Pavani
-
వాలెంటైన్ రోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ‘పుష్ప 2’ నటి పావని (ఫోటోలు)
-
కత్తుల్లాంటి చూపుతో కట్టిపడేస్తోన్న పావని కరణం లేటెస్ట్ పిక్స్
-
పుష్ప-2 పావని.. ఆ విషయం గుర్తు చేసుకుని స్టేజీపైనే కన్నీళ్లు!
సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1కు కొనసాగింపుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు లేని విధంగా రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ ఏకంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి-1, బాహుబలి-1, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరల్డ్ వైడ్గా పలు దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది.పుష్ప-2లో ఆకట్టుకున్న పావని..పుష్ప-2లో అజయ్ కూతురిగా నటించిన పావని కరణం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పుష్పరాజ్ను చిన్నాయన అంటూ కావేరి పాత్రలో అభిమానులను మెప్పించింది పావని. అయితే పుష్ప-2 చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ హైలెట్గా నిలిచింది. బన్నీ గాల్లోకి ఎగురుతూ చేసిన ఫైట్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ను కట్టిపడేసింది. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన పావని ఎమోషనలైంంది. తనను గుర్తించి అవకాశమిచ్చిన డైరెక్టర్ సుకుమార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.ఈవెంట్లో పావని మాట్లాడుతూ..' ఈవెంట్కు పెద్దలందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నా క్యారెక్టర్తో పాటు టీమ్ మొత్తానికి ఊహించని దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. ఎప్పుడైనా నిద్రలోంచి లేస్తే ఏడ్చుకుంటూ లేచేదాన్ని. సుకుమార్ గారికి, బన్నీగారికి థ్యాంక్స్ చెప్పలేదనే బాధ ఉండేది. సినిమా రిలీజ్ అయ్యాక సుక్కు సార్, బన్నీ సార్ను కలవలేదంటూ ఎమోషనలైంది. అల్లు అర్జున్ సార్కు నేను వీరాభిమానిని. సెట్లో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటా సార్. అంతేకాదు మీరు నాకు ఆదర్శం కూడా. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తా. సుక్కు సార్ మీరు నన్ను గుర్తించి అవకాశమిచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. సినిమా చూసిన తర్వాత నన్ను బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన చిత్ర బృందానికి థ్యాంక్స్.' ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ సార్కు థ్యాంక్స్ అంటూ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది పావని కరణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
'పుష్ప' లైఫ్ని మార్చేసే పాత్ర.. ఈ నటి ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
Prakriti Pavani: కైపెక్కించే చూపులతో మదిని దోచుకుంటున్న ప్రకృతి పావని (ఫోటోలు)
-
'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం!
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందిన ఘటన మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ్వాయిపల్లి చెందిన క్కొల్ల శేఖవ్వ, మల్లేశం రెండో కుమార్తె పావని(21) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో పేర్కొనడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురి మృతిపై విచారణ చేపట్టాలని సోమవారం పావని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బీటెక్ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు.. -
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్లోన్ మేనేజర్గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
‘మణప్పురం’లో బంగారం మాయం
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్ హెడ్ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచి హెడ్గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు. సోమవారం రాత్రి బ్రాంచ్ హెడ్గా ఉన్న పావని విధులు ముగించుకుని వెళ్లారు. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మంగళవారం మణప్పురం బ్రాంచ్కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన మణప్పురం కంకిపాడు బ్రాంచ్లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఈ బ్రాంచ్లో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మణప్పురం ఆఫీసు కింద ఉన్న షాపుల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే పోలీసుల విచారణకు తోడ్పడ్డాయి. బ్రాంచ్ హెడ్ పావని పనే... బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచి హెడ్గా పనిచేస్తున్న రెడ్డి వెంకట పావని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె సోమవారం రాత్రి విధులు పూర్తి^ó సుకున్న అనంతరం తనతోపాటు వచ్చిన మరో వ్యక్తితో కలిసి కార్యాలయం మూసివేసి కారులో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్గేట్ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
Bigg Boss 7 Nayani Pavani HD Photos: బిగ్ బాస్-7లోకి పక్కా తెలంగాణ అమ్మాయి నయని పావని (ఫొటోలు)
-
ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీలో నిద్రమాత్రలు కలిపి
కర్ణాటక: ప్రేమికునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యను చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు అరెస్ట్ చేశారు. కడూరు తాలూకా హనుమనహళ్లికి చెందిన పావనికి నవీన్ (29)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఇటీవల భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త గొడవ పడగా పెద్దలు రాజీ పంచాయతీ చేశారు. ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీల్లో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. భర్త తిని నిద్రలోకి వెళ్లగానే ప్రియునితో కలిసి హత్య చేసి మూడు కిలోమీటర్ల దూరంలో పడేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది. అయితే ఇది ఆత్మహత్య కాదని తెలిసి పావనిని విచారించగా నిజం చెప్పింది. ఇద్దరినీ అరెస్టు చేశారు. -
దివ్యాంగుడికి ‘గృహలక్ష్మి’ చేయూత
భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చుక్క నరేశ్, పావని దంపతులు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోనే మొదటి ప్రొసీడింగ్ను అందుకున్నారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. నరేశ్ ఇంటికి వెళ్లి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. శనివారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ను ప్రారంభించిన సందర్భంగా అక్కడ మగ్గం పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్ కుటుంబం దీనస్థితిని తెలుసుకొన్నారు. వారికి సొంత ఇల్లు లేదని తెలుసుకొని వెంటనే స్పందించిన మంత్రి.. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ప్రొసీడింగ్ను అందజేయాలని అక్కడే ఉన్న కలెక్టర్ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలసి నరేశ్ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తమ సొంతింటి కల నెరవేరనుండటంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలలక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్ కోట అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. -
పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది
నేనేంటి? నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదా? ఈ ప్రశ్నలు పావనిని వెంటాడాయి... వేధించాయి. చదువుంది... పెద్ద ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంది. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలు కన్నదామె. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగినట్లు శ్రమించింది కూడా. జీవితం మాత్రం... ఆమె చదవని సిలబస్తో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షను సహనంతో ఎదుర్కొన్నది... ఉత్తీర్ణత సాధించింది. ఇక... తనను తాను నిరూపించుకోవాలనుంది. క్రియేటివిటీ ఆమెకు తోడుగా వచ్చి వెంట నిలిచింది. ఆమె ఇప్పుడు పట్టుదారంతో చక్కటి ఆభరణాలల్లుతోంది. పావని కోరెం... వరంగల్ జిల్లా, హన్మకొండలో పుట్టింది. బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అండగా నిలిచారు. పెళ్లి తర్వాత హైదరాబాద్లో కాపురం, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరింది. బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ పూర్తయింది. పోటీ పరీక్షల కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి కోచింగ్కెళ్లారు. పరీక్షలకు సిద్ధమయ్యేలోపు జీవితం మరో పరీక్ష పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చిన్న సందేహం. ఆ సందేహాన్ని నిజం చేయడానికా అన్నట్టు పుట్టగానే బిడ్డ ఏడవలేదు. నెలరోజులు హాస్పిటల్లోనే ఉంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. స్పెషల్ కిడ్ కావచ్చనే మరో సందేహం. క్షణక్షణం బిడ్డ సంరక్షణలోనే గడిచిపోయింది. అనుక్షణం బిడ్డ ఎదుగుదల కోసం శ్రమించింది. తల్లిగా కఠోరయజ్ఞమే చేసింది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో బాబుని మెయిన్స్ట్రీమ్లోకి తీసుకు రాగలిగింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను ఆశ్రయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి తనను తాను తీర్చిదిద్దుకుంది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసింది. ఇప్పుడామె తన సృజనాత్మకతతో గుర్తింపు పొందుతోంది. తన జీవితంలో దశాబ్దంపా టు సాగిన కీలక పరిణామాలను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఊహించని శరాఘాతం! ‘‘మా పెళ్లి 2009లో జరిగింది. బాబు ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. బోర్లా పడడం, పా కడం, కూర్చోవడం, నడవడం వంటివన్నీ కొంత ఆలస్యంగా చేశాడు. నార్మల్ కిడ్ చేయాల్సిన సమయానికంటే ఎంత ఆలస్యమవుతోందా అని క్యాలెండర్ చెక్ చేసుకుంటూ... కంటికి రెప్పలా కాపా డుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపుగా నార్మల్ కిడ్ అయ్యాడు. కానీ చిన్నప్పుడు రోజూ ఆందోళనే. బరువు తక్కువగా పుట్టడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. తరచూ జలుబు, జ్వరం వస్తుండేవి. అప్పట్లో మా వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో ఉద్యోగం. కర్నాటకలో ఓ చిన్న గ్రామంలో పోస్టింగ్. అక్కడ వైద్య సదుపా యాలు తక్కువ. ప్రతినిత్యం భయంభయంగా గడిచేది. రెండున్నరేళ్లకే బాబుకి హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంకుకు అనేక అనుబంధ బ్యాంకుల్ని అనుసంధానం చేయడం కూడా అప్పుడే జరిగింది. ఎస్బీఐకి మారి హైదరాబాద్కి వచ్చేశాం. మన ్రపా ంతానికి వచ్చిన తర్వాత నన్ను వెంటాడిన భయం వదిలిపోయింది. బాబుకి మంచి వైద్యం చేయించగలమనే ధైర్యం వచ్చింది. ట్రీట్మెంట్ థెరపీలు జరిగేకొద్దీ బాబులో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండేది. డిప్రెషన్ నుంచి మెల్లగా బయటపడ్డాను. రోజులు ఆశాజనకంగా గడుస్తున్నప్పటికీ నాలో ఏదో వెలితి ఉండేది. సృజనతో సాంత్వన నన్ను నేను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. యూ ట్యూబ్ చూసి నేర్చుకున్న పేపర్ క్విల్లింగ్ మంచి సాంత్వననిచ్చింది. బాబుకి ఫిజియోథెరపీ చేయించే ట్రైనర్ నేను క్విల్లింగ్లో చేసిన పూలు, బొమ్మలను చూసి, చాలా బాగున్నాయని తీసుకెళ్లారు. వాటిని ఆ రోజే వాళ్ల హాస్టల్ స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అప్పుడే మా ఫ్రెండ్ పట్టు దారంతో ఆభరణాలు తయారు చేయమని చెప్పింది. అలా నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది. హాబీగా మొదలు పెట్టిన యాక్టివిటీ కాస్తా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. తెలిసిన వాళ్ల నుంచి నా సృజనాత్మకత ఎల్లలు దాటింది. దుబాయ్, యూఎస్, యూకే, చైనా ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జస్ట్ డయల్, మీ షోలలో నా అల్లికలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి బల్క్ ఆర్డర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రంతా పని చేస్తుంటాను. ముగ్గురు అమ్మాయిలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. మేము తయారు చేసిన ఉత్పత్తులను పికప్ బాయ్స్ వచ్చి తీసుకెళ్తారు. బాబును చూసుకుంటూ నా యాక్టివిటీని కొనసాగిస్తున్నాను. మొదట్లో అయితే మెటీరియల్ కోసం వెతుక్కుంటూ బాబును బండి మీద కూర్చోబెట్టుకుని బేగం పేట నుంచి బేగం బజార్కు వెళ్లేదాన్ని. ఇప్పుడైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ బాబుకు ఇంకా నా అవసరం ఉంది. నేను దగ్గరుండి చూసుకుంటే మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిలా కొనసాగిస్తున్నాను. నాకు నిజంగా ఆశ్యర్యమే! నా లైఫ్ జర్నీలో నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... నన్ను రోల్మోడల్గా చూస్తూ నా నుంచి స్ఫూర్తి ΄ పొందుతున్న వాళ్లు ఉన్నారనే విషయం. అంతా బాగున్న వాళ్లు చాలామంది ఏమీ చేయకుండా ఉంటున్నారు. ఏదైనా సమస్య రాగానే దిగాలు పడిపోయి జీవితాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసుకునే వాళ్లున్నారు. కానీ... ‘సమస్యకు పరిష్కారం వెతుక్కుని, తనకు ఒక గుర్తింపును తెచ్చుకుంది’ అని ప్రశంసిస్తున్నారు. మా వాళ్లు మాత్రం మొదట్లో ‘నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పిల్లాడిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఇన్ని ఒత్తిడులు పెట్టుకోవద్ద’ని కోప్పడ్డారు. కానీ ఈ పని నాకు ఒత్తిడిని తగ్గిస్తోందని తెలిసి మా వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఎంతో సంపా దిస్తున్నానని కాదు, కానీ నేను ఎటువంటి ఉనికి లేకుండా లక్షల్లో ఒకరిలా ఉండిపోకుండా, ఈ పనివల్ల వందల్లో ఒకరిగా ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాను’’ అంటున్నప్పుడు పా వని కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. – వాకా మంజులారెడ్డి , సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పరేషాన్తో అలాంటి అనుభూతి కలిగింది
‘‘కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం..’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘పరేషాన్’ మూవీ చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ‘పరేషాన్’ లో జరిగింది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పరేషాన్’ సక్సెస్ మీట్కి ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ‘‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. గెలవాలంటే లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి.. రానాగారు వచ్చి మాతో సిక్స్ కొట్టించారు’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు పావని కరణం. ‘‘పరేషాన్’కి నైజాంలో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. -
నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియా స్టార్, నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో, సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన ఆమె తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. శనివారం(డిసెంబర్ 31) ఆమె తండ్రి కన్నుమూశారు. ఇదే విషయాన్ని నటి పావని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పలు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింలో నటించిన నయని పావని ప్రముఖ డాన్స్ షో ఢీతో మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. అలాగే మరో యూట్యూబ్, సోషల్ మీడియా స్టార్ శ్వేతా నాయుడి కలిసి ఎక్కువగా నయని రీల్స్ చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో తండ్రి మృతిపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదిక ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు ఆమె పోస్ట్ చేస్తూ.. ‘ఒక్క జన్మలోనే 100 జన్మల ప్రేమందించావు. కానీ, నాకు అది సరిపోలేదు. ఇంకా కావాలి డాడీ. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. నాకు అయిన పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు. ఇక నిన్ను చూడలేను అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నిన్ను ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. ఇకపై పండోడా అని నన్ను ఎవరు పిలుస్తారు? రోజుకి ఐదుసార్లు ఎవరు కాల్ చేస్తారు? ఓర్పుగా నాతో ఎవరు ఉంటారు? నువ్వు ఏమైనా చేయ్.. నీ లైఫ్ నీ ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎవరు చెప్తారు? నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావు అనుకున్నా.. కానీ అంతలోనే నిన్ను ఇలా ఎత్తుకెళ్తాం అనుకోలేదు. ఇది చాలా అన్ ఫెయిర్. 2022 నాకు ఇంతటి విషాదం ఇస్తుందని అనుకొలేదు, ఇక 2023లోకి అస్సలు ఎంటర్ అవ్వాలని లేదు’ అంటూ పావని భావోద్వేగానికి లోనయ్యింది. ఇక ఆమె పోస్టర్ శ్వేతా నాయుడుతో పాటు పలువుకు సోషల్ మీడియా స్టార్ స్పందిస్తున్నారు. ‘ధైర్యంగా ఉండు.. నీకు మేము ఉన్నాం’ అంటూ ఆమెకు ఓదార్పును ఇస్తున్నారు. కాగా ఆమె సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, నీవెవరో, బబ్లూ vs సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి షార్ట్ ఫిలింస్లో నటించింది. View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Gurugubelli Divya sree!😎 (@divyaa__sree) View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) -
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు ఎమ్మెల్యే వంశీ ఆపన్నహస్తం
సాక్షి, హనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): ‘రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. నాకు బతకాలని ఉంది.. నా ప్రాణాలు కాపాడండి..’ అంటూ ఓ మహిళ కన్నీటితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను వేడుకుంది. చలించిన ఆయన తాను న్నానంటూ ఆమె భరోసా ఇచ్చారు. అతిక్లిష్టమైన శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయటంతో పాటు, అందుకు అయ్యే ఖర్చును భరించారు. బాపులపాడు మండలం హనుమాన్జంక్షన్కు చెందిన దుట్టా ఉదయ కిరణ్ రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పావని (22), ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గతే డాది గన్నవరం మండలం కేసరపల్లి వద్ద పావని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె తల రోడ్డుకు బలంగా తగలడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఎడమవైపు పుర్రె భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో పావనిని కుటుంబ సభ్యులు ఎనికేపాడులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి వైద్యులు రెండు సార్లు పావని బ్రెయిన్కు ఆపరేషన్లు చేశారు. తలలో దెబ్బతిన్న పుర్రె భాగాన్ని శస్త్రచికిత్స చేసేందుకు కొద్దిరోజులు భద్రపరిచినా, ఆ తర్వాత పూర్తిగా దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కృత్రిమ పుర్రె (ప్లాస్టిక్ సింకుల్) అమర్చాల్సి ఉందని, ఈ సర్జరీ తమ వల్ల కాదని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటికే రూ.10 లక్షలకు పైగా ఖర్చు కావటంతో ఉదయకిరణ్కు ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ తరుణంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వద్దకు వెళ్లి తన ప్రాణాలు కాపాడాలని పావని కన్నీటి పర్యంతమైంది. చిన్న వయస్సులో ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే వంశీమోహన్ తనకు తెలిసిన కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమెను పరీక్షించాల్సిందిగా సూచించారు. పావని తలను పూర్తిస్థాయిలో పరిశీలించిన వైద్యులు ఆమె తలలో కొప్పా త్రీడీ టెక్నాలజీతో కూడిన కృత్రిమ పుర్రె భాగాన్ని పెట్టి, దానిలో మెదడును అమర్చితే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు తెలిపారు. పుర్రె తయారీకి రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్ తక్షణమే అందించి, ప్రత్యేకంగా పుర్రె భాగాన్ని సిద్ధం చేయించారు. త్వరలోనే పావని తలకు ఆపరేషన్ పూర్తి చేసి పుర్రె అమర్చనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. -
విధితో గెలవలేక.. హిమపావని కన్నుమూత
సాక్షి, నంద్యాల(బొమ్మలసత్రం): పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె హిమపావని(10) విధితో పోరాడలేక గురువారం కన్నుమూసింది. హిమపావని ఐదు నెలల ముందు వరకు స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఆనందంగా ఉండేది. అటువంటి సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పావనికి మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా చేదునిజం బయటపడింది. చిన్నారి మెదడులో రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. కొందరు దాతల సహకారంతో జూన్ నెలలో తమిళనాడులోని వేలూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నెల తర్వాత వైద్యులు తప్పని సరిగా పాపకు ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే అంత మొత్తం లేక మిన్నకుండిపోయారు. ఈనెల 17న ఆళ్లగడ్డకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినపుడు కలిసి పాప విషయాన్ని తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి పాప ఆపరేషన్కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రూ.లక్ష చెక్కును అందించి శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న సిటీ న్యూరో సెంటర్లో ఈనెల 20న పావనిని చేర్పించారు. 26వ తేదీ వైద్యపరీక్షలు పూర్తి చేసి గురువారం ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపరేషన్ పూర్తయిన గంట తర్వాత చిన్నారి హార్ట్బీట్ తగ్గిపోవడం గమనించిన వైద్యులు హుటాహుటీన అధునాతన పరికరాలతో వైద్యం అందించారు. అయినప్పటికీ పావని కోలుకోలేక కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పారవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పాప కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాప మృతదేహాన్ని పట్టణంలోని వారి ఇంటికి చేర్చారు. మృతదేహం వద్ద ఎమ్మెల్యే సతీమణి శిల్పా నాగినిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, చైర్పర్సన్ మాబున్నిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, వైఎస్సార్సీపీ నాయకులు వెంకటసుబ్బయ్య, అమృతరాజ్లు నివాళులు అర్పించారు. చిన్నారి అంత్యక్రియలకు ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఆర్థిక సహాయం అందించారు. -
దేవుడా.. ఇదేమి అన్యాయం.. గుండెకోత మిగిల్చావ్
వరంగల్ చౌరస్తా: వారిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే పిల్లలు కూడా కష్టపడి చదివారు. పెద్దకూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగి, కాగా, చిన్నకూతురును ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పంపాడు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు.. మధ్యలోనే ఆరిపోయాయి. అమెరికాలో స్నేహితులతో కలిసి వ్యాన్లో వెళ్తున్న ఆమె.. పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఇక్కడ మరో విషాద ఏమిటంటే.. కూతురు చనిపోయిన విషయం తల్లికి తెలియజేయలేని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేష్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్ స్కూల్ టీచర్. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు పావని (22)ని అమెరికా పంపించాలనుకున్నారు. అందుకోసం రూపాయి.. రూపాయి కూడబెట్టారు. గత ఏడాది బీటెక్ పూర్తికాగా, ఎంఎస్ కోసం రెండు నెలల క్రితం అమెరికా వెళ్లింది. స్నేహితులతో వెళ్తుండగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో కనెక్టికట్ రాష్ట్రంలో 8 మంది స్నేహితులు మినీ వ్యానులో ప్రయాణిస్తున్నారు. వీరి వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోగా, అందులో పావని ఒకరు. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు ఉన్నారు. మరికొంతమంది గాయపడ్డారు. గుండెలవిసేలా.. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రమేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తల్లికి అనారోగ్యం కారణంగా విషయం చెప్పకుండా దాస్తున్నట్లు తెలిసింది. బంధువులు, ఇతరులు కూడా విషయం తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఆదివారం పావని మృతదేహం నగరానికి చేరుతుందని సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (క్లిక్ చేయండి: ఉన్నత చదువుకు అమెరికా వెళ్లి.. మృత్యుఒడికి..) దేవుడు అన్యాయం చేసిండు ‘ఇద్దరు కూతుళ్లు అని ఎప్పుడూ బాధ పడలేదు. ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం నేను, నా భార్య అహర్నిశలు కష్టపడ్డాం. మా కలలకు తగ్గట్టుగా పెద్ద పాప ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న పాపను అమెరికాను పంపాలనుకున్నాం. రెండు నెలల కిందట పంపించాం. మొన్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా వీడియో కాల్లో మాతో మాట్లాడింది. అంతా బాగానే ఉందని ఓదార్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. చనిపోయినట్లు అమెరికా నుంచి ఫోన్కాల్ వచ్చింది. ఇది నమ్మలేకపోతున్నాను. దేవుడా.. ఇదేమి అన్యాయం’ - దగ్గర బంధువుల వద్ద పావని తండ్రి ఆవేదన -
కాకినాడ మేయర్ పావని తొలగింపు
సాక్షి, కాకినాడ: నాలుగేళ్ల ‘మేయర్’ గిరికి బ్రేక్ పడింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూటగట్టుకుని కార్పొరేటర్ల ‘విశ్వాసం’ కోల్పోయిన మేయర్ సుంకర పావని పదవిని కోల్పోయారు. ఈ మేరకు ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 129 ద్వారా పురపరిపాలనాశాఖ స్పెషల్ చీఫ్సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టింగ్ మేయర్గా చోడిపల్లి డిప్యూటీ మేయర్ చోడిపల్లి ప్రసాద్ ‘యాక్టింగ్ మేయర్’ కానున్నారు. కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మేయర్ పదవిని కోల్పోతే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్కు అన్ని అధికారాలు దాఖలు పడతాయి. మేయర్తోపాటు డిప్యూటీ మేయర్–1 కూడా పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ మేయర్–2గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ తదుపరి మేయర్ ఎన్నిక జరిగే వరకు ‘యాక్టింగ్ మేయర్’గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్కు ప్రతిపాదన పంపనున్నారు. అక్కడి నుంచి తేదీ ఖరారైన వెంటనే కొత్త మేయర్ను ఎన్నుకోనున్నారు. -
అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్ పావని
సాక్షి, కాకినాడ: కాకినాడ మేయర్పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్ పావని, ఉపమేయర్-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్లో 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్అఫిషియో సభ్యులు హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్ అధికారి రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: (సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు) -
మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యాన నగరపాలక పాలక సంస్థ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్ హాలులో ఉదయం 11 గంటలకు మేయర్, 12 గంటలకు డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ జరిగేది ఇలా.. 44 మంది కార్పొరేటర్లతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి 47 మందికి ఓటు హక్కు ఉంది. మూడింట రెండు వంతుల మంది అంటే 31 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. చేతులెత్తే పద్ధతిపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 31 మంది అనుకూలంగా ఓటు వేయాలి. కార్పొరేటర్లు చేతులెత్తి అభీష్టం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు నిర్ధారిస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించాక మేయర్ పదవి నుంచి పావని వైదొలగాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్ పావని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాన్ని 22వ తేదీ వరకూ పెండింగ్లో పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 33 మంది సంతకాలు చేసి, ఐక్యతతో ఉన్నందున పావని పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ విప్పై గందరగోళం టీడీపీ విప్పై గందరగోళం నెలకొంది. వాస్తవానికి మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా కేవలం మేయర్ విషయంలోనే విప్ జారీ చేస్తూ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తీసుకున్న నిర్ణయం కార్పొరేటర్లలో అసహనం రేకెత్తించింది. మేయర్ విషయంలో విప్ జారీ చేసి, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్పై నిర్లక్ష్యం చేయడాన్ని ఆ పార్టీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. మరోవైపు పావనిపై అసమ్మతి కార్పొరేటర్లతో పాటు స్వపక్షంలోని 9 మంది అసమ్మతితో రగిలిపోతున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ వ్యతిరేక శిబిరంలో పార్టీలకు అతీతంగా 33 మంది ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీల్లోని అసమ్మతి కార్పొరేటర్లున్నారు. మేయర్తో కలిపి టీడీపీకి అనుకూలంగా పది మంది ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆ పార్టీ ఆదేశాల మేరకు తటస్థంగా వ్యవహరించనున్నారు. కార్పొరేటర్లపై అధిష్టానానికి ఫిర్యాదు : మేయర్ పావని కాకినాడ సిటీ: టీడీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు మేయర్ సుంకర పావని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న పరిణామాలను కలెక్టర్కు వివరించేందుకు ఆమె సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 22 వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టు తెలిపిందని మేయర్ వివరించారు. ఇప్పటికే కార్పొరేటర్లకు టీడీపీ విప్ జారీ చేసిందన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తన వెంట 10 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు. -
కాకినాడ మేయర్పై రేపే అవిశ్వాసం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నుంచి మేయర్గా ఎన్నికైన పావని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమకు విలువ ఇవ్వలేదని, మహిళా కార్పొరేటర్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ పలువురు కార్పొరేటర్లు గత నెల 17న కలెక్టర్ హరికిరణ్కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసిన 33 మంది కార్పొరేటర్లు విశాఖలో ఏర్పాటు చేసిన రాజకీయ శిబిరానికి తరలి వెళ్లారు. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. వీరందరూ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి కాకినాడ చేరుకుని ఓటింగ్కు హాజరు కానున్నారు. ఇప్పటికే మేయర్కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి కార్పొరేటర్లతో పాటు సొంత టీడీపీకి చెందిన మిగిలిన తొమ్మిది మంది కూడా ఆమెకు దూరమయ్యారు. టీడీపీ జారీ చేసిన విప్ను కూడా ధిక్కరించేందుకు వారు సమాయత్తమవుతున్నారని సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడును రెండు రోజుల క్రితం ఈ తొమ్మిది మంది కార్పొరేటర్లూ నేరుగా కలిసి తమ వాదన వినిపించినట్టు చెబుతున్నారు. మేయర్ పావని సొంత పార్టీలోని కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేమని చెప్పారని అంటున్నారు. ఓవైపు అసమ్మతి కార్పొరేటర్లు, మరోవైపు సొంత పార్టీలోని కార్పొరేటర్ల నుంచి కూడా అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో మేయర్ ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం జరగనున్న ఓటింగ్పై పడింది. -
సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు
సాక్షి, కాకినాడ: నియంతృత్వ ధోరణితో నగర మేయర్ సుంకర పావని టీడీపీని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆ పార్టీకి చెందిన అసమ్మతి కార్పొరేటర్లు మండిపడ్డారు. పదవి కోసం ఆమె ఆడుతున్న కపట నాటకాలను గుర్తించాలని పార్టీ అధినేతను కోరారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడులకు టీడీపీ అనుకూల, అసమ్మతి కార్పొరేటర్లు సోమవారం వేర్వేరుగా లేఖ పంపారు. నాలుగేళ్లుగా మేయర్ పావని, ఆమె భర్త తిరుమలకుమార్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ ఎంతో నష్టపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కొద్ది నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెడతారనే సమాచారంతో ఆమె ఎక్కని గడప, మొక్కని కాలు లేదంటూ మండిపడ్డారు. చదవండి: (బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు) అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖ నేతలను కలిసి, మిగిలిన ఏడాది కాలం తాను పదవిలో ఉండేలా చూడాలంటూ ప్రాధేయపడ్డారని తెలిపారు. ఇందుకు అధికార పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం, అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇప్పుడు సరికొత్త నాటకాలకు తెర తీశారని పేర్కొన్నారు. తన ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టారని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పొలిటికల్ డ్రామాలకు తెర లేపారని చంద్రబాబుకు రాసిన లేఖలో కార్పొరేటర్లు ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీని భ్రష్టు పట్టించి, చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ పెద్దలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. 45వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శైలజ కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై మేయర్ సకాలంలో స్పందించలేదని, దీనివలన ఆమె తన పదవిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, చివరకు కోర్టును ఆశ్రయించి పదవిలో కొనసాగుతున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో తప్పిదాలు చేశారంటూ మేయర్ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. వీటితో పాటు నాలుగేళ్లుగా మేయర్ కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం, అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలను కూడా ఆ లేఖల్లో ప్రస్తావించారు. ఈ వాస్తవాలను, మేయర్ పాలనా విధానాన్ని, ఆమె హయాంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పడిన ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధినేతను కోరారు. మెజార్టీ కార్పొరేటర్లు పార్టీకి ఎందుకు దూరమయ్యారో వాస్తవాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: (జనసేనలో భగ్గుమన్న విభేదాలు) నేడో రేపో బాబుతో భేటీ టీడీపీలో ఉన్న కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా చంద్రబాబుకు తమ వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ పక్షాన ఉన్న సుమారు 9 మంది కార్పొరేటర్లు చంద్రబాబును స్వయంగా కలిసి కాకినాడలో మేయర్ దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం. టీడీపీలో తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. -
పావని మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, చిత్తూరు: వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతి పావని కేసు విషాదాంతమైంది. ఓ వ్యవసాయ బావిలో మంగళవారం ఆమె మృతదేహం లభ్యమైంది. రామకుప్పం (మ) మునింద్రంకు చెందిన పావని వారం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కాగా, పావని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె స్నేహితుడు మునిరత్నమే పావనిని హత్య చేశాడని ఆరోపిస్తూ అతని ఇంటిపై దాడి చేశారు. అయితే, వారు దాడికి దిగిన సమయంలో పరారీలో ఉన్న నిందితుడు మునిరత్నం ముణేంద్రం సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది
సూర్యాపేట : ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ, అతని విధానాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మరో యువకుడితో పెద్దలు కుదిర్చిన వివాహానికి ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా అయ్యింది. మాజీ ప్రేమికుడు.. తనతో ఆ అమ్మాయి చనువుగా ఉన్న ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, వారి కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో పెళ్లి ఆగింది. పెళ్లి ఆగడంతో పాటు కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన యువతి ప్రాణం తీసుకుంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన కునుకుంట్ల వెంకన్న పెద్ద కూతురు పావని (21) ఈ నెల 6న సూర్యాపేటలోని చింతలచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లింది. 9న బయటకు వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు అర్వపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి సూర్యాపేట టూటౌన్కు బదిలీ చేశారు. పెళ్లి ఆగిపోవడంతో.. పావని.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జీఎన్ఎంగా పనిచేస్తోంది. సొంత ఊరుకు చెందిన బొడ్డుపల్లి వంశీ, పావని కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత వంశీ విధానాలు నచ్చక.. అతన్ని దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుది రింది. నిశ్చితార్థం కూడా అయ్యింది. విషయం తెలిసిన వంశీ గతంలో తాను పావనితో దిగిన ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, అతని బావకు పంపాడు. ఈ ఫొటోలను చూసి వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న పావనిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి మందలించారు. కొద్దిరోజులు సూర్యాపేటలో ఉండమని బంధువుల ఇంటికి పంపారు. దీంతో పరువుపోయిందని మనస్తాపానికి గురైన పావని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పత్తిచేనులో శవమై.. తిమ్మాపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద పత్తిచేనులో యువతి మృతదేహం ఉందని సమచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పావనిదిగా గుర్తించి సూర్యాపేట టూటౌన్ పోలీ సులకు సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాని కి పోస్టుమార్టం జరిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పావని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. ముగ్గురిపై కేసు నమోదు.. పావని ఆత్మహత్యకు కారకుడైన బొడ్డుపల్లి వంశీతోపాటు పెళ్లి ఆగిపోవడానికి వంశీకి సహకరించిన నూకల శ్రీకాంత్, శ్యాంరెడ్డిలపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు, ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. -
హీరోయిన్ పావని గ్లామర్ ఫోటోలు
-
ఒక ఇంటివారయ్యారు
గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది. -
మేయర్ గారి షి‘కారు’కు..
జిల్లా కేంద్రమైన కాకినాడ నగరానికి ఆమె ప్రథమ పౌరురాలు. ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పదవిలో ఉన్న ఆమె.. అదే ప్రజల సొమ్ము దుబారాగా ఖర్చు చేస్తూ.. దర్జాగా షి‘కారు’ చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను సహితం తుంగలో తొక్కి.. అధికారమే అండగా.. కౌన్సిల్లో ప్రత్యేకంగా తీర్మానం ఆమోదింపజేసుకుని మరీ.. తన కారు కోసం ప్రతి నెలా నగరపాలక సంస్థ ఖజానా నుంచి రూ.45 వేలు తీసుకుంటున్నారు. కాకినాడ మేయర్ సుంకర పావని సాగిస్తున్న ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ: నగరపాలక సంస్థల్లో మేయర్లకు, కార్పొరేటర్లకు; పురపాలక సంఘాల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలపై ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది. ఆయా స్థానిక సంస్థల స్థాయి, ప్రాధాన్యాన్ని బట్టి నెలనెలా చెల్లించాల్సిన వేతనాన్ని నిర్ధారిస్తూ 2016 డిసెంబర్ 15న పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవోఎంఎస్ నంబర్ 335 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆయా కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో రికార్డు చేసి, అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేయర్కు ప్రయాణ భత్యంతో కలిపి గౌరవ వేతనాన్ని రూ.30 వేలు. వాస్తవానికి 2016లో జీవో సవరణకు ముందు ఈ మొత్తం రూ.14 వేలు మాత్రమే ఉండగా, దీనిని రెట్టింపు పైగా పెంచారు. అలాగే డిప్యూటీ మేయర్ల గౌరవ వేతనం రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలుగా నిర్ధారించారు. దీని ప్రకారం ఆయా స్థానిక ప్రజాప్రతినిధులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాకినాడ మేయర్ సుంకర పావనికి కూడా ఈ ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా రూ.30 వేల గౌరవ వేతనాన్ని నగరపాలక సంస్థ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. 2017 ఆగçస్టులో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా ఎన్నికైన నాటి నుంచి ఈ మొత్తాన్ని ఆమెకు ఇస్తూనే ఉన్నారు. ఆమె తన కోసం ప్రత్యేకంగా ఓ కారు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ అధికారాన్ని, హోదాను, మెజారిటీని అడ్డం పెట్టుకుని కారు కోసం కౌన్సిల్లో తీర్మానం కూడా చేయించేశారు. అనంతరం టెండర్ పిలిచి మరీ మేయర్కు కారు కేటాయించారు. నిర్వహణ, డ్రైవర్ జీతంతో కలిపి మేయర్ వినియోగిస్తున్న ఆ కారు కోసం నగరపాలక సంస్థ ప్రతి నెలా రూ.45 వేల చొప్పున చెల్లిస్తోంది. ఒకవైపు మేయర్ హోదాలో రూ.30 వేల గౌరవ వేతనం ఇస్తూనే.. దీంతోపాటు కారుకు రూ.45 వేల చొప్పున ఇచ్చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ అదనపు సొమ్మును అలవెన్స్ రూపంలో నగరపాలక సంస్థే భరిస్తోంది. రెండేళ్లకు కలిపి సుమారు రూ.10.80 లక్షల వరకూ మేయర్ కారు కోసం చెల్లించినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ.. ఏదైనా అంశంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా కౌన్సిల్ తీర్మానం చేస్తే.. ఆ తీర్మానాన్ని విధిగా ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదిస్తేనే ఆ తీర్మానం అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే మేయర్కు కారు ఏర్పాటు చేసే విషయంలో ఈ నిబంధనలను నాటి నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. కౌన్సిల్ పరంగా ఓ తీర్మానాన్ని ఆమోదింపజేసి, మేయర్కు కారు ఏర్పాటు చేసి, ప్రతి నెలా రూ.45 వేల చొప్పున కాంట్రాక్టర్కు చెల్లించేస్తున్నారు. కౌన్సిల్కు ఎన్ని అధికారాలున్నా ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను అడ్డగోలుగా ఉల్లంఘించి, తీర్మానం చేయడం, అధికారులు సైతం దీనికి సై అనడం విమర్శలకు తావిస్తోంది. ఇలా మేయర్కు ప్రత్యేకంగా కారు అలవెన్స్ చెల్లించడం తప్పని తెలిసినా.. అప్పటి అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడీ ఈ వ్యవహారం కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్ తీర్మానం మేరకే.. మేయర్కు కారు ఏర్పాటు చేయాల్సిందిగా అప్పట్లో కౌన్సిల్ తీర్మానం చేసింది.ఆ తీర్మానానికి అనుగుణంగానే టెండర్ ద్వారా కారు తీసుకునిమేయర్కు ఇచ్చాం.– సత్యనారాయణరాజు,డీఈ, కాకినాడనగరపాలక సంస్థ -
తాత.. నాన్న.. ఓ తణుకు అమ్మాయి
తణుకు అర్బన్: మూగ జీవాలపై ఆ బాలికకు విపరీతమైన ప్రేమ.. వాటికి ఎక్కడ ఏ కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే అక్కడ వాలిపోతుంది. అక్కున చేర్చుకుని వాటిని ఆరోప్రాణంగా కాపాడుతుంది. ఆమే తణుకుకు చెందిన జనత హాస్పటల్ దంత వైద్యుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె పావని వర్మ. ఈ వారసత్వం ఆమెకు తాతయ్య డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు(జనతా రాజు), నాన్న సుందరరామరాజుల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. తణుకు లయన్స్క్లబ్ ప్రాంతంలోని నివాసం వద్ద అవుట్ హౌస్లో తాత, నాన్న, పావని ఎప్పటి నుంచో వివిధ రకాల కోళ్లు, బాతులు, కవుజు పిట్టలు, కుందేళ్లను సంరక్షిస్తున్నారు. పావని మరో అడుగు ముందుకేసి జంతు సంరక్షణ చేస్తూ యానిమల్ రెస్క్యూ టీంని సృష్టించేందుకు ప్రయతిస్తోంది. అకారణంగా ఏ జంతువును ఇబ్బంది పెట్టినా వారిపై సంబంధిత అ«ధికారులకు ఫిర్యాదుతో పాటు సదరు జంతువును రక్షించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తిగా వాలంటీర్లను నియమించేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. మూగజీవాల సంరక్షణకు ఇప్పటికే తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును స్థలం ఇప్పించాల్సిందిగా కోరిగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పావని చెప్పింది. తనకు మూగజీవాలంటే ఇష్టమని, అయితే చదువు పరంగా తాను ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వీరి వద్ద చైనా కోళ్లు, పోలీస్ క్యాప్ కోళ్లు, కజానా బాతులు, గిరిరాజు కోళ్లు ఉన్నాయి. వీటి సంరక్షణకు సీసీ కెమెరాలతో పాటు సెయింట్ బెర్నాడ్ జాతికి చెందిన సింహాల్లాంటి మూడు శునకాలు కూడా గస్తీ నిర్వహించడం విశేషం. జంతువులంటే పిచ్చిప్రేమ కుక్కలు, గోవులతో పాటు ఇతర జంతువులంటే మా అమ్మాయికి ఎంతో ఇష్టం. వాటిని బాధించకూడదని తాపత్రయపడుతుంది. ఐదేళ్లుగా మా ఇంటి ఆవరణలో నాన్న సహకారంతో వివిధ రకాల కోళ్లు, బాతులు, కుందేళ్లు, కౌజు పిట్టలను సంరక్షిస్తున్నాను. వాటిని చూసిన మా అమ్మాయి చలించిపోయి యానిమల్స్ రెస్క్యూ టీంను ఏర్పాటుకు నాంది పలికింది. – డాక్టర్ దాట్ల సుందరరామరాజు, జనతా హాస్పటల్ వైద్యుడు -
రాయలసీమ ప్రేమకథ
‘‘రాయలసీమ లవ్స్టోరీ’ ట్రైలర్లో ‘ఇడియట్’ సినిమా యాటిట్యూడ్ కనపడుతోంది. కర్నూల్లో షూట్ చేసిన ఏ సినిమా అయినా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూల్ నేపథ్యంలో వస్తున్న ‘రాయలసీమ లవ్స్టోరీ’ ఇంకెంత హిట్ అవుతుందో ఊహించుకోవచ్చు. రామ్లో మంచి ప్రతిభ, పవర్ కనపడుతున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ మంచి భవిష్యత్ ఉండాలి’’ అని డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్స్టోరీ’. రాయల్ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, ఆడియో బిగ్ సీడీలను జి.నాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘మొదటి నుంచి మమ్మల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన నాగేశ్వర్ రెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క లైన్ చెప్పగానే నన్ను నమ్మి పది రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేయించారు నిర్మాతలు. వారు నాకు జీవితం ఇచ్చారు. కథకు తగ్గ కరెక్ట్ టైటిల్ ‘రాయలసీమ లవ్స్టోరీ’’ అన్నారు. ‘‘రాయలసీమ అనగానే అందరికీ బాంబులు, ఫ్యాక్షన్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఈ చిత్రం నిర్మించాం’’ అన్నారు రాయల్ చిన్నా. ‘‘అను కున్న సమయానికి సినిమా పూర్తయింది. ఔట్పుట్ కూడా బాగా వచ్చింది. ఈ నెల 27న సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు నాగరాజు. ‘‘నిర్మాతల సహకారం వల్లే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి ఎలేంద్ర. వెంకట్, హృశాలి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ మహేందర్. -
స్నేహితుడి కోసం...
పవన్, శైలజ జంటగా జి.మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరాదోస్త్’. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై పి.వీరారెడ్డి నిర్మించారు. వి.సాయిరెడ్డి స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర పాటలను తెంగాణ వాటర్ బోర్డ్ చైర్మన్ వి.ప్రకాశ్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. జి.మురళి మాట్లాడుతూ– ‘‘డైనమిక్లాంటి అమ్మాయి ఒక బలహీనుణ్ని ప్రేమిస్తుంది. ఓ సందర్భంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. ఆ బలహీనుడి మిత్రుడైన హీరో... ఆ రాక్షసుడ్ని సంహరించి ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మేరాదోస్త్’. వీరారెడ్డిగారు ఇచ్చిన సహకారంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మురళి చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాం. ‘మేరాదోస్త్’ అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు పి.వీరారెడ్డి. ‘‘సినిమా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. ఆరో తరగతి నుంచే సినిమాలు విపరీతంగా చూసేవాణ్ణి. అల్లాణి శ్రీధర్గారి వద్ద దర్శకత్వశాఖలో పని చేశాను. అనుకోనుకుండా రాజకీయాల్లోకి వెళ్లాను. ఆ తరుణంలోనే తెంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో సినిమాకు దూరమయ్యాను. ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని ఉంది’’ అన్నారు వి.ప్రకాశ్. నిర్మాత సాయి వెంకట్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వి.సాయిరెడ్డి, కెమెరా: సుధీర్. -
చదువుకోవాలని ఉంది.. లేఖ రాసి విద్యార్థిని
బంజారాహిల్స్: తానిక్కడే ఉంటే పెళ్లి చేస్తారని, తనకు ఉన్నత చదువులు చదువుకోవాలని ఉందని ఎక్కడైనా హాస్టల్లో ఉండి చదువుకుంటానంటూ లేఖ రాసి ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్గూడ శివమ్మపాపిరెడ్డిహిల్స్ బ్రహ్మశంకర్నగర్లో ఉంటున్న ఈశ్వరమ్మ–ఎల్లయ్య దంపతుల కూతురు ఆర్. పావని(16)ఈ నెల 9న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ‘తనకు చదువుకోవాలని ఉందని ఏదైనా హాస్టల్లో చేరుతానంటూ లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 7901103898 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రాయలసీమ ప్రేమకథ
వెంకట్ హీరోగా, హృశాలి, పావని హీరోయిన్లుగా రామ్ రణధీర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. ఏ వన్ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై పంచలింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రం నిర్మించారు నిర్మాతలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఔట్ పుట్ ఇచ్చాను. యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్, టీజర్కు మేం ఊహించినదానికంటే ఎక్కువ స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రం టీజర్కు వచ్చిన స్పందన చూసి సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నాం’’ అని రాయల్ చిన్నా, నాగరాజు అన్నారు. నాగినీడు, నల్లవేణు, పృథ్వీ, జీవా, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు తదితరులు నటించారు. -
అందమైన లవ్స్టోరీ
అర్జున్, మధుసూదన్, పావని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అందమా అందుమా’. శ్రీ కృపామణి ఫిలిమ్స్ పతాకంపై ప్రళయ కావేరి మధుసూదన్రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రళయ కావేరి మధుసూదన్రావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. యువతరంతో పాటు కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది. కథానుగుణంగా ఉన్న నాలుగు ఫైట్స్ని అవినాష్ మాస్టర్ చక్కగా కంపోజ్ చేశారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. పావని ఇప్పటి వరకూ పలు సినిమాలు చేసినా ఇందులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. అర్జున్కి మంచి పేరుతో పాటు నటుడిగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథ పరంగా సాగుతుంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. ఆత్రేయ, కెమెరా: ధీరజ్. -
‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది’
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ తిరునగరి ప్రశాంత్ ఆత్మహత్యకు అతడి భార్య పావని కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు పావనిని అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 306 కింద (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కేసు నమోదు చేశారు. పైళ్లైన కొద్ది రోజుల తర్వాత తన భార్య వేముల ప్రణయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రశాంత్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. వారిని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రశాంత్, పావని మధ్య గతంలో జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్ అంటే ఏమాత్రం, తనను వదిలేయాలని పావని చెబుతున్నట్టు ఆడియోలో స్పష్టంగా ఉంది. ప్రేమగా చూసుకుంటానని భర్త ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చచ్చిపోతానని బెదిరించిన ఆమె భయపడలేదు. తనకు ప్రణయ్ ముఖ్యమని, భర్త కాదని తేల్చిచెప్పింది. (పరువుపోయింది.. చచ్చిపోతున్నా..) ఆడియోలో ఏముంది..? ‘నువ్వో పనికిరానివాడివి. నన్ను సరిగా చూసుకోలేదు. నీతో కలిసుండాలని నాకు లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు నాతో ఉండలేవు. నీ మీద నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నిన్ను వదిలి వెళ్లిపోతా. వెళ్లేటప్పుడు నీకు చెప్పే వెళ్లిపోతాను. పెళ్లికి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అతడిని ఏమీ అనొద్దు. తప్పంతా నాదే. ఏదన్నా ఉంటే నన్ను అను. లేదంటే నిన్ను నువ్వు అనుకో. నన్ను నువ్వు పూర్తిగా అంగీకరించలేద’ని పావని పేర్కొంది. ‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది. నువ్వంటే చచ్చేంత ప్రేమ నాకు. పెళ్లైన కొత్తలో ఎలా ఉన్నావో అలాగే ఉండు. ప్రణయ్ను నీ లైఫ్లోంచి తీసేయ్. అదొక్కటే కోరుకుంటున్నా. ప్రణయ్ మన మధ్య రావడం వల్లే నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతానంటున్నావు. ప్రణయ్ మన జీవితాన్ని నాశనం చేశాడు. దయచేసి వాడిని వదిలేయ్. నువ్వు కాదంటే చచ్చిపోతాన’ని ప్రశాంత్ భార్యను బతిమాలుకున్నట్టు ఆడియోలో రికార్డైంది. -
అది మా అదృష్టం
‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’ సినిమా మూడు సార్లు ఆగిపోయింది. ఆరు మంది నిర్మాతలు మారారు. చివరకు మా ఫ్రెండ్ వబ్బిన వెంకట్రావు నిర్మాతగా ఈ సినిమా పూర్తి చేశాం’’ అని డైరెక్టర్ రామస్వామి అన్నారు. ‘‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో రామస్వామి మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురువారం విడుదలైంది. మా సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రానికి మేం పోటీ కాదు. మాకు ఎన్టీఆర్ గారంటే గౌరవం, త్రివిక్రమ్గారంటే ఇష్టం. వాళ్ల సినిమా మధ్య మా చిత్రం విడుదల చేయడం మా అదృష్టం. ఆ సినిమాకు వచ్చిన ఓవర్ ఫ్లోతో మా హాల్ నిండినా చాలనుకున్నాం’’ అన్నారు. డా.మల్లె శ్రీనివాసరావు, భరత్ బండారు, వబ్బిన వెంకట్రావు, సంగీత దర్శకుడు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. -
చచ్చేదాకా కలిసి ఉండటమే
‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. రామస్వామి దర్శకత్వంలో డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. పాటల రచయిత భాస్కరభట్ల, సంగీత దర్శకుడు సాయికార్తీక్ చిత్ర ట్రైలర్ను, పాటలను విడుదల చేశారు. రామస్వామి మాట్లాడుతూ– ‘‘ప్రేమంటే చంపుకోవడమో, చావడమో కాదు.. చచ్చేదాకా కలిసి బతకటం. కన్నవాళ్ల కలలతో పాటు, ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లుతుంది. మా నిర్మాత, సమర్పకులే నన్ను నడిపించారు. మా చిత్రంలో చంద్రబోస్గారు రాసిన పాట గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటారు’’ అన్నారు. ‘‘మా స్మైల్ పిక్చర్స్ బ్యానర్లో ఇది తొలి సినిమా. మా టీమ్ చాలా కష్టపడి చేశారు’’ అన్నారు వెంకట్రావు. చిత్ర సమర్పకులు డా. మల్లె శ్రీనివాస్, డైరెక్టర్ దేవీప్రసాద్, నటులు భరత్, అర్జున్ యజత్, పావని, సీమా చౌదరి, సంగీత దర్శకుడు కృష్ణసాయి, ఆర్ట్ డైరక్టర్ రమణ, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్ నేర్చుకొంటూ యువతి దుర్మరణం
ఆరిలోవ(విశాఖ తూర్పు): డ్రైవింగ్ నేర్చుకొంటూ డివైడర్ని ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చినవాల్తేరు ప్రాంతానికి చెందిన పావని(16) నగరంలోని రామాటాకీస్ దరి మహవీర్ బుక్ షాపులో పనిచేస్తుండేది. ఆమెకు ఆరిలోవ ప్రాంతం జైభీమ్ నగర్కు చెందిన కిరణ్తో పరిచయమైంది. కిరణ్ ఆమెకు బైక్ డ్రైవింగ్ నేర్పడానికి ఆదివారం ఉదయం బీచ్రోడ్డులో రుషికొండ తీసుకెళ్లాడు. బీచ్ రోడ్డులో డ్రైవింగ్ నేర్చుకొనే క్రమంలో బేపార్కు వద్ద మలుపులో ఆమె నడుపుతున్న బైక్ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు పొట్టలో బలమైన గాయమైంది. అదే సమయంలో నడకకోసం వెళ్లిన వారు 108కి సమాచారం అందించి కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. పావని పెదనాన్న పీలా రమణ ఫిర్యాదు మేరకు ఆరిలోవ ఏఎస్ఐ బ్రహ్మాజీ కేసు నమోదు చేశారు. -
ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయి!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: శ్రీగౌతమి హత్య కేసు పరిశోధించిన తీరుపై సవాలక్ష అనుమానాలు.. అది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని అందరూ మొత్తుకుంటున్నా.. ఆ ఘటన చుట్టూ అనేక సందేహాలు రేకెత్తుతున్నా.. పది రోజుల్లోనే దీన్ని ప్రమాద కేసుగా పోలీసులు అటకెక్కించడానికి ఏ ఒత్తిళ్లు పని చేశాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఏఎస్పీ స్థాయి అధికారిని విచారణ కోసం పంపినా కేసులో ఏ మాత్రం పురోగతి కనిపించలేదు. ఘటన జరిగిన నాటి నుంచి చెబుతున్న ప్రమాద కోణానికే పోలీసులు విచారణను పరిమితం చేశారు. కిందిస్థాయి అధికారి ఇచ్చిన నివేదికనే విలేకరుల సమావేశంలో చదివేసి ఇది వందశాతం ప్రమాదంగానే తేల్చిపారేశారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు. పావని వాదనను పట్టించుకోని పోలీసులు అయితే ఘటన జరిగి, ప్రమాదంలో తన అక్క శ్రీగౌతమి మృతి చెందిందని తెలిసిన రోజు నుంచీ, ఇది ముమ్మాటికీ హత్యేనని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డ పావని చెబుతూ వస్తోంది. తన అక్కకు టీడీపీ నేత సజ్జా బుజ్జితో వివాహం జరిగిందని, అతని భార్య నుంచి గౌతమి బెదిరింపులను ఎదుర్కొంటుందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే ఆమె చెప్పిందంతా అరణ్య రోదనగానే మిగిలింది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అంతేకాదు గౌతమి చనిపోయిందని తెలియక ముందు.. మొదటి మూడు రోజులూ కూడా పావని తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే యత్నం చేశారని చెప్పింది. సజ్జా బుజ్జితో రహస్య వివాహం, ఇతర విషయాలు పక్కన పెడితే కనీసం టీజింగ్ అంశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టకపోవడాన్ని ఆనాడే ‘సాక్షి’ ప్రశ్నించింది. అయితే తాము సరైన కోణంలోనే విచారణ చేస్తున్నామంటూ ఉన్నతాధికారులు వాదించారు. కేవలం రెండు సెక్షన్లలో నిందితులపై కేసు నమోదు చేసి ఊరుకున్నారు. ప్రమాదంలో శ్రీగౌతమి మృతికి కారణమైనందుకు 304 (ఏ),పావని గాయాలపాలైనందుకు 338 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈవ్టీజింగ్ కోణాన్నీ పోలీçసులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ప్రజాప్రతినిధులపైనా ఆరోపణలు తన అక్కను సజ్జాబుజ్జి రెండోపెళ్లి చేసుకున్నాడని, అతని భార్య తన అక్కను బెదిరించేదని చెప్పినా, రెండోపెళ్లి ఆధారాలు చూపినా సజ్జా బుజ్జిని కనీసం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వారిని ఒక ప్రైవేటు గెస్ట్హౌస్కు పిలిపించి మాట్లాడి పంపించేయడం వెనుక ఒక ఉన్నత ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును క్లోజ్ చేయించడానికి నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు పావని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యేలు ఈ కేసును సక్రమంగా విచారించే దిశగా అధికారులపై ఒత్తిడి తేలేదు. నిందితులంతా తమ పార్టీకి చెందిన వారు కావడంతో ఈ కేసును ప్రమాదంగా మూసేయించేందుకు రాజధాని స్థాయిలో యత్నాలు జరిగాయి. రెండోపెళ్లి చేసుకోవడం నేరమని తెలిసినా, బాధితులు ఫిర్యాదు చేసినా సజ్జా బుజ్జిని అరెస్టు చేసే ధైర్యం కూడా అప్పటి పోలీసు అధికారులు చేయలేకపోయారు. ప్రమాదానికి కారణమైన కారు విశాఖపట్నం నుంచి రావడం, అదే సమయంలో గౌతమి కూడా విశాఖపట్నంలో చదువుతుండటంతో, కోడి పందేలు చూడటానికి వచ్చామని పట్టుబడిన డ్రైవర్, అతని స్నేహితుడు చెబుతున్న అంశాలకు పొంతన లేకపోవడంతో ఇది హత్యేనన్న అనుమానాలు వచ్చాయి. పావని పోరాటం వల్లే.. పావని బతికి బయట పడటం, పట్టు వదలకుండా అన్ని ఆధారాలు తానే సేకరించి డీఎస్పీ నుంచి డీజీపీ కార్యాలయాల వరకు తిరిగి తమకు న్యాయం చేయాలని చేసిన పోరాటం కారణంగానే సీఐడీ దర్యాప్తు చేయడం, వారు తమ వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా కేసును ముందుకు తీసుకుపోవడంతో ఈ కేసు హత్య కేసుగా మార్పు చెందింది. ఇప్పటికైనా పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టకపోతే నిందితులు దర్జాగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఏదేమైనా శ్రీగౌతమి కేసు జిల్లా పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ వైఫల్యానికి కారకులను గుర్తించి నివేదిక పంపామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఎస్పీ ఎం.రవిప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. నిందితులపై టీడీపీ వేటు గౌతమి హత్య కేసులో అరెస్టయిన నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, దర్భరేవు మాజీ సర్పంచ్ సజ్జా బుజ్జి, టీడీపీ దర్భరేవు గ్రామ అధ్యక్షుడు బొల్లంపల్లి రాంప్రసాద్(రమేష్)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. -
పిసినారి పాట్లు
హోమానంద్, పావని జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ హోమానంద్’. జైరామ్ కుమార్ దర్శకుడు. ఓం తీర్థం ఫిల్మ్ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. హోమానంద్ మాట్లాడుతూ – ‘‘మా నాన్న పేరు కేశవ తీర్థ. ఈ సినిమాకి నిర్మాత ఆయనే. మా బ్యానర్లో ‘బెజవాడ పోలీస్ స్టేషన్’తో పాటు మరో సినిమా చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లోకొచ్చాను. బీబీఏ డిగ్రీ పూర్తి చేశాను. మొదట షార్ట్ ఫిల్మ్స్లో నటించాలనుకున్నాను. అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. సత్యంగారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న మెళకువలు సెట్స్లో బాగా ఉపమోగపడ్డాయి. సినిమా కథ విషయానికొస్తే.. నాది పిసినారి పాత్ర. కూడబెట్టుకున్న డబ్బుతో ఓ ఇల్లు కొంటాను. ఆ ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇంట్లో దెయ్యం ఏంటి? దెయ్యమో, నేనో తేల్చుకోవాలి. సింపుల్గా సినిమా కథ ఇది. హారర్ కామెడీతో సినిమా అంతా నవ్విస్తుంది. దర్శకుడు జైరామ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఆయన కథ చెప్తున్నప్పుడే నాకు, నా ఫ్యామిలీకి నచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది. రాజా వన్నెంరెడ్డిగారితో ఓ సినిమా చేయబోతున్నాను. దర్శకులు సుకుమార్, మారుతీల ప్రొడక్షన్స్లో నటించేందుకు డిస్కషన్స్ జరుగుతున్నాయి’’ అన్నారు. -
హోమానంద్ కామెడీ
హోమానంద్, పావని జంటగా జైరామ్ కుమార్ దర్శకత్వంలో ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ హోమానంద్’. బోలే షావళి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేశారు. ట్రైలర్, బిగ్ సీడీని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘మిస్టర్ హోమానంద్’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘హారర్, కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది’’ అన్నారు జైరామ్ కుమార్. ‘‘మా గురువుగారు కేశవ తీర్థగారి వల్లే సినిమారంగంలోకి వచ్చా. మంచి అవుట్ఫుట్ వచ్చింది. సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం. ఇంద్రసేనా రెడ్డి. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. నా నటన చూసి సీనియర్ యాక్టర్లా చేసావని అంటుంటే వెరీ హ్యాపీ’’ అన్నారు హోమానంద్. -
పావని మృతి కేసులో మలుపులు!
పాలకొండ: పాలకొండలో చంచలనం కలిగించిన డైట్ విద్యార్థిని పాలక పావని మృతి కేసు పలు మలుపులు తిరుగుతోంది. మూడు రోజులుగా పోలీసులు కేసును ఛేదించలేకపోయారు. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో సీతంపేటకు చెందిన అధికార పార్టీ నాయకుడు జిల్లాకు చెందిన ఓ మంత్రితో పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. దీంతో పావని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేలా దర్యాప్తు సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో హత్య జరిగినట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చిన పోలీసులు ప్రస్తుతం మంత్రి జోక్యంతో కేసును నీరుగారుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో ఆరు అంగులాల వరకూ గొంతు కోసి ఉండడంతో పావనిని హత్య చేశారని వైద్యులు నిర్థారించారు. దీంతో ఇప్పటికే ఇంటి యజమాని సహ ఎనిమిది మందిని పోలీసులు విచారించారు. మరి కొంతమందిని అదుపులో ఉంచి విచారిస్తున్నారు. ఎమ్మెల్యే ఆగ్రహం కేసు విషయంలో జరుగుతున్న రాజకీయ వ్యవహారంతో ఎమ్మెల్యే కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళను హత్యచేసినా పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. ఈ విషయమై ఆమె ఎస్పీ త్రివిక్రమవర్మతో ఫోన్లో మాట్లాడారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో కేసును పక్కతోవ పట్టిస్తే ఆందో ళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేయాలని, పోస్టుమార్టం నివేదిక బహిర్ఘతం చేయాలని కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేసును న్యాయబద్ధంగా చేయాలని ఇప్పటికే కోరామని, పోలీసులు మాత్రం కేసును నీరుగార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు వ్యవహారంలో సీతంపేటకు చెందిన ఓ నాయకుడు డబ్బులుకాజేసీ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలు స్తుందని ఆరోపించారు. గిరిజనులకు అన్యాయం జరిగేలా దర్యాప్తు సాగితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ సందర్శన పావని మృతిపై ఎస్పీ త్రివిక్రమవర్మ స్వయంగా పరిశీలనకు దిగారు. మరోసారి పాలకొండ శుక్రవారం వచ్చిన ఆయన పావని మృతిచెందిన ఇంటిని పరిశీలించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులతోనూ సంఘనా స్థలంలో వివరాలు తీసుకున్నారు. క్రైం డీఎస్పీ వేణుగోపాలనాయుడు, డీఎస్పీ స్వరూపరాణి, సీఐ వేణుగోపాలరావు, ఎస్సై వాసునారాయణ ఆయనతో పాటు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కాగా ఎస్పీ త్రివిక్రమవర్మ విలేకరులతో మాట్లాడుతూ పావని ముందుగా యాసిడ్ తాగి అనంతరం గొంతు కోసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. అయితే యాసిడ్ తాగించి హత్య చేశారా, లేక తానే ఆత్మహత్య చేసుకుందా అన్నది దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నామని చెప్పారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
మా మమ్మీ బండి మమ్మీ
పిల్లల్ని బడిబాట పట్టించినట్లుగా మహిళల్ని ‘బండిబాట’ పట్టించడానికి ‘ఆత్మనిర్భర్’ అనే డ్రైవింగ్ స్కూల్ను నడిపిస్తోంది పావని. ‘సాధికారత’కు ఆమె చెబుతున్న అర్థం.. ‘బండి నడపడం’. ఆమె చొరవతో మథురై, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి అమ్మా సాధికారతను ‘డ్రైవ్’ చేస్తోంది ‘‘ఫేస్బుక్లో బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఈ మాత్రం స్పందన చాలు ఇప్పటికిప్పుడు మొదలుపెట్టడానికి’’.. ఫేస్బుక్లోంచి లాగవుట్ అవుతూ అనుకుంది పావని ఖండేల్వాల్. ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసింది. కావల్సిన సమాధానమే వచ్చినట్టుంది. ఊరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుంది. పుణె నుంచి ఆమె తన సొంతూరు మథుర (యుపి) వెళ్తోంది. పుణెలోని సింబయోసిస్ యూనివర్సిటీలో బీబీఎమ్ చదివింది పావని. అక్కడే ఉద్యోగం కూడా చేస్తోంది. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనే ఆశయం. అయితే పావని అమ్మగారు ఆమె ఆలోచనకు వేరే రూపునిచ్చారు! అమ్మ నసే.. ఐడియా! ‘‘పావనీ.. నన్ను బజార్కు తీసుకెళ్లు, పావనీ.. అత్తవాళ్లింటి దగ్గర వదిలిపెట్టు.. పావనీ.. కాస్త కూరలు తెచ్చిపెట్టవా? పావనీ.. నన్ను అక్కడ డ్రాప్ చేయవా? పావనీ.. ఇక్కడున్నాను.. వచ్చి తీసుకెళ్లవా?’’ అంటూ అమ్మ రేఖ.. సెలవులకు వెళ్లినప్పుడల్లా తనకు పనులు పురమాయించేది. తను ఉన్న వారం రోజుల్లో పనులన్నీ చేసేసుకోవాలని అమ్మ ఆరాటం. అలా మూడు నెలల కిందట మ«థుర వెళ్లినప్పుడు అమ్మ తనను చాలానే విసిగించింది. ‘‘నువ్వు నేర్చుకోవచ్చు కదా బండి నడపడం? ఇలా నా మీదో.. నాన్న మీదో ఆధారపడేకంటే?’’ అంది అదే విసుగుతో పావని. ఆ మాటను మనసుకు తీసుకుంది పావని తల్లి. లేడీ ట్రైనర్ కోసం చాలా వెదికింది. ఎవరూ దొరకలేదు. ఆమె పట్టుదల చూసి చివరకు తనే వారం రోజులు సెలవు పొడిగించుకుని, మథురలో ఉండి మరీ అమ్మకు బండి నేర్పించింది. అప్పుడు తట్టింది పావనికి ఐడియా! ఆ ఐడియా ఇప్పుడు ఓ ఆకారం దిద్దుకోబోతోంది. ట్రైన్ ఆగింది. స్టేషన్లో దిగింది పావని. మహిళలా! మథురలోనా?! అమ్మకు తను డ్రైవింగ్ నేర్పడానికి ముందు, స్కూటీ నేర్పే లేడీ ట్రైనర్ కోసం వెదకుతుంటే అర్థమైంది పావనికి.. లేడీ ట్రైనర్స్ అవసరం ఎంతుందో. అప్పుడే అలాంటి ప్రాజెక్ట్కు అంకురం పడింది ఆమె మైండ్లో. అమ్మకు డ్రైవింగ్ నేర్పించి, మథుర నుంచి పుణె వెళ్లగానే దానికి సంబంధించి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసింది. చాలా మంది తమకూ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందనీ పుణె నుంచి పోస్టులు పంపారు. మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్కమీజ్కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చింది. మథుర వచ్చిన వెంటనే ‘ఆత్మనిర్భర్’ పేరుతో తను మొదలుపెట్టబోయే ‘ఆల్ విమెన్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్’ను రిజిస్టర్ చేయించింది. వెంటనే పనిలోకి దిగింది. డ్రైవ్ చెయ్యాలా.. వద్దా?! వారం గడిచేసరికి డ్రైవింగ్ నేర్చుకోడానికి ముందుకు వచ్చిన వాళ్లలో సగం మంది ‘ఎందుకులేబ్బా’ అని వెనక్కి తగ్గారు. పావని వాళ్ల అమ్మ నిరుత్సాహపడింది. అప్పటికే ఆమె స్కూటీ నడపడంలో పర్ఫెక్ట్ అయిపోయింది. డ్రైవింగ్ని ఆస్వాదిస్తోంది. ‘‘రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్టుంది’’ అంటుంది ఆమె. ఇంకొకరి మీద ఆధారపడకుండా బయట పనులన్నీ స్వయంగా చేసుకుంటే ఉండే సౌకర్యాన్ని, సాధికారతను, దర్పాన్నీ ఆమె అనుభవిస్తోంది. అదే మాట చెప్పింది.. తన కూతురు పెట్టిన డ్రైవింగ్ స్కూల్కి వచ్చిన మహిళలకు. కొంతమందికి ఆ మాటలు స్ఫూర్తినిచ్చాయి. డ్రైవింగ్ నేర్చుకోడానికి చేరారు. వాళ్ల సంఖ్య పెరిగేసరికి, నేర్పుతామని బయటి ఊళ్ల నుంచి వచ్చే మహిళా ట్రైనర్లూ పెరిగారు. ఇలా పద్దెనిమిది మందితో మొదలైన ఆ స్కూల్ నెల గడిచే సరికి 25 మందికి పెరిగింది. ఒకర్ని చూసి ఒకరికి ధైర్యం నలభై ఐదేళ్ల పావని వాళ్ల అమ్మ తన స్కూటీపై మథుర అంతా తిరుగుతుంటే ఆ వయసు వాళ్లకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. డ్రైవింగ్ స్కూల్లో ట్రైనర్స్ అంతా ఆడవాళ్లే అయ్యేసరికి ధైర్యమొచ్చింది. క్యూ కట్టారు స్కూల్కి. ఇప్పుడు దాదాపు యాభై మంది అయ్యారు నేర్చుకునేవారు. అంతా పదహారు నుంచి 48 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లే. చుట్టుపక్కల ఊళ్ల నుంచీ అప్లికేషన్లు పెరుగుతుండటంతో పక్కనే ఉన్న భరత్పూర్, జైపూర్లో కూడా బ్రాంచ్లను తెరిచింది పావని. ఆత్మనిర్భర్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న కొంతమంది అల్పదాయ మహిళలకు అందులోనే ట్రైనర్స్గా అవకాశం ఇస్తోంది పావని. అలా వాళ్లు తమ కుటుంబానికి చేదోడువాదోడు అవుతున్నారు. ఆత్మనిర్భర్ ఆలోచన రావడానికి, అది కార్యాచరణ దాల్చడానికి వాళ్లమ్మే కారణం కాబట్టి దానికి వాళ్లమ్మనే సీఈఓగా నియమించింది పావని. సింపుల్ అండ్ స్పీడ్ కోర్స్ పావని డ్రైవింగ్ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. కోర్సు వ్యవధి పది రోజులు. కోర్సు అయ్యాక బండి మెయిన్టెనెన్స్ గురించీ వివరిస్తారు. అంతేకాదు, లైసెన్స్ను ఇప్పించే బాధ్యతనూ ఆత్మనిర్భరే తీసుకుంటోంది. ఇలా.. పాతికవేల రూపాయల పెట్టుబడితో, రెండు స్కూటీలతో మొదలైన ఈ స్కూల్ యేడాది గడవకముందే ఏడాదికి ఆరు లక్షల ఆదాయానికి చేరుకుంది. ఇలా.. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలన్న పావని కల కూడా నెరవేరింది. బ్రేక్స్ లేకుండా డ్రైవింగ్ స్కూల్ను ముందుకు పరిగెత్తించడమే నా ధ్యేయం అంటోంది పావని. – శరాది మహిళా (డ్రైవింగ్) దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ ఆత్మనిర్భర్లో విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఓ వర్క్షాప్నూ నిర్వహించింది పావని. దీనికి మథుర చుట్టుపక్కల పట్టణాల నుంచే కాక రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇదికాకుండా ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని చిన్న చిన్న పట్టణాల్లోని మహిళల కోసం డ్రైవింగ్ క్యాంప్స్ను నిర్వహించనున్నట్లు చెప్పింది పావని ఖండేల్వాల్. అన్నట్టు పావని రాయల్ ఎన్ఫీల్డ్ ‘బైకర్ని’ కూడా! బైకర్ని అంటే ఫిమేల్ బైకర్ అని. -
మా మమ్మీ బండి మమ్మీ
పిల్లల్ని బడిబాట పట్టించినట్లుగా మహిళల్ని ‘బండిబాట’ పట్టించడానికి ‘ఆత్మనిర్భర్’ అనే డ్రైవింగ్ స్కూల్ను నడిపిస్తోంది పావని. ‘సాధికారత’కు ఆమె చెబుతున్న అర్థం.. ‘బండి నడపడం’. ఆమె చొరవతో మథురై, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి అమ్మా సాధికారతను ‘డ్రైవ్’ చేస్తోంది మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్కమీజ్కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం పావనికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నీ ఇచ్చింది. ‘‘ఫేస్బుక్లో బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఈ మాత్రం స్పందన చాలు ఇప్పటికిప్పుడు మొదలుపెట్టడానికి’’.. ఫేస్బుక్లోంచి లాగవుట్ అవుతూ అనుకుంది పావని ఖండేల్వాల్. ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసింది. కావల్సిన సమాధానమే వచ్చినట్టుంది. ఊరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుంది. పుణె నుంచి ఆమె తన సొంతూరు మథుర (యుపి) వెళ్తోంది. పుణెలోని సింబయోసిస్ యూనివర్సిటీలో బీబీఎమ్ చదివింది పావని. అక్కడే ఉద్యోగం కూడా చేస్తోంది. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనే ఆశయం. అయితే పావని అమ్మగారు ఆమె ఆలోచనకు వేరే రూపునిచ్చారు! అమ్మ నసే.. ఐడియా! ‘‘పావనీ.. నన్ను బజార్కు తీసుకెళ్లు, పావనీ.. అత్తవాళ్లింటి దగ్గర వదిలిపెట్టు.. పావనీ.. కాస్త కూరలు తెచ్చిపెట్టవా? పావనీ.. నన్ను అక్కడ డ్రాప్ చేయవా? పావనీ.. ఇక్కడున్నాను.. వచ్చి తీసుకెళ్లవా?’’ అంటూ అమ్మ రేఖ.. సెలవులకు వెళ్లినప్పుడల్లా తనకు పనులు పురమాయించేది. తను ఉన్న వారం రోజుల్లో పనులన్నీ చేసేసుకోవాలని అమ్మ ఆరాటం. అలా మూడు నెలల కిందట మ«థుర వెళ్లినప్పుడు అమ్మ తనను చాలానే విసిగించింది. ‘‘నువ్వు నేర్చుకోవచ్చు కదా బండి నడపడం? ఇలా నా మీదో.. నాన్న మీదో ఆధారపడేకంటే?’’ అంది అదే విసుగుతో పావని. ఆ మాటను మనసుకు తీసుకుంది పావని తల్లి. లేడీ ట్రైనర్ కోసం చాలా వెదికింది. ఎవరూ దొరకలేదు. ఆమె పట్టుదల చూసి చివరకు తనే వారం రోజులు సెలవు పొడిగించుకుని, మథురలో ఉండి మరీ అమ్మకు బండి నేర్పించింది. అప్పుడు తట్టింది పావనికి ఐడియా! ఆ ఐడియా ఇప్పుడు ఓ ఆకారం దిద్దుకోబోతోంది. ట్రైన్ ఆగింది. స్టేషన్లో దిగింది పావని. మహిళలా! మథురలోనా?! అమ్మకు తను డ్రైవింగ్ నేర్పడానికి ముందు, స్కూటీ నేర్పే లేడీ ట్రైనర్ కోసం వెదకుతుంటే అర్థమైంది పావనికి.. లేడీ ట్రైనర్స్ అవసరం ఎంతుందో. అప్పుడే అలాంటి ప్రాజెక్ట్కు అంకురం పడింది ఆమె మైండ్లో. అమ్మకు డ్రైవింగ్ నేర్పించి, మథుర నుంచి పుణె వెళ్లగానే దానికి సంబంధించి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసింది. చాలా మంది తమకూ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందనీ పుణె నుంచి పోస్టులు పంపారు. మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్కమీజ్కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చింది. మథుర వచ్చిన వెంటనే ‘ఆత్మనిర్భర్’ పేరుతో తను మొదలుపెట్టబోయే ‘ఆల్ విమెన్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్’ను రిజిస్టర్ చేయించింది. వెంటనే పనిలోకి దిగింది. డ్రైవ్ చెయ్యాలా.. వద్దా?! వారం గడిచేసరికి డ్రైవింగ్ నేర్చుకోడానికి ముందుకు వచ్చిన వాళ్లలో సగం మంది ‘ఎందుకులేబ్బా’ అని వెనక్కి తగ్గారు. పావని వాళ్ల అమ్మ నిరుత్సాహపడింది. అప్పటికే ఆమె స్కూటీ నడపడంలో పర్ఫెక్ట్ అయిపోయింది. డ్రైవింగ్ని ఆస్వాదిస్తోంది. ‘‘రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్టుంది’’ అంటుంది ఆమె. ఇంకొకరి మీద ఆధారపడకుండా బయట పనులన్నీ స్వయంగా చేసుకుంటే ఉండే సౌకర్యాన్ని, సాధికారతను, దర్పాన్నీ ఆమె అనుభవిస్తోంది. అదే మాట చెప్పింది.. తన కూతురు పెట్టిన డ్రైవింగ్ స్కూల్కి వచ్చిన మహిళలకు. కొంతమందికి ఆ మాటలు స్ఫూర్తినిచ్చాయి. డ్రైవింగ్ నేర్చుకోడానికి చేరారు. వాళ్ల సంఖ్య పెరిగేసరికి, నేర్పుతామని బయటి ఊళ్ల నుంచి వచ్చే మహిళా ట్రైనర్లూ పెరిగారు. ఇలా పద్దెనిమిది మందితో మొదలైన ఆ స్కూల్ నెల గడిచే సరికి 25 మందికి పెరిగింది. ఒకర్ని చూసి ఒకరికి ధైర్యం నలభై ఐదేళ్ల పావని వాళ్ల అమ్మ తన స్కూటీపై మథుర అంతా తిరుగుతుంటే ఆ వయసు వాళ్లకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. డ్రైవింగ్ స్కూల్లో ట్రైనర్స్ అంతా ఆడవాళ్లే అయ్యేసరికి ధైర్యమొచ్చింది. క్యూ కట్టారు స్కూల్కి. ఇప్పుడు దాదాపు యాభై మంది అయ్యారు నేర్చుకునేవారు. అంతా పదహారు నుంచి 48 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లే. చుట్టుపక్కల ఊళ్ల నుంచీ అప్లికేషన్లు పెరుగుతుండటంతో పక్కనే ఉన్న భరత్పూర్, జైపూర్లో కూడా బ్రాంచ్లను తెరిచింది పావని. ఆత్మనిర్భర్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న కొంతమంది అల్పదాయ మహిళలకు అందులోనే ట్రైనర్స్గా అవకాశం ఇస్తోంది పావని. అలా వాళ్లు తమ కుటుంబానికి చేదోడువాదోడు అవుతున్నారు. ఆత్మనిర్భర్ ఆలోచన రావడానికి, అది కార్యాచరణ దాల్చడానికి వాళ్లమ్మే కారణం కాబట్టి దానికి వాళ్లమ్మనే సీఈఓగా నియమించింది పావని. సింపుల్ అండ్ స్పీడ్ కోర్స్ పావని డ్రైవింగ్ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. కోర్సు వ్యవధి పది రోజులు. కోర్సు అయ్యాక బండి మెయిన్టెనెన్స్ గురించీ వివరిస్తారు. అంతేకాదు, లైసెన్స్ను ఇప్పించే బాధ్యతనూ ఆత్మనిర్భరే తీసుకుంటోంది. ఇలా.. పాతికవేల రూపాయల పెట్టుబడితో, రెండు స్కూటీలతో మొదలైన ఈ స్కూల్ యేడాది గడవకముందే ఏడాదికి ఆరు లక్షల ఆదాయానికి చేరుకుంది. ఇలా.. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలన్న పావని కల కూడా నెరవేరింది. బ్రేక్స్ లేకుండా డ్రైవింగ్ స్కూల్ను ముందుకు పరిగెత్తించడమే నా ధ్యేయం అంటోంది పావని. మహిళా (డ్రైవింగ్) దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ ఆత్మనిర్భర్లో విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఓ వర్క్షాప్నూ నిర్వహించింది పావని. దీనికి మథుర చుట్టుపక్కల పట్టణాల నుంచే కాక రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇదికాకుండా ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని చిన్న చిన్న పట్టణాల్లోని మహిళల కోసం డ్రైవింగ్ క్యాంప్స్ను నిర్వహించనున్నట్లు చెప్పింది పావని ఖండేల్వాల్. అన్నట్టు పావని రాయల్ ఎన్ఫీల్డ్ ‘బైకర్ని’ కూడా! బైకర్ని అంటే ఫిమేల్ బైకర్ అని. – శరాది -
మూడు పువ్వులు ఆరు కాయలు
అర్జున్ యజత్, భరత్ బండారు, రామస్వామి హీరోలుగా, సౌమ్య వేణుగోపాల్, పావని, సీమా చౌదరీలు హీరోయిన్లుగా డా. మల్లె శ్రీనివాసరావు సమర్పణ లో పెబ్బిన వెంకటరావు నిర్మాతగా రామస్వామి దర్శకత్వం వహించిన సినిమా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. ప్రేమ గొప్పదే.. కానీ జీవిత లక్ష్యం ఇంకా గొప్పది. ప్రేమ కోసం చావటం, చంపటం కాదు. మన కన్నవాళ్ల కలల్ని, మనం అనుకున్న లక్ష్యాన్ని నిజం చేస్తేనే జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. సినిమాలో హాస్య రసంతో పాటు కరుణరసం కూడా ఉంటుంది. 40 సినిమాలకు రచయితగా చేసిన రామస్వామిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘మంచి కాన్సెప్ట్తో సకుటుంబాన్ని ఆదరించేలా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు. తనికెళ్ల భరణి, అజయ్ఘోష్, కృష్ణభగవాన్ తదితరులు నటించారు. -
రాయలసీమ ప్రేమకథ
వెంకట్, హృశాలి, పావని ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘రాయలసీమ లవ్స్టోరీ’. రామ్ రణధీర్ దర్శకత్వంలో నాగరాజు, హుస్సేన్, ఇమ్మాన్యుయేల్ నిర్మిస్తున్న ఈ సినిమా కర్నూల్లో ప్రారంభమైంది. నర్వా రాజశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, ఆయన తనయుడు భరత్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘రాయలసీమ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలొచ్చాయి. అవన్నీ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కినవే. మా సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్స్టోరీగా రూపొందిస్తున్నాం. కర్నూల్లో పది రోజులపాటు మొదటి షెడ్యూల్ ఉంటుంది’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. -
ఆ విషయం నాకు ముందే చెప్పారు
‘గంగ, అంపశయ్య, ఎర్రబస్సు, ఎలుకా మజాకా, లావణ్య విత్ లవ్బాయ్స్’ తదితర సినిమాల్లో అలరించిన పావని నటించిన తాజా చిత్రం ‘లవర్స్ క్లబ్’. అనిష్ చంద్ర, ఆర్యన్, పూర్ణి ప్రధానపాత్రల్లో ధృవశేఖర్ దర్శకత్వంలో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. పావని మాట్లాడుతూ – ‘‘మా తాతగారికి స్టేజ్ అనుభవం ఉంది. నేను కూడా చాలా నాటకాల్లో నటించాను. సినిమా ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు మా నాన్నగారు, సోదరులు సపోర్ట్ చేశారు. ‘లవర్స్ క్లబ్’లో డాక్టర్గా చేశా. అనుకోని కారణాలు, సమస్యల వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చేస్తా. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాని ఐ ఫోన్లో షూట్ చేస్తామని నాకు ముందే చెప్పారు. నేను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. లీడ్ ఆర్టిస్ట్గా అవకాశాలు వస్తున్నాయి. లీడ్ అనే కాకుండా, నటనకు ఆస్కారం ఉండే పెద్ద చిత్రాల్లోనూ చేయాలని ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ నెల 13న ఓ సినిమా మొదలవుతుంది’’ అన్నారు. -
పావని మృతిపై జేసీ విచారణ
కడప అర్బన్ : చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని పావని మృతిపై విచారణ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్వేత తేవతీయ సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 7:30 గంటల వరకు తన చాంబర్లో విచారణ చేపట్టారు. విచారణలో పావని తల్లిదండ్రులైన శివమ్మ, మల్లేశ్వరరెడ్డిల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు శోభారాణి, ఆనంద్కుమార్, చింతకొమ్మదిన్నె ఎస్ఐ హేమకుమార్లను విచారణ చేసి వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. కాగా, ఇప్పటికే నారాయణ కళాశాల వద్దకు వెళ్లి అక్కడి విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని ఈనెల 13 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు విచారించారు. -
నూజివీడు ట్రిపుల్ఐటీలో మరణ మృదంగం
-
నారాయణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
నారాయణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కడప: నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పావని(17) హాస్టల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పావని ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించడానికి వెళ్లిన బంధువలను నారాయణ కాలేజీ సెక్యురిటీ సిబ్బంది అడ్డుకుంది. విద్యార్థిని బంధువులను హాస్టల్లోకి యాజమాన్యం అనుమతించలేదు. యాజమాన్యం తీరుకు నిరసనగా హాస్టల్ ఎదుట బంధువలు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట పావని మృతదేహంతో బంధువులు నిరసన తెలిపి, కాలేజీ తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆత్మహత్యపై విచారణకు ఆదేశం విద్యార్థిని ఆత్మహత్యపై విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. విద్యార్థిని పావని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్తో మాట్లాడారు. కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరి కళాశాల అయినా నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. -
స్వచ్ఛమైన ప్రేమ
సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లావణ్య విత్ లవ్బాయ్స్’. వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రాజ్యలక్ష్మి, సి. నర్సింలు పటేల్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. సినిమా ట్రైలర్, ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్. రాములు ట్రైలర్ విడుదల చేశారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘అమ్మాయి బాహ్య సౌందర్యాన్ని చూసి కాదు అంతరంగాన్ని తెలుసుకొని ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమిలేదనేది చిత్రకథ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: శరత్ చెట్టి. -
ప్రేమికుల అడ్డా
‘‘ఓ యువకుడు ప్రేమికులకు అండగా నిలబడుతుంటాడు. అటువంటి ఆ యువకుడి జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ‘లవర్స్ క్లబ్’ చిత్రంలో ఆసక్తికరం’’ అన్నారు దర్శకుడు ధృవ శేఖర్. అనీష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ధృవ శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. ఇంతవరకు ఎవరూ తీయని విధంగా ఫస్ట్ టైమ్ ఐ ఫోన్ టెక్నాలజీ ఉపయోగించి షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కథే బలమని ఇటీవల ప్రేక్షకులు నిరూపించారు. కథ బాగుంటే ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా తీశాం’’ అని భరత్ అవ్వారి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి, నేపథ్య సంగీతం: కమల్.డి, కెమెరా: డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మదన్ గంజికుంట, అవ్వారి ధను, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి. -
కొత్తవాళ్లను ప్రోత్సహించాలి
– రమణాచారి పావని, కిరణ్, యోధ, సాంబ ముఖ్య తారలుగా వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లావణ్య విత్ లవ్బాయ్స్’. నర్సింలు పటేల్చెట్టి, సి. రాజ్యలక్ష్మీ నిర్మించారు. యశోకృష్ణ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. రమణాచారి ఆవిష్కరించి, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు. ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. రమణాచారి మాట్లాడుతూ– ‘‘తేనె మనసులు’తో ఆదుర్తిగారు పరిచయం చేయకపోతే కృష్ణగారు, కొత్త నటీనటులు వద్దని దాసరిగారు అనుకుని ఉంటే మోహన్బాబుగారి లాంటి ప్రతిభావంతులు వచ్చి ఉండేవారు కాదు. తేజ, శేఖర్ కమ్ముల వంటి దర్శకులు కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. వడ్డేపల్లి కృష్ణ చక్కని కథాంశంతో కొత్త నటీనటులతో చేసిన చిత్రమిది. కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేవాళ్లు మరింతమంది రావాలి’’ అన్నారు. ‘‘ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుందనేదే కథ’’ అన్నారు వడ్డేపల్లి కృష్ణ. -
లావణ్య ప్రేమ
ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ. పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాథ్, హేమసుందర్, పావని, స్వరూప, యోధా, సాంబ, కిరణ్ ముఖ్య తారలు. రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమ్యాక్స్ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యువతరం మెచ్చే చక్కటి కథ, కథనాలతో పాటు మంచి మాటలు, పాటలు కుదిరాయి. నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ‘‘లావణ్య అనే అమ్మాయి కథే ఈ సినిమా. లవ్ బాయ్స్లో ఆమె మనసు సొంతం చేసుకున్నది ఎవరనేది ఆసక్తికరం. అన్ని వర్గాలవారూ చూడ్డదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమేరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ. -
ప్రేమ గొప్పతనం
‘పిల్లజమీందార్’, ‘పెద్దరికం’, ‘భైరవద్వీపం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ తదితర చిత్రాలకు పాటలు రాసిన డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకునిగా మారారు. పావని, పరమేశ్ యోధా, సాంబ, కిరణ్ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి చంద్రశేఖర్రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంటుంది. కథ, మాటలు, పాటలు అన్నీ బాగా కుదిరాయి. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అని తెలిపారు. కాశీ విశ్వనాథ్, డా. పరుచూరి గోపాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సమర్పణ: శరత్చెట్టి (యూఎస్ఏ). -
స్వచ్ఛతలో మున్సిపాలిటీ ఆదర్శం
చైర్పర్సన్ పావని సిరిసిల్ల : స్వచ్ఛతలో సిరిసిల్ల మున్సిపాలిటీ రాష్ట్రానికే ఆదర్శంగా ఉంటుందని చైర్పర్సన్ సామల పావని అన్నారు. స్థానిక విద్యానగర్లో కమిషనర్ సుమన్ రావుతో కలిసి సెప్టిక్ట్యాంకులను పరిశీలించారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉందని, మురుగుకాలువకు పైపులను తొలగించి సెప్టిక్ట్యాంకులను నిర్మించేందుకు నెలరోజులుగా శ్రమించామని పేర్కొన్నారు. పందులను తొలగించేక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్ల సహకారంతో లక్ష్యాన్ని చేరామన్నారు. ఆమె వెంట కౌన్సిలర్ వెల్ముల స్వరూపరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఔరా.. పావని..!
రూ.కోట్లకు పడగ చింటూ, బుల్లెట్ల వద్ద పలు పంచాయతీలు మరికొందరిపై కేసుల నమోదుకు రంగం సిద్ధం రూ.కోటి విలువైన స్థలాల గుర్తింపు పావని దంపతులకు ముగిసిన పోలీసు కస్టడీ చిత్తూరు (అర్బన్): పావని.. రెండేళ్ల క్రితం చీరలు అమ్ముతూ జనంలోకి వచ్చిన ఓ సాధారణ మహిళ. ఆమె భర్త చరణ్ ఆటో డ్రైవర్. ఆమె చుట్టుపక్కల వారినే కాకుండా పలు ప్రాంతాల వారిని మాయ మాటలతో పడేసింది. కిలోల లెక్కన బంగారు ఆభరణాలు, రూ.కోట్ల నగదు తీసుకుని చివరకు వారికి టోపీ పెట్టింది. పోలీసు కస్టడీలో ఆమె తెలిపిన వివరాలు విని పోలీసులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. తొమ్మిది రోజుల కస్టడీ గడువు పూర్తికావడంతో వారిని సోమవారం కోర్టు ఎదుట హాజరుపరచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ విచారణలో పావని దంపతులు చెప్పిన వివరాల మేరకు పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. అత్యాశే పెట్టుబడి తమిళనాడుకు చెందిన పావని రెండేళ్ల క్రితం చిత్తూరు నగరం మిట్టూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం, చిన్న కిరాణ దుకాణం నిర్వహించడం మొదలుపెట్టింది. చుట్టు పక్కల మహిళల్ని లక్ష్యంగా చేసుకుని నూటికి రూ.పది చొప్పున వడ్డీ ఇస్తానని చెప్పి నగదు తీసుకుంది. సక్రమంగా వడ్డీ చెల్లిస్తూ నమ్మకం పెంచుకుంది. వారి అత్యాశను పెట్టుబడిగా మార్చుకుంది. నమ్మకమనే పేరిట పలువురు మహిళల నుంచి సుమారు 8.25 కిలోల బంగారు ఆభరణాలను సేకరించింది. వీటిని తాకట్టుపెట్టి సొమ్ము చేసుకుంది. దీనికి తోడు చీటీలు, చేతి బదులు, అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి రూ.1.85 కోట్ల వరకు తీసుకుంది. విదేశీ టూర్లు... ఇదే నమ్మకంతో చిత్తూరు నగరంలోని ఎస్టేట్కు చెందిన ఓఎం.రాందాస్ కుటుంబంతో పరిచయం పెంచుకుంది. నిత్యం ‘డాడీ.. డాడీ..’ అని వారిని పావని పిలిచేది. ఈ క్రమంలోనే వారితో కలిసి థాయ్లాండ్, సింగపూర్కు సైతం టూర్లకు వెళ్లింది. రాందాస్ కుమార్తె జ్యోత్స్నకు సైతం హాండిచ్చింది. ఇక చీటీల పేరిట రూ.1.83 కోట్లు అప్పులు చేసి న్యాయస్థానంలో ఐపీ దాఖలు చేసింది. ముత్తూట్ ఫిన్కార్ప్ సంస్థలో ఏకంగా 234 ఖాతాల్లో 8 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కుదువపెట్టి సొమ్ము చేసుకుంది. డబ్బులు అడిగిన వారిని చింటూ వద్దకు పిలిపించి బెదిరించేది. ఇదే క్రమంలో చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్, ప్రియ అనే మహిళకు ఇవ్వాల్సిన ఆభరణాలు, నగలపై పంచాయతీ చేసినట్లు పావని దంపతులు పోలీసులకు వివరించారు. దీనిపై ఇప్పటికే పోలీసులు బుల్లెట్ సురేష్ను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. రూ.కోట్ల విలువైన స్థలాల గుర్తింపు పావని దంతపతులకు నగరంలోని ఎస్టేట్లో ఓ స్థలం, మురకంబట్టులో ఇంటిని గుర్తించారు. వీటి విలువ రూ.కోటి వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిపై చట్టపరంగా అటాచ్మెంట్కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక పావని వద్ద ఉన్న ఇండికా, డస్టర్, రెండు టెంపో వాహనాలను ఫైనాన్స్ సంస్థలు ఇప్పటికే సీజ్ చేశాయి. తొలుత ఇద్దరు మహిళలు మాత్రమే పావనిపై ఫిర్యాదు చేయగా ప్రస్తుతం వారి సంఖ్య 15కు చేరింది. పావని దంపతులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. -
‘బుల్లెట్’ను చుట్టేస్తున్న కేసులు!
ఇప్పటికే పలు పోలీసు కేసులతో సతమతం తాజాగా పావని కేసులో శ్రీముఖాలు 9న హాజరుకావాలని నోటీసులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, చిత్తూరు చెందిన అధికారపార్టీ నేత బుల్లెట్ సురేష్ మరో కేసులో చిక్కుకున్నారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్.. ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా చిత్తూరులో పలువురు మహిళల్ని మోసం చేసి 8 కిలోల వరకు బంగారు ఆభరణాలు కాజేసిన పావని ఎపిసోడ్.. బుల్లెట్కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కేసు విచారణలో భాగంగా ఈనెల 9న తమ ముందు హాజరు కావాలని వన్టౌన్ పోలీసులు సురేష్కు నోటీసులు జారీ చేయడం చిత్తూరులో హాట్ టాపిక్గా మారింది. చిత్తూరు (అర్బన్): బుల్లెట్ సురేష్ను రెండేళ్ల క్రితం ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్న సురేష్ తరువాత బెయిల్పై విడుదల అయ్యారు. గత ఏడాది నవంబరులో చిత్తూరు మేయర్గా ఉన్న అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల హత్య కేసులో సైతం సురేష్పై కేసు నమోదు చేసిన పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం, ఇటీవల బెయిల్పై బయటకు రావడం తెలి సిందే. ఈ మధ్యే కోల్కత్తాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ భార్య సంగీత చటర్జీను అరెస్టు చేసిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు. తప్పుడు గన్ లెసైన్సును సురేష్కు ఇచ్చినట్లు, దీని ద్వారా ఓ తుపాకీను అమ్మినట్లు లక్ష్మన్ పోలీసులకు చెప్పారు. దీనిపై విచారణ సాగిస్తున్న పోలీసులు సురేష్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక తాజాగా చిత్తూరు నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని పలువురు మహిళలను మోసం చేసి దాదాపు 8 కిలోల బంగారు ఆభరణాలను మాయం చేసిన పావని, మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ, హరిదాస్లతో కలసి తమ ను బెదిరించినట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పావని, ఆమె భర్త చరన్లను అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో 9 రోజుల కస్టడీకు తీసుకున్నారు. పావని దంపతుల్ని విచారిస్తున్న పోలీసులు బుల్లెట్ సురేష్పై దృష్టి సారించారు. పోలీసుల విచారణలో పావని సురేష్ పేరు ప్రస్తావించడంమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బుల్లెట్ సురేష్ గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యే క్రమంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసుల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన తమకు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటే అధికారపార్టీ నాయకులు మౌనం వహిస్తున్నారని ఇటీవల సురేష్ కుటుం బ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన తో టీడీపీ నాయకులపై వారు మరింత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. -
నాలుగు భాషల్లో...
ప్రముఖ రచయిత నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన చిత్రం ‘క్యాంపస్ అంపశయ్య’. శ్యామ్ కుమార్, పావని జంటగా ప్రభాకర్ జైని ప్రధాన పాత్రలో జైని క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవరాయ ఫిలిమ్స్పై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రం జూన్లో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మానవ విలువలు, మానసిక సంఘర్షణలున్న చిత్రమిది. అన్ని భాషల వారికి సరిపోయే కథ కావడంతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. చదువు కోసం ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చే కుర్రాడి జీవితంలో ఒక రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి సంఘటనలు జరిగాయన్నదే కథ. 1970ల కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమేరా: రవికుమార్ నీర్ల. -
వీధికుక్కల వీరంగం
- తీవ్రంగా గాయపడ్డ మూడేళ్ల చిన్నారి నల్లకుంట వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన ఉప్పల్ కళ్యాణ పురి కాలనీ లో జరిగింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. గుంపుగా తిరుగుతున్న వీధి కుక్కలు బుధవారం ఒక్కసారి గా ఇంట్లో కి వచ్చి.. ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి పావని(3) ని నోట కర్చుకుని ఈడ్చుకు వెళ్లాయి. చిన్నారి తల, ముఖం, కడుపు, వీపు, చేతులపై తీవ్ర గాయాలు చేశాయి. ఇంతలో దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమి.. చిన్నారిని కాపాడారు. రక్తం ఓడుతున్న చిన్నారిని హుటాహుటిన నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
కన్నీటి కథ... ‘అంపశయ్య’
ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఇప్పుడు వెండి తెరపై ఆవిష్కృతం కావడానికి సిద్ధమైంది. శ్యామ్ కుమార్, పావని జంటగా ‘అమ్మా నీకు వందనం’ ఫేవ్ు ప్రభాకర్ జైని దర్శకత్వంలో విజయలక్ష్మి జైని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘1965-1970 కాలంలోని పేదరికం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కొడుకు చదువు కోసం రూ. 200 కూడా చెల్లించలేని పేదరికం తండ్రిది. ఫీజు కోసం భార్య కడియాలు అమ్మినా డబ్బు సరిపోక, ఆ తండ్రి నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తాడు. ఆ సీన్లో వచ్చే పాట, అందులోని సాహిత్యం గుండెలు పిండేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో, మలయాళంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల. సంగీతం: సందీప్. -
బంగారమ్మపాలెంలో విషాదం
వరహా నదిలో పడి విద్యార్థిని మృతి మరో బాలికకు తప్పిన ప్రాణాపాయం ఎస్.రాయవరం: మండలంలోని బంగారమ్మపాలెంలో శుక్రవారం విషాదం నెలకొంది. గ్రామానికి సమీపంలోని వరహా నదిలో పడి ఓ విద్యార్థిని మృతి చెందగా మరో విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక యూపీ పాఠశాలలో కారే పావని (13), మైలపల్లి జ్ఞానేశ్వరిలు ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం ముగించుకుని ఇద్దరూ సమీపంలో ఉన్న వరహానది వద్దకు స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలి జారి ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే పీతలు పట్టుకుంటున్న మత్స్యకారుడు గమనించి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చాడు. అయితే అప్పటికే పావని ప్రాణాలు వదిలింది. కొన ఊపిరితో ఉన్న జ్ఞానేశ్వరిని హుటాహుటిన నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర సేవలు అందించడంతో ఆమె ప్రాణానికి ప్రమాదం తప్పింది. పావని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. స్థానికులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా విద్యార్థినులు కాలిజారి పడిపోలేదని..ఆత్మహత్యకు యత్నించారని స్థానికులు కొందరు అంటున్నారు. పాఠశాలకు వెళ్లిన ఇద్దరి విద్యార్థినులు అల్లరి చేష్టలు చేస్తుండడంతో వారి తల్లిదండ్రులు వెళ్లి మందలించారని.. దీంతో మనస్థాపం చెందిన బాలికలు నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారని అంటున్నారు. ఏమైనప్పటికీ చేతికందొచ్చిన కుమార్తె ఆకాల మరణం చెందడంతో పావని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మత్స్యకారులంతా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవారు. అయితే శుక్రవారం అంతా పావని మృతదేహం వద్ద విలపిస్తుండడం గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. -
పావని కేసులో కొత్త మలుపు
చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా పలువురు మహిళల్ని మోసం చేసి బంగారు ఆభరణాలను కాజేసిన పావని కేసు కొత్త మలుపు తిరిగింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు పావని ఇచ్చినట్లు గుర్తించిన రూ.50 లక్షల నగదు, ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 460 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ శ్రీనివాస్, కేసు దర్యాప్తు అధికారి గిరిధర్ శుక్రవారం వివరించారు. చిత్తూరుకు చెందిన ఆటో డ్రైవర్ చరణ్ భార్య పావని 2013 నుంచి 2015 వరకు పలువురు మహిళలకు మాయ మాటలు చెప్పి వారి నుంచి సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుంది. వీటిని ఆమె చిత్తూరులోని ముత్తూట్ ఫైనాన్స్లో 244 ఖాతాల్లో కుదువ పెట్టి రూ.1.52 కోట్ల రుణం తీసుకుంది. ఆభరణాలు ఇచ్చిన మహిళలు వాటిని వెనక్కు ఇవ్వాలని అడగడంతో పావని హరిదాస్ ద్వారా చింటూను ఆశ్రయించింది. చింటూ తనను బెదిరించాడంటూ ఓఎంఆర్ జ్యోత్స్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో వాస్తవాలన్నీ వెలుగు చూశాయి. ఒత్తిళ్ల నుంచి తప్పించినందుకు పావని చింటూకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో రూ.45 లక్షలు బెంగళూరులోని చింటూకు పరిచయం ఉన్న వ్యక్తి వద్ద, మిగిలిన రూ.5 లక్షలు గంగనపల్లెలోని చింటూ నివాసంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు లో ఉందని, మరిన్ని వివరాలను త్వరలో రాబడతామని ఎస్పీ పేర్కొన్నారు. పావని కోసం గాలింపు ఈ కేసులో పరారీలో ఉన్న పావని, ఆమె భర్త చరణ్ కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే ఇద్దరినీ అరెస్టు చేస్తామన్నారు. -
పావని మోసాలు ఎన్నని..!
‘సాక్షి’ కథనంతో ఎస్పీని ఆశ్రయించిన బాధితులు రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.15 లక్షల ఆభరణాలు ఇచ్చినట్లు వెల్లడి తన భర్త మృతికి పావని కారణమని మరో మహిళ ఫిర్యాదు నిందితురాలికి అండగా నిలిచిన పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశం చిత్తూరు (అర్బన్): జిల్లాలో పలువురి మహిళల్ని మోసం చేసి, వారి బంగారు ఆభరణాలను ఫైనాన్స్ కంపెనీల్లో కుదువపెట్టి, అందరికీ కుచ్చుటోపీ పెట్టిన పావని మోసాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. పావని చేసిన మోసాలపై ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఖతర్నాక్ పావని’ శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. పలువురు బాధితులు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ను పోలీసు మైదానంలో కలిసి తమ గోడు నివేదించారు. ఎందరో బాధితులు చిత్తూరుకు చెందిన జ్యోత్స్న పావనిపై పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పలువురు బాధితులు ముందుకొచ్చారు. వీళ్లల్లో నగరంలోని మార్కెట్వీధికి చెందిన వాణి అనే మహిళ ఎస్పీకు తన గోడు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. తన ఆభరణాలు పావనికి ఇచ్చినా ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో తన భర్త ఆదినారాయణగుప్త ఆమెను నిలదీయడానికి వెళ్లి గత ఏడాది ఏప్రిల్ 30న తవణంపల్లెలో శవమయ్యాడని, దీనిని పావని దంపతులే కారణమని పేర్కొంది. మరో మహిళ మాట్లాడుతూ, పావని మాటలు నమ్మి బంగారు ఆభరణాలు, రూ.లక్షల్లో డబ్బులిచ్చి మోసపోయామని చెప్పుకొచ్చింది. మరో వృద్ధురాలు మాట్లాడుతూ, ఇచ్చిన ఆభరణాలు అడిగినందుకు చింటూ వద్ద పావని తమను దోషిగా నిలబెట్టిందని మొగిలి, హరిదాస్, పరంధామలకు సైతం ఇందులో సంబంధం ఉందని పేర్కొన్నారు. పావని వ్యవహారంలో పోలీసు శాఖకు చెందిన కొందరు ఆమెకు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారని మరో బాధితురాలు ఆరోపించింది. తాము పావని మాటల్లో పడి రూ.15 లక్షలు, రూ.20 లక్షలు, రూ. 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఇచ్చి ఇప్పటి వరకు వాటిని తీసుకోలేదని మరికొందరు ఎస్పీ వద్ద లబోదిబోమన్నారు. అందరి గోడూ ఆలకించిన ఎస్పీ దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చిత్తూరు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ గిరిధర్ను ఆదేశించారు. అంతేకాకుండా ఇందులో ప్రమేయమున్న పోలీసులపై సైతం కేసు నమోదు చేయాలన్నారు. దీంతో మహిళల నుంచి వేర్వేరుగా ఫిర్యాదులు తీసుకున్న డీఎస్పీ, వాళ్ల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పావనికి బంగారు ఆభరణాలు ఇచ్చిన వాళ్లంతా అధిక వడ్డీకు ఆశపడి ఇంట్లో భర్త, కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా మోసపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూడటం కొసమెరుపు! -
ఖతర్నాక్ పావని!
- పైకి చీరల వ్యాపారం.. చేసేది వడ్డీ వ్యాపారం - ముత్తూట్లో 244 ఖాతాల్లో 8 కిలోల బంగారం తాకట్టు - పావనికి చింటూ అండ.. కస్టడీకి కోరనున్న పోలీసులు చిత్తూరు: నగరంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన పావని గురించి బాధితుల్ని విచారిస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. మూడేళ్లుగా పావని చిత్తూరులో చీరల వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త చరణ్ అలియాస్ చెర్రీ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పావని కాలనీలోని మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వారి నుంచి అప్పులు తీసుకునేది. మూడేళ్ల కాలంలో చిత్తూరు నగరంతో పాటు శ్రీకాళహస్తి ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళల నుంచి నగదు, బంగారు ఆభరణాలు అప్పుగా తీసుకుంది. 2013 నవంబరు నుంచి 2015 డిసెంబరు వరకు చిత్తూరులోని ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్లో 244 ఖాతాలు తెరిచి 7.882 కిలోల బంగారు ఆభరణాలు కుదువ పెట్టింది. ఇందులో 1.30 కిలోల బంగారు ఆభరణాలను ముత్తూట్ సంస్థ వేలం వేయగా, 4.308 కిలోల ఆభరణాలను రూ.91 లక్షలు చెల్లించి పావని విడిపించుకుంది. 1.600 కిలోల ఆభరణాలను వారం క్రితం చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడు నెలల క్రితం శ్రీకాళహస్తి కోర్టులో ఐపీ దాఖలు చేసిన పావనిని నగల యజమానులు ఆభరణాలను ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చారు. పావని తనను మోసగించి 406 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు నగరానికి చెందిన ఓఎం. రాందాస్ భార్య జ్యోత్న్స పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. చింటూపై కేసు ఈ నేపథ్యంలో పావని హరిదాస్ ద్వారా చింటూ వద్దకు వెళ్లి పరిచయం పెంచుకుంది. రాందాస్ భార్య జ్యోత్న్సతోపాటు పలువురు మహిళలను చింటూ బెదిరించినట్లు పోలీసుల రికార్డుల్లో నమోదయ్యింది. దీంతో పోలీసులు చింటూ, హరిదాస్, పావని, చెర్రీలపై ఐపీసీ 420, 384, 109 ఆర్డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారించడానికి చింటూ, హరిదాస్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మేయర్ దంపతుల హత్యకు వారం ముందే పావనిని చింటూ బయటకు పంపించేశాడని, తరువాత ఇతను కూడా ఆమె వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం రావడంతో ఆ దిశగా కూడా నెలక్రితం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. -
ఊగిసలాడే...
మనసులో ప్రేమ ఉంటే మనిషి ఎంత దూరంలో ఉన్నా దగ్గర చేస్తుందనే కాన్సెప్ట్తో రూపొందనున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. రావంత్, పావని జంటగా కెమెరామ్యాన్ ధనుంజయ్ దర్శకత్వంలో పళ్లా రమణ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘జనవరి 10 నుంచి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, చీరాల ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో టాకీ పార్ట్ పూర్తి చేసి, పాటలను గోవా, అరకు ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. యువహృదయాల ఊగిసలాటని ఇందులో ఆవిష్కరించనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్కిరణ్, సమర్పణ: పళ్లా శారదా రమణ. -
అక్రమ సంబంధాలు అంటగట్టి.. బయటకు గెంటాడు..
వరంగల్: జర్నలిస్టు పేరుతో చెలామణి అవుతున్న ఓ వ్యక్తి తన భార్యకు అక్రమ సంబంధాలు అంటగట్టడమేగాక, పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా తన సంతానం కాదంటూ వేధించడంతో భార్య అతడి ఇంటి ఎదుటే బైఠాయించింది. వివరాలు.. వరంగల్ రామన్నపేటలో నివాసముంటున్న రాసాల వెంకట్ ఓ మాస పత్రిక ఎడిటర్గా చెప్పుకొంటూ జర్నలిస్టుగా కొనసాగుతున్నాడు. అతడికి పావనితో 2000 ఏప్రిల్ 23న వివాహమైంది. పెళ్లి సమయంలో అతడికి రూ. 3 లక్షల కట్నం, 3 తులాల బంగారం, మోటార్సైకిల్ కోసం రూ. 50 వేలు ఇచ్చారు. కొంతకాలానికి పావని-వెంకట్ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అంతే.. వెంకట్ అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. దీంతో పెద్దమనుషులు పంచాయితీ చేసి న్యూశాయంపేటలోని ఇంట్లో రెండు పోర్షన్లను రాసిచ్చారు. వాటి అద్దె కూడా వెంకట్ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత మరోసారి వేధించి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. కొంతకాలంగా భార్య పావనికి అక్రమ సంబంధాలు అంటగట్టడమేగాక, ఇద్దరు ఆడపిల్లలు తనకు పుట్టలేదని వెంకట్ వేధించేవాడు. డీఎన్ఏ పరీక్షల కోసం ఈ ఏడాది జూలై 7న నోటరీ స్టాంపు కాగితాలపై పావనితో బలవంతంగా సంతకాలు కూడా చేయించుకొని, భార్యా పిల్లల్ని బయటకు గెంటాడు. భర్త వేధింపులు భరించలేని పావని తల్లి గారింట్లో ఉంటూ.. 15 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ను కలిసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని మహిళా పోలీస్ స్టేషన్కు పంపారు. స్పందన లేకపోవడంతో ఐద్వా మహిళా సంఘం అండతో భర్త నివాసం ఎదుటే ఆదివారం ఆందోళనకు దిగింది. మట్టెవాడ సీఐ శివరామయ్య వచ్చి వెంకట్పై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉంచేలా న్యాయం చేస్తానని పావనికి హామీ ఇచ్చారు. కాగా, ఇలాంటి వ్యక్తులను సాంఘిక బహిష్కరణ చేయాలని మాజీ కార్పొరేటర్ మెడికట్ల సారంగపాణి, వెంకట్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా కార్యదర్శి రజిత డిమాండ్ చేశారు. -
పండుగకు వచ్చి... విగతజీవులయ్యారు
అత్తిలి : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు..చివరికి చెరువులో శవాలై తేలారు. దుళ్ళ గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబు కుమారుడు మణికంఠ, తణుకు మండలం వేల్పూరుకు చెందిన కోటి చుక్కల నాగేంద్ర కుమార్ ఇద్దరు కుమార్తెలు పావని దుర్గ మహాలక్ష్మి, పల్లవిలు సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వీరంతా దగ్గరలోని గుడి దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళనతో కుటుంబసభ్యుల వెతికారు. అయినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు జరుపుతుండగనే..చిన్నారుల శవాలు చెరువులో లభ్యం కావడంతో వారి తల్లిదండ్రులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఇప్పటివరకూ ఓ చిన్నారి మృతదేహం వెలికి తీయగా, మిగతా ఇద్దరి మృతదేహాలు వెలికి తీస్తున్నారు. -
కట్టుకున్న భార్యే.. పొట్టన బెట్టుకుంటుందనుకోలే..
శివునిపల్లి(స్టేషన్ఘన్పూర్ టౌన్) : పెద్దలు, కుటుంబ సభ్యుల మాటను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదని ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యూరు. నమ్మించి.. మట్టుబెట్టిందని శాపనార్థాలు పెట్టారు. శివునిపల్లికి చెందిన కుసుమ సత్తెమ్మ, రాజమౌళి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్(33) హైదరాబాద్లో ఈ 9న భార్య చేతిలో హత్యకు గురయ్యూడు. అతడి మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి తల్లిదండ్రులు, సోదరుడి కథనం ప్రకారం.. శ్రావణ్కుమార్ సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన అమృత నర్సింహారావు, విజయ దంపతుల కుమార్తె పావనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో బీటేక్ ఫైనలియర్ చదువుతున్న అతడిని తల్లిదండ్రులు ఎంటెక్ చదివించారు. అనంతరం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ భార్యతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. వారికి కుమారుడు అభినవ్, కుమార్తె వశిష్ట ఉన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం బాలాజీనగర్లో బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకోవడంతోపాటు ఫైనాన్స్లో కారు కొనుగోలు చేశారు. కాగా ఏడాది క్రితం అతడిని కళాశాల యూజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతోపాటు ఏడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనోవేదనకు గురైన శ్రావణ్కుమార్ తన పిల్లలను తీసుకుని శివునిపల్లిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మూడు నెలల క్రితం పిల్లలు కావాలని ఇంటికి వచ్చిన భార్య పావని పాపను తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లింది. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచారుుతీలు కాగా ఇద్దరు కలిసి శివునిపల్లిలో ఉండాలని వారు నిర్ణరుుంచారు. అందుకు పావని అంగీకరించలేదు. దీంతో అతడు ధర్మసాగర్ మండలం రాంపూర్ వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కుమారుడిని ఘన్పూర్లోని హోలీక్రాస్ పాఠశాలలో చేర్పించి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పావని హైదరాబాద్లోని పోలీస్స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత దీపావళి పండుగ మరుసటి రోజు ఇంటికి వచ్చిన పావని తాను మారిపోయానని, అంతా కలిసి ఉందామని చెప్పడంతో శ్రావణ్కుమార్ నమ్మాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేములవాడకు వెళ్లొచ్చారని, హైదరాబాద్లో ఉన్న ఇంటిని అమ్మేందుకని ఈ నెల 8న హైదరాబాద్కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదని వారు విలపించారు. ఈ నెల 9న రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు ఫోన్ చేసి శ్రావణ్ చనిపోయినట్లు చెప్పారని వాపోయూరు. శ్రావణ్ను భార్య, అత్త పథకం ప్రకారం హతమార్చారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. -
భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య
-
భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని బాలజీనగర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తాళికట్టిన భర్తనే హతమార్చిందో భార్య. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రవణ్ కుమార్, పావని దంపతుల మధ్య గత కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దాంతో భర్త వేధింపులకు విసిగిపోయిన పావని... శ్రవణ్ కుమార్ను గొంతునులిమి హతమార్చింది. కాగా శ్రవణ్ కుమార్ గత కాలంగా మద్యం సేవించి భార్య పావనిని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడని, దాంతో వేసారిన ఆమె ఈ హత్య చేసినట్లు సమాచారం. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితురాలిని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆపరేషన్ థియేటర్లో గర్భిణి మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు గవర్నర్పేట స్టేషన్లో కేసు విజయవాడ : పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో ఎనిమిది నెలల గర్భిణి మంగళవారం రాత్రి ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లిన కొద్దిసేపటికే మరణించడం వివాదాస్పదమైంది. ఆస్పత్రిలో చేరి రెండురోజులైనా వైద్యులు పట్టిం చుకోలేదని ఆమె భర్త, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో ఆపరేషన్ చేసి ఉంటే బతికేదని వారు పేర్కొంటున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో వారు సిబ్బందితో కొంతసేపు గొడవ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జి.కొండూరు మండలం కట్టుబడివారిపాలేనికి చెందిన ద్రోణాదుల పావని(20)కి ఏడాదిన్నర కిందట గుడివాడకు చెందిన నీలకంఠంతో వివాహమైంది. పావని ప్రస్తుతం 34 వారాల గర్భిణి. అధిక రక్తపోటుతో బాధపడుతుండటంతో ఈనెల 21న ఆమెను పాత ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి ఆస్పత్రిలో చేర్చుకున్నారు. మంగళవారం ఉద యం వైద్యులు మరోమారు పరీక్షించి కడుపులో శిశువు చనిపోయిందని ఒకసారి, బాగానే ఉం దని ఇంకోసారి రకరకాలుగా చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు. పావనిని ఈనెల 12న ఆస్పత్రికి తీసుకురాగా, రెండురోజులు ఉంచి పంపివేశారని వారు పేర్కొంటున్నారు. పావని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారని, ఐదు ని ముషాల లోపే చనిపోయిందని చెప్పారని బంధువులు తెలిపారు. పావని మృతికి కారకులై న వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డి మాండ్ చేశారు. శిశువు దక్కకపోయినా తల్లిని కాపాడాలని వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదని పావని తల్లి విలపిస్తూ చెప్పింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతిచెందిందని పే ర్కొంటూ పావని భర్త నీలకంఠం అదేరో జు రాత్రి గవర్నర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు కేసు నమోదైంది. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో బందోబస్తు ని ర్వహించారు. మృతదేహాన్ని బుధవారం ఉద యం కొత్త ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అ ప్పగించారు. ఈ సందర్భంగా మృతురాలి బం ధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించి, మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. వైద్యులు ముందే వివరించారు పావనిని ఈనెల 12 బంధువులు ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. 14న ఆమెను ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ త్రిపురసుందరీదేవి పరీక్షించారు. గర్భం తొలగిస్తేనే రక్తపోటు అదుపులోకి వస్తుందని, లేకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. మరుసటిరోజు గర్భం తొల గించేందుకు వైద్యులు నిర్ణయించారు. 15వ తేదీ ఉదయానికి పావని వార్డులో కనిపించలేదు. దీంతో అబ్స్కాండింగ్గా కేస్షీట్లో నమోదు చేశారు. పావనిని తిరిగి ఈనెల 21న బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యు లు పరీక్షించి, గర్భం తొలగించేందుకు జెల్, టాబ్లెట్లు వాడారు. ఆమె పరిస్థితి క్రమేపీ విషమిస్తుండటంతో ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి శిశువును తొలగిస్తుండగా అకస్మికంగా మృతిచెందింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి గుండె ఆగిపోతుంది.. లేదా కిడ్నీలు పనిచేయవు. గర్భిణి మృతికి కారణం ఏమిటనేది ఖచ్చితంగా నిర్ధారించలేం. - డాక్టర్ సూర్యకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఆశ్రయమిచ్చే అమ్మ
అంగవైకల్యం.. ఎదుటివారిపై ఆధారపడేలా చేస్తుంది. కానీ, ఇక్కడ పిల్లలందరి మధ్యలో వీల్చైర్లో కూర్చున్న పావని... ఎదుటివారికి... అదీ అన్ని అవయవాలు బాగున్నవారికి అండగా నిలవాలనుకుంది. బతికున్నంతకాలం తల్లిదండ్రులకు చంటిపాపలా ఉండాల్సిన పావని తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథపిల్లలకు తల్లిగా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికెళ్లి ‘అమ్మ ఆశ్రమం’ గురించి అడిగితే అందరూ ముందు పావని గురించే చెబుతారు. ఒకరోజు వార్తాపత్రికలో.. ‘తల్లిదండ్రులు లేని ఈ అనాథపిల్లలకు ఆర్థిక సాయం చేయగలరు’ అనే ప్రకటన చదివింది పావని. తన స్నేహితులకు విషయం చెప్పి వారి సాయంతో కోటగిరికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మన్దేవ్పల్లికి వెళ్లింది. తొమ్మిదేళ్ల వయసున్న భారతి, ఏడేళ్ల శోభను కలిసి వారిని తనకిమ్మని పెద్దలతో మాట్లాడింది. తన గురించి పూర్తిగా చెప్పి పెద్దల్ని ఒప్పించి ఆ అనాథలిద్దర్ని ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికే తల్లితో తన ఆశ గురించి, ఆశయం గురించి వివరంగా చెప్పింది పావని. బిడ్డ మనసెరిగిన వెంకటరమణ అలా వచ్చిన అనాథ పిల్లలందరికీ అమ్మమ్మ అయ్యింది. ఆశే.. ఆశయమైంది కొన్నిసార్లు ఏదో ఆలోచనతో మొదలుపెట్టిన పని...రకరకాలు మలుపులు తిరుగుతూ సరికొత్త ఫలితాలను అందజేస్తుంది. పావని తనకు తోడు కావాలనుకుని మొదలుపెట్టినా... అనాథపిల్లల జీవితాలు చూసి ఓ క్షణం వారి గురించి ఆలోచించి వారందరికీ తోడుగా నిలవాలనుకుంది. ‘‘భారతి, శోభ మా ఇంటికొచ్చి నాలుగేళ్లు దాటింది. అన్నయ్య పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా విజయవాడ వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో అమ్మా, నాన్న, నేను. అమ్మ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన పథకం కింద వంటచేసే పని చేస్తుంది. నాన్న ఏ పనీ చేయకపోయినా కాలక్షేపానికి ఊళ్లోకి వెళ్లిపోతాడు. అమ్మానాన్న ఉన్నప్పుడే ఇలా ఉందంటే.. వారి తర్వాత నా పరిస్థితి ఏంటని బాగా ఆలోచించాను. నావాళ్లంటూ ఓ నలుగురు ఉండాలని అనుకున్నాను. ఒకరో ఇద్దరో అనాథల్ని పెంచుకుంటే వారి నీడనే జీవితం గడిపేయొచ్చుకదా! అన్న ఆశతో మొదలుపెట్టాను. విచిత్రం ఏమిటంటే..అది అక్కడితో ఆగకుండా...నా చుట్టుపక్కలున్న అనాథపిల్లలందరికీ నన్ను అమ్మగా మార్చేసింది. మనకు తెలియకుండానే మన జీవితం మలుపు తిరుగుతుందని ఎవరో అంటే నాకు అర్థం కాలేదు. నా ఇంట్లో అనాథపిల్లల సంఖ్య పెరుగుతున్నప్పుడల్లా నా మనసులో కలిగింది ఆశ కాదు, ఆశయమని అర్థమవుతుంటుంది’’ అంటూ చెప్పే పావని వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. శరీర బరువు కారణంతో ఓ ఇద్దరు సాయం ఉంటేగాని కదల్లేదు. వీల్చైర్ ఎక్కిందంటే మాత్రం అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. ఓ పక్క కుట్లు, అల్లికల పనిచేస్తూనే పదో తరగతి పరీక్ష రాసి పాసైంది పావని. తర్వాత ఇంట్లో నుంచి ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేసింది. అమ్మ సాయంతోనే... పిల్లలకు ఆస్తులివ్వకపోయినా వారి ఆశయాలు నెరవేరితే చాలంటుంది పావని తల్లి వెంకట రమణ. పల్లెల్లో పనుల్లేక కన్నబిడ్డల్ని పెంచడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది అనాథ పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడం అంటే మాటలు కాదు. అదెలా సాధ్యం అంటే... ‘‘పావని మొదట్లో చెబితే నాకు అర్థం కాలేదు. ఓ ఇద్దరు పిల్లలు ఇంట్లో అడుగుపెట్టగానే పావని ముఖంలో తెలియని ధైర్యం చూశాను. ఆ అనాథపిల్లలకోసం ఏదైనా చేయాలనే పావని పట్టుదలను గమనించాక అప్పటివరకూ పావని గురించి ఉన్న బెంగ పోయింది నాకు. పిల్లలందరినీ నేను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. మధ్యాహ్నం భోజనం అక్కడే తినేస్తారు. సాయంత్రం భోజనం కోసం ఆమె కుట్లు, అల్లికల డబ్బును ఉపయోగిస్తుంది. దాతల సాయం కూడా ఉంది’’ అని చెప్పింది వెంకటరమణ. పెరుగుతున్న పిల్లల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పావని ఆ ప్రాంత పెద్దల సలహాలతో ఆశ్రమం నడుపుతోంది. రెండు గదుల ఇరుకింట్లో ఇరవైమంది ఉండడాన్ని చూసి స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ మధ్యనే ఆశ్రమం నిర్మాణం కోసం మూడు లక్షల నగదు సాయం చేశారు. దానికి మిగతా దాతలు తోడు కావడంతో కొత్తగా మరో భవనం నిర్మాణానికి పూనుకుంది పావని. ఒక్క తల్లి బిడ్డల్లా... పదిహేడు మంది పిల్లల్లో ఎనిమిదిమంది ఆడపిల్లలు, తొమ్మిదిమంది మగపిల్లలూ ఉన్నారు. రోజు పొద్దునే వారి పనులు వారు చేసుకుని బడికి వెళ్లిపోవడం సాయంత్రం వచ్చాక కాసేపు టీవీ చూడ్డం, చదువుకోవడం... అన్నీ సొంతింట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి పూర్తిచేసిన భారతి తన గురించి చెప్పినపుడు ‘నేను పావనిగారి పెద్దమ్మాయి’ని అంటూ పరిచయం చేసుకుంది. అలాగే రమేష్ అనే అబ్బాయి మాట్లాడుతూ... ‘ఇంతమంది అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరికి ఉంటారు? అమ్మ గురించి చెప్పాలంటే... మా ప్రోగ్రెస్ రిపోర్టులు చూసుకుని తెగ మురిసిపోతుంటుంది. మార్కులు తక్కువొచ్చాయా... ఇక వారితో మాట్లాడదు. మేమంతా బాగా చదవాలన్నది ఆమె కోరిక’’ అని చెప్పాడు. తోటివారికి చేతనైనంత సాయం చేయడం మానవధర్మమైతే...చేయగలిగినదానికంటే ఎక్కువగా చేయడం సేవాధర్మం. ఆ ధర్మానికి కట్టుబడే తన దృష్టికి వచ్చిన ప్రతి అనాథపట్ల స్పందిస్తోంది పావని. ఎంతమందికైనా ఆశ్రయం ఇవ్వగలనన్న ఆమె మనోధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ‘‘ఎవరడిగినా ఇది మా ఇల్లనే చెబుతాం. ఆశ్రమం అనే మాట ఎవరో బయటి నుంచి వచ్చినవాళ్లే అంటారు. అమ్మ, అమ్మమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ‘నాకంటే కాళ్లు లేవు... మీరలా కాదు... జీవితంలో ఏదైనా సాధించగలరు’ అని మాటిమాటికీ అమ్మ చెప్పే మాటలు మేం ఎప్పటికీ మరచిపోలేం’’ అని చెప్పింది భారతి అనే అమ్మాయి. -
దాంపత్య జీవితానికి దూరంగా ఉంచుతుందని...
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ పావని కేసులో వీడిన మిస్టరీ దుండిగల్, న్యూస్లైన్: దాంపత్య జీవితానికి దూరంగా ఉంచుతుందని ఆగ్రహించిన భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించాడు. చివరికి నిజాలు వెలుగులోకి రావడంతో కటకటాపాలైయ్యాడు. సోమవారం దుండిగల్ సీఐ బాలకృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం మొగల్లు గ్రామానికి చెందిన పెనుమత్స సుబ్రహ్మణ్య కుమార్రాజు(28)కు అత్తిలి మండలం ఈడూరుకు చెందిన పావని(22)తో 2013 ఫిబ్రవరి 13న వివాహమైంది. నాలుగు నెలల క్రితం సుబ్రహ్మణ్య రాజు భార్య పావని, తన తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి బాచుపల్లి రామచంద్రారెడ్డినగర్లోని వైష్ణవి సాయిరెసిడెన్సీ అపార్ట్మెంట్ పెంట్హౌస్లో అద్దెకుంటున్నాడు. సుబ్రహ్మణ్యరాజు ఖాజిపల్లిలోని ప్రసాద్ స్టోన్ క్రషర్లో సూపర్వైజర్. అతని తండ్రి సూర్యనారాయణరాజు అక్కడే మెస్లో పని చేస్తున్నారు. కాగా పెళ్లైనప్పటి నుంచి పావని భర్తతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ అతనంటే ఇష్టంలేనట్టు ఉండేది. గతేడాది డిసెంబర్ 24న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్య రాజు కోరిక తీర్చమని అడిగాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురై బలంగా కొట్టడంతో తలకు గాయాలై స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించి చీరతో ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం దోపిడీ దొంగల పనిగా ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసి బయట నుంచి తలుపు గడియపెట్టి వెళ్లిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టుగా భార్య మృతదేహం వద్ద విలపించాడు. కాగా, పావని మృతదేహాన్ని ఈడూరుకు తరలించగా అక్కడికి వెళ్లిన సుబ్రహ్మణ్య రాజుపై మృతురాలి బంధువులు దాడి చేసి నిలదీయడంతో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం ఇదే విషయాన్ని అత్తిలి పోలీసులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా హత్యగా గుర్తించి సుబ్రహ్మణ్యరాజును సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి
=హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు దుండిగల్, న్యూస్లైన్: పెళ్లైన పది నెలలకే ఓ యువతి అనుమానాస్పదస్థితిలో ఉరేసుకొని మృతి చెందింది. హత్యా, ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా పాలకోడూరు మండలం మొగల్లు గ్రామానికి చెందిన సూర్యనారాయణ రాజు, అనంతలక్ష్మిల కుమారుడు పెనుమచ్చ సుబ్రహ్మణ్య కుమార్రాజుకు అదే మండలం ఈడూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, సీతాదేవిల కుమార్తె పావని(22)తో ఈఏడాది ఫిబ్రవరి 13న పెళ్లైంది. మూడు నెలల క్రితం సుబ్రహ్మణ్యరాజు భార్య పావని, తన తల్లిదండ్రులతో కలిసి బాచుపల్లి రామచంద్రారెడ్డినగర్ కాలనీలోని వైష్ణవి సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని పెంట్హౌస్లో అద్దెకుంటున్నాడు. సుబ్రహ్మణ్యరాజు మెదక్ జిల్లా జిన్నారంలోని ఎన్వీ ప్రసాద్ క్వారీలో సూపర్వైజర్ కాగా.. అతని తండ్రి అక్కడే మెస్లో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సుబ్రహ్మణ్యరాజు తల్లి అనంతలక్ష్మి తమ స్వగ్రామానికి వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సుబ్రహ్మణ్యరాజు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాడు. అదే రోజు రాత్రి 8 గంటలకు మామ సూర్యనారాయణరాజు ఇం టికి రాగా తలుపునకు బయట నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో అతను గడియ తీసి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని కోడలు పావని కనిపించింది. వెంటనే అతను తన కుమారుడితో పాటు చుట్టు పక్కల వారికి ఈ విషయం చెప్పాడు. సమాచారం అం దుకున్న దుండిగల్ పోలీసులు శవాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పేట్బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు సందర్శించారు. పోలీసు జాగిలాలను రప్పించగా అవి అపార్ట్మెంట్లోనే తిరిగాయి. ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు సేకరించారు. కాగా, పావని మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేరారు. అంతేగాక ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది ఆత్మహత్యగా ఇంకా నిర్ధారణకు రాలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది తెలుస్తుందని దుండిగల్ సీఐ బాలకృష్ణ తెలిపారు. -
‘ఫైలిన్’మరింత ఉధృతం: వాగుల్లో ఇద్దరి మృతి
మచిలీపట్నం, న్యూస్లైన్ : ఫైలిన్ తుపాను తీరం చేరకముందే జిల్లాలో ఇద్దరిని బలిగొంది. మరో బాలిక వాగులో కొట్టుకుపోయి గల్లంతైంది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలోని కుంపిణీవాగు, కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటకు చెందిన కరేటి శైలజ (15), నక్కనబోయిన పావని (14) గురువారం కుంపిణీ వాగులో గల్లంతవగా శైలజ శవమై తేలింది. ముసునూరు మండలం యల్లాపురానికి పుట్టింటికి వచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో తమ్మిలేరు దాటేందుకు ప్రయత్నించిన కంభంపాటి శాంతమ్మ (46) నీటి ఉధృతికి కొట్టుకుపోగా ఆమె మృతదేహం బలివే వద్ద దొరికింది. నేటినుంచి మరింత ఉధృతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి తుపాను ప్రభావం మరింత ఉధృతమవుతుందని వారు తెలిపారు. కోస్తా ప్రాంతంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 40 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం తుపాను ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీరులపాడులో 126, అత్యల్పంగా నాగాయలంకలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో నందిగామ, మైలవరం తదితర ప్రాంతాల్లో పూత, పిందె దశలో ఉన్న పత్తి పైరు దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. తుపాను విపత్తును తట్టుకునేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, జిల్లా ప్రత్యేకాధికారి బీఆర్ మీనా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను ప్రభావంతో మంగినపూడి బీచ్లోకి పర్యాటకులను గురువారం నుంచి అనుమతించటం లేదు. సముద్రంలోనే 40 బోట్లు... నాలుగైదు రోజుల క్రితం సముద్రంలోకి గిలకలదిండి హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 40 బోట్లను వెంటనే తిరిగి వచ్చేయాలని మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క బోటులో ఎనిమిది మంది చొప్పున ఉన్నారని వివరించారు. శుక్రవారానికి ఈ బోట్లు గిలకలదిండి హార్బర్కు చేరే అవకాశముంది. పొంగి ప్రవహిస్తున్న వాగులు... బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పశ్చిమకృష్ణాలో కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. జి.కొండూరు సమీపంలోని వెలగలేరు వద్ద బుడమేరులో ఇవి కలుస్తాయి. ఇటీవల కాలంలో ఇక్కడి హెడ్ రెగ్యులరేటర్లకు గేట్లు అమర్చారు. పది అడుగుల మేర నీటి మట్టం ఇక్కడకు చేరితే ప్రమాద స్థాయికి చేరినట్లని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేర నీటి మట్టం ఉందని, మరిన్ని వర్షాలు కురిసి వరద ఉధృతి పెరిగితే రెగ్యులేటర్ గేట్లు తెరవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ గేట్లు తెరిస్తే వెలగలేరు సమీపంలో రైలు కట్టకు దిగువన ఉన్న కొత్తూరు తాడేపల్లి, సింగ్నగర్, పాయకాపురంలలోకి వరదనీరు ప్రవేశించే అవకాశం ఉంది. ముసునూరు మండలంలో ఉన్న రామిలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిగామ ప్రాంతంలో ఉన్న మున్నేరువాగులోకి వరదనీటి రాక అధికమైంది. తుపాను ప్రభావంతో మరింత వర్షం కురిస్తే ఈ వాగులు ప్రమాదస్థాయిని మించి ప్రవహించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రత్యేక అధికారుల నియామకం... జిల్లాలో తుపాను ప్రబావిత ప్రాంతాలకు ప్రత్యేకాధికారులను కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి నియమించారు. మచిలీపట్నానికి జెడ్పీ సీఈవో, మత్స్యశాఖ ఏడీలను, నాగాయలంకకు మత్స్యశాఖ డీడీ, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిలను, కోడూరుకు సాంఘిక సంక్షేమశాఖ జేడీ, డీఆర్డీఏ పీడీలను, కృత్తివెన్నుకు డ్వామా పీడీ, విజయవాడ మత్స్యశాఖ ఏడీలను, బంటుమిల్లికి ఎస్సీ సొసైటీ ఈడీని, అవనిగడ్డకు జిల్లా సహకార శాఖాధికారిని, మోపిదేవికి రాజీవ్ విద్యామిషన్ పీవో నియమితులయ్యారు. వీరితో పాటు భారీ వర్షాలు కురిసి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను కాపాడేందుకు జగ్గయ్యపేటకు మెప్మా పీడీని, చందర్లపాడుకు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డెరైక్టర్ను, కంచికచర్లకు వ్యవసాయశాఖ జేడీని, ఇబ్రహీంపట్నానికి డీపీవోను, విజయవాడ అర్బన్కు అటవీ అధికారిని, విజయవాడ రూరల్కు వీజీటీఎం ఉడా అధికారిని, పెనమలూరుకు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారిని, కంకిపాడుకు పరిశ్రమల శాఖ జీఎంను, తోట్లవల్లూరుకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేకాధికారిని, పమిడిముక్కలకు కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ను, ఘంటసాలకు చేనేత, జౌళిశాఖ ఏడీని, చల్లపల్లికి గృహనిర్మాణ సంస్థ పీడీని నియమించారు. -
జెండా ఆవిష్కరించిన ఆదర్శ మహిళ
సాక్షి, హైదరాబాద్: అవయవ దానం చేసి భర్తను బతికించుకున్న ఆదర్శ మహిళ డి. పావని (30)ని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సముచిత రీతిలో గౌరవించింది. ఆస్పత్రి ఆవరణలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆమెతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింప జేశారు. పావని, ఈశ్వరరావులది ప్రేమ వివాహం. వీరికి పాప, బాబు ఉన్నారు. ప్రేమ వివాహం కావడంతో వీరి రెండు కుటుంబాల నుంచీ తీవ్ర అనారోగ్యానికి గురైన ఈశ్వరరావుకు ఏ రకమైన సహాయం అందలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పావని ధైర్యంగా తన లివర్ నుంచి కొంత భాగం తీసి భర్తకు అమర్చవలసిందిగా డాక్టర్లను అభ్యర్థించింది. ఆ ప్రకారం శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించగా ఇద్దరూ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆమెకు ఈ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పావనిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. డాక్టర్ జి.వి.రావుతో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.