Ramdas Athawale
-
బీజేపీ ప్లాన్ అదే.. షిండే ముందున్న మార్గమిదే: అథవాలే
ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే సీఎం పదవి ఖరారు కావడం మహాయుతి కూటమిలో చిచ్చురాజేసిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసమ్మతితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఉన్న కారణంగా బయటకు ఆయన ఒకే చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర కలత చెందారని పలువురు కామెంట్స్ చేశారు.మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే.. ఏక్నాథ్ షిండేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అథవాలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమే. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు.అయితే, గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.ఈ కారణంగానే మహారాష్ట్ర సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న మార్గం అంటూ సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇచ్చారు. #WATCH | Delhi: On the question of Maharashtra CM, Union Minister Ramdas Athawale says, "I believe in the meeting that is going to take place tomorrow, BJP observers will listen to all the MLAs and the name of Devendra Fadnavis can be announced tomorrow...Eknath Shinde does not… pic.twitter.com/52QJ0bMn07— ANI (@ANI) December 3, 2024 -
మళ్లీ మేము అధికారంలోకి వస్తామో రామో కానీ..: నితిన్ గడ్కరీ
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తోటి కేబినెట్ మంత్రి, రామ్దాస్ అథవాలేను ఉద్ధేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి కేంద్రంలో తమ ప్రభుత్వం(బీజేపీ) వస్తుందో రాదో తెలియదు కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ రామ్దాస్ అథవాలే మాత్రం కచ్చితంగా కేంద్రమంతి అవుతారనే హామీ ఇవ్వగలనని చమత్కరించారు.ఈ మేరకు నాగ్పూర్లోజరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. వివిధ ప్రభుత్వాలలో అథవాలే కేబినెట్ పదవులు చేపట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో స్టేజ్పై అథవాలే కూడా ఉండటం గమనార్హం. అనంతరం అథవాలేతో సరదాగా నవ్వుతూ తాను జోక్ చేశానని చెప్పుకొచ్చారు.అథవాలే కూడా నవ్వులు చిందించారు.ప్రస్తుతం గడ్కరీ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కాగా, రామ్దాస్ అథవాలే వరుసగా మూడుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తన పరంపరను కొనసాగిస్తానని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో ఆర్పీఐ కూడా భాగం. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అథవాలే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడనుంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆర్పీఐ(ఏ) కనీసం 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు అథవాలే పేర్కొన్నారు.. నాగ్పూర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర నాగ్పూర్, ఉమ్రేడ్ (నాగ్పూర్), యావత్మాల్లోని ఉమర్ఖేడ్, వాషిమ్తో సహా విదర్భలో మూడు నుంచి నాలుగు స్థానాలను అడుగుతామని చెప్పారు.కూటమిలో భాగమైన బీజేపీ, శివసేన, ఎన్సీపీలు తమ కోటా నుంచి తమ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వాలని అన్నారు.చదవండి: ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు -
అక్టోబర్లో కశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు అక్టోబర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలె చెప్పారు. శ్రీనగర్లో గురువారం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి’అని మంత్రి అథవాలె వివరించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటూ గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
అలాగే తనతో పాటు వాళ్లందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పండి సార్!
అలాగే తనతో పాటు వాళ్లందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పండి సార్! -
నితీష్ కుమార్పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ముంబై: కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధినేత రామ్దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతలో కీలక పాత్ర పోషించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమవాడేనని, ఏ క్షణమైనా ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా గతేడాది వరకు ఎన్డీయే కూటమిలోనే కొనసాగిన నితీష్ కుమార్.. 2022 ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకొని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో (మహాఘట్బంధన్) చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు రావడంతో బిహార్ సీఎం కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో 26 విపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. తాజాగా రామ్దాస్ అథవాలే ముంబైలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బిహార్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ సీఎంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ఎన్డీయే లక్ష్యమైతే.. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి తొలగించడమే ఏకైక ఎజెండాగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ‘ఇండియా’ కూటమిపై విరుచుకుపడ్డారు. కూటమికి కన్వీనర్, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో కూడా విపక్షాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. చదవండి: జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ‘నేను నిన్న(శనివారం) పాట్నాలో ఉన్నాను. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్షాలు భేటీపై నితీష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇండియా పేరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతను సంతోషంగా లేకపోతే త్వరలో ముంబయిలో నిర్వహించబోయే సమావేశానికి కూడా హాజరు కావొద్దని కోరాను. నితీష్ అంతకుముందు ఎన్డీయేలో సభ్యుడు, ఆయన ఎప్పుడైనా సొంతగూటికి తిరిగి రావొచ్చు’ అని అథవాలే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే విధంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు మమతా వల్ల ఉపయోగం లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే రామ్దాస్ అథవాలే వ్యాఖ్యలపై జేడీయూగానీ, నీతీష్గానీ స్పందించలేదు. కానీ ‘ఇండియా’ పేరుపై నీతీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అథవాలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
నితీశ్కుమార్ తిరిగి ఎన్డీయేలోకి?!
అతిత్వరలో బీహార్లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!. మహారాష్ట్రలో అజిత్ పవార్తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు. అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే.. బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ. ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా. ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం! -
ఎంపీ భరత్కు ఇండో అరబ్ ఎక్సలెన్స్ అవార్డ్
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సా ర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజ మహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్కు ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సోమవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జీ–20 ఇండియా ప్రెసిడెన్సీ సెలబ్రేషన్స్లో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా ఎంపీ భరత్కు ఈ అవార్డ్ను అందజేశారు. యువతా హరితా, గోగ్రీన్ చాలెంజ్ పేరుతో ఎంపీ భరత్రామ్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డ్ను ప్రదానం చేసినట్లు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడంపై ఎంపీ భరత్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ అవార్డును రాజమహేంద్రవరం విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలకు అంకితమిస్తున్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం -
Tunisha Sharma Case: షీజాన్ ఖాన్ను ఉరితీయాలి.. కేంద్ర మంత్రి డిమాండ్
థానే: బుల్లి తెర నటి తునీషా శర్మ ఆత్మహత్యకు కారణమైన షీజాన్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆమె తల్లికి రూ.25లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. థానే జిల్లాలోని భయందర్లోని తునీషా శర్మ నివాసంలో ఆమె తల్లి వనితను గురువారం అథవాలే పరామర్శించారు. కూతురు అకాల మరణానికి న్యాయం చేయడంలో పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తునీషా శర్మను సహనటుడు షీజాన్ ఖాన్ నమ్మించి మోసం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. షీజాన్ ఖాన్కు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తునీషా శర్మను కోల్పోవడం ఆమె తల్లికి తీరని లోటని, రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నష్టపరిహారంగా రూ.25లక్షలు చెల్లించాలని కోరారు. తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తరఫున ఆమెకు రూ.3లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. తునీషా శర్మకు న్యాయం జరిగేందుకు ఉజ్జ్వల్ నికమ్ను ప్రత్యేక ప్రాసిక్యూటర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని అథవాలే డిమాండ్ చేశారు. కాగా 24 ఏళ్ల తునీషా శర్మ సహ నటుడు షీజాన్ ఖాన్ మేకప్ రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షీజాన్నుపోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అయితే.. ఓసారి నా జాతకం చూసి నాకు ప్రధాని యోగం ఉందేమో చెప్పండి సార్!
అయితే.. ఓసారి నా జాతకం చూసి నాకు ప్రధాని యోగం ఉందేమో చెప్పండి సార్! -
రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం..
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు కేంద్ర సామాజిక న్యాయ సహాయమంత్రి రామ్దాస్ అథవాలే. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీ ఆయనను ప్రధాని చేయాల్సిందని పేర్కొన్నారు. సమయం దాటిపోయిందని, ఇక రాహుల్ ఎప్పటికీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని అథవాలే అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని అథవాలే చెప్పారు. ఆయన స్థానాన్నీ భర్తీ చేసే నాయకుడే లేరన్నారు. రాహుల్ గాంధీకి అది సాధ్యం కాదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ 400 స్థానాలకుపైగా కైవవం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు రాహుల్ ఎలా ప్రధాని అవుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావని అథవాలే అన్నారు. కేరళ ప్రజలు ఆదరించకపోయి ఉంటే గత ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని 15 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. చదవండి: భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు -
‘వ్యాపార రంగాల్లో మహిళల జైత్రయాత్ర’
సాక్షి, హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్లో హైదరాబాద్కు చెందిన శ్రీను టెక్నాలజీ కంపెనీకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఎక్స్లెన్స్ అవార్డ్ దక్కింది. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే చేతుల మీదుగా శ్రీను టెక్నాలజీ ఎండీ చిల్కా కావ్యశ్రీ అందుకున్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో ఉన్న వనరులను వినియోగించుకొని వ్యాపార రంగాల్లో మహిళలు జైత్రయాత్ర సాగించడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా యువ దళిత మహిళ కావ్యశ్రీని అభినందించారు. భవిష్యత్లో మరింత ఎదగాలని ఆకాక్షించారు. సదస్సులో కేంద్ర మాజీ మంత్రి కె.జె ఆల్ఫాన్స్, సిక్కిం మాజీ గవర్నర్ బి.సి.సింగ్, మాజీ ఎంపి జె.కె.జెయిన్, సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది జి.వి.రావు తదితరులు హాజరయ్యారు. -
సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి
సాక్షి, విజయవాడ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడం శుభపరిణామమని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఏపీలో కొందరు వ్యతిరేకిస్తున్నారని, అంబేద్కర్ అందరివాడని, ఆయన్ను గౌరవించాలని కోరుతున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించొద్దని సూచించారు. అలాగే ఏపీలో 3,35,358 మందికి పోస్ట్ మెట్రిక్, 2,13,694 మంది విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ఇస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వాన్ని రామ్దాస్ అథవాలే కోరారు. చదవండి: పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దు: మంత్రి అంబటి -
Maharashtra Political Crisis శివ సైనికులకు కేంద్ర మంత్రి అథవాలే వార్నింగ్!
సాక్షి, ముంబై: మహా రాజకీయ సంక్షోభం ముదురుతున్న వేళ బీజేపీ ‘వేచి చూసే ధోరణి’ని అవలంభిస్తోంది. అవకాశం వస్తే వదులుకోం అన్న సంకేతాలను పార్టీ నేతలు కొందరు ఇస్తుండగా మరికొందరు శివసేన ఇంటి పంచాయితీలో వేలు పెట్టబోమని అంటున్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తాజాగా అటువంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య పంచాయితీలో జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సింది వారేనని అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో శుక్రవారం జరిగిన భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే తమకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని పేర్కొన్నారు. శివసేన అంతర్గత విషయాల్లో తలదూర్చకూడదని ఫడ్నవీస్ కూడా అభిప్రాయపడినట్టు అథవాలే తెలిపారు. అది ఎలా సాధ్యం? చాలామంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అయినప్పటికీ సభలో మెజారిటీ నిరూపించుకుంటామని మహావికాస్ అఘాడి సీనియర్లు శరద్ పవార్, అజిత్ పవార్, ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్ చెప్పడం విడ్డూరంగా ఉందని అథవాలే అన్నారు. సొంత పార్టీ నుంచి 37 మంది, 7 నుంచి 8 మంది స్వతంత్ర ఎమ్మేల్యేలు తన వెంట ఉన్నారని ఏక్నాథ్ చెప్పడం కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వారి కార్యాలయాలపై దాడుల ఘటనలపై అథవాలే స్పందించారు. శివసేన ఎమ్మెల్యేలు దాదాగిరి చేస్తే సహించబోమని అన్నారు. తాము కూడా అంతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చారు. కాగా, పుణెలోని శివసేన రెబెల్ఎమ్మెల్యే తానాజి సావంత్ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. శివసైనికులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. వెన్నుపోటుదారులందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. -
ఏపీ సీఎం జగన్పై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ప్రశంసలు
సాక్షి, వరంగల్: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి గొప్ప వ్యక్తి అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే కొనియాడారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన ‘దళిత బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు. కొందరు దళిత, బహుజన వ్యతిరేకులు అంబేడ్కర్ పేరు వద్దని ఆందోళనలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ మన మధ్యలో ఉంటే భారత ప్రధాని అయ్యేవారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని, దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతుందని అథవాలే తెలిపారు. సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. -
ఏపీలో సంక్షేమం అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతంగా అమలు చేస్తున్నారని కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే కితాబునిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన శనివారం విజయవాడలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఎంపీలుగా పని చేసినప్పటి నుంచి తనకు సాన్నిహిత్యం ఉందని, ఇద్దరూ స్నేహభావంతో మెలిగే వ్యక్తులని అన్నారు. సీఎం వైఎస్ జగన్కు ఏపీ ప్రజలు బ్రహ్మండమైన మద్దతు పలికారన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న తీరు చాలా బాగుందన్నారు. ప్రధానంగా దళితుల ఉద్ధరణకు సీఎం జగన్ చేస్తున్న కృషి బాగుందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ కేంద్రంలోని బీజేపీతో చేతులు కలపలేదని, కానీ ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని సానుకూలంగా ఉన్నారని, అందుకు అనుగుణంగానే కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు సీఎం జగన్ అనేకసార్లు ప్రధానిని కలిశారని, వారి ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. ఈ నెల 17న జరిగే సమావేశంలో రాష్ట్రానికి విభజన హామీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందన్నారు. ఒక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందడంలేదని, ఈ పరిస్థితిలో మూడు రాజధానులు సరికాదన్నది తన అభిప్రాయమన్నారు. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. ఏపీలో మూడు రాజదానులు నిర్మించడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడ్డారు. బీజేపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు. విద్యాలయాల్లో విద్యార్థుల వస్త్రధారణ మతాలకు అతీతంగా ఉండాలని, మతపరమైన వస్త్రధరణను తాను సమర్థించబోనని చెప్పారు. మీడియా సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త బి.నాగేశ్వరరావు, ఏపీ అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
శశి థరూర్ ట్వీట్లో తప్పులు.. రీ కౌంటర్ వేసిన అథవాలే
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్లు వేసే కాంగ్రెస్ శశి థరూర్ తన ట్వీట్ అక్షర దోషాలవల్ల దొరికిపోయారు. కేంద్ర బడ్జెట్ 2022పై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతల మద్య ట్విటర్లో వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఓ ట్వీట్ చేశారు. అయితే, అందులో Budget కి బదులుగా Bydget అని, reply కి బదులుగా rely అని రాశారు. ఈ ట్వీట్ కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కౌంటర్ ఇస్తూ ఆరోపణలు చేసే ముందు తప్పులను సరిచేసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. 2022-23 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయంలో దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే 1991 ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దేశంలో గోల్డెన్ పీరియడ్ నడుస్తోందని ప్రశంసించారు. కాంగ్రెస్ పాలనాకాలంలో దేశంలో వెలుగులోకి వచ్చిన స్కామ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ టైమ్ లో ప్రతీ రోజు పత్రికల్లో ఏదో ఒక స్కామ్ గురించి వస్తుండేదని ఆమె ఎద్దేవా చేశారు. కోల్ స్కామ్, 2జీ స్కామ్, ఆంట్రిక్ దివాస్ స్కామ్, పలు కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆర్థికమంత్రి చెప్పేదంతా అంకెల గారడీ అని ఆమె ప్రసంగాన్ని వింటున్న కేంద్ర మంత్రి అథవాలె ముఖ కవళికలు చూస్తే తెలుస్తుందని థరూర్ సెటైరికల్గా ట్వీట్ చేశారు. Dear Shashi Tharoor ji, they say one is bound to make mistakes while making unnecessary claims and statements. It’s not “Bydget” but BUDGET. Also, not rely but “reply”! Well, we understand! https://t.co/sG9aNtbykT — Dr.Ramdas Athawale (@RamdasAthawale) February 10, 2022 -
భారత్-పాక్ మ్యాచ్ పై కేంద్రమంత్రి కీలక వాఖ్యలు..
Ramdas Athawale Comments on India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్-2021లో ఈ నెల 24న జరగనున్న దాయాదుల పోరు నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలతో లోయ దద్దరిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదని అథవాలే పేర్కొన్నారు. "పొరుగు దేశం పాకిస్తాన్ ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు. భారత దేశంపై వారి ఉగ్రచర్యలు ఆగడంలేదు. కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్ ఆదేశం పై యుద్దం ప్రకటించాలి. జమ్మూ కాశ్మీర్లో వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయి. లోయలో అభివృద్ధిని అనుమతించకూడదనేది పాకిస్తాన్ ఎత్తుగడ. ఇటువంటి పరిస్థితుల్లో భారత్.. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదు’’ అని విలేకరుల సమావేశంలో అథవాలే చెప్పారు. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చిస్తానని అథవాలే తెలిపారు. కాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ల మధ్య అక్టోబర్ 24న జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు అధికమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే, ఐసీసీ టోర్నీలో ఓ జట్టుతో ఆడలేమని చెప్పడం సరికాదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి చదవండి: T20 WC IND Vs PAK: ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్తో టీ20 అవసరమా..? -
మూడు రాజధానులు.. రాష్ట్ర పరిధిలోని అంశం: కేంద్ర మంత్రి
సాక్షి,విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఏపీలో మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధంలేదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైందన్నారు. ఒకవేళ నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా మోదీ నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. తమ రిపబ్లికన్ పార్టీ కూడా వైఎస్సార్సీపీలాగే ప్రాంతీయ పార్టీ అని, ఎన్డీఏలో భాగస్వామి అయ్యాక అభివృద్ధి వేగవంతమైందన్నారు. అదే తరహాలో వైఎస్సార్సీపీ ఎన్డీఏలో భాగస్వామి అయితే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఏపీలో జాతీయ రహదారులు, టూరిజం తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రులకు పలుసార్లు వినతులిచ్చారని చెప్పారు. ఏపీలో బలమైన పార్టీ నేతగా ఎదిగిన వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్సార్తో తనకెంతో అనుబంధముందన్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ద్వారా కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. స్వర్ణకారుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళతానని ఏపీ స్వర్ణకార సంఘం మహాసభలో అథవాలే చెప్పారు. -
రోజురోజుకి కాంగ్రెస్ పతనం: రాందాస్ అథవాలే
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్ రోజురోజుకి పతనం అవుతోందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందన్నారు. ‘‘మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోని అంశం. కేంద్రం పరిధిలో లేదని’’ కేంద్రమంత్రి స్పష్టం చేశారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
అది పోవాలంటే రాహుల్ పెళ్లి చేసుకోవాలి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కులతత్వం పోవాలంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ దళిత మహిళను పెళ్లి చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సలహా ఇచ్చారు. రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. రాహుల్ ఇచ్చిన నినాదం ‘హమ్ దో హమారే దో’ ఈ సందర్భంగా మంత్రి పార్లమెంట్లో వినిపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అథవాలే తప్పుపట్టారు. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ‘హమ్ దో హమారే దో’ అనే నినాదం గురించి ఆయన మాట్లాడుతున్నారని, నిజానికి ఈ నినాదం గతంలో కుటుంబ నియంత్రణ గురించి వాడేవారని గుర్తుచేశారు. అందుకే ముందుగా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆయన దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అప్పుడు ఆయన మహాత్మా గాంధీ కలలను నిజం చేసినవాడవుతాడని పేర్కొన్నారు. ఆయన పెళ్లితో కులపిచ్చికి అంతం పలకవచ్చు అని పేర్కొన్నారు. ఇలా చేస్తే దేశ యువతకు రాహుల్ మార్గనిర్దేశకుడు అవుతారని ఎద్దేవా చేశారు. గతంలోనూ మంత్రి అథవాలే రాహుల్పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకుంటే, ఆయనకు కులాంతర వివాహం పథకం కింద రూ.2.5 లక్షలు ఇస్తానని తెలిపారు. -
ఆజాద్ వీడ్కోలు: ఎన్డీయే ఆఫర్..!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్పై బీజేపీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన రాజ్యసభ పదవీ కాలం ఈనెల 15న ముగియనుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు ఆజాద్ సేవలను కొనియాడారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనదైన మార్కును చూపించారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ ప్రజా సేవకోసమే పరితమించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్దాస్ అంథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనపై పట్టు కలిగిన ఆజాద్ లాంటి సభ్యులు చట్ట సభల్లో ఉండటం చాలా అవసరమన్నారు. మరో వారంరోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తోందని, మరోసారి ఆయన పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆజాద్ను రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. తాము (ఎన్డీయే) నామినేట్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్కు గర్వకారణమన్నారు. ఆజాద్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. పార్లమెంట్లో తీవ్రమైన ఉద్వేగానికి గురై కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. కాగా తొలిసారి 1984లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆజాద్ సుమారు 40 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. 2005లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై 2008 వరకు కొనసాగారు. ఆ తరువాత యూపీయే (2009-2014) ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారు. అయితే 71 ఏళ్ల ఆజాద్ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేయడంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నుంచి ఇప్పట్లో ఆయన ఎన్నికైయ్యే అవకాశం కూడా లేదు. దీంతో ఇదే ఆయనకు చివరి అవకాశంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాము నామినేట్ చేస్తామంటూ అథవాలే ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ వీడ్కోలు.. మోదీ కన్నీరు -
కేంద్రమంత్రి అథవాలేకు కరోనా, ఆసుపత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మయూర్ బోర్కర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.అటు అథవాలే కూడా తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా ప్రకారం తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అలాగే తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జాగ్రత్త తీసుకోండి, సురక్షితంగా ఉండండని పేర్కొన్నారు. (నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఇన్నింగ్స్) మరోవైపు పాయల్ ఘోష్ పార్టీలో చేరిన సందర్భంగా అథవాలే సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పాయల్ ఘోష్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆమెను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో అథవాలే, పాయల్ ఘోష్ ఫేస్ మాస్క్ వేసుకున్నప్పటికీ దాన్ని ముక్కుమీద నుంచి తొలగించి మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు. వేదికపై ఉన్నవారు కూడా దాదాపు ఇలానే ఉండటం గమనార్హం. తాజాగా అథవాలే కరోనా బారిన పడటంతో సమావేశానికి హాజరైన వారిలో ఆందోళన మొదలైంది. కాగా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఫిబ్రవరి 20న ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద చైనా కాన్సుల్ జనరల్ టాంగ్ గ్యుకోయి, కొద్దిమంది బౌద్ధ సన్యాసులతో కలిసి ‘గో కరోనా గో’ అంటూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. I have tested #COVID19 positive and as per advise of Doctors I have been hospitalised for few days. Those who have been come in contact with me are advised to get COVID-19 tests done. Take Care & Stay Safe — Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 27, 2020 अभिनेत्री पायल घोष का आरपीआय मे स्वागत है। @iampayalghosh आपके साथसे आरपीआय की महिला आघाडी और मजबूत करेंगे! महिलाओंको न्याय दिलाने की लढाई मजबुतीसे लढेंगे!डॉ बाबासाहेब आंबेडकरजीके संविधान का समतावादी भारत साकार करेंगे! pic.twitter.com/xvt1EksnIl — Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 26, 2020 -
నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఇన్నింగ్స్
ముంబై : బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే)లో చేరారు. కేంద్ర మంత్రి, ఆ పార్టీ చీఫ్ రాందాస్ అథవలే సమక్షంలో ఆమె ఆర్పీఐ(ఏ)లో అడుగుపెట్టారు. పార్టీలో ఆమె చేరికను తాను స్వాగతిస్తున్నానని, పాయల్ ఘోష్కు శుభాకాంక్షలు తెలియచేశానని రాందాస్ అథవలే పేర్కొన్నారు. ఆర్పీఐ(ఏ) మహిళా విభాగానికి ఆమెను ఉపాధ్యక్షురాలిగా నియమించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాయల్ ఘోష్ ఆర్పీఐలో చేరారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్పై పాయల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోఫణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదవండి : కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి -
ఇక మిగిలింది అథవాలే ఒక్కరే!
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ మరణంతో ఎన్డీయే మంత్రివర్గంలో బీజేపీ మిత్రపక్షాల నుంచి రాంధాస్ అథవాలే ఒక్కరే మిగిలారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు అయిన అథవాలే ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన అరవింద్ సావంత్(శివసేన), హర్సిమ్రత్ కౌర్ బాదల్(శిరోమణి అకాలీదళ్) గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా పాశ్వాన్(ఎల్జేపీ) అనారోగ్యంతో మృతిచెందారు. (చదవండి: పాశ్వాన్ కన్నుమూత ) ఇక శివసేన, శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. మరో మిత్రపక్షం జేడీ(యూ) కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా 57 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 24 మంది కేబినెట్, 9 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 24 మంది సహాయ మంత్రులు. అరవింద్ సావంత్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా, పాశ్వాన్ మరణంతో కేబినెట్ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. అలాగే రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతితో సహాయ మంత్రుల సంఖ్య 23కు పడిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ 80 మంది మంత్రులను నియమించుకునేందుకు అవకాశం ఉంది. -
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంగనా!
అహ్మదాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతితో పాటు మాదకద్రవ్యాల అంశానికి సంబంధించి బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా సైతం సంచలనం సృష్టిస్తున్నాయి. కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై బాలీవుడ్తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రామ్దాస్ అథవాలే కంగనాకు మద్దతుగా నిలిచారు. దీంతో కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసిన ఓ పోస్టర్ చర్చనీయాంశమైంది. త్వరలో జరగబోయే వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆర్పీఐ కంగనా ఫొటోలతో ఉన్న పోస్టర్ను వాడింది. (చదవండి: ఎన్ని నోళ్లు మూయించగలరు?) కాలాఘోడా ప్రాంతంలో వెలిసిన ఈ పోస్టర్లో అథవాలే, కంగనా ఉన్నారు. కంగనాకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆర్పీఐ వడోదర చీఫ్ రాజేశ్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై వచ్చేందుకు కంగానా ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ పార్టీ అధినేత అథవాలే ఆమెకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాగా, యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి బంధుప్రీతి కారణమని వార్తల్లో నిలిచిన కంగనా, బాలీవుడ్ను డ్రగ్స్ మాఫియా శాసిస్తోందని చెప్పి తీవ్ర విమర్శలు చేసింది. దాంతోపాటు సుశాంత్ మృతి కేసు విచారణలో ముంబై పోలీసులపై నమ్మకం లేదని తేల్చి చెప్పింది. కంగనా వ్యాఖ్యలపై శివసేన పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో వివాదం ముదిరింది. ఈక్రమంలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ముంబై కార్పొరేషన్ కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చేసింది. కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ ఆమె హైకోర్టుకు వెళ్లడంతో.. అధికారుల దుందుడుకు చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) -
ఎన్ని నోళ్లు మూయించగలరు?
ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కంగనపై ఫిర్యాదు నమోదు ఉద్ధవ్పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్ స్టేషన్లో బుధవారం నితిన్ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. అది అక్రమ నిర్మాణమే కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది. గవర్నర్ అసంతృప్తి కంగన రనౌత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హడావుడిగా కంగన కార్యాలయ భవనాన్ని కూల్చేయడాన్ని ఆయన తప్పుబట్టారని గవర్నర్ సన్నిహితులు తెలిపారు. కంగనతో కేంద్రమంత్రి అథావలె భేటీ కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలె గురువారం ముంబైలో కంగనతో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. అయితే, ముంబైను పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను తన పార్టీ ఖండిస్తుందని గతంలో అథావలె ప్రకటించారు. శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. -
కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి
ముంబై: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్దాస్ అతవాలే కంగనా రనౌత్కు మద్దతుగా నిలిచారు. ముంబాయి నగరం పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను తలపిస్తుందంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి రామ్దాస్ మాట్లాడుతూ, ‘నాకు పూర్తిగా నిజమేమిటో తెలియదు, కానీ శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ నటిని ఉద్దేశించి అలా మాట్లాడటం మాత్రం ఖండించదగ్గ విషయం. కంగనా చేస్తున్న పోరాటంలో మేం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తాం’ అని పేర్కొన్నారు. శివసేన మహిళ విభాగం నేతలు కంగనారనౌత్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఆమె పోస్టర్లపై చెప్పులతో దాడి చేశారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ భార్య అమృత స్పందిస్తూ ‘ మేం ముంబాయి గురించి అలా అనడాన్ని సమర్థించం. కానీ ప్రతి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. నటి పోస్టర్లపై చెప్పులతో దాడిచేయడం అనే చర్యలు హేయమైనవి’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్ర పాక్ ఆక్రమిత కశ్మీర్లా మారిందని కామెంట్ చేసిన కంనా ఆ తరువాత ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని తాలిబన్లతో పోల్చింది. దీనిపై మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ స్పందిస్తూ కంగనాకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. అంత అభద్రతా భావం ఉంటే మహారాష్ట్రని వదిలి వెళ్లిపోవాలి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పోలీసుల గురించి తప్పుగా ఎలా మాట్లాడుతుంది’ అని మండిపడ్డారు. చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
రండి.. ఎన్డీయేలో చేరండి.. అప్పుడే..!
ముంబై: భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే(నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత శరద్ పవార్కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే విజ్ఞప్తి చేశారు. ఈ కలయిక మహారాష్ట్ర అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. శివసేనతో జట్టు కట్టినందు వల్ల ఎన్సీపీకి ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. శరద్ పవార్ గనుక ఎన్డీయేలో భాగస్వామ్యమయ్యేందుకు సిద్ధంగా ఉంటే బీజేపీ, ఎన్సీపీ, ఆర్పీఐ(అథవాలే పార్టీ)లు మహారాష్ట్రలో ‘మహాయుతి’ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి మహారాష్ట్రకు అధిక నిధులు రావాలంటే ఈ విషయం గురించి పవార్ తీవ్రంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా అథవాలే తన అభిప్రాయాలను వెల్లడించారు. (నేనేమీ రిమోట్ కంట్రోల్ని కాదు: శరద్ పవార్) ‘‘శరద్ పవార్ మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు. రైతులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల సమస్యల గురించి ఆయనకు బాగా తెలుసు. నరేంద్ర మోదీతో చేతులు కలపాలని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశాభివృద్ధికి ఇది ఎంతో కీలకం. అయితే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నా ఆకాంక్ష’’అని అథవాలే వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా అనేక దోబూచులాటలు, పరిణామాల మధ్య శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 105 సీట్లు గెలుచుకున్నప్పటికీ.. 56 సీట్లలో విజయం సాధించిన శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకుంది. (ప్రియాంక రాయబారం : మెత్తబడిన పైలట్ ) ఇక కొన్ని రోజులుగా సంకీర్ణ సర్కారులో విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో అథవాలే ఈ మేరకు బహిరంగంగా శరద్ పవార్కు ఎన్డీయేలో చేరాలంటూ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మరోవైపు.. రాజస్తాన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తరుణంలో అథవాలే వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని సర్కారును కూలదోసి.. జ్యోతిరాదిత్య సింధియా ప్రోద్బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. राष्ट्रवादी काँग्रेस के नेता शरद पवारजी एनडीए मे शामिल होना चाहीये! महाराष्ट्र्र मे भाजपा राष्ट्रवादी कॉंग्रेस और आरपीआय की महायुती बने यह मेरी व्यक्तीगत इच्छा है@PawarSpeaks pic.twitter.com/lk5j3KnS48 — Dr.Ramdas Athawale (@RamdasAthawale) July 13, 2020 -
ఆరెస్సెస్ చీఫ్పై కేంద్ర మంత్రి విమర్శలు!
-
ఆరెస్సెస్ చీఫ్పై కేంద్ర మంత్రి విమర్శలు!
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయులంతా హిందువులే అనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని సరూర్నగర్ మైదానంలో ఆరెస్సెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు హాజరైన విషయం విదితమే. ఈ క్రమంలో మోహన్ భగవత్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... భారత్లో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు, సంప్రదాయలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ దృష్టిలో 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనని పేర్కొన్నారు. (చదవండి : భరతమాతను ఆరాధించేవారంతా హిందువులే) ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సామాజిక న్యాయ శాఖా మంత్రి రాందాస్ అథవాలే.. మోహన్ భగవత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘భారతీయులంతా హిందువులేనని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఒకప్పుడు మన దేశంలో బుద్ధులు మాత్రమే ఉన్నారు. హిందుత్వ ఆవిర్భవించిన తర్వాతే మన దేశం హిందూ దేశంగా మారింది. నిజానికి భారత్లో ఉన్న వాళ్లంతా భారతీయులేనని మోహన్ భగవత్ చెప్పి ఉంటే బాగుండేది. మన దేశంలో బుద్ధులు, సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, పార్శీలు, జైనులు, లింగాయత్లు ఉన్నారు. వేర్వేరు మత విశ్వాసాలు గల వారు ఇక్కడ నివసిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు రాందాస్ అధ్యక్షుడన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఘాటుగా స్పందించారు. భారత్లో కేవలం ఒక మతం మాత్రమే ఉండాలని ఆరెస్సెస్ భావిస్తోందని.. అయితే అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. Union Min Ramdas Athawale on Mohan Bhagwat's remark '130 cr population of India as Hindu society': Not right to say all are Hindus.There was a time when everyone was Buddhist in our country. When Hinduism came, we became a Hindu nation. If he means everyone is ours then it's good pic.twitter.com/bXWIsHhDbU — ANI (@ANI) December 26, 2019 -
మహా ట్విస్ట్ : బీజేపీ-సేన నయా ఫార్ములా
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల మధ్య ఢిల్లీలో మహారాష్ట్ర పరిణామాలపై కీలక భేటీ జరగగా, మరోవైపు బీజేపీ-శివసేనల మధ్య నయా ఫార్ములా తెరపైకి వచ్చింది. కేంద్రమంత్రి రాందాస్ అథవలే ఈ దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రలో బీజేపీ-సేన సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన నేత సంజయ్ రౌత్తో సంప్రదింపులు జరిపానని మూడేళ్లు బీజేపీ సీఎం, రెండేళ్లు శివసేన సీఎం ఉండేలా సరికొత్త ఫార్ములాను ప్రతిపాదించానని రాందాస్ అథవలే చెప్పుకొచ్చారు. తన ప్రతిపాదనపై రౌత్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రతిపాదనపై తాను బీజేపీతో సంప్రదింపులు జరుపుతానని ఆయన తనకు చెప్పారని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక సోనియాతో భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాము చర్చించామని, అయితే శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు చర్చించిన మీదట చర్చల పురోగతిని వారు తమకు వివరిస్తారని అన్నారు. -
అలా అయితే పాకిస్తాన్కు సాయం చేస్తాం: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత లోయలో పూర్తి శాంతియుత వాతావరణం నెలకొందని కేంద్ర సామాజిక న్యాయ సాధికారికత సహాయ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. కశ్మీర్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, చట్టాలు అమలు చేయడం ద్వారా పెట్టబడులు పెరిగి అభివృద్ధి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల వలె కశ్మీర్లో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కేంద్ర పాలిత ప్రాంత హోదా తొలగిపోయి.. తిరిగి రాష్ట్ర హోదా దక్కించుకుంటుందని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా కశ్మీర్ కేంద్రపాలిత హోదా తాత్కాలికమేనని స్పష్టం చేశారు. శుక్రవారం రాందాస్ విలేకరులతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ దమ్మున్న ప్రధాని అని.. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు చారిత్రక నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్కు మింగుడుపడటం లేదని.. అందుకే అంతర్జాతీయ వేదికలపై అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కశ్మీర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను హెచ్చరించిన అథవాలే...‘ మా సైన్యం ఎంతో దుర్భేద్యమైనది. కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ చేతిలో చిత్తయిన సంగతి గుర్తుండే ఉంటుంది. నిజంగా మీరు యుద్ధం కోరుకోన్నట్లయితే.. మర్యాదగా పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించండి. పీవోకేలో పౌరులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి పీవోకేను భారత్కు అప్పగిస్తే..అక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తాం. అంతేకాదు పాకిస్తాన్కు కూడా వాణిజ్య వ్యాపారాల్లో సహకరించి...పేదరికాన్ని, నిరుద్యోగితను నిర్మూలించేందుకు కావాల్సిన సహాయం అందిస్తాం’ అని పేర్కొన్నారు. -
లోక్సభలో నవ్వులు పూయించిన అఠవాలే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠవాలే బుధవారం లోక్సభలో తన మాటలతో ప్రధాని మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ముఖాల్లో నవ్వులు పూయించారు. ‘రాహుల్ గారు, ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం మీకు వచ్చినందుకు అభినందనలు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నేను మీ కూటమిలోనే ఉన్నాను. తాజా ఎన్నికలకు ముందు కూడా మళ్లీ యూపీఏలో చేరాల్సిందిగా కాంగ్రెస్ నేతలు నన్ను కోరారు. అయితే గాలి ఎటువైపు వీస్తోందో నేను గమనించి, ఎన్డీయేతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని అఠవాలే అన్నారు. ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్న రాహుల్, సోనియాలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అఠవాలే మాట్లాడుతుండగా మోదీ కూడా పలుసార్లు నవ్వారు. మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉండి మంచిపనులు చేస్తారన్నారు. -
పార్లమెంటులో నవ్వులు పువ్వులు..!
-
పార్లమెంటులో నవ్వులు పువ్వులు..!
న్యూఢిల్లీ: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నాయకుడు, ఎంపీ రాందాస్ అథవాలే బుధవారం పార్లమెంటులో నవ్వుల పువ్వులు పూయించారు. సమయానుకూలంగా ఛలోక్తులు విసిరి.. ప్రత్యర్థులను సైతం నవ్వుల్లో ముంచెత్తగల నేతగా పేరొందిన ఆయన.. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా అభినందనలు తెలుపాలనుకుంటున్నట్టు చెప్పారు. అమేథిలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. ‘అక్కడ (ప్రతిపక్ష బెంచీల మీద) కూర్చునే అవకాశం వచ్చినందుకు మీకు నా అభినందనలు. మీరు కూడా నాకు మిత్రులే. మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను మీతోనే ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరుగుతుంది. ఎన్నికలకు ముందు మా వైపు రండి అంటూ కాంగ్రెస్ వాళ్లు పిలిచారు. కానీ, గాలి వైపు చూస్తే.. అది మోదీ వైపు వీస్తోంది. అక్కడి వచ్చి నేనేం చేస్తాను’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ సహా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నవ్వులు చిందించారు. గతంలో యూపీఏ కూటమిలో ఉన్న రాందాస్ అథవాలే 2014 ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఐదేళ్లే కాకుండా మరో ఐదేళ్లు, ఇంకో ఐదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, మోదీ సాహిబ్ మంచి పని చేస్తూనే ఉంటారని, మీరు అంత సులభంగా ఇటువైపు (అధికార బెంచీల వైపు) రాకుండా అడ్డుకుంటామని పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు ఎన్డీయే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో కలసి రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సామాజికన్యాయ, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అఠవాలే సూచించారు. ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన ప్లాజా హోటల్లో విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు మరింత ముందుకు సాగాలంటే కేంద్ర మద్దతు అవసరమని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్ మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచిందని, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఏన్డీయేదేనన్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకమనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. అంచనాలకు మించిన ప్రజాతీర్పుతో అద్భుత విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాభినందనలు తెలుపుతున్నట్లు అఠవాలే అన్నారు. బేగంపేట పర్యాటకభవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం అనేక సంక్లిష్టతలతో కూడిన వ్యవహారమని అన్నారు. -
రాహుల్ ఇప్పుడు ‘పప్పు’ కాదు.. పప్పా!
ఠాణే: ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకి విజయం చేకూర్చారు. ఇప్పుడు ఆయన ఇంకెంత మాత్రం ‘పప్పు’ (అమాయకుడు, తెలివి తక్కువ వాడు) కాదు.. రాహుల్ ఇప్పుడు పప్పా (తండ్రి) అయ్యారు’ అంటూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అఠవాలే ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ అధికారం చేపడుతుండటం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైందనీ, ప్రధాని నరేంద్ర మోదీ కాదని అఠవాలే అన్నారు. కేవలం రఫేల్ ఒప్పందంపై ఆరోపణలతోనే కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే శివసేనకే లాభమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయొద్దని శివసేనకు సూచించారు. -
షాకింగ్; కేంద్ర మంత్రి చెంప చెళ్లు
థానే: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలేకి మహారాష్ట్రలోని అంబర్నాథ్ పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి ఓ అగంతకుడు ఆయనపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే.. అంబర్నాథ్లో జరిగిన ఓ సభలో పాల్గొన్న అథవాలే.. కార్యక్రమం ముగిశాక కార్యకర్తలతో ముచ్చటించడం కోసం వేదిక కిందకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అథవాలే వైపు దూసుకొచ్చిన ఓ యువకుడు ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. అంతేకాకుండా ఆయనను తోసివేయడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన అథవాలే భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆవేశంలో ఆర్పీఐ కార్యకర్తలు నిందితుడిపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా గుర్తించారు. కాగా, ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఈ షాకింగ్ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత అథవాలే ముంబైకి వెళ్లిపోయారు. అథవాలేపై దాడి జరిగిందనే విషయం తెలియడంతో ముంబైలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఈ ఘటనపై ఆర్పీఐ నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. దీని వెనుక ఉన్నావారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అథవాలేపై దాడికి నిరసనగా ఆదివారం మహారాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. -
అగ్రవర్ణ పేదలకు 25 శాతం రిజర్వేషన్లు
లక్నో: అగ్రవర్ణ పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే ప్రతిపాదించారు. అందుకు రిజర్వేషన్ కోటాను 75 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఉన్నత కులాల్లోని పేదలకు 25 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే అది అందరికీ ఉపయోగకరం. 75 శాతానికి రిజర్వేషన్లను పెంచాలి. ఇందుకు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని అన్నారు. ఓబీసీలకు, దళితులకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే విషయంలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే వీలుందని పేర్కొన్నారు. -
బీజేపీ- అన్నాడీఎంకే పొత్తు తథ్యం!
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగానే కన్పిస్తున్నాయి. తమిళనాడులో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్త్ను బీజేపీకి.. పళనిసామి స్నేహహస్తం అందించేందుకు సిద్ధమయ్యారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఇటువంటి సంకేతాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. స్నేహబంధం కొనసాగుతుంది.. సోమవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రాందాస్... దివంగత ఎంజీఆర్, జయలలిత వంటి నేతలు కేంద్రంతో సన్నిహితంగా మెలిగేవారని, ఇప్పుడు వారి ఆశయ సాధనలో నిమగ్నమైన ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని పళని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఉభయసభల్లోనూ అన్నాడీఎంకే సభ్యులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఈ స్నేహబంధం కొనసాగుతుందని పేర్కొంటూ, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే తప్పని సరిగా ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాందాస్ వ్యాఖ్యలతో ఇరకాటంలో అధికార పార్టీ.. కేంద్రం అడుగులకు మడుగులు వొత్తే రీతిలో రాష్ట్రంలోని అన్నాడీఎంకే పాలకులు వ్యవహరిస్తున్నారంటూ పళని ప్రభుత్వంపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఉభయసభల్లో బీజేపీకి అనుకూలంగా అన్నాడీఎంకే ఓట్లు వేయడం, కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంలో ఒక దాని తర్వాత మరొకటి అమల్లోకి రావడం వంటి విషయాలు గమనిస్తుంటే.. కేంద్రం దర్శకత్వంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే పాలన సాగుతుందన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఈ ప్రచారాన్ని ఆసరాగా చేసుకున్న ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దూకుడును పెంచాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో పళని ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది. -
కావాలనే జగన్పై కాంగ్రెస్ కేసులు
సాక్షి, అమరావతి/నెహ్రూనగర్(గుంటూరు): కాంగ్రెస్ పార్టీ కావాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు నమోదు చేయించిందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. జగన్పై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని గుర్తుచేశారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా చరిష్మా ఉన్న నాయకుడని అన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని రామ్దాస్ అథవాలే చెప్పారు. బీసీలకు ఇప్పటికే 27 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం కపట నాటకమని పేర్కొన్నారు. తమ శాఖ జనవరి 15న ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించినట్లు తెలిపారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు తప్పించుకునే వ్యవహారం చేస్తున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చామని, ఇంకా ఇస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై అవసరమైతే ఆర్డినెన్స్ కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే గురువారం విజయవాడలో సాంఘిక, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదవుతున్న కేసుల వివరాలను ఆరా తీశారు. ఇటీవల సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పుపై అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దళితులు పారిశ్రామిక రంగంలో రాణించాలి దళితులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు పారిశ్రామిక రంగం సరైనదని రామ్దాస్ అథవాలే చెప్పారు. గురువారం గుంటూరులో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కీ) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులు అన్ని రంగాల్లో ముందుండి దేశానికి వెన్నెముకగా నిలవాలని సూచించారు. ఐక్యమత్యంగా ఉంటూ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగంలో రాణించాలంటే విద్య అవసరమని, విద్యా రంగంలో ముందంజలో అన్ని రంగాల్లో రాణించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, డిక్కీ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు మిలింద్ కాంబ్లో, సౌత్ ఇండియా అధ్యక్షుడు నర్రా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్పై ఉన్న కేసులేవీ నిరూపితం కాలేదు
-
ఎస్పీ–బీఎస్పీ కలిస్తే బీజేపీకి నష్టమే
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎస్పీ–బీఎస్పీ చేతులు కలిపితే బీజేపీకి భారీ నష్టం తప్పదని వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దాదాపు 30 లోక్సభ స్థానాలు కోల్పోయే ప్రమాదముందని కేంద్ర మంత్రి, ఎన్డీఏ మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ(ఏ)) రామ్దాస్ అథావలే అభిప్రాయపడ్డారు.యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉండగా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 73 సీట్లు గెలిచాయి. శుక్రవారం లక్నోలో అథావలే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎస్పీ, బీఎస్పీ జత కడితే బీజేపీ, దాని మిత్రపక్షాలకు నష్టం తప్పదు. కానీ, ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి అడ్డంకి కాదు’అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీని, రాహుల్ గానీ, అఖిలేష్ యాదవ్గానీ, మాయావతిగానీ సవాల్ చేయలేరని చెప్పారు. లోక్సభ ఉప ఎన్నికల్లో మాయావతి ఎస్పీకి మద్దతు ఇవ్వగా.. రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు సహకరించకపోవడంతో బీఎస్పీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి అథావలే వ్యాఖ్య -
అమ్మ ప్రేమ గొప్పది
‘‘తెలుగు గానా, తెలంగాణ అంటే ఇష్టం. హైదరాబాద్, అమరావతి కూడా చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం’’ అని కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల అన్నారు. కృష్ణుడు, సన ప్రధానపాత్రల్లో పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మకు ప్రేమతో’. ఈ సినిమా పోస్టర్ని రాందాస్ అత్వాల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అమ్మకు ప్రేమతో’ మంచి టైటిల్. ఈ సినిమా సక్సెస్ కావాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కేసీఆర్గారికి మద్దతు కూడా ప్రకటించాను’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో మంచి మనిషి, నిరంతరం ప్రజా సేవకై పాటుపడే వ్యక్తి రాందాస్ అత్వాలగారిని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్(టి.ఎఫ్.సి.సి) తరఫున సత్కరించడం గర్వంగా ఫీలవుతున్నాం. టి.ఎఫ్.సి.సి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మందికి హెల్త్ కార్డులు అందించాం. భవిష్యత్లో మరిన్ని పథకాలను రాందాస్ గారిద్వారా సాధిస్తాం’’ అన్నారు. -
ఓసీలకు 25% రిజర్వేషన్లు ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. మొత్తంగా వారికి 25 శాతం రిజర్వేషన్లను కల్పించడం వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే క్రీమీలేయర్ పద్ధతిని వర్తింపజేయవచ్చన్నారు. ప్రస్తుతం ప్రజల సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే ప్రజల ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత చట్టాల్లో మార్పులను పరిశీలించొచ్చన్నారు. రిజర్వేషన్ల కోసం గుజరాత్లో పాటిదార్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో జాట్లు చేస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లను తాను సమర్థించినట్లు అథవాలే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు ప్రభుత్వం రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తోందని, ఈ మొత్తాన్ని రూ. లక్షకు పెంచాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. గోరక్ష పేరిట దాడులు జరగడం అమానుషమని, గోవులకు రక్షణ ఇవ్వడం మంచిదేనని, కానీ దాని పేరిట మనుషులకు రక్షణ ప్రశ్నార్థకం కారాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కింద ఏటా 42 వేల కేసులు నమోదవుతున్నాయని మంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు అప్పటికప్పుడు స్పందించ డం తప్ప దాడులు జరగకుండా నిరోదించేందుకు కృషి చేయాలని సూచించారు. హెచ్సీయూలో రోహిత్వేముల లాంటి ప్రతిభావంతుడు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ల భర్తీపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో ఆయన అంతకుముందు సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘అంబేడ్కర్–రాజ్యాంగవాదం’అనే అంశంపై జరిగిన సదస్సులో కూడా అథవాలే పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి హెగ్డేపై తోటి మంత్రి ఘాటు కామెంట్!
పుణె: సహచర కేంద్రమంత్రి అనంత్కుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఘాటుగా స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని, తాను అలా జరగనివ్వబోనని ఆయన అన్నారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి అయిన అథవాలే ఆదివారం పుణెలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హెగ్డే వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ‘ఎవరైనా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే.. మేం వారిని మారుస్తాం’ అని సరదాగా నవ్వుతూ అన్నారు. రాజ్యాంగాన్ని పవిత్రపుస్తకంగా ప్రధాని మోదీ అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేసిన అథవాలే.. హెగ్డేపై చర్యలు తీసుకోవాలని బీజేపీని కోరారు. రాజ్యాంగాన్ని గతంలో చాలాసార్లు సవరించారని, కాబట్టి బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తులో రాజ్యాంగాన్ని సవరించి.. అందులోని లౌకికవాదం పదాన్ని తొలగించబోతున్నదని కేంద్రమంత్రి హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
‘అగ్రకులాలకు 25 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి’
► క్రిమిలేయర్ పద్దతిని పాటించి అమలు చేయాలి ► అన్ని పార్టీలు సహకరించి చట్టం తేవాల్సి ఉంది ► కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే సాక్షి, హైదరాబాద్: జనరల్ కేటగిరీలో ఉన్న కులాలకూ రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా 50.5 శాతం కోటాలో జనరల్ కేటగిరీలో ఉన్న కులాలకు 25శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. క్రిమిలేయర్ పద్దతిలో ఈ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తే సరిపోతుందన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, కాపు, రెడ్డి, వెలమ కులాలు, మహారాష్ట్రలో మరాఠాలు, గుజరాత్లో పటేల్, హర్యానాలో జాట్, రాజస్థాన్లో రాజ్పుథ్ కులాలు రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నాయి. అగ్రవర్ణాలైనప్పటికీ ఆయా కులాల్లో కొందరు పేదలున్నారు. ఆర్థిక స్థితిని బట్టి వారికి కూడా ప్రయోజనాలు కల్పించాలి.. ఈ ప్రక్రియంతా పూర్తి పారదర్శకతతో జరగాలి’ అని అన్నారు. కేంద్ర మంత్రి మండలి మొదలు, రాజ్యసభలోనూ రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, రైల్వేశాఖల్లోనూ రిజర్వేషన్ల వారీగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. వికలాంగుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం 3 శాతం ఉన్న వికలాంగుల రిజర్వేషన్లు 4 శాతానికి పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వికలాంగులకు ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టామని, అన్ని శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు విజన్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటు ప్రశంసించదగ్గ కార్యక్రమమని, మైనార్టీల కోసం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరపున రూ.702 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఈమేరకు అథవాలేకు వినతి పత్రాన్ని సమర్పించాడు. రాష్ట్రంలో తలపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.100 కోట్ల సాయం కావాలని కేంద్రమంత్రిని కోరారు. అదేవిధంగా గురుకులాల అభివృద్ధి రూ.400 కోట్లు ఇస్తే వీటిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. -
ఎస్సీ వర్గీకరణ బిల్లు వద్దు
కేంద్ర మంత్రి అఠావలేను కోరిన మాలమహానాడు సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని కేంద్ర మంత్రి రాందాస్ అఠావలేను మాలమహానాడు నేతలు కోరారు. ఆదివారం అఠావలేను ఢిల్లీలో కలుసుకున్న ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. వర్గీకరణపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందని, ఇది ఇప్పట్లో తేలే అంశం కాదని ఆయన తమతో చెప్పారని చెన్నయ్య తెలిపారు. వర్గీకరణను అడ్డుకోండి: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీ రవీంద్రబాబును తెలంగాణ మాలమహానాడు నేతలు కోరారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పసుల రాంమూర్తి తదితరులు ఆదివారం ఆయనను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. -
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా బిల్లు పెట్టండి
కేంద్రమంత్రి అథావాలేను కోరిన సంఘం నేతలు సాక్షి, న్యూఢిల్లీ: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలేను అఖిల భారత క్రిస్టియన్ల సమాఖ్య కోరింది. ఈ మేరకు సంఘం నేతలు శ్రీమంతులు, రాజేశ్బాబు తదితరులు శుక్రవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుంటే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు. -
కులాంతర పెళ్లిళ్ల కోసం సీఎంలందరికీ లేఖలు: కేంద్రమంత్రి
లక్నో: కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సమాజం మొత్తం కలిసుండేలా చేయొచ్చని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని అన్నారు. ఇటీవల కాలంలో దళితులపై దాడులు పెరుగుతుండటం, కులపరమైన ఘర్షణలు పెరుగుతుండటం నేపథ్యంలో స్పందించిన ఆయన దళితులపై దాడులు తగ్గించేందుకు కులాంతర వివాహాలే పరిష్కారం అన్నారు. ఈ విషయంలో తాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని చెప్పారు. ఆదివారం ఆయన గుర్గావ్లో మీడియాతో మాట్లాడుతూ దళితులపై నానాటికి దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం కులాంతర వివాహాలే అని చెప్పారు. 'దళితులపై దాడులు తగ్గించేందుకు కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో రూ.25కోట్లు కేటాయించాలని కోరుతున్నాను. అలాగే, ఇంటర్ క్యాస్ట్ మేరేజ్ చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5లక్షల ఆర్థిక సహాయంతో అందజేయడంతోపాటు ఆ ఇద్దరిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. దీని ద్వారా కులాల పేరిట పెరుగుతున్న అంతరాలకు బదులు కలిసే ఉంటారు' అని చెప్పారు. దళితులపై దాడులు ఎక్కువగా బిహార్, రాజస్థాన్లో జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రెండున్నర లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.50 వేల నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. -
‘మాయావతికి పోటీగా సినీ నటి’
అలహాబాద్: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పోటీచేస్తే, ఆమెకు ప్రత్యర్థిగా తమ పార్టీ నుంచి సినీ నటి రాఖీ సావంత్ను నిలబెడతామని ఆర్పీఐ(రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రామ్దాస్ అథవాలే ఆదివారం ఈ విషయం చెప్పారు. మాయావతి కొన్ని రోజులుగా ఎన్నికల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ఆయన అన్నారు. దళితుల మద్దతు బాగా ఉన్న ఆర్పీఐ.. బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటుందని, కుదరని పక్షంలో 200 స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను పోటీలో నిలబెడతామని అథవాలే వెల్లడించారు. ‘మాయావతి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించుకుంటున్నారు. ఈసారి మనసు మార్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే ఆమెపై మా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాఖీ సావంత్ ను బరిలోకి దించుతాం. మాయావతి ఎక్కడి నుంచి పోటీచేస్తే అక్కడి నుంచి సావంత్ బరిలో ఉంటార’ని రామ్దాస్ అథవాలే తెలిపారు. యూపీలో బీఎస్పీకి ప్రత్యామ్నాయం కోసం దళితులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాయావతి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
పాక్ ఉగ్రదాడుల లక్ష్యం అదే..!
హైదరాబాద్: భారత్ పై తరచుగా దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ తీరును కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తప్పుబట్టారు. ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దాయాది పాక్ తో భారత్ ఎలాంటి శత్రుత్వాన్ని కోరుకోవడం లేదని, అదే సమయంలో పాక్ మాత్రం ఉగ్రదాడులకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పై దాయాదికి ఎలాంటి హక్కులు లేవని.. పీఓకే భారత్ లో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఉడీ ఉగ్రదాడిని ఈ సందర్భంగా రాందాస్ ఖండించారు. భారత్ను ఆర్థికంగా దెబ్బతీయాలన్నదే పాక్ టార్గెట్ అని అభిప్రాయపడ్డారు. సరైన సమయం వస్తే పాక్ పై ధరల యుద్ధం చేయాల్సి వస్తుందని దాయాది దేశాన్ని హెచ్చరించారు. భారత్ ఎప్పటికీ శాంతి మార్గాన్నే అనుసరిస్తున్నా.. పాక్ మాత్రం ఉగ్రదాడులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్ను దెబ్బకొట్టాలని పాక్ ఎప్పుడూ యత్నిస్తుందన్నారు. ఉగ్రదాడులు కేవలం పాక్ నుంచి తలెత్తుతున్నాయని, 2008లో జరిగిన ముంబై దాడులు పాక్ పనే అని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే పాక్ లక్ష్యం అని, అందుకోసం ఉద్దేశపూర్వకంగానే మన ఆర్మీ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని రాందాస్ అథవాలే ఆరోపించారు. -
‘అగ్రవర్ణ పేదలకు 25శాతం కోటా ఇవ్వాలి’
భువనేశ్వర్: అగ్రవర్ణాల్లో పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దళితనేత, కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ పరిమితిని 50 నుంచి 75 శాతానికి పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. వెనుకబడిన గుజ్జర్లు, పటేల్, రాజపుత్రులు, మరాఠాలు, జాట్లు, బ్రాహ్మణులకు కల్పించాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాల్లో పేదలకు తమిళనాడు ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని గుర్తు చేశారు. -
గోవు రక్షకులపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల కేంద్ర కేబినెట్లో చేరిన దళిత నాయకుడు రాందాస్ బాండు అథావాలె గోవుల రక్షణ పేరిట దళితులమీద జరుగుతున్న దాడులపై స్పందించారు. మనుషుల ప్రాణాలు పణంగా పెట్టి గోవుల రక్షణ చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. గోవుల రక్షణ పేరిట మనుషులను చంపుతూపోతే.. మరీ మానవ రక్షణ ఎవరు చేపడతారని ఆయన ప్రశ్నించారు. గుజరాత్లోని ఉనా తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆవు చర్మాన్ని వలిచారని ఉనాలో దళిత యువకులని కారుకు కట్టేసి గోరక్షకులు దారుణంగా కొట్టిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన రాందాస్ అథావాలే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉంది. ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్’కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాందాస్ దళితులు బుద్ధిజంలోకి మారాలని పిలుపునిచ్చారు. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నానని చెప్తున్న మాయావతి ఇంకా ఎందుకు బుద్ధిస్టుగా మారలేదని ఆయన ప్రశ్నించారు. ఉనా ఘటన చాలా తీవ్రమైనదని రాందాస్ పేర్కొన్నారు. ‘గోవుల రక్షకులను నేను ఒక్కటే విషయం అడుగుతున్నా.. గో హత్యకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. అయినా, మీరెందుకు గో రక్షణ పేరిట మానవ హత్యలు చేపడుతున్నారు. మీరు ఈ విధంగా గోవుల రక్షణ చేస్తే.. అప్పుడు మనుషులను ఎవరు రక్షిస్తారు?’ అని ఆయన అన్నారు. -
ప్రైవేట్ సెక్రటరీగా దేవయాని కోబ్రాగడే
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి రామ్దాస్ అథవాలేకు ప్రైవేట్ సెక్రటరీగా అమెరికాలో భారత మాజీ ఉప దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే నియమితులయ్యారు. దేవయాని న్యూయార్క్లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్గా ఉన్న సమయంలో తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను న్యూయార్క్ పోలీసులు 2013లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె 2.5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బయటకొచ్చారు. దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. కాగా, దేవయాని ఇద్దరు కూతుళ్లు భారత పౌరులు కాదని కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, చట్ట విరుద్ధంగా తమ కుమార్తెలకు సంబంధించిన పాస్పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆమె కోర్టును ఆశ్రయించడంతో కేంద్రం ఈమేరకు నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేవయాని కూతుళ్లు అమెరికా, భారత్ పౌరసత్వాలు పొందారని పేర్కొంటూ కేంద్రం వారి పాస్పోర్టులను రద్దు చేసింది. -
'ఆయన విదేశాలకు వెళ్తే.. తిరిగి తీసుకొస్తాం'
భోపాల్: బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ అసహనం వివాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత రాందాస్ అథావాలే స్పందించారు. ఆమిర్ ఒకవేళ విదేశాలకు వెళ్లిపోయినా.. తమ కేడర్ను పంపించి ఆయనను తిరిగి భారత్కు తీసుకొస్తామని ఆయన తెలిపారు. దేశంలో ఆయనకు భద్రత అవసరమైతే తమ పార్టీ కేడర్ ఆయనకు రక్షణకవచంగా ఉంటుందని ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. -
మంత్రి పదవికోసం ‘మరాఠా వంటకాలు’
మంత్రిపదవికోసం దీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, ఎంపీ రాందాస్ అథవాలే తాజాగా, మహారాష్ట్రలోని రెస్టారెంట్లలో స్థానిక ఆహార పదార్థాలనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక అస్తిత్వాన్ని రాజకీయాలకోసం ఉపయోగించుకునే సరికొత్త ప్రయత్నం ఇది. నిజాం ప్రభువు మనసుకు ఏదైనా ఆలోచన తట్టి దాన్ని తన దర్బారులో ప్రస్తావించిన ప్పుడు ఆయన అధికారులు ముక్తకంఠంతో ‘అవును, అవు ను’ అనేవారట. వాస్తవానికి దాని అర్థం ‘కాదుకాదు’ అనే. ‘అద్భుతం హుజూర్, మీ వివేచన నుంచి మాత్రమే ఇలాంటివి పుట్టుకొస్తాయి. కాని వాటిని అమలు చేసేముందు కొన్ని అవరోధా లను పరిష్కరించాల్సి ఉంది. దయచేసి మాకు కాస్త సమయాన్ని ఇవ్వండి’ అనేవారట వారు. కాలం గడిచేకొద్దీ నిజాం తన ఆలోచనను పూర్తిగా మర్చి పోయేవాడు. అధికారులు నిట్టూర్పు విడిచేవారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, ఎంపీ రాం దాస్ అథవాలే విషయంలో కూడా ఇదే జరిగింది మరి. ఇతడు మహారాష్ట్రలో లేదా కేంద్రంలో మంత్రిపదవి కోసం దీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇటీవలే మహా రాష్ట్రలోని అన్ని రకాల, అన్ని తరగతుల రెస్టారెంట్లలో మహారాష్ట్ర ఆహార పదార్థాలనే తమ మెనూలో పొందు పర్చాలన్న కోరికను ఇతడు వెలిబుచ్చాడు. వేయించిన బియ్యం, ఉల్లిపాయలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు కలిపి వండే స్థానిక ఖండా పోహె అనే వంటకాన్ని, చిన్న బ్రెడ్లో బోండాను దట్టించి తయారు చేసే శాండ్విచ్ వడాపావ్ను అన్ని రెస్టారెంట్లలో ఉంటాలని అతడి డిమాండ్. తన ప్రతిపాదనకు రెస్టారెంట్ల యజమానులు ఆమోదం తెలుపుతూనే మంచి మరాటీ వంటగాళ్లు దొరకటం లేదని వినయ పూర్వకంగానే రాందాస్కు విన్నవించారు. సరైన కుక్లను ఆయన వెతికిపెడితే, తమ వినియోగదా రులందరికీ మరాటీ వంటకాలనే వడ్డిస్తామని వారు సెలవిచ్చారు.రాందాస్ వంటి నేతకు లేదనే సమాధానం చెప్ప డానికి గాను మరాటీ దినపత్రిక పుధారి మాత్రమే ఈ ట్రిక్కును తన పాఠకులకు నివేదించింది. మరి రాందాస్ మామూలు వ్యక్తి కాదు. అవసరమైతే వీధు ల్లోకి సమస్యను తీసుకుపోగల కేడర్ బలం కలిగిన వాడు. హోటల్స్కు సంబంధించిన ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకుపోతామని రాందాస్ పార్టీ ప్రతిపాదించింది కూడా. మహారాష్ట్ర ప్రజలు తమ సాంస్కృతిక అస్తిత్వం, భాష విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. కేవలం సాంస్కృతిక అస్తిత్వం చుట్టూ వారు ఒక రాజకీ య పార్టీనే సృష్టించుకున్నారు. అదే శివసేన. ప్రస్తుతం శివసేనతో, బీజేపీతో పోటీ పడటానికి రాందాస్ సిద్ధమవుతున్నారు. అది పూర్తిగా అవకాశవాదమే అనుకోండి. విమర్శించడానికి అతడికి ఒక సమస్య కావాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గంలోకి రాందాస్ను తీసుకో లేదు. ఎంపీగా ఉన్నప్పటికీ అతడిని ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్లోకి ఆహ్వానించలేదు. మొత్తంమీద చెప్పాలంటే మహారాష్ట్ర ప్రజలకు తిండి పట్ల గల మక్కువను ఉపయోగించుకోవడానికి రాందాస్ ఒక చెడు ప్రయత్నం చేశారు. మహా రాష్ట్రీయులు ఇంటి భోజనంపై మక్కువ చూపిస్తారు లేదా వీధుల్లో ఆహారాన్ని ఆరగిస్తారు. అది ప్రత్యేక మైనది కావచ్చు. స్నాక్ కావచ్చు లేదా భోజనమే కావచ్చు వంటగది సౌకర్యం లేనివారికి స్ట్రీట్ ఫుడ్ ఒకటే మార్గం. వీరిలో చాలామందికి తగిన ఇళ్లు కూడా ఉండవు. స్థానికులు అయినా కాకున్నా సరే వీళ్లంతా బయటి తిండిపైనే ఆధారపడి బతికేస్తుంటారు. అయితే ఈ ఆహారం రెస్టారెంట్ మెనూ వంటి గంభీరమైనది కాదు. ఉడిపి కావచ్చు లేదా శెట్టి నడిపే హోటల్ కావచ్చు. ఇవి ఇడ్లీ, దోసె, ఊతప్పం వంటి దక్షిణాది వంటలను ఇవి అందిస్తుంటాయి. ఇక పంజాబీ వంటకాలు ఎలా ఉంటాయంటే పంజా బీయులే వాటిని గుర్తించలేరు. చైనీస్, కాంటినెంటల్ వంటకాలను వారికి వడ్డించకపోవడానికి తగిన కారణ మేదీ కనిపించదు. మీరు వెతుక్కోగలిగితే అవన్నీ వీధి వ్యాపారుల వద్ద కూడా దొరుకుతాయి. మీరు ఆరోగ్యం పట్ల మక్కువ కలిగి ఉండి రెస్టారెంట్ కిచెన్లు, సర్వీస్ బాగుంటుందని భావించి వీధుల్లో వంటకాలకు దూరం జరిగినట్లయితే, ప్రతి రెస్టారెంట్లోనూ రాందాస్ ప్రతిపాదించినట్లు అక్కడ కూడా మహారాష్ట్ర వంటమనిషి కోసం మీరు కాస్త వేచి ఉండాల్సి వస్తుంది. ఇలా ఎంత కాలం? అంటే ఎవరికి తెలుసు. ఈసారి రెస్టారెంట్లో అడుగు పెట్టినప్పుడు ఈ సౌకర్యంకోసం మీరు అడగొద్దు. దానికి బదులుగా, ఆయన బ్యూరో ఏమయినా మహారాష్ట్ర కుక్లచేత పని ప్రారంభించ చేసిందా అని అథవాలేనే అడగండి. అథవాలే నొక్కిచెబుతున్నట్లుగా మీడియా మహా రాష్ట్ర వంటల గురించి నివేదిస్తున్నటప్పుడు ఆ వంట కాలలో వారన్-బాత్, పప్పుకూర, మసాలా బాత్, రసం, వంకాయబజ్జీ వంటివి ఉంటాయని మీడియా మనకు సూచించకపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ మెనూలో ఉంటే, ఉడిపి, షెట్టి, చైనీస్ హోటళ్లు కూడా మరాటీ రెస్టారెంట్లుగా మారిపోతాయి. ఇది మితిమీరిన ఏకత్వం కావచ్చు కూడా. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) - మహేష్ విజాపుర్కార్ -
'ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మద్దతు అవసరం'
ముంబై: మహారాష్ట్రలో శివసేన మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు చేయడం కష్టమని బీజేపీ మిత్రపక్షం ఆర్పీఐ(రిపబ్లిక్న పార్టీ ఆఫ్ ఇండియా) అభిప్రాయపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సీట్లను దక్కించుకోపోవచ్చని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠావలే తెలిపారు. దీనిపై శివసేన-బీజేపీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల సందర్బంగా బీజేపీ-శివసేన పొత్తు వైఫల్యం చెందడంపై మాట్లాడానికి నిరాకరించారు. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల మహారాష్ట్రలో 225 నుంచి 230 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజన మరోసారి పనిచేసిందని ఆయన తెలిపారు. -
మా సీట్లు మాకు కావాలే..
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాషాయ కూటమి తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. బాంద్రాలోని రంగశారద సభాగృహంలో జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి చిహ్నంపై తమ అభ్యర్థులు పోటీ చేయబోరని, తమ పార్టీ గుర్తుపైనే పోటీచేస్తారని కుండబద్దలు కొట్టారు. ఇంతకుముందు తమ పార్టీకి 40 స్థానాలు కావాలని అడిగినా ప్రస్తుత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 20 స్థానాలు కావాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఆర్పీఐ ఓట్లు గంపగుత్తగా పడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆమేరకు ఆర్పీఐ అభ్యర్థులకు కూటమి పార్టీల ఓట్లు రావడంలేదని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాసన సభ ఎన్నికల్లో పరిస్థితుల మారాలంటే ఆ ఓట్లన్నీ ఆర్పీఐ అభ్యర్థులకు పోలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇరు పార్టీల నాయకులకు ఆఠవలే సూచించారు. ఒక కులానికి రిజర్వేషన్ అమలుచేసే ముందు మరో కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. కొద్ది రోజులుగా ధన్గర్ సమాజ ప్రజలు రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికి సమాన న్యాయం జరిగే తీరులో తుది నిర్ణయం తీసుకోవాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు. అది మా లిస్ట్ కాదు.. బీడ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తమ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఇటీవల ఆర్పీఐ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వచ్చిన కథనాలను బుధవారం ఆయన ఖండించారు. ఎవరో కూటమిని తప్పుదోవ పట్టించేందుకు ఇలా అసత్యాలను ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. తాము అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మీడియా ద్వారానే బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కథనాల వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. బీజేపీ,శివసేన కూటమికి తాము 57 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను అందజేశామని, వాటిలో 20 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని రాందాస్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రవర్తించినట్లు ఇప్పుడు కాషాయ కూటమి ప్రవర్తిస్తుందని అనుకోవడంలేదని, ఆర్పీఐ అండ లేకుండా దళితుల ఓట్లను సాధించడం కూటమి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే నటి రాఖీ సావంత్ చేరగా, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ త్వరలో చేరనున్నట్లు వివరించారు. కాగా, బీడ్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
‘కరివేపాకు’ చందమేనా..!
సాక్షి, ముంబై: గంపెడాశతో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో చేరిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కు ఆ కూటమిలో తమ స్థానం ఏంటనే దానిపై రాందాస్ ఆఠవలే వర్గంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. వచ్చే లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంలో స్థానాలు కేటాయించే విషయమై కూటమి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. దీంతో కాషాయకూటమి తమ పార్టీకి ఎంతమేర ప్రాధాన్యత ఇస్తుందనేది ఆర్పీఐ కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఒంట రిగానే ఎన్నికల బరిలో దిగిన ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రాబల్యం తగ్గిపోవడంతో పలు ప్రధానపార్టీల తో పొత్తు పెట్టుకున్నారు. అయినా అనుకున్నంతమేర ఫలితాలు రాలేదు. చివరకు కాషాయకూటమితో పొత్తుపెట్టుకోవడంతో అది మహాకూటమిగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఆర్పీఐ వర్గం ఓట్లు అధికంగా పోలవడంతో కాషాయకూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో భవిష్యత్తులో జరిగే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చనే ధీమాతో ఆఠవలే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో సీట్ల పంపకంపై పలుమార్లు శివసేన, బీజేపీ నాయకులతో చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ను మహాకూటమిలో చేర్చుకునే అంశాన్ని బీజేపీ నాయకులు తెరమీదకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆర్పీఐ గుండెల్లో దడ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు ఆర్పీఐకి వదులుకోవాలనే విషయంపై శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేన భవన్లో అనేక సార్లు చర్చలు జరిగాయి. తనను రాజ్యసభకు పంపాలని చేసిన డిమాండ్ను కూడా శివసేన నెరవేర్చలేకపోయింది. చివరకు అనేక కారణాలు చూపుతూ బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ఇలా శివసేన, బీజేపీ నాయకులు ఆఠవలే నిరాశపడకుండా అనేక హామీలు ఇచ్చారు. ఆయన్ని శాంతపరిచేందుకు‘మహాకూట మి సమన్వయ సమితి’ని కూడా ఏర్పాటు చేశారు. కాని ఇంతవరకు కచ్చితమైన సీట్ల సంఖ్యను ఖరారు చేయలేకపోయారు. దీంతో ఆర్పీఐ కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. బీఎంసీ ఎన్నికల్లో కాషాయకూటమి నాయకులు తమను వాడుకున్నారని ఆర్పీఐ వర్గం ఆరోపిస్తోంది. సీట్ల సర్దుబాటు వెంటనే తేల్చని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని గతంలో ఆఠవలే హెచ్చరించారు. అయినప్పటికీ ఆ అంశం ఇప్పటికీ అయోమయంలోనే ఉంది. దీంతో కాషాయకూటమిలో తమ పార్టీ స్థానం ఏంటనే దానిపై ఆఠవలే కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. -
దేవయానికి అండగా నిలుస్తాం
సాక్షి, ముంబై: ఇక్కట్లపాలైన అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అండగా నిలవనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే శనివారం వెల్లడించారు. జనవరిలో అమెరికా వెళ్లనున్నట్టు చెప్పారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుస్తానన్నారు. కాగా వీసా మోసం ఆరోపణలపై దేవయానిని అరెస్టు చేసి బేడీలు వేయడం, ఆ తరువాత విచారణ పేరు తో ఆమెపట్ల దారుణంగా వ్యవహరించడం తెలి సిందే. అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తం గా వివిధ రంగాల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శనివారం సాయంత్రం రాందాస్ను కలిశారు. అనంతరం రాందాస్ మీడియాతో మాట్లాడుతూ దేవయానికి అండగా నిలిచేందుకే తాను అమెరికా వెళుతున్నానన్నారు. దేవయానిపై నమోదుచేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని, ఆమెపట్ల కఠినంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు చెప్పారు. దేవయానికి న్యాయం జరిగేదాకా తమ పార్టీ ఆందోళన ఆగదని రాందాస్ స్పష్టం చేశారు. -
‘అన్నా’ను ఏమీ అనొద్దు: రాందాస్
సాక్షి, ముంబై: లోక్పాల్ బిల్లు అంశంపై అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్ల మధ్య తలెత్తిన వాగ్వాదంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే జోక్యం చేసుకున్నారు. అథవాలే అన్నాహజారేకి అండదండగా నిలిచారు. మంగళవారం ఆయన ఇక్కడ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ‘ఇకనుంచి అన్నాహజారేపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. లేకపోతే మహారాష్ట్రలో అడుగు పెట్టనివ్వం’ అని అరవింద్ను హెచ్చరించారు. లోక్పాల్ బిల్లుపై అన్నాహజారే తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కేజ్రీవాల్ అనవసరంగా లోక్పాల్ను జోక్పాల్ అంటూ ఎగతాళి చేయొద్దన్నారు. ఈ వైఖరి మార్చుకోని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఒక్క సభ కూడా నిర్వహించకుండా అడ్డుకుంటామంటూ రాందాస్ ఘాటుగా హెచ్చరించారు. ‘లోక్పాల్ బిల్లుపై అన్నాహజారే పూర్తిగా అధ్యయనం చేశారు. అందులో సీబీఐ, ప్రధానిలనుకూడా చేర్చాలంటూ ఆయన చేసిన డిమాండ్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అన్నాహజారే కారణంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా స్థానాలు వచ్చాయని, ఆ విషయం ఎంతమాత్రం మర్చిపోవద్దని సూచించారు. -
రాజ్యసభకు రాందాస్
సాక్షి, ముంబై: శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో కొనసాగుతున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారయింది. అఠవలేతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు ఈ అవకాశాన్ని దీపావళి కానుకగా భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఏడు రాజ్యసభ స్థానాలు ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక స్థానాన్ని మహాకూటమి అభ్యర్థిగా ఆఠవలేకు ఇవ్వాలని మంగళవారం సాయంత్రం శివాలయ్ సభాగృహంలో జరిగిన మహాకూటమి సమన్వయ సమితి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శివసేన సీనియర్ నాయకుడు సుభాష్ దేశాయ్ ఈ విషయం వెల్లడించారు. అయితే ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఆఠవలేకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చే ప్రతిపాదనకు నాయకులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నాయకుడు గోపినాథ్ ముండే వద్దకు పంపించనున్నట్లు దేశాయ్ చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే, ఆర్పీఐ నాయకులు సుమంత్ గైక్వాడ్, అర్జున్ డాంగే, అవినాశ్ మహతేకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎలాంటి సమవేశాలైనా శివసేన, బీజేపీ, ఆర్పీఐ (మహాకూటమి) నాయకులంతా కలిసి నిర్వహించాలని తీర్మానించారు. ‘రైతుల విద్యుత్ పంపుల కనెక్షన్లు తొలగిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. వీటిపై మహాకూటమి నాయకులంతా సర్కారు వ్యతిరేకంగా సభలు, ఆందోళనలు నిర్వహించనున్నారు’ అని ఫడ్నవిస్ చెప్పారు. దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే ప్రథమ వర్ధంతి నవంబరు 17న జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహాకూటమి నాయకులందరూ శివాజీపార్క్కు తరలి రావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీహాలు భవనంపై కాషాయం, నీలంరంగు జెండా ఎగురవేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ రోజు చర్చించనున్నట్లు ఆర్పీఐ నాయకుడు సుమంత్ గైక్వాడ్ పేర్కొన్నారు. -
ఉందామా! వద్దా!
సాక్షి, ముంబై: మహాకూటమిలోని పరిణామాలపై అసంతృప్తితో ఉన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే తన దారి తాను చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలో కొనసాగాలా, తెగతెంపులు చేసుకోవాలనే అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆఠవలే రాజ్యసభ స్థానం డిమాండ్ చేయడంతో కొద్ది రోజులుగా శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో ప్రతిష్టం భన నెలకొంది. అది ఎటూ తేలకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకునే సమయం దగ్గరపడిందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. అయితే ఆర్పీఐ అసంతృప్తికి చాలా కారణాలు ఉన్నాయి. శివసేన దగ్గర ఒకే ఒక రాజ్యసభ సీటు ఉంది కాబట్టి ఆఠవలేకు రాజ్యసభ స్థానం ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అది తేల్చిచెప్పింది. బీజేపీ నుంచి ప్రయత్నం చేయాలని సూచించింది. శివసేన వైఖ రిపై అసంతృప్తికి గురైన ఆర్పీఐ అధినేత.. మహా కూటమి పక్షపాత ధొరణి అవలంభిస్తున్నట్లు తన సన్నిహితులతో చెబుతున్నారు. దీంతో పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సహా ఆఠవలే కూడా అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తాడోపేడో తేల్చుకుని తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నా యి. శివశక్తి, భీంశక్తి ఒకటవ్వాలని దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే చేసిన ప్రతిపాదనకు ఆఠవలే స్పందించారు. తరువాత శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమితో ఆర్పీఐ జతకట్టడం తో దీనికి మహాకూటమిగా నామకరణం చేశారు. శివసేన ఆఠవలేకు తప్పకుండా రాజ్యసభ అభ్యర్థిత్వం ఇస్తుందని కార్యకర్తలు భావించారు. ఆఠవలే ఇదే విషయాన్ని పలుసార్లు పార్టీ నాయకులతో చెప్పారు కూడా. చివరికి శివసేన కుదరదని తేల్చి చెప్పడంతో ఆర్పీఐలో అసంతృప్తి నెలకొంది. శివసేన తీసుకున్న ఈ నిర్ణయంతో దళిత సమాజానికి తప్పుడు సంకేతం పంపిందని ఆర్పీఐ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆఠవలేకు రాజ్యసభ అభ్యర్థిత్వం నిరాకరించి శివసేన తమ అసలు రంగు బయటపెట్టుకుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్ నియోజక వర్గాలు తమకు వదిలేయాలని, అక్టోబరు ఆఖరు వరకు శాసనసభ సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్నామ్యాయ మార్గాన్ని వెతుకోవాల్సి ఉంటుందని ఇదివరకే ఆర్పీఐ కాషాయ కూటమిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఠవలే లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందు సిద్ధంగా లేరు. తనను రాజ్యసభకు పం పించాలని పట్టుబడుతున్నారు. శివసేన మాత్రం ఏ ఒక్క ప్రతిపాదననూ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే తెగదెంపులు తప్పకపోవచ్చని ఆర్పీఐ నాయకుడొకరు అన్నారు. ‘కూటమి నుంచి బయటపడాలా..? వద్దా..? అనే దానిపై తేల్చుకునేందుకు త్వరలో ఒక సమావేశం నిర్వహిస్తాం’ అని ఆర్పీఐ వర్గాలు వెల్లడించాయి. -
భాగస్వామ్య పక్షాలే నిర్ణయిస్తాయి
ముంబై: తమ పార్టీకి రాజ్యసభ స్థానం కేటాయింపుపై శివసేన, బీజేపీలే నిర్ణయం తీసుకుంటాయని ఆర్పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే పేర్కొన్నారు. శివసేన నాయకుడు ఉద్ధవ్ఠాక్రేని శుక్రవారం ఆయన మాతోశ్రీలో కలుసుకుని ఈ అంశంపై చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మూడు లోక్సభ సీట్లతోపాటు ఒక రాజ్యసభ స్థానాలను కేటాయించాలంటూ కోరామన్నారు. ఇందుకు ఉద్ధవ్ స్పందిస్తూ బీజేపీతో చర్చించినఅనంతరం సీట్లను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారన్నారు. కాగా శివసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకున్న ఆర్పీఐ వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమకు 35 స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. ఢిల్లీకి మనోహర్? సాక్షి, ముంబై: శివసేన పార్టీ అగ్రనాయకుడు మనోహర్ జోషీ ఢిల్లీ వెళ్ల్లనున్నట్లు వచ్చిన వదంతులు రాజకీయాల్లో దుమారం రేపాయి. అయితే తనను ఢిల్లీకి ఎవరూ ఆహ్వానించలేదని, ప్రస్తుతం ముంబైలోనే ఉన్నానంటూ ఆయన మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై స్థానం ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళుతున్నారంటూ వదంతులు వ్యాపిం చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ , కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్లను కలుస్తారనే పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా రాజ్నాథ్ సింగ్ను కలసిన తరువాత శరద్ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన రాష్టీయ లోక్షాహి ఆఘాడి (ఆర్ఎల్ఏ) సమన్వయకర్త పదవిని దక్కించుకునే ప్రయత్నాలు చేయనున్నారంటూ చర్చించుకోవడం మొదలైంది. అయితే అదేమీ లేదంటూ ఎన్సీపీ కార్యాలయాల వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జోషి ఎక్కడున్నారనే విషయంలోనూ అనేక అనుమానాలు తలెత్తాయి. ఆయన మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే మనోహర్తో మాట్లాడేందుకు ఓ టీవీ చానల్ చేసిన ప్రయత్నం ఫలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.