Private Sector
-
ప్రైవేట్ రంగానికి పీఎం గతి శక్తి డేటా..
చివరి అంచె వరకు డెలివరీ సేవలు అందేలా చూసేందుకు, మౌలిక సదుపాయాల ఆధారిత యాప్లను రూపొందించేందుకు ఉపయోగపడేలా పీఎం గతి శక్తి పోర్టల్లోని నిర్దిష్ట డేటా, మ్యాప్లను ప్రైవేట్ రంగానికి అందించే దిశగా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, ప్రాజెక్ట్ ప్లానింగ్లో ప్రైవేట్ రంగానికి తోడ్పడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ శాఖలు అందించే రైల్వే స్టేషన్లు, గూడ్ షెడ్లు, జాతీయ.. రాష్ట్ర రహదారులు, గిడ్డంగులు, విమానాశ్రయాలు, ఎంఎంఎల్పీలు (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు) మొదలైన డేటా, ప్రైవేట్ రంగం లాస్ట్ మైల్ డెలివరీ సేవలను మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడనుంది. అలాగే, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ను రూపకల్పన, టెక్ ఆధారిత లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అవసరాలకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. -
అంతరిక్ష రంగం అభివృద్ధికి ఇవే కీలకం: ఇస్రో చైర్మన్
అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ వాటాను కైవసం చేసుకునేందుకు.. భారత్ తన అంతరిక్ష కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తోంది. అయితే దీనికి ప్రైవేట్ రంగాలు.. స్టార్టప్లు కీలక పాత్ర పోషించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా భారత్ అవతరించినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్లో ఇండియా వాటా కేవలం 2 శాతం (386 బిలియన్ డాలర్లు) వద్దనే ఉంది. దీనిని 2030నాటికి 500 బిలియన్ డాలర్లకు.. 2047 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని సోమనాథ్ అన్నారు.భారతదేశంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న స్పేస్ శాటిలైట్స్ కేవలం 15 మాత్రమే. ఈ సంఖ్య చాలా తక్కువ. దీనిని పెంచడానికి కృషి చేయాలి. అంతరిక్ష సాంకేతికతలో దేశం నైపుణ్యం.. పెరుగుతున్న ఉపగ్రహాల తయారీ కంపెనీల దృష్ట్యా.. భారతదేశం కనీసం 500 ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించే సామర్థ్యాన్ని కలిగి ఉందని సోమనాథ్ ఉద్ఘాటించారు.ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రైవేట్ సంస్థలు.. కక్ష్యలో శాటిలైట్లను తయారు చేసి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రైవేట్ లాంచ్ప్యాడ్లు కూడా వస్తాయి. 2014లో అంతరిక్ష సంబంధిత స్టార్టప్ కేవలం ఒక్కటి మాత్రమే ఉండేది. 2024కు ఈ సంఖ్య 250కి చేరింది. 2023లోనే స్పేస్ స్టార్టప్లు రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించాయి. 450కి పైగా MSMEలు.. 50కి పైగా పెద్ద కంపెనీలు ఇప్పుడు అంతరిక్ష రంగానికి చురుకుగా సహకరిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.మన దేశంలో మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్యాన్, ఇండియన్ స్పేస్ స్టేటన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులు కూడా ఇస్రో.. ప్రైవేట్ రంగాల మధ్య సహకార ప్రయత్నాలే. అంతరిక్ష యాత్రల కోసం చేసిన పరిశోధనల నుంచి ప్రయోజనం పొందే వందలాది విభిన్న రంగాలను ఇస్రో గుర్తించింది. సాంకేతికత బదిలీ కోసం ఎంపిక చేసిన పరిశ్రమలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి?.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా ఇస్రో సుమారు 61 దేశాలకు సహకరిస్తోంది. భారత్ ఇప్పటి వరకు 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని సోమనాథ్ తెలిపారు. ప్రస్తుత ఉమ్మడి మిషన్లలో NASAతో NISAR, CNES (ఫ్రాన్స్)తో TRISHNA, G20 శాటిలైట్, JAXA (జపాన్)తో లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ వంటివి ఉన్నాయని స్పష్టం చేశారు. -
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్తోపాటు, ఎన్పీఎస్లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్పీఎస్లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్పీఎస్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్పీఎస్లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్పీఎస్లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్పీఎస్లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ/సిప్కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్పీఎస్లో 60% నిధి, ఈపీఎఫ్లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్పీఎస్లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్పీఎస్లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్పీఎస్లోనూ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్డెస్క్ -
దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? బడ్జెట్ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా? చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్–భాగల్పూర్ ఎక్స్ప్రెస్వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్లోని బక్సర్ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్పూర్లోని పీర్పైంతిలో 2,400–మెగావాట్ల పవర్ ప్లాంట్ రానుంది. ఆంధ్రప్రదేశ్కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.బడ్జెట్ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్నిసంతోషపెట్టడమే.అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?నోట్ల రద్దు, కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.- వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సుబీర్ రాయ్ -
మన ముందున్న కర్తవ్యం ఇదే!.. బడ్జెట్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెన్ను ఉద్దేశించి, తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. వికసిత భారత్ను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలలో ఉద్యోగ కల్పన గురించి వెల్లడించడాన్ని అంశాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం ప్రశంసనీయం. దీనికి తగిన విధంగా ప్రైవేట్ రంగం కృషి చేయాలి. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రైవేట్ రంగం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, మన ముందున్న కర్తవ్యం ఇదే అని.. ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే.. రాబోయే రోజుల్లో విపత్తుగా మారే అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో మనదేశం ప్రపంచమే అసూయపడేలా మనదేశం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.We are the envy of the world in terms of our growth in GDP.We are the preferred destination of the world for investment because of the belief in our future.But the vital task ahead for us is to ensure that this growth is now accompanied by an explosion in job-creation.… pic.twitter.com/Z73BKJwWR1— anand mahindra (@anandmahindra) July 24, 2024 -
కన్నడనాట స్థానిక రగడ!
సాక్షి బెంగళూరు: కర్నాటకలో మరోసారి స్థానిక, స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింట్లోనూ కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పంచాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు–2024కు కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ 25 వేల దాకా జరిమానా కూడా విధిస్తారు. అంతేగాక గ్రూప్ సి, డి తరహా చిరుద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా నూటికి నూరు శాతం స్థానికులనే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి దీనిపై వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇదీ నేపథ్యం... కర్నాటకవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉత్తరాది వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్నాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది. 100 % స్థానికులకేనంటూ సిద్ధు పోస్టుబిల్లుకు మంత్రివర్గ ఆమోదం అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పెట్టిన పోస్టు వివాదానికి దారితీసింది. ‘‘మాది కన్నడ ప్రభుత్వం. కన్నడిగుల భద్రత, సంక్షేమానికి పాటుపడటమే మా బాధ్యత. కానీ కన్నడిగులు కన్నడనాడులోనే ఉద్యోగాలు పొందడంలో వెనకబడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేటు రంగ పరిశ్రమలు, కర్మాగారాల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వాల్సిందే’’ అని పోస్టులో సిద్ధు పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు.తీవ్ర వ్యతిరేకతసిద్ధు సర్కారు నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు ము ఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్నాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్కామ్ విమర్శించింది. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షా పూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు. ‘‘ఇది రాజ్యాంగవిరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఈ ఫాసిస్టు బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అసోచామ్ కర్నాటక సహధ్యక్షుడు ఆర్కే మిశ్రా తదితరులు కూడా ఇది దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుబట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది. కర్నాటకలో కన్నడిగుల స్వాభిమానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి, పరంపర విషయంలో వెనుకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పస్తూ బిల్లు తేవడం అందులో భాగమే– బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు -
ఇక వాహనాల తుక్కు యూనిట్లు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన వాహనాలకు సెలవు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనాల తుక్కు విధానం’ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం జిల్లాస్థాయిలో ‘వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు’ నెలకొల్పనుంది. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని తాజాగా నిర్ణయించింది. అందుకోసం ఔత్సాహిక వ్యాపారులకు అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర విధానం ప్రకారం 15 ఏళ్ల జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో వాహనాల స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రిజిస్టర్ అథారిటీగా నిర్ణయించారు. అంటే స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసే అధికారం రవాణా శాఖ కమిషనర్కు అప్పగించారు. ఇక అప్పిలేట్ అథారిటీగా రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. రవాణా శాఖ కమిషనర్ దరఖాస్తును తిరస్కరిస్తే ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు అప్పిలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. కాల పరిమితి దాటిన వాహనాలు 2 లక్షలు రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 1.20 కోట్లు వ్యక్తిగతవి కాగా.. 30 లక్షలు వాణిజ్య వాహనాలు. 15 ఏళ్లు జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలు కలిపి దాదాపు 2 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. వాటిని తుక్కుగా మార్చాల్సి ఉందని గుర్తించారు. తరువాత ఏటా జీవిత కాలం ముగిసే వాహనాలను తుక్కు కింద మారుస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాల్లోనే దాదాపు 3,500 వాహనాలకు జీవితకాలం ముగిసిందని ఇటీవల నిర్ధారించారు. మొదట ఆ వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అన్ని శాఖలకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుంది. జిల్లాకు రెండు యూనిట్లు జిల్లాకు కనీసం రెండు చొప్పున వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగిన స్థలం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు. వాహనాల ఫిట్నెస్ను పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ వెహికిల్ చెకింగ్ యూనిట్లను నెలకొల్పాలి. అలా వాహనాల ఫిట్నెస్ను నిర్ధారించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. మరమ్మతులు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేందుకు కూడా పనికిరావు అని నిర్ధారించే వాహనాలను తుక్కు కింద మార్చాల్సి ఉంది. వాటితోపాటు జీవితకాలం పూర్తయిన వాహనాలను కూడా యజమానులు తుక్కు కింద మార్చవచ్చు. తుక్కు కింద ఇచ్చే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు సాŠక్రపింగ్ యూనిట్లు చెల్లిస్తాయి. స్క్రాపింగ్ యూనిట్లు జారీ చేసే సర్టిఫికెట్ను సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై వాహనాల కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తాయి. ఆ మేరకు వాహన తయారీ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. స్క్రాపింగ్ యూనిట్లలో వాహనాల తుక్కును ఆ కంపెనీలకు విక్రయిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తుంది. దాంతో కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చి, కొత్త వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రోడ్లపై తిరుగుతున్న కాలం చెల్లిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాల యజమానులపై జరిమానాలు విధిస్తారు. దాంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవడంతోపాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రవాణా శాఖ భావిస్తోంది. -
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1 ..గుజరాత్ను అధిగమించి సత్తా
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్ను అధిగమించి ఏపీ నంబర్ వన్గా నిలిచింది. 2022–23లో టాప్ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్కు డిమాండ్.. గుజరాత్ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలున్నాయి. కోవిడ్ సంక్షోభం ముగిసిన తరువాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు బాగా పెరిగినట్లు సర్వే పేర్కొంది. 2022–23లో మొత్తం రూ.36.99 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో ప్రైవేట్ రంగ పెట్టుబడుల విలువ రూ.25,31,800 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు రూ.5,62,083 కోట్లు, రాష్ట్రాల పెట్టుబడులు రూ.6,05,790 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు కుదిరే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టిసారించిన రాష్ట్రాలు ప్రైవేట్ పెట్టుబడులను అధికంగా ఆకర్షించనున్నట్లు సర్వే పేర్కొంది. విశాఖ సదస్సుతో ఏపీకి గరిష్ట ప్రయోజనం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ నిర్వహించగా అందులో అత్యధికంగా లబ్ధి పొందిన రా>ష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సర్వే తెలిపింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈ సర్వేలో కొన్ని ప్రాజెక్టుల ఒప్పందాలను పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు. -
ప్రైవేట్ పెట్టుబడులూ కీలకమే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అజయ్ సింగ్ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు. జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. -
విస్తృతంగా వసతులు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం పారిశ్రామిక పార్కులు, టౌన్షిప్స్ను అభివృద్ధి చేసేలా నూతన పారిశ్రామిక విధానం 2023–27లో పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే పార్కుల్లో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నివాసానికి అనువుగా టౌన్షిప్లను అభివృద్ధి చేయనున్నారు. నివాసం నుంచి ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లే విధంగా వాక్ టు వర్క్ విధానంలో పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో ఉన్న 10 పారిశ్రామిక పార్కుల్లో కనీసం ఐదు పార్కులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. కేవలం భారీ పారిశ్రామిక పార్కులే కాకుండా పీపీపీ విధానంలో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్ పార్కులు, కోల్డ్ చైన్లను అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన విధివిధానాలను పారిశ్రామిక పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు ప్రైవేట్ రంగంలో పార్కులు అభివృద్ధి చేసేందుకు కనీస ప్రారంభ పెట్టుబడి రూ.200 కోట్లుగా నిర్ణయించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పార్కు కనీసం 50 ఎకరాలకుపైగా ఉండాలి. అదే ఏపీఐఐసీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పోతే కనీస పరిమితిని 100 ఎకరాలుగా నిర్ణయించారు. అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులో నివాస, వాణిజ్య సముదాయాల పరిమితి 33 శాతం మించి అనుమతించరు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ కోసం 33 శాతం కేటాయించాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ రంగంలో పార్కును అభివృద్ధి చేస్తే ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి భూమిని బదలాయించాలి. ఒకవేళ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటే ఎస్పీవీలో పెయిడ్ క్యాపిటల్గా 2 – 11 శాతం వాటా ప్రభుత్వానికి కేలాయించాల్సి ఉంటుంది. ఈ పార్కులో 90 శాతం వినియోగంలోకి వచ్చిన తర్వాత వాటాను ప్రభుత్వం విక్రయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ డెవలపర్ పార్కును అభివృద్ధి చేయడానికి వస్తే దీర్ఘకాలిక లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రైవేట్ డెవలపర్ను ఎంపిక చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా పార్కును అభివృద్ధి చేయడంలో డెవలపర్ విఫలమైతే ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భారీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి పారదర్శకంగా బిడ్డింగ్ విధానంలో ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పీపీపీ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ డెవలపర్స్ ఎంపిక జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్కులు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగంలో కూడా ప్రైవేట్ పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 25 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు కానున్నాయి. రెడీ టు బిల్డ్.. అంటే తక్షణం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకునే విధానంలో డిజైన్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను కనీనం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పార్కుల మౌలిక వసతుల నిర్మాణ వ్యయంలో 25 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. స్టాంప్ డ్యూటీ, భూ వినియోగ మారి్పడి చార్జీలు (నాలా) వంద శాతం రీయింబర్స్చేస్తారు. రుణాలపై మూడేళ్లపాటు మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కులో 50 శాతం వినియోగంలోకి రాగానే 50 శాతం ప్రోత్సాహకాలు అందిస్తారు. 100 శాతం వినియోగంలోకి వస్తే మిగిలిన 50 శాతం కూడా చెల్లిస్తారు. లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, శీతల గిడ్డంగుల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానంలో పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ రంగంలో లాజిస్టిక్ పార్కులు, ఇన్లాండ్ కంటైనర్ డిపోలను అభివృద్ధి చేయడానికి కనీస పెట్టుబడిని రూ.50 కోట్లుగా నిర్ణయించారు. గోడౌన్ల నిర్మాణానికి రూ.5 కోట్లు, శీతల గిడ్డంగులకు రూ.3 కోట్లుగా నిర్ణయించారు. లాజిస్టిక్స్ వేర్హౌసింగ్కు పరిశ్రమ హోదా ఇవ్వడంతోపాటు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. పేటెంట్ల రిజిస్ట్రేషన్స్ వ్యయంలో 75 శాతంతో పాటు పారిశ్రామిక పాలసీ 2020–23లో పేర్కొన్న రాయితీలను వర్తింపచేస్తారు. -
ప్రైవేటు రంగం మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రభుత్వం కల్పించిన ప్రతిపాదనలను అనుకూలంగా మలుచుకోవాలని భారత పరిశ్రమలను (ఇండియా ఇంక్) ప్రధాని మోదీ కోరారు. ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచినట్టే, ప్రైవేటు రంగం కూడా మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే గరిష్ట ప్రయోజనం పొందగలమన్నారు. బడ్జెట్పై నిర్వహించిన 10వ వెబినార్లో భాగంగా ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మూలధన వ్యయాల లక్ష్యాన్ని చారిత్రక గరిష్ట స్థాయి అయిన రూ.10 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి ప్రశంసలు లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్టీసహా ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల పన్నుల భారం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు ప్రధాని తెలిపారు. ఈ చర్యలతో పన్నుల వసూళ్లు మెరుగుపడ్డాయని.. 2013–14 నాటికి 11 లక్షల కోట్లుగా ఉన్న పన్నుల ఆదాయం 2023–24 నాటికి రూ.33 లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు. -
విశ్రాంత జీవనం.. హాయిగా..!
ప్రజల ఆయుర్ధాయం పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా నేటి యువత ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. లేదంటే సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాలతో స్థిరపడుతున్నారు. జీవించి ఉన్నంత కాలం ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించలేం. ఉద్యోగంలో అయితే 58 ఏళ్లకు దిగిపోవాల్సిందే. స్వయం ఉపాధిలోని వారికి వయో పరిమితి లేదు. అయినా కానీ ఏదో ఒక రోజు చేస్తున్న పనికి విరామం పలకాల్సిందే. శారీరక, ఆరోగ్య పరమైన మార్పులు మునుపటి మాదిరిగా పనిచేయనీయవు. కనుక వృద్ధాప్యంలో పనికి విరామం పలికిన తర్వాత జీవన అవసరాలను తీర్చుకోవడం ఎలా అన్నది ముందే ఆలోచించాలి. దీనివల్ల విశ్రాంత రోజుల్లో ప్రశాంతమైన జీవనానికి అవకాశం లభిస్తుంది. ఈ అంశంపై ‘మనీ పాత్శాల’ వ్యవస్థాపకులు వివేక్ లా ఏం చెబుతున్నారో చూద్దాం... రిటైర్మెంట్ అనేది తప్పనిసరి దీర్ఘకాల ప్రణాళిక. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మరో 20–30 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం కాదు. దీనికి డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు చేసుకోవాలి. చేస్తున్న పనికే రిటైర్మెంట్ కానీ, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం/వ్యాపారం ఆగిపోయినా, మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం ఆగిపోకూడదని అనుకుంటే అందుకు ముందు నుంచి తగిన ఏర్పాట్లు ఉండాలి. ఆర్జన ఆరంభించిన వెంటనే రిటర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. నిజానికి చాలా మంది యువత దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. దీంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎంతో మందికి సవాలుగా మారుతోంది. వాయిదా సరికాదు.. రిటైర్మెంట్ ఆలస్యం చేసిన కొద్దీ లక్ష్యం భారంగా మారుతుంది. పెట్టుబడి ఎంత ముందుగా ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో దీర్ఘకాలంలో అది మంచి నిధిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెలా రూ.5,000 చొప్పున 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. 35 ఏళ్ల కాలంలో ఎంత సమకూరుతుంది? 12% కాంపౌండింగ్ రాబడి అంచనా ప్రకారం రూ.3.24 కోట్లు సమకూరుతుంది. కేవలం నెలకు రూ.5వేలు అంత పెద్ద నిధిగా మారిందంటే అదే కాంపౌండింగ్ మహిమ. ఒకవేళ ఈ పెట్టుడిని ఒక ఏడాది ఆలస్యంగా మొదలు పెట్టారని అనుకుందాం. అంటే 26 ఏళ్లకు ఇన్వెస్ట్మెంట్ మొదలైతే రూ.37 లక్షలు తక్కువ మొత్తం సమకూరుతుంది. ఏడాది ఆలస్యం చేయడం వల్ల ఏర్పడిన నష్టం రూ.37 లక్షలు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడని, అన్నింటికంటే ముందు ఆరంభించే పెట్టుబడి ప్రణాళిక రిటైర్మెంట్ ఫండ్ కావాలి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ 45–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని ప్రపంచమంతా తిరిగి రావాలి? ఇది కొందరి లక్ష్యం కావచ్చు. కానీ, 60 ఏళ్లు వచ్చే నాటికి అయినా దీన్ని సాధించగలిగారా? అని ప్రశ్నిస్తే.. ఎక్కువ మంది నుంచి లేదన్నదే సమాధానం వస్తుంది. సంపాదన మొదలైన నాటి నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మనలో చాలా మంది ఆర్జించే మొత్తం చెప్పుకోతగ్గ గొప్పగా ఉండదు. దీంతో పరిమిత ఆర్జన, అవసరాల నడుమ.. రిటైర్మెంట్ 60 ఏళ్లప్పుడు కదా, తర్వాత చూద్దాంలే? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యుక్త వయసు, ఆరోగ్యం సహకరిస్తున్న రోజుల్లోనే అలా అనుకుంటే.. వృద్ధాప్యానికి చేరువ అవుతున్న సమయంలో రిటైర్మెంట్ ఫండ్ వంటి భారీ లక్ష్యం ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. పిల్లల విద్య, వారి వివాహం, ఇతర బాధ్యతలతో రిటైర్మెంట్కు ముందు వరకు చాలా మంది తీరిక లేకుండా ఉంటారు. కనుక ఏ లక్ష్యాన్నీ నిర్లక్ష్యం చేయడానికి, వాయిదా వేయడానికి లేదు. 25–30 ఏళ్ల కెరీర్లో రోజువారీ అవసరాల్లో ఎలాంటి రాజీ పడకుండా, రిటైర్మెంట్కు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం ఎలా? ఆర్థిక ప్రణాళిక ఇందుకు మార్గం చూపుతుంది. జీవితంలో ఏవి కావాలని కోరుకుంటున్నారు? అందుకోసం ఏం చేయాలి, ఎలా చేయాలనేది? ఆర్థిక ప్రణాళిక స్పష్టం చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. కారణాలు ఏవైనా, రిటైర్మెంట్ నాటికి కావాల్సినంత నిధి సమకూర్చుకోలేకపోతే తిరిగి మునుపటి మాదిరి యువకుల్లా పనిచేయడం సాధ్యపడదు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఉదాహరణకు మీరు 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుంటే, 90 ఏళ్ల వరకు జీవించి ఉండేట్టు అయితే కనీసం 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిధి అవసరమవుతుంది. ఇది చాలా పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు, పిల్లల విద్య, వారి వివాహాలు, వృద్ధాప్యంలో జీవన అవసరాలు, ద్రవ్యోల్బణం వల్ల పెరిగిపోయే జీవన వ్యయాలను విస్మరించడానికి లేదు. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా అవసరాలు తీర్చుకునేందుకు రూ.3 లక్షలు కావాలని అనుకుంటే.. ఏటా 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా ఆధారంగా రూ.10 కోట్ల నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 35 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్ ఆరంభించారని అనుకుంటే.. 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి మీ చేతిలో 25 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి నెలా రూ.55,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏటా 12% చొప్పున వృద్ధిని చూస్తుందనుకుంటే 60 ఏళ్ల నాటికి రూ.10 కోట్లు సమకూరుతుంది. అందుకే మొదటి నెల వేతనం నుంచే రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి తొలి అడుగు పడాలి. తల్లిదండ్రులు లేదా తాతలు ప్రభుత్వరంగంలో ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అవ్వడంతో, వారికి పెన్షన్ సదుపాయం ఉండేది. కానీ మన పరిస్థితి అలా కాదు. గ్యారంటీడ్ పెన్షన్ అనేది లేదు. ఎవరికి వారే సొంతంగా నిధిని సమకూర్చుకుని, దానిపై ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం 4–6 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అంటే నేడు పాకెట్లో ఉన్న రూ.1000 విలువ ఏడాది తర్వాత రూ.96కు తగ్గుతుంది. ఇలా తరిగిపోయే విలువకు తగిన రక్షణగా అదనపు పెట్టుబడి అవసరం ఉంటుంది. మిగులు లేదని చెప్పుకోవద్దు.. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు లేదని కొందరు చెబుతుంటారు. తర్వాత వీలు చూసుకుని మొదలు పెడదామని, అనుకుంటూ ఉంటుంటారు. కానీ, విలువైన సమయాన్ని వృధా చేసిన తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం పొదుపు చేసినా అది గణనీయమైన వృద్ధిని చూడడానికి కావల్సిందన వ్యవధి ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలోనే 25 ఏళ్లకు కాకుండా, తీరిగ్గా 45 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెటు మొదలు పెట్టారని అనుకుందాం. ప్రతి నెలా రూ.50,000 చొప్పున అక్కడి నుంచి 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. 12 శాతం కాంపౌండింగ్ రాబడి చొప్పున 2.5 కోట్లు సమకూరుతుంది. 25 ఏళ్ల వయసులో ఆరంభించడం వల్ల కేవలం ప్రతి నెలా రూ.5వేలతోనే రిటైర్మెంట్ నాటికి రూ.3.24 కోట్లు సమకూరుతుంటే.. 20 ఏళ్లు ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ప్రతి నెలా రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అప్పటికీ సమకూరే మొత్తం కేవలం రూ.2.5 కోట్లు కావడాన్ని గమనించాలి. సమకూర్చుకునేది ఎలా? రిటైర్మెంట్ ప్రణాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్ సమయం వచ్చేంత వరకు కావాల్సిన నిధిని సమకూర్చుకోవడం. రిటైర్మెంట్ తర్వాత ఆ నిధి నుంచి ప్రతి నెలా రాబడి పొందడం రెండోది అవుతుంది. 25–30 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది కనుక, పెట్టుబడులకు ఈక్విటీలను మెరుగైన మార్గంగా చూడాలి. దీర్ఘకాలంలో ఈక్విటీలను మించి కాంపౌండెడ్ రాబడులను ఇచ్చిన మెరుగైన సాధనం మరొకటి లేదనే చెప్పుకోవాలి. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎన్పీఎస్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్థిక సలహాదారు సూచనలను తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. నిపుణుల సాయంతో రాబడుల అంచనాలు, కాల వ్యవధి ఆధారంగా పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్కు సమయం దగ్గర పడుతుండగా, ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుని, డెట్కు మళ్లించుకోవడంలో ఆర్థిక సలహాదారు సాయపడతారు. తద్వారా మీ లక్ష్యాలు నెరవేరతాయి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. -
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓ ఓకే
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) విజయవంతమైంది. మంగళవారం(31) చివరిరోజుకల్లా పూర్తిస్థాయిలో బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. స్టాక్ ఎక్సే్ఛంజీల గణాంకాల ప్రకారం 5.08 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. నాన్రిటైల్ ఇన్వెస్టర్లు ప్రధానంగా భారీ సంఖ్యలో బిడ్స్ దాఖలు చేయడం ఇందుకు సహకరించింది. నాన్ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 96.16 లక్షల షేర్లను రిజర్వ్ చేయగా.. మూడు రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 1.2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు, కంపెనీ ఉద్యోగుల నుంచి అంతంతమాత్ర స్పందనే లభించినట్లు బీఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. రిటైలర్లకు 2.29 కోట్ల షేర్లు కేటాయించగా.. 12 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగులకు పక్కనపెట్టిన 1.62 లక్షల షేర్లకుగాను 55 శాతానికే స్పందన లభించింది. ఎఫ్పీవోకింద కంపెనీ మొత్తం 6.14 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. యాంకర్ ఇన్వెస్టర్లుసహా ఇతరుల నుంచి 6.45 కోట్ల షేర్లకు డిమాండ్ నమోదైంది. షేరు అప్ ఎఫ్పీవో ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. ఇష్యూ ముగింపు నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో 3.35 శాతం బలపడి రూ. 2,975 వద్ద ముగిసింది. గత వారం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 33 ఫండ్స్కు 1.82 కోట్ల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 3,276 ధరలో జారీ చేసింది. షేర్లను కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్ల జారబితాలో అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్, సొసైటీ జనరాలి, గోల్డ్మన్ శాక్స్ ఇన్వెస్ట్మెంట్ (మారిషస్), మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్), నోమురా సింగపూర్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషన్ తదితరాలున్నాయి. యాంకర్బుక్లో దేశీ దిగ్గజాలు ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ తదితరాలున్నాయి. ఎఫ్పీవో నిధుల్లో రూ. 10,689 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత ఎయిర్పోర్టుల పనులు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణం తదితరాలకు వినియోగించనుంది. -
ప్రైవేటు బ్యాంకుగానే ఐడీబీఐ బ్యాంక్, స్పష్టం చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్ఐసీ, ప్రభుత్వ వాటాల విక్రయం తదుపరి ఐడీబీఐ బ్యాంకు దేశీ ప్రయివేట్ రంగ సంస్థగా కొనసాగనున్నట్లు ఆర్ధిక శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. వ్యూహాత్మక విక్ర యం తదుపరి మిగిలిన 15% ప్రభుత్వ వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్గా పరిగణించనున్నట్లు తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా(ఎంపీఎస్) విషయంలో బ్యాంకు కొత్త యాజమాన్యానికి అధిక గడువును అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బ్యాంకును గెలుపొందిన బిడ్డర్ అనుబంధ సంస్థల పునర్వ్యవస్థీకరణను చేపట్టడంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. బ్యాంకు కొనుగోలులో భాగంగా ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) సందేహాలకు సమాధానమిచ్చే ప్రక్రియకింద ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ఈ అంశాలపై వివరణ ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకు విక్రయానికి ప్రభుత్వం అక్టోబర్ 7న బిడ్స్కు ఆహ్వానం పలికింది. డిసెంబర్ 16కల్లా కొనుగోలుదారులు ఈవోఐలను దాఖలు చేయవలసి ఉంటుంది. సంయుక్తంగా విక్రయం ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. పబ్లిక్ వాటా 5.2 శాతంగా నమోదైంది. దీంతో కొనుగోలుదారుడు 5.28 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ను ప్రకటించవలసి వస్తుంది. విక్ర యంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభు త్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
విక్రమ్–ఎస్ ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన ఈ రాకెట్కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు. ప్రైవేట్రంగంలో తొలి రాకెట్ కావడంతో దీనిని ప్రారంభ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రాకెట్ మూడు అతిచిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఈ పేలోడ్స్ రోదసీలో భూమికి అతి తక్కువ దూరం అంటే 81 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉండి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. ఇది 83 కేజీల మూడు పేలోడ్స్ను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఘన ఇంధనంతో కూడిన సింగిల్ స్టేజ్ రాకెట్ కావడం దీని ప్రత్యేకత. ఈ రాకెట్ ద్వారా స్పేస్కిడ్జ్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థకు చెందిన 2.5 కేజీల ఫన్–శాట్ను కక్ష్యలోకి పంపుతున్నారు. దీనిని ఐఐటీ విద్యార్థులు, అమెరికా, సింగపూర్, ఇండోనేసియా విద్యార్థులు సంయుక్తంగా తయారుచేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్–స్పేస్ టెక్, ఆర్మేనియాకు చెందిన బజూమ్క్యూ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్కు చెందిన పేలోడ్లను రాకెట్ మోసుకెళ్లనుంది. -
‘విక్రమ్’ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: భారత్లో తొలిసారిగా ప్రైవేట్రంగంలో రూపుదిద్దుకున్న విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా మూడ్రోజులు వాయిదాపడింది. నవంబర్ 15న చేపట్టాల్సిన ప్రయోగాన్ని నవంబర్ 18న ఉదయం 11.30కి నిర్వహిస్తామని దాని తయారీదారు, హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం వేదిక నుంచి దీనిని ప్రయోగిస్తారు. -
విస్తరణపై ‘ప్రైవేట్’ దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్కు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ)లలో పెట్టుబడి అవకాశాలపై ప్రయివేట్ రంగం దృష్టి సారించాల్సి ఉందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆర్థిక నిర్వహణగా కాకుండా సంస్కరణల కోణంలో చూడవలసిందిగా సూచించారు. కార్పొరేట్ సుపరిపాలన కారణంగా సీపీఎస్ఈలు మెరుగైన పనితీరు చూపుతున్నాయని తెలిపారు. దీంతో వాటాదారులకు సీపీఎస్ఈ షేర్లు స్టాక్ మార్కెట్ ఇండెక్సులతో పోలిస్తే అత్యుత్తమ రిటర్నులు(లాభాలు) అందిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ కంపెనీలు వృద్ధి బాటలో సాగడంతోపాటు దేశ, విదేశాలలో క్లిష్టతరహా బిజినెస్లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తి పెంపు, ఉద్యోగ సృష్టి తదితర లబ్దిని చేకూర్చగల విస్తరణ అంశాలకు ప్రయివేట్ రంగం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సొంత సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోకుండా సంకోచాలు వీడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవలసిందిగా దేశీ కార్పొరేట్లకు మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో పాండే అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యూహాత్మక విక్రయానికి దీపమ్ సుమారు ఏడు ప్రభుత్వ రంగ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ), కంటెయినర్ కార్పొరేషన్(కంకార్), వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్ త్వరలో ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్కు వీలుగా త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు తెరతీయనున్నట్లు దీపమ్ కార్యదర్శి పాండే వెల్లడించారు. బ్యాంక్ వ్యూహాత్మక విక్రయానికి 2021 మే నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్గా ఉన్న బీమా రంగ పీఎస్యూ ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ప్రాథమిక బిడ్స్కు ఆహ్వానం పలికేముందు ప్రభుత్వం, ఎల్ఐసీ ఎంతమేర వాటాలు ఆఫర్ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పాండే తెలియజేశారు. ఫిక్కీ సీఏపీఏఎమ్ 2022 నిర్వహించిన 19వ వార్షిక క్యాపిటల్ మార్కెట్ సదస్సులో పాండే ఈ విషయాలు పేర్కొన్నారు. -
47 శాతం యాంటీబయోటిక్స్కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్ఈస్టు ఆసియా’ జర్నల్లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
ప్రైవేట్పై నమ్మకమే అభివృద్ధికి దన్ను
గాంధీనగర్: దేశ పురోగతి, అభివృద్ధి సాధనలో ప్రైవేట్ రంగంపై నమ్మకం ఉంచడం కీలకమని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని విశ్వసించిందని, దేశ ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి.. ఉద్యోగాల కల్పన విషయంలో ముందంజలో ఉండేలా పరిశ్రమను ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు. అలాగని ప్రైవేట్ రంగంలో లోపాలు లేకపోలేదని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వ .. ప్రైవేట్ రంగాల సానుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని చూస్తే ప్రైవేట్ వైపే సానుకూలాంశాల మొగ్గు కొంత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఈ 60–65 ఏళ్లు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను చూసిన మీదట .. భవిష్యత్తులో ప్రైవేట్ రంగంపై ఆధారపడటం ద్వారా భారత్ ముందుకు వెళ్లగలదు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు‘ అని భార్గవ చెప్పారు. మారుతీ సుజుకీ కార్యకలాపాలు ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, రాబోయే 10–20 ఏళ్లలో దేశీయంగా ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై స్పందిస్తూ భార్గవ ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అంత సమర్ధమంతంగా లేకపోవడానికి రాజ్యాంగపరమైన పరిమితులు, లీగల్ విధానాలు, అలాగే నియంత్రణలు.. పర్యవేక్షణ మొదలైన అంశాలు కారణమని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియను స్వాగతిస్తున్నట్లు భార్గవ చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, దివాలా కోడ్, జీఎస్టీ అమలు, కార్పొరేట్ ట్యాక్స్లను తగ్గించడం మొదలైన సంస్కరణలు ప్రశంసనీయమని ఆయన చెప్పారు. ‘కొన్నేళ్ల క్రితం దేశీయంగా పారిశ్రామిక వృద్ధిపై నేను నిరాశావాదంతో ఉన్నాం. బోలెడన్ని మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఏదీ జరిగేది కాదు. కానీ ఒక్కసారిగా సంస్కరణల రాకతో భారత్ మారుతోందని నాకు తోచింది. భవిష్యత్తు ఆశావహంగా ఉండగలదని అనిపించింది‘ అని భార్గవ తెలిపారు. ఈసారి అత్యధిక ఉత్పత్తి.. సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రికార్డులు నమోదు చేయగలదని భావిస్తున్నట్లు భార్గవ చెప్పారు. ‘భారత్లోను, కార్ల పరిశ్రమలోను 2022–23లో ఉత్పత్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. నేను కేవలం మారుతీ గురించి మాట్లాడటం లేదు. మొత్తం కార్ల పరిశ్రమ గురించి చెబుతున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. 2018–19లో దేశీయంగా రికార్డు స్థాయిలో 33,77,436 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 30,69,499 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. -
నిరుద్యోగులకు ప్రైవేటు కొలువులిప్పిస్తున్నాం
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే నని, అందువల్ల నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కలిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్ను కేటీఆర్ సందర్శించి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆస్పత్రిలో పిల్లల వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. రాష్ట్రంలో తమ తొలి విడత ఐదేళ్ల పాలనలో 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, ప్రస్తుత రెండో దఫా పాలనలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ప్రధాని మోదీ కేవలం 10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగార్థులందరూ సెల్ఫోన్ పక్కనపెట్టి అంకితభావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీసర్కిళ్లను సీఎం మంజూరు చేసినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అభ్యర్థులు అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ చోదకశక్తిగా ఎదిగింది.. తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ రెట్టింపు అయిందని.. దేశాన్ని సాదుతున్న రాష్ట్రంగా, ఆర్థిక చోదకశక్తిగా ఎదుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. ఇవి ఆర్బీఐ చెప్పిన లెక్కలని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ.3,65,797 కోట్లు రాష్ట్రం నుంచి ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన కేంద్రం అడుగడుగునా వివక్ష చూపతోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపై గలమెత్తుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
ప్రైవేటుతో మౌలిక వసతుల ప్రగతి
సాక్షి, హైదరాబాద్: దేశ మౌలిక వసతుల వ్యవస్థను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేటు రంగం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారత్కు పుష్కలమైన శక్తి సామర్థ్యాలున్న ప్రస్తుత సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ సుస్థిర ప్రగతి పథంలో భాగస్వాములు కావాలన్నారు. మౌలిక వసతుల వృద్ధిద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలన్నారు. శనివారం సీఈవో క్లబ్స్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తోందన్నారు. పారిశ్రామిక రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, పోటీ వాతావరణంలో సృజనాత్మకంగా ముందుకెళ్లాలని కోరారు. సంపదను పెంచుకోవడంతోపాటు ఉపాధి కల్పనకు బాటలు వేయాలని సూచించారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సమన్వయం అవసరమని సూచించారు. డిజిటల్ సేవలు, తయారీ రంగం వంటి ఎన్నో రంగాల్లో మన దేశంలో అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయన్నారు. కావలసిందల్లా వాటిని గుర్తించి, ప్రోత్సహించి సద్వినియోగపరచుకోవడమేనని చెప్పారు. కార్యక్రమంలో సీఈవో క్లబ్స్ అధ్యక్షుడు శ్రీ కాళీప్రసాద్ గడిరాజు, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ కృష్ణ ఎల్ల, సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్ల, ట్రెండ్ సెట్ బిల్డర్స్ చైర్మన్ డాక్టర్ కె.ఎల్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యవిద్యా రంగంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించండి..ప్రైవేట్ సంస్థలకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: భాషాపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ మన విద్యార్థులు ఇతర చిన్నచిన్న దేశాలకు సైతం వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోకడను నివారించేందుకు ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యకు అవసరమైన భూ కేటాయింపులకు రాష్ట్రాలు సులభమైన విధానాలను తీసుకురావాలన్నారు. దేశంతోపాటు ప్రపంచ దేశాలకు కూడా అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని మన వద్దనే తయారు చేసుకోవచ్చని చెప్పారు. శనివారం ప్రధాని కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యరంగానికి కేటాయింపులపై ఒక వెబినార్లో ప్రసంగించారు. దేశంలోనే వైద్య విద్యకు విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న మన వైద్యులు తమ నైపుణ్యంతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు పనులు సాగుతున్నట్లు వివరించారు. -
ప్రైవేట్ ఉద్యోగుల పంట పండింది!! భారీగా పెరగనున్న జీతాలు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో గత రెండు సంవత్సరాలుగా వేతనాల విషయంలో నిరాశను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ ఏడాది పంట పండనుంది. వారి వేతనాలు 9 శాతం వరకు పెరగొచ్చని ‘మెర్సర్స్ టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ తెలిపింది. 2020లో వేతన పెంపులు తగ్గడం తెలిసిందే. కానీ, ఈ ఏడాది కరోనా పూర్వపు స్థాయిలో వేతన పెంపులను కంపెనీలు చేపట్టొచ్చని ఈ సర్వే పేర్కొంది. 988 కంపెనీలు, 5,700 ఉద్యోగ విభాగాలకు సంబంధించి అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. కన్జ్యూమర్, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాలు 2022లో ఇతర రంగాల కంటే అధిక వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఈ సర్వే తెలిపింది. ‘‘సంస్థలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయమై కరోనా పూర్వపు స్థాయిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉండడం కీలకమైన సానుకూలత. 2022లో అన్ని రంగాల్లోనూ వేతన పెంపు 9 శాతంగా ఉండనుంది. 2020లో ఇది 7.7 శాతమే. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంట్ను ఇది తెలియజేస్తోంది’’ అని రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ మన్సీ సింఘాల్ పేర్కొన్నారు. ►సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్అండ్డీ, విక్రయాలకు ముందు సేవలు, డేటా సైన్సెస్ విభాగాల్లో 12 శాతం మేర వేతనాలు పెరగనున్నాయి. ► టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన వారికి ఈ ఏడాదే కాకుండా, రానున్న రోజుల్లోనూ ఎక్కువ వేతన ప్రయోజనాలు లభించనున్నాయి. ►ఆరంభ స్థాయి ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాల రూపంలో ఫ్రెషర్లను తీసుకుంటున్నందున.. టెక్నో ఫంక్షనల్ బాధ్యతల్లోని వారికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది. -
‘ప్రైవేటు’తోనే ఉద్యోగావకాశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పెట్టుబడులే ఆర్థికాభివృద్ధికి చోదకాలని, ఆర్థికాభివృద్ధి లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించ లేమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.రాజీవ్కుమార్ స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి చర్యలతో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే దిశగా కేంద్ర బడ్జెట్కు రూపకల్పన చేసినట్టు వెల్ల డించారు. కేంద్ర బడ్జెట్ 2022–23పై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) మంగళవారం నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడారు. ఆవిష్కరణలు, పెట్టుబడులు, సమ్మిళిత అభివృద్ధి, రవాణా వనరుల అనుసంధానం బడ్జెట్కు 4 మూల స్తంభాలన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్లకు బడ్జెట్లో భారీగా రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించామన్నారు. ప్రజలపై భారం మోపేలా ఎలాంటి పన్నులను పెంచలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో ఆహార పదార్థాల ధరలు, ద్రవ్యోల్బణం దిగి వస్తోందన్నారు. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని జారీ అవకాశాలపై ఇప్పుడు మాట్లాడడం తొందరపాటు అవుతుందని రాజీవ్కుమార్ స్పష్టం చేశారు. ప్రగతిశీల బడ్జెట్ను కేంద్రం తీసుకొచ్చిందని ఆస్కీ చైర్మన్ కె.పద్మనాభయ్య అన్నారు. -
పెట్టుబడులు పెంచండి
న్యూఢిల్లీ: ‘టీమ్ ఇండియా’ (భారత జట్టు)లో చేరి, భారత ప్రభుత్వ మూలధన వ్యయ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెంచాలని ప్రైవేటు రంగానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. రానున్న సంవత్సరాల్లోనూ భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా గుర్తింపు నిలబెట్టుకునేందుకు సాయంగా నిలవాలని కోరారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం 35 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లను చేరుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు.. ప్రైవేటు రంగం నుంచి సైతం ఇతోధిక పెట్టుబడులకు మార్గం చూపుతుందన్నారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులకు ఇది అవకాశాల తరుణం. మీ సామర్థ్యాలను విస్తరించుకోండి. కరోనా మహమ్మారి రావడానికి ముందుతో పోలిస్తే కార్పొరేట్ పన్ను తగ్గించాం. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని కోరుతున్నాను’’ అంటూ పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–8.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసిన విషయం గమనార్హం. ‘‘ముందుకు రండి. వీలైనంత మెరుగ్గా కృషి చేయండి. టీమ్ ఇండియాలో భాగస్వాములై ఈ ఏడాది, వచ్చే ఏడాది, తర్వాతి సంవత్సరాల్లోనూ భారత్ మెరుగైన వృద్ధి నమోదు చేసేందుకు మద్దతుగా నిలవండి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. -
క్యూ2లో టాటా స్టీల్ జోరు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 12,548 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,665 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 39,158 కోట్ల నుంచి రూ. 60,554 కోట్లకు జంప్చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,000 కోట్ల నుంచి రూ. 47,135 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 7.25 మిలియన్ టన్ను(ఎంటీ)ల నుంచి 7.77 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు మాత్రం 7.93 ఎంటీ నుంచి 7.39 ఎంటీకి వెనకడుగు వేశాయి. కాగా.. స్టాండెలోన్ నికర లాభం రూ. 2,539 కోట్ల నుంచి రూ. 8,707 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 21,820 కోట్ల నుంచి రూ. 32,964 కోట్లకు జంప్చేసింది. నాట్స్టీల్ విక్రయం..: సింగపూర్ అనుబంధ సంస్థ నాట్స్టీల్ హోల్డింగ్స్లో 100 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. దేశీ బిజినెస్తోపాటు.. యూరోపియన్ కార్యకలాపాలు సైతం పటిష్ట ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అయితే బొగ్గు ధరలు, ఇంధన వ్యయాల కారణంగా భవిష్యత్లో మార్జిన్లపై ఒత్తిడి పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. 5 ఎంటీ వార్షిక సామర్థ్యంతో చేపట్టిన కళింగనగర్ రెండో దశ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ బీఎస్ఎల్ విలీనాన్ని త్వరలో పూర్తిచేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇటీవలే అధిక నాణ్యతగల గంధల్పాడ ఇనుపఖనిజ గనులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో రూ. 11,424 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,299 వద్ద ముగిసింది. రూ. 1,324 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఇండస్ఇండ్.. రయ్ లాభం 73 శాతం జూమ్
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంకు సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్గా నికర లాభం 73 శాతం పెరిగింది. రూ.663 కోట్ల లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. రుణాల్లో వృద్ధికితోడు, ఎన్పీఏలకు (వసూలు కాని మొండి రుణాలు) కేటాయింపులు తగ్గడం లాభం పెరిగేందుకు దోహదపడింది. సూక్ష్మ, వాహన రుణ విభాగం లో ఒత్తిళ్లు ఉన్నట్టు బ్యాంకు ప్రకటించింది. ► నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,658 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ మార్జిన్ 4.07 శాతంగా ఉంది. ► ఫీజుల రూపంలో ఆదాయం రూ.1,554 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగింది. ► సెప్టెంబర్ త్రైమాసింకలో రూ.2,658 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ► స్థూల ఎన్పీఏలు 2.77 శాతానికి చేరాయి. ఇవి అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 2.21శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరికి 2.88 శాతంగా ఉన్నాయి. ► కేటాయింపులు రూ.1,703 కోట్లకు తగ్గాయి. -
సొంతింటికొస్తున్న విమానం
ఎయిర్ ఇండియా తిరిగి టాటా చేతికే వచ్చేసింది. స్వాతంత్రానికి పూర్వం ప్రయివేటు రంగంలో మొదలై, తర్వాత ప్రభుత్వ పరమై... భారత దేశ కీర్తి పతాకాన్ని దశాబ్దాల పాటు విశ్వ గగన వీధుల్లో రెపరెపలాడించిన ఓ విమానయాన సంస్థ తిరిగి అదే సంస్థ చేతికి రావడం భావోద్వేగాలు రేపే ఘట్టం! ‘చరిత్ర పునరావృతమౌతుంది’ అని తరచూ వాడే నానుడి ఇక్కడ నిజమైంది. ‘భూమి గుండ్రంగా ఉండును...’ అనేది సాపేక్షంగా రుజువవుతుందన్నట్టు... కొన్ని పరిణామాలు మొదలైన చోటికే మళ్లీ చేరడాన్ని జనం వింతగా చూస్తారు. కొందరు ఆశ్చర్యపోతారు. మరికొందరు లోతైన భావోద్వేగాలకు లోనవుతారు. భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, దేశంలో లైసెన్స్ పొందిన తొలి కమర్షియల్ పైలెట్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జే.ఆర్.డి) టాటా 1932లో స్థాపించిన సంస్థ, 1953లో చట్టం ద్వారా ప్రభుత్వ నిర్వహణలోకి వెళ్లి, 68 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంస్థ చేతుల్లోకి వచ్చింది. ఎయిర్ ఇండియా నూటికి నూరు శాతం కొనుగోలుకై వచ్చిన తాజా బిడ్లలో టాటాయే అర్హమైనట్టు, చివరకు అదే ఎంపికయినట్టు కేంద్రంలోని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం)’ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే శుక్రవారం అధికారికంగా ప్రకటించడంతో దేశమంతా ఓ ఆహ్లాదపు వార్త విన్న అనుభూతి పొందింది. ఎందుకంటే, టాటా గ్రూప్కు, దాని యాజమాన్యానికి ఉన్న పేరు అటువంటిది. జాతీయతా భావాలు కలిగిన నిబద్ద కార్పొరేట్ సంస్థగా వారికున్న పేరు దేశంలో మరే సంస్థకూ లేదంటే అతిశయోక్తి కాదు! ‘టాటా గ్రూప్కు ఇస్తే మంచిది. ఎయిర్ ఇండియాను స్వీకరించి, సమర్థంగా నిర్వహించడానికి అంతకు మించిన కార్పొరేట్ ఏదీ ఇవాళ దేశంలో లేదు’ అని ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అçహ్లువాలియా రెండు రోజుల కింద చేసిన ట్వీట్ సగటు భారతీయుల భావాల ప్రతీక! చివరకు అదే జరిగింది. ‘...జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే విమానయాన సంస్థను పొంది, నిర్వహించే అవకాశం, గ్రూప్కు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తాం. ఓ ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్ది ప్రతి భారతీయుడూ గర్వించేలా చేస్తాం....’ అన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తక్షణ స్పందన గ్రూప్ సంస్థల సంకల్పాన్ని ప్రతిబింబించేదే! ఎయిర్ ఇండియాను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చేసిన తొలి యత్నం కాదిది. 2000– 01లోనే అప్పటి బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం, నిధుల సమీకరణ కోసం ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సన్నద్దమైంది. అప్పుడూ టాటా గ్రూప్తో పాటు సింగపూర్ ఎయిర్లైన్స్ ఓ ప్రయత్నం చేశాయి. కానీ, ఎందుకో వ్యవహారం కుదరలేదు. 2005 తర్వాత ప్రయివేటు రంగం పోటీని, ప్రభుత్వ రంగంలోని అలసత్వాన్ని ఎయిర్ ఇండియా తట్టుకోలేకపోయింది. తీవ్ర నష్టాలు, తీరని రుణభారంతో అల్లాడుతూ వచ్చింది. ముఖ్యంగా, 2007లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వపు యూపీఏ ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ని విలీనం చేసి, యాౖభై వేలకోట్ల రూపాయల రుణం ఇప్పించడం ద్వారా కొత్త విమానాల్ని కొనుగోలు చేయించింది. మెరుగవక పోగా, పరిస్థితి దిగజారింది. ఒక దశలో ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి వచ్చినపుడు, ఈక్విటీ ఫండ్ రూపంలో కేంద్రం ముఫ్ఫై వేల కోట్ల రూపాయలు ఇప్పించినా కోలుకోలేకపోయింది. ఎయిర్ ఇండియా వాటాలు 76 శాతం, ఎయిర్ ఇండియా–సింగపూర్ ఎయిర్పోర్ట్ టర్మినల్ సర్వీసెస్ వాటాలు 50 శాతం విక్రయించాలని 2018లో చేసిన మరో ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక నూరుశాతం విక్రయమే మార్గమని, 2019లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకిలా పరిణమించింది. 63 వేల కోట్ల రూపాయల రుణభారంతో ఉన్న ఎయిర్ ఇండియాను కొనడానికి వచ్చిన బిడ్లలో స్పైస్జెట్, టాటా చివరి వరకూ మిగిలి, టాటా సన్స్ అంతిమ విజేత అయింది. టాటాలకు ఇంతటి శక్తి, కీర్తి ఒక రోజులో వచ్చినవి కాదు. నూరేళ్లకు పైబడ్డ సంకల్ప ఫలం. నిబద్ధత, దేశభక్తి, అంకితభావం కలగలిసిన కృషి ఫలితం. చిన్న గుండుసూది తయారీ నుంచి పెద్ద విమానాలు నడుపడం వరకు దేశాభివృద్ధిలో టాటాల భాగస్వామ్యం అగణితమని చెప్పాలి. నడమంత్రపు సిరితో తూగుతున్న నయా కార్పొరేట్లతో పోలిస్తే టాటాలది ఈ దేశపు మట్టితో, గాలితో, పౌరుల బతుకుతో ముడివడ్డ ప్రగతి! 1991 మార్చి 23న, జేఆర్డీ టాటా, బాంబేహౌజ్లోని తన కార్యాలయంలో కూర్చొని ‘నేను రిటైర్ అవాలని, ఆ స్థానంలో నిన్ను ప్రకటించాలని నిర్ణయించాను’ అని వెల్లడించడానికి దశాబ్దం ముందు నుంచే రతన్ టాటా మది నిండా ఆలోచనలున్నాయి. టాటా విస్తరణ బ్లూప్రింట్ అప్పటికే తయారైంది. ఒకవైపు దేశ ఆర్థికస్థితి, మరోవైపు ప్రభుత్వ విధానాల్ని గమనంలోకి తీసుకొని ఆయనీ బ్లూ ప్రింట్ రూపొందించారు. లైసెన్స్రాజ్లో ఎదురైన చేదు అను భవాలు ఆయనకు తెలుసు. టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి సంస్థల్ని అగ్రస్థానంలో నిలప డానికి ఎన్నెన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు! ఉత్పత్తి, ధరలు, విక్రయాలు, మార్కెటింగ్, ఎగుమతి–దిగుమతులు, విదేశీ మారకం.... ఇలా, అప్పట్లో ప్రతిదీ నియంత్రణే! అన్నీ అధిగమించి, దేశ ప్రయోజనాల విషయంలో అణుమాత్రం రాజీపడకుండా సంప్రదాయ–నెమ్మది పంథా నుంచి టాటా గ్రూప్ను ప్రపంచ పోటీ తట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. టాటా అంటే, ఇవాళ విశ్వస నీయత కలిగిన బ్రాండ్! దేశ ప్రగతి సౌధంలో ఒక్కో ఇటుకై నిలిచిన పెద్ద గోడ! ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ అనివార్యమైతే... అందుకు టాటాయే యోగ్యం! దేశానికి అదే ప్రయోజనకరం. -
రెండోరోజూ బుల్ సందడి
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ బుల్ సందడి చేసింది. ఇంధన, ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 446 పాయింట్లు పెరిగి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 17,822 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితులు, బాండ్, ఫారెక్స్ మార్కెట్లలో అస్థిరతలను విస్మరిస్తూ కొనుగోళ్లకే కట్టుబడ్డారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఇంధన షేర్లకు, డాలర్ మారకంలో రూపాయి క్షీణత ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అయితే ఫార్మా, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.చిన్న, మధ్య తరహా షేర్లలో ఓ మోస్తారు కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు అర శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో 10 షేర్లు నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1915 కోట్ల షేర్లను అమ్మగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1868 కోట్ల షేర్లను కొన్నారు. క్రూడాయిల్ ధరల ప్రభావంతో ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. టెక్నాలజీ షేర్లు రికవరీతో యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగింపు... దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 59,320 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 17,661 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ప్రపంచ మార్కెట్లోని ప్రతికూలతలతో సూచీలు ఆరంభంలో తడబడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలో వెంటనే కోలుకున్నాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో సేవల రంగ నెమ్మదించినా.., గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చింది. యూరప్ మార్కెట్ల స్వల్ప లాభాల ప్రారంభంతో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 479 పాయింట్లు ఎగసి 59,778 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు ర్యాలీ చేసి 17,833 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. మిడ్సెషన్లోనూ స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు దాదాపు ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగిశాయి. రెండు రోజుల్లో రూ.5.17 లక్షల కోట్లు... స్టాక్ సూచీలు వరుస లాభాలతో దూసుకెళ్లడంతో స్టాక్ మార్కెట్లో రెండో రోజుల్లో రూ.5.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.265 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 980 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు పెరిగింది. ప్రభుత్వానికి పీఎస్యూల డివిడెండ్లు ఓఎన్జీసీ, కోల్ ఇండియా చెల్లింపులు న్యూఢిల్లీ: ప్రమోటర్గా కేంద్ర ప్రభుత్వం ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఓఎన్జీసీ, కోల్ ఇండియా నుంచి తాజాగా డివిడెండ్లను అందుకుంది. కోల్ ఇండియా రూ. 1,426 కోట్లు, ఓఎన్జీసీ రూ. 1,406 కోట్లు చొప్పున ప్రభుత్వానికి చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది (2021–22)లో సీపీఎస్ఈల నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల రూపేణా రూ. 4,576 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థల(సీపీఎస్ఈలు)లో వాటాల విక్రయం ద్వారా రూ. 9,110 కోట్లను సమీకరించినట్లు పేర్కొన్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►దాదాపు రూ.300 కోట్ల ఆర్డర్లను దక్కించుకోవడంతో హెచ్ఎఫ్సీఎల్ షేరు 5% ఎగసి అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది. షేరు రూ.79 స్థాయి వద్ద స్థిరపడింది. ►కేంద్రం స్పెక్ట్రం వినియోగ ఛార్జీలను తగ్గించడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. ఈ రంగానికి చెందిన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ తదితర కంపెనీల షేర్లు ఐదు శాతం నుంచి 2% లాభపడ్డాయి. ►ఇంధన షేర్లలో ర్యాలీ భాగంగా రిలయన్స్ షేరు రాణించింది. బీఎస్ఈ ఇంట్రాడేలో రెండు శాతానికి పైగా ఎగసి రూ.2612 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 2% లాభంతో రూ.2609 వద్ద స్థిరపింది. ►చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు నిర్వహణ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్బీఐ బోర్డును రద్దు చేయడంతో శ్రేయీ ఇన్ఫ్రా షేర్లు ఐదుశాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్ను తాకాయి. -
స్పేస్ టెక్నాలజీ హబ్గా రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సాంకేతికత (స్పేస్ టెక్నాలజీ)కు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే ‘తెలంగాణ స్పేస్టెక్ పాలసీ ఫ్రేమ్వర్క్’ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసిన ఐటీ శాఖ... దీనిపై ఈ నెల 25లోగా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. రోజువారీ సమస్యలకు పరిష్కారాలు... ప్రజల దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలకు చూపడంలో అంతరిక్ష సాంకేతికత అంచనాలకు మించి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. భారతీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘స్పేస్కామ్ పాలసీ 2020’, ‘స్పేస్ ఆర్ఎస్ పాలసీ 2020’, ‘జియో స్పేషియల్ పాలసీ 2021’తదితరాలను విడుదల చేసింది. దీంతో ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్), ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్’(ఇన్స్పేస్) వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష ఆర్థిక రంగంలో ప్రైవేటు రంగం మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ స్పేస్టెక్ పాలసీ ఫ్రేమ్వర్క్’ను సిద్ధం చేసింది. తద్వారా ప్రపంచ స్పేస్ టెక్నాలజీ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపార, వాణిజ్యాభివృద్ధి, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లకు పరీక్ష కేంద్రంగా తీర్చిదిద్దడం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, భాగస్వామ్యాలను ఆహ్వానించడం వంటి లక్ష్యాలను ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం మౌలిక వసతులు, వాణిజ్య అవకాశాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణల కోసం అనేక విధాన నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటికే స్పేస్ టెక్నాలజీ రంగంలో పేరొందిన అనంత్ టెక్నాలజీస్, వీఈఎం టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్ వంటి సంస్థలు, స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్లతోపాటు డీఆర్డీఓ, ఎన్ఆర్ఎస్, అడ్రిన్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఆర్డినెన్స్ ప్యాక్టరీ వంటి రక్షణ రంగ పరిశోధన, తయారీ సంస్థలు హైదరాబాద్లో అంతరిక్ష సాంకేతిక వాతావరణానికి ఊతమివ్వనున్నాయి. అంతరిక్ష సాంకేతిక కార్యకలాపాలకు హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా ఉంది. మార్స్ ఆర్బిటర్ మిషన్లోని 30 శాతం విడిభాగాలు రాష్ట్రంలోనే తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర టెక్నాలజీ పాలసీ ఆశించిన ఫలితాలను రాబడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
దశాబ్దం కనిష్టానికి కోటక్ మహీంద్రా గృహ వడ్డీ
ముంబై: పండుగల సీజన్లో గృహ రుణ మార్కెట్లో వాటా పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ విభాగంలోని వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ గృహ రుణ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జూ్యమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుచ్ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్ రెండు నెలలు అంటే నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగిన ఉద్యోగులకు మాత్రమే దిగువ స్థాయి రుణ రేటు ఆఫర్ను అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ గృహ రుణ విభాగం మంచి పనితీరును కనబరుస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ
ముంబై: ప్రైవేట్ రంగ బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘ఈషీల్డ్ నెక్ట్స్’ ప్లాన్ ఆవిష్కరించింది. జీవితంలో వివిధ దశలకు (వివాహం, ఇంటి కొనుగోలు మొదలైనవి) అనుగుణంగా కవరేజీ పెరిగే సౌలభ్యం ఉండటం ఈ పాలసీ ప్రత్యేకత. లెవెల్ కవర్, పెరిగే కవరేజీ ప్రయోజనం, ఫ్యూచర్ ప్రూఫింగ్ ప్రయోజనంతో లెవెల్ కవర్ అంటూ మూడు ఆప్షన్లలో ఇది లభిస్తుంది. పాలసీ తీసుకున్నప్పుడు ఎంచుకున్న ఆప్షనే చివరిదాకా కొనసాగుతుంది. మధ్యలో మార్చుకోవడానికి ఉం డదు. రెగ్యులర్గా లేదా ఏకమొత్తంగా లేదా పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించేందుకు వీలు ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపారు. -
ఏయూ స్మాల్ బ్యాంక్ భారీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారీ స్థాయిలో నిధుల సమీకరణకు రెడీ అవుతోంది. ఇందుకు తాజా ఏజీఎంలో వాటాదారుల అనుమతి పొందినట్లు వెల్లడించింది. వెరసి రుణాలు, ఈక్విటీ ద్వారా రూ. 14,500 కోట్లను సమీకరించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. నిధులను బిజినెస్ వృద్ధి అవకాశాలపై వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. దేశీ, విదేశీ రుణాల ద్వారా రూ.12,000 కోట్లు, ఈక్విటీ పెట్టుబడుల ద్వారా మరో రూ.2,500 కోట్లు సమకూర్చు కునే ప్రణాళికలు వేసినట్లు వివరించింది. -
నష్టాల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 459 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది (2020–21) ఇదే కాలంలో రూ. 141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు పెరగడం ప్రభావం చూపింది. కోవిడ్–19 నేపథ్యంలో స్థూల స్లిప్పేజెస్ 97 శాతం ఎగసి రూ. 1,342 కోట్లను తాకాయి. గత క్యూ1తో పోలిస్తే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.45 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 500 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు జంప్చేశాయి. కోవిడ్–19కు రూ. 600 కోట్ల అదనపు కేటాయింపులు చేపట్టకపోతే క్యూ1లో లాభాలు ప్రకటించడం సాధ్యమయ్యేదని ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ, సీఈవో విశ్వవీర్ అహుజా పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరించిన రుణాలు రూ. 933 కోట్ల నుంచి రూ. 1,162 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 7 శాతం క్షీణించి రూ. 970 కోట్లకు పరిమితంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.9 శాతం నుంచి 4.4 శాతానికి నీరసించాయి. కనీస మూలధన నిష్పత్తి 17.15 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఆర్బీఎల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 195 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1,642 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,244 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,685 కోట్ల నుంచి రూ. 8,063 కోట్లకు పుంజుకుంది. అయితే నికర వడ్డీ ఆదాయం రూ. 6,912 కోట్ల నుంచి రూ. 6,480 కోట్లకు నీరసించింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.7 శాతం నుంచి 3.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.87% నుంచి 1.28 శాతానికి పెరిగాయి. కాగా.. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 962 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ. 935 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1% లాభంతో రూ. 1,740 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదిత్య పురికి రూ. 13.82 కోట్ల ప్యాకేజీ
ముంబై: ప్రైవేట్ రంగంలోని టాప్ 3 ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఆదిత్య పురి అత్యధిక వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఆయన రిటైర్ అయిన గత ఆర్థిక సంవత్సరంలో(2020–21) రూ. 13.82 కోట్లు జీతభత్యాల రూపంలో పొందారు. ఇందులో రూ. 3.5 కోట్ల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పురి రిటైర్మెంట్ తర్వాత సీఈవో, ఎండీగా నియమితులైన శశిధర్ జగదీశన్ రూ. 4.77 కోట్లు వేతనం అందుకున్నారు. మరోవైపు, కోవిడ్–19పరమైన పరిస్థితుల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి స్వచ్ఛందంగా తన జీత భత్యాల్లో ఫిక్స్డ్ భాగాన్ని, కొన్ని అలవెన్సులను వదులుకున్నారు. రూ. 38.38 లక్షల అలవెన్సులు అందుకోగా .. 2017, 2018 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ. 63.60 లక్షలు పనితీరు ఆధారిత బోనస్ పొందారు. అటు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి రూ. 6.52 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. -
ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 52 శాతం జంప్చేసి రూ. 4,747 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 77 శాతం దూసుకెళ్లి రూ. 4,616 కోట్లను అధిగమించింది. మొత్తం ప్రొవిజన్లు 62 శాతం తగ్గి రూ. 2,852 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు(జీఎన్పీఏలు) పెరగనున్న అంచనాలతో గతేడాది క్యూ1లో రూ. 7,594 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. తాజా స్లిప్పేజెస్ రూ. 7,231 కోట్లకు చేరాయి. వీటిలో రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ వాటా రూ. 6,773 కోట్లు. ఎస్ఎంఈ, కార్పొరేట్ విభాగం నుంచి రూ. 458 కోట్లు నమోదైంది. ఎన్పీఏలు ఇలా ఐసీఐసీఐ బ్యాంక్ జీఎన్పీఏలు గతేడాది క్యూ1తో పోలిస్తే 5.46 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఇవి 4.96 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.14 శాతం నుంచి 1.16 శాతానికి స్వల్పంగా పెరిగాయి. రిటైల్, బ్యాంకింగ్ బిజినెస్ విభాగంలో మరింత ఎక్కువగా 2.04 శాతం నుంచి 3.75 శాతానికి పెరిగాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 10,936 కోట్లను తాకింది. ఇతర ఆదాయం 56 శాతం ఎగసి రూ. 3,706 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 0.2 శాతం బలపడి 3.89 శాతానికి చేరాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.27 శాతంగా నమోదైంది. -
ప్రైవేటు రంగ ఉద్యోగులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రాకతో భారత్లో నిరుద్యోగరేటు గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ ఎనాలిసిస్ ప్రకారం...భారత నిరుద్యోగిత రేటు 2019లో 5.27 శాతంగా నమోదవ్వగా, 2020లో నిరుద్యోగిత రేటు గణనీయంగా 7.11 శాతానికి చేరుకుంది. కోవిడ్ రాకతో సుమారు 12.2 కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా వైరస్ ఉదృతి తగ్గడంతో కంపెనీలు తిరిగి ఉద్యోగనియామాకాలను చేపట్టాయి. జీతాల పెంపు..! తాజాగా బ్లూమ్బర్గ్ భారత ఉద్యోగులకు తీపి కబురును అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతీయుల జీతాలు గణనీయంగా పెరుగుతాయనీ పేర్కొంది. కోవిడ్-19 ప్రేరిత లాక్డౌన్ల నుంచి కంపెనీలకు ఉపశమనం కల్గనున్నట్లు పేర్కొంది. భారత్లో ముఖ్యంగా ఈ-కామర్స్, ఐటీ, ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ రంగాలోని ఉద్యోగులకు గణనీయంగా జీతాల పెంపు ఉంటుందని బ్లూమ్బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఎరోస్పేస్, పర్యాటకం, అతిథ్య రంగాలు పుంజుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం..కోవిడ్-19 మూడో వేవ్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే దేశంలోని ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నుంచి వారి జీతాల్లో 8 శాతం మేర జీతాల పెంపు ఉండవచ్చునని పేర్కొంది. కరోనా మహామ్మారి సమయంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ, వేతన కోతలను ఎదుర్కోన్న వారికి కాస్త ఉపశమనం కల్గనుంది. -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్లను అధ్యయనం చేసేందుకు పీఎస్బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్కిరణ్రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
వ్యాపారవేత్తలకు అవకాశాల సునామీ
ముంబై: ప్రైవేట్ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ మరింత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశాలు సునామీలా వెల్లువెత్తగలవని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా టెక్నాలజీలు అందుబాటులో ఉండటం కూడా ఇందుకు దోహదపడగలదని ఈవై ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘రాబోయే దశాబ్దాల్లో ప్రపంచంలోనే టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా నిల్చేందుకు భారత్కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నాయి. పర్యావరణ అనుకూల ఇంధనాలు, విద్య, వైద్యం, బయోటెక్నాలజీ, సర్వీసులు వంటి వివిధ రంగాల్లో అసాధారణ స్థాయిలో అవకాశాలు ఉన్నాయి‘ అని అంబానీ తెలిపారు. భారత్ ఆర్థికంగా, ప్రజాస్వామ్యపరంగా, దౌత్య విధానాలపరంగా, సాంస్కృతిక కేంద్రంగా ముందుకు దూసుకెడుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
ప్రైవేటులోనూ రిజర్వేషన్లు ప్రజల హక్కు
దేశంలో ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు. ఉన్న ఖాళీలను నింపడం లేదు. దీనికితోడు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి చర్యలు ఊపందుకుంటున్నాయి. మరి దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ప్రైవేటురంగంలోకే పోయినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల మాటేమిటి? సామాజిక న్యాయం బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ వర్గాలు ఇంకా పైకి రాలేవన్నది చేదునిజం. ప్రైవేటు సంస్థల పైస్థాయి ఉద్యోగాల్లో ఈ వర్గాల ప్రజలు నామమాత్రంగా ఉన్నారన్నది నగ్నసత్యం. కాబట్టి కేంద్రప్రభుత్వం సామాజిక అసమానత లను తొలగించే బాధ్యత నుంచి తప్పుకోకూడదు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకతప్పదు. ‘‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బహి రంగంగా పలుమార్లు ప్రకటించారు. పరిశ్రమ, సేవా రంగాలను దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నదనేది స్పష్టం. అందులో భాగంగా రైల్వే, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, రక్షణ, బొగ్గు సంస్థలు, విశాఖ ఉక్కు పరి శ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. దీన్ని ప్రజలు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయన్నది ఒక కారణమైతే, అందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతామనే అభద్రత మరో కారణం. అలాగే ప్రైవేటీకరణ వల్ల రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు జరగదనీ, రద్దు చేయకుండానే రిజర్వేషన్లు రద్దవుతాయనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలుకు అంగీకరించడం లేదు. ప్రైవేటు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం వద్ద అన్ని రకాల సహాయ, సహకారాలు తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ నియమాలను పాటించడం లేదు. ఉద్యోగ రంగంలో 90 శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పాదనలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తే మరో 26 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి. అప్పుడు అవి 7 శాతానికి తగ్గుతాయి. ఉద్యో గాల్లో ప్రైవేటు రంగం విస్తరిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ బలంగా ముందుకు వస్తున్నది. ప్రైవేటురంగం విస్తరిస్తూ పోతే సమాజంలో సాంఘిక, ఆర్థిక అస మానతలు మరింత పెరుగుతాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సమ సమాజం, సామాజిక న్యాయం పుస్తకాల్లోని పదాలుగా మిగిలి పోతాయి. ఆర్థిక అసమానతల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. సంపద కొంతమంది బడా పారి శ్రామికవేత్తల చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల రూపంలో లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అవి కోట్లాది ప్రజల ఆస్తులు. ఇన్ని ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగిం చడం ప్రభుత్వం చేయవలసిన పని కాదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదించాలి. ఇది న్యాయమైన డిమాండ్ అని సమాజాన్ని ఒప్పించాలి. అలాగే దీనికి రాజ్యాంగపరంగా న్యాయపరమైన అవరోధాలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ఇవి సాధించుకోవడానికి ఉద్యమాలు, వ్యూహాలు రూపొందించుకోవాలి. పార్లమెంటులో పాలక, ప్రతి పక్షాలు ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. రాజ్యాంగంలోని 15 (4), 16(4) ప్రకారం ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్న భావన నిబిడీకృతమై ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అవసరమైనా దీనికి అభ్యంతరం చెప్పే రాజకీయ పార్టీలు ఉన్నాయా? సామాజిక న్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా అగ్రకులాల్లోని పేదలకు రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసి 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్రం, 90 శాతం జనాభా గల పేద కులాలకు రిజర్వేషన్లు పెడితే అభ్యంతరాలు చెప్పే వారు ఉంటారా? పాలక పక్షం తలుచుకుంటే ఈ రిజర్వేషన్లు అమలు చేయడం ఒక లెక్కలోది కాదు. ఒక్కరోజు పని మాత్రమే. ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఏ కేటగిరీ ఉద్యోగాల్లో ఎవరు న్నారు? మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జి్జక్యూటివ్ డైరెక్టర్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? జనరల్ మేనేజర్లు, ఇంజినీర్లు, ఆఫీసర్లు, సూపర్వైజరు వగైరా ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఇందులో పైస్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు నామమాత్రంగా కూడా లేరనేది నగ్నసత్యం. వివిధ స్థాయిల్లో అధికార, అనధికార సంస్థలు జరిపిన సర్వేల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో ఈ వర్గాల వారు ఐదు శాతం కూడా లేరని తేలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలావుంటే సామాజిక న్యాయం ఇంకెప్పుడు సాధ్యమవుతుంది? ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల డిమాండ్ రెండు కోణాల్లో సమర్థ నీయం. ఈ కంపెనీలకు ప్రభుత్వమే రాయితీల మీద భూమి, ముడి సరుకు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది. అలాగే ఇందులో చెమటోడ్చే కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. అలాంటప్పుడు అధికారం చలాయించే చోట ఈ వర్గాలు ఉండరాదా? ఈ పరిశ్రమల ఉత్పత్తుల్ని సంపన్న వర్గాలే కొనవు. 90 శాతం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే సింహభాగం కొంటారు. కొనుగోలులో అన్ని కులాల భాగస్వామ్యం ఉన్నప్పుడు పాలనలోనూ వాటా కల్పించడానికి అభ్యంతరం ఏమిటి? ఇంకొక విషయాన్ని గమనించాలి. ఒకనాడు బీసీ కులాల వారు చేసిన కులవృత్తులు, చేతి వృత్తులు నేడు పారిశ్రామికీకరణ చెందాయి. పద్మశాలీలు, దేవాం గులు నేసిన చేనేత వృత్తి బట్టల మిల్లులుగా మారిపోయింది. కమ్మరి, కంచరి పని ఉక్కు, ఇనుము కంపెనీలుగా మారిపోయింది. మేదరి, ఎరుకల వారి గంపలు, బుట్టలు, చాటలను, కుమ్మరివాళ్ల కుండలను ప్లాస్టిక్, స్టీలు పరిశ్రమలు తన్నుకుపోయాయి. ఒకప్పుడు వృత్తులకు యజమా నులైన ఈ కులాలవారు కనీసం ఇందులో ఉద్యోగులు కాకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యం? మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద పునాదులతో పెట్టుబడిదారీ విధానం అవలం బించే దేశం. అలాంటప్పుడు ప్రభుత్వాలు వ్యాపారం చేసే బాధ్యత తీసుకోవని ప్రధాని ప్రకటించడాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వేగ వంతమైన అభివృద్ధికి ప్రైవేటీకరణే కారణమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పర్యవేక్షణ కట్టుదిట్టంగా అమలవుతుంది. పని సంస్కృతి మారుతుంది. జవాబుదారీతనం పెరుగుతుంది. వృథా తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. అందులో సందేహం లేదు. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి ప్రైవేటీకరణే ప్రధాన కారణం. కానీ మనదేశంలో ఇప్పటికే 95 శాతం పారిశ్రామిక రంగం ప్రైవేట్ రంగంలోనే ఉంది. ఇంకా ముందుకు పోవడం వాంఛనీయం కాదు. కొత్త పరిశ్రమలను ప్రైవేటు రంగంలో చేరిస్తే అభ్యంతరం లేదు. కానీ పాతవాటిని, కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించేవాటిని, ప్రజా సేవలో భాగమైన రైల్వేలను, ప్రభుత్వానికి అవసరమైన అప్పులు ఇచ్చే ఎల్ఐసీ లాంటి వాటిని కూడా ప్రైవేటీకరించడాన్ని సమాజం అంగీకరించదు. రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదు. కొత్త ఉద్యో గాలు సృష్టించడం లేదు. పైగా శాశ్వత ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్లు, గెస్టు టీచర్లు విద్యా వాలంటీర్లు, ఎన్ఎంఆర్లు అంటూ రకరకాల పేర్లతో రిజర్వేషన్లు లేకుండా చేశారు. ప్రైవేటీకరణ రహస్య ఎజెండా వెనకనే ఈ వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఉంది. అలాంటప్పుడు అంత సులభంగా రిజర్వేషన్లు పెడుతారా! అందుకే ఈ కులాలు పెద్ద పోరాటం చేయక తప్పదు. వీరి అభివృద్ధి ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద, సమాజంలోని ఆధిపత్య కులాల సానుభూతి మీద ఆధార పడిలేదు. ఇది భిక్షంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
ప్రైవేటీకరణతో అసలైన విలువ
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో సమర్థవంతమైన యాజమాన్యం, ఆధునిక టెక్నాలజీల వినియోగం వల్ల వ్యూహాత్మక పెట్టుబడులను ఉపసంహరించుకునే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల (సీపీఎస్ఈ)కు నిజమైన విలువ సమకూరుతుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్. దీంతో ఉత్పాదకత, ఉపాధి కల్పన రూపంలో ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రతిఫలం అందుతుందన్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం.. ప్రాధాన్య రంగాల్లో లేని సీపీఎస్ఈలను గుర్తించి సిఫారసు చేసే బాధ్యతను నీతి ఆయోగ్కు అప్పగించినట్టు మంత్రి చెప్పారు. జాతీయ భద్రత ఇతర అంశాలను నీతి ఆయోగ్ పరిగణనలోకి తీసుకుని సిఫారసులు చేస్తుందన్నారు. లాభాలను ఆర్జిస్తున్న షిప్పింగ్ కార్పొరేషన్ను ప్రైవేటీకరించడానికి వెనుక ఉన్న ఉద్దేశం, కారణాలు ఏంటంటూ లోక్సభ సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా మంత్రి బదులిచ్చారు. వస్తు తయారీ, సేవల రంగాల్లో పోటీతత్వంలో కూడిన మార్కెట్లు అభివృద్ధి చెందిన తర్వాత అటువంటి రంగాల్లో ప్రభు త్వ పాత్రను తగ్గించుకుని, ప్రైవేటుకు అప్పగించినట్టయితే మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని మంత్రి వివరించారు. మరో ప్రశ్నకు.. 84 సీపీఎస్ఈలు, వాటి అనుబంధ సంస్థలు 2019–20లో నష్టాలను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఉపాధి బాధ్యత ప్రభుత్వానిది... వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించినట్టయితే ఉపాధి, ఇతర సదుపాయాల నష్టం కలుగకుండా ఒప్పందంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభకు ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొత్తం మీద మరింతగా ఉపాధి అవకాశాలు వస్తాయే కానీ, ఉద్యోగాలు కోల్పోవడం ఉండదన్నారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్తు, పెట్రోలియం, బొగ్గు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ను వ్యూహాత్మక రంగాలుగా కేంద్రం ఇప్పటికే గుర్తించింది. సహారా క్యూ పెట్టుబడులు పక్కదారి సహారా క్యూ షాప్ పేరుతో వసూలు చేసిన పెట్టుబడులు.. సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారా గ్రూపునకు చెందిన మరో రెండు సొసైటీలకు మళ్లించినట్టు ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు లో తేలిందని సీతారామన్ లోక్సభకు తెలిపారు. -
అంచనాలు అందుకోవాల్సిన బాధ్యత మాపైనే!
సాక్షి,న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిలో ప్రైవేట్ రంగం కూడా కీలకపాత్ర పోషిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చిన నేపథ్యంలో కార్పొరేట్లు స్పందించారు. ప్రైవేట్పై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా రాణించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో.. పరిశ్రమలపై సానుకూల అభిప్రాయం కలిగించేందుకు ప్రధాని మోదీ వ్యాఖ్యలు తోడ్పడగలవని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దేశంలో సంపద, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్న రంగానికి ఎంతో ఊతం లభిస్తుంది‘ అని ఆనంద్ మహీం ద్రా, సజ్జన్ జిందాల్ తదితర దిగ్గజాలు పేర్కొన్నారు. ‘కరోనా దెబ్బతో కుదేలైన భారతీయ పరిశ్ర మ మళ్లీ అధిక వృద్ధి బాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో పరిశ్రమ కృషిని ప్రధాని గుర్తించడమనేది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పరిశ్రమవర్గాలకూ ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ప్రైవేట్ రంగంపై ఆయనకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. జాతి నిర్మాణంలో ప్రైవేట్ రంగ పాత్రపై ఆయన దార్శనికతకు ఈ వ్యాఖ్యలు నిదర్శనం. అదే సమయంలో మిగతా విషయాల కంటే దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసేలా వ్యాపారవర్గాలపై బాధ్యతను మరింతగా పెంచాయి‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా.. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం పాత్ర కూడా కీలకమేనంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టెలికం, ఫార్మా తదితర రంగాలను ప్రస్తావించారు. ప్రోత్సాహకర వ్యాఖ్యలు.. మరోవైపు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ‘కరోనా పరిస్థితుల్లో కష్టకాలం ఎదుర్కొంటున్న పరిశ్రమకు ప్రధాని వ్యాఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇక పనితీరులోను, గవర్నెన్స్లోనూ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత మనపైనే (ప్రైవేట్ రంగం) ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘భారతీయ వ్యాపారవేత్తలపై దేశ ప్రధాని బహిరంగంగా గౌరవాన్ని వ్యక్తపర్చడం ఇదే ప్రథమం. దేశంలో సంపద సృష్టిస్తూ, ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమకు ఇది ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే విషయం’ అని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. -
రైతుల ఉద్యమం పవిత్రమైనదే.. కానీ: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు చేస్తోన్న ఉద్యమం పవిత్రమైనదే కానీ.. ఆందోళన జీవి వల్ల అది దారి తప్పుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్సభలో సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ.. వివిధ అంశాలపై సుధీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా రైతుల ఉద్యమానికి సంబంధించి మోదీ చేసిన ఆందోళన జీవి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతుండటంతో ఆయన దీనిపై స్పందించారు. ‘‘రైతుల చేస్తోన్న ఉద్యమం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆందోళన జీవులు రైతుల ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. వారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను.. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని, నక్సల్స్ను, ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ ఆందోళన జీవులు రైతులకు మేలు చేసే వారు ఎలా అవుతారు’’ అని మోదీ ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఆందోళన ముఖ్యం. కాని జనాలు ప్రజాస్వామ్యం, నిజమైన ఆందోళనకారుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. పంజాబ్లో మొబైల్ టవర్లను ధ్వంసం చేయడం ఏంటి.. వ్యవసాయ చట్టాలతో దానికి సంబంధం ఏంటి’’ అని మోదీ ప్రశ్నించారు. ప్రైవేట్ రంగం కూడా కీలకమే ‘‘ప్రభుత్వ రంగం అనివార్యమే ఒప్పుకుంటాను. కానీ అదే సమయంలో ప్రైవేట్ రంగం కూడా కీలకమే’’ అని ప్రధాని పేర్కొన్నారు. టెలికాం, ఫార్మా సహా ఏ రంగం తీసుకున్నా ప్రైవేట్ రంగం పాత్ర విస్మరించలేమని తెలిపారు. ప్రైవేట్ రంగాన్ని కించపరుస్తూ మాట్లాడే సంస్కృతికి కాలం చెల్లిందన్నారు. గతంలో ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని పార్టీలకు ఓట్లు పడేవి. కానీ ఇప్పుడా రోజులకు కాలం చెల్లిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులతో సేద్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రయోజనమే తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదని మోదీ స్పష్టం చేశారు. చదవండి: ప్రధాని మోదీకి చిదంబరం గట్టి కౌంటర్ హలధారులే కానీ.. హంతకులు కారు -
ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ నిపుణులు
న్యూఢిల్లీ: అధికార యంత్రాంగానికి కొత్త రక్తం ఎక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుడుగు వేస్తోంది. కీలకమైన శాఖల్లో 30 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కాంట్రాక్టు విధానంలో నియమించాలని నిర్ణయించింది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే జాయింట్ సెక్రెటరీ, డైరెక్టర్ పోస్టుల్లో వీరిని నియమించాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ పోస్టుల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికైన వారిని నియమిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3 జాయింట్ సెక్రెటరీ, 27 డైరెక్టర్ల పోస్టుల భర్తీకి గాను నైపుణ్యం కలిగిన భారతీయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ యూపీఎస్సీ ఇటీవల ప్రకటనలు జారీ చేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ, రెవెన్యూ విభాగం, ఆర్థిక శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రెటరీ పోస్టులో ప్రైవేట్ నిపుణులను నియమిస్తారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, న్యాయ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ, జలశక్తి శాఖ, పౌర విమానయాన తదితర శాఖల్లో డైరెక్టర్ పోస్టుల్లో ప్రైవేట్ నిపుణులను చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్ సెక్రెటరీ స్థాయి పోస్టులో కనీసం 15 ఏళ్ల అనుభవం, డైరెక్టర్ స్థాయి పోస్టులో పదేళ్ల అనుభవం ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. -
వైట్కాలర్ ఉద్యోగాలు హుష్
సాక్షి, అమరావతి: వైట్ కాలర్ జాబ్స్ (నైపుణ్య ఉద్యోగాలు) అంటే ఎంతో క్రేజ్. కానీ.. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తదనంతర పరిణామాలు దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాలకే ఎక్కువగా కోత పెట్టాయి. దేశంలో ఏకంగా 66.60 లక్షల ఉద్యోగాల్లో కోత పడ్డాయని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. కోత పడిన ఉద్యోగుల్లో పారిశ్రామిక రంగంలోని కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. నివేదికలోని ప్రధానాంశాలివీ ► దేశంలో మే నుంచి ఆగస్టు వరకు 66.60 లక్షల మంది వైట్ కాలర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ► 2019 మే– ఆగస్టు మధ్య దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో 1.88 కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగులుండేవారు. కాగా 2020 మే–ఆగస్టు మధ్య 1.22 కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగులు మాత్రమే మిగిలారు. ► ఈ రంగంలో 2020 మే–ఆగస్టులో దాదాపు 66.60 లక్షల ఉద్యోగాలకు కోత పడింది. ► దేశంలో జాబ్స్ కోల్పోయిన వైట్ కాలర్ ఉద్యోగుల్లో ఇంజనీర్లు, ఫిజీషియన్లు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, అనలిస్టులు మొదలైనవారు ఎక్కువగా ఉన్నారు. ► ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య పారిశ్రామిక రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ రంగం 26 శాతం ఉద్యోగాల కోతతో రెండో స్థానంలో నిలిచింది. ► కార్పొరేట్ సంస్థల కంటే చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల్లోనే ఎక్కువ ఉద్యోగాలు కోతపడ్డాయి. ► పారిశ్రామిక రంగంలో క్లరికల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండటం గమనార్హం. ఇతరులతో పోలిస్తే బీపీవోలు, కియోస్క్లలో ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి వారికి ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంది. వారికి ‘వర్క్ ఫ్రం హోమ్’కు అవకాశం ఉండటమే దీనికి కారణం. అన్లాక్తో ఊరట ► దేశంలో దశల వారీగా లాక్డౌన్ తొలగించటంతో ప్రస్తుత పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. ► దేశంలో 1.21 కోట్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు కోత పడొచ్చని ఈ ఏడాది ఏప్రిల్లో సీఎంఐఈ అంచనా వేసింది. ► కానీ.. దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేయడంతో ఆగస్టు నుంచి ఆర్థిక రథచక్రం తిరిగి జోరందుకుంది. ► దాంతో ఉద్యోగాల కోతకు తెరపడిందని సీఎంఐఈ వెల్లడించింది. -
తెలంగాణలో కొలువుల జాతర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఓ సంస్థ సహకారంతో డీట్ అనే వెబ్సైట్ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ఆ శాఖ.. త్వరలో కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది. ఆయా కంపెనీలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంపాయ్మెంట్ ఎక్సే్చంజ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతి జిల్లాలో జాబ్మేళా..: ఇదివరకు ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్లో ఉద్యోగ మేళాలు నిర్వహించినప్పటికీ ఒకట్రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనేవి. ఇప్పుడలా కాకుండా కంపెనీల వారీగా ఉన్న ఉద్యోగా లను కేటగిరీలుగా విభజించి ఆమేరకు ఒక్కో కేటగిరీని భర్తీ చేస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీల వారీగా ఖాళీల వివరాలను సేకరించిన తర్వాత వాటిని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆన్లైన్ పద్దతిలోనే జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తారు. కోవిడ్–19 తీవ్రత తగ్గిన తర్వాత అప్పటి పరిస్థితులకు తగినట్లు జాబ్మేళాలు నిర్వహించనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను గ్రామీణ యువత అందిపుచ్చుకునేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదించి ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీట్ వెబ్సైట్ను ప్రవేశపెట్టిన అధికారులు..తాజాగా నేరుగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హతలేమిటి...అభ్యర్థుల నియామకం ఎలా చేపట్టాలనే దానిపై కంపెనీల వారీగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. (ఆన్లైన్ పాఠాలా.. జర జాగ్రత్త..) -
అంతరిక్ష రంగంలో ప్రైవేటు
సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక గ్రహాంతర అన్వేషణ ప్రయోగాలు సహా అన్ని అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లభించనుందని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకునేందుకు అనుసంధాన సంస్థగా కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ వ్యవహరిస్తుందన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)’ వీలు కల్పిస్తుందన్నారు. సంస్కరణల వల్ల ఇస్రో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై, మానవసహిత అంతరిక్ష ప్రయోగాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం ద్వారా దేశీయంగా అంతరిక్ష రంగ అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ఇంటర్నేషనల్ స్పేస్ ఎకానమీలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తుందని, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఓబీసీల వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు ఓబీసీ వర్గీకరణ కోసం ఏర్పడిన కమిషన్ కాలపరిమితిని జనవరి 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల్లో కొన్ని కులాలకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో వారికి న్యాయం జరగడం లేదని, ఈ విషయంలో తగిన సిఫారసులు చేయాలని ఓబీసీ వర్గీకరణ కమిషన్ను కేంద్రం 2017లో ఏర్పాటు చేసింది. -
ప్రైవేటుకు ‘కరోనా కాటు’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ‘కరోనా కాటు’ పడింది. దీంతో యాజమాన్యాలతోపాటు వాటిలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అల్లాడిపోతున్నారు. లాక్డౌన్ కారణంగా జబ్బులొస్తున్నా వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అత్యవసర కేసులు మినహా అన్ని చికిత్సలకూ బ్రేక్ పడింది. దీంతో ఆదాయం లేక ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్హోంలు నిలదొక్కుకునే పరిస్థితి లేకుండా పోయింది. కార్పొరేట్ ఆసుపత్రులు ఎలాగో నెట్టకొచ్చినా, ఇప్పుడు వాటి పరిస్థితీ దిగజారింది. లాక్డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులు తీవ్ర నష్టాల్లోకి వెళ్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తన నివేదికలో వెల్లడించింది. రూ. 22 వేల కోట్ల వరకు నష్టం లాక్డౌన్తో ప్రైవేటు ఆసుపత్రుల్లో గత నెల చివరి నాటికే ఏకంగా 40 శాతం రోగుల సంఖ్య తగ్గిందని ఫిక్కి పేర్కొంది. అదే కారణంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏకంగా రూ.13,400 కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల మేరకు నష్టాన్ని ప్రైవేటు ఆసుపత్రులు మూటగట్టుకుంటాయని అంచనా వేసింది. ప్రధాన పట్టణాలు, నగరాల్లోని ఆసుప్రతులు అధికంగా నష్టపోనున్నట్టు పేర్కొంది. ఓపీలు అంతంత మాత్రంగానే ఉండటం, సర్జరీలు వాయిదా వేసుకోవడంతో నిర్వహణ నిలిచిపోయింది. వివిధ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల పనితీరుపై అధ్యయనం చేసిన ఫిక్కీ ఈ నష్టాన్ని అంచనా వేసింది. పడిపోయిన అంతర్జాతీయ ఆదాయం దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల ఏడాది ఆదాయం రూ. 2.4 లక్షల కోట్లు ఉంటుందని ఫిక్కి అంచనా వేసింది. ఒక్క హైదరాబాద్లో ఉండే సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రులకే నెలకు అంతర్జాతీయ రోగుల ద్వారా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల మేర ఆదాయం సమకూరుతుంది. లాక్డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రాణాపాయమైన అత్యవసర సర్జరీలు మినహా మిగతా వైద్యసేవలను నిలిపివేశాయి. అలాగే రోజుకు సగటున 500 మంది వరకు రోగులు ఓపీ కోసం వచ్చే కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రస్తుతం 10మంది కూడా రావడం లేదని ఫిక్కీ తెలిపింది. అలాగే డయాగ్నొస్టిక్ సెంటర్లలోనూ 80శాతం వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య తగ్గింది. ఇప్పటికే కొన్ని రంగాలకు ఆర్థిక ఉపశమనాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం హెల్త్కేర్రంగానికి కూడా ప్రకటించాలని ఫిక్కీ తన నివేదికలో సూచనలు చేసింది. ఇక దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులకు సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ పథకాల కింద ఉన్న రూ.1,700 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల మేర ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించింది. పరోక్ష పన్ను ఉపశమనాలు, మినహాయింపులు ఇవ్వడంతో పాటు కరోనా రోగుల చికిత్స కోసం అవసరమైన మందులు, వినియోగ వస్తువులు, పరికరాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపునివ్వాలని పేర్కొంది. 6 నెలలు కోలుకునే పరిస్థితి లేదు లాక్డౌన్తో అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నష్టాల్లోకి వెళ్లాయి. ఆసుపత్రులు నెలలో పూర్తిస్థాయిలో పనిచేస్తే, అందులో 25 రోజులు వచ్చే సొమ్ము శాలరీలు, నిర్వహణ ఖర్చులకే పోతుంది. మిగిలిన ఐదు రోజులు వచ్చేదే ఆదాయం. 30 రోజులు మూతపడడంతో ఆసుపత్రుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ స్కీముల కింద చేసిన చికిత్సల సొమ్ము కేవలం మా ఆసుపత్రికే రూ.80కోట్ల మేర రావాలి. లాక్డౌన్ ఎత్తేశాక కూడా ఆరు నెలలపాటు కోలుకునే పరిస్థితి ఉండదనిపిస్తోంది. కాబట్టి ఫిక్కీ నివేదిక చెబుతున్నట్లు బకాయిలు తీర్చాలి. కొన్ని మినహాయింపులనివ్వాలి. – డాక్టర్ ఎ.వి.గురువారెడ్డి, ఎండీ, సన్షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ -
క్రమం తప్పకుండా ఆదాయం
పదవీ విరమణ చేసిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని వారికి సైతం పదవీ విరమణ తర్వాత పెన్షన్ కోసం ఈపీఎఫ్వో అందించే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది. కానీ, దీనిపై వచ్చే పెన్షన్ చాలా తక్కువ. కనుక ప్రైవేటు రంగంలోని వారు, స్వయం ఉపాధిలో ఉన్న వారు పదవీ విరమణ అనంతరం క్రమం తప్పకుండా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. వీరికోసం అందుబాటులో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్తోపాటు.. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడం (ఎస్డబ్ల్యూపీ) ఇలా ఎన్నో. అయితే, అందరికీ అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. కనుక ఈ సాధనాలు, వాటిల్లో రాబడులు, రిస్క్ ఏ మేరకు తదితర వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది.. తమ పెట్టుబడులు, రాబడులపై ఎటువంటి రిస్క్ వద్దనుకునే వారు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాన్ని (పీవోఎంఐఎస్) పరిశీలించొచ్చు. అన్ని వయసుల వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి వయవందన యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటివి 60 ఏళ్లు నిండిన వారికి మాత్రమే. కానీ, ఇవన్నీ సురక్షిత సాధనాలు. మూడు నెలలకోసారి అయినా ఫర్వాలేదనుకుంటే అందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ మూడింటిలో అధిక రాబడులను ఇచ్చే సాధనం. పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో ప్రస్తుతం పెట్టుబడులపై 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షలు, అదే జాయింట్గా అయితే రూ.9 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది. దీని కాల వ్యవధి ఐదేళ్లు. ఏడాది పూర్తయిన తర్వాత ముందస్తుగా వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిలో 2 శాతాన్ని తపాలా శాఖ మినహాయించుకుంటుంది. అదే మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే అప్పుడు ఒక్క శాతమే కోల్పోవాల్సి వస్తుంది. పీవోఎంఐఎస్ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఆ వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇతర ఆదాయ మార్గంలో దీన్ని చూపించి అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వయవందన యోజన ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనం. ఇందులో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. కాల వ్యవధి పదేళ్లు. కనీసం రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీఎంవీవీవై ద్వారా వచ్చే వడ్డీ ఆదాయాన్ని కూడా వార్షిక ఆదాయ రిటర్నుల్లో ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకంలో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.6 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తారు. 60 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఇందులో పెట్టుబడులకు అర్హులు. అదే ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారు (55–60 ఏళ్ల మధ్య) ఒక నెల వ్యవధి మించకుండా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రతీ త్రైమాసికం చివర్లో.. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెల చివరి తేదీన వడ్డీ చెల్లింపులు చేస్తారు. యాన్యుటీ ప్లాన్లు బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇమీడియట్ యాన్యుటీ పథకాలు కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనం. వీటిల్లోనూ రిస్క్ తక్కువే. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై, మరుసటి నెల నుంచే పెన్షన్ అందుకోవచ్చు. కాకపోతే వీటిల్లో పెట్టుబడులపై రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో గరిష్ట రాబడి రేటు కేవలం 6 శాతమే. వీటిపై వచ్చే ఆదాయాన్ని ఇతర మార్గాల కింద వచ్చిన ఆదాయంగా ఐటీఆర్లో చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటిలోకి రాబడులు ఎస్సీఎస్ఎస్లోనే ఎక్కువ అని చెప్పుకోవాలి. కాకపోతే గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. పైగా మూడు నెలలకోసారి మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. మొదటి మూడు నెలలకు సరిపడా నిధి మీ వద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈ పథకంలో పెట్టుబడులు సౌకర్యంగా, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఇది అనుకూలంగా లేదనుకున్న వారు వయవందన యోజనను పరిశీలించొచ్చు. అలాగే, ఒక పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితికి మించి ఇంకా నిధి మిగిలి ఉంటే అప్పుడు మరో పథకాన్ని ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు రిస్క్ కొంచెం తక్కువ కోరుకునే వారి కోసం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. కాకపోతే జాతీయ బ్యాంకుల్లో అయితే దీర్ఘకాలానికి వడ్డీ రేటు 7 శాతం వరకే ఉంది. ఒకవేళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తిగా ఉంటే 7–9 శాతం మధ్య వడ్డీ రాబడి పొందొచ్చు. సాధారణంగా బ్యాంకులు త్రైమాసికం వారీగా వడ్డీ చెల్లింపులు చేస్తాయి. అయితే, డిపాజిటర్ కోరితే నెలవారీగా చెల్లింపులు చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి. కాకపోతే నెలవారీగా కోరుకుంటే వచ్చే ఆదాయం కాస్త తగ్గుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ అనే పథకాన్ని నిర్వహిస్తోంది. సాధారణ ఎఫ్డీతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో పెట్టుబడి కాల వ్యవధి తర్వాత చెల్లింపుల కాలవ్యవధి ఆరంభమవుతుంది. అంటే 24 నెలల పాటు పెట్టుబడి కాల వ్యవధిని ఎంచుకున్నారనుకంటే... ఆ తర్వాత, తదుపరి 24 నెలల పాటు చెల్లింపులు జరుగుతాయి. వడ్డీ రేటు 7.25 శాతం. చెల్లింపుల సమయంలో ప్రతి నెలా చెల్లింపులు చేయగా మిగిలిన మొత్తంపై వడ్డీ కలుస్తూ ఉంటుంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు అధిక రిస్క్ తీసుకునే వారు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించొచ్చు. కాకపోతే మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటినే పరిశీలించడం మంచిది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు అధిక రేటును ఆఫర్ చేస్తాయి. అందుకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏఏఏ రేటింగ్ కలిగిన బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతం 7.72 నుంచి 8.05 శాతం వరకు వార్షిక వడ్డీని నెలవారీగా చెల్లింపులపై ఆఫర్ చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయాన్ని ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు 60 ఏళ్లు నిండిన వారు మినహాయింపు పొందొచ్చు. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారు మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ)ను పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సాధనం (సిప్)కు ఇది పూర్తి వ్యతిరేకం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల నుంచి క్రమం తప్పకుండా ఇంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేదానిని ఎస్డబ్ల్యూపీగా పేర్కొంటారు. తన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల నుంచి ప్రతీ నెలా ఇంత మొత్తం కావాలని ఏఎంసీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు. మ్యూచువల్ ఫండ్స్లోనూ మీ రిస్క్ను బట్టి, పూర్తిగా డెట్ లేదా ఈక్విటీ లేదా ఈక్విటీ డెట్ కలయికతో కూడిన ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన మరుసటి నెల నుంచే తీసుకుంటే మొదటి ఏడాది వరకు ఎగ్జిట్లోడ్ను భరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది ఒక శాతంగా ఉండొచ్చు. పైగా ఎస్డబ్ల్యూపీపై ప్రతి నెలా వెనక్కి తీసుకునే మొత్తంపై లాభం ఆర్జిస్తే, అది మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. ఈక్విటీ పథకాలు అయితే స్వల్పకాల మూలధన లాభాలు (ఏడాదిలోపు)పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం.. మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించి ఉంటే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను అమలవుతుంది. ఈక్విటీ కాకుండా ఇతర పథకాలు అయినా మూడేళ్లకు మించి కొనసాగించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20 శాతం వర్తిస్తుంది. మూడేళ్ల లోపు కాలంలో వచ్చే లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. -
మొబైల్ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ ప్రీ–పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్తో రోజుకు 2 జీబీ డేటా, ఏ నెట్వర్క్కయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అదనంగా రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఈ రీచార్జ్ వేలిడిటీ 84 రోజులు ఉంటుందని, ప్రతీ రీచార్జ్తో పాటు బీమా కవరేజీ ఆటోమేటిక్గా మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది. దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది. -
కాలేజీ చదువులు
సాక్షి, అమరావతి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఆధోగతిలో ఉన్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో తేటతెల్లమైంది. ఇటు ప్రభుత్వంలో అటు ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర డిగ్రీ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు బాగా దిగజారి పోయాయనేందుకు సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం నిదర్శనంగా నిలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు బీటెక్ (కంప్యూటర్స్)తో పాటు పీజీ చేసిన వారు ఏకంగా 2,72,088 మంది పరీక్షలు రాశారు. అయితే ఇంత మంది పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కేవలం 3,623 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చూసి ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను ఎత్తి చూపుతున్నాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. డిజిటల్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి 150 మార్కులకు గాను 60 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. అయితే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణత కేవలం 1.33 శాతమే ఉండటం విద్యా ప్రమాణాలు ఇంత దిగజారిపోయాయా అని ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 11,158 డిజిటల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణులైన వారు కేవలం 3,623 మంది మాత్రమే ఉండటం గమనార్హం. వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టుల ఉత్తీర్ణత శాతం కూడా విద్యా ప్రమాణాలను ఎత్తి చూపింది. ఈ పోస్టులకు 52,334 మంది పరీక్షలు రాస్తే, కేవలం 1,474 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు పరీక్షలు రాసినప్పటికీ కనీస అర్హత మార్కులను కూడా సాధించలేకపోయారు. అంటే పరీక్షలు రాసిన వారిలో కేవలం 2.8 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టులు 3,648 ఉండగా 52,334 మంది పరీక్షలు రాయగా కేవలం 1,474 మందే ఉత్తీర్ణులవ్వటం గమనార్హం. అలాగే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టుల పరీక్షల ఉత్తీర్ణత శాతం చూస్తే అగ్రికల్చర్ బీఎస్సీ విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనే అనుమానం కలుగుతుంది. 6,714 గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టులకు 22,622 మంది పరీక్షలు రాయగా కేవలం 6,239 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 27.57 శాతం మాత్రమే. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టుల పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. 3,770 పోస్టులకు 12,643 మంది పరీక్ష రాయగా 2,096 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 16.57 శాతం మాత్రమే. విద్యా ప్రమాణాలు పెంచడంపై సర్కారు దృష్టి ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన గత ప్రభుత్వాలు ఆ కాలేజీల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల గురించి పట్టించుకోలేదు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించిన గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలోని కాలేజీలను నీరుగార్చాయి. దీంతో అటు ప్రైవేట్ రంగం, ఇటు ప్రభుత్వ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు నిర్వీర్యం అయినట్లు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఉత్తీర్ణత శాతం స్పష్టం చేస్తోంది. ఈ పరీక్షల ఉత్తీర్ణత శాతాలతో సంబంధం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచనున్నారు. -
అంతా ఆ బ్యాంకే చేసింది..!
లేహ్: ఆల్టికో క్యాపిటల్లో సంక్షోభానికి ఓ ప్రైవేటు బ్యాంకు స్వార్ధపూరిత వైఖరే కారణమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలు సమకూర్చే బ్యాంకింగేతర ఆరి్థక సంస్థ ఆల్టికో క్యాపిటల్ దేశీయ బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్కు తాజా ఎన్పీఏగా మారే ప్రమాదం వచ్చి పడింది. దీనికి కారణం సదరు సంస్థ గత వారం ఈసీబీ రుణంపై రూ.20 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఓ ప్రైవేటు బ్యాంకు తన రుణాలను కాపాడుకునేందుకు ఆల్టికో ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ (ఫిక్స్డ్ డిపాజిట్)ని సర్దుబాటు చేసుకుంది. దీన్ని ఏక్షపక్ష నిర్ణయంగా రజనీష్ కుమార్ పేర్కొన్నారు. తన సొంత డబ్బులను కాపాడుకునేందుకు అనుసరించిన ఈ చర్య విస్తృతమైన ఆరి్థక వ్యవస్థకు సమస్యలు తెచి్చపెడుతుందన్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు మొత్తంగా రూ.4,500 కోట్ల మేర ఆల్టికో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే, వడ్డీ చెల్లింపుల్లో విఫలం కావడం గత వారమే మొదటి సారి చోటు చేసుకుంది. లేహ్ వచి్చన సందర్భంగా దీనిపై రజనీష్ కుమార్ మీడియా సమక్షంలో స్పందించారు. ‘‘ఏదైనా బ్యాంకు స్వార్ధపూరిత వైఖరి తీసుకుంటే మిగిలిన వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రూ.50–100 కోట్ల ఎక్స్పోజర్ను మీరు తీసేసుకుని మీ డబ్బులను కాపాడుకున్నామని సంతోషపడొచ్చు. కానీ, మీరు వ్యవస్థను పాడు చేస్తే అది సరైన విధానం కాదు. పెద్ద కంపెనీల విషయంలోనూ ఓ బ్యాంకు ట్రిగ్గర్ నొక్కితే లేదా రుణాల సరఫరాను నిలిపివేస్తే ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. సమష్టిగా వ్యవహరించాలి... బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మొత్తం ఆరి్థక వ్యవస్థను కాపాడవచ్చన్నారు రజనీష్ కుమార్. అతిపెద్ద ఎన్పీఏ కేసుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆల్టికో క్యాపిటల్ యూఏఈకి చెందిన మాష్రెక్ బ్యాంకుకు రూ.660 కోట్లు, ఎస్బీఐకి రూ.400 కోట్లు, యూటీఐ మ్యూచువల్ ఫండ్కు రూ.200 కోట్లు, రిలయన్స్ నిప్పన్ ఏఎంసీకి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. గత వారం మాష్రెక్ బ్యాంకుకు రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమవడమే సంక్షోభానికి కారణం. ఈ నెల 3న ఆల్టికో రేటింగ్ను ఇండియా రేటింగ్స్, కేర్ రేటింగ్స్ జంక్ కేటగిరీకి డౌన్గ్రేడ్ చేశాయి. క్లియర్వాటర్ క్యాపిటల్ పార్ట్నర్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, వర్దే పార్ట్నర్స్ ఈ సంస్థకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
ఉద్యోగ భాగ్యం!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో కొలువుల జాతర మొదలైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. మహానగరం పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల కాలంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పనలో 18 శాతం వృద్ధి నమోదైనట్లు నౌకరీ డాట్ కామ్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని మెట్రో నగరాలలో గ్రేటర్ సిటీ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఈ సంస్థ నగరంలో ప్రధానంగా ఐటీ, బీపీఓ, నిర్మాణ రంగం, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, టెలికం, ఇన్సూరెన్స్, ఫార్మా తదితర విభాగాల్లో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నూతనంగా సృష్టించిన ఉద్యోగాలను లెక్కించింది. ఆయా రంగాల్లో సుమారు 75 వేల మందికి నూతనంగా కొలువులు దక్కినట్లు పేర్కొంది. ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్రంగాల్లో అత్యధికం.. దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పనలో గ్రీన్సిటీ బెంగళూరు 20 శాతం వృద్ధితో తొలిస్థానంలో నిలవగా.. 18 శాతం వృద్ధితో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి నగరాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో అన్ని రంగాల్లో ఉద్యోగాల వృద్ధి రేటు 10 నుంచి 14 శాతానికే పరిమితమైనట్లు అధ్యయనం వెల్లడించింది. అత్యధికంగా సిటీలో ఆటో మొబైల్స్, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో కొలువుల కల్పన ఉందని.. ఆ తర్వాత ఐటీ, బీపీఓ, ఫార్మా రంగాలు నిలిచాయని పేర్కొంది. ఇక చదువు పూర్తిచేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారితోపాటు మూడేళ్ల అనుభవం ఉన్నవారికీ నగరంలో నూతన కొలువులు దక్కుతున్నట్లు తెలిపింది. ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్ హైదరాబాద్లో ఆటోమొబైల్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దేశ, విదేశీ వాహన కంపెనీలు, వాటి షోరూమ్లు, సర్వీసింగ్ కేంద్రాలు, వాటి విడిభాగాలు విక్రయించే దుకాణాలు వందలాదిగా వెలుస్తున్నాయి. వాటిల్లో ఉద్యోగాల కల్పన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మరోవైపు బహుళజాతి బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు సైతం బీమా రంగంలోకి ప్రవేశించడంతో ఈ రంగంలోనూ వేలాది మంది ఫ్రెషర్స్కు కొలువులు దక్కుతున్నాయి. నిర్మాణ రంగం గ్రేటర్ సిటీలో నిర్మాణ రంగానికి కొంగు బంగారంగా మారింది. కోర్సిటీ కంటే శివారు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ గృహాలు లక్షలాదిగా వెలుస్తున్నాయి. బడా నిర్మాణ రంగ కంపెనీలు నగరంపై దృష్టి సారించడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఐటీ, బీపీఓ కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల రాకతో ఐటీ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఈ రంగంలో నూతన ఉద్యోగాల కల్పన ఊపందుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ రంగంలో ఐదు లక్షల మంది ఉద్యోగాలు చేస్తుండగా.. ఈ ఏడాది నూతనంగా మరో 25 వేల వరకు ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక బీపీఓ రంగం శరవేగంగా విస్తరిస్తోందని.. ఈ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని నిపుణులు తెలిపారు. ఫార్మా బల్క్ డ్రగ్, ఫార్మా క్యాపిటల్గా పేరొందిన గ్రేటర్ సిటీలో బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ తదితర కోర్సులు చదివిన వారికి ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తున్నట్లు నౌకరీ డాట్ కామ్ అధ్యయనంలో వెల్లడైంది. -
ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ ప్రైవేటుకు!
న్యూఢిల్లీ: ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వారికి ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ అధికారి గిరీశ్ పిళ్లై చెప్పారు. ఈ విషయంపై సీనియర్ అధికారులు చర్చిస్తున్నామన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా రైల్వే నిర్వహణలో మార్పులొచ్చాయి. భారత్లోనూ ఈ మార్పులకు సమయం ఆసన్నమైంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంపై చర్చిస్తున్నాం’ అని అన్నారు. చార్జీల నిర్ణయం, టెర్మినళ్ల నిర్మాణం వంటి వాటి వరకు అనుమతించవచ్చా లేదా అన్న విషయంపై సీనియర్ అధికారులు చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్యాసింజర్, సరుకు రవాణా నిర్వహణను విడివిడిగా చూడాల్సిన అవసరమొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. -
బంధన్ బ్యాంక్ లాభం 10 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ నికర లాభంపై కూడా ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ రుణ భారం ప్రభావం చూపించింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలకు ఈ బ్యాంక్ పూర్తిగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. ఈ కేటాయింపులు లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగి ఉండేది. కాగా ఐఎల్అండ్ఎఫ్ఎస్కు ఏ మాత్రం రుణాలిచ్చిందనేది ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ రుణాల పుణ్యమాని ఈ బ్యాంక్ మొండి బకాయిలు భారీగా పెరిగాయి. 54 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం.... గత క్యూ3లో రూ. 1,336 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 41 శాతం వృద్ధితో రూ.1,884 కోట్లకు ఎగసిందని బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. రుణాలు 46 శాతం వృద్ధి చెంది రూ.35,599 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రుణ వృద్ధి జోరుగా ఉండటం, మార్జిన్లు పటిష్టంగా(10.5 శాతం) ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 54 శాతం ఎగసి రూ.1,124 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇతర ఆదాయం 48 శాతం పెరిగి రూ.234 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.574 కోట్ల నుంచి 57 శాతం పెరిగి రూ.900 కోట్లకు చేరిందని తెలిపారు. గత క్యూ3లో 9.9 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 10.3 శాతానికి పెరిగిందని వివరించారు. తగ్గిన రుణనాణ్యత... ఇన్ని సానుకూలాంశాలున్నా ఈ బ్యాంక్ రుణ నాణ్యత తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 1.29 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిల నిష్పత్తి ఈ క్యూ3లో 2.41 శాతానికి పెరిగింది. అలాగే నికర మొండి బకాయిలు 0.69 శాతం నుంచి 0.70 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో రూ.124 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.474 కోట్లకు పెరిగాయని ఘోష్ పేర్కొన్నారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ కంపెనీకి ఇచ్చిన రుణాల కోసం రూ.385 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వెల్లడించారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ కేటాయింపులు లేకపోతే మొత్తం కేటాయింపులు రూ.90 కోట్లుగానే ఉండేవని వివరించారు. హెచ్డీఎఫ్సీ గ్రూప్నకు చెందిన గృహ్ ఫైనాన్స్ కంపెనీని కొనుగోలు చేయడానికి ఈ బ్యాంక్ ఇటీవలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగిస్తుందన్న ధీమాను బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బంధన్ బ్యాంక్ షేర్ పెరిగింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లు పతనమైనా, బంధన్ బ్యాంక్ షేర్ 4 శాతం ఎగసి రూ.472 వద్ద ముగిసింది. -
సమాజ అవసరాలు తీర్చే పరిశోధనలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: సుస్థిరాభివృద్ధికి అత్యంత కీలకమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాలతోపాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సమాజ అవసరాలను తీర్చే వినూత్న పరిశోధనలకు పెద్దపీట వేయాలని శాస్త్రవేత్తలను కోరారు. సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్లాటినమ్ జూబ్లీ వేడుకల ప్రారంభం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పరిశోధన సంస్థలు యువ శాస్త్రవేత్తల ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కోరారు. భూతాపోన్నతి, వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తులో స్వచ్ఛమైన నీరు, తగిన ఆహారం లభించడం కూడా పెను సవాళ్లుగా మారనున్నాయని, శాస్త్రవేత్తలు వీటిని అధిగమించడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. దశాబ్దాల క్రితం హరిత విప్లవం దేశ ఆహార అవసరాలను తీరిస్తే, నేడు మేధో విప్లవం సాయంతో వ్యవసాయం, రైతుల సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాల ఉత్పత్తి అవసరమని, దానికి అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలే కాదు, సామాన్యుడు కూడా మన దేశానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని, వారి భద్రతకు చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ మన దేశానికి చాలా అవసరమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన అందరికీ ఆరోగ్యం, విద్య అందాలన్నా, లింగవివక్ష అంతం కావాలన్నా మన ఆలోచన విధానం మారాలని వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న పరిశోధన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,227 వరకూ ఉంటే అందులో సీఎస్ఐఆర్ తొమ్మిదో స్థానంలో ఉండటం దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఒక్కతాటిపైకి తెచ్చాం: హర్షవర్ధన్ నాలుగేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చిన తరువాత సీఎస్ఐఆర్తోపాటు దేశంలోని అన్ని పరిశోధన సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగామని, ఫలితంగా దేశంలో పరిశోధనల తీరుతెన్నులు మారిపోయాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. సీఎస్ఐఆర్లోని మొత్తం 37 సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన డెహ్రాడూన్ డిక్లరేషన్ ద్వారా దేశంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు చేపట్టడం సాధ్యమైందని, ఐఐసీటీ వైద్యం, ఇంధన రంగాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్వహిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ మాట్లాడుతూ వ్యవసాయానికి కీలకమైన కీటకనాశినులను దేశీయంగా తయారు చేయడం మొదలుకొని ప్రాణాధార మందులను జెనరిక్ రూపంలో చౌకగా అందించడం వరకూ ఐఐసీటీ చేసిన సేవ ఎంతో ముఖ్యమైందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, సీనియర్ శాస్త్రవేత్తలు ఎన్.వి.సత్యనారాయణ, శైలజ దోనంపూడి, ఐఐసీటీ మాజీ డైరెక్టర్లు, దేశవ్యాప్త సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఆ వర్సిటీలను ప్రైవేటుపరం చేయం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతోపాటు దేశంలోని పలు వర్సిటీలను ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే వాటికి స్వయంప్రతిపత్తి హోదా కల్పించామనడం సరికాదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ విద్యా సంస్థల్లో ఫీజులు పెంచబోమని, వీటికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న దేశంలోని 60 విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అటానమస్ హోదా కల్పించింది. వీటిలో 5 సెంట్రల్ వర్సిటీలు కాగా 21 స్టేట్ వర్సిటీలున్నాయి. అటానమస్ హోదా కారణంగా ఆయా వర్సిటీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. -
ఐదేళ్లలో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏ దేశమైనా సాంకేతికంగా శరవేగంగా అభివద్ధి చెందుతుంటే దాని ప్రభావం కచ్చితంగా ఉద్యోగులపై ఉంటుందనేది తెల్సిందే. ఫలితంగా ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. పర్యవసానంగా పాత ఉద్యోగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులే కొత్త ఉద్యోగాల్లో కుదురుకోగలరు. మిగితా వాళ్లకు ఉద్వాసన చెప్పక తప్పదు. 2022 నాటికి భారత్లో కూడా ఈ పరిణామాలు సంభవిస్తాయని ‘యర్నెస్ట్ అండ్ యంగ్’ అనే మేనేజ్మెంట్ కన్సెల్టింగ్ సంస్థ డిసెంబర్లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. పలు రకాల పరిశ్రమలు, 130 మంది వ్యాపారవేత్తలు, పలువురు విద్యావేత్తల అభిప్రాయలను తెలుసుకోవడం ద్వారా ఈ సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం ఈ నాలుగేళ్ల కాలంలో ప్రస్తుతమున్న ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 నుంచి 35 శాతం వరకు ఉద్యోగాలు పోతాయి. ప్రతి మందిలో ఒకరికి కొత్త ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉనికిలోనే లేని ఆ ఉద్యోగం రేపు ఎక్కడా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. ముఖ్యంగా భారత టెక్ సెక్టార్లో ఉద్యోగాల నియామకం క్రమంగా మందగిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రత్యక్షంగా 38 లక్షల మంది పనిచేస్తుండగా, పరోక్షంగా 1.30 మంది పనిచేస్తున్నారు. ఈ రంగంలో ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతో ఆధునిక సాంకేతిక జ్ఞానం అవసరం అవుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంను సమకూర్చుకోవడం వల్ల పాత ఉద్యోగులు పోతారు. కొత్త నియామకాలు తగ్గుతాయి. ఉదాహరణకు ఐటీ–బీపీఎం పురోభివద్ధి శాతం ఆరు శాతం ఉంటే నియమకాలు మూడు నుంచి మూడున్నర శాతం వరకు ఉంటాయి. 2022 నాటికి మూడొంతుల ఉద్యోగాలకు కొత్త నైపుణ్యం అవసరం అవుతుంది. ఐటీ–బీపీఎం రంగంలోనే 2022 నాటికి 45 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో నాలుగున్నర లక్షల నుంచి తొమ్మిది లక్షల ఉద్యోగాలు కొత్తవి ఉంటాయని సర్వేలో అంచనా వేశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ రంగాల్లో కొత్త స్కిల్స్ అవసరం అవుతాయని, ఒక్క ఐటీ–బీపీఎంలోనే కాకుండా వెలుపలున్న ఐటీ రంగంలో కూడా భారీగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. -
ఇందిరాగాంధీ స్టేడియంపై గద్దలు
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం (ఐజీఎంసీ)పై కూడా ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. పర్యాటకాభివృద్ధి ముసుగులో ప్రైవేటు సంస్థల పేరిట బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సంసిద్ధమవుతోంది. దాదాపు రూ.1,350 కోట్లు మార్కెట్ విలువ ఉన్న స్టేడియం భూములను ధారాదత్తం చేసేందుకు పన్నాగం సాగుతోంది. స్టేడియం భూములపై కన్ను విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఐజీఎంసీ క్రీడారంగానికి ఎంతో కీలకమైంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లోని గచ్చిబౌలీ, ఎల్బీ స్టేడియాల తరువాత ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు, క్రికెట్ మ్యాచ్లకు వేదికగా నిలిచింది. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో స్టేడియాల కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం ప్రాధాన్యం మరింత పెరిగింది. కోట్లాది రూపాయాల నిధులతో ఏర్పాటు చేసిన బహుళ అంతస్తుల శాప్ ప్రధాన కార్యాలయం ఇక్కడే (స్టేడియంలోనే) ఉంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ స్టేడియం భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. శాప్ అధికారులకు కూడా తెలియకుండా ఆ సంస్థ ఎండీ ఎన్.బంగారురాజు ఇచ్చిన ఆదేశాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంస్థ సామగ్రి మొత్తం గుంటూరు బీఆర్ స్టేడియానికి తరలించమని ఆయన ఆదేశించారు. అంటే ఇక్కడ నుంచి శాప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా రూ.6 కోట్లతో ఈ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సింథటిక్ ట్రాక్ను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. ఆ ట్రాక్ను ముందే వ్యూహాత్మకంగా విశాఖపట్నం తరలించేశారు. తద్వారా ఇక్కడ క్రీడా సదుపాయాలు ఏవీ అభివృద్ధి చేయకుండా కొంతకాలంగా పావులు కదుపుతూ వచ్చారు. తాజాగా ఏకంగా శాప్ కార్యాలయాన్నే తరలించేయాలని నిర్ణయించారు. ఒకసారి స్టేడియాన్ని ఖాళీ చేస్తే తరువాత కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. త్వరలోనే ఆ స్టేడియం భూములను పర్యాటక ప్రాజెక్టుల పేరుతో పీపీపీ పద్ధతిలో తమ బినామీ సంస్థలకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి గొడ్డలిపెట్టు వంటి ఈ నిర్ణయంపై క్రీడారంగ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజాపంపిణీ ప్రైవేట్ పరం
-
వైద్య సేవలు ప్రైవేటుకు ఇద్దామా!
⇒ రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ప్రజారోగ్యంపై ప్రైవేటురంగం గుత్తాధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆస్పత్రులలోని కొన్ని రకాల వైద్య సేవల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్ ప్రతిపాదనలను రూపొందించాయి. ‘ప్రభుత్వ ఆస్పత్రులలోని కొన్ని వైద్య సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఎలా ఉంటుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, ఇబ్బందుల పరిస్థితేమిటి. మీ రాష్ట్రంలో ఈ పద్ధతిని అమలు చేసేందుకు అవకాశాలున్నాయో లేదో స్పష్టత ఇవ్వడి’ అని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ జూన్ 5న లేఖలు పంపింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, స్పందన ఆధారంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ ఖర్చు అయ్యే వైద్య సేవలను ప్రైవేటు సంస్థలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంద ని ప్రభుత్వ వైద్య వర్గాలు భావిస్తున్నాయి. మూడు రకాల సేవలు... దేశంలోని ప్రభుత్వ వైద్య సేవలపై ప్రపంచ బ్యాంకు సం ప్రదింపులతో కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్లు తాజాగా ఒక నివేదిక రూపొందించాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా ఆస్పత్రులు... ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో గుండె, ఊపిరితిత్తులు, కేన్సర్ వైద్య సేవల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన 30 ఏళ్లు లీజు ఉండేలా అప్పగించాలి’ అని లేఖలో నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. కాగా, నీతి ఆయోగ్ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన పంపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
ప్రైవేట్ రంగానికి పెద్దపీట
-
ప్రైవేట్ రంగానికి పెద్దపీట
మంత్రివర్గ సమావేశం నిర్ణయం సెజ్లు, ప్రైవేట్ పరిశ్రమలకు భూ కేటాయింపులు సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ గురువారం తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఏపీఐఐసీ నుంచి భూములు తీసుకోవడం, ఇవ్వడం వంటి నిర్ణయాలు మంత్రివర్గం తీసుకున్నది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పలువురిలో చర్చకు దారి తీశాయి. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార ప్రసార శాఖల మంత్రి పల్లె రఘునాధరెడ్డి గురువారం వెల్లడించారు. ♦ అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమర్?ర గ్రామం సర్వే నెంబరు: 447/2లో 23.11 ఎకరాలు, పరిగి మండల కేంద్రంలో సర్వే నంబరు 451-1ఎలో 44.05 ఎకరాలు, చిత్తూరు జిల్లా వి కోట మండలం బైరుపల్లి గ్రామంలో సర్వే నంబరు 96-10, 99-1లో 7.94 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి బదలాయింపు. ♦ చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలం చినపందూరులో ఏపీఐఐసీకి చెందిన 200 ఎకరాల భూమిని అపోలో టైర్స్ లిమిటెడ్ కంపెనీకి కేటాయింపు. ఇక్కడ టైర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. ♦ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదన మేరకు ఎప్పటికప్పుడు భూ సేకరణ కోసం తీసుకొనే రూ.ఐదువేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయం. ♦ షెడ్యూల్డ్ ప్రాపర్టీలో విలువ కట్టని ఆస్తులలో హీరోమోటార్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టిన పెట్టుబడికి సేల్ డీడ్లో నష్టపరిహారం ష్యూరిటీ క్లాజ్ను చేర్చే ప్రతిపాదనకు ఏపీఐఐసీ లిమిటెడ్కు అనుమతి. ♦ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ల గౌరవ వేతనం ఇతర భత్యాల పెంపు రెట్టింపు. ♦ అమరావతిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో దుబాయ్కి చెందిన బీఆర్ షెట్టి గ్రూప్ మెడికల్ యూనివర్శిటీ, వెయి పడకల ఆస్పత్రి, వైద్య పరికరాల తయారీ యూనిట్, నేచురోపతి సెంటర్, స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటుకు ఎకరా రూ.50 లక్షల చొప్పున 100 ఎకరాల కేటాయింపు. ♦ అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ హడ్కో లేదా ఇతర సంస్థల నుంచి మూడేళ్ళలో తిరిగి చెల్లించేలా రూ.1859 కోట్ల రుణాన్ని తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడానికి ఆమోదం. ♦ చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న పోలీస్ స్టేషన్ కోసం హోమ్ శాఖలో కొత్తగా 172 పోస్టులు మంజూరయ్యాయి. రెవెన్యూ శాఖలో డెరైక్టర్ ఆఫ్ ట్రాన్సలేషన్ పోస్ట్ మంజూరు చేశారు. ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ శాఖకు సంబంధించి 22 పోస్టులు మంజూరు చేశారు. అందులో 11 టీచింగ్, 6 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు విజయనగరం జిల్లా గరివిడిలోని పశువైద్య కళాశాలకు మంజూరు చేశారు. -
'స్మార్ట్ మిషన్'లో ప్రైవేట్ రంగమే కీలకం
న్యూఢిల్లీ : మనదేశంలో ప్రభుత్వం రంగంతో పాటు, ప్రైవేట్ రంగానికి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీల రూపకల్పనలో ప్రైవేట్ రంగమే కీలక పాత్ర పోషించ నుందని సర్వేలు తేల్చి చెప్పాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ప్రైస్ వాటర్ హౌస్ కార్పొరేషన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మౌలిక సదుపాయాలు, మున్సిపల్ సర్వీసులు కల్పించకపోతే పట్టణ ప్రాంతాల వృద్ధి జరదని సర్వేలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు, అర్బన్ స్థానిక సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడైనా సమస్య వచ్చినా సహాయ పడటంలో ప్రైవేటు రంగం కీలకపాత్ర పోషిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 ఏడాది వరకు పట్టణ జనాభా 66 శాతం పెరుగుతుందని, దీనిలో భారత్ పాత్రే ఎక్కువగా ఉంటుందని చెప్పాయి. భారత్ లో పట్టణ జనాభా దాదాపు 410 మిలియన్. ఇది మొత్తం జనాభాకు 32 శాతం. అయితే ఈ జనాభా 2050 కల్లా 814 మిలియన్ కు లేదా ప్రపంచ జనాభాలో సగానికి కన్నా చేరుకుంటుందని ఈ సర్వేలు అంచనావేస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్రప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలు, 500 సిటీలను అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సిమిషన్ కింద ఎంపిక చేసిందని పేర్కొన్నాయి. ఈ సిటీల రూపకల్పనలో ప్రైవేట్ రంగం ఎంతో సహాయం అందిస్తుందని సర్వేలు తెలిపాయి. -
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్సించాలి
హైదరాబాద్: కాంగ్రెస్ జెనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్లించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. పరిశ్రమలకు ఒక వైపు చేయూతనిస్తూనే మరో వైపు అణగారిన వర్గాల వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కల్పిస్తే త్వరగా అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు తమ యూపీఏ ప్రభుత్వం నిశ్చయాత్మక చర్యలు తీసుకున్న విషయాన్ని ఈసందర్భంగా దిగ్విజయ్ గుర్తు చేశారు.రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పారదర్శకత విషయంలో రాజకీయ పార్టీలకు మినహాయింపులు ఉండాల్సిన అవసరం లేదని స్పంష్టం చేశారు. -
స్మార్ట్ సిటీలకు 10 లక్షల కోట్లు అవసరం: నివేదిక
ముంబై: కేంద్రం చేపట్టిన 100 స్మార్ట్ సిటీల నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ డాలర్లు (రూ.10లక్షల కోట్లు) అవసరమవుతాయని ఓ నివేదిక తెలిపింది. ఇందుకోసం ప్రైవేటు రంగం ప్రధాన భాగస్వామిగా మారాల్సిందేనంది. డెలాయిట్ సంస్థ విశ్లేషణ ప్రకారం 120 బిలియన్ డాలర్లు ప్రైవేటు రంగం నుంచి రానున్నట్లు అంచనా. స్మార్ట్సిటీ ప్రాజెక్టులోభాగంగా నగరమంతా వై-ఫై సర్వీసులు అందించేందుకు సర్వీసు ప్రొవైడర్లు, కంటెంట్ ప్రొవైడర్లదే కీలక పాత్ర అని నివేదిక పేర్కొంది. అయితే 50 స్మార్ట్ సిటీల్లో వై-ఫై సేవలందించేందుకు రిలయన్స్ జియో ముందుకు రాగా, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు సంయుక్తంగా సేవలందించాలని భావిస్తున్నాయి. కాగా.. 100 స్మార్ట్సిటీలు, 500 అమృత్ నగరాలకోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా 7.513 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 వేల కోట్లు) ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. -
ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
♦ సీతారాం ఏచూరి డిమాండ్ ♦ హామీల అమలుకు పట్టుబడితే సీఎం కేసీఆర్కు కోపమొస్తుంది సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. 16 నెలలైనా ఎందుకు అమలు చేయలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే ఆయనకు కోపమొస్తుందని, ఈ మధ్యకాలంలో వామపక్షాలపై చిర్రుబుర్రులాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల సాధన కోసం హైకోర్టు న్యాయవాది ఉస్మాన్ షాహీద్ అధ్యక్షతన సోమవారమిక్కడ సదస్సులో ఏచూరి ముఖ్యఅథితిగా హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ల సిఫార్సులను అమలుచేయాలని ఎన్డీఏ ప్రభుత్వానికి చెప్పినా వినిపిం చుకునే పరిస్థితి లేదన్నారు. కనుక ముస్లింలు రిజర్వేషన్ల సాధనకు పోరాటం చేయాలని, తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ఎస్సీ, ఎస్టీల కంటే దారుణమైన స్థితిలో ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. జనాభాలో 12 శాతం ఉన్న ముస్లింలకు లక్ష కోట్ల బడ్జెట్లో రూ.12 వేల కోట్లు దక్కాలని సూచించారు. వీటి కోసం సీఎం కేసీఆర్కు దరఖాస్తులో, అర్జీలో పెట్టుకోవడం కాకుండా గల్లాపట్టి తీసుకోవాలన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం సమాన హక్కులు, అవకాశాలు అణగారిన వర్గాల ప్రజలకు దక్కాలంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ఇందుకోసం పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉందని ీసీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం హాల్లో బషీర్బాగ్ పీజీ లా కళాశాల, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘రైట్ టు రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టార్ యాజ్ ఏ హ్యూమన్ రైట్’ అనే అంశంపై ఒక రోజు జాతీయస్థాయి వర్క్షాప్ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరై సీతారాం ఏచూరి మాట్లాడారు. -
గతవారం బిజినెస్
హెచ్డీఎఫ్సీ కనీస స్థాయి రుణ రేటు భారత ప్రై వేటు రంగంలో రెండవ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, తన కనీస రుణ రేటు (బేస్ రేటు)ను 0.35 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.35 శాతానికి చేరింది. ఇది బ్యాంకింగ్ పరిశ్రమలో అతి తక్కువ బేస్ రేటు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐల బేస్రేటు 9.7 శాతంగా ఉంది. స్టార్టప్లలో రతన్ టాటా పెట్టుబడులు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా డేటా అనలిటిక్స్ సంస్థ ఇన్ఫినిట్ అనలిటిక్స్లోను... ఆన్లైన్ ఫుడ్ మార్కెట్ ప్లేస్ హోలాషెఫ్లోను పెట్టుబడులు పెట్టారు. ఈ రెండూ స్టార్టప్ సంస్థలే. అయితే రెండింటిలోనూ ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశారన్నది వెల్లడి కాలేదు. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు కీలక హోదా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐని, ప్రై వేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకుని.. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకులుగా (డీ-ఎస్ఐబీ) రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. ఇవి భారీ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తున్నందున..ఒకవేళ వీటి సర్వీసులకు విఘాతం కలిగినా ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి సమస్యలు రాకుండా, వీటికి మరింత అత్యున్నత స్థాయి పర్యవేక్షణ నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. డెయిరీ మార్కెట్లోకి ఐటీసీ సిగరెట్లు, వంటనూనెలు, సబ్బులు, బిస్కెట్లు వంటి తదితర ఉత్పత్తులను తయారుచేసే ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ డెయిరీ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. త్వరలో నెయ్యితో తమ తొలి డెయిరీ ప్రొడక్ట్ను మార్కెట్లోకి తీసుకువస్తామని ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తెలిపారు. నెయ్యి తర్వాత పాలు, వెన్న, జున్ను, చాక్లెట్స్ వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. రైల్వే తొలి ఎఫ్డీఐ ఆఫర్కు 3 బిడ్లు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేలో తొలి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) ఆఫర్కు మూడు అంతర్జాతీయ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. బీహార్లోని మాధేపురాలో ఆధునిక ఎలక్ట్రిక్ రైలు పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీని రూ.1.300 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. సీమెన్స్, ఆల్స్టోమ్, బొంబార్డీయిర్.. ఈ మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమ తమ బిడ్లను దాఖలు చేశాయి. ఎఫ్ఐఐలకు మ్యాట్ లేనట్టే! వివాదాస్పదంగా మారిన ‘కనీస ప్రత్యామ్నాయ పన్ను’ (మ్యాట్) విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (ఎఫ్ఐఐ) ఊరట లభించనుంది. ఎఫ్ఐఐలపై మ్యాట్ విధించరాదంటూ జస్టిస్ ఏపీ షా కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిం ది. ఇందులో భాగంగా ఎఫ్ఐఐలపై మ్యాట్ కేసుల విచారణ పక్కన పెట్టాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1కి పూర్వం కేసుల విషయంలో రికవరీలు ఆపేయాలని ఒక సర్క్యులర్లో సూచించింది. చిన్న చమురు క్షేత్రాలు ప్రైవేట్ పరం! ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు అప్పగించిన 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేసి ప్రై వేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇప్పటిదాకా అమల్లో ఉన్న... ‘లాభాల్లో వాటాల విధానం’ కాకుండా ఇకపై స్థూల ఆదాయాల్లో వాటాలివ్వాలనే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. 11 శాతం తగ్గిన ఏటీఎఫ్ ఇంధన ధర అంతర్జాతీయంగా ఇంధన ధరలు క్షీణించడంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 11.7 శాతం తగ్గింది. అలాగే సబ్సిడీయేతర వంటగ్యాస్ ఎల్పీజీ ధర కూడా సిలిండర్కు రూ.25.5లు కిందకు దిగివచ్చింది. దేశ రాజధానిలో ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ.5,469 (11.7 శాతం) తగ్గి రూ.40,938లుగా ఉందని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. జెట్ ఎయిర్వేస్లో జెట్లైట్ విలీనం! జెట్లైట్ ఎయిర్వేస్ తన మాతృ సంస్థ జెట్ ఎయిర్వేస్లో విలీనమవుతోంది. ఈ విలీనానికి కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. కంపెనీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడానికి, ఒకే రకమైన ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించడానికి ఈ విలీనం చేపట్టినట్లు జె ట్ ఎయిర్వేస్ పేర్కొంది. జెట్ ఎయిర్వేస్ 2007 ఏప్రిల్ నెలలో సహారా ఎయిర్లైన్స్ను రూ.1,450 కోట్లకు కొనుగోలు చేసింది. తర్వాత సహారా ఎయిర్లైన్స్ పేరు జెట్లైట్గా రూపాంతరం చెందింది. ఆర్థికాభివృద్ధి అంతంతే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2015-16 : ఏప్రిల్-జూన్) నిరాశను మిగిల్చింది. ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేక కేవలం 7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మూడు ప్రధాన రంగాలు- సేవలు, తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు దీనికి కారణం. మరోవైపు జీడీపీ నెమ్మదించడం సెప్టెంబర్ 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల కోత ఆశలను పెంచుతోంది. 2,4 శనివారాల్లో ఆర్టీజీఎస్ సేవలు బంద్ ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఆయా రోజుల్లో ఇకపై ఆర్టీజీఎస్ సేవలు కూడా అందుబాటులో ఉండవని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగతా శనివారాల్లో మాత్రం పూర్తిగా రోజంతా సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆర్టీజీఎస్ వేళల్లో కూడా మార్పులు చేసినట్లు ఆర్బీఐ వివరించింది. దీని ప్రకారం రెండో, నాలుగో శనివారాలు మినహా మిగతా అన్ని రోజుల్లో కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఆర్టీజీఎస్ వేళలు ఉదయం 8 గం. ల నుంచి సాయంత్రం 4.30 గం.ల దాకా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్లో లక్ష కోట్ల పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దాదాపు రూ. 1.07 లక్ష కోట్ల పైగా విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు టెలి కం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గత 14 నెలలుగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ఏర్పాటును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, దానికి తగ్గట్లుగానే పెట్టుబడి ప్రతిపాదనలూ వస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ పథకం (ఎంఎస్ఐపీఎస్) కింద ఈ ప్రతిపాదనలకు పెట్టుబడి వ్యయాలపై సబ్సిడీ మొదలైనవి అందించనున్నట్లు పేర్కొన్నారు. నియామకాలు - రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. - ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా రతన్ పి. వాతాల్ (59) నియమితులయ్యారు. - సెయిల్ కొత్త చైర్మన్గా పీకే సింగ్ ఎంపికయ్యారు. - సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియాం) కొత్త ప్రెసిడెంట్గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి ఎంపికయ్యారు. - ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ సిప్లా, ఉమాంగ్ వోరాను గ్లోబల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించింది. ఆయన గతంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్తర అమెరికా బిజినెస్ హెడ్గా ఉండేవారు. డీల్స్.. - అమెరికాలోని ఇన్వాజెన్ ఫార్మాస్యూటికల్స్, ఎక్సెలాన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలను దేశీ కంపెనీ సిప్లా కొనుగోలు చేసింది. హెటిరో గ్రూప్ ప్రమోటర్లకు చెందిన ఈ రెండు కంపెనీలనూ రూ.3,652 కోట్లకు కొనుగోలు చేశామని సిప్లా తెలియజేసింది. - టేబుల్ రిజర్వేషన్ ప్లాట్ఫామ్ డైన్అవుట్ బెంగళూరుకు చెందిన ఇన్రెస్టో సర్వీస్ను కొనుగోలు చేసింది. - అమెరికాకు చెందిన రెడ్యూస్ డేటా స్టార్టప్ను ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ కొనుగోలు చేసింది. - ఆన్లైన్ ఈ-కామర్స్ కంపెనీ ‘ఈబే ఇండియా’ 24/7 హోమ్ షాపింగ్ చానల్ ‘బెస్ట్ డీల్ టీవీ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈబే ఒప్పందంలో భాగం గా బెస్ట్ డీల్ టీవీ సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులను అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాలకు ఈబే ఎగుమతి చేస్తుంది. -
సామాజిక, విప్లవ శక్తులు ఏకమవ్వాలి
{పైవేట్ రిజర్వేషన్లు సాధించాలి సామాజిక విశ్లేషకుడు {పొఫెసర్ కంచె ఐలయ్య విద్యారణ్యపురి: ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు సాధించేందుకు సామాజిక, విప్లవ శక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ఓయూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ‘ప్రైవేట్రంగంలో రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థారుు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రైవేట్ రంగం అంతా అగ్రకులాల చేతుల్లోనే ఉందని, ఆయూ రంగాల్లో రిజర్వేషన్లు లేక ఎస్సీ, ఎస్టీ, బీసీలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మారాయని విమర్శించారు. పాలకవర్గాల విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల పోరాట సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాడి ముసలయ్య మాట్లాడుతూ, ఈ ఉద్యమంలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాలని కోరారు. బీసీసబ్ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ కె. మురళీమనోహర్, దళితరత్న బొమ్మల కట్టయ్య, నిజాం కాలేజి ప్రిన్సిపాల్ గాలి వినోద్కుమార్, ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాలప్రిన్సిపాల్ భద్రునాయక్, కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు సంఘం అధ్యక్షుడు ఎం. సారంగపాణి, సీపీఎం,సీపీఐ , ఎంసీపీఐ, ఆర్ఎస్పీ ఫార్వర్డ్బ్లాక్ జిల్లా కార్యదర్శులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, టి శ్రీనివాసులు, పి. భూమయ్య, కె. శివాజీ, ఇ. వేణు, టీపీఎస్ రాష్ట్రకన్వీనర్ జి రాములు తదితరులు మాట్లాడారు. వివిధ ప్రజాసంఘాల బాధ్యులు సీహెచ్. రంగయ్య, డి. తిరుపతి, భీమానాత్ శ్రీనివాస్, టి. స్కైలాబ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
యస్బ్యాంక్ లాభం 28% అప్
న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 28 శాతం వృద్ధితో రూ.551 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం వల్ల నికర లాభంలో రెండంకెల వృద్ధి నమోదైందని వివరించింది.కాగా ఆదాయం 42 శాతం వృద్ధితో రూ.1,060 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.3,093 కోట్ల నుంచి రూ.3,797 కోట్లకు ఎగసింది. కాగా త్వరలో బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. -
5 శాతం పెరిగిన డీసీబీ నికర లాభం
ముంబై : ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.45 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.47 కోట్లకు పెరిగిందని డీసీబీ తెలిపింది. తమకు వర్తించే పన్ను రేటు 16 శాతమని, కానీ తాము 35 శాతం పన్ను రేటు చొప్పున చెల్లించామని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళి ఎం. నటరాజన్ చెప్పారు. అందుకే నికర లాభం తగ్గిందని వివరించారు. నికర మొండి బకాయిలు 0.97 శాతం నుంచి 1.22 శాతానికి పెరిగాయని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 1.96 శాతానికి చేరాయని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం రూ.352 కోట్ల నుంచి రూ.404 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.140 కోట్లకు పెరిగాయని, మొత్తం ఆదాయం రూ.204 కోట్లకు పెరిగిందని వివరించారు. త్వరలో కొత్తగా 30 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని, 400 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని తెలిపారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం 25% అప్
క్యూ1లో రూ. 525 కోట్లు... ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో రూ.525 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.421 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం వృద్ధి చెందింది. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 2,874 కోట్ల నుంచి రూ.3,448 కోట్లకు పెరిగింది. 20 శాతం ఎగసింది. ఇక క్యూ1లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) కూడా 22 శాతం ఎగబాకి రూ.724 కోట్ల నుంచి రూ.981 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 26 శాతం పెరిగి రూ.724 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఫీజులు, బీమా, మ్యూచువల్ ఫండ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఆదాయంలో 43 శాతం పెరుగుదల(రూ.107 కోట్లు) కారణంగా ఇతర ఆదాయాలు భారీగా పుంజుకున్నాయని బ్యాంక్ ఎండీ, సీఈఓ, రమేశ్ సోబ్తి పేర్కొన్నారు. ఇక క్యూ1లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 0.79 శాతానికి తగ్గాయి. గతేడాది క్యూ4(మార్చి క్వార్టర్)లో ఇవి 0.81 శాతంగా ఉన్నాయని సోబ్తి తెలిపారు. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) కూడా స్థిరంగా 3.68 శాతం(రూ.453 కోట్లు)గా నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఈ నెల ఆరంభంలో సంస్థాగతంగా షేర్ల కేటాయింపుల ద్వారా రూ.4,327 కోట్లను సమీకరించామని.. త్వరలో ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూపంలో మరో రూ.750 కోట్లను సమీకరించనున్నట్లు సోబ్తి వివరించారు. ఫలితాల నేపథ్యంలో సోమవారం ఇండస్ఇండ్ షేరు ధర బీఎస్ఈలో 3.27 శాతం ఎగబాకి రూ.924 వద్ద ముగిసింది. -
రుణ రేటు తగ్గించిన కోటక్ బ్యాంక్
ముంబై: ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ కనీస రుణ (బేస్) రేటును 0.10 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.85 శాతం నుంచి 9.75 శాతానికి తగ్గింది. జూలై 2వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రైవేటు రంగంలో మూడు అతిపెద్ద బ్యాంకులు- ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్లతో పోల్చితే... ఇప్పటికీ కోటక్ ఆఫర్ చేస్తున్న బేస్ రేటు 5 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది. కనీస రుణ రేటు తగ్గడం వల్ల దీనితో అనుసంధానమైన వాహన, గృహ, విద్యా రుణ రేట్లు తగ్గే వీలుంటుంది. ఈ ఏడాది మొత్తంలో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) 0.75 శాతం తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనంలో కొంత కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. రుణ రేటు తగ్గడం డిపాజిట్ రేటు తగ్గడానికి కూడా సంకేతం. -
యాక్సిస్ బ్యాంక్ బేస్రేటు తగ్గింపు
ముంబై : ప్రైవేటు రంగంలో మూడవ అతిపెద్ద యాక్సిస్ బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.85 శాతానికి తగ్గింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). పైవేటు రంగంలో అగ్రస్థాయిలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ రేటు తగ్గింపు మరుసటిరోజే యాక్సిస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యాక్సిస్ బ్యాంక్ నిర్ణయం జూన్ 30 నుంచీ అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో-ప్రస్తుతం 7.25 శాతం) 75 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే- ఈ ప్రయోజనంలో 0.30 శాతాన్ని యాక్సిస్ కస్టమర్లకు బదలాయించినట్లయ్యింది. అయితే ఇప్పటికీ యాక్సిస్ బ్యాంక్ బేస్ రేటు.. ఐసీఐసీఐ బ్యాంక్ బేస్ రేటు (9.7 శాతం) కన్నా అధికం కావడం గమనార్హం -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ రేటు కోత
న్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కనీస (బేస్) రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.70 శాతానికి చేరింది. జూన్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ తన వెబ్సైట్లో తెలిపింది. కనీస రుణ రేటు తగ్గడం వల్ల దీనితో అనుసంధానమైన వాహన, గృహ, విద్యా రుణ రేట్లు తగ్గే వీలుంటుంది. ఇంతక్రితం ఏప్రిల్ 13న బ్యాంక్ రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.85 శాతానికి చేరింది. తాజా నిర్ణయంతో ఈ రేటు మరో 15 బేసిస్ పాయింట్లు తగ్గినట్లయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2న రెపో రేటును పావుశాతం తగ్గించింది. ఈ ఏడాది మొత్తంలో 0.75 శాతం తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనంలో కొంత కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. ఎస్బీబీజే కూడా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ (ఎస్బీబీజే) కూడా బేస్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 10.10% నుంచి 9.95 శాతానికి తగ్గింది. ఈ రేటు జూన్ 18 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ బీఎస్ఈకి పంపిన ఒక ఫైలింగ్లో తెలిపింది -
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి: సీపీఎం
వరంగల్: ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. వరంగల్ జిల్లా కమిటీ వరంగల్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలుకు పోరుబాట పట్టినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ప్రేవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోస్టర్ విడుదల చేశారు. బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ రంగాన్ని కాపాడలన్నారు. -
పోస్టాఫీసులు ఇక.. సేవామాల్స్
అన్ని సేవలూ ఒకే గొడుగు కింద ఉంటే అందరికీ ప్రయోజనమే. అన్ని రకాల గృహవినియోగ వస్తువులను అందిస్తున్న సూపర్బజార్ల మాదిరిగానే భవిష్యత్తులో పోస్టాఫీసులు అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే సేవామాల్స్గా మారనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా పోస్టాఫీసులను విస్తృతపరిచేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్ రంగం కంటే తక్కువ ఫీజలకే నమ్మకంగా సేవలు అందించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో మూడు ప్రధాన పోస్టాఫీసులు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ శాఖ సేవలపై రాష్ర్టప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతోంది. ప్రజలకు పలు సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాయే ప్రధాన బాధ్యతగా పని చేస్తున్న పోస్టాఫీసుల్లో ప్రస్తుతం లభిస్తున్న పరిమిత బ్యాంకు తరహా సేవలతోపాటు పింఛన్లు, వేతనాల పంపిణీ వంటి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని మరింత విస్తరించే దిశగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన పోస్టల్ శాఖ కీలక సమావేశంలో ఉన్నతాధికారులు చర్చించారు. సంప్రదాయ విధులనే కొనసాగిస్తే ప్రజలకు దూరమై, ఇబ్బందులు తప్పవన్న భావనతో ఉన్న సిబ్బందితోనే ఇంకా ఎటువంటి సేవలు అవసరం, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాల్లో ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అందుబాటులోకి రానున్న సేవలు ప్రస్తుతం అందిస్తున్న సేవలకు అదనంగా పరిశీలన, కార్యాచరణ దశలో ఉన్న సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ కొరియర్ సంస్థల పోటీ తట్టుకునేందుకు స్పీడ్ కొరియర్ సేవలకు పోస్టాఫీసులు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో పాస్పోర్ట్ దరఖాస్తుల విక్రయం, స్వీకరణ బాధ్యత చేపట్టవచ్చు. సొంత ఫొటోలతో స్టాంపులు వేయించుకునే మై స్టాంప్ సౌకర్యాన్ని విస్తృతపరచనున్నారు. ప్రస్తుతం మీ-సేవ కేంద్రాలు అందిస్తున్న అన్ని రకాల సేవలను భవిష్యత్తులో పోస్టాఫీసుల్లోనే జరపాలనే ప్రతిపాదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంది. కొన్ని మీ సేవ సెంటర్లలో ఆర్థిక లావాదేవీల విషయంలో అక్రమాలు జరుగుతుండడంతో అధికారులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. వినియోగదారుడు పంపిన ఉత్తరం, పార్శిల్, కొరియర్ ఎక్కడ ఉందీ ఇట్టే తెలుసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. జీపీఎస్ ద్వారా వాటి ఉనికిని కనుగొని వినియోగదారుడికి అవసరమైన సమయాల్లో ఎస్సెమ్మెస్ల ద్వారా సమాచారం అందిస్తారు. పోస్టు బాక్సులో నిర్ణీత సమయాల్లో పోస్ట్మన్ ఉత్తరాలు తీస్తున్నాడో లేదో తెలుసుకునేందుకు వాటిని జీపీఎస్తో అనుసంధానం చేస్తారు. తద్వారా వినియోగదారుడికి మెరుగైన సేవలందించే అవకాశం ఉంది. గతంలో పోస్టాఫీసుల్లో బీఎస్ఎన్ఎల్ రీచార్జింగ్ కార్డులు విక్రయించేవారు. భవిష్యత్తులో అన్ని మొబైల్ నెట్వర్క్ల కార్డులూ విక్రయించే అవకాశం ఉంది. రిజిస్టర్డ్ పోస్టు సర్వీసుల్ని ప్రజలకు దగ్గరగా చేసేందుకు రుసుములను తగ్గించే అవకాశం ఉంది. ఆధార్, పాన్ కార్డ్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఓటు కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, సీ బుక్, రేషన్కార్డుల జారీ, తప్పుల సవరణలు తదితర సేవలు కూడా పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు బ్యాంకుల్లో జరుగుతున్న స్వల్ప, దీర్ఘకాలిక, గృహ, వ్యక్తిగత, వాహన రుణాల మంజూరు ప్రక్రియను పోస్టాఫీసుల ద్వారా కూడా చేయిస్తారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) లావాదేవీలను మరింత పెంచనున్నారు. పోస్టల్ సేవలపై నమ్మకం గతంలో పలు లావాదేవీలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసులనే ప్రజలు నమ్ముతున్నారు. పోస్టల్ సేవలను ప్రజలకు దగ్గర చేసేందుకు కేంద్రం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని సేవలు లభ్యమయ్యే అవకాశం ఉంది. సేవల పెంపునకు సంబంధించి ఇటీవల మా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. -జె.ప్రసాదబాబు, తపాలా శాఖ సూపరింటెండెంట్, శ్రీకాకుళం -
ఎంసెట్ ఉండాల్సిందే
ప్రభుత్వానికి నివేదించిన ఉన్నతాధికారుల కమిటీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షను ఇకముందూ కొనసాగించాల్సిందేనని ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్తో సహా ఉన్నత విద్యారంగంలో ప్రైవేటు రంగందే పైచేయిగా ఉండడం వల్ల ఎంసెట్ రద్దు విపరిణామాలకు దారితీస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇంజనీరింగ్, ఫార్మా ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్తో పాటు ఉన్నత విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ .ఎం.డోబ్రియాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఆరుగురు సభ్యుల బృందాన్ని సెప్టెంబర్ 19న ఏర్పాటు చేసింది. కమిటీలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్, అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ విద్యా గెడైన్స్ అధికారి ఆర్.డేవిడ్ కుమార్స్వామి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ డిప్యుటీ డైరక్టర్ ఎస్పీ శ్రీకాంత్లను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ తమిళనాడులో పర్యటించి అక్కడి ఇంటర్మీడియెట్ విద్య, ఉన్నత విద్య, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అధ్యయనం చేసి వచ్చింది. ఇటీవలే ఈ నివేదికను డోబ్రియాల్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆనివేదిక ప్రకారం ‘ఇంటర్మీడియెట్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యారంగాలకు సంబంధించి తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్కు వ్యత్యాసముంది. తమిళనాడు విద్యారంగంలో ప్రభుత్వ పరిధే ఎక్కువ. స్కూళ్లు కాలేజీల్లో 85 శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసినవే. దీంతో పాటు అక్కడి పరీక్షల విధానం కూడా ఎంతో పకడ్బందీగా అమలవుతోంది. అక్రమాలకు తావులేకుండా కఠినమైన పద్ధతులను అక్కడ అమలు చేస్తున్నారు. ఏపీలో అందుకుభిన్నంగా స్కూళ్లు, ఇంటర్మీడియెట్ కాలేజీల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. తమిళనాడులో ఇంజనీరింగ్, ఫార్మాకోర్సుల్లో ప్రవేశానికి ఏపీలో మాదిరిగా ఎంసెట్ వంటి పరీక్ష నిర్వహించడం లేదు. ఎంసెట్తో పనిలేకుండా ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఇంటర్మీడియెట్ కాలేజీలు అత్యధికం ప్రభుత్వానివే అయినందున ఆ పబ్లిక్ పరీక్షలు పగడ్బందీగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ పరిధి తక్కువగా ఉండి ప్రైవేటు భాగస్వామ్యమే ఎక్కువైంది. ఈ తరుణంలో ఎంసెట్ పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కల్పన వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. గ్రా మీణ, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకన్నా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లోని పిల్లలకే ఇంటర్మీడియెట్ మార్కులు అధికంగా తెప్పించుకొని ఇంజనీరింగ్ సీట్లు వారికే కేటాయింపులు జరుగుతాయి. దీంతో గ్రామీణ, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులు నష్టపోతారు. ఎంసెట్ను యధావిథిగా కొనసాగించడం అనివార్యం’ అని సూచించినట్టు అధికారవర్గాలు తెలిపాయి ఉమ్మడి ఎంసెట్ తప్పదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఉమ్మడిగానే ఎంసెట్ను నిర్వహించాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యా ప్రవేశాలు ఉమ్మడిగా జరగాలని విభజన చట్టంలో ఉందని, ఎంసెట్ అనేది ప్రవేశాలకు సంబంధించినదే కనుక పరీక్షను ఉమ్మడిగానే నిర్వహించకతప్పదని చెబుతున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు వేర్వేరుగా జరుగుతున్నందున మూల్యాంకనం, మార్కులివ్వడంపై ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రానికి అనుమానాలు తలెత్తే పరిస్థితి ఉంటుందని, ఈ తరుణంలో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వడం పూర్తిగా రద్దుచేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఎంసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తే ఎలాంటి వివాదాలకూ తావుండదని పేర్కొంటున్నారు.