Rajampeta
-
టీడీపీ అభ్యర్ధి సైలెంట్.. అన్ని సర్దుకుని సొంత నియోజకవర్గానికి పరార్
పోలింగ్కు ముందు గెలుపు మాదే అంటూ వీరంగం వేశారు. బస్తీమే సవాల్ అన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మరీ పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ధీమాగా ఉన్నారు. కాని బయటి నుంచి వచ్చి సవాళ్ళు విసిరిన టీడీపీ అభ్యర్థి సైలెంట్ అయిపోయారు. అన్నీ సర్దుకుని తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కుడుంది? అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థే దొరకలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగల బలమైన నేత ఎవరూ కనిపించలేదు. దీంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి తనయుడు బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి అంటూ పొరుగు నుంచి సుబ్రహ్మణ్యంను తీసుకువచ్చారు.వాస్తవానికి బాలసుబ్రమణ్యాన్ని టీడీపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు అయన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని బిజేపికి ఇవ్వగా..అక్కడి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిని బీజేపీ బరిలో దించింది. అసెంబ్లీ సీటు రాయచోటి నేత సుబ్రహ్మణ్యంకు ఇవ్వడంతో స్థానికంగా టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా...ఆందోళనలు కూడా చేశారు. ఓ వైపు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. సొంత పార్టీలోనే నిరసనలు ఎదురైనా బాలసుబ్రమణ్యం మాత్రం ఎన్నికల బరిలో నిలిచారు. కానీ చాలా మంది టీడీపీ నేతలు అయనకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. అయినా బాలసుబ్రమణ్యం మాత్రం గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. రాజంపేట మార్పు కోరుకుంతోందని, నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామనే అలవికానీ హామీలతో రాజంపేట వాసులను అకట్టుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు రాజంపేటకు తీసుకువచ్చి ప్రచారం చేయించారు. రాజంపేటలో టిడిపి జెండా ఎగరేస్తానంటూ సుబ్రహ్మణ్యం గొప్పలు చెప్పుకున్నారు. తన గెలుపు కోసం వైఎస్సార్సీపీ పై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బాలసుబ్రమణ్యం అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే ఆయనకు పనిచెయ్యలేదని.. బిజేపితో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా పడలేదని, ప్రత్యేకించి మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకు అస్సలు పడలేదని నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తొంది. పోలింగ్ పూర్తయ్యాక రాయచోటి నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు తత్వం బోధపడింది. గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో.. ఓటమి భయంతో మౌనముద్ర దాల్చారు. ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడకుండా తన అన్నీ సర్దుకుని సొంత నియోజకవర్గమైన రాయచోటికి వెళ్లిపోయారు. పోలింగ్ ముందు వరకు గెలుస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తామన్న అయన ఇప్పుడు సైలెంటయ్యారు. కానీ తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం కాన్ఫిడెంట్గ ఉంది. రాజంపేట వాసులు సీఎం వైఎస్ జగన్ నిలిపిన అభ్యర్ధికి ఆమోదం తెలిపారని, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అయిందని ధీమాగా చెబుతున్నారు. -
మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు
-
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
-
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే... యమునా తీరే! జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, సుగవాసి ప్రసాద్బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్మోహన్రాజు విడిగా తన వర్గంతోకలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. చిట్వేలిలో చీలిన నాయకులు.. చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్ వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదనపల్లెలో మూడుముక్కలాట మదనపల్లె: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్చార్జి శంకర్తో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్మోహన్రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
గత ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాజంపేట: గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పత్తిపాటి కుసుమకుమారి భర్త పత్తిపాటి సుబ్రమణ్యంనాయుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున విషద్రావణం తీసుకున్న తరుణంలో సంబంధీకులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!
అదిగో అల్లదిగో.. అంటూ శ్రీవారిని స్మరిస్తూ.. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదరకమైన దట్టమైన అటవీమార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేలసంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుం బిగించి భక్తులను ఆనందపరవశులను చేస్తోంది. రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారిభక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి.. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. అప్పట్లో వైఎస్సార్ స్పందించి టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అమోదం తెలిపింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో టీటీడీ నిమగ్నమైంది. 18న ఆకేపాటి అన్నమయ్య కాలిబాటలో.. ఈనెల 18న శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి 20వసారి వేలాదిమందితో అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలకు చేరుకోనున్నారు. ఈయనతో పాటు అనేకమంది గోవిందమాలలు ధరించి అన్నమయ్య కాలిబాటలో వెళ్లనున్నారు. ఉదయం ఆకేపాటి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కాలిబాట స్వరూపం.. ► మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది. ► అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. ► సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. ► పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలిబాటకు వెయ్యేళ్లు... రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధికి టీటీడీ దృష్టి సారించింది. ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవిందనామస్మరణాలు చేసుకుంటూ శ్రీవారిసన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు. ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం... పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధికసంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది. కాలిబాటలో శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం.. పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఇప్పటికే అనేకమంది భక్తులు గోవిందమాల ధరించి ఆ మార్గంలో కొండకు చేరుకుంటున్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ ముందుకు రావడం శుభపరిణామం. జడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి కాలిబాటలో వేలాదిమంది భక్తులతో కొండకు 20వ సారి వెళుతున్నారు. – చొప్పా ఎల్లారెడ్డి, వైస్చైర్మన్, ఎఐటీఎస్, రాజంపేట అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి ఆకేపాటి కృషి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి ఎంతగానో కృషిచేసారు. దివంగత సీఎం, ప్రస్తుతం సీఎం, టీటీడీ చైర్మన్ దృష్టికి కాలిబాట అంశం అనేకసార్లు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు అన్నమయ్య కాలిబాట అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేసింది. అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ కూడా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉంటారు. – పిల్లిపిచ్చయ్య, అధ్యక్షుడు, రాజంపేట తాలుకా పెన్షనర్ల సంఘం -
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్కు చేరుకున్నాడు. సైకిల్యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్కు సైకిల్యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి,రాజంపేట: వైఎస్సార్సీపీకి కార్యకర్తలు, నాయకులే మూలస్తంభాలని రాజంపేట ఎంపీ, లోక్సభ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డి అన్నారు. మంగళవారం తోట కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే కార్యకర్తలే కీలక సూత్రధారులన్నారు. కార్యకర్తలకు వెన్నంటే ఉంటామన్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీచైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో తనతోపాటు ముందంజలో ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. రాజంపేట అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని, త్వరలో తాను, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్ సీఎంను కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలోని హామీలను మూడేళ్లలో తొంభై ఐదుశాతానికి పైగా అమలు చేసిన సీఎం జగన్కు, ఎన్నికల అనంతరం మేనిఫెస్టోను ఆన్లైన్లో తొలగించిన చంద్రబాబుకు పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైఎస్సార్సీపీకే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. టీడీపీకి దుష్టచతుష్టయం, ఎల్లోమీడియా మద్దతు ఉంటే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్సీపీ జెండా కిందనే జీవిద్దామని కార్యకర్తలకు, నాయకులకు గడికోట పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతోనే జెండా రెపరెపలు రైల్వేకోడూరు అర్బన్: కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, నాయకుల కష్టంతోనే వైఎస్సార్సీపీ ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి పార్టీ జెండా రెపరెపలాడుతోందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. వారి కష్టాన్ని పార్టీ ఎప్పటికీ విస్మరించదన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
11 ఏళ్ల రాజం పేట మున్సిపాలిటీ ఎన్నికలు
-
వైరల్: నలుగురిని కాపాడిన యాచకుడు
నందలూరు (రాజంపేట): ఈతకు వెళ్లి నీటి గుంతలో కూరుకుపోయిన ఐదుగురిలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురిని ఒక యాచకుడు కాపాడాడు. ఈ ఘటన చెయ్యేటి రైల్వే వంతెన వద్ద సోమవారం చోటు చేసుకుంది. చెయ్యేటి గ్రామమైన కుమ్మరపల్లె (నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధి)కు చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. ఇసుక కోసం గోతులు తీయడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో ఇటీవల వర్షానికి భారీగా నీరు చేరింది. ఈ గుంతల్లో ఈత కొడుతూ ఐదుగురూ లోపలకు కూరుకుపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో గమనించిన ఒక యాచకుడు గుంతలోకి దిగి నలుగురిని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఆదిత్య (16) బయటకు రాలేక మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థి తండ్రి రమేశ్ గతంలోనే చనిపోయాడు. ఒకగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శైలజ రోదించడం అందరినీ కలచివేసింది. -
ట్రేడింగ్లో మోసాలకు పాల్పడిన ముగ్గురికి రిమాండ్
సాక్షి, వైఎస్సార్ కడప: ఆన్లైన్ ట్రేడింగ్లో 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కానీస్టెబుల్ ఈశ్వర్ మోసపోవడంతో రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అధిక లాభాలు గడించవచ్చనే ఆశతో కానిస్టేబుల్ ఈశ్వర్ అప్పు చేసిన ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్లో పట్టుబడ్డారు. దీంతో పీటీ వారెంటుతో నిందితులను పోలీసులు హైదరాబాద్ నుంచి రాజంపేటకు తీసుకువచ్చారు. నిందితుల్లో ఒకరూ చైనా దేశస్థుడు కాగా మరో ఇద్దరూ ఇండియాకు చెందిన హర్యానా వాసులుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం నందలూరు జేఎఫ్ఎం కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. -
చీటింగ్ కేసులో టీడీపీ నేత హరిప్రసాద్ అరెస్ట్
రాజంపేట, రాయచోటి: అటాచ్లో ఉన్న సొసైటీ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించిన కేసులో వైఎస్సార్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రాజంపేట సీఐ శుభకుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనగలూరు మండలం కంబాలకుంటకు చెందిన వెంకటసుబ్బయ్య 2001లో శ్రీసాయి ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించాడు. చార్మినార్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో వెంకటసుబ్బయ్య జైలుకు వెళ్లిన సమయంలో రాజంపేటలో అటాచ్లో ఉన్న ఐదెకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా హరిప్రసాద్ విక్రయించాడు. మూర్తి, శంకర్నాయుడు, జోహార్ చౌదరి అతడికి సహకరించారు. వెంకటసుబ్బయ్య ఈనెల 1న దీనిపై రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నిందితుడు హరిప్రసాద్ను ఆదివారం దేవుని కడపలో అరెస్టు చేసి రిమాండు నిమిత్తం ప్రొద్దుటూరు సబ్జైలుకు తరలించారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడు హరిప్రసాద్ తన భూములను ఆక్రమించడమే కాకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు వెంకటసుబ్బయ్య ఆదివారం రాయచోటిలో మీడియాతో పేర్కొన్నాడు. చార్మినార్ బ్యాంకులో రుణం విషయంలో తనను అరెస్టు చేయడంతో సొసైటీ తాత్కాలిక సెక్రటరీగా హరిప్రసాద్ను నియమించానన్నారు. ఇదే అదనుగా రాజంపేటలో భూమిని నకిలీ పేర్లతో విక్రయించినట్లు పేర్కొన్నాడు. -
ఆర్సీ రెడ్డి విజయగాథ
ఆయన సివిల్ సర్వీసుకు ఎంపిక కాలేదు. కష్టపడి మూడు పర్యాయాలూ ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఆ వైఫల్యం నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు. ఏ రంగంలో విఫలమయ్యారో అదే రంగంలో విజయముద్ర వేసుకున్నారు. ఎందరో సివిల్ సర్వీసుకు ఎంపిక కావడానికి కారణమయ్యారు. విజయబాట వేశారు. కాదు..విజయబావుటా ఎగురవేశారు..ఆయనే ఏడు పదులు దాటిన ఆర్సీ రెడ్డి..స్ఫూర్తిదాయకమైన ఆయన జీవిత విశేషాలు ఒకసారి పరికిద్దామా.. రాజంపేట: వైఎస్సార్ జిల్లా నందలూరు మండలంలోని ఓ మారు పల్లె. పేరు ఈదరపల్లె.. ఆ ఊరికి సర్పంచ్గా పనిచేసిన భూమన మల్లారెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి(ఆర్సీ రెడ్డి). ఆ ఊరిలోనే ప్రాథమిక విద్య చదివారు. తర్వాత రాజంపేట మండలం గుండూర్లు వెళ్లి కొంతకాలం చదివారు. నందలూరులోని జిల్లా ప్రజాపరిషత్ స్కూలులో స్ఎల్ఎల్సీ (ఇప్పటి టెన్తు క్లాస్) ఉత్తీర్ణులయ్యారు. సైన్స్మీద మక్కువతో కడప వెళ్లి ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ప్రతి క్లాసులోనూ మంచి మార్కులే వచ్చేవి. ఆయన ఆటల్లోనూ దిట్ట. ఎస్వీ యూనివర్శిటీలో హకీ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించారు. చదువుతున్నప్పటి నుంచి ఉన్నత స్థానం చేరుకోవాలని ఆర్సీ రెడ్డి అభిలషించేవారు. ముఖ్యంగా ఐఏఎస్ కావాలని ఎక్కువగా పరితపించేవారు. ఇదే ఆకాంక్షను తన తల్లిదండ్రులు మల్లారెడ్డి..భవానమ్మల వద్ద వ్యక్తంచేశారు. వారు కూడా వెంటనే వెన్నుతట్టి ప్రోత్సహించారు. వెంటనే ఆర్సీ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రావూస్ స్టడీ సర్కిల్లో చేరారు. కష్టపడి చదివారు. సివిల్ సర్వీసు పరీక్ష మూడు సార్లు రాశారు. ఈ మూడు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో కుంగుబాటు..నిరాశలను దరిచేరనీయకుండా తనకున్న ఆంగ్ల పరిజ్జానంతో కొద్దికాలం ఇంగ్లీషు మ్యాగ్జైన్లో జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేశారు. తాను ఢిల్లీలో శిక్షణ పొందిన రావూస్ ప్రొద్బలంలో హైదరాబాద్లోని అదే శిక్షణా సంస్థ శాఖకు ఎండీగా పనిచేశారు. బలమైన సంకల్పంతో.. రావూస్లో చేస్తున్నా ఆయన మస్తిష్కంలో సివిల్ సర్వీసెస్ ఆలోచన నిరంతరం వెంటాడేది. పల్లె నేపథ్యంలో తనలాగే వచ్చిన వారికి తర్ఫీదునిస్తే కొందరయినా సివిల్స్కు ఎంపికవుతారని భావించేవారు. మట్టిలో మాణిక్యాలను తవ్వి తీయాలని బలమైన సంకల్పం తీసుకున్నారు. తనకున్న అనుభవసారంతో సివిల్ సర్వీస్కు వెళ్లే అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలనుకున్నారు. 1985లో సాహసంతో ఓ ముందడుగు వేశారు. హైదరాబాద్లో స్వయంగా ఐఏఎస్ స్టడీ సర్కిల్ పేరుతో చిన్నగా సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తనతోపాటు మంచి ఫ్యాకల్టీని ఎంపిక చేసుకున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆసంస్థకు పేరు వచ్చింది. ఏటా సివిల్ సర్వీస్ ఫలితాల్లో కొందరు విజేతలవడం ప్రారంభమైంది. దీంతో ఆర్సీ రెడ్డికి విశేష ఖ్యాతి లభించింది. ఆయన వద్ద కోచింగ్ తీసుకుని సివిల్ సర్వీసుకు ఎంపికైన ప్రముఖుల్లో ఏకెఖాన్, తేజ్దీప్ ప్రతిహస్త, ద్వారకతిరుమలరావు, రాజేందర్రెడ్డి తోపాటు ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లుగా ఉన్న కృష్ణబాబు, ధనుంజయరెడ్డి లాంటి వారున్నారు. 2001లో ఇండియా టాపర్ సత్యప్రకాశ్(రాజంపేట) ఆర్సీరెడ్డి మార్గదర్శకంలోనే శిక్షణ పొందడం విశేషం. ఇలా సివిల్ సర్వీసుకు ఎంపికైన వారిని తయారు చేసే ఆర్సీరెడ్డి తమ ప్రాంతానికి చెందిన వారేనని ఇక్కడి వారు ఆనందపడుతుంటారు. నందలూరుకు చెందిన ఇద్దరు ఇప్పటివరకూ సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారంటే ఆయన ప్రేరణే. గడచిన మూడు దశాబ్ధాలలో ఈ సంస్థలో తర్ఫీదు పొంది 135 మంది ఐఏఎస్, 23 మంది ఐఎఫ్ఎస్, 142 ఐపీఎస్, 643 మంది సెంట్రల్ సర్వీసెస్లకు ఎంపికైనట్లు సంస్థ వర్గాలు చెప్పాయి. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 14మంది విజేతలుగా నిలిచారు. ఆర్సీ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. అమెరికాలో ఉంటున్నారు. భార్య విద్యావేత్తగా పనిచేసి రిటైరయ్యారు. ఆర్సీ రెడ్డి తమకు స్ఫూర్తి అని రాజంపేట పరిసర ప్రాంత యువకులు చెబుతుంటారు. ఆయన ఇక్కడి కార్యక్రమాలకు హాజరై అందరినీ పలకరించి వెళ్తుంటారు. సానపడితే వజ్రాలే.. పల్లెటూళ్ల నుంచి వచ్చారని తక్కువ అంచనా వేయకూడదు. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. వారిని గుర్తించి సానబడితే వజ్రాలవుతారు. ఐక్యూ గుర్తించి, సరైన మార్గంలో తర్ఫీదు ఇస్తే వారు తప్పకుండా సివిల్స్ లాంటి రంగాల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరంభంలోనే మెరుగైన రీతిలో సాధన పెట్టాలి. అప్పుడే మంచి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. నేను సివిల్స్కు ఎంపిక కాలేకపోయినా ఇదే భావనతో సివిల్స్.. గ్రూప్వన్ సర్వీసులకు కొంతమందిని అందించగలుగుతున్నాను. ఇది పూర్వజన్మసుకృతంగా భావిస్తుంటాను. – భూమన రామచంద్రారెడ్డి -
మళ్లీ రాజంపేటకు ఐఏఎస్ అధికారి !
రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ తర్వాత సబ్ కలెక్టరేట్ ఉంది. ఇక్కడికి మళ్లీ ఐఏఎస్ క్యాడర్ కలిగిన అధికారి కేతన్గర్గ్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటిష్ పాలకుల నుంచి రాజంపేట రెవెన్యూ డివిజన్కు సబ్కలెక్టరుగా ఐఏఎస్ల నేతృత్వంలో రెవెన్యూ పాలన కొనసాగింది. 24 మంది సబ్కలెక్టరుగా ఇక్కడ పనిచేశారు. చివరిగా సబ్కలెక్టరుగా ప్రీతిమీనా పనిచేసి వెళ్లారు. అప్పటి నుంచి ఐఎఎస్ హోదా కలిగిన వారిని ఇక్కడ సబ్కలెక్టరుగా అప్పటి ప్రభుత్వం నియమించలేదు. తర్వాత ఆర్టీవోలుగా విజయసునీత, ప్రభాకర్పిళ్లై, వీరబ్రహ్మం, నాగన్నలు పనిచేశారు. ప్రస్తుతం ధర్మచంద్రారెడ్డిలు ఆర్డీవో కొనసాగారు. వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో మళ్లీ రాజంపేటకు ఐఏఎస్ హోదా కలిగిన అధికారిని నియమించడం విశేషం. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కేతన్గర్గ్ విజయనగరంలో ట్రైనీ కలెక్టర్గా పనిచేశారు. -
ముద్దనూరు–ముదిగుబ్బ లైనుపై ఆశలు
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో పది నియోజకవర్గాల్లో రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాలు రైలుకూతకు దూరంగా ఉన్నాయి. ఈ మార్గాల మీదుగా రైలు మార్గాలేవీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఈ ప్రాంతాల్లో రైలు కూత వినిపించడంలేదు. జిల్లాలో రైల్వేపరంగా అభివృద్ధికి ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డిలు కృషి చేస్తున్నారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ రాయచోటి, ఇటు పులివెందుల నియోజకవర్గ పరిధిలో వెళుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు రైల్వే సేవలు అందే అవకాశముంది. తాజాగా ఈ ఏడాది బడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బలైను తెర మీదకు వచ్చింది. దీంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు రేకేత్తించాయి. 65కిలోమీటర్ల రైల్వేలైన్.. ముదిగుబ్బ రైల్వేస్టేషన్ గుంతకల్–బెంగళూరు రైలు మార్గంలో ఉంది. ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు లైన్ కలిపితే బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అదే ఆలోచనతో ఈ లైనుకు రైల్వేశాఖ సర్వేకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు 65 కిలోమీటర్ల దూరం ఉంది. ముద్దనూరు–ముదిగుబ్బ కొత రైల్వే లైన్ సర్వేకి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ లైను సర్వే ఏ దిశగా ఉంటుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రకటించిన కొత్తరైల్వేలైన్ల సర్వేలా ఉండిపోతుందా.. ముందుకు వెళుతుందా అనేది వేచిచూడాల్సిందే. ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా కదిరి మార్గంలో ముదిగుబ్బ వరకు వెళ్లే విధంగా అలైన్మెంట్ చేస్తారా..లేక పులివెందుల సమీప ప్రాంతం నుంచి వెళ్లే విధంగా అలైన్మెంట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలైన్మెంట్ స్పష్టమైతే పులివెందుల మీదుగా అయితే అక్కడి వాసులు రాబోయే రోజుల్లో రైలుకూత వినవచ్చు. బడ్జెట్లో కొత్త లైను సర్వేకి నామమాత్రంగా నిధులు కేటాయిచారని విమర్శ ఉంది. ఈ లైనును త్వరిగతిన రాబట్టుకుంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు రైలు కూత వినిపిస్తుంది. -
రాజంపేటలో రోడ్డు ప్రమాదం; చిన్నారి మృతి
సాక్షి, వైఎస్సార్ కడప : రాజంపేట మండలం చొప్పావారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలను దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా బొలెరో వాహనాన్ని బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో 12 మంది ప్రయాణిస్తుండగా యాదాద్రి భువనగిరికి చెందిన చిన్నారి చందన(10) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన 11 మందిని తిరుపతి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి దగ్గరుండి వివరాలు సేకరిస్తున్నారు. -
‘ఘాట్’ గా స్పందనేదీ..?
సాక్షి, రాజంపేట: అదిగో అల్లదిగో అంటూ శ్రీవారిని స్మరిస్తూ .. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితా పితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట ఇది. మూడవ ఘాట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా తెరపైకి వచ్చినా నాటి ప్రభుత్వాలు, టీటీడీ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ బాట అభివృద్ధి అటకెక్కింది. శ్రీ వేంకటేశ్వరస్వామిపై 32వేల సంకీర్తనార్చనలు చేసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన మార్గాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని విస్మరిస్తూ వస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ దారిలో తిరుమలకు నడిచి వెళుతున్న భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. మార్గం తీరు ఇలా.. కడప–రేణిగుంట జాతీయర రహదారిలో కుక్కలదొడ్డి నుంచి తుంబరతీర్థం మీదుగా తిరుమలకు అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొండకు వెళ్లేందుకు మూడురోజులు పడుతుంది. కుక్కలదొడి సమీపంలోని మామండూరు మీదుగా అటవీ మార్గం నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొంచెం అటు ఇటుగా తిరుమలకు చేరుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులుతిరుమలకు చేరుకుంటున్నారు. ఒక్క రాజంపేట ప్రాంతంలో నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం అనుకూలం. కొండపైన అన్నమయ్య పార్వేట మండపం వద్ద పాపవినాశనం రోడ్డులో దగ్గరలో ఈ దారి కలుస్తుంది. కాలిబాటలో పాడుబడిన సత్రం శేషాచలం అటవీ ప్రాంతంలో.. అన్నమయ్య కాలిబాట పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతంలో సాగుతుంది. ప్రకృతి రమణీయ, కమనీయ దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ మార్గంలో రోడ్డు వేస్తే తిరుమలకు చేరుకునే భక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులున్నాయి. అన్నమయ్య కాలిబాటను అభివృద్ధిచేస్తే తిరుమలకు రానుపోను 44 నుంచి 48 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇప్పుడున్న మార్గం ద్వారా 51కిలోమీటర్ల దూరం పడుతోంది. అదే మామండూరు నుంచి తిరుమల మార్గంలో అయితే 23 కిలోమీటర్లే అవుతుంది. దశాబ్ధాలుగా అతీగతీలేదు అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధిని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కుక్కల దొడి లేదా మామండూరు నుంచి తిరుమలకుమార్గం వేస్తే తిరుపతి ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళన చిత్తూరు జిల్లా వాసుల్లో నెలకొంది. తిరుమల దగ్గర అంశాన్ని అటవీ సంరక్షణ పేరుతో అడ్డుకుంటున్నటులగా ఆరోపణలున్నాయి. అందువల్లే అన్నమయ్య కాలిబాట అభివృద్ధి విషయంలోపూర్తి నిర్లక్ష్యవైఖరి కనిపిస్తోంది. కాలిబాట స్వరూపం మామండూరు–బాలపల్లె మధ్య స్వామి పాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతవరణంతో పూర్వం భక్తులు కాలిబాట కొండకు చేరుకుంటుంది. అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటల, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 17వ సారి ఆకేపాటి తిరుమల మహాపాదయాత్ర వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తిరుమల మహాపాదయాత్రను 17వ సారి చేపట్టనున్నారు. ఈనెల 13న శుక్రవారం వేలాది మందితో తిరుమల పాదయాత్ర ప్రారంభించనున్నారు. అదేరోజున ఆకేపాడు లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు. కంకణధారణ, హోమం, భజనలు, అన్నదాన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఆకేపాడు ఆలయాల సముదాయం నుంచి మధ్యాహ్నం 2గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేషనల్హైవే మీదుగా రాజంపేట, రైల్వేకోడూరుకు చేరుకొని అక్కడి నుంచి అటవీమార్గం(మామండూరు)లో తిరుమల చేరుతుంది. గోవిందమాలలు ధరంచి తిరుమలకు కాలిబాటన వెళుతున్న భక్తులు(ఫైల్) అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలి అన్నమయ్య నడిచివెళ్లి శ్రీవారిని దర్శించుకున్న కాలిబాటను పునరుద్ధరించాలని భక్తులతోపాటు తాను దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నాం. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఈ కాలిబాట అభివృద్ధికి బీజం పడింది. అయితే ఆయన మరణాంతరం కాలిబాట అభివృద్ధి అంశం అటకెక్కింది. 17వసారి పాదయాత్రగా ఈ మార్గం గుండా తిరుమల వెళుతున్నాను. భక్తులు పాల్గొని పాదయాత్రను జయప్రదంచేయాలి. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట అన్నమయ్య బాటలో వెళ్లడం మహాభాగ్యం పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే మూడవ ఘాట్గా ఉపయోగపడుతుంది. తెలంగాణ, సీమవాసులకు దగ్గరగా ఉంటుంది. ఈ మార్గం అభివృద్ధిపై ఆకేపాటితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు డైరెక్టర్ అటవీప్రాంతం: శేషాచలం తొలినడక:అన్నమాచార్యుడు చరిత్ర: వెయ్యేళ్లు దూరం: 23 కిలోమీటర్లు కాలిబాట ప్రారంభం: మామండూరు–బాలపల్లె మధ్య -
ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి
పుల్లంపేట: ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన మంగళవారం వైఎస్సార్ జిల్లా పుల్లంపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణంలో నివసించే కొండపల్లి కృష్ణమూర్తి, గౌరి దంపతులు తమ కుమార్తె లక్ష్మీప్రసన్నను పుల్లంపేటలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. అక్కడ సైన్సు ఉపాధ్యాయుడు శివ తనను చదువు విషయమై తరచూ వేధిస్తున్నాడని లక్ష్మీప్రసన్న పలుమార్లు తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, కన్నీరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కుమార్తెను ఓదార్చేందుకు విద్యార్థిని తల్లి గౌరి మంగళవారం సాయంత్రం పాఠశాల వద్దకు వచ్చింది. సిబ్బంది అనుమతించకపోవడంతో వెలుపల వేచి ఉంది. పాఠశాల విడిచిపెట్టాక లక్ష్మీప్రసన్నను హస్టల్కు తీసుకెళ్లింది. దుస్తులు మార్చుకుంటానని గది లోపలికి వెళ్లిన లక్ష్మీప్రసన్న చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ముఠా అరెస్టు
సాక్షి, రాజంపేట: చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ఫోన్కాల్స్ ముఠాను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ వీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ బి. శుభకుమార్తో కలిసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఫోన్కాల్ నిర్వహిస్తున్న ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్దనున్న రూ. లక్షల్లో విలువజేసే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఫ్రొటోకాల్ టెలికమ్యూనికేషన్ సామగ్రి, కంప్యూటర్లను, అలాగే దాదాపు 500కుపైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. పట్టణ బీఎస్ఎన్ఎల్ జేఈ ప్రసాద్ ఫిర్యాదు మేరకు అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ముఠాపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ తదితర పరికరాలు రెడ్డివారి వీధిలో నిర్వహించే ఈ ముఠా నెలకు రూ. 10లక్షలు మేరా ఆదాయం ఆర్జీస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి చెందిన సయ్యద్ మహ్మద్ షరీఫ్ అలియాస్ మున్నా, పోలికి చెందిన గుండ్రాజు సుదర్శన్ రాజు, రాజశేఖర్ నాయుడు అలియాస్ నాయుడులను అదుపులోకి తీకున్నామన్నారు. ప్రధాన సూత్రధారి రెడ్డివారి వీధికి చెందిన లక్ష్మీనారాయణ కువైట్లో ఉన్నాడన్నారు. వీరి వద్ద నుంచి అతడు లింక్ తీసుకొని అక్కడ నుంచి కువైట్, ఇండియా, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాలకు నిమిషానికి రూ.32 అయ్యే కాల్ని రూ. 6 లకే అందిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అక్రమమార్గంలో టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయడం నేరమన్నారు. కార్యక్రమంలో పట్టణ పోలీసులు పాల్గొన్నారు. చదవండి : స్మార్ట్ దోపిడీ -
అరుదైన గౌరవం
సాక్షి, కడప : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గురువారం స్పీకర్ స్థానంలో కొలువుదీరారు. ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్సభను నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరు కాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్సభను నిర్వహించడం సాంప్రదాయం. ఈక్రమంలో ప్యానల్ స్పీకర్గా అధ్యక్ష స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ప్యానల్ స్పీకర్ అవకాశం దక్కింది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకుడు భారత అత్యున్నత చట్టసభకు స్పీకర్గా విధులు నిర్వహించడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఎంపీగా లోక్సభలో ప్రభుత్వతీరును ఎండగట్టి నేడు అదే లోక్సభలో చిన్న వయసులోనే ప్యానెల్ స్పీకర్గా బాధ్యతలు చేపట్టడం నిజంగా గర్వకారణమని అంటున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలిచిన ఆయన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరిపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంచెలంచెలుగా ఉద్యమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ నిర్ణయం మేరకు పార్లమెంట్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. అనంతరం 2019లో మరోమారు ఆయన రాజంపేట నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్లు ఆధిక్యతతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్యానల్ స్పీకర్గా నియమితులయ్యారు. ఆమేరకు గురువారం ఆ హోదాలో లోక్సభ నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిపారు. -
ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్సభ నిర్వహించిన మిథున్రెడ్డి
-
లోక్సభ నిర్వహిస్తున్న ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్సభ నిర్వహించారు. లోక్సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన.. గురువారం ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్సభ కార్యకలాపాలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్షనేత మిథున్రెడ్డి ఇటీవలే లోక్సభ ప్యానల్ స్పీకర్గా నియమితులైన విషయం విదితమే. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి మిథున్రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించిన ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. -
రాజంపేట: రీపోలింగ్ జరగాలి
సాక్షి, రాజంపేట: రాజంపేట మండలం లోని వైబీఎన్పల్లె, డీబీఎన్పల్లె, శవనవారిపల్లె, కొల్లావారిపల్లె, మిట్టమీదపల్లెలోని 170, 172, 171, 196,199, 192,193 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగి, తమకు అనుకూలంగా మలుచుకున్నారని, అందువల్ల వాటిలో రీపోలింగ్ నిర్వహిం చాలని వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విన్నవించారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్ఓ నాగన్నకు వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతవరణంలో వినియోగించుకోలేకపోయారంటే ఇందులో పోలీసులు వైఫల్యం ఉందన్నారు.గ్రామాల్లోకి వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు జనరల్ ఏజెంటగా వెళితే రాకుండా అడ్డుకోవడం ఎలాంటి సంస్కృతికి దారితీస్తుందన్నారు. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ రాజంపేట చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ సారి దౌర్జన్యకర వాతవరణంలో పోలింగ్ జరగడం విచాకరమన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటే వారిలో ఓడిపోతున్నామనే భయం వెంటాడుతోందన్నారు. తాము కోరుతున్న పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాల్సిన ఆవశ్యకత ఉందని, దీనిని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఈ రాష్ట్రానికి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి కావడం తధ్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాపినేని విశ్వనాథ్రెడ్డి, పోలిమురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పోలింగ్ సందర్భంగా వచ్చిన పిర్యాదులపై విచారణ చేయడం జరుగుతుందని ఆర్వో నాగన్న ఇక్కడి విలేకరులకు తెలియచేశారు. -
రాజంపేటలో స్థానికేతరుల మకాం
సాక్షి, రాజంపేట: రాజంపేటలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అనే అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో స్థానికేతరులు భారీగా చొరబడినట్లు ప్రచారం జరుగుతోంది. పక్క నియోజకవర్గమైన రైల్వేకోడూరు నుంచి గత నెల నుంచి రాజంపేట టౌన్, నందలూరుతో వివిధ మండలాల్లో ఒక వర్గం చేరినట్లు తెలుస్తోంది. ఈ వర్గం ప్రతినిధుల కనుసన్నల్లోనే డబ్బు, మద్యం యథేచ్ఛగా పంపిణీ జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల (ఓ సామాజికవర్గం) అధికారులు పెద్దగా దృష్టి సారించలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతిపక్షపార్టీకి చెందిన వారినే టార్గెట్ చేసుకొనే ఆకస్మికదాడులు, కేసులో బనాయిస్తున్నారనే అపవాదును ఇప్పటికే పోలీసులు మూటకట్టుకున్నారు. అధికారపార్టీవైపు వారు కన్నెత్తిచూడటంలేదన్న విమర్శలున్నాయి. నాన్లోకల్తోపాటు అసాంఘికశక్తులు దిగిపోయారా? పక్క నియోజకవర్గం నుంచి స్థానికేతరులతోపాటు అసాంఘికశక్తులు వచ్చారనే ప్రచారాలు ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతి మండలంలో స్ధానికేతరులతో పాటు అసాంఘికశక్తులు రంగంలో ఇప్పటికే దిగిపోయినట్లు తెలుస్తోంది. ఓవర్గంతో కలిసిపోవడమే కాకుండా అధికారపార్టీ నాయకుల అండదండలతో స్థ్ధానికంగా పెత్తనం సాగిస్తున్నారు. పోలింగ్ రోజున ఎటువంటి దుశ్చర్యలకు దిగుతారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కర్ణాటక నుంచి అక్రమమద్యం దిగుమతి చేసిన తరహాలో ఈసారి కూడా రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు స్ధానికంగానే మద్యం సరఫరాపై దృష్టి సారించారు. కానీ కర్ణాటక నుంచి తెప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వైనాలపై దృష్టి సారించాల్సి ఉంది. నియోజకవర్గంలో స్ధానికేతరుల ఓటర్ల నమోదుపై అనుమానాలు.. పొరుగు ప్రాంతాలకు చెందిన స్ధానికేతరులు అధికారపార్టీకి అండగా నిలిచేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేటలో నాన్లోకల్ అరాచకశక్తులు చెలరేగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే భయం స్ధానికుల్లో నెలకొంది. రెండువేల నుంచి మూడు వేల వరకు స్ధానికేతరులను కొంతమంది రెవెన్యూ సిబ్బంది సహకారంతోఓటర్లుగా చేర్చినట్లు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు వెళ్లాయి. వీరు ఓటింగుకు వచ్చిన సందర్భంలో బూత్లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్ధితుల్లో ఘర్షణలకు దారితీసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్నికల సంఘం, పోలీసుశాఖ దృష్టి సారించాలని, వెనువెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని ఓటర్లు కోరుతున్నారు. -
అగ్రి గోల్డు బాధితులకు అండగా జగన్
సాక్షి, రాజంపేట రూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలిచి వైఎస్సార్సీపీనీ అధికారంలోకి తెచ్చుకుందామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ రాష్ట్ర , జిల్లా ఉపాధక్షుడు తుమ్మల రాము అగ్రిగోల్డ్ బాధితులను కోరారు. సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లోటస్పాండ్లో రాష్ట్ర అధ్యక్షుడు బి. విశ్వనాథ్రెడ్డితో వెళ్లి కలిశామని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు జననేతకు వివరించామన్నారు. అధికారంలోకి రాగానే మూడు నెలలలోపు రూ.1183 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారని రాము తెలియజేశారు. దశల వారిగా ప్రతి కస్టమర్కు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. నాలుగు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే బాబు ప్రభుత్వం న్యాయం చేయక పోగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. 250 మందికి పైగా రైతులు క్షోభతో కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి భాధితుడు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. మంగళవారం నుంచి అగ్రిగోల్డ్ భాధితులు ప్రచా రం చేయాలని కోరారు. జననేతను కలిసిన వారిలో రాజంపేట శాఖ అధ్యక్షుడు పీవీ సుబ్బారావు, ఉపాధ్యక్షుడు తదితరులు ఉన్నారు. -
నా జీవితం..ప్రజాసేవకే అంకితం
ప్ర: రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నేతృత్వంలో అత్యధికమెజార్టీ సాధించే గెలుపు దిశగా దూసుకుపోతున్నాను. వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడ్పాటుతోపాటు ప్రజల దీవెన ఉంది. అంతేగాకుండా జననేత జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా నా విజయానికి కలిసివచ్చే అంశం. ప్ర: రాజంపేటలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై, అలాగే ఇక్కడి ప్రజల మనోగతం ఎలా ఉంది? మా నియోజకవర్గ ప్రజలు మహాతెలివైన వారు. రాజకీయచైతన్యం కలిగిన వారు. ప్రజలు ఇప్పటికే లోకల్ అయిన నావైపే మొగ్గుచూపుతున్నారు. నాన్లోకల్ లీడర్లు వస్తారు.. పోతారు. వారి గోగాకు, పుల్లకూర, ఉప్మా మాటలు రాజంపేట నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్ర: రాజంపేట వాసులు ఫ్యాక్షన్ ప్రభావితం చేసే, కన్నింగ్, మాటల మాయగాళ్లను ప్రజలు నమ్ముతారా? ఫ్యాక్షన్ ప్రభావితం చేసే వ్యక్తులను రాజంపేట ఓటర్లు దూరంపెడతారు. తొలివాగ్గేయకారుడు అన్నమయ్య నడిచిన నేల ఇది. అటువంటి ప్రాంతంలో ఉన్నవారు మంచిని, నిజాయితీని, ధర్మాన్ని ఆచరిస్తారు. కన్నింగ్, మాటలమాయగాళ్ల చేతిలో మోసపోయేందుకు ఇక్కడి ఓటర్లు సిద్ధంగాలేరు. ప్ర: రాజంపేటలో ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికలో ఓ సామాజికవర్గం పాలిట్రిక్స్ జరుగుతున్నాయి. మైండ్గేమ్, క్యాస్ట్గేమ్ను ఎన్నడూలేని రీతిలో ఇప్పుడు జరుగుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వెలువడుతున్నాయి.దీనిపై మీ స్పందన? నేను అందరివాడిని.. అందరిని ప్రేమగా, ఆప్యాయతగా పలుకురిస్తాను. సామాజికవర్గాల భేదాబిప్రాయాలు లేవు. మైండ్గేమ్, క్యాస్ట్గేమ్లకు నేను దూరం. ఏ కులమైనా.. ఏ మతమైనా అందరూ నావాళ్లే అనుకునే మనసత్త్వం నాది. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవాలనే భావనతో ప్రజాసేవ చేస్తున్నాను. కుట్రలు, కుతంత్రాలకు దూరం. మంచిని ప్రేమిస్తాను. ధర్మాన్ని ఆచరిస్తాను. ప్ర: ఇప్పటి వరకు మీ ప్రజాసేవ కొనసాగిందిలా..! భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళతారు? ప్రజల సొమ్మును దోచుకునే స్వభావం లేదు. సొంత డబ్బులతో ప్రజాసేవచేస్తూ ముందుకెళుతున్నాను. అదే రీతిలో భవిష్యత్తులో ముందుకెళతాను. ప్రజల కోసం నిరంతరం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ప్రజలే నా ఉపిరి, శ్వాస అనే భావనతో నడుచుకునేందుకు ఇష్టపడతాను. ప్ర: రాజంపేట అసెంబ్లీ జనానికి రైల్వేకోడూరులో అమలుకాబడిన దుర్మార్గపు రాజకీయశైలి భయం వెంటాడుతోందని భావనలు వెలువడుతున్నాయా? నిజమేనా? నిజమే కదా? చందాలు వసూలు, సుంకాల చెల్లింపులు లాంటివి వస్తే ఇబ్బందిపడతామని వ్యాపారవర్గాలతోపాటు విభిన్న వర్గాలు భయాందోళన చెందతున్నారు. అందుకే కదా స్థానికుడు అయిన నాకే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ప్ర: టీడీపీకి రాజంపేటలో అభ్యర్థులు కరువయ్యారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇందువల్లనే పక్క నియోజకవర్గనేతను బరిలోకి దింపారనే వాదన ఆపార్టీ వర్గాల్లోనే ఉంది. దీనికి మీరు ఏమంటారు? వైఎస్సార్సీపీకి బలమైన ఆదరణ, అభిమానం కలిగి ఉన్న నియోజకవర్గం రాజంపేట. అటువంటి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీ చేసే నాయకుడు లేక, దిగుమతి చేసుకున్న నాయకున్ని ఎన్నికల బరిలోకి దింపిందనే విషయం అందరికీ తెలిసిందే కదా. ప్ర: ఎన్నికల వేళలో చాలామంది క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికబదిలీ చేయించారనే వాదన రాజంపేటలో వినిపిస్తోంది. నిజమేనా? ఎక్కడ ఓడిపోతామనే భావనతో అధికారపార్టీ మాకు వ్యతిరేక సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికంగా బదిలీ చేయిస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది నిజం. ఇప్పుడు ఎన్నికలసంఘం నేతృత్వంలో అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్ర: చంద్రబాబు పాలనపై జనంలో వ్యతిరేకత వెల్లుబుకుతోంది. 650 హామీలు ఇచ్చి నట్టేట ముంచేశారని జనం బహిర్గతంగానే విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? బాబు పాలన దోపిడీ, అవినీతితో కూడుకున్నదని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాజంపేటను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే యోచన ఉంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యం. జగన్ సీఎం అయితే అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతారు. నేను రాజంపేట నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్సార్ను ఆశయంగా తీసుకొని శాశ్వత అభివృద్ధికి దోహదపడతాను. మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? మాది నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లె. నేను దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో నందలూరు సింగల్విండో చైర్మన్ ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేశాను. ఆనాటి నుంచి మా కుటుంబానికి వైఎస్సార్ కుటుంబం అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. దివంగత సీఎం వైఎస్సార్ ప్రతిపక్షనేతగా ఉన్న హయాంలో బస్సు యాత్రకు మా ఇంటికి వచ్చారు. ఇప్పటికీ ఆయన రాజకీయశైలిని మరిచిపోలేకున్నాను. ఆయన ఆశయాలకు పాటుపడుతూ, జగన్ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళుతున్నాను. మీ ప్రచారం ఎలా జరుగుతోంది? వైఎస్సార్సీపీ వస్తున్న జనాదరణ ఏలా ఉంది? ఆరుమండలాల్లో ప్రచారానికి జనంనుంచి విశేషస్పందన లభిస్తోంది. నాయకుల నేతృత్వంలో పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయి. బాబు సామాజికవర్గంతోపాటు, కాపు, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఏగ్రామానికి వెళ్లినా జనం అపూర్వస్వాగతం, ఆపాయ్యతలు, అభిమానాలు చూపుతున్నారు. -
మద్దతు తెలపలేదని.. ఓట్లు తక్కువగా చూపుతారా?
సాక్షి,రాజంపేట: రాజంపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని దిగుమతి చేసుకోవడం వల్లే అతనికి ఆశించినంత స్థాయిలో బలిజలు మద్దతు పలకడంలేదని కాపునేత, సీనియర్న్యాయవాది కృష్ణకుమార్ ఆరోపించారు. ఆదివారం తన స్వగృహంలో కాపుసామాజిక వర్గానికి చెందిన నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి బలిజలు మద్దతు తెలపకపోవడంతో ఆ కుల ఓట్లు తక్కువగా ఉన్నట్లుగా పచ్చపత్రికల్లో రాయడం సరికాదన్నారు. నిజాలు తెలుసుకొని రాయలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేవలం బలిజ, కాపు ఉపకులాలతో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాపు ఓట్లు లేనిదే టీడీపీకి దిక్కులేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలిజ ఓటర్లు సగం జనసేన వైపు, మిగిలిన సగం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పచ్చపార్టీలు తమ పత్రికల్లో బలిజ కులస్తులు తక్కువగా ఉన్నారని చూపించడం సహించలేనిది అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజ కులస్తులు 26వేలు మాత్రమే ఉన్నట్లు ఓ పత్రికలో రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజంపేటటౌన్, మండలం కలిపి 15వేలు, నందలూరులో 8వేలు, ఒంటిమిట్టలో 4వేలు, సిద్దవటంలో 5వేలు , సుండుపల్లెలో 8వేలు, వీరబల్లిలో 3వేల ఓట్లు మొత్తం 42వేల బలిజ ఓట్లు ఉన్నాయన్నారు. రాజకీయ ఉద్దేశంతో తగ్గించి రాయడం చూస్తుంటేకాపు కులాన్ని కించపరిచడమే అవుతుందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బలిజ కులస్తులు ఎక్కువ భాగం వైఎస్సార్సీపీ వెంట ఉన్నందు వల్లే ఇలా రాయడం అవివేకమన్నారు. టీడీపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాజంపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, అలాగే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు. -
రాజంపేటలో వైఎస్ఆర్సీపీ బీసీల ఆత్మీయ సభ
-
ఓ నియోజకవర్గం.. ముగ్గురు తొలి ఎమ్మెల్యేలు..
సాక్షి, రాజంపేట: ఒక నియోజకవర్గానికి ఒకరే తొలి ఎమ్మెల్యే ఉంటారని అందరికీ తెలుసు.. కానీ రాజంపేట నియోజకవర్గానికి ముగ్గురు ఉన్నారు. 1952లో రాజంపేట, రైల్వేకోడూరు ఉమ్మడి నియోజకవర్గంగా ఉన్నప్పుడు పంజం నరసింహారెడ్డి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి నియోజకవర్గ చరిత్రలో ఆయన తొలి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అనంతరాజంపేట గ్రామ పంచాయతీలోని తంబల్లవారిపల్లెకి చెందిన ఈయన పేరొందిన కమ్యూనిస్టు నేత. కేవలం భూమి ఉన్న వారికే ఓటు హక్కు ఉన్న రోజుల్లో.. ఆయన ఓ సంచి తగిలించుకొని గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే వారు. కమ్యూనిస్టు పార్టీ మొదటి జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 1913లో పుట్టి, 1964లో మరణించారు. స్వాతంత్య్రసంగ్రామంలో దేశం కోసం పాల్గొంటూనే.. ప్రజల సమస్యలపై కమ్యూనిస్టుగా పోరాటాలను చేశారు. కొండూరు మారారెడ్డి ఉమ్మడి నియోజకవర్గం నుంచి రాజంపేట వేరైంది. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పెనగలూరు మండలంలోని కొండూరుకు చెందిన కొండూరు మారారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఈయన గుర్తు నక్షత్రం. మంచికి మారుపేరుగా.. పేదలంటే అభిమానం, ఆప్యాయతలను చూపే ఆయన పట్ల ప్రజలు ఎనలేని అభిమానం చూపే వారు. అందుకే ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత మారారెడ్డి స్థానంలో ఆయన సతీమణి కొండూరు ప్రభావతమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రాజంపేట నియోజకవర్గంలో తనదైన శైలిలో రాణించారు. ఇప్పుడు వారి సొంత మండలం పెనగలూరు రైల్వేకోడూరు నియోజకవర్గంలోకి చేరిపోయింది. పునర్విభజన తర్వాత ఆకేపాటి రాజంపేట, పెనగలూరు, ఒంటిమిట్ట, నందలూరు మండలాలతో ఉన్న రాజంపేట నియోజకవర్గం.. నియోజకవర్గాల పునర్విభజనతో రాజంపేట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలతో రాజంపేట నియోజకవర్గంగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రాజంపేట రాజకీయ చరిత్రలో తొలి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచిన తొలి ఎమ్మెల్యేగా ఆకేపాటి చరిత్రకెక్కారు. దివంగత సీఎం వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం కలిగిన ఆకేపాటి అంచలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటికి వచ్చినప్పుడు.. ఆయనకు అండగా నిలబడిన తొలి ఎమ్మెల్యే ఆకేపాటి. వైఎస్సార్ హయాంలో జిల్లా అధ్యక్షుడిగాను, జగన్మోహన్రెడ్డి హయాంలో వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. -
అక్కడ పోటీకి నో చెప్పిన డీకే సత్యప్రభ!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ శుక్రవారం భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ స్థానంనుంచి సత్యప్రభను పోటీ చేయించే విషయంపై చంద్రబాబు ఆమెతో చర్చించారు. అయితే సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేస్తానని సత్యప్రభ వెల్లడించారు. ఆలోచించి రాత్రికి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. కాగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమెపై అధిష్టానం గత కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తోంది. ఈ ఎన్నికల్లో కీలకమైన ఎంపీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నేతలు ఎవరూ సంసిద్ధత తెలపకపోవడం గమనార్హం. టీడీపీ బలహీనంగా ఉన్న రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇంతకుముందు రాజంపేట నుంచి చిత్తూరు ఎంపీ డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులును పోటీ చేయించాలని చంద్రబాబు భావించినా ఆయన సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో డీకే సత్యప్రభను అక్కడినుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆమె కూడా రాజంపేట ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవటంతో వేరే అభ్యర్థిని వెతుక్కోవల్సిన పని పడింది. టీడీపీ ఓడిపోయే నియోజకవర్గంలో తామెందుకు పోటీ చేయాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. -
‘దారి’చూపని ముఖ్యమంత్రి
సాక్షి,రాజాంపేట: రాజాం ప్రధాన రహదారిని విస్తరిస్తాం. రాజాం పట్టణంలోని చెరువులను పార్కులుగా మారుస్తాం. హైటెక్ సిటీ, శాటిలైట్ సిటీ నిర్మాణం చేపడతాం. తోటపల్లి మిగులు భూములకు నీరు అందిస్తాం.’ అని 2017వ సంవత్సరం జనవరి 6న రాజాంలో నిర్వహించిన ‘జన్మభూమి మా ఊరు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలివి. అప్పట్లో రాజాం బస్టాండ్ ఆవరణలో జరిగిన ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమంలో సీఎం ఈ హామీలు ఇవ్వగా రెండేళ్లు దాటినా ఇప్పటికీ అవి పూర్తికాలేదు. రాజాం ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడంతో విస్తరిస్తామని 2017లో సీఎం హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణకు రూ.56 కోట్లు మేర నిధులు కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.10 కోట్లు మేర మాత్రమే వచ్చాయి. ఏడాది కాలంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి బొబ్బిలి జంక్షన్ వరకూ రోడ్డు విస్తరణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకూ ఆ పనులు కొలిక్కి రాలేదు. ఇలాంటి హామీలు ఇచ్చిన బాబును ఎందుకు నమ్మాలి? అని రాజాం పట్టణ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు
సాక్షి, విజయవాడ : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయనను రమేష్ హాస్పిటల్కు తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య అభ్యర్థనను చంద్రబాబు నిరాకరించినట్టు సమాచారం. నిన్న కడపలో జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ‘పార్టీలో కష్టపడిన వారికి కాకుండా వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు) -
అర్ధరాత్రి నిప్పు.. భద్రతకు ముప్పు
వైఎస్ఆర్ జిల్లా , రాజంపేట: రాజంపేటలో చోటుచేసుకుంటున్న దహనం సంఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. ఎనిమిదేళ్ల క్రితం పట్టణంలోని సాయినగర్లో వరుసగా ఇంటిబయట ఉన్న బైకులకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. అప్పటి నుంచి ఈ ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే వస్తున్నాయి. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద 300 యేళ్ల కిందటి వినియోగంలో లేని రథానికి నిప్పు పెట్టడంతోపాటు పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనలు పట్టణ వాసుల్లో భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. వాహనాలకు భద్రత కరువు.. బైకులు, భారీ వాహనాలకు భద్రత కరువైంది. తమ ఇంటి ముందు, వీధిలోను, ఆవరణంలో ఉంచిన వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడతారనే భయం వాహనదారులను వెంటాడుతోంది. ఇప్పుడు వాహనాలు బయట పెట్టుకోవాలంటే జంకుతున్నారు. పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమీ కాకపోయినప్పటికీ అది ఇప్పుడు మళ్లీ జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలాచేస్తున్నారో.. వాహనాలకు నిప్పుపెట్టడం వల్ల వారికి కలిగే ఆనందం ఏమిటో..ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రత్యర్ధులను టార్గెట్ చేసుకొని తమ కసి తీర్చుకోవడం సహజమే. అలాంటిదేమీ లేకున్నా.. వాహనాలకు నిప్పుపెట్టిన వారితో ఎలాంటి సంబంధంలేకున్నా ఎందుకు నిప్పుపెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. తలలు పట్టుకుంటున్న పోలీసులు పట్టణంలో వాహనాలకు నిప్పుపెడుతున్న వారి తీరు అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనాలకు నిప్పు పెడుతూ సైకోలా వ్యవహరిస్తున్న వారు స్థానికులా, ఇతర ప్రాంతానికి చెందిన వారా అనేది తెలియని పరిస్థితి. సీసీ కెమెరాలు పనిచేస్తుంటే... పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఇప్పుడు పనిచేయడంలేదు. అవి పనిచేయకపోవడంతో జరుగుతున్న సంఘటనల కారకులను గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు పోలీసులు ప్రైవేటు వారి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ లాడ్జిలో తనిఖీలు చేసి సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం రాజంపేటలో చోటుచేసుకున్న దహనం సంఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. రథంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టిన సంఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నాము. అవసరమైన ఆధారల సేకరణలో ఉన్నాము.– రాఘవేంద్ర, డీఎస్పీ, రాజంపేట -
వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత
-
కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరోసారి బహిర్గతమైంది
రాజంపేట రూరల్: ఏపీకి ప్రత్యేక హోదా పై అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరొకసారి బహిర్గతమైందని సీపీఐ, సీపీఎం ఏరియా కార్యదర్శులు పి.మహేష్, సి.రవికుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక బైపాస్ రహదారిలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కేంద్ర వైఖరిని నిరసిస్తూ మెడకు ఉరితాళ్లను వేసుకొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏపీని మోసం చేస్తూనే ఉందన్నారు. విభజన హామీలన్ని అమలు చేశామని బూటకపు అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శంచారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ నాయకులు ఎంఎస్ రాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి ఈ.సికిందర్, గురుసాయి, ఏఐటీయూసీ నాయకులు ఎస్ఎస్ షరీఫ్, సుబ్రమణ్యంరాజు, వెంకటేష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
ఆ పోలీసుస్టేషన్ అంటే ఎస్ఐలకు దడ !
రాజంపేట : నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రూరల్ (మన్నూరు) పోలీసుస్టేషన్ ఎస్ఐలుకు అచ్చిరావడంలేదు. మన్నూరు పోలీసుస్టేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్న ఎస్ఐలు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సస్పెన్షన్ కావడమో..రాజకీయ బదిలీ...లేక వ్యక్తిగతగ ఫెయిల్యూర్స్తో ఎస్ఐలు స్టేషన్ వీడిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టింగ్ అంటే ఎస్ఐలు వెనడుగు వేస్తున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. లాకప్డెత్ నుంచి నేటి వరకు పనిచేసిన ఎస్ఐలు అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారంటే ఈ స్టేషన్ ప్రభావం ఏ పాటిదే అవగతమవుతుంది. పరిధి విస్తారం..మానసిక ఒత్తిడిలు.. పేరుకే రూరల్ పోలీస్టేషన్..కానీ పరిధి విస్తా రం. ప్రజల కోసం పనిచేసే ఎస్ఐలకు రాజ కీయ ఒత్తిళ్లు అధికం అన్న విమర్శలున్నాయి. మన్నూరు పోలీసుస్టేషన్ పరిధి ఎక్కువుగా ఉండటంతో ఒక ఎస్ఐ విధులు నిర్వర్తించాలంటే కష్టమవుతోంది. ఇక్కడ పనిచేసే ఎస్ఐకు మానసిక ,విధి పరమైన ఒత్తిడిలతో కుటుంబాలతో గడపలేని పరిస్ధితులు దాపురించాయి. ఇటీవల మన్నూరు ఎస్ఐ మహేశ్నాయుడు భార్య ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో ఈ స్టేషన్ అంటేనే హడలెత్తిపోతున్నారు. వాస్తుపరంగా ఈస్టేషన్కు దోషాలు ఉన్నాయనే అనుమానాలు మన్నూరు పోలీసులను వేధిస్తున్నాయి. పట్టణతరహాలో ఎస్హెచ్ఓ అవసరం.. రాజంపేట పట్టణపోలీసుస్టేషన్ తరహలో స్టేషన్హౌస్ ఆఫీసర్కు సీఐ స్ధాయి అధికారిని పోలీసుశాఖ నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రూరల్ సీఐ ఉన్నప్పటికీ రాజంపేట నియోజకవర్గంలో ఒక మండలం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు, పుల్లంపేట మండలాలు చూసుకోవాల్సి వస్తోంది. మన్నూరు పరిధిలో అధిక సంఖ్యలో గ్రామాలు, అటవీ పల్లెలు, పట్టణంతో పాటు అభివృద్ధి చెందుతున్న బోయనపల్లె, పలు ఉన్నత విద్యాసంస్ధలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిలో ఈ స్టేషన్ను ఒక ఎస్ఐ మెయింటెన్ చేయడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు.. ఇప్పటి వరకు మన్నూరు పోలీసుస్టేషన్లో అనేక మంది సీఐలు, ఎస్ఐలు పనిచేసినప్పటికి వివాదాలు నడుమ వెళ్లిపోవడం ఈ స్టేషన్ సంప్రదాయం. 1998 నుంచి తీసుకుంటే మునిరామయ్య, గోరంట్ల మాధవ్, సయ్యద్ సాబ్జాన్, శాంతుడు, ఓవీ రమణ, రామచంద్రారెడ్డి, జెవీఎస్ సత్యనారాయణ, ఎం.కృష్ణారెడ్డి, పి.చంద్రశేఖర్, రెడ్డప్ప, కృష్ణయ్య, కృష్ణమోహన్, డి.శ్రీనివాస్, ఎస్వీనరసింహారావు, మధుసూదన్రెడ్డి, సుధాకర్, మహమ్మద్రఫి, ప్రవీణ్కుమార్, ఎన్వీనాగరాజు, పి.మహేశ్లు పనిచేశారు. వీరిలో సగానికిపైగా పోలీసు అధికారులు అనవసర వివాదాల్లో చిక్కుకొని ఇక్కడి నుంచి వీఆర్, బదిలీలో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ ఎక్కడుండాలి... మన్నూరు పోలీసుస్టేషన్ రూరల్ పరిధిలో కాకుండా పట్టణంలోని పట్టణ పోలీస్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నారు. గతంలో హరితహోటల్ సమీపంలో ఉన్న మన్నూరు పోలీసుస్టేషన్ను నిర్మాణ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు.బోయనపల్లె మెయిన్రోడ్డులోని పీఓబి, ఎర్రబల్లి వద్ద స్థలాలు ఉన్నాయి. అక్కడ నిర్మించేందుకు పోలీసు బాస్లు ఆలోచన చేయడంలేదు. ప్రస్తుతం ఉన్నచోటు నుంచి మరోచోటుకు తరలించాలని అధికారులను స్టేషన్లో పని చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
సాయం చేయండి..ఊపిరి పోసుకుంటా
అసలే పేదరికం.....వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య తీవ్రమైంది.ఆర్థిక సమస్యలతో డయాలసిస్ చేయించుకోలేకఇబ్బంది పడుతున్నాడు. దాతలు సాయం చేస్తే ఊపిరి పోసుకుంటానని వేడుకుంటున్నాడు. సున్నపురాళ్లపల్లి (రాజంపేట టౌన్) : రాజంపేట మండలం సున్నపురాళ్ళపల్లె గ్రామానికి చెందిన జి.వెంకటేష్ అలియాస్ ఉమర్బాషా రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. వయసులో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వయస్సు పైబడటం, దానికి తోడు ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమర్బాషా కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో ఉమర్బాషాకు కిడ్నీ సమస్య అధికమైంది. రెండు నెలలుగా మూడు రోజులకోసారి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల సహకారంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బాధితుడు చెబుతున్నాడు. సకాలంలో డబ్బులు లభించకుంటే వారం రోజుల వరకు డయాలసిస్ చేయించుకోకుండా ఉండిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహాయం చేస్తే తన ప్రాణం నిలబడుతుందని వేడుకుంటున్నాడు. మానవతావాదులు 8790085866 నంబరును సంప్రదించాలని కోరుతున్నాడు. -
ఎస్ఐ భార్య ఆత్మహత్య
రాజంపేట : మన్నూరు పోలీసుస్టేషన్ ఎస్ఐ మహేశ్నాయుడు భార్య సౌజన్య (26) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మన్నూరు పోలీసుస్టేషన్ ఎదురు వీధిలో వీరు నివాసం ఉంటున్నారు. సౌజన్యది నెల్లూరు జిల్లా కావలి కాగా, ఎస్ఐది చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలోని వరదయ్యగారిపాళెం. ఐదేళ్ల కిత్రం వీరికి వివాహమైంది. వీరికి పూర్ణేష్ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. ఎస్ఐ ఏడాదిన్నర క్రితం మన్నూరు స్టేషన్కు బదిలీ అయ్యారు. భార్యభర్త ఇక్కడే ఉంటున్నారు. కాగా ఎస్ఐ ఉదయం నుంచి ప్రత్యేకహోదా బంద్లో విధులు నిర్వర్తించారు. సాయంకాలం ఊటుకూరు గ్రామసభలో విధులు నిర్వర్తించే క్రమంలో ఎస్ఐ వెళ్లిపోయారు. పోతూ పోతూ తన బిడ్డను పోలీసుస్టేషన్లో ఓ కానిస్టేబుల్కు అప్పగించి వెళ్లినట్లు సమాచారం. పిల్లవాడిని చూసుకుంటుండాలి.. విధులు ముగించుకొని వచ్చేటప్పుడు తీసుకెళతానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇతను విధుల్లో ఉండగానే ఇంటికి రావాలని భార్య నుంచి ఫోన్కాల్ రాగా.. తాను గ్రామసభలో ఉన్నానని.. ఆ తర్వాత వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈలోగా పిల్లవ్లాడిని ఓ కానిస్టేబుల్ ఇంటి వద్దకు తీసుకెళ్లి చూడగా, తలుపు వేసి ఉందని వెనక్కి వచ్చి ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. అయితే మరో కానిస్టేబుల్ మళ్లీ ఇంటికి వద్దకు వెళ్లి బలవంతంగా తలుపు తెరిచి లోపలికి వెళ్లి చూడగా ఎస్ఐ భార్య ఫ్యాన్కు ఊరివేసుకొని ఆత్మహత్య చేçసుకోవడాన్ని గమనించారు. వెంటనే ఎస్ఐకు సమాచారం అందచేశారు. హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకుని, భార్య మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ మన్నూరు ఎస్ఐ భార్య ఆత్మహత్య సంఘటన పోలీసువర్గాలను కలవరపాటుకు గురిచేసింది. సంఘటన స్ధలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారని పలువురు పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కేసు విషయంపై పరిశీలిస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ రాజగోపాల్(టౌన్), రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, తహసీల్దారు నరసింహులు తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు. -
‘సోలార్’ బాధితులకు అండగా పాదయాత్ర
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి నంబులపూలకుంట: మండలంలో ఏర్పాటు చేస్తున్న అల్ట్రామెగా సోలార్పవర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయి పరిహారం రాని బాధిత రైతుల తరఫున పోరాటం సాగిస్తామని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ డా.పి.వి.సిద్దారెడ్డి చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన వివాహవేడుకకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరిహద్దు జిల్లాలైన వైఎస్ఆర్,అనంతపురం లో దాదాపు 10వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా సోలార్ ప్రాజెక్టులో రైతులు భూములు కోల్పోయి ఉపాధి లేక వీదిన పడాల్సి వచ్చిందన్నారు. మూడేళ్లుగా రైతులకు మంజూరైన పరిహారాన్ని ఇవ్వకుండా సర్వే పేరుతో ప్రభుత్వం నీరుగార్చేలా ప్రవర్తిస్తోందన్నారు. అక్టోబర్లో సోలార్హబ్ నుంచి చేపట్టనున్న పాదయాత్రలో ప్రతి రైతూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సోలార్హబ్తో నష్టపోయిన బాధితుల రైతుల సమస్యను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రానున్న అసెంబ్సీ సమావేశాల్లో పట్టాలున్న 104 మంది రైతులతోపాటు పట్టాలులేని రైతులకు ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. బీమా పంపిణీలోనూ రైతులకు తీవ్ర అన్యాయం : వర్షాబావంతో నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన బీమా పరిహారంలోనూ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని డా.పి.వి.సిద్దారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం మండలాల వారీగా ప్రకటించిన బీమా పరిహారానికి ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పరిహారానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. బ్యాంకులు రైతుల వద్ద పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న విస్తీర్ణానికి బీమా ప్రీమియం చెల్లించుకున్నప్పటికీ పరిహారం వచ్చే సమయానికి సగం భూమికి మాత్రమే పరిహారం ఇవ్వడం దారుణమన్నారు. దీనిపై పూర్తి వివరాలతో హైకోర్టుకెళ్లి ప్రతి రైతుకూ తగిన పరిహారం అందేలా పోరాటం చేస్తామన్నారు. -
భూఅక్రమాలపై ఏసీబీ కన్ను
► రాజంపేటలో జోరుగా భూ అక్రమాలు ► రికార్డుల కోసం వచ్చిన అధికారులు ► క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లపై ఆరా ► కాసులు కురిపిస్తున్న భూ వ్యవహారాలు ► కోట్లాది విలువచేసే సర్కారు భూములు ధారాదత్తం రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోజరిగిన భూ అక్రమాలపై ఎసీబీ కన్నుపడింది. మండల పరిధిలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల టాంపరింగ్, కబ్జాలు ఇలా ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారుల్లో భూ బకాసురులు అక్రమ వ్యవహారాలకు తెరతీశారు. రికార్డులు తారుమారు, టాంపరింగ్ చేసి తమవి అన్నట్లుగా చిత్రీకరించుకోవడం రాజంపేటలో అధికం కావడంతో నిజమైన భూబాధితులు అధికారుల అవినీతికి అడ్డుకట్టవేసేందుకు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. ఈనేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం తహసీల్దారు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించారు. అక్కడి అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టి...కోట్లు లాభర్జన: తహసీల్దారు కార్యాలయంలో కొందరు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా భూ బకాసురులకు కట్టబెడుతున్నారు. ఇందుకు కొంతమంది అధికారులు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నట్లుగా ఆరోపణలు వెలుడుతున్నాయి. ఓ రెవెన్యూ అధికారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుం చి కోట్లాది రూపాయలు భూ కుం భకోణంకు పాల్పడినట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయíస్థితిలో రెవెన్యూ ఉన్నతాధికారులు ఉండిపోయారు. అధికార పార్టీ అండదండలతో భూ అక్రమ వ్యవహారాలను తమ్ముళ్లకు అనుకూలంగా వ్యవహారిస్తూ రూ.కోట్లు వెనుకవేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు వీఆర్వోలు కూడా భూ బకాసురు లకు అంతర్గత మద్దత్తు ఇస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఏసీబీ ఆరాతో రెవెన్యూ అధికారుల్లో వణుకు ఏసీబీ అధికారులు తహసీల్దారు కార్యాలయానికి రావడంతో కొందరు అధికారుల్లో వణుకుపుట్టింది. అలాగే ప్రభుత్వ భూములను కూడా రికార్డులు మార్చేసి రాజం పేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్లు కూడా చేయించుకున్నారంటే ఎంత పక్కాగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదని భూ బాధితులు చెబుతున్నారు. తాళ్లపాక, ఊటుకూరు, వెంకటరాజంపే ట, బోయనపల్లె, అన్నమయ్య థీం పార్కు ఏరియా, బైపాస్ రహదారి, చక్రాలమడుగు ఏరియా, ఎస్ఆర్పాళెం(పుల్లంపేట మండలం), రాయచోటి రోడ్డు తదితర ప్రాంతాల్లో భూ అక్రమ వ్యవహారాలు కోట్లరూపాయలు సాగినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. పైవాటిలో కొన్నింటికి సంబంధించి భూ రికార్డులలో గోల్మాల్ చేసినట్లు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఇంటిస్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడాలేదనే రాజంపేట రెవెన్యూ అధికారులు మాత్రం బడాబాబులు, అధికారపార్టీ నేతలకు మాత్రం దగ్గరుండి సాగు, ఇంటి స్థలాలను చూపించి.. వారి వద్ద నుంచి కొంత మొత్తం తీసుకొని కట్టబెడుతున్నారు. గత మూడేళ్లుగా కొనసాగిన ప్రభుత్వ భూ అక్రమ వ్యవహారం ఎట్టకేలకు ఏసీబీని కూడా తాకింది...ఏసీబీ అధికారులు ఏ క్షణానైనా దాడి చేయవచ్చనే భయాందోళన రెవెన్యూ వర్గాల్లో హాట్టాఫిక్గా మారింది. రికార్డుల కోసం.. ఏసీబీ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల కోసం ఆయాశాఖల అధికారులను సంప్రందించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా రాజంపేటలో జరుగుతున్న భూ అక్రమ వ్యవహారాలపై నిఘా ఉం చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ అక్రమ వ్యవహా రాలు అధికమయ్యాయి. ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించడం లాంటివి స్థానిక రెవెన్యూ అధి కారుల సహకారంతో చేపట్టినట్లు ఆరోపణలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ప్ర«భుత్వ భూములను తమవి అన్నట్లుగా రికార్డులు సృష్టించుకొని అందులో రియల్ వ్యాపారం చేస్తున్నారు. -
ఐక్యతకు ప్రతీక నవమి ఉత్సవాలు
కూచివారిపల్లె (రాజంపేట టౌన్): ప్రజల్లో ఐక్యతకు శ్రీరామనవతి ఉత్సవాలు ప్రతీకలాంటివని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాద్రెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని కూచివారిపల్లెలో వెలసిన శ్రీరామాలయంలో వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకుడు రెడ్డిమాసి రమేష్నాయుడు స్వామివారికి శనివారం ఉభయం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆకేపాటి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారాములను దర్శించుకొని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆకేపాటి మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీరామనవమి, వినాయకచవితి, పీర్లపండుగలు వంటివి ప్రజల్లో ఐక్యతాభావాన్ని మరింత పెంచుతాయన్నారు. ఈ పండుగలను ప్రతిచోట అన్ని వర్గాల ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలసి ఘనంగా జరుపుకుంటుండటం దేశ ఐక్యతకే నిదర్శనమన్నారు. పండుగలు, ఉత్సవాలు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాల్లాంటివని తెలిపారు. పండుగలను, శుభ కార్యాలను ప్రజలంతా కలిసి, మెలసి సంతోషంగా జరుపుకోవాలని ఆకేపాటి ఆకాంక్షించారు. అప్పుడే ప్రజల మధ్య చిన్న, చిన్న స్పర్దలు ఉన్నా తొలగిపోతాయని ఆయన తెలిపారు. సమాజంలో సుఖశాంతులు విరాజిల్లాలని ఆకేపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఊటుకూరు–1 ఎంపీటీసీ రేవరాజు శ్రీనివాసరాజు, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు రెడ్డిమాసి రమేష్నాయుడు, పోలి మురళీరెడ్డి, రమణారెడ్డి, పసుపులేటి సుధాకర్, పెనిగిలపాటి పెంచలయ్యనాయుడు, గోవిందు బాలక్రిష్ణ, బలిజపల్లె చిన్న తదితరులు పాల్గొన్నారు. -
నష్టాల్లో రాజంపేట ఆర్టీసీ
రాజంపేట: రాజంపేట ఆర్టీసీ డిపో రూ.10.80కోట్ల నష్టానికి చేరుకుంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు సంబంధించి రాజంపేటలో ఆర్టీసీ డిపో ఉంది. కిలోమీటరకు రూ.27.11 ఆదాయం వస్తున్నప్పటికి ఖర్చు రూ.35.78 వస్తోంది. దీన్ని బట్టి కిలోమీటరకు రూ.8.67 నష్టం వస్తోంది. ఈ విధమైన రీతిలో రాజంపేట డిపో ఆర్టీసీ నడుస్తోంది. తెలుగువెలుగుకు ఆటోల తాకిడి..: రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో చాలా ప్రాంతాలకు నడిచే తెలుగువెలుగు బస్సులకు ఆటోల తాకిడి అధికమైంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం క్రమక్రమంగా నైట్హాల్ట్ బస్సులతో పాటు కొన్ని బస్సులను రద్దు చేసుకుంది. ఉదాహరణకు తొగురుపేట, నందలూరు ఆర్ఎస్ బస్సులు ఉన్నాయి. మారుమూల గ్రామాలకు ఆటోల తాకిడితో ఈ బస్సులను ఆర్టీసీ నడపడం మానేసింది. తగ్గిపోతున్న సర్వీసులు..: రాజంపేట డిపోలో ఒకప్పుడు 124 సర్వీసులకుపైగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 80కి చేరింది. అద్దెబస్సులు 30 వరకు నడుస్తున్నాయి. నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ యాజమాన్యం బస్సులను ఉపసంహరించుకుంటోంది. సర్వీసులు తగ్గిపోతున్న క్రమంలో ఉన్న కార్మికులకు డ్యూటీ చార్ట్లో విధులకన్నా..విశ్రాంతి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కోట్లు విలువచేసే స్థలం ఉన్నా..: డిపోకు కోట్ల రూపాయలు విలువజేసే రెండు ఎకరాలకు పైగా నిరుపయోగంగా ఉంది. ఈ ఆస్తులను వాడకంలోకి తెచ్చి ఆర్టీసీ డిపో లాభాల బాటలో పయనించేందుకు ప్రయత్నాలు సాగించింది. ఖాళీ స్థలంలో సర్వే నిర్వహించి ప్లాట్స్కూడా వేసింది. ఇప్పుడున్న స్థలంలో ఒకే ఒక షాపు మాత్రం ఏర్పాటైంది. మిగిలిన ప్లాట్స్ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కనుమరుగవుతున్న ఎక్స్ప్రెస్ సర్వీసులు...: రాజంపేట డిపో పరిధిలో ఎక్స్ప్రెస్ సర్వీసులు కననుమరుగవుతున్నాయి. కలెక్షన్ రావ డం లేదనే సాకుతో నెల్లూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలకు నడిచే బస్సులను నిలిపివేశారు. కడప–రాజంపేట పాతబస్టాండు మధ్య నడిచే ఎక్స్ప్రెస్ సర్వీసును కూడా ఎత్తివేశారు. ప్రస్తుతం కేవలం విజయవాడ, బెంగళూరు, హైదరాబాదుకు నడుస్తున్నాయి. విజయవాడకు అద్దెబస్సును నడిపిస్తున్నారు. 30మంది రాయచోటికి బదిలీ..: రాజంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న 30 మందిని రాయచోటి డిపోకు బదిలీ అయినట్లుగా సమాచారం. ఈ బదిలీకి ప్రధానంగా ఈ డిపోలో సర్వీసులు తగ్గిపోవడమేనని కార్మికవర్గాలు వాపోతున్నాయి. నడుస్తున్న సర్వీసుల కన్నా అధికంగా సిబ్బంది ఉండటం వల్లనే బదిలీకి ఆర్టీసీ ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల ఈడీ కూడా డిపోకు వచ్చి ఆర్టీస్టీ పురోగతికి సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. అధికారులతో చర్చించారు. కేఎంపీఎల్ సాధించడంలో జోన్లో అగ్రస్థానం..: డిపో నష్టాల్లో నడుస్తున్నప్పటికీ కేఎంపీఎల్ సాధించడంలో ఆర్టీసీ జోన్లోని అగ్ర స్థానంలో ఉంది. రాజంపేట డిపో మేనేజరుగా ఎంవీకృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకన్నప్పటి నుంచి ఆర్టీసీని లాభాలబాటలో నడిపించాలని విశేష కృషి సలుపుతున్నారు. డిపోలో తొలిసారిగా కెఎంపీఎల్ సాధించడంలో సఫలీకృతులయ్యారు. ఇటీవల డిపో నష్టాలను తగ్గించుకునేందుకు అనేక ఆదాయమార్గాలను అన్వేషించుకుంటున్నారు. ఆర్టీసీ ఆలయాల దర్శనం, ముఖ్యమైన ఉత్సవాలకు బస్సులను నడిపించడంలో కార్మికుల సహకారంతో ముందుకెళుతున్నారు. డిపో నష్టాల్లో నడుస్తోంది..: రాజంపేట డిపో నష్టం పది కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా వస్తోంది. నష్టాల నంచి బయటపడేందుకు కార్మికులు, ఉద్యోగుల సహకారంతో కృషి చేస్తున్నాం. చాలా రూట్లలో కలెక్షన్ రాకపోవడం వల్ల బస్సులను తిప్పలేకపోయే పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. --- ఎంవీ కృష్ణారెడ్డి, మేనేజరు, రాజంపేట డిపో -
రాజంపేటలో విషాదం
రాజంపేట పట్టణంలో ఆదివారం విషాదం అలుముకుంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఈతకు వెళ్లి ఇద్దరు.. ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు.. అనుమానాస్పద స్థితిలో మరొకరు మృతి చెందడంతో నాలుగు కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి. ఈతకు వెళ్లి.. రాజంపేట: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు స్విమ్మింగ్పూల్లో మునిగి మృతి చెందిన సంఘటన ఆదివారం రాజంపేట పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ అశోక్కుమార్ కథనం మేరకు.. రాజంపేట మండలం ఎంజీపురం రహదారిలోని చక్రధర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమారుడు అమర్నాథ్(22) తన స్నేహితులు ప్రతాప్, కార్తీక్, మహేష్లతో కలిసి పట్టణంలోని పీఎన్ఆర్ స్విమ్మింగ్పూల్కు వెళ్లారు. స్విమ్మింగ్పూల్లో నలుగురు ఈత కొడుతున్న సమయంలో నీటిలో ఉన్న అమర్నాథ్ స్పృహ కోల్పోయాడు. వెంటనే తోటి స్నేహితులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అమర్నాథ్ మృతి చెందాడు. కాగా నలుగురు కూడా మద్యం సేవించి స్విమ్మింగ్కు వచ్చారు. మద్యం మత్తులో ఈత కొట్టడంతోనే అమర్నాథ్ మృతి చెంది ఉండవచ్చని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతునికి కొద్ది నెలల క్రితమే వివాహమైంది. దీంతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యరాలలో మరో యువకుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన హత్యరాలలోని బహుదా నదిలో ఈతకు వెళ్లి తిరుపతికి చెందిన రాము (22) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం జనసందోహం తక్కువగా ఉన్న సమయంలో పక్క దోవ నుంచి బహుదా నదిలో ఈతకు వెళ్లిన రాము తీరం అవతలికి వెళ్లి తిరిగి ఇవతలికి వచ్చేటప్పుడు నీటిలో మునిగిపోయాడు. దీంతో రాము మృతదేహం కోసం తహశీల్దార్ చంద్రశేఖర్రెడ్డి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6గంటల సమయంలో రాము మృతదేహం లభ్యమైంది. రాము తిరుపతిలోని ఓ హోటల్లో పని చేసుకుని జీవించేవాడని అతని స్నేహితులు తహశీల్దార్ చంద్రశేఖర్రెడ్డికి వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొని.. ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని యల్లాగడ్డకు చెందిన తాళ్లపాక వెంకటయ్య (50) మృతి చెందాడు. ఆదివారం హత్యరాలకు వెళ్లి వస్తున్న క్రమంలో తాళ్లపాకలో ద్విచక్రవాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో.. రాజంపేట పట్టణం అహమ్మద్నగర్కు చెందిన సగినాల మౌలా (38) అనే గ్రానైట్ వ్యాపారి ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అతని ఇంటి సమీపంలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పట్టణ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ రెడ్డప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య
రాజంపేట(వైఎస్సార్జిల్లా): వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజంపేట మండలం మందరం గొల్లపల్లిలో భార్యాభర్తలు వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య(40), వెంకట సుబ్బమ్మ(37) దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి వీరిధ్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురై ఇద్దరు కలిసి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
విద్యార్థి మరణం.. కట్టలు తెగిన ఆగ్రహం
- జాతీయ రహదారిపై విద్యార్థుల బైఠాయింపు - రాస్తారోకోలో పాల్గొన్న వివేకా, ఆకేపాటి రాజంపేట: జాతీయ స్థాయిలో రాణించిన జూడో క్రీడాకారుడు యుగంధర్ (21) దుర్మరణంతో తోటి విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా ఐదు గంటలకు పైగా కడప–రేణిగుంట జాతీయ రహదారిని దిగ్బంధించేశారు. రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు బైఠాయించారు. ఫలితంగా జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం ఇలా.. కడప–రేణిగుంట జాతీయ రహదారిపై బోయనపల్లెలోని ఇసుకపల్లె క్రాస్ రోడ్డు వద్ద శనివారం అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతూ జాతీయ స్థాయిలో జూడో క్రీడాకారుడుగా రాణిస్తున్న బి.యుగంధర్ (21) రోడ్డు దాటుతుండగా కడప నుంచి తిరుపతికి వెళుతున్న నాన్స్టాప్ బస్సు ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థికి అంబులెన్స్ సిబ్బంది చికిత్స అందిస్తుండగానే మృత్యు ఒడికి చేరుకున్నాడు. సకాలంలో పోలీసులు, అంబులెన్స్ రాలేదని ఆగ్రహంతో విద్యార్థులు అంబులెన్స్, ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఆందోళనలో వివేకా, ఆకేపాటి విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావంగా రాస్తారోకోలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణతోపాటు పోలీసు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ఆందోళనలో పట్టణ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్, నందలూరు సౌమిత్రి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి పల్లె గ్రీష్మంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలని పట్టు సంఘటన స్థలానికి సాయంత్రం రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, డీఎస్పీ రాజేంద్ర చేరుకుని విద్యార్థులతో చర్చించారు. విద్యార్ధులను ఎన్నివిధాగాలు నచ్చచెప్పిన వినేపరిస్ధితులు దాటిపోయాయి. కలెక్టరు రావాలంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు బై ఠాయించారు. బస్సు డ్రైవరు, అంబులెన్స్ వాహన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి కూడా రాజంపేటకు చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. డిమాండ్లను అంగీకరించాకే ఆందోళన విరమణ మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, బోయనపల్లెలో పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్లు వేయాలని, ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆర్డీవోను కోరారు. ఆర్డీవో హామీతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కోలారు(కర్ణాటక): స్థానిక జాతీయ రహదారిపై ఉన్న పవన్ కళాశాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన షేక్ అఫీజా (44)ది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఉస్మాన్నగర్. రాజంపేటకు చెందిన వీరు చెన్నై నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో వెళ్తున్న సమయంలో ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా తిరగడంతో ఢీకొంది. ఘటనలో షేక్ అఫీజా మరణించగా, భర్త జిలాని తీవ్రంగా గాయపడి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కోలారు(కర్ణాటక): స్థానిక జాతీయ రహదారిపై ఉన్న పవన్ కళాశాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన షేక్ అఫీజా (44)ది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఉస్మాన్నగర్. రాజంపేటకు చెందిన వీరు చెన్నై నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో వెళ్తున్న సమయంలో ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా తిరగడంతో ఢీకొంది. ఘటనలో షేక్ అఫీజా మరణించగా, భర్త జిలాని తీవ్రంగా గాయపడి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అతి వేగం.. గర్భశోకం
- రెండు కుటుంబాల్లో విషాదం నింపిన కొత్త సంవత్సర వేడుకలు - రాజంపేటలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం రాజంపేట: కొత్త సంవత్సర వేడుకలంటే యువతకు అదో జోష్.. అర్ధరాత్రి ఈలలు.. కేకలు వేసుకుంటూ బైకులపై అతి వేగంగా వెళుతూ ఉంటే వారికి అదో ఆనందం.. కానీ వీరి సంతోష సమయంలో ఏమాత్రం పొరబాటు జరిగినా కన్నవారికి కడుపు కోత మిగులుతుందనే కనీస ఆలోచన చేయడం లేదు. పర్యవసానంగా కొత్తసంవత్సరం వేళ రాజంపేటలో ఇద్దరు యువకులు మృత్యువాత పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చారు. చావు బతికుల మధ్య యువకుడు కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం అర్ధరాత్రి రాజంపేట పట్టణంలో రెండు బైకులు అతివేగంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతివేగం..ప్రమాదకరమని తెలిసినా..అధునాతనమైన బైకులో వెళ్లే యువకులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రాజంపేట పరిసర ప్రాంతాల్లో గల్ఫ్పై ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. ఎక్కడో తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే, ఇక్కడ ఆ డబ్బులతో జల్సా చేసే వారు అనేకమంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజంపేట పట్టణంలోని ఆర్వోబీ(రైల్వేఓవర్ బ్రిడ్జి)పై శనివారం అర్ధరాత్రి బైకులు ఢీకొన్న సంఘటనలో సాయిప్రసాద్, వినోద్ అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ ఇంటికే ఒక్కడే.. బైకులు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన సాయిప్రసాద్ వారి కుటుంబానికి ఒక్కడే కొడుకు కావడం గమనార్హం. వీరబల్లి మండలంలోని సానిపాయికి చెందిన సురేంద్ర రాజంపేట పట్టణంలోని బలిజపల్లెలో నివసిస్తున్నాడు. జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లాడు. సురేంద్ర, నీలావతి దంపతులకు సురేంద్ర, కూతురు ఉన్నారు. సాయిప్రసాద్ అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తండ్రి కువైట్ నుంచి వస్తున్నట్లు బంధువులు తెలిపారు. కొడుకును పోగొట్టుకున్న టైలర్ కుటుంబం ఈ సంఘటనలో మృతి చెందిన వినోద్ ఎన్ఐటీఎస్లో బీటెక్(మెకానికల్) పూర్తి చేశాడు. తండ్రి తిరుపాలు, హైమావతి దంపతులకు చివరి కొడుకు వినోద్. తండ్రి టైలర్ వృత్తిని చేపట్టి కుమారున్ని ఉన్నత విద్యను అతిక ష్టంమీద చదవించారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితునితో కలిసి ఇంటినుంచి వెళ్లిన కుమారుడు మృతదేహమై ఇంటికి రావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
రాజంపేట: రాజంపేట–నెల్లూరు రహదారిలోని పోలిచెరువుకట్ట వద్ద గురువారం ఆటో బోల్తా పడిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజంపేట నుంచి మందరం గ్రామంలో పని నిమిత్తం కూలీలు ఆటోలో బయలుదేరారు. పోలిచెరువుకట్ట సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. వీరినిచికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
కోర్టు క్లాంపెక్స్ కోసం స్థల పరిశీలన
రాజంపేట: జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఆదేశాల మేరకు జిల్లా మూడవ అదనపు జడ్జి ఎం.తిరుమలరావు శుక్రవారం కోర్టు క్లాంపెక్స్ కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అఫిషియల్క్లబ్, సబ్ కలెక్టరేట్ క్యాంపస్లోని ఖాళీ స్థలాలను, స్థానిక తహసీల్దారు కార్యాలయాలను పరిశీలించారు. జడ్జి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సిబ్బంది అఫిషియల్ క్లబ్ భవనం, క్రీడాస్థలం, సబ్ కలెక్టరులోని నూనివారిపల్లె వైపు ఖాళీ స్థలం, సబ్జడ్జి బంగళా, మెజిస్ట్రేట్ బంగళాను సర్వే చేపట్టి కొలతలు తీసుకున్నారు. అన్ని స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించి, కోర్టు క్లాంపెక్స్కు ఏదీ ఆమోదయోగ్యమో దాన్ని జిల్లా జడ్జి, హైకోర్టుకు నివేదించనున్నారు. ఈ సందర్భంగా అఫిషియల్ క్లబ్ సభ్యులు రామచంద్రరాజు, శివారెడ్డి, సుధాకరరెడ్డి, వాసు, బాలరాజు తదితరులు అఫిషియల్ క్లబ్ వ్యవస్థ, దాని విశిష్టత, దాని ప్రస్తుత అవసరం గురించి ఏడీజేకి విన్నవించారు. ఏడీజే వెంట రాజంపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండూరు శరత్కుమార్రాజు, ఏజీపీ లక్ష్మీనారాయణ, పీపీ వెంకటస్వామి, న్యాయవాదులు ఎబీ సుదర్శనరెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్, కత్తి సుబ్బరాయుడు, వీవీరమణ, శ్రీనువాసరాజు, నాసురుద్దీన్, జఫురుద్దీన్, కేవీరమణ, తదితరులు పాల్గొన్నారు. . . -
అన్నమయ్య కాలిబాటపై టీటీడీ నిర్లక్ష్యం!
రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32 వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తుడిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిబాటపై తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడవ ఘాట్రోడ్డు పరిశీలనలో ఈ కాలిబాటను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్ ఉంది. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి వినతిపత్రంను సమర్పించిన సంగతి తెలిసిందే. దాంతో టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా అప్పట్లో జారీ చేశారు. టీటీడీ పాలక మండలి కూడా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. కాలిబాట ఇలా.. శేషాచల అటవీ ప్రాంతంలో స్వామి పాదాల నుంచి ప్రారంభమైయ్య కాలిబాట అవ్వతాత గుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలకు, ఈతకాయల మండపం నుంచి గోగర్భంతీర్థం(తిరుమల)కు చేరుకుంటుంది. అలాగే ఈ మార్గంలో తుంబరకోన, పనసమాన కోన, వాగేటి కోన, కనివేటికోన సహా మెుత్తం రకరకాల ఇరవై కోనలు ఉన్నాయి. సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉండటం వలన రహదారి గుండా జనసంచారం లేకపోయినా అటవీశాఖ సిబ్బందికి ఉపయోగపడుతోంది. శిథిలమైన కాలిబాట.. రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచివెళ్లిన కాలిబాట నేడు శిథిలమయ్యింది. వెయ్యేళ్ల క్రితం నుంచి ఉన్న రహదారి అభివృద్ధికి కోట్లాది రూపాయిల ఆదాయం కలిగివుండే టీటీడీ కనీసం కన్నెత్తిచూడలేదు. మవుండూరు–బాలపల్లె మధ్య స్వామి పాదాల నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు పాదాలు, అక్కడి కోనేరు, సత్రం కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక్కడి నుంచి మెుదలయ్యే కాలిబాటలో ఎన్నో ఆలయాలు, సత్రాలు, కోనలు కొలువుదీరి ఉన్నాయి. ఈ బాట ద్వారా వెయేళ్ల క్రితం నుంచి భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ కొండకు వెళుతూ వచ్చారు. ఉత్తర భారతీయులకు అనుకూలం.. పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. రాను రాను నేటి కలియుగంలో తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు కొనసాగుతోంది. ఉత్తర భారతదేశం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నధికి చేరుకునే పుణ్యపవిత్రమైన వూర్గం అన్నమయ్య కాలిబాట. తాళ్లపాకకు ప్రపంచ స్థాయిలో నేటికీ గుర్తింపు వస్తున్న తరుణంలో..అదే స్థాయిలో అన్నమయ్య కాలిబాటకు మోక్షం కలుగుతుందన్న భావనలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రభుత్వం, టీటీడీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తిరుమల ఘాట్రోడ్డు పరిస్థితితో మూడవ ఘాట్రోడ్డు పరిశీలనకు ఈ మార్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న భావన భక్తుల నుంచి వెలువడుతోంది. నేడు ఆకేపాటి తిరుమల మహాపాదయాత్ర: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి శనివారం తెల్లవారుజామున తిరుమల మహాపాదయాత్రను ఆకేపాడు ఆలయాల సముదాయం నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర రాజంపేట, రైల్వేకోడూరు మీదుగా కుక్కలదొడ్డి వరకు కొనసాగనున్నది. అక్కడి నుంచి అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు చేరుకుంటారు. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలోని రంగంపేటకు చెందిన గుర్రప్ప(32)జీవనోపాధి కోసం వచ్చి రాజంపేటలో నివసిస్తున్నారు. గాలివీడుక చెందిన శేఖర్, గుర్రప్ప మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో గుర్రప్ప మృతి చెందాడు. ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడినట్లు సమాచారం. తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించావని శేఖర్.. గుర్రప్పతో వాదనకు దిగడంతోనే ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. రాయితో కొట్టడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. పట్టణ ఎస్ఐ రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
పెద్దకారంపల్లె (రాజంపేట రూరల్): అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన అరకటవేముల రామాంజనేయులు(30) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతని మృతదేహం శనివారం పెద్దకారంపల్లె పంచాయతీ పరిధిలోని కృష్ణమ్మ చెరువు గుంతలో లభ్యమైంది. కాగా మృతుడు అధికార పార్టీకి చెందిన ఓ నేత క్రషర్లో పనిచేసేవాడని, అక్కడ జరిగిన బ్లాస్టింగ్లో శుక్రవారం మృతి చెంది ఉంటాడని, దీంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పడేసి ఉంటారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కాగా మృతుని సంబంధీకులు మాత్రం చేపల కోసం ఔట్లు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. ఇదిలా ఉండగా రామాంజనేయులు మృతి విషయంలో సంబంధీకులతో బేరసారాలు జరిపి కొంత నగదు ఇచ్చేలా క్రషర్ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. రామాంజనేయులుకు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ కర్నాటకం హేమసుందర్రావు, ఎస్ఐ నాగరాజు, ఏఎస్ఐ రమణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సంబంధీకులతో పూర్తి వివరాలను సేకరించారు. ఆ మేరకు చేపలు పట్టేందుకు వెళ్లి ఔట్లు పేల్చి మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
సంగారెడ్డిలో టైగర్ బటర్ఫ్లై
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలోని రాజంపేటలో ధన్రాజ్ యాదవ్ ఇంటి ఆవరణలో బుధవారం అరుదైన టైగర్ సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. పులిచర్మం రంగులో ఉన్న సీతాకోక చిలుక కనిపించడంతో కాలనీవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. అచ్చం పులి కళ్లు మాదిరిగా ఉండే టైగర్ సీతాకోక చిలుక కనిపించడం చాలా అరుదు. -
రాజంపేటలో ‘చుట్టాలబ్బాయ్’
రాజంపేట టౌన్ : డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి విజయోత్సవ యాత్ర బుధవారం రాత్రి రాజంపేటకు చేరుకుంది. రాజంపేట సమద్ థియేటర్లో చుట్టాలబ్బాయి చిత్రం ప్రదర్శించబడుతోంది. ఈనేపథ్యంలో ఆ చిత్రంలో నటించిన హీరో ఆది, హీరోయిన్ నమిత ప్రమోద్, డైరెక్టర్ వీరభద్రంలు సమద్ థియేటర్కు చేరుకొని ప్రేక్షకులను కలుసుకున్నారు. అలాగే ఆది అభిమానులు పెద్దఎత్తున థియేటర్కు చేరుకొని ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఈసందర్భంగా ఆది అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ చుట్టాలబ్బాయిని ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారని, ఇందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చుట్టాలబ్బాయి తొలి మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ వీరభద్రం మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానులు ఇలాగే ఉంటే ఇంకా మంచి సినిమాలు తీస్తానని తెలిపారు. హీరోయిన్ నమితప్రమోద్ మాట్లాడుతూ మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిటర్లు హబీబ్, మనోహర్రెడ్డి, పాపినేని విశ్వనాథ్రెడ్డి, సుబ్రమణ్యంనాయుడు, అదృష్టదీపుడు తదితరులు పాల్గొన్నారు. -
బంగారం అమ్మడానికి వెళ్లి.
రాజంపేట: పట్టణంలో ఓ బంగారు షాపులో పని చేస్తున్న ఇద్దరు యువకులు బంగారం అమ్మడానికి ప్రొద్దుటూరు వెళ్లిన క్రమంలో వారిలో ఒకరు తిరిగి వచ్చారు.. మరొకరు అదృశ్యమయ్యారు. ఈ విషయంపై బంగారు వ్యాపార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సంఘటన గత నెలలో చోటు చేసుకుంది. మెయిన్రోడ్డులో ఉన్న ఓ బంగారు షాపులో వినోద్, గణేష్ అనే ఇద్దరు గుమస్తాలుగా పని చేస్తున్నారు. వీరు తరుచుగా ప్రొద్దుటూరుకు వెళ్లి అక్కడ బంగారు అమ్మకాలు సాగించి తద్వారా వచ్చిన డబ్బు తీసుకొని యజమానికి ఇస్తుంటారు. ఈ క్రమంలో నెల క్రితం వీరు 1 కేజి 300 గ్రాముల బంగారం అమ్మేందుకు ప్రొద్దుటూరు వెళ్లారు. 300 గ్రాముల బంగారు మాత్రం విక్రయించి, దానికి వచ్చిన నగదు, పాత బకాయి మరో రూ.5 లక్షల వసూలు చేసుకున్నారు. తిరిగి గణేష్ అనే యువకుడు రాజంపేటకు వచ్చాడు. వినోద్ కనిపించక పోవడంతో గణేష్ నుంచి షాపు యజమాని వివరాలు ఆరా తీశారు. 300 గ్రాముల బంగారు అమ్మి, మరో రూ.5 లక్షలు తీసుకున్న వినోద్ వెనకనే వస్తానని చెప్పినట్లు గణేష్ తన యజమానికి తెలిపినట్లు తెలిసింది. షాపు యజమాని సంబంధీకులు ఉస్మాన్నగర్లో నివసిస్తున్న వినోద్ తండ్రిని బెదిరించి దాడి చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం పట్టణ పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇంతకూ వినోద్ ఉన్నాడా? లేక లేడా, అతని దగ్గర ఉన్న రూ.45 లక్షల విలువ గల బంగారు, రూ.5 లక్షలు నగదు ఏమైనట్లు తెలియని పరిస్థితి. పోలీసులు రంగ ప్రవేశం చేస్తేనే నిజనిజాలు బహిర్గతమవుతాయి. -
శ్రీలంక మహిళ అక్రమనివాసం
రాజంపేట: టూరిస్టు వీసాతో వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వచ్చిన శ్రీలంక మహిళ దిశానాయకే ముదియన్శెలగే నంద అక్రమ నివాసం ఉన్నందువల్ల అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ హేమసుందరరావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం అమె అరెస్టును విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రాజంపేట మండలం తమ్మిరెడ్డిపల్లె గోపమాంబపురానికి చెందిన తమ్మిరెడ్డి విశ్వనాధరెడ్డిని నంద ప్రేమవివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాజంపేటలోని రాంనగర్లో అద్దె ఇంటిలో నివాసముంటున్నట్లు తెలిపారు. టూర్ వీసాతో వచ్చిన విదేశీయురాలు వీసాకాలం అయిపోయినా ఇక్కడే నిలిచిపోయిందన్నారు. చట్టవ్యతిరేకంగా ఇండియాలో ఉంటూ, భారతదేశవాసిగా దొంగపత్రాలు సృష్టించుకొని కొత్త పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీనిపై విచారణ అధికారి ఆర్వీ రసింహరావు(ఎస్బీహెచ్) ఫిర్యాదు మేరకు మన్నూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమేరకు గురువారం రాంనగర్లో ఆమెను అరెస్టు చేసి, శుక్రవారం రాజంపేట జేఎఫ్సీఎం జడ్జి ఎదుట ప్రవేశపెట్టామన్నారు. 14రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఆమెకు సహకరించిన తమ్మిరెడ్డి విశ్వనాథరెడ్డి అరెస్టు కావాల్సి ఉందన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. -
మంత్రి మాణిక్యాలరావుకు అస్వస్థత
రాజంపేటటౌన్: దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఆయన తిరుపతి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో వైఎస్సార్జిల్లా రాజంపేట వద్ద ఆయనకు అనారోగ్యానికి గురి కావడంతో స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆగిపోయారు. స్థానిక వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం మంత్రి మాణిక్యాలరావు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో బీసీ బాలికల వసతి గృహన్ని రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బాలికల కోసం బీసీ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం సంతోషం కలిగించే విషయమని చెప్పారు. -
రాజంపేటలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి
కడప: జిల్లాలోని రాజంపేటలో శుక్రవారం వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పర్యటించారు. మహిళలకు స్వయంసేవక రుణాలను ఆయన అందజేశారు. రైల్వేఅండర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు మిధున్ రెడ్డిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి పాల్గొన్నారు. -
రాజంపేట ఎంఈఓకు దేహశుద్ధి
రాజంపేట రూరల్: రాజంపేట ఎంఈఓ కృష్ణకుమార్కు బోయనపల్లె గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ‘పిల్లలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమే అని ఎంఈఓ పేర్కొనడంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఎంఈఓపై దాడి చేసి చితకబాదారు. బోయనపల్లె జెడ్పీ హైస్కూల్ వద్ద శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల ఆర్థర్ అనే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇదే పాఠశాలలో మరో ముగ్గురు ఉపాధ్యాయులు కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ శనివారం పాఠశాలకు తాళాలు వేశారు. అక్కడున్న సిబ్బందిని, ఉపాధ్యాయులను బయటికి పంపించేశారు. ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, జీఆర్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు గ్రామస్తులతో కలిసి పాఠశాల గేటు వద్ద ధర్నా చేశారు. కీచక ఉపాధ్యాయులైన హెచ్ఎం వెంకటరామిరెడ్డి, హిందీ పండిట్ ఖాజాహుస్సేన్, గణిత ఉపాధ్యాయుడు రమణారెడ్డి ఇకపై పాఠశాలకు రావద్దని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ కృష్ణకుమార్ పాఠశాల వద్దకు చేరుకున్నారు. జరిగిన సంఘటనను ఎంఈఓ కృష్ణకుమార్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఇవన్నీ సర్వసాధారణమేనని ఎంఈఓ చెప్పగానే గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంఈఓపై దాడి చేసి చితకబాదారు. దీంతో విద్యార్థి నాయకులు రక్షణగా ఏర్పడి ఎంఈఓను ద్విచక్ర వాహనంలో తరలించారు. సమాచారం తెలియడంతో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తొలి నుంచి వివాదాస్పదుడే బద్వేలుకు చెందిన ఆర్థర్ తొలినుంచి వివాదాస్పద వ్యక్తిగానే పేరుపొందారు. రెండేళ్ల క్రితం రాజంపేట మండలంలోని బోయనపల్లె జెడ్పీ హైస్కూల్కు బదిలీ అయ్యారు. చక్రధరకాలనీలో నివాసం ఉండగా ఇతని వికృత చేష్టలు గమనించి ఆరు నెలల క్రితం గ్రామస్తులు అక్కడి నుంచి పంపించేశారు. తరువాత బోయనపల్లెలో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు బద్వేలులో ఉన్నారు. కీచక మాస్టర్ సస్పెన్షన్ వైవీయూ : రాజంపేట మండలం బోయనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న పి. ఆర్తర్ను విధుల నుంచి తొలగించినట్లు డీఈఓ కె. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. -
'కిరణ్ ఊర్లో వెబ్ కెమెరాల ద్వారా నిఘాపెట్టాలి'
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం, గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల అధికారులకు రాజంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్రెడ్డి, పీలేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలు కోరారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశముందని, వెబ్ కెమెరాల ద్వారా పొలింగ్ సరళి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ను మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు కోరారు. -
పాపం చిన్నమ్మ.....
విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఎంపీ టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీ శల్య రాజకీయాల కారణంగా రాజంపేటకు వలస వచ్చిన కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరికి ఆశించిన ఆదరణ దక్కటం లేదు. రాజంపేటలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె రెండు నెలల క్రితం వరకూ కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా ఉన్నారు. రాష్ట్ర విభజన అంశంలో ఆశించిన మేరకు పోరాటం చేయకపోగా, పదవిని అంటిపెట్టుకుని అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా ఉన్నారనే అపవాదును ఎదుర్కొన్నారు. రాజంపేటలో పోటీ చేస్తున్న ఆమె రాయలసీమ ఆడబిడ్డను అంటూనే, ఎన్టీ రామారావు కుమార్తెగా తనను ఆదరించాలని అభ్యర్థిస్తున్నారు. సీమ ఆడబిడ్డగా పేర్కొంటున్న పురందేశ్వరి రాష్ట్ర విభజన అనివార్యమైతే అత్యంత దారుణంగా దెబ్బతిని పోయే ప్రాంతాల్లో రాయలసీమ మొదటిదని తెలిసీ కూడా ప్రశ్నించలేకపోయారని పలువురు నిలదీస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సొంత అల్లుళ్లు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నా నిలువరించలేదని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు. అవకాశవాద రాజకీయాల్లో భాగస్వామిగా మారి ప్రస్తుతం సెంటిమెంటును ప్రదర్శిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చిన్నమ్మ ప్రచారం చిలు పలుకుల్లా ఉండటం మినహా ప్రజాదరణ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
రాజంపేటలో టీడీపీకి షాక్
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. రాజంపేట నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి సేవ చేసిన వారికి గాక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని మదన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా రాజంపేట లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక్కడి నుంచి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. -
స్వల్ప సంఘటనలు మినహా తొలిపోరు ప్రశాంతం
స్థానిక పోరులో తొలి అంకం పరిసమాప్తమైంది. 5 నియోజకవర్గాల పరిధిలోని 29 మండలాల్లోని 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం పోలింగ్ ముగిసింది. టీడీపీ నేతలు ఆర్థిక, అంగ బలంతో వైఎస్సార్సీపీ శ్రేణులపై పలు చోట్ల తెగబడ్డారు. కొన్నిచోట్ల భౌతిక దాడికి పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలను గాయపరిచారు. ఎమ్మెల్సీ బత్యాల తన సొంత పంచాయతీలో రిగ్గింగ్కు తెగించారు. సుండుపల్లి మండలం వీఎన్ పల్లిలో ఓటేసేందుకు వచ్చిన వృద్ధురాలు ఎండదెబ్బకు మృత్యువాతపడ్డారు. ఇలాంటి సంఘటనలు మినహా తక్కిన అన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే ఓటర్లు పట్టం కట్టినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. సాక్షి, కడప: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలిపోరులో మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల్లో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది. 9 గంటల వరకు 12 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 38.2 శాతం, ఒంటిగంటకు 60 శాతం, 3 గంటలకు 70.8 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు 80.40 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకూ ఓటర్లరద్దీ కొనసాగింది. ఆపై తగ్గింది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసింది. ‘టీడీపీ’ తెగబడింది ఇక్కడే: రాయచోటి మండలం దిగువాబోరం గ్రామంలో ఏజెంట్ల నియామకంలో తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు కట్టెలతో దాడికి తెగబడ్డారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల చలపతి నాయుడు చెవి తెగిపోయింది. వెంకటరమణ తలకు గాయమైంది. పుల్లంపేట మండలం దొండ్లపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ సుబ్రహ్మణంపై టీడీపీ ఏజెంట్లు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తరలించారు.చిన్నమండెం మండలం మల్లూరులో ఓ టీడీపీ కార్యకర్త పోలీసుతో గొడవకు దిగారు. పోలీస్ టీపీని విసిరేసిన టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీటీసీ స్థానాలు 332... ఓటింగ్ జరిగింది 326:తొలివిడత ఎన్నికలు జరగాల్సిన ఎంపీటీసీ స్థానాలు 332 ఉన్నాయి. అయితే ఇందులో ఆరుస్థానాలు(చాపాడు-2, కోడూరు-1, ఓబుళవారిపల్లి-1, రామాపురం-1, సుండుపల్లి-1) ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా తక్కిన అన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతం: జిల్లా యంత్రాంగం పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించడంలో విజయం సాధించారు. రెండు, మూడు చోట్ల చెదుమదురు సంఘటనలు జరిగినా తక్కిన అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు సాగడంలో జిల్లా కలెక్టర్ శశిధర్, ఎస్పీ అశోక్కుమార్ కీలకపాత్ర పోషించారు. -
రాజంపేట దేశంలో ముసలం
సాక్షి ప్రతినిధి, కడప: రాజంపేట తెలుగుదేశంలో ముసలం పుట్టిందా.. పార్టీకి వీరవిధేయులుగా ఉన్న నేతలు తిరుగుబావుటాకు సిద్ధమయ్యారా.. టీడీపీలోని కోవర్టుల కారణంగానే అర్హులకు అన్యాయం చోటుచేసుకుంటున్నదని భావిస్తున్నారా.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తోంది.. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కమ్మ, బలిజ సామాజిక వర్గాలు అండగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా కష్టనష్టాలను ఓర్చుకుని పార్టీని నెట్టుకొస్తున్నారు. పార్టీలో ఉన్న వారినే ప్రోత్సహించాలని అభిప్రాయ పడుతూ వస్తున్నారు. తమలో ఒకరిని ఎంపిక చేయాలని, తాము సమర్థులం కాదని భావిస్తే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అన్నింటికి తలూపిన నేతలు ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో మండిపడుతున్నారు. ఎన్నికల్లో డబ్బే ప్రధాన అస్త్రంగా పనిచేస్తుందనుకోవడం పొరపాటని, వాస్తవాలను విస్మరించి నేతలు ఊహల్లో పయనిస్తున్నారని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం.... తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం 2.12గంటలకు కాంగ్రెస్ పార్టీ నేత మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం కండువా వేసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన డబ్బును మంచినీళ్లు లెక్కన ఖర్చుపెట్టినా ఘోరంగా ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి చేతిలో 38,219 భారీ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డి కొంతకాలంగా ఊగిసలాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రగులుతున్న తెలుగుతమ్ముళ్లు.... కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. పార్టీకోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి బ్రహ్మయ్య తనయుడు సైతం అసమ్మతి బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. మేడా మల్లికార్జునరెడ్డికి టీడీపీ కంటే వైఎస్సార్సీపీలో చేరాలనే తలంపు అధికంగా ఉండేదని, అటు వైపు అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పంచన చేరుతున్నారని, ఇలాంటి వాస్తవాలను గ్రహించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. మేడాను పార్టీలో చేర్చుకునే ముందుగా సీనియర్ నేతలను సైతం సంప్రదించకపోవడాన్ని అక్కడి నేతలు జీర్ణించుకోలేకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం. -
అంగన్వాడీల వినూత్న నిరసన
రాజంపేట రూరల్, కళ్లకు గంతలు కట్టుకుని అంగన్వాడీ వర్కర్లు బుధవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లోని అంగన్వాడీలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీ.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అని ప్రశ్నించారు. అంగన్వాడీలు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తుంటే చీమకుట్టినట్లు అయినా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితులల్లో పాలకులు లేరని మండిపడ్డారు. రాష్ట్రాలు విడిపోయినా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామన్నారు. అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఎన్.శంకరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
రాజంపేటలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
-
రణ నారీ భేరి
జై సమైక్యాంధ్ర అంటూ సమైక్య వాదులు శనివారం రాజంపేటలో రణభేరి మోగించారు. భానుడి సెగను సైతం లెక్కచేయక కేంద్రానికి వినపడేలా సమైక్య నినాదాలు చేశారు. వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సమైక్య వాదులను ఉత్తేజపరిచాయి. రాజంపేట, న్యూస్లైన్: రాష్ట్ర విభజనపై రగిలిన గుండెలతో రాజంపేటలో శనివారం రణభేరి మోగించారు. స్థానిక ప్రభుత్వ క్రీడామైదానంలో సమైక్యాంధ్రపరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో లక్షగళ సమైక్య రణభేరి పెద్దఎత్తున నిర్వహించారు. ఈ రణభేరికి సమైక్యవాదులు వేలాదిగా తరలివచ్చారు. భానుడి సెగను సైతం లెక్క చేయకుండా కేంద్రానికి వినబడేలా నినదించారు. ఆధ్యంతం సమైక్యహోరుతో రణభేరి కొనసాగింది. విభజనపై వ్యతిరేకతను ఎలుగెత్తి చాటారు. ఎమ్మెల్యే ఆకేపాటి, కాంగ్రెస్ ఇన్చార్జి మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య పాల్గొన్నారు. వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సభికులను ఉత్తేజపరిచాయి. అల్లూరి సీతారామరాజు, తెలుగుతల్లి వేషధారణలు ఆకట్టుకున్నాయి. తెలుగుతల్లి ఆక్రందనే సీమాంధ్ర ఉద్యమమని ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసి బయటికి వస్తే అసెంబ్లీ, పార్లమెంటులో విభజన బిల్లు ఎలా ఆమోదం పొందుతుందన్నారు. విభజన వల్ల అనేక విధాలుగా నష్టపోయేది సీమాంధ్ర అన్నారు. విభజన కాక ముందే కేసీఆర్ చేస్తున్న ప్రకటనలతో సీమాంధ్ర ఉద్యమం మరింత ఎగిసిపడుతోందన్నారు. ప్రజల కోసం రాజకీయాలు చేయాలే తప్ప పదవుల కోసం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలంగాణావాసులు వెనకబడి ఉన్నారని చెప్పడం అవాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత అభివృద్థి చెందింది తెలంగాణవారేనన్నారు. మన ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద భాగ్యనగరంగా అవతరించిందన్నారు. ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం రెండృుగా చీలిపోతే రాయలసీమ ఎడారిగా మిగిలిపోతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యమాలతో రగిలిపోతుంటే ఇంతవరకు కేంద్రం ఏ మాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. మోదుగుల కళావతమ్మ కళాశాల అధినేత పెంచలయ్య, ఉద్యోగ రాజంపేట జేఏసీ చైర్మన్ ఎస్వీరమణ తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. సభ ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.