమార్ అనే వ్యక్తులు గత సెప్టెంబర్ 15న సైమన్ను సంప్రదించారు. రూ.700 చొప్పున కిరాయి మాట్లాడుకుని 10 కెమెరాలను తీసుకున్నారు. గుర్తింపుగా ఆధార్ కార్డు స్కాన్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్టోబర్ 9 వరకు గడువు పొడిగిస్తున్నట్లు సైమన్కు మేసేజ్ చేశారు. అనంతరం కెమెరాలను ఇతరులకు విక్రయించారు. అయితే గడువు ముగిసినా కెమెరాలు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన సైమన్ వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ చేసినట్లు వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, కమిషనర్లరెట్ల పరిధిలోని చిక్కడపల్లి, బహుదూర్పూర, బోయినపల్లి, చాంద్రాయణగుట్ట, వనస్థలిపురం, అల్వాల్, సనత్నగర్, గోల్కొండ, ఎస్సార్నగర్ పీఎస్ల పరిధిలో కేసులు ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
దడ పుట్టిస్తున్న సైబర్ నేరాలు
-
అంతా మోసం!
సాక్షి, సిటీబ్యూరో: కంటికి కనిపించకుండా అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పంథామార్చుకుంటున్నారు. వివిధ మార్గాల్లో మోసాలకుపాల్పడుతూ ప్రజలను నిలువునా ముంచుతున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకొని సిటీజనులు మోసపోతున్నారు. సెకండ్హ్యాండ్ సేల్స్ పేరుతో ఓఎల్ఎక్స్ వేదికగా దగా చేయడం, బ్యాంకు అధికారులఅవతారమెత్తి ఓటీపీ సంగ్రహించి టోకరా వేయడం, జాబ్స్/వీసాల పేరుతో దండుకోవడం, లాటరీ/రుణాల పేరుతో అందినకాడికి దోచుకోవడం, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతూ డిమాండ్ చేయడం... ఇలా వినూత్న మార్గాల్లో సైబర్ నేరగాళ్లు పంజావిసురుతున్నారు. ఈ కేటగిరీ క్రైమ్స్లో ఈ ఏడాది ఆగస్టు వరకు సిటీలో 720 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 198 ‘ఓఎల్ఎక్స్’ ఫ్రాడ్స్ ఉన్నాయి. గతంలో ఓటీపీ క్రైమ్ ఎక్కువగా నమోదు కాగా... ఇప్పుడా స్థానంలో ‘ఓఎల్ఎక్స్’ చేరింది. ఈ ఈ–కామర్స్ సైట్లో ఆర్మీ ఉద్యోగుల పేరుతో పోస్టింగ్స్ పెట్టి, సెకండ్హ్యాండ్ వస్తువుల్ని అతి తక్కువ ధరకు విక్రయిస్తామంటూ డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారు. భరత్పూర్ కేంద్రంగా... రాజస్థాన్లోని మేవాట్ రీజియన్లో ఉన్న భరత్పూర్ ఈ ఓఎల్ఎక్స్ నేరగాళ్లకు అడ్డాగా మారిపోయిందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఈ–కామర్స్ సైట్స్లో కార్లను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకొని మోసం చేసే ముఠాలు అక్కడ అనేకం ఉన్నాయని వివరిస్తున్నారు. ప్రధానంగా ఓఎల్ఎక్స్తో పాటు మరికొన్ని సైట్స్లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్ పెడుతున్న ఈ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన వారి ఫొటోలతోనే పోస్టింగ్స్ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్తో పాటు వివిధ రకాలైన కార్ల ఫొటోలను పొందు పరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైర్డ్ అయిన నేపథ్యంలోనే ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్లో పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆర్మీ దుస్తుల్లో దిగిన ఫొటోలనూ పోస్ట్ చేసి మరింత నమ్మకం కలిగిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు రేట్లు పొందుపరుస్తున్నారు. ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా వాహనాల యజమానులు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఉందంటూ చెబుతున్నారు. ఎవరైనా ఆసక్తి చూపించి వారిచ్చిన నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్గా కొంత మొత్తం చెల్లించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు ఖాతాలతో పాటు వివిధ వాలెట్స్లోకి ఆ నగదు బదిలీ చేయించుకొని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేస్తున్నారు. అదే అదనుగా... విదేశాల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేయడం అనేక మంది కల. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునే ముఠాలు పుట్టుకొచ్చాయి. సాధారణంగా విదేశాల్లో విద్య, ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లు ఇంటర్నెట్పై ఆధారపడతారు. అనేక వెబ్సైట్లు, బ్లాగులను సెర్చ్ చేయడంతో పాటు మరికొన్నింటిలో తమ ప్రొఫైల్స్ పొందుపరుస్తూ ఉంటారు. ఇవన్నీ సైబర్ నేరగాళ్లకు కలిసొచ్చే అంశాలుగా మారిపోతున్నాయి. ఆయా వెబ్సైట్స్ నుంచి సమాచారం సంగ్రహిస్తున్న నేరగాళ్లు విదేశీ విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారిని టార్గెట్గా చేసుకుంటున్నారు. నేరుగా కాల్స్ చేయడమో, ఎస్సెమ్మెస్లు, ఈ–మెయిల్స్ పంపడమో చేస్తున్నారు. వీటికి ఎదుటివారు స్పందిస్తే తమ ‘పని’ ప్రారంభిస్తున్నారు. ఫలానా వెబ్సైట్లో ప్రొఫైల్ చూశామని, తాము అందించే ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెబుతుంటారు. విద్యార్థులకైతే ఆయా దేశాల్లో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలతో తమకు సంబంధాలున్నాయని, ప్రతిఏటా కొన్ని సీట్లు రిజర్వ్ చేసి మరీ వాటిని భర్తీ చేసే అవకాశం నిర్వాహకులు తమకు ఇచ్చారని పేర్కొంటారు. ఆపై అడ్వాన్స్లు, వీసా ప్రాసెసింగ్ ఫీజులు, పన్నుల పేర్లు చెప్పి డబ్బు తమ బ్యాంకు ఖాతాల్లోకో, వాలెట్స్లోకో బదిలీ చేయించుకొని మోసం చేస్తుంటారు. ఒకసారి డబ్బు ముట్టిన తర్వాత బాధితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిని సంప్రదించడం సాధ్యం కాదు. అపరిచితులతోలావాదేవీలొద్దు... ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం అంత కష్టం. ఈ కేసుల్లో రికవరీలు దాదాపు అసాధ్యంగా మారిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో లావాదేవీలు చేయొద్దు. పరిచయం లేనివారు చెప్పిన మాటలు నమ్మి ఒక్క రూపాయి కూడా కోల్పోవద్దు. ఈ నేరగాళ్లు వినియోగించే సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ బోగస్ వివరాలతో పొందినవై ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిందితులను పట్టుకోవడం సాధ్యం కాదు. సైబర్ నేరాల విషయంలో ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యార్’ అనే నానుడి కచ్చితంగా పాటించాలి. ఏ వస్తువైనా వాటి విలువ కంటే తక్కువ ధరకు మార్కెట్లో దొరకదని, బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి ఓటీపీలు అడగరని, ఆన్లైన్ ప్రొఫైల్స్ ఆధారంగా ఉద్యోగాలు, విద్యావకాశాలు రావని గుర్తుంచుకోవాలి.– సిటీ సైబర్ కాప్స్ లాటరీలంటూ టోకరా... నగర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో నమోదవుతున్న కేసుల్లో లాటరీ/లోన్ ఫ్రాడ్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఈ నేరాలకు పాల్పడే నిందితులు వివిధ మార్గాల్లో బల్క్గా ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్స్ సంపాదిస్తున్నారు. డార్క్ వెబ్తో పాటు ఇంటర్నెట్లోనూ నామమాత్రపు ధరకు ఈ డేటాను అందించే సైట్లు అనేకం ఉన్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాల ఆధారంగా ప్రముఖ సంస్థల పేర్లతో లాటరీ తగిలిందని, తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామంటూ కాల్స్, ఎస్సెమ్మెస్లు, ఈ–మెయిల్స్తో ‘విరుచుకుపడతారు’. ఎవరైనా స్పందిస్తే వారిలో నమ్మకం కలగడానికి ఆయా సంస్థల పేర్లు, లోగోలతో కూడిన సర్టిఫికెట్లను సైతం ఈ–మెయిల్/వాట్సాప్ ద్వారా బాధితులకు పంపిస్తారు. ఆ మొత్తం మీకు చేరాలంటే జీఎస్టీ మొదలు అనేక పన్నులు చెల్లించాలని చెప్పి తమ ఖాతాలు/వాలెట్స్లో వేయించుకొని మోసం చేస్తారు. ఈ నేరగాళ్లు అనేక సందర్భాల్లో మీరు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేసే ప్రతి పైసా లాటరీ మొత్తం లేదా రుణంతో కలిపి తిరిగి వచ్చేస్తుందని నమ్మిస్తారు. ఈ రెండు రకాలైన మోసాలతో పాటు ఇప్పటికీ బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సంగ్రహించి మోసం చేస్తున్న కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలూ అనేకం పోలీసు రికార్డులకు ఎక్కుతున్నాయి. -
ఎలక్షన్ ఫండ్ కోసం ‘ఓఎల్ఎక్స్’ మోసం
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మెహతబ్కు రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఇప్పటికే రెండుసార్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మరోసారి ఎలక్షన్ బరిలోకి దిగడానికి అవసరమైన డబ్బు కోసం తన స్నేహితుడు అఖిబ్తో కలిసి ‘ఓఎల్ఎక్స్ ఫ్రాడ్’కు తెరలేపాడు. వీరిరువురు హైదరాబాద్కు చెందిన విద్యార్థిని ఢిల్లీకి రప్పించి రూ.4.65 లక్షలు కాజేశారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీలోని కమ్ల మార్కెట్ పోలీసులు కొద్ది రోజుల క్రితం నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు ఆధారాలు లభించాయని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ మన్దీప్ సింగ్ రంద్వా పేర్కొన్నారు. కారు కోసం ఈ–కామర్స్ సైట్లో... హైదరాబాద్కు చెందిన విద్యార్థి సుల్తాన్ సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు ఖరీదు చేసేందుకు గాను గత ఆగస్టు నెలలో ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి రూ.6 లక్షలకు విక్రయిస్తామంటూ పోస్ట్ చేసిన టయోట ఫార్చునర్ కారు ప్రకటనపై పడింది. సుల్తాన్ ఆ ప్రకటనలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా మెహతాబ్ను సంప్రదించాడు. బేరసారాల తర్వాత కారును రూ.4.65 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. నగదు చెల్లించి కారు తీసుకువెళ్ళడానికి ఢిల్లీకి రావాల్సిందిగా మెహతాబ్ చెప్పడంతో సెప్టెంబర్ 3న సుల్తాన్ తన సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లాడు. అజ్మేరీ గేట్ వద్ద సుల్తాన్ను కలిసిన మెహతాబ్, అఖిబ్ అతడి నుంచి రూ.2.15 లక్షల నగదు తీసుకున్నారు. మరో రూ.2.5 లక్షలను మెహతాబ్ సోదరుడు అథర్ అలీ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. కారుకు సంబందించిన ఎన్ఓసీ అందాల్సి ఉందని, మర్నాడు (సెప్టెంబర్ 4న) అది వచ్చాక కారు అప్పగిస్తామని చెప్పారు. తెల్లవారుజామునే పరారీ... దీనికి సుల్తాన్ అంగీకరించడంతో వారిని మెహతాబ్ ద్వయం ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలోని లాడ్జికి తీసుకువెళ్ళారు. పక్కపక్క గదులు తీసుకున్న వీరు ఆ రాత్రి అక్కడే బస చేశారు. సెప్టెంబర్ 4 ఉదయం సుల్తాన్, అతడి సోదరుడు నిద్ర లేచేసరికి మెహతాబ్, అఖిబ్లు లాడ్జి ఖాళీ చేసి ఉడాయించారు. దీనిపై బాధితుడు అక్కడి కమ్ల మార్కెట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు అజ్మేరీ గేట్తో పాటు వారు బస చేసిన హోటల్ తదితర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ ఆధారంగా అనుమానితుల్ని గుర్తించారు. సుల్తాన్ రూ.2.5 లక్షలు బదిలీ చేసిన అథర్ అలీ బ్యాంకు ఖాతా ఆధారంగా నిందితులు మీరట్కు చెందిన వారిగా . అక్కడికి వెళ్ళిన ప్రత్యేక బృందం స్థానికుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించింది. మెహతాబ్ ఈ–కామర్స్ సైట్లో పోస్ట్ చేసిన కారు అతడి బంధువుదిగా తేలడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అథర్ అలీ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఖర్చు కోసమే... మీరట్కు చెందిన మెహతాబ్, అఖిబ్ వ్యవసాయం చేసేవారు. మెహతాబ్కు రాజకీయాలపై ఆసక్తి పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. ఇందులో భాగంగా రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మెహతాబ్తో పాటు అతడికి నగదు సాయం చేసిన అఖిబ్ సైతం ఆర్థికంగా బాగా నష్టపోయాడు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి పోటీ చేసి గెలవాలని మెహతాబ్ నిర్ణయించాడు. అయితే అందుకు అవసరమైన డబ్బు కోసం ఇద్దరూ కలిసి ‘ఓఎల్ఎక్స్ ఫ్రాడ్’కు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో మెహతాబ్ మేనమామ తన టయోట ఫార్చునార్ కారు అమ్ముతానని చెప్పడంతో దానినే వాడుకున్నారు. ఆ కా>రు ఫొటో, వివరాలను ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేస్తూ తక్కువ రేటు పొందుపరిచారు. దీనికి సుల్తాన్ తో పాటు అనేక మంది ఆకర్షితులై ఢిల్లీ చేరి మోసపోయారు. అలాంటి వారిలో హైదరాబాద్కు చెందిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఆర్మీ పేరుతో గాలం !
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల సెకండ్హ్యాండ్ ఆన్లైన్ మార్కెట్ బహిరంగ విపణికి పోటీగా ఆన్లైన్లోనూ జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఓఎల్ఎక్స్, క్వికర్ సహా అనేక వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ఇవి వినియోగదారులకు ఎంత సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయో... సైబర్ నేరగాళ్లకూ అదే స్థాయిలో కలిసి వస్తున్నాయి. ప్రధానంగా ఓఎల్ఎక్స్ను అడ్డాగా చేసుకుని, ఆర్మీ ఉద్యోగులమంటూ తక్కువ ధరకు వస్తువుల పేరుతో మోసం చేస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరహా మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేరుతో అమాయకులకు గాలం వేస్తున్నారు. ఈ–కామర్స్ సైట్స్లో ఆకర్షనీయంగా ఉండే వాహనం ఫొటోను అతి తక్కువ ధరకు పోస్ట్ చేసే వీరు సంప్రదించేందుకు ఓ నెంబర్ ఇస్తున్నారు. సాధారణంగా ఆ నంబర్లు కూడా తప్పుడు పేర్లు, బోగస్ వివరాలతో పొందినవై ఉంటున్నాయి. దీనిని చూసి ఆకర్షితులై సంప్రదించిన వారితో తాము హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ అవుతున్నామని... అనివార్య కారణాల నేపథ్యంలోనే తమ వాహనం తీసుకెళ్లడం సాధ్యం కానందున అత్యవసరంగా అమ్మాల్సి వస్తోందంటూ చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని గుర్తింపుకార్డులు తదితరాలు వాట్సాప్ ద్వారా బాధితులకు పంపిస్తున్నారు. ఒక్కోసారి వీరు కూడా ఓఎల్ఎక్స్లో ఉన్న ప్రకటనల ఆధారంగానే విక్రేతలను సంప్రదించి తాము ఆయా వాహనాలను ఖరీదు చేస్తామంటున్నారు. సరిచూసుకోవడానికి పత్రాలు పంపాలని కోరుతున్నారు. వీటి ఆధారంగా వీళ్ళే విక్రేతలుగా మారి మరొకరిని టార్గెట్ చేస్తున్నారు. ఈ సైబర్ మాయగాళ్లు క్వికర్.కామ్లో ఉన్న వాహన విక్రయ ప్రకటనలను కాపీ చేస్తున్నారని, వాటిని ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు నగరవాసులకు టోకరా వేసేందుకు స్థానిక రిజిస్ట్రేషన్ నంబర్లతో కూడిన వాహనాల ఫొటోలను ప్రకటనల్లో పొందుపరుస్తున్నారు. వీటినీ వారు ఇంటర్నెట్ నుంచి సేకరించి, ఫొటోషాప్లో నంబర్లు మారుస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వాహనాలతో పాటు ఐ–ఫోన్లు, శామ్సంగ్, మోటోరోలాతో పాటు డెల్, హెచ్పీ కంపెనీల ల్యాప్టాప్లు కూడా అమ్ముతామంటూ అందినకాడికి దండుకుంటున్నారు. బేరసారాల తర్వాత అడ్వాన్స్గా కొంత తమ ఖాతాలు/వాలెట్స్లోకి బదిలీ చేస్తే వాహనం/వస్తువు పంపుతామంటూ షరతు విధిస్తున్నారు. అలా డబ్బు తమకు చేరిన తర్వాత తర్వాత ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ చేసేస్తున్నారు. ఈ ఖాతాలు/వాలెట్స్ సైతం వారి పేర్లు, వివరాలతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ నేరగాళ్లు ఆయా వస్తువులు/వాహనాన్ని ఓ కొరియర్ కార్యాలయం నుంచి పంపుతున్నామంటూ నకిలీ కొరియర్ సంస్థలో ఫొటోలు, రసీదును వాట్సాప్ ద్వారా కొనుగోలుదారులకు పంపి మొత్తం ఖరీదు వసూలు చేసి ముంచేస్తున్నారు. కొరియర్ సంస్థల నుంచి ఫోన్లు చేస్తున్నట్లు మాట్లాడి మొత్తం సొమ్ము తమకు చేరేలా చేసుకుంటున్నారు. ఈ సైబర్ నేరాలకు పాల్పడే వారు ప్రధానంగా రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా డీగా, టోడా గ్రామాల్లోని తండాలకు చెందిన వారిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ♦ కేవలం ఓఎల్ఎక్స్ ప్రకటనల విషయంలోనే కాకుండా నేరుగా పరిచయం లేని వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నెరపకూడదు. ప్రత్యక్షంగా వస్తువులు, వ్యక్తులను చూసిన తర్వాతే చెల్లింపులు చేయాలి. ♦ ఈ–కామర్స్ సైట్స్లో ప్రకటనలకు సంబంధించిన వస్తువులు/వాహనాల కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకండి. అలా వెళితే కిడ్నాపర్ల బారినపడే ప్రమాదమూ ఉంటుందని మర్చిపోవద్దు. వస్తువు ధర మరీ తక్కువగా ఉందంటే అనుమానించాల్సిందే. ♦ క్లాసిఫైడ్ సైట్లలో మనకు కనిపించే ఏ వస్తువును కొనుగోలు చేసినా సరే.. దాన్ని పొందేందుకు ముందుగానే డబ్బులు ఖాతాలో జమ చేయాలని ఎవరైనా అడిగితే అనుమానించండి. ♦ సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అవతలి వ్యక్తుల నుంచి వారి ధ్రువపత్రాల జిరాక్సులను తీసుకోవాలి. గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాలను సేకరించాలి. ♦ కార్లు తదితర వాహనాలను కొనుగోలు చేసే వారు సేల్ డీడ్ తో పాటు డిక్లరేషన్ తీసుకోవాలి. అప్పటి వరకు ఆ వాహనంపై ఉండే చలాన్లు లేదా ఏవైనా నేరాలు జరిగి ఉంటే.. ఆ వాహనం పాత ఓనర్దే బాధ్యత అని చెబుతూ ఆ ఓనర్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం మంచిది. వస్తువులను కొనేటప్పుడు వాటిని స్వయంగా వచ్చి చూపించాలని కోరాలి. అన్నీ కుదిరాకే వస్తువును కొనాలి. ఓఎల్ఎక్స్కు నోటీసులు జారీ చేశాం ఇటీవల కాలంలో ఓఎల్ఎక్స్ కేంద్రంగా మోసపోయామంటూ ఫిర్యాదులు పెరిగాయి. సైబర్ నేరగాళ్ల వలలో పడి వస్తువు చూడకుండా, వారిని కలవకుండా డబ్బులు చెల్లించి మోసపోతున్నారు. ముఖ్యంగా ఆర్మీ ఉద్యోగులం అంటూ ఓఎల్ఎక్స్లో వస్తున్న ప్రకటనలకే ఎక్కువ మంది నిండా మునుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓఎల్ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేశాం. వారితో మాట్లాడి ఈ తరహా నేరాల కట్టడికి చర్యలుతీసుకుంటున్నాం. – సీహెచ్వై శ్రీనివాస్కుమార్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ -
ఓఎల్ఎక్స్లో మరిన్ని భద్రతా ఫీచర్లు
హైదరాబాద్: ఆన్లైన్ ప్రకటనల వేదిక ఓఎల్ఎక్స్ వినియోగదారుల భద్రతకు సంబంధించి మరిన్ని చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్లైన్లో సురక్షిత లావాదేవీల నిర్వహణ, సైబర్ భద్రత పట్ల వారిలో అవగాహన కల్పించనుంది. ఉత్పత్తుల ఉన్నతీకరణ, యూజర్ల భద్రత మార్గదర్శకాలు, సోషల్ మీడియాలో డిజిటల్ ప్రచారం చర్యలను కూడా చేపట్టనుంది. సైబర్ పీస్ ఫౌండేషన్ తో ఓఎల్ఎక్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సైబర్ భద్రతా అవగాహన సదస్సులను తొలిదశ కింద రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించనుంది. యూజర్ల భద్రత కోణంలో ఓఎల్ఎక్స్ యాప్లో సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టినట్టు సంస్థ ప్రకటించింది. స్పామ్, హానికారక కంటెంట్ గురించి రిపోర్ట్ చేయవచ్చని తెలిపింది. -
ఆకర్షించి దోచేస్తారు
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ హ్యాండ్ వస్తువుల వ్యాపారానికి కేంద్రమైన ఆన్లైన్ సైట్ ‘ఓఎల్ఎక్స్’ సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారింది. ఇందులోని ప్రకటనలకు ఆకర్షితులై ఒకరు రూ.30 వేలకు బేరమాడిన బైక్కి రూ.3.6 లక్షలు చెల్లిస్తే.. మరొకరి నుంచి రూ.22 వేలకు ఫైనల్ చేసుకున్న ద్విచక్ర వాహనానికి రూ.92 వేలు గుంజేశారు. ఓ ద్విచక్ర వాహనాల షోరూమ్లో పనిచేస్తున్న యువతి కొత్త వాహనం బుకింగ్కు సంబంధించినదిగా భావించి ఫోన్కాల్ అందుకుంటే.. అడ్వాన్స్ చెల్లిస్తున్నానంటూ చెప్పిన మోసగాడు ఆమె వ్యక్తిగత ఖాతా నుంచి రూ.87 వేలు కాజేశాడు. వాహనాలతో ముడిపడి ఉన్నఈ మూడు ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓఎల్ఎక్స్ ద్వారా మోసం చేసిన నేరస్తులు ఉత్తరాదిలోని భరత్పూర్కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.30 వేల బండికి రూ.3.60 లక్షలు.. తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఈ నెల 14న ఓఎల్ఎక్స్లో ద్విచక్ర వాహనం విక్రయానికి సంబంధించిన ప్రకటన చూశారు. జోరాసింగ్ అనే వ్యక్తి బైక్ను రూ.42,500 అమ్మడానికి సిద్ధమంటూ అందులో నమోదు చేశాడు. ఈ ఏడాది మోడల్ అవడంతో వాహనాన్ని ఖరీదు చేయాలని భావించిన ప్రైవేట్ ఉద్యోగి జోరాసింగ్ను సంప్రదించగా.. తాను హైదరాబాద్ కేంద్రంగా ఆర్మీలో పనిచేస్తున్నానని, త్వరలో విజయవాడకు బదిలీపై వెళ్తున్నానని చెబుతూ తన గుర్తింపుకార్డు పంపాడు. దీంతో పూర్తిగా నమ్మిన సదరు ప్రైవేట్ ఉద్యోగి బేరసారాల తర్వాత బైక్ను రూ.30 వేలకు కొనేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి మోసానికి తెరతీసి జోరాసంగ్గా చెప్పుకున్న వ్యక్తి ‘ఆర్మీ’ అనే పేరుతో నిర్వహిస్తున్న తన పేటీఎం ఖాతాకు అడ్వాన్స్గా రూ.10 వేలు పంపాలని కోరాడు. ఆ మొత్తం ముట్టిన వెంటనే కొరియర్లో వాహనాన్ని పంపిస్తానంటూ పేర్కొన్నాడు. ఈ మాటలు నమ్మిన ప్రైవేట్ ఉద్యోగి అలానే చేశారు. మరుసటి రోజే కొరియర్ బాయ్గా చెప్పుకున్న వ్యక్తి నుంచి ఇతడికి ఫోన్ వచ్చింది. వాహనం డెలివరీకి సిద్ధంగా ఉందని, బ్యాలెన్స్ రూ.20 వేలకు జోరా పేటీఎంకు బదిలీ చేస్తే వాహనం వచ్చి చేరుతుందని చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు. ఇది జరిగిన గంటకే మళ్లీ ఫోన్ చేసిన ‘కొరియర్ బాయ్’ సదరు వాహనానికి బీమా చెల్లించాల్సి ఉందని, తక్షణం రూ.11,500 పేటీఎం చేయాలని సూచించగా ఆ డబ్బు కూడా చెల్లించాడు. ఇలా మొత్తం రూ.41,500 ముట్టిన తర్వాత ‘ఓఎల్ఎక్స్ నేరగాళ్లు’ రిఫండ్ అంటూ గుంజడం మొదలెట్టారు. మరోసారి బాధితుడికి ఫోన్ చేసి వాహనానికి జీఎస్టీ నిమిత్తం రూ.13,200 చెల్లించాలని ఈ మొత్తం వాహనం డెలివరీ అయిన తర్వాత రిఫండ్ వస్తుందంటూ నమ్మించి బదిలీ చేయించుకున్నాడు. లావాదేవీలు ఆలస్యమైన నేపథ్యంలో ‘ఆర్మీ’ లేట్ ఫీజు విధించడంతో పాటు కొంత మొత్తం డిపాజిట్ చెల్లించాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్న ‘కొరియర్ బాయ్’ రూ.51,500 డిపాజిట్ చేయించుకున్నాడు. ఈ చెల్లింపులు చేసిన మరుసటి రోజు ప్రైవేట్ ఉద్యోగి సదరు ‘కొరియర్ బాయ్’ని ఫోన్ ద్వారా సంప్రదించి వాహనం డెలివరీ ఇవ్వాలని కోరాడు. దీంతో మరికొన్ని ‘రిఫండబుల్ ఫీజులు’ వివరాలు చెప్పిన అతగాడు మరికొంత మొత్తం డిపాజిట్ చేయించుకున్నాడు. మొత్తమ్మీద రూ.30 వేలకు బేరమాడిన వాహనం కోసం ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.3,60,200 గుంజేశారు. అంతటితో ఆగని సైబర్ నేరగాళ్లు మరో రూ.75 వేలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడి సోదరి సూచన మేరకు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. రూ.22 వేల బైక్కు రూ.92 వేలు దోపిడీ బజార్ఘాట్కు చెందిన ఓ యువకుడు రేడియం వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఈ నెల 15న ఓఎల్ఎక్స్ మొబైల్ యాప్లో ఓ ప్రకటన చూశారు. సెకండ్ హ్యాండ్ హోండా యాక్టివా వాహనం రూ.24 వేలకు విక్రయిస్తామనేది దాని సారాంశం. దీనికి ఆకర్షితుడైన వ్యాపారి అందులో ఉన్న ఫోన్ నెంబర్కు కాల్ చేయగా ఆర్మీ ఉద్యోగి పీఎస్ఎన్ మూర్తిగా పరిచయం చేస్తున్న అవతలి వ్యక్తి తాను మహారాష్ట్రలోని నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. బేరసారాల తర్వాత వాహనాన్ని రూ.22 వేలకు ఇచ్చేందుకు మూర్తి అంగీకరించాడు. దీంతో తన గూగుల్ పే ఖాతా ఉన్న ఫోన్ నెంబర్ చెప్పిన మూర్తిగా చెప్పుకున్న వ్యక్తి అడ్వాన్స్గా కొంత మొత్తం చెల్లింమన్నాడు. ఆపై అనేక ఫీజులు, రిఫండ్ డిపాజిట్ల పేరుతో మొత్తం రూ.92,782 కాజేశాడు. మధ్యలో ఓ సందర్భంలో తాను ఆర్మీలో పనిచేస్తున్నట్లు ‘నిరూపించే’ గుర్తింపు కార్డునూ వాట్సాప్ ద్వారా బాధితుడికి పంపాడు. ఎంతకూ వాహనం డెలివరీ కాకపోవడం, మూర్తి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బైక్కు అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పి.. సికింద్రాబాద్లోని ప్యాట్నీ ప్రాంతానికి చెందిన ఓ యువతి సోమాజిగూడలోని ద్విచక్ర వాహనాల షోరూమ్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈమెకు వెస్ట్ మారేడ్పల్లిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఖాతా ఉంది. దీనికి సంబంధించి గూగుల్ పే ఖాతా కూడా ఆమెకు ఉంది. మంగళవారం వీరి షోరూమ్కు ఓ కాల్ వచ్చింది. తాను టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ వాహనం కొనాలని భావిస్తున్నాని, దాన్ని బుక్ చేసుకుంటూ రూ.10 వేలు అడ్వాన్స్గా ఇస్తానంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో ఈ కాల్ అటెండ్ చేయాల్సిన బాధ్యతని నిర్వాహకులు ఈ యువతికి అప్పగించారు. అతడితో మాట్లాడిన ఈమెతో సదరు మోసగాడు అడ్వాన్స్ చెల్లించడానికి సిద్ధమయ్యాడు. దీనికోసం ఆమె గూగుల్ పే ఖాతా బార్ కోడ్ను స్క్రీన్ షాట్ తీసి తనకు వాట్సాప్కు పంపమని చెప్పాడు. ఆమె అలానే చేయడంతో అతగాడు తన ‘పని’ మొదలెట్టాడు. ఆమెకు మరోసారి కాల్ చేసిన మోసగాడు గూగుల్ పే యాప్లోకి వెళ్లి అందులో ఉన్న ‘ప్రొసీడ్ ఆప్షన్’ నొక్కాల్సిందిగా సూచించాడు. ఆమె అలానే చేయడంతో తొలుత రూ.11 వేలు తన ఖాతాలోకి వచ్చినట్లు కనిపించింది. ఆపై అతడు సూచించినట్లే మరో ఆరుసార్లు అదే ఆప్షన్ను ఆమె నొక్కారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత తన బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకున్న బాధితురాలు అందులో నుంచి రూ.87 వేలు మాయమైనట్లు గుర్తించారు. వాహనం బుక్ చేసుకుంటాను, ఆన్లైన్లో అడ్వాన్స్ చెల్లిస్తాను అంటూ ఫోన్ చేసిన వ్యక్తి దీనికి బాధ్యుడని గుర్తించారు. దీంతో బాధితురాలు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. యూపీఐ లావాదేవీల ద్వారా మోసగాడు ఆమె ఖాతా నుంచి నగదు తస్కరించనట్లు పోలీసులు నిర్థారించారు. -
ఆన్లైన్లో కొంటున్నారా.. బహు పరాక్
అల్లిపురం(విశాఖ దక్షిణం): ∙నగరంలో ఓ నేవల్ అధికారి ఓఎల్ఎక్స్ యాప్లో ఖరీదైన కారు తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుకు సిద్ధపడ్డాడు. అమ్మకందారుతో చాటింగ్లో ధర నిర్ణయించుకుని లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. అంతే అమ్మకందారు చాటింగ్ నుంచి పరార్. దీంతో లబోదిబో మంటూ ఆ అధికారి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఆన్లైన్లో అమ్మకందారు చూపించిన డిఫెన్స్ ఐడీ కార్డు, ఆధార్ కార్డును పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయాడు. ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ప్రదీప్ సింగ్ ధర్మాల్ సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనం కోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశాడు. హోండా యాక్టివా 5జీ ఫర్ సేల్ అని పోస్ట్ చూశాడు. వెంటనే పోస్ట్ పెట్టిన వ్యక్తిని సంప్రదించగా తన పేరు అజయ్ యాదవ్ అని, ఇండియన్ ఆర్మీ కాకినాడలో పని చేస్తున్నానని చెప్పడంతో రూ.28 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రదీప్ సింగ్ మాత్రం వాహనం చూసి డబ్బులు ఇస్తానని చెప్పడంతో.. నేను ఆర్మీ పర్సన్ను నన్ను నమ్మమని చెప్పడంతో అంగీకరించారు. ఆ తరువాత రకరకాల రిఫండబుల్ చార్జెస్ పేరుతో రూ.50,625 డిపాజిట్ చేయించుకున్నాడు. అనుమానం వచ్చిన ప్రదీప్సింగ్.. అజయ్ యాదవ్ ఇచ్చిన వివరాలు పరిశీలించగా.. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రెండు నెలల్లో 7 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నా విద్యావంతులు సైతం మోసం పోతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఓఎల్ఎక్స్ ఆన్లైన్ సైట్ ద్వారా మొబైల్ ఫోన్స్, కార్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాల పేరిట ఎక్కువ మోసాలు విశాఖపట్నం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి. రెండేళ్లుగా ఓఎల్ఎక్స్ ద్వారా మోసపోయిన కేసులు సుమారు 25 కేసులు ఉన్నాయి. వాటి ద్వారా దాదాపు రూ.29లక్షల వరకూ యాప్ వినియోగదారులు నష్టపోయారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీనిపై నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓఎల్ఎక్స్ లీగల్ మేనేజర్ జుహీసింగ్ను విశాఖపట్నం పిలిపించి సూచనలు చేశారు. పోలీసుల సూచనల మేరకు ఓఎల్ఎక్స్ యాజమాన్యం యాప్లో మార్పులు చేశారు. ఓఎల్ఎక్స్లో పెట్టే ప్రతియాడ్లోను పోస్ట్ చేసే వారి ఐడీ ప్రూఫ్ ధ్రువీకరణ, లొకేషన్ ధ్రువీకరణ, డివైస్ ధ్రువీకరణ పోస్టు చేసేలా మార్పులు చేశారు. ఇప్పటికైనా ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఫేస్బుక్లలో వచ్చే యాడ్లను చూసి తక్కువలో మొబైల్ ఫోన్స్, కార్లు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేసే సమయంలో సరైన ధ్రువీకరణ లేకుండా ముందస్తుగా ఎవ్వరికీ డబ్బులు పంపరాదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ధ్రువపత్రాలు చూసుకుని వస్తువులు కొనండి సరైన ధ్రువీకరణ లేకుండా వెబ్సైట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయకండి. యాప్లో వచ్చే యాడ్స్కు సంబంధించి అమ్మకందారులు పెడుతున్న ధ్రువ పత్రాలను సరిచూసుకోండి. ఆన్లైన్లో వస్తువులను చూసి మోసపోకండి. రిమోట్ ఏరియాల నుంచి వచ్చే యాడ్ల పట్ల ఆకర్షితులవ్వకండి. జాగ్రత్తగా ఆలోచించి, సమీపంలో అడ్రస్లను ఎంచుకుని వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది. తొందరపడి డబ్బు డిపాజిట్ చేయకండి. తస్మాత్ జాగ్రత్త. – వి.గోపీనాథ్, సైబర్ క్రైం సీఐ్చ -
జల్సాలకు అలవాటు పడిన ఆమె..
నాగోలు: ఓఎల్ఎక్స్ ద్వారా సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి అమె నుంచి రూ. 3.40 లక్షల విలువైన సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీఐ కృష్ణ మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన అల్లారి భాను అరవింద చౌదరి నగరానికి వచ్చి సరూర్నగర్లో ఉంటోంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఓఎల్ఎక్స్లో సెల్ ఫోన్లు విక్రయించేందుకు ప్రకటనలు ఇచ్చేవారిని సంప్రదించేది. వారిని తాను ఎంచుకున్న ప్రాంతానికి రప్పించి సెల్ఫోన్ ఇంట్లో వాళ్ల చూపిస్తానని వస్తానని చెప్పి పరారయ్యేది. ఇదే తరహాలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సైదాబద్లో ఒకరిని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి అమె నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. -
‘భరత్పూర్’ భరతం పట్టలేరా?
సాక్షి, సిటీబ్యూరో: రాజస్థాన్ రాష్ట్రం, మేవాట్ రీజియన్లోని భరత్పూర్ జిల్లా ‘ఓఎల్ఎక్స్ సైబర్ నేరగాళ్లకు’ అడ్డాగా మారింది. ఈ–కామర్స్ సైట్స్లో కార్లను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసం చేసే ముఠాలకు కేంద్రమైంది. దీంతో వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే స్థానికులు, అక్కడి పోలీసుల నుంచి ఎలాంటి సహకారం ఉండకపోవడంతో ఫలితం దక్కట్లేదు. గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ ఫెయిల్ కాగా... తాజాగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారుల యత్నం బెడిసికొట్టింది. దేశంలోని దాదాపు ప్రతి నగరం నుంచీ పోలీసులు అక్కడకు వెళ్తుంటారు. ఇలాంటి వారిలో 95 శాతం రిక్తహస్తాలతోనో, రక్తసిక్త గాయాలతోనో తిరిగి వస్తుంటారు. ఆర్మీ ఉద్యోగుల పేరుతో పోస్టింగ్స్... ఓఎల్ఎక్స్తో పాటు మరికొన్ని సైట్లలో, ఇటీవల కాలంలో ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్ పెడుతున్న ఈ భరత్పూర్ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన వారి ఫొటోలతోనే పోస్టింగ్స్ చేస్తున్నారుట్లిందులో బుల్లెట్తో పాటు వివిధ రకాల కార్ల ఫొటోలను పొందుపరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైనైన నేపథ్యంలోనో ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్లో పొందుపరుస్తారు. కొన్నిసార్లు ఆర్మీ దుస్తుల్లో దిగిన ఫొటోలనూ పోస్ట్ చేసి మరింత నమ్మకం పుట్టిస్తారు. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50 వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు ధరలు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా వాహనాల యజమానులు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఉందంటూ చెబుతున్నారు. ఎవరైనా ఆసక్తి చూపించి వారిని సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్గా కొంత మొత్తం చెల్లించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు ఖాతా లతో పాటు వివిధ వ్యాలెట్స్లోకి ఆ నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేస్తున్నారు. రాజకీయ కారణాలతోనే అడ్డుపుల్లలు... భరత్పూర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఓఎల్ఎక్స్ నేరగాళ్లు ఈ తరహాలో రెచ్చిపోవడానికి, పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులను ముప్పతిప్పలు పెట్టడానికి రాజకీయ కారణాలు సైతం ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే అక్కడ ప్రభుత్వం మారి కొత్త సర్కారు కొలువు తీరింది. ఇలా సర్కారు మారినప్పుడల్లా ఆ ప్రాంతంలో సమీకరణలు మారిపోతున్నాయి. స్థానిక పోలీసులు ఈ నేరగాళ్ల విషయంలో తామేమీ చేయలేమని చేతులు ఎత్తేస్తూ ఎమ్మెల్యేలను కలవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు వెళ్లి ఆయా ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలను సంప్రదించి వాంటెడ్ జాబితాలను అందిస్తున్నారు. అయితే ఈ లోపే స్థానిక పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న సైబర్ నేరగాళ్లు రాజస్థాన్ సరిహద్దులు దాటి హర్యానాలోకి వెళ్లిపోతుంటారు. అప్పటి వరకు ఆగే అక్కడి రాజకీయ నాయకులు ఆ తర్వాతే పట్టుకోవడానికి సహకరిస్తామంటూ చెప్పి డ్రామా నడిపిస్తున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులైతే ఓట్బ్యాంక్ రాజకీయాల నేపథ్యంలో తమ ప్రాంతం నుంచి ఎవరినీ తీసుకువెళ్లడానికి వీలులేదని, మోసపోమే వారు ఉన్నారు కనుకే తమ వారు మోసాలు చేస్తున్నారని చెప్పి బయటి ప్రాంత పోలీసులను తిప్పిపంపుతున్నారు. దీంతో అనేక కేసుల్లో ప్రధాన సూత్రధారులకు తమ బ్యాంకు ఖాతాలు ఇచ్చి సహకరిస్తున్న దళారులను మాత్రమే పట్టుకోగలుగుతున్నారు. 60 మంది సూత్రధారులతో జాబితా... ఇలాంటి నేరాలు మెట్రో నగరాల్లో నివసిస్తున్న నైజీరియన్ల నేతృత్వంలోనూ జరుగుతున్నాయి. అయితే అత్యధిక వ్యవహారాలు భరత్పూర్కు చెందిన వారి ద్వారానే జరుగుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అక్కడి యువత వ్యవస్థీకృతంగా ఈ దందాలు చేస్తున్నట్లు తేల్చారు. మూడు కమిషనరేట్లలోనూ ఏటా వందల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అధ్యయనం చేసిన అధికారులు దాదాపు 60 మంది సూత్రధారులతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. ప్రధానంగా దక్షిణాది పైనే కన్నేస్తున్న ఈ కేటుగాళ్లపై దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అయితే ఎవరైనా భరత్పూర్ వెళ్లి వారికి పట్టుకోవాలని భావిస్తే మాత్రం తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. గ్రామాలు మూకుమ్మడిగా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నాయి. స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటే వారిపైనా ఆగ్రహావేశాలు తప్పవు. అక్కడి కమన్ అనే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు ఏడాదిలో 14 మంది ఇన్స్పెక్టర్లు మారారంటూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. దీంతో భరత్పూర్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులతో సంప్రదింపులు జరిపిన ఇక్కడి సైబర్ క్రైమ్ కాప్స్ ఈ నేరగాళ్ల వ్యవహారశైలి, కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించారు. -
అటు ఓఎల్ఎక్స్... ఇటు ఫేస్బుక్!
సాక్షి, సిటీబ్యూరో: తక్కువ ధరకు వస్తువులంటూ ఎర వేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మారుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్ ఆధారంగానే దందా చేసే వీరు తాజాగా ఫేస్బుక్ను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉన్న మార్కెట్ ప్లేస్లో బోగస్ ప్రకటనలు ఇచ్చి ఆశపడిన వారి జేబులు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇటీవలి కాలంలో పెరిగాయని, ప్రజలు వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెకండ్ హ్యాండ్తో పాటు కొన్ని రకాలైన ఫస్ట్హ్యాండ్ వస్తువులు అమ్మడానికి, కొనడానికి ఆన్లైన్పై ఆధారపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఖరీదు చేసే వారు సైతం వాటికి సంబంధించిన సమాచారం సేకరించేందుకు ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ–కామర్స్ సైట్స్తో పాటు యాప్స్ సైతం ప్రాచుర్యం పొందాయి. వీటికి తోడు ఫేస్బుక్లోనూ ప్రత్యేకంగా పేజ్లు పుట్టుకు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకున్న సైబర్ చీటర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ మార్కెట్ ప్లేస్లో ప్రకటనలు ఇస్తున్నారు. కొన్నిసార్లు తాము భద్రతా బలగాల్లో పని చేస్తున్నామని, హఠాత్తుగా బదిలీ అయిన నేపథ్యంలో ఆయా వస్తువులను తీసుకువెళ్లలేక విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో అనేక మందికి విక్రేతలపై నమ్మకం కలుగుతోంది. అలా బుట్టలో పడిన వారు ఆయా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపి సంప్రదిస్తున్నారు. బేరసారాల అనంతరం అడ్వాన్స్ చెల్లించాలంటూ సైబర్ చీటర్లు షరతు పెడుతున్నారు. అప్పటికే పూర్తిగా వారి వల్లో పడిన బాధితులు వివిధ వాలెట్స్లోకి నగదు బదిలీ చేస్తున్నారు. డబ్బు తమకు చేరిన వెంటనే సైబర్ నేరగాళ్ల నుంచి స్పందన ఉండట్లేదు. వారి ఖాతాలు, ఫోన్లు కనుమరుగు కావడం, స్విచ్ఛాఫ్లో ఉండటం జరుగుతోంది. ఇటీవల మార్కెట్ ప్లేస్ బాధితుల ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ తరహా మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఓఎల్ఎక్స్ తదితర వెబ్సైట్ల కేంద్రంగా జరుగుతున్న మోసాలు గతంలో పెరగడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా ఈ–కామర్స్ సైట్లకు లేఖలు రాశారు. దీంతో ఇలాంటి ప్రకటనలపై ఆ సైట్ల నిర్వాహకులు నిఘా పెంచారు. ఈ కారణంగానే సైబర్ నేరగాళ్ళు ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్కు తమ అడ్డా మార్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. తాము పొందుపరిచిన వస్తువులు ఖరీదు చేసేందుకు ఆసక్తి ఉన్న వారు మెసెంజర్ ద్వారా టచ్లోకి రావాలని సూచిస్తూ తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు ఇటీవల భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్ ప్లేస్ కేంద్రంగా జరుగుతున్న మోసాల పైనా ప్రచారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. -
మన సంగీత మార్కెట్లోకి మరో దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయులకు సంగీతాన్ని ఆస్వాదించే సంస్కృతి అద్భుతంగా ఉండడంతో భారతీయ పాటల ప్రపంచంలోకి మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘స్పాటిఫై’ అడుగు పెట్టింది. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ సంస్థ భారత పాటల మార్కెట్లోకి ప్రవేశించాలనే సంకల్పంతో సరిగ్గా 11 నెలల క్రితం ముంబైలో తన భారతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయంలో మూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా ఇంతకుముందు ఆన్లైన్ మార్కెట్ప్లేస్ ‘ఓఎల్ఎక్స్’కు సీఈవోగా పనిచేసిన అమర్సింగ్ బాత్రాను తీసుకున్నారు. భారతీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తిని లాంఛనంగా ప్రవేశపెడుతున్నట్లు స్పాటిఫై వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో డేనియల్ ఎక్ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ భాషల్లో నాలుగు కోట్లకుపైగా భారతీయ పాటలు తమ వద్ద ఉన్నాయని, వాటిని ఏకంగా ‘త్రీ బిలియన్ ప్లే లిస్ట్స్’తో విడుదల చేస్తున్నామని చెప్పారు. భారతీయ వినియోగదారుడి నుంచి నెలకు 119 రూపాయల చందాకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా తమ పాటలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇదే అమెరికా వినియోగదారుడి దగ్గరి నుంచి నెలకు 9.99 డాలర్లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి జనవరి చివరలోనే ‘స్పాటిఫై’ భారతీయ మార్కెట్లోకి రావల్సి ఉండింది. అమెరికాలోని ‘వార్నర్ మ్యూజిక్ గ్రూప్’కు చెందిన వార్నర్–ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ, స్పాటిఫై లెసెన్స్ ఒప్పందంపై ముంబై హైకోర్టుకు వెళ్లడంతో మార్కెట్లోకి రావడానికి ఆలస్యమైంది. హాలివుడ్ సింగర్స్ కేటి పెర్రీ, బెయాన్స్, కెండ్రిక్ లామర్, లెడ్ జెప్పెలిన్ కేటలాగ్ల విషయంలో రెండు కంపెనీల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయమై ఓ పక్క న్యాయ పోరాటం కొనసాగుతుండగానే ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో 20 కోట్ల మంది వినియోగదారులకు ‘స్పాటిఫై’ తన పాటల సర్వీస్ను అందిస్తోంది. భారత్లోని అతిపెద్ద సంగీత బ్రాండ్ లేబుల్ కలిగిన టీ సీరీస్తో ఒప్పందం కుదుర్చుకొని 1,60,000 పాటల లైబ్రరీని సమకూర్చుకుంది. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. 2017 లెక్కల ప్రకారం మొత్తం ఆసియాలో సంగీత మార్కెట్ రెవెన్యూ 38.2 శాతానికి విస్తరించగా ఒక్క భారత్లోనే 60.8 శాతానికి విస్తరించింది. భారత్లో ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం, డేటా చార్జీలు బాగా తగ్గడం కూడా సంగీత మార్కెట్ విస్తరించడానికి దోహదపడ్డాయి. 2020 నాటికి భారత సంగీత ప్రపంచంలో రెవెన్యూ 27.30 కోట్ల డాలర్లకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే అమెజాన్ కంపెనీ భారత సంగీత మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఏడాది సబ్స్క్రిప్షన్ కింద కేవలం 999 రూపాయలనే వసూలు చేస్తోంది. ఇంగ్లీషు, హిందీతోపాటు పలు భారత ప్రాంతీయ భషల్లో కొన్ని కోట్ల కాటలాగ్లను ‘అమెజాన్ మ్యూజిక్’ అందిస్తోంది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘టెన్సెంట్’ భారతీయ సంగీత మార్కెట్లోకి ‘గానా’ పేరుతో ప్రవేశించింది. ఏకంగా 7.50 కోట్ల మంది నెల ఛందాదారులతో మార్కెట్లో నెంబర్ వన్గా చెలామణి అవుతోంది. రిలయెన్స్, ఏర్టెల్, వొడావోన్ కంపెనీలు భారతీయ సంగీత మార్కెట్లోకి ఎప్పుడో అడుగుపెట్టాయి. రిలయెన్స్ కంపెనీకి చెందిన ‘జియో మ్యూజిక్’ను గతేడాది మార్చి నెలలో అంతర్జాతీయ కంపెనీ ‘సావ్న్’లో వంద కోట్ల డాలర్లకు విలీనం చేసింది. -
అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు
రసూల్పురా: హెచ్డీ కెమెరాలను అద్దెకు తీసుకుని వాటిని విక్రయించి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి రూ. 5లక్షల విలువైన 9 కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాజేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి భాగ్ అంబర్ పేట, రామిరెడ్డినగర్కు చెందిన రంజిత్కుమార్రెడ్డి బీటెక్ చదువుతూ మధ్యలోనే మానేశాడు. ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉంటున్న సోదరుడి వద్దకు వెళ్లిన అతడికి అక్కడ ఉద్యోగం లభించకపోవడంతో 2017 నవంబర్లో నగరానికి తిరిగి వచ్చాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాడి పడిన రిజింత్ ‘బెట్ 365’ యాప్ ద్వారా బెట్టింగ్కు పాల్పడి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో స్నేహితుల నుంచి కెమెరాలు, అమెరికా నుంచి సోదరుడు పంపిన ఐఫోన్లు, ల్యాప్ టాప్లను విక్రయించి జల్సాలు చేసేవాడు. దుబాయ్లో ఉంటున్న అతడి తండ్రి సాంబశివారెడ్డికి ఈ విషయం తెలియడంతో నగరానికి వచ్చిన అతను కెమెరాలు ఇచ్చిన స్నేహితులకు డబ్బులు చెల్లించి గత ఏడాది రంజిత్ను దుబాయ్ తీసుకెళ్లి ఐఈఎల్ టీఎస్లో కోచింగ్ ఇప్పించాడు. గత ఏప్రిల్లో నగరానికి వచ్చిన రంజిత్ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం మరోసారి క్రికెట్బెట్టింగ్లకు పాల్పడి ఆర్థికంగా నష్టపోయాడు. ఓఎల్ఎక్స్లో ప్రకటనలు చూసి... ఓఎల్ఎక్స్లో హెచ్డీ కెమెరాలను అద్దెకు ఇస్తున్న ప్రకటనలు చూసిన అతను సులువుగా డబ్బులు సంపా.దించేందుకు పథకం పన్నాడు. అడ్వాన్స్లు చెల్లించి పలువురి వద్ద కెమెరాలను అద్దెకు తీసుకున్నాడు. ఇదే క్రమంలో పాతబోయిన్పల్లి మల్లిఖార్డున్నగర్కు చెందిన మణికంఠ వద్ద హెచ్డి కెమెరా అద్దెకు ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వడంతో రంజిత్ తన ఆధార్కార్డు డిపాజిట్ చేసి రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించేలా గత డిసెంబర్ 20న రెండు రోజుల అద్దెకు కెమెరా తీసుకెళ్లాడు. కెమెరా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో మణికంఠ ఈనెల 23న బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రంజిత్ కోఠిలోని హిరాదాస్ మార్కెట్లో కెమెరాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేశారు. రూ. 5లక్షల విలువైన 9 హెచ్డీ కెమెరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
ఓఎల్ఎక్స్లో కారు ఎరగా చూపి మోసం
పశ్చిమగోదావరి, తణుకు: సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించడానికి వేదిగా ఉన్న ఓఎల్ఎక్స్ యాప్లో కారు విక్రయిస్తానని చెప్పి మోసం చేసి ఒక వ్యక్తి నుంచి రూ. 2.19 లక్షలు కాజేసిన సంఘటన తణుకులో చోటు చేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలోని తార్నాకకు చెందిన మరో వ్యక్తి మోసం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రాయపురం ఆంధ్రాసుగర్స్లో ఫైనాన్స్ మేనేజర్గా పని చేస్తున్న తాళ్లూరి వెంకటసత్యరాజేష్ అనే వ్యక్తి ఓఎల్ఎక్స్లో కారు చూసి కొనేందుకు బేరం మాట్లాడుకున్నారు. తార్నాకకు చెందిన అపరిచిత వ్యక్తి తాను మైనింగ్ శాఖలో గెజిటెడ్ అధికారినని పరిచడం చేసుకున్నాడు. దీంతో అతన్ని నమ్మిన రాజేష్ పలు దఫాలుగా మొత్తం రూ. 2,19,990 నగదును అతని బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. అయితే కారు గురించి అడగ్గా రిపేరుకు ఇచ్చానంటూ మాయమాటలు చెబుతూ వస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు అతన్ని ఫోన్లో నిలదీయడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు రాజేష్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రారా.. అక్కడకు రారా
ఓఎల్ఎక్స్తోపాటు ఇతర ఈ–కామర్స్ సైట్స్లో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి అందినకాడికి దండుకునే మోసగాళ్ల పంథా మారుతోంది. ఇప్పటివరకు ఆన్లైన్లో ‘అడ్వాన్స్’ తీసుకుని మోసం చేసేవారు. తాజాగా తమ మాటల వలలో పడినవారిని రాజస్థాన్తోపాటు హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రప్పించి కిడ్నాప్ చేసి దోచేస్తున్నారు. ఈ విధంగా మోసపోయిన ఓ వ్యక్తి పోలీసుల్ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. – సాక్షి, హైదరాబాద్ ఇక్కడివరకు రొటీన్ పంథానే.. ఓఎల్ఎక్స్తోపాటు మరికొన్ని సైట్స్లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్ పెడుతున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన వారే. ప్రజల్ని తేలిగ్గా మోసం చేయడానికి దేశ వ్యాప్తంగా విధులు నిర్వర్తించే, ఎప్పుడు–ఎక్కడికైనా బదిలీ అయ్యే ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించినవారి ఫొటోలతోనో, తామే ఆ వేషాలు వేసుకునో పోస్టింగ్స్ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్తోపాటు వివిధ రకాలైన కార్లకు సంబంధించిన ఆకర్షణీయమైన ఫొటోలను, వాటికి అత్యంత తక్కువ ధరలను పొందుపరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైర్ అయిన నేపథ్యంలోనో ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్లో పొందుపరుస్తున్నారు. ఇక్కడిదాకా గతంలో ఎలా వ్యవహరించారో అలానే చేస్తున్నారు. పరిచయం లేని వారితో లావాదేవీలు వద్దు కేవలం ఓఎల్ఎక్స్ యాడ్స్ విషయంలోనే కాదు ఏ విషయంలోనూ పరిచయం లేని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు వద్దు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ వివిధ ఈ–కామర్స్ సైట్స్లో ఉన్న ప్రకటనలు గుడ్డిగా నమ్మకూడదు. ప్రత్యక్షంగా వస్తువుల్ని, వ్యక్తుల్ని చూడకుండా అడ్వాన్స్లు చెల్లించవద్దు. ఎవరైనా కొత్త వ్యక్తులు వ్యాపారం తదితరాల పేర్లు చెప్పి నగదుతో తమ ప్రాంతాలకు రమ్మంటే వెళ్లకపోవడం ఉత్తమం. అనేక సందర్భాల్లో ఆయా పోలీసు విభాగాల నుంచి పూర్తి సహకారం లభించకపోవచ్చు. అన్ని వివరాలు పక్కాగా సరిచూసుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలి. – సైబర్ క్రైమ్ అధికారులు డిపాజిట్ కాకుండా నేరుగా రమ్మని.. కొత్తగా కనిపిస్తున్న వాహనాలు తక్కువ ధరకు విక్రయానికి ఉన్నాయని ఓఎల్ ఎక్స్ పోస్టు ద్వారా నమ్మినవారు ఎవరైనా సంప్రదిస్తే అసలు కథ మొదలెడుతున్నారు. ఇలా ఫోన్ ద్వారా సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్గా కొంత మొత్తం చెల్లించాలని చెప్పేవారు. దీనికోసం బోగస్ వివరాలతో తెరిచిన తమ బ్యాంకు ఖాతాలతోపాటు వివిధ వ్యాలెట్స్లోకి ఆ నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసేవారు. అడుగుపెట్టగానే అపహరించి... ఈ మాటలు నమ్మినవారు ఎవరైనా నగదుతో అక్కడకు చేరుకుంటే వెంటనే సీన్ మారి పోతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వేచి ఉండే ఆ ముఠాలు కస్టమర్లను కిడ్నాప్ చేస్తున్నాయి. అక్కడి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి నగదు, బంగారం దోపిడీ చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా వారిని ఏటీఎం కేంద్రాలకు తీసుకువెళ్లి వీలున్నంత వరకు డ్రా చేయించి స్వాహా చేసి తీవ్రంగా భయపెట్టి వదిలిపెడుతున్నారు. బాధితులు అక్కడి పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం లేకుండా ఉండేందుకు హర్యానా పరిధిలో నేరం చేస్తే వెంటనే దగ్గరలోనే ఉండే యూపీ లేదా రాజస్థాన్ పరిధిలోకి వెళ్లిపోయి కొన్నిరోజులు తలదాచుకుంటున్నాయి. ఇటీవల ఓ వ్యక్తికి తక్కువ ధరకు కారును ఆశగా చూపి హర్యానాలోకి హొటల్కు రప్పించి నిలువు దోపిడీ చేసి పంపాయి. ఆ బాధితుడి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కేసు నమోదుకు సంబంధించి న్యాయపరమైన సలహా తీసుకోవాలని నిర్ణయించారు. -
చేతులెత్తేశారు..!
సాక్షి, సిటీబ్యూరో: మేవాట్ రీజియన్లోని భరత్పూర్ జిల్లా ‘ఓఎల్ఎక్స్ సైబర్ నేరగాళ్లకు’ అడ్డాగా మారింది. వీరు ఈ–కామర్స్ సైట్స్లో కార్లను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వీరిని పట్టుకునేందుకు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చెందిన బృందం అక్కడికి వెళ్లింది. రాజస్థాన్లో ఎన్నికల హడావుడి ఉండటంతో కాస్త వేచి ఉండాలని, సహకరిస్తామని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 11న వెలువడిన ఎన్నికల ఫలితాలతో సీన్ మారిపోయింది. ప్రభుత్వం మారి కొత్త సర్కారు కొలువు తీరడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. ఆ పరిస్థితుల్లో తాము సహకరించలేమంటూ పోలీసులు చేతులు ఎత్తేయడంతో పాటు ‘రివర్స్ గేర్’ వేశారు. స్థానిక ఎమ్మెల్యే సైతం సైబర్ నేరగాళ్లు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతంపై దాడికి అంగీకరించకపోవడంతో స్పెషల్టీమ్ ఖాళీగా తిరిగి వస్తోంది. ఆర్మీ ఉద్యోగుల పేరుతో... ఓఎల్ఎక్స్తో పాటు మరికొన్ని సైట్స్లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్ పెడుతున్న ఈ భరత్పూర్ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన వారి ఫొటోలతోనే పోస్టింగ్స్ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్తో పాటు వివిధ రకాలైన కార్ల ఫొటోలను పొందుపరుస్తూ తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందున, లేదా రిటైర్ అయిన నేపథ్యంలోనే ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ అందులో పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆర్మీ దుస్తుల్లో దిగిన ఫొటోలనూ పోస్ట్ చేసి మరింత నమ్మకం పుట్టిస్తారు. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50 వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు ధరలు చూపుతున్నారు. ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సదరు నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్గా కొంత మొత్తం చెల్లించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు ఖాతాలతో పాటు వివిధ వ్యాలెట్స్లోకి ఆ నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. 30 మంది సూత్రధారులతో జాబితా... ఇలాంటి నేరాలు మెట్రో నగరాల్లో నివసిస్తున్న నైజీరియన్ల నేతృత్వంలోనూ జరుగుతున్నాయి. అయితే అత్యధిక వ్యవహారాలు భరత్పూర్కు చెందిన వారి ద్వారానే జరుగుతున్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అక్కడి యువత వ్యవస్థీకృతంగా ఈ దందాలు చేస్తున్నట్లు గుర్తించి, దాదాపు 30 మంది సూత్రధారులతో కూడిన జాబితాను సైతం సిద్ధం చేశారు. వీరిపై ఆరు నెలల్లో రాజధానిలోని మూడు కమిషనరేట్లలో పరిదిలో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా దక్షిణాది పైనే కన్నేస్తున్న ఈ కేటుగాళ్లపై దేశ వ్యాప్తంగా వేల కేసులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఎవరైనా భరత్పూర్ వెళ్లి వారిని పట్టుకోవాలని భావిస్తే తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. గ్రామస్తులు మూకుమ్మడిగా పోలీసులపై దాడులకు దిగుతున్నారు. దీంతో భరత్పూర్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులతో సంప్రదింపులు జరిపిన సిటీ సైబర్ క్రైమ్ కాప్స్ ఈ నేరగాళ్ల వ్యవహారశైలి, కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా వరుసదాడులు చేసి, నేరగాళ్లను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఫలితాలతో మారిపోయిన సీన్... క్షేత్రస్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడంతో అనుభవం ఉన్న సైబర్, సీసీఎస్ అధికారులను ఎంపిక చేసి 20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులపైనా ఎదుర్కునేందుకు వీరికి ఆయుధాలు సైతం అందించారు. ఈ స్పెషల్ టీమ్ ఎన్నికల వేడి నడుస్తుండగానే అక్కడికి వెళ్లింది. స్థానిక పోలీసులను కలిసి తమ వద్ద ఉన్న సమాచారం చెప్పి సహకరించాల్సిందిగా కోరగా, వారు కొన్నాళ్లు వేచి ఉండాలని సూచించారు. ఈ లోపే రాజస్థాన్లో ప్రభుత్వం మారి కొత్త సర్కారు కొలువు దీరింది. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో ఈకేషన్స్ మారాయని, తామేమీ చేయలేమని వారు చేతులు ఎత్తేస్తూ ఓ ఎమ్మెల్యేను కలవాల్సిందిగా సూచించారు. స్పెషల్ టీమ్ ఆ ఎమ్మెల్యేను సంప్రదించి వాంటెడ్ జాబితాను అందించింది. ఈ లోగా స్థానిక పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న నేరగాళ్లు రాజస్థాన్ సరిహద్దులు దాటి హర్యానాలోకి వెళ్లిపోయారు. సదరు వ్యక్తులు ఎవరూ అక్కడ అందుబాటులో లేరని, ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళ్లి దాడులు చేయడానికి తాము ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రధాన సూత్రధారులకు తమ బ్యాంకు ఖాతాలు ఇచ్చి సహకరిస్తున్న ఇద్దరు పాత్రధారులను పట్టుకుని తిరుగు ప్రయాణమైంది. -
ఓఎల్ఎక్స్ ప్రీ–ఓన్డ్ కార్ స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్ప్లేస్ కంపెనీ ఓఎల్ఎక్స్... ప్రీఓన్డ్ కార్ల అమ్మకాల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం బెర్లిన్కు చెందిన యూజ్డ్ కార్ గ్రూప్ ఫ్రాంటియర్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు పలు నగరాల్లో ‘ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్’ పేరిట స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఓఎల్ఎక్స్ యూజర్లు ఆన్లైన్తో పాటూ ఆయా స్టోర్లలో ప్రీ ఓన్డ్ కార్లను విక్రయించే వీలుంటుంది. ప్రస్తుతం దేశంలోని 10 నగరాల్లో 27 స్టోర్లున్నాయని.. 2021 నాటికి 40 నగరాల్లో 150 స్టోర్లను ప్రారంభిస్తామని ఓఎల్ఎక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ కుమార్ తెలిపారు. -
'భరతం' పడతాం!
ఆన్లైన్లో వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా... అయితే, జర జాగ్రత్త! ఘరానా మోసగాళ్ల వలలో చిక్కు కుని జేబులు గుల్ల చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఆన్లైన్లో ఎర వేస్తారు. అందినకాడికి దండు కుంటారు. ఆ తర్వాత వారి పత్తా ఉండదు. వారి ఫోన్లు మూగనోముపడతాయి. వారేమో ముఖం చాటేస్తారు. వారే భరత్పూర్ కేటుగాళ్లు. రాజ స్తాన్లోని భరత్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల యువకులు ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు అధికారుల పేరిట ఫోన్లు చేసి, వినియోగదారుల వ్యక్తిగత సమా చారం, ఓటీపీ సేకరించి ఖాతాలోని సొమ్మును కాజేసే మోసగాళ్లకు జమ్తార అడ్డా అయితే... ఓఎల్ఎక్స్తోపాటు ఇతర ఈ–కామర్స్ సైట్లలో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామంటూ పోస్టింగ్లు పెట్టి, అడ్వాన్స్గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని కాజేస్తున్న కేటుగాళ్లకు భరత్ఫూర్ కేరాఫ్ అడ్రస్. వీరి భరతం పట్టేందుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ వ్యూహాన్ని రచించారు. – సాక్షి, హైదరాబాద్ ఎర ఎలా? - ఓఎల్ఎక్స్తోపాటు మరికొన్ని వెబ్సైట్లలో ఖాతాలు తెరుస్తారు.. - ఈ ఖాతాలకు ఆర్మీ ఉద్యోగుల పేర్లను వాడుకుంటారు. - వివిధ మార్గాల్లో సేకరించిన ఆర్మీ ఉద్యోగుల ఫొటోలతో పోస్టింగ్లు పెడతారు. - కొన్నిసార్లు ఆర్మీ అధికారుల వేషాలతో పోస్ట్ చేస్తుంటారు. - బుల్లెట్తోపాటు వివిధ రకాల కార్లను వాటిల్లో పొందుపరుస్తారు. - బదిలీ అయిందని, పదవీ విరమణ అయిన నేపథ్యంలో వాహనాలను అమ్మి వెళ్లిపోతున్నామంటూ నమ్మబలుకుతారు. - ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50 వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు రేట్లు పెడతారు. - ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. - విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఉందని నమ్మిస్తారు. - ఎవరైనా ఆసక్తితో వారిచ్చిన నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్గా కొంతమొత్తం చెల్లించాలంటారు. - తమ బ్యాంకు ఖాతాలతోపాటు వివిధ వ్యాలెట్లలోకి నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారు. ఆరు నెలల్లో 500 కేసులు... మెట్రో నగరాల్లో నివసిస్తున్న నైజీరియన్ల నేతృత్వంలోనూ సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యధికంగా భరత్పూర్కు చెంది నవారి ద్వారానే జరుగుతున్నట్లు సిటీ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. కనీసం ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని ఈ కేటుగాళ్లు నేరాలలో పీహెచ్డీ చేసినట్లుగా రాటుదేలారు. వీరి నేరాలకు స్థానికుల మద్దతు కూడా ఉంటోందని భావి స్తున్నారు. ఈ భరత్పూర్ ముఠాలపై ఆరునెలల్లో రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా దక్షిణాదిపైనే కన్నేస్తున్న వీరిపై దేశవ్యాప్తంగా వేల కేసులు ఉంటాయని భావిస్తున్నారు. ఎవరైనా భరత్పూర్ వెళ్లి వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే విచక్షణారహితంగా పోలీసులపై ఎదురుదాడులకు పాల్పడుతున్నారు. సైబర్ పోలీసుల భారీ వ్యూహం.. భరత్పూర్ మోసగాళ్లను పట్టుకునేందుకు వివిధ ప్రాంతాల పోలీసులతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేరగాళ్ల వ్యవహారశైలి, కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా వరుసదాడులు చేసి, నేరగాళ్లను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 20 మంది సైబర్, సీసీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికిగాను వీరికి ఆయుధాలు సైతం అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్ల నుంచి తుపాకులు తీసుకువచ్చారు. ఈ బృందం మరో రెండు రోజుల్లో భరత్పూర్కు వెళ్లనుంది. అక్కడి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేసి ఈ ముఠాను పట్టుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ముఠాకు చెందిన కీలక వ్యక్తుల వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. -
మహాముదురు ఈ మైనరు
సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్, క్వికర్లో వంటి సైట్స్ను ఆధారంగా చేసుకుని తక్కువ ధరకు వస్తువులంటూ ఎర వేసి, అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లను ఇప్పటి వరకు చూశాం. అయితే నగరానికి చెందిన ఈ మైనర్ మాత్రం మహా ముదురులా వ్యవహరించాడు. ఇన్స్ట్రాగామ్ కేంద్రంగా మోసాలకు తెరలేపాడు. తక్కువ మొత్తాలే టార్గెట్గా చేసుకుని దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.3 లక్షలు కాజేశాడు. ఇద్దరు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జువైనల్ హామ్కు తరలించారు. ఇతను జనాల నుంచి సొమ్మును తన తండ్రి పే–టీఎం ఖాతాలోకి డిపాజిట్ చేయించి స్వాహా చేయడం కొసమెరుపు. ఓ దశలో దీనిపై ఆ తండ్రి ప్రశ్నించగా... ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతానంటా బెదిరించాడని తెలిసింది. నష్టపోయి అదే బాట పట్టి... నగరానికి చెందిన మైనర్ (16 ఏళ్లు) ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ వెబ్సైట్లో తక్కువ ధరకు వస్తువుల విక్రయం ప్రకటన చూసిన అతను వారిని సంప్రదించాడు. బేరసారాల అనంతరం వారు చెప్పిన ఖాతాలో నగదు డిపాజిట్ చేసినా వస్తువు డెలివరీ కాలేదు. మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు. దీంతో మోసపోయానని భావించిన అతగాడు అదే పని ప్రారంభించాడు. నెట్లో సెర్చ్ చేయడం ద్వారా రోటీన్కు భిన్నంగా ఇన్స్ట్రాగామ్ను ఎంచుకున్నాడు. అందులో ‘మిలియనీర్స్ ట్రెండ్’ పేరుతో అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, వస్త్రాల వివరాలు పొందుపరిచాడు. వీటిని అతి తక్కువ ధరకు విక్రయిస్తానంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీనిని చూసి ఆకర్షితులైన వారితో కేవలం వాట్సాప్ చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. బేరసారాల అనంతరం వస్తువు రేటు ఖరారు చేసే వాడు. తండ్రి పే–టీఎం ఖాతాతో... ఖరారైన రేటుకు వస్తువులు ఖరీదు చేయాలని భావించే వారికి తన తండ్రి పే–టీఎం ఖాతాకు సంబం«ధించిన క్యూఆర్ కోడ్ వాట్సాప్ ద్వారా పంపేవాడు. దానిని స్కాన్ చేసుకుని ఆ మొత్తాన్ని అందులో డిపాజిట్ చేయమని సూచించాడు. అతడి తండ్రి రామ్కోఠిలోని ఓ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కోసం దుకాణ యజమాని ఈ పే–టీఎం ఖాతా తెరిచి ఇచ్చాడు. తన ఖాతాలో నగదు బదిలీ కావటం, కుమారుడు ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసుకోవడాన్ని గుర్తించిన ఆయన అదేమని కుమారుడిని నిలదీయగా... ఎదురు తిరగడంతో పాటు మరోసారి అడిగితే ఎలాంటి సమాచారం లేకుండా ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించాడు. దీంతో అతను ‘చేయరానిది చేస్తే కుటుంబం పరువు పోతుంది’ అంటూ నచ్చజెప్పినా అతడిలో మార్పు రాలేదు. చిన్న మొత్తాలనే స్వాహా చేస్తూ... ఇన్స్ట్రాగామ్ ప్రకటనల పట్ల ఆకర్షితులైన వారి నుంచి నగదు కాజేయడంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కువ మొత్తాలు కాజేస్తే వారు సీరియస్గా తీసుకుని కేసుల వరకు వెళ్తారని భావించిన అతను ఒక్కొక్కరి నుంచి కనిష్టంగా రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు మాత్రమే స్వాహా చేయడం మొదలెట్టాడు. ఈ పంథాలో దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.3 లక్షల వరకు కాజేశాడు. వారిలో ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లలేదు. అయితే సిటీకి చెందిన ఇద్దరు రూ.8,500, రూ.7 వేల చొప్పున కోల్పోయారు. వీరు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. చివరకు ఈ మైనరే బాధ్యుడని గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జువైనల్ హోమ్కు తరలించారు. -
అద్దెకు ఇస్తే అమ్మేశాడు
బంజారాహిల్స్: బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఓఎల్ఎక్స్లో కారును అమ్మకానికి పెట్టి మోసగించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్బీటీ నగర్కు చెందిన నుకుం శ్రీలత అనే మహిళ ఓఎల్ఎక్స్లో హుందాయ్ ఐ–20(టీఎస్ 08 ఎఫ్టి 6402) కారు అమ్మకానికి ఉన్నట్లు తెలుసుకుని అందులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా జూలై 20న కేపీహెచ్బీకి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణను సంప్రదించింది. తన అన్న సురేష్జాదవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని అతడికి చెందిన కారును విక్రయిస్తున్నట్లు అతను పత్రాలు చూపడంతో అతడి మాటలు నమ్మిన శ్రీలత రూ. 4.75 లక్షలకు కారును కొనుగోలు చేసింది. అయితే సదరు కారుపై బేగంపేట ఎస్.బ్యాంకులో లోన్ ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి విచారిచగా సదరు సురేష్ జాదవ్ బతికే ఉన్నట్లు బ్యాంకు అధికారి తెలిపాడు. దీంతో సురేష్ జాదవ్కు ఫోన్ చేయగా కారును బాల వంశీకృష్ణ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్లు తెలిపాడు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రీకరించి ఓఎల్ఎక్స్లో అద్దెకు తీసుకున్న కారును విక్రయానికి పెట్టి తమను మోసం చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓఎల్ఎక్స్లో ప్రకటన..ఆగ్రాకు పిలిచి దోపిడీ..
సాక్షి, సిటీబ్యూరో: ఇద్దరు నగరవాసులు... ఒకరు బెంగళూరులో నమోదైన కేసులో నిందితుడిగా, మరొకరు ఆగ్రాలో జరిగిన నేరంలో బాధితుడిగా మారారు... మొదటి కేసులో ఓ వ్యాపారి యానిమేషన్ కంపెనీని మోసం చేశారన్నది ఆరోపణ... రెండో దాని విషయానికి వస్తే ఓఎల్ఎక్స్లో చూసి కారు ఖరీదు చేయడానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. గత వారం చోటు చేసుకున్న ఈ రెండు ఉదంతాలకు సంబంధించి ప్రాథమిక సమాచారం అందడంతో సిటీ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. సిటీలో ఏమైనా నేరాలతో సంబంధం ఉందా? అనే కోణంలో కూపీ లాగుతున్నారు. విదేశీ ఆర్డర్ల పేరుతో టోకరా... బెంళగూరుకు చెందిన ఆర్.రంజిత్ వార్థూర్ ప్రాంతంలో సాట్చా ఎంటర్టైన్మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇది ఆర్డర్పై దేశవిదేశాల్లోని కంపెనీలకు వివిధ రకాలైన యానిమేషన్ వర్క్ చేసి అందిస్తుంటుంది. రంజిత్కు గతేడాది నగరానికి చెందిన వ్యాపారి అనురాగ్తో పరిచయమైంది. హైదరాబాద్లో కంపెనీ నిర్వహించే తనకు నెదర్లాండ్స్లోని వివిధ కంపెనీలతో సంబంధాలున్నాయంటూ ప్రచారం చేసుకున్నాడు. కొన్ని రోజులకు ఓ కంపెనీ నుంచి రూ.2 కోట్ల యానిమేషన్ వర్క్ ఆర్డర్ ఉందని చెప్పిన అతను ఈ ఆర్డర్ చేయడానికి తాను నెదర్లాండ్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఎర వేశాడు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని, వచ్చే లాభంలో చెరి సగం తీసుకుందామని చెప్పాడు. ఇందుకు రంజిత్ అంగీకరించడంతో గతేడాది ఆగస్టు 30న ఇరువురూ ఒప్పందపత్రాలు రాసుకున్నారు. అనురాగ్ రంజిత్ నుంచి అడ్వాన్స్గా రూ.20 లక్షలు తీసుకుని ప్రాజెక్టు అప్పగించాడు. ఈ వర్క్ పది శాతం వరకు పూర్తి చేసిన తర్వాత రంజిత్కు అనుమానం రావడంతో నేరుగా నెదర్లాండ్స్ కంపెనీని సంప్రదించగా తాము అనురాగ్కు చెందిన కంపెనీకి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదని తెలిపారు. లోతుగా ఆరా తీయగా బోగస్ ప్రాజెక్ట్ వర్క్ అప్పగించి తమను అనురాగ్ మోసం చేసినట్లు గుర్తించిన అతను వార్థుర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనురాగ్పై కేసు నమోదైంది. విచారణ నిమిత్తం అనురాగ్కు నోటీసులు జారీ చేయడానికి అక్కడి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. కారంటూ ఆగ్రాకు రప్పించి దోపిడీ... నగరానికి చెందిన ప్రదీప్కుమార్ అనే యువకుడు ఆగ్రాకు చెందిన ముఠా చేతిలో దారుణంగా మోసపోయాడు. ఎస్యూవీ కారును తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన ముఠా బాధితుడిని అక్కడకు రప్పించుకుని అతడి వద్ద ఉన్న రూ.3.2 లక్షలతో పాటు ఐఫోన్ దోచుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న వరిందవాన్ పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్లోని ప్రకటనలు చూస్తున్న ప్రదీప్ను ఎస్యూవీకి సంబంధించిన యాడ్ ఆకట్టుకుంది. ఆ వాహనాన్ని కేవలం రూ.3.7 లక్షలకే అమ్ముతామంటూ వరిందవాన్కు చెందిన షమ్మీ ఎర వేశాడు. ఇది హైదరాబాద్ మార్కెట్లో రూ.4.8 లక్షలు పలుకుతుండటంతో ఆకర్శితుడైన ప్రదీప్ షమ్మీని సంప్రదించాడు. కారు విక్రయించడానికి అంగీకరించిన షమ్మీ ఆగ్రా రావాలంటూ సూచించాడు.వస్తూ తన కోసం ఓ ఐఫోన్ తీసుకురావాలని, దాని విలువ మినహాయించుకుని మిగతా మొత్తం చెల్లించి ఎస్యూవీ తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో రూ.50 వేల ఐఫోన్, రూ.3.2 లక్షల నగదుతో ప్రదీప్ అక్కడకు చేరుకున్నాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇతడిని రిసీవ్ చేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఆగ్రా తీసుకువెళ్లారు. వాహనాన్ని చూపించడంతో పాటు సైట్ సీయింగ్ పేరు చెప్పి అక్కడి వరిందవాన్లో ఉన్న చిన్న అడవిలోకి తీసుకువెళ్లారు. ప్రదీప్ వద్ద ఉన్న ఐఫోన్తో పాటు రూ.3.2 లక్షలు దోచుకుని, తుపాకీతో బెదిరించి తరిమేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వరిందర్వాన్ పోలీసులు గత వారం ముఠా సభ్యుడైన ముకీమ్ను పట్టుకున్నారు. అతడి నుంచి ఎస్యూవీ వాహనం,తుపాకీతో పాటు రూ.20 వేల నగదు స్వాధీనంచేసుకున్నారు. పరారీలో ఉన్న షమ్మీసహా మరో ముఠా సభ్యుడి కోసం గాలిస్తున్నారు. -
డూప్లికేట్ కెమెరా విక్రయించాడని..
ముషీరాబాద్/చిక్కడపల్లి : ఓఎల్ఎక్స్లో డూప్లికేట్ కెమెరా విక్రయించాడనే కోపంతో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్ జెమిని కాలనీకి చెందిన ఆకాష్సింగ్ నెల రోజుల క్రితం ఓఎల్ఎక్స్లో తన కెమెరాను విక్రయానికి పెట్టగా, కిషన్బాగ్కు చెందిన కరన్వీర్సింగ్ రూ.15వేలకు కొనుగోలు చేశాడు. దానిని రిపేర్షాపులో చూపించగా డూప్లికేట్ అని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన కరణ్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గురువారం చిక్కడపల్లిలోని ఓ కెమెరా రిపేర్ దుకాణం వద్దకు రావాలని ఆకాశ్సింగ్ చెప్పడంతో కరన్వీర్సింగ్ అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన అక్కడే ఉన్న పేపర్లు కట్ చేసే బ్లేడ్తో ఆకాశ్సింగ్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుమలగిరిలోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసిపి ప్రదీప్కుమార్రెడ్డి నేతృత్వంలో చిక్కడపల్లి డిఐ రాకేష్, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో
ఇంట్లో ఎవరైనా ఒక్కరోజు కనిపించకపోతేనే కుటుంబం, బంధుమిత్రులు కంగారు పడతారు. అలాంటిది వారం, రెండు వారాలు కాదు ఏకంగా రెండు నెలల నుంచి కన్నకొడుకు కనిపించక ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఏ ఫోన్ వచ్చినా తమ కొడుకుదేమోనని ఆశ మిణుకుమంటోంది. పోలీసుల చుట్టు తిరుగుతున్నా ఏం చెప్పలేకపోతున్నారు. రోదసిని అందుకునే టెక్నాలజీ ఉందని చెబుతారు, కానీ నగర శివార్లలో జరిగిన ఘటనను ఛేదించలేకపోతున్నారు. సాక్షి, బెంగళూరు: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అజితాబ్ కుమార్ సిన్హా అదృశ్యమై రెండు నెలలు ముగిసింది. అయినా ఇప్పటివరకు పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన తన కారును అమ్మేందుకు గత ఏడాది డిసెంబర్ 18న బయటకు వెళ్లిన అజితాబ్.. అప్పటినుంచి ఏమయ్యాడో తెలియదు. వైట్ఫీల్డ్లో స్నేహితునితో నివాసం ఉంటున్న అజితాబ్ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలలో ఇంజినీరు. తన మారుతి సియాజ్ కారును ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడు. ఒక ఆగంతకుడు అజితాబ్ను ఫోన్ చేసి కారును కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. దీంతో డిసెంబర్ 18న కారును తీసుకుని అజితాబ్, కొనుగోలుదారుడిని కలిసేందుకు వెళ్లాడు. అయితే ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్. వైట్ఫీల్డ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు తీవ్రంగా గాలించారు. దీనికితోడు ఉన్నతాధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడిలో ఎంత వెతికినా అజితాబ్ ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో అజితాబ్ తండ్రి అశోక్సిన్హా హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ చేయించాలని కోరారు. ధర్మాసనం కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరిపించాలని నగర పోలీసు కమిషనర్ను ఆదేశించింది. సిట్ కూడా ఏం సాధించలేకపోయింది. ఆ సిమ్ కోలారులో కొన్నారు పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. కొన్ని వేల కాల్స్ను పరిశీలించినా క్లూ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. మిస్సయిన అజితాబ్ ఫోన్ను ఇప్పటివరకు తిరిగి ఆన్ చేయలేదు. కొనుగోలుదారుని నంబర్ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అది కోలారు నగరానికి చెందిన బీడీ కార్మికురాలు సబీనాకు చెందినదని గుర్తించారు. ఆమెను విచారిస్తే ఆ సిమ్ నిందితుని దగ్గరకు ఎలా వెళ్లిందో తనకు తెలియదని చెప్పింది. ఆ సిమ్ను వాడడం ఆపేసి అప్పటికే వారం రోజులు పైగా అయిందని తెలిపింది. కోలారు నగరంలోని ఆనంద్ అనే వ్యక్తి షాపులో నిందితుడు సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు తెలిసింది. సబీనా ఫోటో, పత్రాలతో ఆమె పేరు మీద గుర్తు తెలియని వ్యక్తికి సిమ్ తీసుకున్నాడు. ఆ షాపులోని సీసీటీవీ ఫుటేజీ కూడా దొరక్కపోవడం గమనార్హం. షాపు యజమాని ప్రతి 30 రోజులకొకసారి సీసీటీవీ దృశ్యాలను తొలగిస్తాడని తెలుసుకున్న నిందితుడు తెలివిగా సిమ్ కొన్న 30 రోజుల తర్వాత అజితాబ్తో వ్యవహారం నడిపాడు. కారు కూడా ఆచూకీ లేదు కిడ్నాప్ గురైన తర్వాత అజితాబ్ కుటుంబం, స్నేహితులకు ఏవైనా హెచ్చరిక ఫోన్లు కాల్స్ వచ్చాయేమోనని పోలీసులు విచారించారు. అయితే ఎలాంటి కాల్స్ రాలేదని నిర్ధారించుకున్నారు. అజితాబ్కు కూడా ఎవరితోనూ వ్యక్తిగత విభేధాలు లేవని గుర్తించారు. విచిత్రం ఏమిటంటే అజితాబ్ అదృశ్యమైనప్పటి నుంచి అతని కారు కూడా కనిపించలేదు. అన్ని టోల్ప్లాజా సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. కానీ ఎలాంటి ఫలితం లభించలేదు. తమిళనాడుకు వెళ్లే 15 మార్గాల్లో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవని, నిందితుడు ఆ మార్గాల్లో ఏదో ఒకదానిలో వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘బొమ్మ’ చూసి ‘సొమ్ము’ ఇస్తే అంతే
సాక్షి,బెంగళూరు: నగరంలో కొత్త తరహా మోసాలకు తెరలేసింది. ఇప్పటి వరకూ వేల కోట్ల రూపాయల విలువచేసే లాటరీ తగిలింది పన్నులు చెల్లిస్తే ఆ మొత్తం మీ అకౌంట్లోకి వేస్తామంటూ అక్రమాలకు పాల్పడిన ఘటనలే చూశాము. తాజాగా ఎయిర్ పోర్టులో పార్కింగ్ చేసిన కారు తక్కువ ధరకు దొరుకుతుందని చెబుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న దుండగులు బెంగళూరులో ఎక్కువవుతున్నారు. సదరు గ్యాంగ్లో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి కేసులు గత వారం రోజుల్లో నగరంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో మూడు చోటు చేసుకోవడం గమనార్హం. (పోలీసులు, బాధితుల కోరిక మేరకు పేర్లు మార్చబడ్డాయి.) ఓఎల్ఎక్స్లో మారుతీ స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని రూ.3.8 లక్షలకు అమ్ముతామని యాడ్ పెట్టారు. విషయం గమనించిన హెచ్ఎస్ఆర్ లేఔట్కు చెందిన వినోద్ అందులో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేశారు. వాహనం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉందని మరిన్ని వివరాల కోసం సవితా అనే మహిళలకు కాల్ చేయాలని ఫోన్నంబర్ ఇచ్చాడు. ఆమెతో మాట్లాడిన తర్వాత పార్కింగ్ ఫీ చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతానికి వాహనాన్ని చూపించడానికి కాదన్నారు. పార్కింగ్ ఫీజును చెల్లిస్తే వాహనాన్ని అందజేస్తామని సదరు మొత్తాన్ని ఫైనల్ సెటిల్మెంట్లో తగ్గించుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని నమ్మిన వినోద్ మొతట వారు చెప్పినట్లు బసవరాజ్ అనే అకౌంట్కు మొదట రూ.1.8 లక్షలు అటుపై రూ.49 వేలను ఆన్లైన్ ద్వారా వారు చెప్పిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. తదుపరి రోజు ఫోన్ చేస్తే వారి ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. తాను మోసపోయినట్లు గుర్తించిన వినోద్ హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఫిర్యాదు చేశారు. అన్నసంద్రపాళ్యకు చెందిన మరో ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగి అయిన కూడా ఓఎల్ఎక్స్లోని యాడ్ను చూసి మారుతీ బ్రీజా వాహనం కోసం రూ.4.88 లక్షలను నేరుగా ఇద్దరు వ్యక్తులకు ఇచ్చానని అయితే వారు సొమ్ము తీసుకున్న తర్వాత వాహనం ఇవ్వలేదని అంతే కాకుండా గత నాలుగురోజులుగా వారి ఫోన్లు స్విచ్ఆఫ్ అయినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. నగరంలోని ఇందిరా నగర్లో నివసించే వినీత్ అనే వ్యక్తి కూడా ఓఎల్ఎక్స్లో హుండాయ్ ఐ 20 అమ్ముతామనే యాడ్ను చూసి రూ.96,500 పోగొట్టుకున్నాడు. ఈ సొత్తును మూడు విడుతలగా ఈనెల 15 నుంచి 22 లోపు ఫ్లోరా సేనా, అనితా అనే ఇద్దరు మహిళల అకౌంట్కు వేశారు. మొదటి రోజు ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో వాహనం ఉందని చెప్పిన వారు గత రెండు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నారని బాదితుడు వాపోతున్నారు. ఈ మూడు కేసులు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం సైబర్ పోలీస్స్టేషన్కు బదిలీ కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటువంటి సెకెండ్ హ్యాండ్ వస్తువులను ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ నుంచి కొనేవారు అప్రమత్తంగా ఉండాలని నగర జాయింట్ కమిషనర్ సతీష్కుమార్ తెలిపారు. -
కారు ఓఎల్ఎక్స్లో.. టెకీ అదృశ్యం!
బెంగళూరు: ఓఎల్ఎక్స్ వెబ్సైట్ ద్వారా కారు అమ్మేందుకు యత్నించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్నాకు చెందిన కుమార్ అజితబ్(30) బెంగళూరులోని ఓ బ్రిటీష్ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నారు. ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన కారును చూసిన ఓ వ్యక్తి డిసెంబర్ 18న కుమార్కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సాయంత్రం 6.30 గంటల సమయంలో కుమార్ కారులో బయటకు వెళ్లాడన్నారు. చాలాసేపయినా కుమార్ జాడలేకపోవడంతో అతని స్నేహితులు కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తేలిందన్నారు. దీంతో కంగారుపడ్డ వారు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారన్నారు. కుమార్ అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతని ఫోన్ లొకేషన్ చివరిసారి ఇక్కడి వైట్ఫీల్డ్లోని గున్జుర్లో ఉన్నట్లు చూపించిందన్నారు. -
ఓఎల్ఎక్స్లో ప్రకటనే పెట్టుబడి!
సాక్షి, సిటీబ్యూరో: తేలికపాటి వాహనాలను విక్రయిస్తానంటూ ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్లో తప్పుడు ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న రాజమహేంద్రవరం వాసిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మందిని మోసం చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎం.వినోద్ కొన్నాళ్ల క్రితం ఓఎల్ఎక్స్లో ఓ నకిలీ ప్రకటన పెట్టాడు. వివిధ రకాల తేలికపాటి వాహనాలకు తక్కువ రేటుకు అమ్ముతానంటూ అందులో పొందుపరిచాడు. ఆసక్తి చూపి ఎవరైనా సంప్రదిస్తే బేరసారాల తర్వాత ఓ రేటు ఖరారు చేసేవాడు. ఆపై అడ్వాన్స్గా కొంత మొత్తం తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకుని మోసం చేసేవాడు. నగరంలోని ఫిల్మ్నగర్ ప్రాంతానికి చెందిన జ్యోతి ప్రకాష్ ఇటీవల సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఓఎల్ఎక్స్ను ఆశ్రయించారు. అందులో 2014 మోడల్కు చెందిన మారుతి స్విఫ్ట్ కారును రూ.3.6 లక్షలకు విక్రయిస్తానంటూ ఉన్న ప్రకటన ప్రకాష్ను ఆకర్షించింది. అందులో పేర్కొన్న ఫోన్ నంబర్ను సంప్రదించగా.. సూరిబాబు పేరుతో వినోద్ మాట్లాడాడు. బేరసారాల తర్వాత రూ.3 లక్షలకు కారు అమ్మేందుకు అంగీకరించాడు. అడ్వాన్స్గా రూ.60 వేలు చెల్లించాలని, కారు డెలివరీ అయిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని చెప్పాడు. దీనికి అంగీరించిన ప్రకాష్ ఆ మొత్తాన్ని వినోద్ చెప్పిన బ్యాంకు ఖాతాలో రెండు దఫాల్లో డిపాజిట్ చేశారు. ఈ ఖాతాలు సీహెచ్ శ్రావణి పేరుతో ఉన్నాయి. అడ్వాన్స్ డబ్బు చెల్లించిన తర్వాత వాహనం డెలివరీ విషయానికి సంబంధించి ప్రకాష్ అనేకసార్లు సూరిబాబుగా చెప్పుకొన్న వినోద్తో సంప్రదించే ప్రయత్నం చేశారు. వినోద్ అతడి కాల్స్ను నిర్లక్ష్యం చేయడంతో పాటు తన ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు.. ఈ నెల 2న సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ జి.శంకర్రాజు నేతృత్వంలో ఎస్సైలు రమేష్, మధుసూదన్ దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి రాజమహేంద్రవరానికి చెందిన వినోద్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో వినోద్పై తెలుగు రాష్ట్రాల్లోని ధవళేశ్వరం, ఏలూరు, పడమటిలంక, ఆలేరు ఠాణాల్లోనూ ఇదే తరహా మోసాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు గుర్తించారు. తరచు సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు మార్చే అలవాటున్న ఇతగాడు ఇంకా అనేక మందికి మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. -
‘అమెజాన్’ను ఆటాడించారు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అమెజాన్కు ఆర్డర్ ఇచ్చిన వస్తువులు చేతికందినా ఖాళీ బాక్స్లు, తెల్లపేపర్ వచ్చిందంటూ కస్టమర్ సర్వీస్ సెంటర్కు ఈ–మెయిల్ ఫిర్యాదు చేసి కొత్త ప్రొడక్ట్ తీసుకోవడమేగాక వీటిని ఓలెక్స్లో తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వచ్చిన వస్తువు ధ్వంసమైందంటూ డబ్బులు రీఫండ్ చేయించుకుంటున్నారు. ఇలా అమెజాన్కు దాదాపు రూ.12 లక్షలకుపైగా నష్టం కలిగించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిల కథనం ప్రకారం...సికింద్రాబాద్ సైనిక్పురికి చెందిన సిమ్సన్ గుణశేఖర్, జాన్ అరుల్ ప్రకాశ్ చిన్ననాటి స్నేహితులు. 2014 లో గుణశేఖర్ అమెజాన్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా చేరాడు. వస్తువులు రాలేదు, ధ్వంసమయ్యాయి, వస్తువుల స్థానంలో రాళ్లు, సబ్బులు వచ్చాయంటూ పంపిన మెయిల్స్ను చూసి డబ్బు తిరిగి చెల్లించడం, వస్తువులు తిరిగి పంపించడం చేసేవాడు. మోసపూరితంగా సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మంచి మార్గమని భావించిన గుణశేఖర్ అదే కంపెనీలో పనిచేస్తున్న జాన్ అరుల్ ప్రకాశ్కు పథకాన్ని వివరించాడు. దీంతో 2016 అక్టోబర్లో జాన్ అరుల్ జాన్ క్రిస్గా అమెజాన్.ఇన్లో నకిలీ యూజర్ ఐడీ సృష్టించి యాపిల్ ఐఫోన్ 5ఎస్కు ఆర్డర్ ఇచ్చాడు. ఆ ప్రొడక్ట్ చేతికి అందిన తర్వాత పథకం ప్రకారం ‘ప్రొడక్ట్ మా చేతికి అందలేదు. దీంతో డబ్బులు తిరిగి చెల్లించాలం’టూ రిజిస్టర్ మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయడంతో అతడిచ్చిన బ్యాంక్ ఖాతాకు తిరిగి డబ్బులు చెల్లించారు. 2017 మేలో మరో కస్టమర్ అకౌంట్తో జాన్ అరుల్ లెనోవా ల్యాప్టాప్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ వస్తువు రాలేదంటూ తిరిగి పంపించాలంటూ మళ్లీ మెయిల్ పెట్టడంతో రెండోసారి కూడా ల్యాప్టాప్ చేతికి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న గుణేశేఖర్ తన సోదరుడి పేరుతో యూజర్ ఐడీ క్రియేట్ చేసి శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ సెల్ఫోన్ చేతికందినా, దానిస్థానంలో తెల్ల పేపర్ వచ్చిదంటూ మళ్లీ సెల్ఫోన్ పంపాలంటూ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసి అందుకున్నాడు. ఇలా గుణశేఖర్ ఐదు అర్డర్లు ఇచ్చి మూడు రీప్లేస్మెంట్, ఒక రీఫండ్ అమౌంట్, జాన్ అరుల్ పది ఆర్డర్లు ఇచ్చి ఎనిమిది రీప్లేస్మెంట్లు, ఒక రీఫండ్ అమౌంట్ పొందారు. ఈ ప్రొడక్ట్లను ఓలెక్స్ వెబ్సైట్లో 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ దర్యాప్తులో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. -
కొనొచ్చు.. అమ్మేయొచ్చు..
ఫేస్బుక్ అంటే.. ఏదైనా మనకు నంచిన పోస్టును, వీడియోలను పెట్టడం లేదా షేర్ చేయడం, దానికి ఎన్ని లైక్స్ వస్తున్నాయో, ఎన్ని షేర్లు వస్తున్నాయో చూసుకుని మురిసిపోవడం. ఇలాంటి వాటికే కాకుండా ఫేస్బుక్ కూడా తన నెట్వర్క్ పరిధిని మరింత విస్తరిస్తోంది. తాజాగా ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఓలెక్స్ తరహాలో వినియోగించిన వస్తువులను కొనడానికి, అమ్మడానికి అవకాశం కల్పిస్తోంది. 'మార్కెట్ప్లేస్' పేరుతో ఫేస్బుక్ ప్లాట్ఫామ్పై ఈ ఫీచర్ ట్రయల్ను ముంబైలో చేపట్టింది. ఒకవేళ అక్కడ ఇది సక్సెస్ అయితే వెంటనే దేశవ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయబోతుంది. ఆన్లైన్ క్లాసిఫైడ్స్ ఓలెక్స్, క్వికర్ తరహాలో ఫేస్బుక్ కూడా ఈ సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ 25 దేశాల్లో అందుబాటులో ఉంది. ఇటీవలే జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి 17 దేశాల్లో దీన్ని ప్రారంభించారు. ఫేస్బుక్కు భారీ మొత్తంలో యూజర్ డేటాబేస్ ఉంది. ఈ క్రమంలో ఫేస్బుక్ తన పేజీలో మార్కెట్ ప్లేస్ అనే ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్తో యూజర్లను మరింత మందిని ఆకట్టుకోనుంది. అందులోకి వెళ్లి అమ్మాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు అక్కడే ఛాటింగ్ లేదా కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. గృహోపరికరాలు, ఎలక్ట్రానిక్స్, అప్పారెల్స్ వంటి అన్ని కేటగిరీ వస్తువులను దీనిలో కొనుగోలు చేసుకోవడానికి, అమ్మడానికి అవకాశం కల్పించనుంది. అయితే పేమెంట్కు, డెలివరీకి మాత్రం ఫేస్బుక్ బాధ్యత కాదు. ఇందులో అభ్యంతరకమైన వస్తువులను అమ్మకానికి పెట్టడానికి వీలులేకుండా మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను వాడుతున్నారు. -
ఛీటింగ్ కేసులో జనసేన నేత అరెస్టు ?
సాక్షి, హైదరాబాద్: ఐ ఫోన్ 7 అమ్ముతానని ఓఎల్ఎక్స్ డమ్మీ ఫోన్ అమ్మిన రౌడీ షీటర్ ను నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన కళ్యాణ్ సుంకర అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాన్నే మార్గంగా ఎంచుకున్నాడు. ఓఎల్ఎక్స్ వైబ్సైట్ ఐ ఫోన్ 7ను అమ్మడానికి ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి చాలామంది అతన్ని సంప్రదించారు. ఇది చూసిన ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. తిరా చూస్తే అది డమ్మీ ఫోన్ అని అతనికి తెలిసింది. విషయం తెలుసుకుని డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. నన్ను ప్రశ్నిస్తావా అని కోపంతో ఆ రౌడీ షీటర్ తన ఎయిర్ గన్తో బెదిరించాడు. దీంతో బాధితుడు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ రౌడీ షీటర్ నుంచి ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్ గన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో జనసేన పార్టీ తరపున కళ్యాణ్ సుంకర పలు టీవీ ఛానెల్స్లో చర్చావేదికల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనను పటిష్టం చేసుకోవాలని ఓ పక్క అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తోంటే ఆ పార్టీకి నేతగా ఉన్న కళ్యాణ్ సుంకర అరెస్ట్ కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. -
రూ.700కే జియో ఫోన్
రూ.1500 రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్తో రిలయన్స్ జియో తన స్మార్ట్ ఫీచర్ ఫోన్ను డెలివరీ చేయడం ప్రారంభించింది. తొలి దశలో బుక్ అయిన 6 మిలియన్ యూనిట్లను కంపెనీ తన కస్టమర్ల చేతికి అందిస్తోంది. దశల వారీగా అందిస్తున్న ఈ ఫోన్పై ఇప్పటికే డెలివరీ లేటు అయిందంటూ ట్విట్టర్లో నిరాశవ్యక్తమవుతూ ఉంది. తాజాగా ఓ కస్టమర్ చేసిన ట్వీట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఫోన్ను పొందిన కొందరు ఆన్లైన్ క్లాసిఫైడ్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్లో రిజిస్ట్రర్ జియో నెంబర్లతో పాటు విక్రయానికి పెట్టినట్టు ట్వీట్ చేశాడు. తొలుత ఈ ఫోన్ డెలివరీ గ్రామీణ ప్రాంతాలకు అని, తర్వాత ఓఎల్ఎక్స్లోకి అని, ఎప్పటి నుంచో వేచిచూస్తున్న పట్టణ ప్రాంత ప్రజలు పూల్స్?? అంటూ ప్రశ్నించాడు. ఓఎల్ఎక్స్లో ఈ ఫోన్ ధర రూ.700 నుంచి రూ.2,499 మధ్యలో ఉందని తెలిసింది. పూర్తిగా బాక్స్ చేసిన ఉన్న ఫోన్నే విక్రయిస్తున్నారట. అసలు రిలయన్స్ జియో పాలసీల మేరకు జియో ఫోన్ నాన్-ట్రాన్సఫరేబుల్. ఈ ఫోన్ను పొందిన వారు దీన్ని విక్రయించడానికి, లీజ్కు ఇవ్వడానికి, ట్రాన్సఫర్ చేయడానికి వంటి వాటికి అనుమతి ఉండదు. థర్డ్ పార్టీ నుంచి ఒకవేళ ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. తొలుత జియో సిమ్ విషయంలోనూ, తర్వాత రిటర్ను చేసే విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయట. ఒకరు రిజిస్టర్ చేసుకున్న జియోఫోన్ను మరొకరు పొందడం పెద్ద భద్రతా ప్రమాదంగా మారుతుందని, దీన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశముంటుందని కంపెనీనే ఈ ఫోన్ ట్రాన్సఫర్పై నిషేధం విధించింది. ఓఎల్ఎక్స్ కూడా తన ప్లాట్ఫామ్పై అమ్మే వస్తువులపై ఎక్కువ జాగురకత వహించాలని, అన్నింటికీ రీసేల్, రీసోల్డ్కు అవకాశమివ్వకూడదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతమైతే జియో ఫోన్ ప్రీబుకింగ్స్ లేనప్పటికీ, కంపెనీ ముందస్తు వచ్చిన డిమాండ్ను తట్టుకోవడానికే చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
స్నాప్డీల్లో కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో అమ్మేశారు!
నలుగురు వ్యక్తులు కలిసి మంచి ప్లాన్ వేశారు. స్నాప్డీల్ ద్వారా డెలివరీకి వచ్చే సరుకులను దారిలోనే కొట్టేసి, వాటిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేశారు. ఒకటి, రెండు రోజులు కాదు.. చాలా కాలం ఇలాగే చేయడంతో చివరకు పట్టుబడ్డారు. వాళ్లలో స్నాప్డీల్ సరుకులు చేరవేసే లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసే ముగ్గురు డెలియరీ బోయ్లు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసి తప్పుడు పేర్లు, చిరునామాలతో స్నాప్డీల్లో వివిధ వస్తువులు బుక్ చేసి, ఆ తర్వాత వాటిని తీసేసుకుని వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు పెట్టేసి డెలివరీ తీసుకోనట్లుగా వాటిని రిటర్న్ చేసేసేవారు. తీసుకున్న సరుకులను ఎంచక్కా ఓఎల్ఎక్స్లో అమ్మేసుకునేవారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన రవికాంత్, హరి ఓం, అమృత్, కరణ్ శర్మ అనే నలుగురిని అరెస్టు చేసి గుర్గ్రామ్ కోర్టులో ప్రవేశపెట్టారు. స్నాప్డీల్ తరఫున పార్సిల్స్ తీసుకుని వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో డెలివరీ చేసే వల్కన్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏరియా మేనేజర్ రమేష్ కుమార్ గత నెలలో ఈ వ్యవహారంపై ఫిర్ఆయదు చేశారు. విచారణలో ఈ సంస్థలో పనిచేసే డెలివరీ బోయ్లే ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ముందుగా రవికాంత్, హరి ఓం అనే ఇద్దరు డెలివరీ బోయ్లను అరెస్టు చేయగా, వాళ్లిచ్చిన సమాచారంతో హరి ఓం అన్న కరణ్ను అరెస్టు చేశారు. అతడే మొత్తం కుట్రకు సూత్రధారి. ఖరీదైన వస్తువులు బుక్ చేసి, వాటికి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో చెల్లింపు ఆప్షన్ పెట్టేవాడు. డెలివరీ బోయ్లు అతడి అడ్రస్ సరిగా లేదని చెప్పి వాటిని తిరిగి ఇచ్చేసేవారు. అప్పటికే లోపలి సరుకు మారిపోయేది. సరుకు విలువలో 15% మొత్తాన్ని డెలివరీ బోయ్లకు కమీషన్గా ఇచ్చేవారు. దాదాపు 50 పార్సిళ్లను ఇలా ఓఎల్ఎక్స్లో అమ్మేశారని డీసీపీ క్రైం సుమిత్ కుమార్ తెలిపారు. -
ఓఎల్ఎక్స్ యూజర్లే టార్గెట్..
రాంగోపాల్పేట్: ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన వారినే టార్గెట్ చేసి ఐ ఫోన్లు కొంటానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. అదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఉదయ్కిరణ్రెడ్డి (29) జగద్గిరిగుట్టలో నివసించే వాడు. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఖర్చులకు భార్యను డబ్బు అడిగి వేధిస్తుండటంతో ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్లు అమ్ముతామని ప్రకటనలు ఇచ్చిన వారిని మోసం చేయాలని పథకం పన్నారు. అందులో ఇచ్చిన మొబైల్కు ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతాడు. ఫోన్ తన సోదరికి కావాలని ఆమె కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుందని నమ్మిస్తాడు. అమ్మే వ్యక్తి చెప్పిన ధర చెల్లిస్తానని ఒకమారు ఆస్పత్రిలో ఉన్న సోదరికి చూపించి వస్తానని చెబుతాడు. ఆస్పత్రి లోపలికి వెళ్లి అటునుంచి అటే వెళ్లిపోతాడు. ఇలా ఐదుగురి నుంచి ఐ6ఎస్ రెండు, ఐ6 ఫోన్లు 3 కొట్టేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిని మోసం చేసేందుకు కొత్త సిమ్కార్డు కొనుగోలు చేసి దాంతో మోసాలు చేసేవాడు. నిందితుడి నుంచి రూ.2.30లక్షల విలువ చేసే ఐదుఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఫోన్లు కొంటా..
రాంగోపాల్పేట్: ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన వారినే టార్గెట్ చేసి ఐ ఫోన్లు కొంటానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఉదయ్కిరణ్రెడ్డి (29) జగద్గిరిగుట్టలో నివసించే వాడు. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఖర్చులకు భార్యను డబ్బు అడిగి వేధిస్తుండటంతో ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్లు అమ్ముతామని ప్రకటనలు ఇచ్చిన వారిని మోసం చేయాలని పథకం పన్నారు. అందులో ఇచ్చిన మొబైల్కు ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతాడు. ఫోన్ తనసోదరికి కావాలని ఆమె కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుందని నమ్మిస్తాడు. అమ్మే వ్యక్తి చెప్పిన ధర చెల్లిస్తానని ఒకమారు ఆస్పత్రిలో ఉన్న సోదరికి చూపించి వస్తానని చెబుతాడు. ఆస్పత్రి లోపలికి వెళ్లి అటునుంచి అటే వెళ్లిపోతాడు. ఇలా ఐదుగురి నుంచి ఐ6ఎస్ రెండు, ఐ6 ఫోన్లు 3 కొట్టేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిని మోసం చేసేందుకు కొత్త సిమ్కార్డు కొనుగోలు చేసి దాంతో మోసాలు చేసేవాడు. నిందితుడి నుంచి రూ.2.30లక్షల విలువ చేసే ఐదు ఐ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
పోయిన కారు ఓఎల్ఎక్స్లో దొరికింది
నోయిడా: పోయిన కారు కోసం వెతికి వెతికి ఎంతకీ లభించక పోవడంతో ..సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చెద్దామని ఈ కామర్స్ వెబ్ సైటైన ఓఎల్ఎక్స్లో ప్రయత్నించిన వ్యక్తికి తన కారే అమ్మకానికి పెట్టడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ప్రాపర్టీ డీలర్ కుల్వంత్ సింగ్ గత ఏడాది అగస్టులో సెక్టర్ 1 లో ఉన్న తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు చోరీకి గురైంది. పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు చేశాడు. కారు ఎంతకీ దొరకకపోవడంతో సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్ 4సీఆర్ 0757 ఉన్న తన కారును చూశాడు. వెంటనే యాడ్ ఇచ్చిన వ్యక్తితో కారు గురించి మాట్లాడాలని కోరాడు. అతని దగ్గరకు వెళ్లేమందు పోలీసులను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కారు యాడ్ ఇచ్చిన వ్యక్తిని లోనీలో నివసించే అహ్మద్గా పోలీసులు గుర్తించారు. తాను నివసించే ప్రాంతంలోనే ఉండే మరో వ్యక్తి జుల్ఫికర్ ఆ కారును తనకు అమ్మినట్టు అహ్మద్ తెలిపాడు. ప్రధాన నిందితుడు జుల్ఫికర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
'మోదీని ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తామంటున్నారు'
'ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ చాలా హామీలే గుప్పించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, అచ్చెదిన్ (మంచిరోజులు) తీసుకొస్తానని ఇలా చాలా విషయాలే చెప్పారు. తీరా ప్రధానమంత్రి అయ్యాక తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోదీని ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు'.. ప్రధాని మోదీపై మిత్రపక్షం శివసేన విసిరిన వ్యంగ్యాస్త్రాలివి. శివసేన అధికార పత్రిక 'సామ్నా' ప్రధాని మోదీ టార్గెట్ గా ఓ సంపాదకీయాన్ని వెలువరించింది. మోదీ వైఫల్యం వల్లే జెఎన్ యూ విద్యార్థి నేత అయిన కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా ఆయనను విమర్శిస్తున్నారని మండిపడింది. పాత వస్తువులు అమ్మే ఓఎల్ఎక్స్ లో ప్రధానిని అమ్మేస్తామని కన్హయ్య లాంటి నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని, ఇది బీజేపీకి ఆమోదయోగ్యం కాకూడదని పేర్కొంది. కన్హయ్య లాంటి నేతలకు బీజేపీ ఊపిరి అందిస్తున్నదని, ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగాలని సూచించింది. కన్హయ్యపై జెట్ విమానంలో హత్యాయత్నం జరిగిందన్న వార్తల నేపథ్యంలో అతనిపై దేశద్రోహి ముద్ర వేసి ప్రచారం చేయడం ఎంతమాత్రం సబబు కాదని బీజేపీని ఉద్దేశించి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్న సంగతి తెలిసిందే. -
స్నేహితుని ఇంట్లో చోరీ... ఓఎల్ఎక్స్లో విక్రయం
ఇద్దరి అరెస్టు లంగర్హౌస్: స్నేహితుడి ఇంట్లో వస్తువులు చోరీ చేసి.. వాటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తున్న ఇద్దరి లంగర్హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం... సాయిశ్రీకాంత్ లంగర్హౌస్ దుర్గానగర్లో ఉంటూ అమేజాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఎన్ఐటీ చేసిన ఇతను గతనెల 7న యూనివర్సిటీలో పట్టా అందుకొనేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లాడు. 16న నగరానికి తిరిగి వచ్చే సరికి దొంగలు కిటికీలోంచి చొరబడి కంప్యూటర్, ట్యాప్ తదితర వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... చోరీ అయిన వస్తువుల్లో సామ్సంగ్ ట్యాబ్ ఓఎల్ఎక్స్లో రూ. 6 వేలకు విక్రయించినట్టు కనుగొన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా సాయి స్నేహితులే ఈ చోరీకి పాల్పడినట్టు తేలింది. గతంలో ఇదే అపార్ట్మెంట్లో ఉండి ప్రస్తుతం భెల్ ఎంప్లాయ్ అసోసియేట్లో పని చేస్తున్న ఉప్పర్పల్లికి చెందిన శ్రీకాంత్, లంగర్హౌస్లో ఉంటూ బీటెక్ చదువుతున్న రాంపల్లి విక్రమ్తో కలిసి చోరీ చేసినట్టు గుర్తించి సోమవారం ఇద్దరినీ అరెస్టుచేశారు. వీరి వద్ద నుంచి కంప్యూటర్ సీపీయూ, మానీటర్, సెల్ఫోన్, సామ్సంగ్ ట్యాబ్, 2 గడియారాలు, బ్లూటూత్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుల్లో శ్రీకాంత్ పాతనేరస్తుడని పోలీసులు తెలిపారు. -
ఓఎల్ఎక్స్.... తోసేయండి...
నెల్లూరు : ఏదైనా అమ్ముకోవచ్చు' ఇది ఓఎల్ఎక్స్ అనే ఉచిత ఆన్లైన్ ప్రకటనల వెబ్సైట్ ప్రచార నినాదం. అదే ఓ వ్యక్తి కొంప ముంచింది. ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో కారు అమ్మకానికి పెట్టిన అతగాడికి చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన అశోక్ కుమార్... వెబ్సైట్లో తన కారును అమ్మకానికి పెట్టాడు. ఆ ప్రకటన చూసిన ఇద్దరు వ్యక్తులు కారు కొనేందుకు ముందుకు వచ్చారు. టెస్ట్ డ్రైవింగ్ చేద్దామంటూ ఆ ఇద్దరు...కారుతో బయల్దేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులో ఉన్న అశోక్ కుమార్ను వారిద్దరూ బలవంతంగా బయటకు తోసేసి...వాహనంతో పరారయ్యారు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
యాప్.. యాప్.. హుర్రే..!
మొబైల్ యాప్స్కు తాను పెద్ద ఫ్యాన్నని, ఈ యాప్స్ మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, వినోదభరితంగా మారుస్తాయని హీరో అల్లు అర్జున్ కితాబునిస్తారు. సోమాజిగూడ పార్క్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓఎల్ఎక్స్ డాట్ ఇన్ టీవీ కమర్షియల్ యాడ్ను ఆయన ఆవిష్కరించారు. పాత వస్తువుల కొనుగోలు, విక్రయాలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఓఎల్ఎక్స్ కమర్షియల్ యాడ్లో అల్లు అర్జున్, రెజీనా కాసాండ్రలు నటించారు. -
ఉపయోగించని వస్తువుల మార్కెట్ @ రూ.22,000 కోట్లు
హైదరాబాద్: భారత పట్టణాల్లో ఉపయోగించని వస్తువుల మార్కెట్ రూ.22,000 కోట్లని క్రస్ట్ సర్వే వెల్లడించింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్తో కలిసి ఓఎల్ఎక్స్ సంస్థ ఈ క్రస్ట్ సర్వేని నిర్వహించిందని ఓఎల్ఎక్స్డాట్ఇన్ సీఈవో అమ్రిత్ బాత్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఓఎల్ఎక్స్ కన్సూమర్ రీసెర్చ్ ఆన్ యూజ్డ్-గూడ్స్ అండ్ సెల్లింగ్ ట్రెండ్స్(క్రస్ట్) పేరుతో దేశంలోని 4 ప్రాంతాల్లోని 12 నగరాల్లో ఈ సర్వే నిర్వహించామని పేర్కొన్నారు. దేశంలో ఏ నగరంలో లేనంతగా ముంబైలో ఉపయోగించని వస్తువులున్నాయని వివరించారు. ఇలాంటి వస్తువుల్లో అధిక భాగం వంట పాత్రలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, బట్టలు, వాచీలు, పుస్తకాలు ఉన్నాయన్నారు. -
సెకండ్ హ్యాండ్ అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: భారత్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్ జోరు పెరుగుతోందని ఆసోచామ్ తాజా అధ్యయనం తెలిపింది. ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ పేర్కొన్న వివరాల ప్రకారం.., రూ.80 వేల కోట్లుగా ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్ విలువ 2015 కల్లా రూ.1,15,000 కోట్లకు పెరుగుతుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం, నష్టభయం వంటి కారణాల వల్ల సెకండ్ హ్యాండ్ వస్తువులు వినియోగించే సంస్కృతి పెరుగుతోంది. వినియోగదారుల ఆశలు పెరిగినంతగా ఆదాయాలు పెరగకపోవడంతో సెకండ్ హ్యాండ్ వస్తువులకు డిమాండ్ జోరుగా ఉంది. ఇది వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, పారిశ్రామిక యంత్రాలు, పుస్తకాలు తదితర వస్తువులు ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల అమ్మకాలు మాత్రం తగ్గుతున్నాయి.