robots
-
అమ్మగారూ.. ఇల్లు ఊడ్చేశా..అంట్లు తోమేశా..!
అంట్లుతోమడం మొదలు బట్టలు మడతపెట్టడం దాకా ఇల్లాలికి శ్రమలేకుండా ఇంటి పనులన్నీ చేసే రోబో ఒకటి! సరుకులు సహా మోత పనులను మీ బదులు అలవోకగా చేసిపెట్ట్టగల మరమనిషి మరొకటి!! పనివాళ్ల కొరతను తీరుస్తూ క్లబ్ హౌస్లోని స్విమ్మింగ్ పూల్ను శుభ్రం చేసేందుకు ఇంకో రోబో! హాల్లో మీ కదలికలకు అనుగుణంగా లైట్ను ప్రసరించే రోబో ఇంకొకటి!! వీకెండ్లో కుటుంబమంతా కలిసి సినిమా చూద్దామనుకోగానే పరుగున వచ్చి తన కళ్లనే ప్రొజెక్టర్గా చేసి సినిమా చూపే హైఫై రోబో మరొకటి!! స్నేహితులతో ఇంట్లో చిల్ అవుతుంటే చిటికెలో కాక్టెయిల్ను సిద్ధం చేసి అందించే ఓ బార్టెండర్ రోబో!! ఓ బుజ్జాయిలా ఇంటిల్లిపాదినీ వచ్చిరాని మాటలతో అలరించే ఓ చిట్టి రోబో!! బాబోయ్.. ఇల్లంతా ఏమిటీ రోబోలమయమని అవాక్కవుతున్నారా? అమెరికాలోని లాగ్ వేగాస్ వేదికగా తాజాగా జరిగిన కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ షో వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కనిపించబోయే ట్రెండ్ను కళ్లకు కట్టింది.సాక్షి, హైదరాబాద్ : ఇప్పటివరకు మనం హోటళ్లు, మాల్స్ వద్ద ఆతిథ్య సేవల్లో నిమగ్నమైన రోబోలను లేదా పరిశ్రమలు, వైద్య రంగంలో సేవలు అందించే రోబోలను మాత్రమే చూశాం. అయితే అవన్నీ ముందే సిద్ధం చేసిన ప్రోగ్రామ్లకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే ఒకే రకమైన పనిని మాత్రమే ఆ రోబోలు చేసిపెట్టగలవన్నమాట. కానీ త్వరలోనే మనతో మాటకలుపుతూ మన ఆదేశాలకు అనుగుణంగా పనులు చేసిపెట్టగల కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రోబోలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా మరమనిషి అనే రూపాన్ని తుడిచేస్తూ ఎన్నో ఆకారాలు, సైజుల్లో మనల్ని కనువిందు చేయనున్నాయి. రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని మన దైనందిన కార్యకలాపాలకు ఉపయోగపడేలా టెక్నాలజీ కంపెనీలు రోబోలను తీర్చిదిద్దుతున్నాయి.ఆడమ్ నుంచి మిరుమి దాకా...లాస్వెగాస్ కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ షోలో ఇంటి పనుల్లో సహకరించే హైటెక్ రోబోలు సందడి చేశాయి. ఇవి ఇంటిని శుభ్రం చేయడం, మొక్కలను అందంగా కత్తిరించడం, స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్, హాల్లో లైట్లకు బదులు వెలుతురు ప్రసరింపజేయడం వంటి సేవలు చేసిపెట్టగలవు. రిచ్టెక్ రొబోటిక్స్ అనే సంస్థ తయారు చేసిన బార్టెండర్ రోబో ‘ఆడమ్’ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. అలాగే శిశువు ప్రతిరూపంలోని ‘మిరుమి అనే రోబో వీక్షకుల మాటలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ అలరించింది. టాంజిబుల్ ఫ్యూచర్ సంస్థ రూపొందించిన చాట్జీపీటీ ఆధారిత ‘లూయి’, ఎన్చాన్టెడ్ టూల్స్ సంస్థ తయారు చేసిన ‘మిరోకై’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అంతేకాకుండా ఓపెన్డ్రాయిడ్స్ హోమ్–కోర్స్ అసిస్టెంట్ ‘ఆర్2డీ3’, జిజాయ్ రూపొందించిన అటానమస్ లాంప్ ‘మి–మో’, శామ్సంగ్ సృష్టించిన ‘బాల్లీ’ అనే ప్రొజెక్టర్ రోబోలు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ షోలో ప్రదర్శించిన రోబోలన్నీ సహజ భాషా ప్రాసెసింగ్ అల్గోరిథంతో మనకు సమానమైన వాయిస్ కమాండ్లకు అందించగలవు. ప్రతి ఒక్క రోబో ఆటోమేషన్ను మాత్రమే కాకుండా భావనలను వ్యక్తపరిచే ఇంటరాక్టివ్నెస్ స్థాయిని కూడా ప్రదర్శించాయి. మిరోకై రోబో యానిమేటెడ్ ముఖంతో మనిíÙలానే కనిపిస్తుంది. ‘ఇఫ్–దిస్–దెన్–దట్’ లాజిక్ ఆధారంగా ఏదైనా ‘పని’ని నేర్చుకోగలదు.ఎంత ప్రియమో...ఈ రోబోల్లో కొన్ని మార్కెట్లో ఇప్పటికే అందుబాటులోకి రాగా మరికొన్ని భవిష్యత్లో అందుబాటులోకి రానున్నాయి. మిరుమి త్వరలో 70 డాలర్ల (సుమారు రూ. 6 వేలు) రిటైల్ ధరకు అందుబాటులోకి రానుంది. లూయి ఇప్పటికే 169 డాలర్ల (సుమారు రూ. 14,500)కు అందుబాటులో ఉండగా మి–మో లాంప్ రోబో రిటైల్ ధర 3,500 డాలర్ల (సుమారు రూ. 3 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. అయితే పూర్తి స్థాయి హ్యూమనాయిడ్ రోబోలు చాలా ఖరీదైనవి. ముఖ్యంగా మిరోకై, ఆర్2డీ3 ధరలు 40 వేల డాలర్లు, 60 వేల డాలర్లు (సుమారు 34 లక్షల నుంచి రూ. 51 లక్షలు)గా ఉంది. ఈ దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా రోబోల మార్కెట్ ఏటా దాదాపు 20% వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో భారత మార్కెట్లోనూ అత్యాధునిక రోబోలు సందడి చేయవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా రోబోల విక్రయాలు పెరిగేకొద్దీ వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. -
మనతో రోబో రన్!
ఎన్నో రంగాల్లో మనిషికి సవాల్ విసురుతున్న మరమనుషులను చైనా.. ప్రపంచంలోనే తొలిసారిగా చరిత్రాత్మక పోటీకి రంగంలోకి దింపుతోంది. అథ్లెట్లు, హ్యూమనాయిడ్ రోబోలకు కలిపి మొట్టమొదటిసారిగా హాఫ్ మారథాన్ (21 కి.మీ.) పరుగు పందెం నిర్వహించనుంది. ఏప్రిల్లో జరగనున్న ఈ పోటీకి చైనా రాజధాని బీజింగ్లోని డాక్సింగ్ జిల్లా వేదిక కానుంది. ఇందులో డజన్లకొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు సుమారు 12 వేల మంది అథ్లెట్లతో పోటీపడనున్నాయి. ఈ రేసులో టాప్–3లో నిలిచే రేసర్లకు (అథ్లెట్లు అయినా లేక హ్యూమనాయిడ్ రోబోలైనా) బహుమతులిస్తారని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’తెలిపింది. బీజింగ్ ఆర్థిక–సాంకేతికత అభివృద్ధి ప్రాంతం లేదా ఈ–టౌన్ పరిపాలనా సంఘం ఈ వినూత్న పోటీని నిర్వహించనుంది. 20కన్నా ఎక్కువ రోబో తయారీ సంస్థలు హాఫ్ మారథాన్లో పాల్గొననున్నాయి.స్పెషల్ ఎట్రాక్షన్గా ‘టియాంగోంగ్’ మారథాన్లో పాల్గొనే రోబోలలో చైనాకు చెందిన ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన టియాంగోంగ్ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ రోబోకు గంటకు సగటున 10 కి.మీ. వేగంతో పరిగెత్తే సామర్థ్యం ఉందని ‘ద డైలీ సీపీఈసీ’పేర్కొంది. గతేడాది బీజింగ్లో జరిగిన హాఫ్ మారథాన్లో రేసు మొదలైనప్పటి నుంచి చివరిదాకా ఈ రోబో మనుషులతో కలిసి పరుగెత్తింది.చైనాలో రోబోల అభివృద్ధి ఎందుకంటే.. చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో శ్రామికశక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్నా.. ఆర్ధికవృద్ధిని పెంచాలన్నా శ్రామికశక్తి అవసరం.దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చైనా ఆగస్టులో హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ లాంటి పోటీలు నిర్వహించనుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్కండిషన్స్ అప్లై..హాఫ్ మారథాన్లో పాల్గొనే రోబోలవిషయంలో చైనా కొన్ని షరతులు విధించింది. అవేమిటంటే.. » రోబోలన్నీ మనిషి ఆకృతిలో కనిపించాలి. » వాకింగ్ లేదా రన్నింగ్ లాంటి కదలికల లక్షణాలు కలిగి ఉండాలి. అంటే వాటికి చక్రాలు ఉండరాదన్నమాట. » రోబోల కనీస ఎత్తు 1.6 అడుగుల నుంచి గరిష్టంగా 6 అడుగుల మధ్య ఉండాలి. » హిప్–టు–ఫుట్ పొడవు అంటే నడుము నుంచి పాదం వరకు 1.47 అడుగుల ఎత్తు ఉండాలి. » రిమోట్ ద్వారా నియంత్రించే రోబోలు లేదా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ హ్యూమనాయిడ్లను పోటీలోకి దింపాలి. అయితే అవసరమైతే పోటీ మధ్య బ్యాటరీలను మార్చుకోవచ్చు.2,76,288ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం 2023లో చైనా సంస్థలు ఇన్స్టాల్ చేసిన రోబోల సంఖ్య. ఇది ఆ ఏడాది ప్రపంచంలోని మొత్తం రోబోల్లో 51 శాతం -
రోజుకు రూ.28000 జీతం: ఏడు గంటలే పని!
ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా రోజుకు ఏడు గంటలు నడవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక జాబ్ ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు గంటకు 48 డాలర్లు లేదా సుమారు 4000 రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన ఏడు గంటలు పనిచేస్తే రోజుకు రూ. 28000 సంపాదించుకోవచ్చు. ఇంతకీ జాబ్ ఏంటి? అక్కడ ఏం చేయాల్సి ఉంటుందనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగమైన మోషన్-క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సంస్థ సన్నద్ధమైంది. దీనికోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి.టెస్లా కంపెనీ ప్రకటించిన ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులు మోషన్-క్యాప్చర్ సూట్ & వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి రోజూ ఏడు గంటల సమయం నిర్దిష్ట మార్గాల్లో నడవడం ఉంటుంది. ఇందులో భాగంగానే డేటా సేకరించడం, విశ్లేషించడం వంటివి చేయాలి. వీటితో పాటు ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తి ఎత్తు 5'7' నుంచి 5'11' ఎండీ ఉండాలి. వీరు 13 ఫౌండ్స్ బరువును కూడా మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: తగ్గిన బంగారం, పెరిగిన వెండి: ఈ రోజు ధరలు ఇవేఉద్యోగంలో మూడు షిఫ్టులు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అవి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు.. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 8:30 గంటల వరకు. అంటే ఈ ఉద్యోగంలో చేరాలనుకునేవారు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో పని చేయాల్సి ఉంటుంది. -
రణయంత్రాలు.. 'యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని?'
‘యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని ముగించేస్తుంది’ అన్నాడు ఇంగ్లిష్ రచయిత హెచ్జీ వెల్స్. చాలామంది దేశాధినేతలు ఇప్పటికీ ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కొత్త కొత్త యుద్ధాలను మొదలుపెడుతున్నారు. మానవాళి జీవనసరళిని సులభతరం చేయాల్సిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సునాయాసంగా సామూహిక జనహననం చేయగల అధునాతన ఆయుధాలను, యుద్ధ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. చివరకు రోబో సైనికులను కూడా రంగంలోకి దించుతున్నారు. ‘యుద్ధం విధ్వంసశాస్త్రం’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు జాన్ అబట్. ఈ విధ్వంసశాస్త్ర పురోగతిపై ఒక విహంగ వీక్షణం...యుద్ధాలు ఎందుకు తలెత్తుతాయంటే, కచ్చితమైన కారణాలను చెప్పడం కష్టం. ప్రధానంగా నియంతల నిరంకుశ ధోరణి, జాత్యహంకారం, మతోన్మాదం, రాజ్యవిస్తరణ కాంక్ష వంటివి చరిత్రలో ప్రధాన యుద్ధ కారణాలుగా కనిపిస్తాయి. అయితే, ఇలాంటి పెద్దపెద్ద కారణాల వల్లనే యుద్ధాలు జరుగుతాయనుకుంటే పొరపాటే! చాలా చిల్లరమల్లర కారణాలు కూడా యుద్ధాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.రణ పరిణామం..మొదటి ప్రపంచయుద్ధం నాటికి యుద్ధరంగంలోకి తుపాకులు, ఫిరంగులు, యుద్ధట్యాంకులు, బాంబులను జారవిడిచే యుద్ధవిమానాలు, జలమార్గం నుంచి దాడులు చేసే యుద్ధనౌకలతో పాటు ప్రమాదకరమైన రసాయనిక ఆయుధాలు కూడా వచ్చిపడ్డాయి. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబులు అందుబాటులోకి వచ్చాయి. జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్ బలగాలు జారవిడిచిన అణుబాంబుల పర్యవసానాలు తెలిసినవే! మొదటి రెండు ప్రపంచయుద్ధాలూ కోట్ల సంఖ్యలో ప్రాణాలను కబళించాయి. ఈ యుద్ధాలు మానవాళికి అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. అలాగని యుద్ధాలు సమసిపోలేదు. రెండు ప్రపంచయుద్ధాల తర్వాత కూడా అనేక యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి. కొన్ని అంతర్యుద్ధాలు, ఇంకొన్ని ప్రచ్ఛన్నయుద్ధాలు, మరికొన్ని ప్రత్యక్ష యుద్ధాలు– ఒక్కొక్క యుద్ధంలో సాంకేతిక ఆయుధాలు పదునెక్కుతూ వస్తున్నాయి. ఇప్పటి యుద్ధాల్లో రణయంత్రాలే రణతంత్రాలను నిర్దేశిస్తున్నాయి. కృత్రిమ మేధ యుద్ధాల తీరుతెన్నులనే మార్చేస్తోంది.రోబో సైనికులు..పాతకాలంలో సైనికులు పరస్పరం ఎదురుపడి తలపడేవారు. ఒక్కోసారి ఏ కొండల చాటునో, గుట్టల చాటునో మాటువేసి దొంగదాడులతో శత్రుబలగాల మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు రోజులు మారాయి. యుద్ధరంగంలోకి రోబో సైనికులను దించుతున్నారు. వీటిని ఎక్కడో ఉంటూ రిమోట్ ద్వారా నియంత్రిస్తూ, శత్రువులను మట్టుబెట్టగలుగుతున్నారు. అలాగే, శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా నిరోధించగలుగుతున్నారు. రోబో సైనికులు ఆయుధాలను ప్రయోగించడమే కాకుండా, శత్రువులు అమర్చిన మందుపాతరలను తొలగించడం, బాంబులను ఏరివేయడం వంటి పనులు కూడా చేయగలవు. అమెరికా, చైనా వంటి దేశాలు ఇప్పటికే రోబో సైనికులను రూపొందించుకున్నాయి.వీటిలో కృత్రిమ మేధతో పనిచేసేవి కూడా ఉండటం విశేషం. ఈ రోబోసైనికులు యుద్ధరంగంలో సైనికుల పనిని సులభతరం చేస్తాయి. దాడులకు తెగబడే శత్రుబలగాలను తిప్పికొట్టడం, శత్రువులపై కాల్పులు జరపడం, శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం వంటి పనులను సునాయాసంగా చేస్తాయి. దక్షిణ కొరియా సైన్యం కాపలా విధుల కోసం సెంట్రీ రోబోలను ఉపయోగిస్తోంది. అధునాతన తుపాకులను అమర్చిన ఈ సెంట్రీ రోబోలు సైనిక స్థావరాల వద్ద గస్తీ తిరుగుతుంటాయి. శత్రువులను గుర్తించినట్లయితే, కాల్పులు జరుపుతాయి. యుద్ధరంగంలో రోబో సైనికులతో పాటు చాలా దేశాలు వేర్వేరు పనుల కోసం వేర్వేరు రోబోలను కూడా వాడుతున్నాయి.యుద్ధరంగంలో భావి సాంకేతికత..ఇప్పటికే పలు అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలు అగ్రరాజ్యాల అమ్ములపొదిలోకి చేరాయి. ఈ దేశాలు మరిన్ని అధునాతన ఆయుధాలు, వాహనాలు, సైనిక పరికరాల కోసం పరిశోధనలు సాగిస్తున్నాయి. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్, హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ వంటి పరికరాల రూపకల్పన ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. వీటి నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ యుద్ధరంగంలో పనిచేసే సైనికులకు బాగా ఉపయోగపడుతుంది. సౌరశక్తితో పనిచేసే ఈ సిస్టమ్లోని మూడున్నర అంగుళాల స్క్రీన్పై చుట్టుపక్కల వివిధ దిశల్లో ఏం జరుగుతోందో, శత్రువుల కదలికలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూడవచ్చు. హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ 360 డిగ్రీలలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు స్క్రీన్పై ప్రసారం చేస్తుంది.ఇందులోని మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ (ఎంటీఐ) రాడార్ సెన్సర్ దుమ్ము ధూళి పొగ దట్టంగా కమ్ముకున్న చోట కూడా శత్రులక్ష్యాలను 50 మీటర్ల దూరం నుంచి స్పష్టంగా చూపగలుగుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికే హైపర్సోనిక్ మిసైల్స్ను వినియోగంలోకి తెచ్చాయి. అయితే, ధ్వనివేగానికి ఇరవైరెట్ల వేగంతో దూసుకుపోయే హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణుబాంబులను మోసుకుపోగలిగే హైపర్సోనిక్ మిసైల్స్ 2040 నాటికి అందుబాటులోకి రాగలవని అంచనా. రష్యా, చైనా, అమెరికా సైన్యాలు ఈ స్థాయి హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి పోటాపోటీగా ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశాల సైనికబలగాలు హైపర్సోనిక్ యుద్ధవిమానాలను వాడుకలోకి తీసుకొచ్చాయి. సైనిక ప్రయోగాల కోసం, హైటెక్ ఆయుధాల తయారీ కోసం అమెరికా భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమాల కోసం అమెరికా చేసే ఖర్చు 2040 నాటికి ట్రిలియన్ డాలర్లను (రూ.83.50 లక్షల కోట్లు) అధిగమిస్తుందని అమెరికన్ రక్షణరంగ నిపుణుడు పీటర్సన్ చెబుతున్నారు.రష్యా, చైనాలు కూడా హైపర్సోనిక్ మిసైల్స్ రూపకల్పనలో ప్రయోగాలు సాగిస్తున్నాయి. భారీస్థాయిలో విధ్వంసాలు సృష్టించగల అణుబాంబులను మోసుకుపోయి ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల మిసైల్స్ తయారీకి ఈ దేశాలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. వీటికి తోడు దుందుడుకు అధ్యక్షుడు కిమ్జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదకర ఆయుధాల తయారీకి ప్రయోగాలను సాగిస్తోంది. వివిధ దేశాలు డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ తయారీకి ప్రయోగాలు సాగిస్తున్నాయి. రైల్ గన్స్ వంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ప్రభావవంతంగా పనిచేసే ఆయుధాలే అయినప్పటికీ, విద్యుత్తు సరఫరా ఉంటేనే ఇవి పనిచేయగలవు. యుద్ధక్షేత్రంలో విద్యుత్తు సరఫరా కోసం అత్యధిక సామర్థ్యం గల హైడెన్సిటీ మొబైల్ పవర్స్టోరేజ్ సిస్టమ్స్, మినీ న్యూక్లియర్ రియాక్టర్స్ వంటి వాటి తయారీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.కొనసాగుతున్న యుద్ధాలు..ఇప్పటికే ఉక్రెయిన్–రష్యాల మధ్య, ఇజ్రాయెల్– పాలస్తీనా, ఇజ్రాయెల్–లెబనాన్, సూడాన్లోని రెండు వర్గాల సైన్యం మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. వీటి వల్ల ఇప్పటికే చాలా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఈ యుద్ధాలను నిలువరించేందుకు ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర దేశాలు బాహాటంగా వీటిలో ఏదో ఒక పక్షం తీసుకున్నట్లయితే, దాని పర్యవసానంగా మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదు.ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలే కాకుండా, ఇథియోపియా, హైతీ వంటి దేశాల్లోని అలజడులు, ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై పట్టు కోసం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టం. ఈ పరిస్థితులు అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధమే గనుక జరిగితే, జరగబోయే బీభత్సం ఊహాతీతంగా ఉంటుంది. ‘మూడో ప్రపంచయుద్ధంలో ఏ ఆయుధాలతో పోరు జరుగుతుందో నాకు తెలీదు గాని, నాలుగో ప్రపంచయుద్ధంలో మాత్రం మనుషులు కర్రలు, రాళ్లతోనే కొట్టుకుంటారు’ అని ఐన్స్టీన్ ఏనాడో అన్నాడు. మూడో ప్రపంచయుద్ధమే గనుక సంభవిస్తే, దాని దెబ్బకు భూమ్మీద నాగరికత తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. యుద్ధంలో మరణించిన వాళ్లు మరణించగా, అరకొరగా మిగిలిన వాళ్ల మధ్య గొడవలు తలెత్తితే, వాళ్ల పోరాటానికి ఆధునిక ఆయుధాలేవీ మిగిలి ఉండకపోవచ్చు. అప్పుడు ఐన్స్టీన్ మాటలే నిజం కూడా కావచ్చు.రోబో వాహనాలు..దేశాల సైనిక బలగాలు రకరకాల రోబో వాహనాలను వాడుతున్నాయి. డ్రైవర్ లేకుండానే ఇవి ప్రయాణించగలవు. రిమోట్ కంట్రోల్తో వీటిని సుదూరం నుంచి నియంత్రించవచ్చు. వీటిలో కొన్నింటికి ఆయుధాలను అమర్చి యుద్ధరంగానికి పంపే వెసులుబాటు ఉంది. వీటి ద్వారా శత్రుస్థావరాలను ఇట్టే మట్టుబెట్టవచ్చు. కొన్ని రకాల రోబో వాహనాలను శత్రువులు అమర్చిన మందుపాతరలను, బాంబులను నిర్వీర్యం చేయడానికి కూడా వాడుతున్నారు. రోబో వాహనాల్లో యుద్ధట్యాంకుల స్థాయి వాహనాల నుంచి బాంబులు, మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ఆటబొమ్మల్లా కనిపించే చిన్న చిన్న రోబో వాహనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, అమెరికన్ బలగాలు ఉపయోగిస్తున్న ‘గార్డ్బో’ అనే రోబో వాహనం చూడటానికి బంతిలా ఉంటుంది. ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటిలోను ఇది సునాయాసంగా ప్రయాణించగలదు.ఇది గస్తీకి, నిఘా పనులకు ఉపయోగపడుతుంది. అమెరికన్ బలగాలు వాడుతున్న ‘మాడ్యులర్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్’ (మార్స్) మనుషులు నడిపే యుద్ధట్యాంకులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిని మనుషులు నేరుగా నడపాల్సిన పనిలేదు. రిమోట్ కంట్రోల్తో దీనిని సుదూరం నుంచి నియంత్రంవచ్చు. దీనికి అమర్చిన ఫిరంగులతో శత్రుస్థావరాలపై దాడులు జరపవచ్చు. బ్రిటిష్ సైన్యం ఉపయోగించే డ్రాగన్ రన్నర్ చూడటానికి చిన్న పిల్లల ఆటబొమ్మలా ఉన్నా, ఇది చాలా సమర్థమైన రోబో వాహనం. రిమోట్తో నడిచే ఈ వాహనం మందుపాతరలను, పేలని బాంబులను ముప్పయి అడుగుల దూరం నుంచి గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. చైనా సైన్యం రోబో ఆర్మ్డ్ డాగ్ను ఇటీవల రంగంలోకి దించింది. ఇది చూడటానికి ఆటబొమ్మలా కనిపిస్తుంది గాని, దీనికి అమర్చిన ఆటోమేటిక్ గన్ ద్వారా కాల్పులు జరపగలదు. దీనిని రిమోట్ ద్వారా సుదూరం నుంచి ఉపయోగించుకోవచ్చు.మన అమ్ములపొదిలోనూ ఏఐ ఆయుధాలు..- రాజ్యాలకు పోటీగా భారత్ కూడా రోబోటిక్ ఆయుధాలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది.హైదరాబాద్కు చెందిన ‘జెన్ టెక్నాలజీస్’ భారత సైన్యం కోసం ‘ప్రహస్త’ పేరుతో రోబో జాగిలాన్ని, ‘హాక్ ఐ’ పేరుతో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను సైతం గుర్తించగలిగే యాంటీ డ్రోన్ సిస్టమ్ను, ‘స్థిర్ స్టాబ్–640’ పేరుతో నేలపై తిరిగే యుద్ధ వాహనాలతో పాటు యుద్ధనౌకల నుంచి ఆయుధాలను గురి తప్పకుండా ఉపయోగపడే పరికరాన్ని, ‘బర్బరీక్’ పేరుతో అల్ట్రాలైట్ రిమోట్ కంట్రోల్ కంబాట్ వెపన్ స్టేషన్ను రూపొందించింది. వీటన్నింటినీ దూరం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి ఇవి సమర్థంగా ఉపయోగపడతాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.స్మార్ట్ ఆయుధాలు..‘స్మార్ట్’యుగం. స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చిన తరుణంలోనే వివిధ దేశాల సైనిక బలగాలు తమ ఆయుధాగారాల్లోకి స్మార్ట్ ఆయుధాలను కూడా చేర్చుకుంటున్నాయి. వీటిలో స్మార్ట్ గ్రనేడ్ లాంచర్లు, డిజిటల్ రివాల్వర్లు వంటివి ఉన్నాయి. అమెరికన్ సైన్యం దశాబ్దం కిందటే స్మార్ట్ గ్రనేడ్ లాంచర్ను వినియోగంలోకి తెచ్చింది. ‘ఎక్స్ఎం25 కౌంటర్ డిఫిలేడ్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సిస్టమ్’ (సీడీటీఈ) గ్రనేడ్ లాంచర్ను అఫ్గాన్ యుద్ధంలో ఉపయోగించింది. దీని నుంచి ప్రయోగించిన గ్రనేడ్లు లక్ష్యం వైపుగా దూసుకుపోయి సరిగా లక్ష్యంపైన లేదా లక్ష్యానికి అత్యంత చేరువలో గాల్లోనే పేలుతాయి. ఇవి 150 మీటర్ల నుంచి 700 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. డిజిటల్ రివాల్వర్లను స్మార్ట్వాచ్ ద్వారా లాక్ లేదా అన్లాక్ చేసుకోవచ్చు. ఆటబొమ్మల్లా కనిపించే ఈ డిజిటల్ రివాల్వర్లను పలు దేశాల సైనిక బలగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. సైన్స్ఫిక్షన్ సినిమాల్లో కనిపించేలాంటి చిత్రవిచిత్రమైన ఆయుధాలు కూడా ప్రస్తుతం విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. ఉదాహరణకు హాలీవుడ్ సినిమా ‘మైనారిటీ రిపోర్ట్’లో పోలీసు బలగాలు ‘సిక్ స్టిక్స్’ అనే ఆయుధాలు ఉపయోగించిన దృశ్యాలు ఉన్నాయి.‘సిక్ స్టిక్స్’ ఎవరిని తాకినా వారికి వెంటనే వాంతులవుతాయి. ఈ సినిమా 2002లో విడుదలైతే, 2007 నాటికల్లా దాదాపు ఇలాంటి ఆయు«ధాలే ‘వోమిట్ గన్స్’ వాడుకలోకి వచ్చేశాయి. ఇవి ప్రాణాంతకమైన ఆయుధాలు కాకున్నా, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగపడతాయి. వీటి నుంచి వెలువడే రేడియో తరంగాలు లక్ష్యం దిశగా ప్రయాణించి, చెవులు గింగుర్లెత్తి, తలతిరిగేలా చేస్తాయి. వీటి బారి నుంచి క్షణాల్లోనే తప్పించుకోకుంటే, ఇవి వాంతులయ్యేలా చేస్తాయి. అమెరికన్ నావికాదళం కోసం ‘ఇన్వోకాన్’ కంపెనీ ఈ ‘వోమిట్ గన్స్’ను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే టాక్టికల్ డ్రోన్స్, అన్మేన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్లేన్స్, అటానమస్ ట్యాంక్స్, అటానమస్ వెపన్స్ వంటివి కూడా స్మార్ట్ ఆయుధాల కోవలోకే వస్తాయి. సంపన్న దేశాలు పోగేసుకుంటున్న ఇలాంటి ఆయుధాలు భారీస్థాయిలో విధ్వంసాలను సృష్టించగలవు. – పన్యాల జగన్నాథదాసు -
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్బ్లాడర్లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్ -
ఇంటిని శుభ్రం చేసే రోబోట్లు.. ధర ఎంతంటే?
ఇంట్లోని నేల, గోడలు శుభ్రం చేయడం ఒక ఎత్తు అయితే, కిటికీలను శుభ్రం చేయడం మరో ఎత్తు. కిటికీలను ఇంటి లోపలి వైపు భాగాన్ని ఎలాగోలా శుభ్రం చేయవచ్చు. వెలుపల ఉన్న భాగాన్ని శుభ్రం చేయడం కష్టమే! అంతస్తుల కొద్ది నిర్మించిన అపార్ట్మెంట్లలోనైతే ఇది మరీ పెద్ద సమస్య. అంత శ్రమ లేకుండా కిటికీలను అన్ని వైపుల నుంచి ఇట్టే శుభ్రపరచగల రోబోను అమెరికన్ కంపెనీ ‘ఇకోవాక్స్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ‘విన్బో డబ్ల్యూ2’ పేరిట కిటికీలను శుభ్రం చేసే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఇటీవల జరిగిన ‘సీఈఎస్–2024’ షోలో సందర్శకులను ఆకట్టుకుంది. స్విచాన్ చేసుకుంటే చాలు, మనకు ఎలాంటి శ్రమ కలిగించకుండా ఇది కిటికీలను తళతళలాడేలా శుభ్రపరుస్తుంది. కిటికీ అద్దాలపై పేరుకున్న దుమ్మును మూల మూలల నుంచి తొలగిస్తుంది. వాటిపై ఉన్న మరకలను పూర్తిగా తుడిచేస్తుంది. దీని ధర 339.99 డాలర్లు (రూ.28,267) మాత్రమే! -
అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!
లాస్ వేగాస్లో అట్టహాసంగా జరుగుతున్న 2024 సీఈఎస్ ఈవెంట్లో అత్యుత్తమ ఉత్పత్తులు కనివిందు చేస్తున్నాయి. ఈ ఈవెంట్లో సాధారణ ఉత్పత్తులకంటే కూడా కొత్త టెక్నాలజీతో అబ్బురపరిచే గ్యాడ్జెట్స్, వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కథనంలో ఏఐ (AI) టెక్నాలజీ కలిగిన ఉత్తమ గాడ్జెట్లను గురించి వివరంగా తెలుసుకుందాం. బల్లీ (BALLIE) సీఈఎస్ వేదికపై కనిపించిన ఉత్తమ ఏఐ ఉత్పత్తులలో ఒకటి 'బల్లీ'. శామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసిన ఈ గ్యాడ్జెట్ చూడటానికి చిన్న బాల్ మాదిరిగా ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం దానికదే సాటి అని చెప్పాలి. నిజానికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ డివైజ్ అయినప్పటికీ.. ఇంట్లో చాలా పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెల మీద, పైకప్పు మీద కూడా ప్రాజెక్ట్ చేయగల కెపాసిటీ కలిగిన బల్లీ.. ఈవెంట్లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాడ్జెట్ ధర, వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. (Image credit: Future) LG స్మార్ట్ హోమ్ ఏజెంట్ శామ్సంగ్ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా.. LG కంపెనీ కూడా ఓ స్మార్ట్ హోమ్ ఏజెంట్ను ఆవిష్కరించింది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ గ్యాడ్జెట్ ఒక స్మార్ట్ హబ్. ఇది ChatGPT వాయిస్తో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని పర్యవేక్షించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఈ ఏఐ రోబోటిక్ ధర కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. (Image credit: LG) సెగ్వే నవిమో (SEGWAY NAVIMOW) సెగ్వే నవిమో అనేది ఓ రోబోట్ లాన్మూవర్స్. నిజానికి రోబోట్ లాన్మూవర్స్ ఈ రోజు ఆలోచన కాదు. అయితే సీఈఎస్ వేదికపై కనిపించిన ఈ సెగ్వే నవిమో ఏఐ టెక్నాలజీ కలిగిన గ్యాడ్జెట్. ఇది బ్లేడ్హాల్ట్ సెన్సార్, రెయిన్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, విజన్ఫెన్స్ సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అమెరికాలో ఈ గ్యాడ్జెట్ ధరలు అందుబాటులో లేదు కానీ.. యూరప్ మార్కెట్లో 1300 డాలర్ల ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. (Image credit: Segway) ఓరో (ORO) శామ్సంగ్, LG గ్యాడ్జెస్ట్స్ కంటే కూడా ఓరో అనేది పెంపుడు జంతువులకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది.పెద్ద పెద్ద కళ్ళు కలిగిం ఈ పరికరం బంతిని విసరడం, ఆహారాన్ని అందించడం వంటివి చేసేలా రూపొందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని ధర 799 డాలర్లు. ఏప్రిల్ నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పుడు దీనిని 299 డాలర్ల డౌన్పేమెంట్తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. (Image credit: ORo) మొబిన్ (MOBINN) సాధారణంగా గ్యాడ్జెట్స్.. ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో తిరగటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మొబిన్ అనేది మెట్లను కూడా ఎక్కగలదు. ఫ్లెక్సిబుల్ వీల్స్తో కూడిన ఈ రోబోట్ మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. LiDAR-బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్ను కలిగిన మొబిన్ వర్షం, మంచు, రాత్రి సమయంలో కూడా పని చేస్తుంది. సంస్థ ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ డేట్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. (Image credit: MOBINN) లూనా (LOONA) సాధారణంగా ఎవరైనా తమను ఎంటర్టైన్ చేయడానికి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే లూనా అనే రోబోట్ పెంపుడు జంతువులకు ఏ మాత్రం తీసిపోదు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ChatGPT ఆధారంగా పనిచేస్తుంది. ఇది కదిలే హోమ్ మానిటర్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్గా పనిచేస్తుంది. దీని ధర 380 డాలర్ల వరకు ఉంటుంది. (Image credit: keyirobot) రోబోట్ వాక్యూమ్ రోబోట్ వాక్యూమ్ అనేది వాయిస్ అసిస్టెంట్, రోబోట్ ఆర్మ్, వీడియో కాలింగ్ ఫంక్షనాలిటీ వంటి వాటిని పొందుతుంది. CES 2024 వేదికగా కనిపించిన అద్భుతమైన గ్యాడ్జెట్లలో ఇది కూడా ఒకటి. మరొక పరికరం అవసరం లేకుండా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ పరికరం లోపల ఉండే కెమెరా యజమానికి కాల్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రోబోట్ వాక్యూమ్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
నిప్పుకు ఇక చెక్
సాక్షి, అమరావతి: అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆకాశం నుంచి ఎగురుకుంటూ డ్రోన్లు వచ్చేస్తాయ్. మంటలు చెలరేగిన భవనాల్లోకి చకచకా వెళ్లి మంటల్ని అదుపుచేసే రోబోలు సైతం రాబోతున్నాయ్. త్వరలో రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధునాతన సాధనా సంపత్తిని సంతరించుకోనుంది. అగ్ని ప్రమాదాలకు తక్షణం చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర అగ్నిమాపక వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం రాష్ట్ర విపత్తుల స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక వ్యవస్థలకు ఆధునిక పరికరాలను సమకూర్చేందుకు ప్రణాళికను ఆమోదించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు రూ.295 కోట్లతో కార్యాచరణ చేపట్టింది. ఇరుకైన ప్రదేశాలు.. ఎత్తైన భవనాల్లోకీ వెళ్లేలా.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరాలు, పట్టణాల జనాభా అధికంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా నగర, పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. పెద్దపెద్ద ఆకాశ హార్యా్మలు, పలు కంపెనీలు నిర్మాణం సర్వసాధారణంగా మారింది. అటువంటి ఎత్తైన భవనాలు, కంపెనీల కార్యాలయాలతోపాటు నగరాలు, పట్టణాల్లో ఇరుకైన ప్రదేశాల్లో పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేయడం సవాల్గా మారింది. ఫైర్ ఇంజిన్లు, ఇతర అగ్నిమాపక వాహనాలు, పరికరాలను ప్రమాదం సంభవించిన ప్రదేశానికి తీసుకువెళ్లి మంటలను అదుపు చేయడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా కనిష్ట సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి మొత్తం రూ.295 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 50 శాతం నిధులతో ఆధునిక అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో అగ్నిమాపక డ్రోన్లు, రోబోలతోపాటు ఎత్తైన భవనాల్లో చెలరేగే మంటలను అదుపు చేసేందుకు ఉపయోగించే హైడ్రాలిక్ ప్లాట్ఫారాలతోపాటు 16 రకాల ఆధునిక పరికరాలు ఉండటం విశేషం. మరో 30 శాతం నిధులతో కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం, 20 శాతం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలుగా గుర్తించి వాటిని వినియోగించనుంది. కొనుగోలు చేయనున్న పరికరాలు ♦ అగ్ని మాపక డ్రోన్లు, అగ్నిమాపక రోబోలు ♦హైడ్రాలిక్ ప్లాట్ఫారాలు, టర్న్ టేబుల్ ల్యాడర్లు ♦ ఇరుకు ప్రదేశాల్లోకి వెళ్లగలిగే అగ్నిమాపక మోటారు సైకిళ్లతో కూడిన మిస్ట్ ఫైటింగ్ యూనిట్లు ♦ హజ్మత్ వ్యాన్లు, అత్యవసర వైద్య సహాయం అందించే మెడికల్ కంటైనర్లు ♦ లైట్ రెస్క్యూ టెండర్లు, మినీ వాటర్ టెండర్లు ♦ క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్సస్ వాహనాలు, రెస్క్యూ బోట్లు ♦ వాటర్ బ్రౌజర్లు, హై ప్రెజర్ పంపులతో కూడిన రెస్క్యూ వాహనాలు ♦ ఫైర్ ఫైటింగ్ ఫిటింగ్స్, సిబ్బందికి రక్షణ కల్పించే పరికరాలు -
కలుపును నిర్మూలించే రోబోలొస్తున్నాయ్!
మన దేశంలో పంట పొలాల్లో కలుపు వల్ల రైతులకు ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం రూ. 1980 కోట్లని నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. పురుగులు, తెగుళ్ల నష్టాలకన్నా కలుపు నష్టమే ఎక్కువని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లెక్కతేల్చింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా స్వతంత్రంగా పనిచేస్తూ కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే రోబోలు (అటానమస్ రొబోటిక్ వీడ్ కంట్రోల్ సిస్టమ్స్) వస్తున్నాయి. కృత్రిమ మేధ, జీపీఎస్, జిఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందిన ‘రోబో కూలీలు’ ఇవి. వీటిల్లో అనేక రకాలున్నాయి. కలుపు తీసే రోబో తనను తానే నడుపుకుంటూ పంట సాళ్లలో వెళ్తూ సాళ్ల మధ్యన, వరుసల్లో మొక్కలు/చెట్ల మధ్యన ఉండే నిర్దేశించిన కలుపు మొక్కల్ని మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి. నాశనం చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. గాలి, మంట (ఫ్లేమ్), చలి గాలి, మైక్రోవేవ్స్, లేజర్ కిరణాలు, వాటర్ జెట్ను ప్రయోగించటం ద్వారా (పంట మొక్కలు, చెట్లకు హాని జరగకుండా) కేవలం కలుపు మొక్కల్ని నిర్మూలించటం ఈ రోబోల ప్రత్యేకత. వీటి ఖరీదెక్కువ. నిర్వహణకు నైపుణ్యం కలిగిన పనివారి అవసరం ఉంటుంది. కూలీల సమస్యను అధిగమించే క్రమంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా డ్రోన్ల మాదిరిగా వీటిని మన దేశంలోనూ వినియోగించే అవకాశాలు ఉన్నాయి. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మరో దిగ్గజ కంపెనీలో 30% ఉద్యోగులపై వేటు... కారణాలు తెలిస్తే షాక్ అవుతారు
-
ఉద్యోగులకు షాక్..వీఆర్ఎస్పై హీరోమోటోకార్ప్ కీలక ప్రకటన!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. మోటో కార్ప్ సంస్థ టూవీలర్ల తయారీలో రోబో టెక్నాలజీని వినియోగించాలని, తద్వారా మరింత ఉత్పాదకత సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా సంస్థలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు హీరో మోటోకార్ప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్యోగులకు వన్టైమ్ సెటిల్మెంట్, వేరియబుల్ పే, మెడికల్ కవరేజ్, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపులు వంటి వాటితోపాటు ఇతర ప్రోత్సహాకాలు ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇక గత రెండేళ్లలో మార్కెటింగ్, ఆర్అండ్డీ, హెచ్ఆర్, ఎలక్ట్రిక్ వాహనాలు విభాగాలకు కొత్త సీఈవోలను సంస్థలోని వారిని ఎంపిక చేసింది. ఫైనాన్స్, ఎలక్ట్రిక్ వాహన విభాగానికి బయటి వ్యక్తులను సీఈవోలుగా నియమించింది. తాజాగా వీఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. -
Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!
వ్యయ నియంత్రణ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్.. లేఆఫ్లు కేవలం ఉద్యోగులకే కాదు.. రోబోలకు కూడా వర్తింపజేసింది. కేఫిటేరియాలలో పనిచేస్తున్న రోబోలకు ఉద్వాసన పలికింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ రోబోల అభివృద్ధి, శిక్షణ కోసం ఎవ్రీడే రోబోట్స్ పేరిట ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ను పూర్తిగా నిలిపివేసిందని ‘వైర్డ్’ కథనం పేర్కొంది. ఆ ప్రాజెక్ట్లో భాగంగా గూగుల్ కార్యాలయాల్లోని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడంతో పాటు వివిధ పనులు చేయడానికి రోబోలను వినియోగించేవారు. ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్లో 200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా చక్రాలపై నడిచే వన్ ఆర్మ్డ్ రోబోలను 100కు పైగా అభివృద్ధి చేస్తున్నారు. వీటని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడం, చెత్తను సేకరించి వేరు చేయడం, తలుపు తెరవడం వంటి పనులు చేసేందుకు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో వీటితో కాన్ఫరెన్స్ రూములు కూడా శుభ్రం చేయించినట్లు ‘వైర్డ్’ కథనంలో వివరించింది. (ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్జీపీటీ!) రోబోలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కోదాని నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని రోబోటిక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యయ నియంత్రణ పరిస్థితుల్లో అంత ఖర్చును భరించడానికి ఆల్ఫాబెట్ సిద్ధంగా లేదు. అందుకే ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్ట్ లాభదాయకం కాదన్న భావనతో దాన్ని నిలిపేసింది. ఆ ప్రాజెక్ట్లో పనిచేసే సిబ్బందిని ఇతర రీసెర్చ్ ప్రాజెక్ట్లలోకి బదిలీ చేసింది. -
మానవ మేధకు మరో రూపం.. హెచ్చరించిన స్టీఫెన్ హాకింగ్!
హాలీవుడ్ నటుడు విల్స్మిత్ 2004లో నటించిన చిత్రం ‘ఐ–రోబోట్’ గుర్తుంది కదా! అందులో రోబోలు మానవ సైకాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అమెరికాలో 2035 నాటికి ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని నిర్మించిన ఊహాజనిత చిత్రమది. పరిస్థితి అంతలా కాకున్నా.. 2045 నాటికి మానవ మేధస్సుతో సమానంగా పోటీపడే సాంకేతిక పరిజ్ఞానం సాధ్యమేనంటున్నారు.. టెక్ నిపుణులు. ప్రస్తుత ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ’ని దాటి మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుని సమస్యలు పరిష్కరించే ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)’ టెక్నాలజీ వస్తుందంటున్నారు. హాంకాంగ్కు చెందిన హన్సన్ రోబోటిక్స్ కంపెనీ 2016లో ఏఐ టెక్నాలజీతో నిర్మించిన ‘సోఫియా’ హూమనాయిడ్ రోబో ప్రోగ్రామింగ్కు అనుగుణంగా పనిచేస్తోంది. అలాగే యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ 2021 డిసెంబర్లో అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీతో నిరి్మంచిన ‘అమెకా’ హూమనాయిడ్ రోబో మానవ ముఖ కవళికలను అర్థం చేసుకోవడంతో పాటు ఎన్నో హావభావాలను పలికిస్తోంది. ఇకపై వచ్చే టెక్నాలజీ మనిíÙతో పోటీపడుతుందని.. అది ఆర్టిఫిíÙయల్ జనరల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతికతతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తాయని చెబుతున్నారు. ఈ రోబోలు మానవ మేధస్సును మించిపోతే ముప్పు కూడా ఉండొచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు. యంత్రానికి ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఏజీఐ.. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషికున్న ఇంగిత జ్ఞానం (కామన్సెన్స్) యంత్రాలకు, సాఫ్ట్వేర్కు ఉండదు. ఒకవేళ యంత్రాలకే ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఆరి్టఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అవుతుందని దీన్ని సమర్థించేవారు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్లో ఏజీఐ అనేది సమగ్రమైన, పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాలు గల తెలివైన వ్యవస్థగా అభివరి్ణస్తున్నారు. ప్రస్తుతం ఏ పనిచేయాలన్నా టెక్నాలజీ, సాఫ్ట్వేర్ తప్పనిసరిగా మారింది. అయితే, వాటిలో సాంకేతిక సమస్య ఎదురైతే నిపుణులైన వారే సరిచేయాలి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. అయితే, టెక్నాలజీలో ఏ సమస్య ఎదురైనా ఏజీఐ గుర్తించి పరిష్కరిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక కాలంలో మనిషి చేయగల ఏ పనినైనా ఏజీఐ వ్యవస్థ చేస్తుందంటున్నారు. ప్రస్తుతానికి నూరు శాతం పనిచేసే ఏజీఐ వ్యవస్థ లేకపోయినప్పటికీ.. అత్యంత బలమైన ఈ కృత్రిమ మేధస్సును టెక్ దిగ్గజ సంస్థ ఐబీఎం తయారు చేసిన వాట్సన్ సూపర్ కంప్యూటర్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలోను కొంతమేర వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ఎలాంటి డేటానైనా అద్భుతమైన వేగంతో యాక్సెస్ చేయడంతోపాటు ప్రాసెస్ చేస్తుందంటున్నారు. అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో మానవ మెదడు కంటే వందల రెట్లు వేగంగా స్పందిస్తుందని పేర్కొంటున్నారు. ఏజీఐ వ్యవస్థ ఇంగిత జ్ఞానం, నిశిత ఆలోచన, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ లెరి్నంగ్ వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్లమనిíÙలాగే సృజనాత్మకంగా ఆలోచిస్తుందని చెబుతున్నారు. ఏజీఐతో ఏ పనైనా సుసాధ్యమే.. ప్రస్తుతం ఏజీఐ టెక్నాలజీని కొన్ని విభాగాలలో కొంతమేర వినియోగిస్తున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐబీఎం వాట్సన్ సూపర్ కంప్యూటర్లు సగటు కంప్యూటర్ చేయలేని గణనలను చేయగలవని అంటున్నారు. వీటిని పూర్తిస్థాయి ఏజీఐ టెక్నాలజీతో అనుసంధానం చేస్తే విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. రోగి డేటా ఆధారంగా ఔషధాలను కూడా సిఫారసు చేయవచ్చంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వినియోగిస్తే.. రోడ్డుపై ఇతర వాహనాలు, వ్యక్తులు, వస్తువులను గుర్తించడంతో పాటు డ్రైవింగ్ నిబంధనలకు కట్టుబడి ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు. ప్రమాదాలను ముందుగానే నూరు శాతం గుర్తించి గమనాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని వివరిస్తున్నారు. ఏఐ అటార్నీగా పిలిచే ‘రోస్ ఇంటెలిజెన్స్’ (న్యాయ నిపుణుల వ్యవస్థ)లోని ఒక బిలియన్ టెక్ట్స్ డాక్యుమెంట్ల డేటాను విశ్లేషించి.. సంక్లిష్టమైన ప్రశ్నలకు మూడు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో సమాధానం చెప్పగలదని ప్రయోగాలు నిరూపించాయంటున్నారు. అయితే, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 2014లో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఏజీఐ సాధ్యమే.. పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందితే అది మానవజాతిని అంతం చేస్తుంది. ఇది తనంత తానుగా నిర్ణయాలు తీసుకుంటుంది.. మానవులు దానితో పోటీ పడలేరు’’ అని హెచ్చరించారు. అయినప్పటికీ, కొంతమంది ఏఐ నిపుణులు ఏజీఐ టెక్నాలజీ అవసరమని భావిస్తున్నారు. దీనిపై పనిచేస్తున్న అమెరికాకు చెందిన కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ 2029కి కంప్యూటర్లు మానవ మేధస్సు స్థాయిని సాధిస్తాయని స్పష్టం చేస్తున్నారు. 2045 నాటికి ఏజీఐ టెక్నాలజీ, మానవ మేధస్సు సమానంగా పనిచేస్తాయని తెలిపారు. ‘ఏఐ’ని మించిన టెక్నాలజీ.. సిద్ధాంతపరంగా మనిషి ఏ పనిచేసినా మేధస్సును ఉపయోగించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మనిíÙకంటే మెరుగ్గా, చురుగ్గా పనిచేస్తేనే టెక్నాలజీకి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ టెక్నాలజీ మనిషి చేసే కొన్ని నిర్దిష్ట పనులు మాత్రమే చేయగలుగుతుంది. అంటే.. కంప్యూటర్ సాఫ్ట్వేర్లో సమస్య ఎదురైతే హెచ్చరిస్తుంది గాని సమస్యను పరిష్కరించలేదు. వాహనాల్లో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ ప్రమాదాలను గుర్తించి హెచ్చరిస్తుంది గాని ఆపలేదు. ఇప్పటికే ఉన్న అనేక ఏఐ సిస్టమ్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, నిర్దిష్ట సమస్యలు పరిష్కరించడానికి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఫోర్స్మెంట్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు అవసరమవుతాయి. అయితే, ఇవేమీ మానవ మెదడు సామర్థ్యాన్ని చేరుకోలేకపోయాయి. అయితే ఏజీఐ టెక్నాలజీ మాత్రం మానవ సామర్థ్యాలతో సమానంగా లేదా అంతకు మించిన కృత్రిమ మేధస్సుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్న నిపుణులు భవిష్యత్లో పూర్తి స్థాయి ఏజీఐ టెక్నాలజీ సాధ్యమేనంటున్నారు. (నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి) -
Sagubadi: గాల్లో ఎగురుతూ పండ్లు కోసే రోబోలు! ఆపిల్స్, అవకాడో, పియర్స్..
పండ్ల కోత కూలీలు సమయానికి దొరక్క రైతులు నానా యాతన పడుతూ ఉంటారు. కూలీల కొరత వల్ల కోత ఆలస్యం కావటం, నాణ్యత కోల్పోవటం.. రైతులు ఆశించిన ధర దక్కకపోవటం చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా కోత కూలీలు దొరక్క ఏటా 3 వేల కోట్ల డాలర్ల మేరకు రైతులు నష్టపోతున్నారు. రెండు వారాలు ఆలస్యంగా కోసిన పండ్ల వెల 80% తగ్గిపోతున్నదట. 2050 నాటికి 50 లక్షల మంది పంట కోత కార్మికుల కొరత నెలకొంటుందని అంచనా. కోసే వాళ్లు లేక 10% పండ్లు కుళ్లిపోతున్నాయట. ఈ సమస్యకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపుతోంది. ఎత్తయిన చెట్ల నుంచి పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే సుతిమెత్తగా పట్టుకొని కోసి తెచ్చే రోబోలు వచ్చేశాయి. PC: Kubota తోటలో నేల మీద కదులుతూ స్ట్రాబెర్రీలు, కూరగాయలు, పండ్లను కోసే రోబోలు వున్నాయి. అయితే, గాలిలో ఎగురుతూ ఎత్తయిన చెట్ల నుంచి పండ్లు కోసే రోబోలను కూడా తాజాగా ఇజ్రాయెల్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ విజయవంతంగా రూపొందించింది. ఇజ్రాయిల్కు చెందిన టెవెల్ ఏరోబోటిక్స్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి స్వతంత్రంగా ఎగురుతూ చెట్ల నుంచి పండ్లను కోసే రోబోలను తయారు చేసింది. ఈ రోబోలకు మీటరు పొడవుండే ఇనుప చెయ్యిని బిగించారు. కోయాల్సిన పండు రకాన్ని బట్టి ఈ చేతిలో తగిన మార్పులు చేస్తారు. అత్యాధునిక కృత్రిమ మేథను కలిగి ఉన్నందున ఏ రంగు, ఏ సైజు పండు కొయ్యాలి? ఏది అక్కర్లేదు? అనే విషయాన్ని ముందుగానే వీటికి ఫీడ్ చేస్తారు. ఆ సమాచారం మేరకు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా సెన్సార్లు, కామెరాల సహాయంతో ఈ రోబోలు పనిచేస్తున్నాయి. పక్వానికి వచ్చిన పండ్లనే కచ్చితంగా గుర్తించి కోయగలుగుతున్నాయని టెవెల్ ఏరోబోటిక్స్ సీఈవో యనివ్ మోర్ తెలిపారు. ఒక వ్యాన్పై నాలుగు పండ్లు కోసే రోబోలను వైర్లతో అనుసంధానం చేస్తారు. అవి చెట్లపై ఎగురుతూ పండ్లను కోసి, వాటిని జాగ్రత్తగా వ్యాన్పై పెడతాయి. ఈ రోబోలు ఒక ఆప్తో అనుసంధానమై ఉండి రైతుకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. ఎంత మొత్తంలో పండ్ల కోత పూర్తయ్యింది? ఏదైనా పురుగుమందు లేదా చీడపీడల ప్రభావం ఉందా? అనే విషయాన్ని కూడా రైతుకు తెలియజేస్తాయి. ఆపిల్స్ నుంచి అవకాడో వరకు అనేక రకాల పండ్లను ఈ రోబోలు అవలీలగా రాత్రీ పగలు నిరంతరాయంగా కోస్తున్నాయని కంపెనీ చెప్తోంది. ఆపిల్స్, అవకాడో, పియర్స్, నారింజ తదితర పండ్ల కోత పరీక్షల్లో చక్కని ఫలితాలు వచ్చాయి. సాధారణంగా రెండున్నర ఎకరాల్లో పండ్ల కోతకు ఒక ఎగిరే రోబో సరిపోతుందట. అయితే, చెట్ల వయసు, పండ్ల రకం, సైజులను బట్టి ఎంత తోటకు ఎన్ని రోబోలు అవసరమవుతాయన్నది ఆధారపడి ఉంటుంది. ‘గాలిలో ఎగురుతూ పండ్లను కోసే రోబోలు మావి మాత్రమే. ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తున్నాం’ అంటున్నారు ఆ కంపెనీ సీఈవో. సుమారు 3 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఐదేళ్లు పరిశోధించి కంపెనీ ఈ వినూత్న రోబోలను తయారు చేసింది కదా.. ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందిగా మరి! మన దేశంలో ఎంత ధరకు అమ్ముతారో వేచి చూద్దాం... చదవండి: Sagubadi: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఇలా తయారు చేసుకోండి.. కోకోపోనిక్స్ సాగులో.. -
మెర్సిడెజ్ బెంజ్: విధుల నుంచి రోబోట్ల తొలగింపు, ఉద్యోగుల నియామకం!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల తయారీలో రోబోట్ల కంటే మనుషులే మేలని నమ్ముతుంది. అందుకే ప్రస్తుతం కార్ల మ్యానిఫ్యాక్చరింగ్లో ఉన్న రోబోట్లను తొలగించింది. వాటి స్థానంలో మనుషుల్ని నియమించనుంది. జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్, ఎలక్ట్రిక్ అవతార్ మెర్సిడెస్ ఈక్యూఎస్, మేబాక్, ఏఎంజీ వెహికల్స్ తయారు చేసిన ఫ్యాక్టరీ 56లో, అలాగే ఓల్డ్ ఫ్యాక్టరీ 46లో గతంలో ఉన్న 25-30శాతం రోబోట్లలో 10 కంటే తక్కువకు తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగా, లగ్జరీ కార్ల తయారీదారు ఇప్పుడు కంబస్టివ్-ఇంజిన్, అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను అదే స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎందుకంటే రోబోట్లు కార్ల తయారీని ఒక్కో పని మాత్రమే చేస్తాయి. అదే మనుషులైతే ఒకే సారి పలు మోడళ్లను తయారు చేసే సామర్ధ్యం ఉందని నమ్ముతుంది. ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్ సైట్ మేనేజర్ మైఖేల్ బాయర్ మాట్లాడుతూ..రోబోట్లను మనుషులు భర్తీ చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ సామర్ధ్యం పెంచుతుందని బౌయర్ వివరించాడు. వినియోగదారుల డిమాండ్ పెరిగే కొద్ది కార్ల తయారీలో ఉపయోగించే టెక్నాలజీల్లో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణమని అన్నారు. -
రోబోలొచ్చేస్తున్నాయ్.. జాగ్రత్త
రోబోల రాకతో.. ఇప్పటికే ఉద్యోగాల విషయంలో మనకు గడ్డు కాలం మొదలైంది.. భవిష్యత్తులో అది మరింత పెరగనుందనడానికి సూచిక ఈ చిత్రం. ఇది లండన్లోని ఓ భారీ గోదాము.. ఇక్కడ మనుషులకు బదులు రోబో కాదు.. రోబోల సైన్యమే ఉంది. సుమారు 35 సూపర్ మార్కెట్లకు సమానమైన ఈ గోడౌన్లో సుశిక్షితులైన సిబ్బంది చేసే దానికన్నా ఐదురెట్ల వేగంతో ఇవి పనికానిచ్చేస్తున్నాయి. ఇంతకీ ఏం చేస్తున్నాయి.. బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత ఆన్లైన్ గ్రాసరీ వెబ్సైట్ ఒకాడో తమ వినియోగదారులకు వీలైనంత త్వరగా సరుకులను సిద్ధం చేసేందుకు నూతన పంథాను ఎంచుకుంది. లండన్లో 5,63,000 చదరపు అడుగుల్లో ఉన్న తమ గోదాములో సుమారు 50 వేల రకాల వస్తువులను... ఆర్డర్లు అందిన వెంటనే డెలివరీ బాయ్స్కు అందించేందుకు వీలుగా 2 వేలకుపైగా రోబోలను వినియోగిస్తోంది. 8 చక్రాలతో పరుగులు తీసే ఈ రోబోలు తేనెతుట్టె గదులను పోలినట్లుగా ఉండే నిలువాటి పెట్టెల్లో అమర్చిన స్టాక్ను క్షణాల్లో సేకరించేస్తున్నాయి. తమకున్న ‘చేతుల’తో వస్తువులను అందుకొని వాటిని నిలువాటి గొట్టంలో వేయడం ద్వారా పికప్ స్టేషన్లోని సిబ్బంది వద్దకు పంపుతున్నాయి. ఈ రోబోలు 20 గంటలపాటు నిర్విరామంగా పనిచేస్తూ ఒక షిఫ్టులో ఏకంగా 20 లక్షల ఆహార వస్తువులను పెట్టెల్లోంచి తీసుకెళ్తున్నాయి. ఏ పెట్టెలో ఏమేం వస్తువులు ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు.. పక్కదాన్ని ఢీకొనకుండా ఎలా వెళ్లాలో ముందే సిద్ధం చేసిన కంప్యూటర్ అల్గోరిథమ్ ద్వారా బాట్స్ అని పిలిచే ఈ రోబోలు మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తున్నాయి. ఈ రోబో సైన్యం వల్ల వేలాది మంది సిబ్బంది అవసరం, ఖర్చు తగ్గిందని ఒకాడో తెలిపింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మిలటరీలో మరమనిషి
మనిషిని దేవుడు సృష్టిస్తే, ఆయనకు పోటీగా మరమనిషిని మనిషి సృష్టించుకున్నాడు. అంతటితో ఆగక వాటిని మృత్యురూపాలుగా మారుస్తున్నాడు. వీటి వాడకంతో సంప్రదాయ యుద్ధ రూపురేఖలు మార్చేశాడు. ఇలాగే కొనసాగితే భవిష్యత్లో సృష్టికర్తనే మింగే భస్మాసుర రోబోలు అవతరించడానికి అట్టేకాలం పట్టదంటున్నారు నిపుణులు. మానవ జీవనం మరింత సౌకర్యవంతంగా చేయాలన్న సంకల్పంతో మరమనుషుల రూపకల్పన జరిగింది. కాలక్రమేణా వీటిని మారణహోమం సృష్టించే మిషన్లుగా వాడడం ఆరంభమైంది. సైనిక రంగంలో రోబోల వాడకం నైతికం కాదన్న వాదనలున్నా, వీటి వాడకం మాత్రం పెరిగిపోతూనే ఉంది. యుద్ధరంగంలోకి రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రపంచ యుద్ధ నమూనాలను మార్చివేస్తోంది. ప్రస్తుతం మిలటరీలో ఉన్న రోబోలు అటు పోరాటంతో పాటు ఇటు రెస్క్యూ (కాపాడడం) ఆపరేషన్లలో, పేలుడు పదార్థాలను కనిపెట్టి నిర్వీర్యం చేయడంలో, గూఢాచర్యంలో, రవాణాలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి రాక సాంప్రదాయక యుద్ధ విధానాలను ఒక్కపెట్టున మార్చేసింది. ఆధునిక రోబో సాంకేతికత అందుబాటులో ఉన్న మిలటరీ అత్యంత బలంగా మారుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు నైతికతను పక్కనపెట్టి మరీ, తమ తమ మిలటరీకి మరమనిషి సాయం అందించేందుకు కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 మిలటరీ రోబోల వివరాలు ఇలా ఉన్నాయి. మార్స్ (ఎంఏఏఆర్ఎస్) ► మాడ్యులార్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్కు సంక్షిప్త నామమే మార్స్. ► ఇది మానవ రహిత రోబో. మిలటరీ ఆవసరాల కోసమే తయారు చేశారు. ► దీంట్లో శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థను, కెమెరాలను, ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను అమర్చారు. ► గ్రెనేడ్ లాంచర్ లాంటి భయంకర జనహనన ఆయుధాలను దీనికి అనుసంధానిస్తారు. ► ఈ ఆయుధాలను రిమోట్తో నిర్వహించి విధ్వంసం సృష్టిస్తారు. ► ధర సుమారు 3 లక్షల డాలర్లు. వేగం గంటకు 11 కిలోమీటర్లు. సఫిర్ (ఎస్ఏఎఫ్ఎఫ్ఐఆర్) ► చూడ్డానికి మనిషిలాగా రెండు కాళ్లతో ఉంటుంది. ► డామేజ్ కంట్రోల్లో మనిషి చేయలేని పనులు చేసేందుకు దీన్ని రూపొందించారు. ► ఇది కూడా మానవ రహిత రోబోనే. ► దూరంలో ఉన్న శత్రు నౌకలను పసిగట్టగలదు. నావికాదళంలో వాడుతున్నారు. ► ధర సుమారు 1.5– 2.25 లక్షల డాలర్లు. గ్లాడియేటర్ ► గ్లాడియేటర్ టాక్టికల్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ను సంక్షిప్తంగా గ్లాడియేటర్ అంటారు. ► గూఢచర్యం, నిఘా, నిర్దేశిత లక్ష్యాలను గుర్తించడం, అడ్డంకుల ఛేదనలో ఉపయోగిస్తారు. ► దీంతో పాటు అణు, రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గుర్తించగలదు. ► అవసరమైతే నేరుగా కాల్పులు జరపగలదు. ► ధర దాదాపు 4 లక్షల డాలర్లు. బిగ్డాగ్ ► పేరుకు తగ్గట్లు పెద్ద కుక్క సైజులో ఉంటుంది. ► బోస్టన్ డైనమిక్స్ దీన్ని రూపొందించింది. 100 పౌండ్ల బరువును మోయగలదు. ► ఎలాంటి ఉపరితలాలపైనైనా సులభంగా ప్రయాణం చేస్తుంది. ► దీన్ని మిలటరీ లాజిస్టిక్స్లో వాడుతున్నారు. ► సులభమైన కదలికల కోసం పలు రకాల సెన్సార్లు ఇందులో ఉంటాయి. ► ధర దాదాపు 74 వేల డాలర్లు. డోగో ► ఎనిమిది మైక్రో వీడియో కెమెరాలున్న ఈ రోబో 360 డిగ్రీల కోణంలో చూస్తుంది. ► ఇందులో ఉన్న తుపాకీ గురితప్పకుండా పేల్చేందుకు మరో రెండు బోరోసైట్ కెమెరాలుంటాయి. ► రేంజర్ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తారు. జనరల్ రోబోటిక్స్ తయారు చేస్తోంది. ► ఈ రోబోను భారతీయ ఎన్ఎస్జీ వాడుతోంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పెట్మాన్ ► ప్రొటెక్షన్ ఎన్సెంబుల్ టెస్ట్ మానిక్విన్ సంక్షిప్త నామమే పెట్మాన్. ► ఇది చూడ్డానికి మనిషిలాగా ఉండే హ్యూమనాయిడ్ రోబో. ► మానవ సైనికుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి రూపొందించారు. ► ఇది మనిషిలాగా నడవడం, పాకడం, పరిగెత్తడంతో పాటు చెమట కూడా కారుస్తుంది. ► భవిష్యత్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాడబోతున్నారు. ► దీని రూపకల్పనకు దాదాపు 2.6 కోట్ల డాలర్లు ఖర్చైందని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది. అట్లాస్ ► ఎమర్జెన్సీ సేవల కోసం రూపొందించారు. ► ప్రమాదకరమైన వాల్వులను మూసివేయడం, తెరుచుకోని బలమైన తలుపులను తెరవడం, మనిషి వెళ్లలేని వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్లి రావడం చేయగలదు. ► చూడటానికి మరుగుజ్జులాగా కనిపిస్తుంది. ► గాల్లోకి దూకడం, వేగంగా పరిగెత్తడం చేయగలదు. ► ధర సుమారు 75 వేల డాలర్లు. గార్డ్బోట్ ► రక్షణ మిషన్లలో పాలుపంచుకుంటూనే పరిస్థితులను వీడియో తీసి లైవ్ స్ట్రీమింగ్ చేయగలగడం దీని ప్రత్యేకత. ► గుండ్రంగా బంతిలాగా ఉండే ఈ రోబో ఉభయచర రోబో. ► నేలపై, నీళ్లలో ప్రయాణించగలదు. ► బురద, మంచును లెక్క చేయకుండా దొర్లుకుంటూ పోగలదు. ► నిఘా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పీడీ100 బ్లాక్ హార్నెట్ ► ఫ్లిర్ సిస్టమ్స్ తయారీ. ఎక్కువగా గూఢచర్యంలో ఉపయోగపడతుంది. ► వాడుకలో ఉన్న అతిచిన్న డ్రోన్ రోబో. కీటకం సైజులో కనిపిస్తుంది. ► భారత్ సహా పలు దేశాల మిలటరీలు చాలా రోజులుగా వాడుతున్నాయి. ► దీన్ని అపరేట్ చేసే విధానాన్ని కేవలం 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ► అరగంట చార్జింగ్తో అరగంట పాటు గాల్లో తిరగగలదు. ► గరిష్ఠ వేగం గంటకు 21 కిలోమీటర్లు. ధర దాదాపు 1.95లక్షల డాలర్లు. ఎల్ఎస్3 ► లెగ్గడ్ స్క్వాడ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ► నాలుగు కాళ్లుండే ఈ రోబో సైనికులకు సామాన్లు మోసే గుర్రంలాగా ఉపయోగపడుతుంది. ► ఎలాంటి ఆర్డర్లు లేకుండానే నాయకుడిని ఫాలో కావడం దీని ప్రత్యేకత. ► చిన్న పాటి వాయిస్ కమాండ్స్ను ఆర్థం చేసుకుంటుంది. ► 400 పౌండ్ల బరువును మోయగలదు. ► బిగ్డాగ్ రోబోతో పోటీ పడుతుంది. ► ధర దాదాపు లక్ష డాలర్లు. ఎంతవరకు కరెక్ట్? మిలటరీలో రోబోలను ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగాలున్నాయనేవారికి సమానంగా వీటి వాడకాన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. సైనిక రోబోలతో మానవ సైనికుల ప్రాణాలను రక్షించవచ్చు. మనిషిలాగా వీటికి అలసట రాదు. కనురెప్ప వాల్చకుండా కాపలా కాస్తాయి. వానకు, ఎండకు బెదరవు. మానవ సంబంధ బలహీనతలకు లొంగవు. ముఖ్యంగా యుద్ధమంటే ఏ దశలో కూడా భయం చెందవు. వీటి గురి తప్పదు. వీటితో సమయం ఆదా అవుతుంది. మనిషి చేయలేని పనులను కూడా చేయగలవు. అందుకే వీటిని వాడడం మంచిదేనంటారు సమర్ధకులు. అయితే ఈ వాదనను మానవ హక్కుల కార్యకర్తలు, ఎన్జీఓలు వ్యతిరేకిస్తుంటాయి. కిల్లర్ రోబోల వాడకం నైతిక విలువలకు దూరమని వీరి వాదన. ఎదుటి పక్షం సైనికులు కూడా మనుషులేనని ఇవి గుర్తించవు. వారిని దయాదాక్షిణ్యం లేకుండా ఈ రోబోలు క్రూరంగా మట్టుబెడతాయి. వీటి ఖరీదు చాలా అధికం. అందువల్ల ధనిక దేశాలు మాత్రమే భరించగలవు. ఇది ఆయా దేశాలకు మిగిలిన బలహీన దేశాలపై పైచేయినిస్తుంది. యుద్ధం మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఒక్కమారుగా పరిస్థితి తలకిందులవుతుంది. అన్నిటికి మించి మితిమీరిన సాంకేతికతతో ఈ రోబోలు స్వతంత్రంగా మారితే జరిగే పరిణామాలు భయానకంగా ఉంటాయని కిల్లర్ రోబోల వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ఎవరివాదన ఎలాఉన్నా ప్రస్తుతానికి ప్రభుత్వాలు మాత్రం వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
సరిహద్దుల్లోకి చైనా రోబోట్లు
న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం చైనా సరిహద్దుల్లో మరో కుయుక్తికి తెరలేపింది. అతి శీతల, ఎత్తైన పర్వత ప్రాంతంలో భారత సైన్యంతో ధీటుగా తలపడలేని పీఎల్ఏ (చైనా సైన్యం) మెషిన్ గన్లను బిగించిన రోబోట్లను రంగంలోకి దించింది. ఆయుధాలను, ఇతర సరఫరాలను చేరవేయగలిగే మానవరహిత వాహనాలను అత్యధిక భాగం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోనే ఉంచినట్లు్ల సమాచారం. షార్ప్ క్లా అనే పేరున్న రోబోట్కు తేలికపాటి మెషిన్గన్ బిగించి ఉంటుంది. దీనిని రిమోట్తో ఆపరేట్ చేయవచ్చు. మ్యూల్–200 అనే మరో రోబో కూడా మనుషులతో అవసరం లేకుండానే ఆయుధాలను ఉపయోగించగలదు. టిబెట్ ప్రాంతంలో మోహరించిన మొత్తం 88 ‘షార్ప్ క్లా’రోబోల్లో 38, మ్యూల్ రకానికి చెందిన 120 రోబోల్లో అత్యధికం తూర్పులద్దాఖ్ ప్రాంతంలోనే చైనా మోహరిం చినట్లు సమాచారం. వీటికితోడుగా, సాయుధ బలగాలను తరలించే వీపీ–22 రకానికి చెందిన మొత్తం 70 వాహనాలకు గాను 47 వాహనాలను సరిహద్దుల్లోకి తీసుకువచ్చినట్లు మీడియా పేర్కొంది. అంతేకాకుండా, అన్ని రకాల ప్రాంతాల్లో మోర్టార్లు, శతఘ్నులు, హెవీ మెషిన్గన్ల వంటివాటిని తరలించేందుకు లింక్స్ రకం వాహనాలను కూడా సైన్యానికి తోడుగా సరిహద్దుల్లోనే చైనా ఉంచిందని సమాచారం. -
చిట్టి చిట్టి రోబో కాదు..పిల్లల్ని కనే రోబో
సాక్షి, హైదరాబాద్: రానురాను ప్రతి పనిలోనూ రోబోల వినియోగం పెరుగుతోంది. ఇంట్లో చేసే పని దగ్గర్నుంచి పరిశ్రమల్లో పనుల దాకా మర మనుషుల వాడకం ఎక్కువవుతోంది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సరికొత్త రోబోలను సృష్టిస్తున్నారు. అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇలా రకరకాల రోబోలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. సంచలనాలు నమోదు చేశారు. మరి ఈ ఏటి మేటి రోబోల్లో టాప్–10 ఏంటో ఓ లుక్కేస్తారా! అంగారకుడైనా.. తిరగడం ఆపుతానా? అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా సిద్ధం చేసిన రోబో హెలికాప్టర్ ‘ఇన్జెన్యునిటీ’ఈ ఏటి మేటి రోబోగా చెప్పుకోవాలి. భూమిని దాటి ఇంకో గ్రహంపై సొంతంగా ఎగిరిన తొలి వాహనం ఇదే కావడం ఒక్క విశేషం మాత్రమే. 1.8 కిలోల బరువు ఉండే ఇన్జెన్యుటీ దాదాపు వెయ్యి మీటర్ల దూరం ప్రయాణించగలదు. అంగారకుడిపై ఉన్న పలుచటి వాతావరణాన్ని కూడా చీల్చుకుని ఎగరగల శక్తిమంతమైంది కూడా. రిమోట్ కంట్రోల్ అవసరం లేకపోవడం కొసమెరుపు! వంటేదైనా.. వండిపెట్టేస్తా ఊ అంటే.. కావాల్సిన వంట వంటి పెట్టే రోబో వ్యవస్థ ఈ మోలీ! లండన్ కేంద్రంగా పనిచేస్తున్న మోలీ రోబోటిక్స్ తయారు చేసింది. సూప్తో మొదలు డెజర్ట్ వరకూ షడ్రుచులతో వంటకాలు సిద్ధం చేసేందుకు మోలీలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కావాల్సిన సరుకులను అందించడమే ఆలస్యం చెప్పిన వంటల్లా వండి పెడుతుంది. సరుకులు అయిపోయే విషయమూ ముందే సమాచారమిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసేలా నిర్దిష్ట కేలరీలతో వంటలు చేయడం, ఏ దేశపు రుచినైనా సిద్ధం చేయగలగడం మోలీలోని ఇతర విశేషాల్లో కొన్ని. మర మనిషి.. పని మనిషి ఇంట్లోని చెత్తాచెదారం ఊడవడం, తుడవడం, పాత్రలు తోమి పెట్టడం వంటి వాటి కోసం తయారైంది ఈ మనిషిని పోలిన రోబో. చైనా కంపెనీ ఉబ్ టెక్ తయారు చేసిన దీని పేరు ‘వాకర్ ఎక్స్’. మనిషి ఆకారం, చేతులు, వేళ్లు అన్నీ ఉన్న వాకర్ ఎక్స్ అన్ని రకాల వస్తువులను చాలా జాగ్రత్తగా పట్టుకోగలదు. సీసా మూత తెరిచి అందులోని పదార్థాన్ని గ్లాసుల్లో పోసి అందివ్వడం, మనిషితో సరదాగా లేదా సీరియస్గానైనా చదరంగం ఆడటం, అలసిపోతే ఒళ్లు పట్టి మసాజ్ కూడా చేయగలదు. తలకిందులున్నా.. పని చేస్తే పక్కా అంతర్జాతీయ కార్ల కంపెనీ టయోటా తయారు చేసిన రోబో పనిమనిషి ఇది. గబ్బిలంగా వేలాడుతున్నట్లు కనిపిస్తుంటుంది కానీ ఇంటి పనులన్నీ చక్కబెట్టగలదు. అందుకే ఇది ఇంట్లో ఉండే ఫర్నిచర్, ఇతర వస్తువులన్నింటినీ తప్పించుకుని పనిచేయడం కాకుండా పైకప్పు నుంచి వేలాడుతూ పని చేసేలా తయారు చేశారు. 2015లో సుమారు 7,400 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన టయోటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ఇంటి పనుల కోసమే వేర్వేరు రోబోలను తయారు చేస్తోంది. మహానటి.. మనిషిని, రోబోను వేరుచేసే ఒకే ఒక్క అంశం మన భావోద్వేగాలని ఒకప్పుడు చెప్పేవారు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఈ భావోద్వేగాలను సూచించే ముఖ కవళికలను కూడా రోబోలు సమకూర్చుకున్నాయి. యూకేకు చెందిన ఇంజినీర్డ్ ఆర్ట్స్ అనే సంస్థ సిద్ధం చేసిన ‘అమికా’ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మేలుకో అంటే చాలు.. ఇది గందరగోళం, నిస్పృహ వంటి ఆరు రకాల భావాలను వ్యక్తం చేస్తుంది. చేతులు కాళ్లూ చూస్తూ నోరు తెరిచి ఆవలిస్తుంది. అంతేకాదు నవ్వు, ఆశ్చర్యం, కోపం వంటి అనేక భావాలను ముఖంలోనే పలికించగల మహానటి ఈ రోబో! బరువులెత్తే పనా.. కంగారెందుకు మైహూనా ఒక రకంగా చూస్తే ఇది రోబో కాదు. మనిషి సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే యంత్రం. కాకపోతే ఇందులోనూ రోబోకు ఉండాల్సిన టెక్నాలజీలు వాడారు. అమెరికా కంపెనీ సాక్రోస్ తయారు చేసిన ఈ గార్డియన్ ఎక్స్ ఓ ను తొడుక్కుంటే సూపర్ మ్యాన్లా ఎగరలేము కానీ శరీరానికి అతితక్కువ కష్టంతో 90 కిలోల బరువులెత్తగలం. అలుపు లేకుండా ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయగలం. పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీలతో రెండు గంటలు పనిచేయొచ్చు. నిమిషాల వ్యవధిలో బ్యాటరీలు మార్చుకోవచ్చు. మా రూటే సపరేటు ప్రాణమున్న కణాల మాదిరిగా పునరుత్పత్తి సామర్థ్యమున్న రోబోలు ఈ జీనోబోట్స్. వెర్మాంట్, టఫ్ట్స్ యూనివర్సిటీ, వైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు హార్వర్డ్ యూనివర్సిటీలో కలిసికట్టుగా వీటిని తయారు చేశారు. కప్ప కణాలతో తయారైన ఈ జీనోబోట్స్ పెట్రిడిష్ (గాజు పాత్ర)లో అటూ ఇటూ కదలగలవు. ఏకాకి కణాలను కలుపుకుంటూ కొత్త కణాలను ఉత్పత్తి చేయగలవు. కొన్ని కోట్ల ఆకారాలను పరీక్షించిన తరువాత వెర్మాంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కోర్లోని ఎవల్యూషనరీ అల్గారిథమ్ ఇంగ్లిషు అక్షరం సీ మాదిరిగా ఉండేలా జీనోబోట్ల ఆకారాన్ని నిర్ణయించింది. క్యాన్సర్, వృద్ధాప్యాన్ని నివారించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను వెతికేందుకు ఈ జీనోబోట్స్ ఉపకరిస్తాయని అంచనా. 20 కిలోలైనా ఎత్తుకు తిరిగేస్తా ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా సిద్ధం చేస్తున్న జనరల్ పర్పస్ రోబో. టెస్లాబోట్ లేదా ఆప్టిమస్ అని పిలుస్తున్నారు. ఇప్పటికి తయారు కాలేదు కానీ ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్లా ‘ఏ.ఐ.’డేలో మస్క్ మాట్లాడుతూ 2022 నాటికల్లా సిద్ధమవుతుందని ప్రకటించారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 57 కిలోల బరువుతో మనిషిలాంటి నిర్మాణం ఉన్న ఈ రోబో టెస్లా అభివృద్ధి చేసిన అడాస్ కృత్రిమ మేధ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. ఇరవై కిలోల బరువు ఎత్తుకుని అటు ఇటు తిరగగలదు. ఫ్యాక్టరీల్లో పదే పదే చేయాల్సిన పనులను సులువుగా చక్కబెట్టగలదని అంచనా. నా చేయి.. 7 విధాలు జంతువుల ఆకారాల్లో రోబోలను తయారు చేస్తున్న బోస్టన్ డైనమిక్స్ సిద్ధం చేసిన మరో రోబో ఇది. పేరు స్ట్రెచ్. ఫొటోలో కనిపిస్తున్నట్టే గోడౌన్లలో బరువులు అటు ఇటు ఎత్తి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ప్యాకేజీలను జాగ్రత్తగా పట్టుకోవడం, క్రమపద్ధతిలో అమర్చడం వంటివి కూడా ఎంచక్కా చేసేయగలదు. ఈ రోబో చేయి 7 విధాలుగా తిరగగలదు. వేగంగా కదులుతున్న ప్యాకేజీని స్థిరంగా ఉంచేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. నడిచే చెట్టు.. పరుగెత్తు అవెంజర్స్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన వారికి ఈ క్యారెక్టర్ పరిచయమే. పేరు గ్రూట్. చెట్టు కాండం మాదిరిగా ఉంటుంది. డిస్నీ వరల్డ్కు చెందిన పరిశోధనశాలలో తయారైంది. కొంచెం అటు ఇటుగా రెండు అడుగుల ఎత్తుండే ఈ రోబో మనిషిలాగే నడుస్తుంది. పరుగెత్తుతుంది కూడా. ఇప్పటికింకా తయారీ దశలోనే ఉంది. -
‘యంత్ర’ ముగ్ధులౌతారు
ఆ మధ్య హైదరాబాద్లోని ఓ హోటల్లో రోబోలను పనికిపెట్టారు. వచ్చే వాళ్లకు స్వాగతం చెప్పడం, వాళ్లతో మాటలు కలపడం, భోజనం తీసుకురావడం, వడ్డించడం.. అబ్బో ఇలా రకరకాల పనులను అవే చేయడం చూసి జనం ఆశ్చర్యపోయారు. సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పని చేసే పోలీస్ రోబోలను సృష్టించారు. రోడ్ల మీద ఎవరైనా రూల్స్ను అతిక్రమిస్తే చాలు.. ‘ఏయ్.. సెట్ రైట్’ అని హెచ్చరిస్తున్నాయి ఇవి. ఇదే సింగపూర్లో ఇంటింటికీ వెళ్లి వస్తువులను డెలివరీ చేసే రోబోలూ అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలేమో సరిహద్దుల్లో గస్తీ కాస్తూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే రోబోలను ఆవిష్కరించారు. వీటన్నింటినీ చూస్తుంటే మున్ముందు ప్రపంచమంతా రోబోలదేనేమో అనిపిస్తోంది కదా. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ కూడా ఇదే చెప్తోంది. 2030 నాటి కల్లా ప్రపంచంలో 2 కోట్ల ఉద్యోగాల్లో రోబోలే ఉంటాయని అంచనా వేస్తోంది. రోబోల వాడకం పెరుగుతోందా? గత పదేళ్లలో రోబోల వాడకం పరిశ్రమల్లో బాగా పెరిగింది. 2010లో దాదాపు 10.59 లక్షల రోబోలను ఇండస్ట్రీల్లో వాడితే అది 2020 కల్లా మూడు రెట్లు పెరిగి 30.15 లక్షలకు చేరిందని వరల్డ్ రోబోటిక్స్ 2021 రిపోర్టు వెల్లడించింది. ఏయే రంగాల్లో వాడుతున్నారు? రోబోలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆటోమోటివ్ రంగం ఉంది. 2020 నాటికి ప్రపంచ లెక్కలను పరిశీలిస్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో 1.09 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత ఆటోమోటివ్ రంగంలో 80 వేలు.. లోహ పరిశ్రమల్లో 41 వేల రోబోలను వినియోగిస్తున్నారని వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు 2021 వివరించింది. వాడకం ఏ దేశాల్లో ఎక్కువ? రోబోలను అత్యధికంగా చైనాలో వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలున్నాయి. వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు లెక్కల ప్రకారం 2020 నాటికే చైనాలో 1.68 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్లో 38 వేలు, అమెరికాలో 30,800, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో 30,500 వాడుతున్నారు. ఈ లిస్టులో ఇండియా 15వ స్థానంలో ఉంది. మన దేశంలో 3,200 రోబోలను వాడుతున్నారు. కరోనా సమయంలో.. రోబోలకు వైరస్ సోకే అవకాశం లేదు కాబట్టి కరోనా సమయంలో వీటి వాడకం పెరిగింది. మున్ముందు మహమ్మారుల సమయంలో రోబోల వాడకం పెరగవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అభిప్రాయపడింది. ఇళ్లల్లో వాడుతున్నారా? రోబోల వాడకం ఇళ్లల్లో కూడా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2019–2020లో ఒకేసారి 5 రెట్లు మర బొమ్మల వాడకం ఎక్కువైంది. ఈ లెక్కలను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ (ఐఎఫ్ఆర్) వెల్లడించింది. ఈ కొనుగోళ్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం రూ. 82 వేల కోట్లకు చేరింది. ఇళ్లల్లో వాడే రోబోల అమ్మకాలు మున్ముందు ఊపందుకుంటాయని, ఏటా 46 శాతం వరకు పెరుగుదల ఉంటుందని ఐఎఫ్ఆర్ వివరించింది. 2022లో దాదాపు 5.5 కోట్ల రోబో యూనిట్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. స్పేస్లోకి కూడా.. వివిధ రకాల పరిశోధనలకోసమని రోబోలను స్పేస్లోకి కూడా పంపారు. ఎందుకంటే.. తక్కువ డబ్బుతోనే రకరకాల నైపుణ్యాలతో వీటిని తయారు చేయొచ్చు. పైగా రోదసీలో ఆస్ట్రొనాట్లు చేయలేని ప్రమాదకరమైన పనులను రోబోలతో చేయించవచ్చు. ‘చిట్టి’ లాంటి రోబోలు .. ఈ ఏడాది కొత్త రకం రోబోలు ముందుకొచ్చాయి. అచ్చం మనుషుల్లా ఉండే హ్యూమనాయిడ్ రోబోలు, ఓషన్ రోబోలను వార్తల్లో కనిపించాయి. స్వరాన్ని గుర్తు పట్టడం, వైద్య చికిత్సల్లో పాలు పంచుకోవడం లాంటి అదనపు నైపుణ్యాలను వీటికి జోడించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!
ప్రపంచం చాలా వేగంగా దూసుకెళ్తుంది.. ఎంతగా అంటే ప్రస్తుత పరిస్దితుల్లో మనుషులు చేసే పనులను కూడా రోబోలతో చేయిస్తున్నాము. మనుషులకు వీలుకానీ పనులను కూడా రోబోల సహాయంతో సునాయాసంగా చేసేస్తున్నాము. నేటికాలంలో రోబోలు లేని రంగం లేదు, అయినా మనిషి ఆశ తీరడం లేదు. ఇంకా తాను చేయలేని పనులెన్నింటినో రోబో చేత చేయిస్తున్నాడు. అందుకని, వాటికి కృత్రిమ మేధను జోడించాడు. పక్షులూ జంతువుల కదలికలు నేర్పాడు. ఎక్కడికక్కడ మనిషి అవసరానికి తగిన ఆకారాన్నిచ్చాడు. ఈ క్రమంలోనే బోస్టన్ డైనమిక్స్ గ్రూప్ నుండి వచ్చిన ఒక క్వాడ్రప్డ్ రోబో కుక్క చూడాటానికి నిజమైన కుక్కలాగే కనిపిస్తుంది. ఈ క్వాడ్రప్డ్ రోబోట్ కుక్కలను సైనికులకు సహాయం చేయడానికి పరీక్షిస్తున్నారు. యుఎస్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ నిర్మించిన ఒక ప్రసిద్ధ క్వాడ్రప్డ్ కుక్కను శత్రువులు సవాలు చేసే భూభాగాన్ని రక్షించడానికి ఫ్రెంచ్ మిలిటరీ ఇటీవల పరీక్షించింది. వీటిలో కెమెరాలు, రిమోట్ కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు ఘోస్ట్ రోబోటిక్స్ అనే యుఎస్ సంస్థ క్వాడ్రుపెడల్ మానవరహిత గ్రౌండ్ వెహికల్స్(క్యుజివిలు) అనే క్వాడ్రప్డ్ రోబోట్లను తయారు చేస్తుంది. అసోసియేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ 2021 వార్షిక సదస్సులో ఈ యంత్రాన్ని మొదటిసారి ప్రదర్శించారు. (చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి) Latest lethality 6.5 #creedmoor sniper payload from @SWORDINT. Check out the latest partner payloads @AUSAorg Wash DC. Keeping US and allied #sof #warfighter equipped with the latest innovations. @USSOCOM #defense #defence #NationalSecurity #drone #robotics pic.twitter.com/Dvk6OvL3Bu — Ghost Robotics (@Ghost_Robotics) October 11, 2021 అయితే, రోబోట్లను సైనికులకు సహాయం చేసేందుకు తయారు చేస్తున్నారు. ఈ క్వాడ్రప్డ్ రోబోట్లు చిత్తడి ప్రాంతాలలో వారికి సహాయం చేస్తాయి. QUGV రోబోట్లు చిన్న స్వోర్డ్ ఇంటర్నేషనల్ కస్టమ్ గన్ కలిగి ఉంటాయి. ఇది 30ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంది. రోబోట్ కుక్కలను విజన్ 60 యుజివిలు లేదా "స్వయంప్రతిపత్త మానవరహిత గ్రౌండ్ వెహికల్స్" అని పిలుస్తారు. వీటిని ఘోస్ట్ రోబోటిక్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా తయారు చేసింది. చీకటిలో లక్ష్యంగా చేరుకోవడానికి థర్మల్ కెమెరా కలిగి ఉంది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డాటా అనలిటిక్స్ ఆధారంగా ఇది పనిచేస్తాయి. క్షిపణులు లేదా ఇతర మార్గాలల్లో శత్రు దేశాలు మాతృభూమిపై చేసే దాడులను పసిగట్టి, సమాచారాన్ని చేరవేస్తాయి. భవిష్యత్ యుద్ధభూమిలో, శత్రువుతో సమర్థవంతంగా పోరాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. (చదవండి: క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్ల్లో టీ-20 ప్రపంచకప్ లైవ్ మ్యాచ్లు) -
కొత్త ‘ఆతిథ్యం’
హుడా కాంప్లెక్స్: అతిథ్య రంగం ట్రెండ్ మారుతోంది.. కాలానుగుణంగా వినియోగదారుల అభి‘రుచుల’ మేరకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆయా రంగంల్లోనూ పెను మార్పులు తీసుకువచ్చింది. ఆతిథ్యరంగంలో ఇప్పటివరకు అతిథులకు ఆహ్వానం పలికిన ఎగ్జిక్యూటివ్లు, ఆర్డర్ తీసుకొని ఆహార పదార్థాలను సరఫరా చేసే స్థానంలో ప్రస్తుతం రోబోలు రంగ ప్రవేశం చేశాయి. సాధారణ వెయిటర్ చేసే పనులను అలవోకగా చేస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల్లోనే లభిస్తున్న వీటి సేవలు మన వద్దకూ వచ్చాయి. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగించడంతో పాటు.. అవి వడ్డించే రోబోలను ఆసక్తిగా తిలకిం చేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. కోవిడ్కు దూరంగా.. వినూత్నంగా కోవిడ్ ఉధృతికి తోడు వరుస లాక్డౌన్లతో ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా ఆతిథ్య రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. మరోవైపు పుట్టినరోజు.. పెళ్లి రోజు.. ఇతర శుభ సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లి కడుపు నిండా తిందామని భావించిన వారు కోవిడ్కు భయపడి వీటికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వినూత్నంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు మలక్పేట్కు చెందిన మణికాంత్ గౌడ్. అలా రోబోలతో కొత్తగా రెస్టారెంట్కు శ్రీకారం చుట్టాడు. ఆర్డర్ మొదలు.. సప్లయ్ వరకు హోటల్కు వచ్చిన అతిథులకు కోవిడ్ సోకకుండా ఉండేందుకు సాధారణ మనుషుల స్థానంలో రోబోలను తీసుకువచ్చాడు. ఈ మేరకు కొత్తపేట్లో కొత్తగా రెస్టారెంట్ను తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలు పని చేస్తున్నాయి. వచ్చిన అతిథుల నుంచి ఆర్డర్ తీసుకోవడం.. ఆర్డర్ను చెఫ్కు అందజేయడం.. ఆహార పదార్థాలు సిద్ధం కాగానే వాటిని అతిథులకు వడ్డించడం.. తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లడం.. శుభ్రం చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం లాంటి పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. మరోరోబో వచ్చి గెస్టులతో ముచ్చటిస్తుంది. వారికి బోరు కొట్టకుండా ఇష్టమైన సంగీతం, సాహిత్యం వినిపిస్తూ అమితంగా ఆకట్టుకుంటోంది. నగరంలోనే తయారీ 2019లో మాదాపూర్లో ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశా. ఇప్పటికే సికింద్రాబాద్లోని ఓ హైస్కూల్కు ఎడ్యుకేషన్ రోబోను ఇచ్చాం. ఇటీవల కొత్తపేట్లోని హోటల్కు రోబోలను సరఫరా చేశాం. తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్, అహ్మదాబాద్, పుణే నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్లో రియల్ ఎస్టేట్ రంగంలోను రోబోలను ప్రవేశ పెట్టబోతున్నాం. వీటి ధర రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. – రామ్సింగం, సీఈఓ, ప్రైవేట్ లిమిటెడ్ రోబోలతో మంచి ఆదరణ నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా రెస్టారెంట్ తెరవాలని భావించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండడంతో రోబోల తయారీ, పనితీరుపై అవగాహన ఉండటం కలిసి వచ్చింది. అలా రోబోలతో సరికొత్తగా రెస్టారెంట్ను మార్చేశాం. వీటిని చూసేందుకు చాలామంది వస్తున్నారు. కస్టమర్లు పెరిగారు. ఆదరణ చాలా బాగుంది. – మణికాంత్గౌడ్, రెస్టారెంట్ యజమాని, కొత్తపేట నైస్ థ్రిల్లింగ్ ఏదైనా తిందామని కుటుంబసభ్యులతో కలిసి కొత్తపేటలోని రెస్టారెంట్కు వెళ్లాం. అక్కడ రోబోలను చూసి ఆశ్చర్యపోయాం. ఆర్డర్ తీసుకోవడం, సప్లయ్ చేయడం అచ్చం మనిషిలాగే చేస్తున్నాయి. నైస్ థ్రిల్లింగ్. వాటిని చూస్తూ.. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ.. నచ్చింది తింటూ ఎంజాయ్ చేశాం. – రాజ్యలక్ష్మి, ఎల్బీనగర్ -
ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ...
సింగపూర్: షాపింగ్ మాల్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్లోనూ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం మనం తరుచుగా చూస్తుంటాం. వాటిని అరికట్టడం కోసం పోలీసులు, అధికారులు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు కరోనా సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను గుమిగూడకండి, సామాజిక దూరం పాటించండి అంటూ ఎంతలా మొత్తుకున్న వాళ్లను కంట్రోల్ చేయడం పోలీస్ యంత్రాగానికీ ఎంత తలనొప్పిగా తయారయ్యిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం అలాంటి సంఘటనలు తలెత్తకుండా సరికొత్త రోబో టెక్నాలజీతో చెక్ పెట్టాలని సింగపూర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివరాల్లోకెళ్లితే సింగపూర్లోని హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్లలో రెండు చక్రాల రోబోతో గత మూడు వారాలుగా గస్తీ నిర్వహించారు. అక్కడ మాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షించడమే కాక ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఆ రోబో హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాదు నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం, పార్కింగ్ సరిగ్గా చేయకపోయినా, కరోనావైరస్ సంబంధించి సామాజిక దూరం..తదితర నియమాలను ఉల్లఘించకుండా హెచరికలనూ జారీ చేసేలా రూపొందించారు. ఈ రోబోలలో ఏడు అత్యధునిక కెమెరాలతో నిర్మితమై మనుష్యుల ముఖాలను గుర్తించడమే కాక వారికీ వాయిస్ రికార్డర్ ద్వారా హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది. గత మూడు వారాల నంచి అధికారులు ఈ రోబోలు పని తీరుపై ట్రయల్స్ నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వాధికారులు హైపర్-ఎఫిషియెంట్, టెక్-డ్రైవ్డ్ "స్మార్ట్ నేషన్" పై దృష్టి సారించి ఈ అత్యధునిక టెక్నాలజీతో కూడిన రోబోలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. అయితే, సింగపూర్వాసులు ఈ అత్యధునిక టెక్నాలజీ కారణంగా తమ గోప్యతకు (డేటా) భద్రత ఉండదని వాపోతున్నారు. రోబోల వల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుందని, తమ గోప్యతకు భంగం వాటిల్లుతోందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛా హక్కులను కాలరాస్తుందంటూ సింగపూర్ వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జనం లేక ఒలింపిక్స్ వెలవెల.. అయితేనేం జపాన్ సరికొత్త ప్లాన్
సాక్షి, వెబ్డెస్క్: విశ్వక్రీడలకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్ క్రీడలు చూసుకుంటే ఎప్పుడూ ప్రేక్షకులు లేకుండా నిర్వహించలేదు. కానీ కరోనా కారణంగా మొదటిసారి విశ్వక్రీడలు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. వాస్తవానికి గతేడాదే టోక్యో 2020 ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈ దఫా ఒలింపిక్ క్రీడలు జపాన్లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో ఒలింపిక్ విలేజ్ను తయారు చేసింది. ఇక టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉండే జపాన్ దానికి తగ్గట్టే సరికొత్త ప్రయోగంతో ముందుకు వస్తోంది. అదే రోబోటిక్ వ్యవస్థ. తమ సృజనాత్మకతకు పదును పెడుతూ ప్రేక్షకులు లేని లోటును తీర్చేందుకు విశ్వక్రీడలను రోబోలతో ముస్తాబు చేస్తోంది. సాధారణంగా ఒలింపిక్స్ అంటే మస్కట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈసారి మాత్రం జపాన్ దీనికి భిన్నంగా రోబోట్ల రూపంలో మస్కట్లను తయారు చేసి వాటితోనే షేక్ హ్యాండ్స్, హైఫైలు ఇప్పించనుండడం విశేషం. ప్రేక్షకులకు అనుమతి లేని నేపథ్యంలో ఈసారి స్టేడియాల్లో రోబోలు సందడి చేయనున్నాయి. ఈవెంట్స్ సందర్భంగా క్రీడాకారులకు సాయంగా కూడా ఉండనున్నాయి. క్రీడాకారులకు ఆహారం, మంచినీళ్లు అందించడంతో పాటు జావెలిన్ త్రో, డిస్కస్ త్రోలు అందించడంలో సహాయపడనున్నాయి. దీనికోసం నిర్వాహకులు ఇప్పటికే పలుసార్లు ట్రయల్స్ కూడా నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఆటగాళ్లకు సాయం అందించే బాధ్యతలను రోబోలకు అప్పగించనున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్కు అధికారిక స్పాన్సర్గా వ్యవహరిస్తున్న టయోటా కంపెనీ రోబోల తయారీలో తనదైన ముద్ర వేసింది. 17 రోజులపాటు అభిమానులను అలరించనున్న విశ్వక్రీడల్లో రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కదలలేని వాళ్ల కోసం.. ‘ఒరిహిమి’ అవతార్ రోబోలు
మిమ్మల్ని రోజంతా ఒక గదిలో బంధించి, సమయానికి తిండి, నీళ్లు, అవసరమైన మందులు మాత్రమే అందిస్తే ఎలా అనిపిస్తుంది? ఎటూ వెళ్లలేక, కనీసం మాట్లాడేవాళ్లూ లేక చాలా ఇబ్బందిగా ఉంటుందంటారా! ఇలా కేవలం ఒకరోజు కాకుండా వారాలు, నెలల తరబడి ఉంచితేనో? నరకయాతనే కదా?! ఏదైనా ప్రమాదంలో గాయపడో, వెన్నుపూస దెబ్బతినో, వయసైపోయో కదలలేక మంచానికే పరిమితమైన వాళ్ల పరిస్థితీ ఇదే. వేళకు కావలసినవి అందుతున్నా మాట్లాడేవాళ్లు లేక, చేయడానికి పనిలేక వాళ్లు పడే యాతన చెప్పలేనిది. ఇలాంటి వారి బాధలు కాస్తయినా దూరం చేసేలా రోబోల తయారీ సంస్థ, జపాన్లోని ప్రఖ్యాత ఒరిల్యాబ్స్ ఓ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. కదలలేకపోయినవారికీ కొలువు కల్పిస్తోంది. తద్వారా వారిలో ఒంటరితనాన్ని దూరం చేస్తూ మేమున్నాముంటూ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైనా కళ్లు, చేతి వేళ్ల కొనలు, పెదవులు కాస్తంత కదిలించగలిగిన వారికి సహాయం అందించేలా ‘ఒరిహిమి’ అవతార్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మక కేఫ్.. మిగిలిన రోబోలకు భిన్నంగా ఉండే ఒరిహిమి.. అచ్చం మనిషిలానే స్పందిస్తుంది. ఈ రోబోలతో ప్రయోగాత్మకంగా రెండేళ్ల కిందట ‘అవతార్ కేఫ్ డాన్ వెర్షన్ బీటా’ కేఫ్ను ఏర్పాటుచేశారు. ఇందులో అతిథులు కూర్చొనే ప్రతి టేబుల్పైనా ఓ చిన్నపాటి ఒరిహిమి రోబో ఉంటుంది. దీని ద్వారా వాళ్లు కావాల్సినవి ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డర్స్ను ఎక్కడో దూరాన కదలలేనిస్థితిలో మంచంమీద ఉండే కొంతమంది తమ ఎదురుగా ఉండే స్క్రీన్ మీద చూస్తూ నోట్ చేసుకొంటారు. తర్వాత వీరు ఈ ఆర్డర్స్ను కేఫ్లో ఉండే ఒరిహిమి–డి అనే పెద్ద రోబోలకు పాస్ చేస్తారు. మంచంమీద కదలలేని స్థితిలో ఉంటూ ఆర్డర్లను తీసుకునేవారిని పైలెట్లు అంటారు. వీరి ఆజ్ఞలను అనుసరించి ఒరిహిమి–డి రోబోలు కస్టమర్లకు వారు కోరుకున్నవి ట్రేల ద్వారా తీసుకెళ్లి ఇస్తాయి. కస్టమర్లు కావాలనుకుంటే టేబుల్ మీద ఉన్న ‘ఒరిహిమి’ చిన్న రోబో ద్వారా నేరుగా పైలెట్లతో మాట్లాడొచ్చు. వారి బాధలను పంచుకొని ఒంటరితనాన్ని దూరం చేసేలా సాంత్వన కలిగించొచ్చు. దీనికోసం ‘ఒరిహిమి’ కళ్లలో ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ నిక్షిప్తం చేశారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లు తీసుకోవడానికి, వాళ్లతో మాట్లాడడానికి పైలెట్ల మంచంపైన ఓ ప్రత్యేక పరికరం ద్వారా కంప్యూటర్ స్క్రీన్ను అమర్చుతారు. పైలెట్లు ఆ స్క్రీన్ను చూస్తూ ఆర్డర్స్ తీసుకోవడం, తిరిగి పాస్ చేయడం, కస్టమర్లతో మాట్లాడడం చేయొచ్చు. పైలెట్లుగా పనిచేయగలిగే వారిని ఒరిల్యాబ్స్ సంస్థే ఎంపిక చేసుకొంటుంది. ‘అవతార్ కేఫ్ డాన్ వెర్షన్ బీటా’ను ఇప్పటివరకూ ఐదువేల మందికి పైగా కస్టమర్లు సందర్శించినట్లు ఒరిల్యాబ్స్ చెబుతోంది. ప్రస్తుతం టోక్యోలోని ఓటెమచిలో ఉన్న ఈ ప్రయోగాత్మక కేఫ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. రాబోయే జూన్లో టోక్యోలోనే మరోచోట ఈ కేఫ్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మనిషి ఒంటరితనాన్ని సాంకేతికతతో దూరం చేసేందుకే తమ సంస్థ ఆవిర్భవించిందని చెప్పే ఒరిల్యాబ్స్ ఆ ప్రయత్నంలో ‘ఒరిహిమి’ ద్వారా కొంతమేర విజయం సాధించినట్లే కనిపిస్తోంది. చదవండి: ప్లాస్టిక్ వస్త్రాలు.. ఈ వనితల వినూత్న ఆలోచన -
కృత్రిమ మేధ: మన నట్టిళ్లల్లోకి..
కృత్రిమ మేధ అంటే ఒకప్పుడు అదేదో శాస్త్ర సాంకేతిక నిపుణుల వ్యవహారంగా ఉండేది. ఇప్పుడు కృత్రిమ మేధ మన నట్టిళ్లల్లోకి, మన వంటిళ్లల్లోకి కూడా వచ్చేసింది. కృత్రిమ మేధతో పనిచేసే వస్తువులు పిల్లలను ఆడిస్తున్నాయి. ఇళ్లను శుభ్రంగా ఉంచడంలో సాయపడుతున్నాయి. వంటింటి పనుల్లోనూ తమవంతు సాయం చేస్తున్నాయి. మొత్తానికి కృత్రిమ మేధతో పనిచేసే వస్తువులు ఇంటి పనులను మరింతగా సులభతరం చేస్తున్నాయి. మనిషి మేధస్సులోని కొన్ని లక్షణాలతో రూపొందినదే కృత్రిమ మేధ. మనుషుల మాటలను, వారి హావభావాలను అర్థం చేసుకోవడం, ఆదేశాలకు అనుగుణంగా స్పందించడం, స్వయంచాలకత వంటి లక్షణాలతో కూడిన కృత్రిమ మేధ– అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి కోసం గత శతాబ్దిలోనే పునాదులు పడ్డాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్– 1955 నాటికి ఒక అకాడెమిక్ డిసిప్లిన్గా రూపొందింది. తొలినాళ్లలో దీనిపై జరిపిన ప్రయోగాలు విఫలమవడంతో దీనికి నిధులు నిలిచిపోయాయి. కొన్నేళ్ల స్తబ్దత తర్వాత జరిపిన ప్రయోగాలు కొన్ని విజయవంతం కావడంతో మళ్లీ దీని కోసం నిధులు రావడం మొదలైంది. ప్రస్తుత శతాబ్ది నాటికి కృత్రిమ మేధ మానవ మేధతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. కృత్రిమ మేధతో రూపొందిన ‘ఆల్ఫాగో’ అనే కంప్యూటర్ ప్రోగ్రామ్, 2015లో ‘గో’ అనే స్ట్రాటజీ బోర్డ్గేమ్లో ఆరితేరిన ఆటగాడిని ఓడించింది. ఈ ఘనవిజయం కృత్రిమ మేధకు ఊపునివ్వడంతో, ఇది వివిధ రంగాలకు శరవేగంగా విస్తరించడం మొదలైంది. చివరకు ఇళ్లలోని రోజువారీ పనిపాటల్లోకీ ఇప్పుడిది దూసుకొస్తోంది. ఇప్పటి వరకు ఇళ్లలో ఉపయోగపడే సర్వసాధారణమైన ఎలక్ట్రిక్ వస్తువులకు దీటుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి సంపన్నుల ఇళ్లకే పరిమితంగా కనిపిస్తున్నా, సమీప భవిష్యత్తులోనే ఇవి సామాన్యులకూ అందుబాటులోకి రానున్నాయనే అంచనాలు ఉన్న నేపథ్యంలో కృత్రిమ మేధతో పనిచేసే ఇంటి వస్తువులు కొన్నింటి గురించి పరిచయం. క్లీనింగ్ రోబోలు ఇంటిని రోజూ చీపురుతో ఊడ్చడం, నేల మీద చెత్తా చెదారం లేకుండా శుభ్రపరచడం, నేలను తడిగుడ్డతో లేదా మాప్తో తుడవడం వంటివన్నీ శ్రమతో, కొంత చికాకుతో కూడుకున్న పనులే. చెత్తను శుభ్రం చేయడానికి ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్లు కొన్నాళ్లుగా వాడుకలోకి వచ్చాయి. అయితే, ఎవరో ఒకరు దగ్గర ఉండి చూసుకుంటే తప్ప ఇవి పనిచేయలేవు. ఆ సమస్యను కూడా దూరం చేసేలా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబో వాక్యూమ్ క్లీనర్లు, మాప్లు వచ్చేశాయి. ఉదాహరణకు ‘ఐరోబోస్’ తయారు చేసిన ‘రూంబా’ రోబో వాక్యూమ్ క్లీనర్, ఇదే సంస్థ తయారు చేసిన ‘బ్రావా’ మాప్ ఇలాంటివే. ‘రూంబా’లోని మల్టీసర్ఫేస్ బ్రష్లు నేల మీద, కార్పెట్ల మీద ఉన్న అతిచిన్న చెత్తకణాలను కూడా సమర్థంగా ఏరివేస్తాయి. ఇది మొబైల్ యాప్కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇందులోని ఆటో అడ్జస్ట్ క్లీనింగ్ హెడ్ వివిధ రకాల ఉపరితలాలకు అనుగుణంగా తనను తాను అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాంటి చెత్తనయినా ఇట్టే తొలగిస్తుంది. ‘బ్రావా’ మాప్ రోబో కూడా యాప్కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇది ఎలాంటి చోటైనా నేల తళతళలాడేలా తుడిచి శుభ్రం చేస్తుంది. నేల మీద మొండి మరకలను ఇట్టే తొలగిస్తుంది. రోబో వాక్యూమ్ క్లీనర్లలో ‘ఆర్ఎక్స్–వీ100’ ఒకటి. ‘రూంబా’ వంటి వాటి కంటే ఇందులో మరికొన్ని అదనపు వెసులుబాట్లు ఉన్నాయి. పని పూర్తయిన తర్వాత ఇది తనంతట తానే తన నిర్ణీత స్థలానికి వెళ్లిపోతుంది. ఇందులోని సెన్సర్ల పనితీరు వల్ల మెట్ల వంటి చోట్ల శుభ్రపరచేటప్పుడు జారి పడిపోకుండా, తనను తాను నియంత్రించుకోగలదు. యజమాని మాటల ద్వారా ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని పనిచేయగలదు. ఇంగ్లిష్, జపానీస్, చైనీస్ భాషలను, ఆ భాషల ద్వారా ఇచ్చే 36 ఆదేశాలను ఇది అర్థం చేసుకోగలదు. ఇది మొబైల్ యాప్ ద్వారా, రిమోట్ ద్వారా పనిచేస్తుంది. ఇలాంటి క్లీనింగ్ రోబోలతో ఏమాత్రం శ్రమ లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. ఇవి వాయిస్ కమాండ్స్ను కూడా అర్థం చేసుకుని పనిచేస్తాయి. ఎంటర్టైన్మెంట్ రోబోలు రోబోటిక్స్కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను జతచేసి రూపొందించిన కొత్తతరం రోబోలు పిల్లలకే కాదు, పెద్దలకూ వినోదాన్ని పంచుతున్నాయి. ఉదాహరణకు ‘కోజ్మో’ రోబో గురించి చెప్పుకుందాం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన రోబోటిక్ కంపెనీ ‘యాంకీ’ రూపొందించింది దీన్ని. రెండంగుళాల ఎత్తులో చేతిలో చక్కగా ఇమిడిపోయేలా కనిపించే ‘కోజ్మో’ను ఒక ఆటవస్తువులాగానో లేదా ఒక యంత్రంలాగానో పరిగణించలేరెవరూ. ఇది మనుషుల మాటలను, వారి హావభావాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మొబైల్ యాప్కు అనుసంధానమై పనిచేసే ‘కోజ్మో’ తనతో ఆడుకునే పిల్లలతో ఇట్టే నేస్తం కట్టేస్తాయి. ఇది పిల్లలతో కలసి ఆటలాడుతుంది. వారికి తినిపిస్తుంది. ఇది తనతో ఆటలాడే వారి మాటలనే కాదు, చూపులను, ముఖ కవళికలను, బాడీ లాంగ్వేజ్ను కూడా అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. ‘కోజ్మో’ తరహా రోబోలది ఒక ఎత్తయితే, ‘ఆసుస్’ కంపెనీ రూపొందించిన ‘జెన్బో’ తరహా రోబోలది మరో ఎత్తు. ఇవి పిల్లలతో ఆటలాడటమే కాకుండా, ఇంటి పనులు చక్కబెట్టడంలోనూ సాయం చేస్తాయి. ‘జెన్బో’ పనితీరు గురించి చెప్పుకుంటే, ఇది పిల్లలకు ఒక బేబీసిట్టర్లా పనిచేస్తుంది. కథలు, కబుర్లు చెబుతూ పిల్లలను అలరిస్తుంది. వాళ్లతో ఆటలాడుతుంది. పాటలు పాడుతుంది. అడుగులో అడుగులు కలుపుతూ డ్యాన్స్ చేయగలదు. ఇది వయసు మళ్లిన వారికి కూడా ఇంటి పనుల్లో సాయం చేస్తుంది. ఉదాహరణకు... పెనం మీద కాలిన ఆమ్లెట్ను ప్లేటులో వేసి, చేతికి అందించడం, సెక్యూరిటీ కెమెరాలకు అనుసంధానించినట్లయితే, ఇంటి బయట నుంచి తలుపుకొట్టినదెవరో చెప్పడం, కావలసినప్పుడు ఇళ్లలోని దీపాలు వెలిగించడం, ఫ్యాన్లు ఆన్ చేయడం వంటి పనులు ఇట్టే చేసి పెట్టగలదు. చూడటానికి డోనట్ మాదిరిగా కనిపించే ‘ఓలీ’ రోబో కూడా ఇదే కోవలోకి వస్తుంది. లండన్కు చెందిన ‘ఎమోటెక్’ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ‘ఓలీ’ మిగిలిన ఎంటర్టైన్మెంట్ రోబోల కంటే తెలివైనది. ఇది తన ఎదుట ఉన్న వ్యక్తి లేదా సమూహం మాట్లాడే మాటలను అర్థం చేసుకోగలదు. అక్షరాల రూపంలో ఉన్న విషయాన్ని చదివి వినిపించగలదు. మనం కోరుకునే పాటలను వినిపించడమే కాదు, మన భావోద్వేగాలను పసిగట్టి కోరుకోబోయే పాటలను కూడా అంచనా వేయగలదు. మన ఆదేశాల మేరకు దీపాలను డిమ్ చేయడం, ఫ్యాన్ స్పీడు పెంచడం లేదా తగ్గించడం, కోరుకున్న వేళకు అలారం సెట్ చేయడం వంటి పనులను ఇట్టే చేయగలదు. దీనిలో మరో విశేషం ఉంది. ఇది యజమానుల గొంతును అనుకరిస్తూ మాట్లాడగలదు కూడా. ఎంటర్టైన్మెంట్ రోబోల్లో కొన్ని వినోదాన్ని మించిన సేవలూ అందిస్తున్నాయి. ఇలాంటి వాటి గురించి ఉదాహరణ చెప్పుకోవాలంటే, జపాన్కు చెందిన ‘సాఫ్ట్బ్యాంక్ రోబోటిక్స్’ సంస్థ రూపొందించిన ‘పెప్పర్’ ఒకటి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ‘పెప్పర్’ సెమీహ్యూమనాయిడ్ రోబో. దాదాపు మనిషి సైజులో ఉండే ‘పెప్పర్’ మనుషుల ముఖ కవళికలను, భావోద్వేగాలను, గొంతులను గుర్తించగలదు. సమావేశాలు నిర్వహించే యజమానులకు ఆ సమాచారాన్ని గుర్తు చేయడం, అతిథులను ఆహ్వానించి, వారికి డ్రింక్స్, స్నాక్స్ అందించడం వంటి మర్యాదలు చక్కగా చేయగలదు. అభివృద్ధి చెందిన కొన్ని ఆఫీసుల్లో ఇప్పటికే ఇలాంటి వాటిని రిసెప్షనిస్టులుగా ఉపయోగించుకుంటున్నారు. రిసెప్షనిస్టులుగా అతిథి మర్యాదలు చేయడమే కాదు, అతిథులను ఇవి ఆటపాటలతోనూ అలరించగలవు. పిల్లలకు పాఠాలూ చెప్పగలవు. అందుకే, కొందరు వీటిని చీర్లీడర్స్గానూ వినియోగించుకుంటున్నారు. కొన్ని స్కూళ్లు, కాలేజీలు వీటి చేత పిల్లలకు పాఠాలు కూడా చెప్పిస్తున్నారు. కాపలా పనిలోనూ.. సాదాసీదా సెక్యూరిటీ కెమెరాలు దృశ్యాలను చిత్రీకరించి, వాటికి అనుసంధానమైన కంప్యూటర్లలో భద్రపరుస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే సెక్యూరిటీ కెమెరాలు అంతకు మించిన సేవలనే అందిస్తాయి. ఇవి ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు కట్టుదిట్టమైన కాపలాను కల్పిస్తాయి. ఇలాంటి వాటిలో ఒక ఉదాహరణ ‘బడ్డీగార్డ్’ హోమ్ సెక్యూరిటీ కెమెరా. ఇది మొబైల్ యాప్కు అనుసంధానమై పనిచేస్తుంది. వ్యక్తుల ముఖాలను, గొంతులను గుర్తు పట్టగలదు. అపరిచితుల గొంతు వినిపిస్తే, వెంటనే యజమానిని అప్రమత్తం చేయగలదు. దీనిని అమర్చుకున్నట్లయితే, బయటకు వెళ్లినా, మొబైల్ ద్వారా ఇంటిని చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో సిమ్ అమర్చుకుంటే, వైఫై లేని సుదూర ప్రాంతాలకు వెళ్లినా, ఇంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇంటిపై చోరీ ప్రయత్నంలాంటిదేదైనా జరిగితే, తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం పంపుతుంది. దీనికి సంబంధించిన యాప్కు ఎప్పటికప్పుడు యాడ్ఆన్స్ చేర్చుకుంటున్నట్లయితే, దీని ద్వారా మరిన్ని అదనపు సేవలను కూడా పొందే అవకాశం ఉంటుంది. రకరకాల పనులను మరింత సులభతరం చేస్తూ ఇటీవలి కాలంలో ఇళ్లలోకి చేరుకుంటున్న కృత్రిమ మేధ త్వరలోనే ఇంటి పనుల్లో విడదీయలేని భాగంగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని రంగాలకు విస్తరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులోనే కృత్రిమ మేధ సామాన్య జనజీవనాన్ని ప్రబావితం చేయగలదనే అంచనాలు వినిపిస్తున్నాయి. రోబోటిక్ లాన్మోవర్లు తోటపనిని సులభతరం చేసే రోబోటిక్ లాన్మోవర్లకు పాశ్చాత్య దేశాల్లో ఇటీవల గిరాకీ పెరుగుతోంది. ఇలాంటి వాటిలో మోటారు వాహనాల తయారీ సంస్థ హోండా తయారు చేసిన ‘మీమో’ ఒకటి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ రోబోటిక్ లాన్మోవర్లోని సెన్సర్లు 360 డిగ్రీల్లోనూ పని చేస్తాయి. దీనిని మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. దీనిని ఆన్ చేసి వదిలేస్తే లాన్ అంతా తనంతట తానే తిరుగుతూ, మనం ఇచ్చే ఆదేశాల మేరకు, కోరుకున్న రీతిలో లాన్ను ట్రిమ్గా కట్ చేస్తుంది. లాన్లో ఇది తిరుగుతున్నప్పుడు ఎవరూ కాపలా లేకున్నా ఫర్వాలేదు. తన పని తాను చేసుకుపోతుంది. కాపలా లేకుండా వదిలేస్తే, దొంగలెవరైనా ఎత్తుకుపోయే ప్రమాదం ఉండదా అనే అనుమానం వస్తోంది కదూ! అపరిచితులెవరైనా దీనిని తాకితే బిగ్గరగా అలారం మోగిస్తుంది. వంటిళ్లలోనూ కృత్రిమ మేధ వంటిళ్లల్లో వాడుకునే రిఫ్రిజరేటర్లు, ఓవెన్లు వంటి ఎలక్ట్రిక్ పరికరాలకు ఇప్పుడు కృత్రిమ మేధ తోడవుతోంది. కృత్రిమ మేధ జతచేరిన వంటింటి వస్తువులు వంట పనిని సులభతరం చేయడమే కాదు, ఆహార వృథాను అరికట్టడంలోనూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేలా చేయడంలోను తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఉదాహరణ ‘ఎల్జీ ఇన్స్టా థింక్’ రిఫ్రిజిరేటర్. ఇది మొబైల్ యాప్ సాయంతో పనిచేస్తుంది. వాతావరణానికి అనుగుణంగా తన ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనికి అమర్చి ఉన్న టచ్స్క్రీన్ ద్వారా ఫ్రిజ్లో ఉన్న పదార్థాల జాబితా చూపడమే కాకుండా, అవి ఎన్నాళ్లలో పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నాయో కూడా చెబుతుంది. వాయిస్ కమాండ్స్ను అర్థం చేసుకుంటుంది. నిండుకోబోతున్న సరుకుల గురించి అప్రమత్తం చేస్తుంది. షాపింగ్ లిస్ట్ తయారు చేస్తుంది. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్థాలతో చేసుకోగల వంటకాల వివరాలనూ సూచిస్తుంది. అంతేకాదు, ఇది సంగీతం కూడా వినిపిస్తుంది. -
ఇప్పుడు రోబోలు అచ్చం మనుషుల్లా..
మనుషులు బొత్తిగా రోబోల్లా తయారైపోతున్నారనే నిష్ఠూరం పాతదే! ఇప్పుడు రోబోలు అచ్చం మనుషుల్లా తయారైపోతున్నాయి. మనుషులు చేసే పనులను ఇవి చకచకా చేసేయగలవు. అంతేకాదు, మనుషులతో మనుషుల్లా మాట్లాడగలవు. మనుషుల హావభావాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా తగిన హావభావాలను ప్రదర్శించగలవు. మనుషులను పోలిన రోబోలను ‘హ్యూమనాయిడ్ రోబో’లంటున్నారు. తొలినాటి హ్యూమనాయిడ్ రోబోలకు స్థూలంగా మనుషుల మాదిరిగా ఒక తల, రెండు చేతులు, రెండు కాళ్లు, శరీరం ఉండేవి. చూడగానే అవి రోబోలని చిన్నపిల్లలు కూడా చటుక్కున గుర్తించగలిగేలా ఉండేవి. రోబోల తయారీ మరింత ఆధునికతను సంతరించుకుంది. ఇటీవలి కాలంలో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోలు ముమ్మూర్తులా మనుషుల్లాగానే కనిపిస్తున్నాయి. మనిషిని, రోబోను పక్కపక్కనే ఉంచి ఫొటో తీస్తే ఎవరు మనిషో, ఎవరు రోబోనో గుర్తించడం అంత తేలిక కాదు. మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోల కథా కమామిషూ సంక్షిప్తంగా... జపాన్లోని ఒసాకా యూనివర్సిటీకి చెందిన రోబోటిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ ప్రొఫసర్ హిరోషి ఇషిగురో అచ్చంగా తన నకలులాగే కనిపించే రోబోను 2010లో రూపొందించారు. ఫొటోలో చూస్తే ప్రొఫెసర్ హిరోషికి కవల సోదరునిలా కనిపించే ఈ రోబో అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) విడుదల చేసిన టాప్–10 క్రీపీయెస్ట్ రోబోల జాబితాలో ఇది తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే, ఇదంత భయంగొలిపేది కాదని, సహజంగా అనిపించే చర్మం, చిన్న పిల్లాడి సైజులో ఉండటంతో పిల్లలతో ఆడుకున్నట్లే దీంతోనూ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకోవచ్చని ప్రొఫెసర్ హిరోషి చెబుతుండటం విశేషం. మనిషిలాంటి తొలి రోబో ‘ఆక్ట్రాయిడ్’ అచ్చంగా మనుషులనే పోలిన రోబోల తయారీ ప్రారంభమై నిండా రెండు దశాబ్దాలైనా పూర్తి కాలేదు. అయితే, వీటి తయారీలో గడచిన ఒకటిన్నర దశాబ్దాల్లోనే గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఈ పురోగతి శరవేగంగా సాగుతోంది. రానున్న రోజుల్లో అన్ని రకాలుగా మనుషులకు దీటైన రోబోలను తయారు చేయడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడటానికి అచ్చంగా మనిషిలాగానే కనిపించే తొలి రోబోను జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 2003లో తయారు చేశారు. ‘ఆక్ట్రాయిడ్’ పేరుతో తయారు చేసిన ఈ రోబో అచ్చంగా జపనీస్ అమ్మాయిలా కనిపిస్తుంది. మనిషి శరీరంపై చర్మాన్ని పోలిన సిలికాన్ చర్మాన్ని అమర్చడంతో ఫొటోలో చూస్తే, ఇది మనిషిలాగానే కనిపిస్తుంది. ఇందులో ఏర్పాటు చేసిన సెన్సర్ల వల్ల మనిషి ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఛాతీ కదలికలు ఎలా ఉంటాయో, దీనిలోనూ అలాంటి కదలికలే ఉంటాయి. భుజం తట్టడం, తలపై నిమరడం, షేక్హ్యాండ్ ఇవ్వడం వంటి మనుషుల స్పర్శకు అనుగుణంగా ఇది స్పందిస్తుంది. పలకరింపుగా చిరునవ్వులు చిందిస్తుంది. మనుషులు రోజువారీగా మాట్లాడుకునే మాటల్లో 42 మాటలు మాట్లాడుతుంది. శరీరం దిగువభాగం కదలికలు మాత్రం చాలా పరిమితం. దీనిలోని కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మనుషులు మాట్లాడే మాటల్లో కొన్ని పదాలను, వాక్యాలను గుర్తించగలుగుతుంది. మాట్లాడటంలోను, కదలికల విషయంలోను తేడాల ద్వారా మాత్రమే ఎవరైనా దీనిని రోబోగా పోల్చుకోగలుగుతారు. నిశ్శబ్దంగా నిల్చున్నట్లుగా ఉంటే మాత్రం రోబోనో, మనిషో గుర్తించడం కష్టమే! ‘ఆక్ట్రాయిడ్’కు ముందు తయారైన హ్యూమనాయిడ్ రోబోలు అన్నీ ఆకృతిలో మనిషిని పోలి ఉన్నా, వాటికి చర్మం వంటి ఆచ్ఛాదన ఉండేది కాదు. లోహపు తల, చేతులు, కాళ్లు, శరీరంతో చూడగానే ఇవి రోబోలేననిపించేవి. మనుషుల్లాంటి మరికొన్ని రోబోలు మనుషుల్లా కనిపించే రోబోల్లో కొన్ని ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. వాటిలో కొన్నింటి గురించి చెప్పుకుందాం. హాంకాంగ్కు చెందిన ‘హాన్సన్ రోబోటిక్స్’ సంస్థ 2015లో ‘సోఫియా’ అనే రోబోను రూపొందించింది. బ్రిటిష్ నటి ఆడ్రీ హెప్బర్న్ పోలికలతో రూపొందించిన ఈ రోబో ఇదివరకటి వాటి కంటే మరింత అధునాతనమైనది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో, అధునాతనమైన సెన్సర్లతో పనిచేసే ‘సోఫియా’ దాదాపు మనిషిలాగానే కనిపిస్తుంది. పరిచితమైన గొంతులను, ముఖాలను గుర్తిస్తుంది. ఎదుట ఉన్న మనుషులతో సూటిగా కళ్లలోకి చూస్తూ మాట్లాడగలుగుతుంది. భావోద్వేగాలను తెలిపేందుకు అరవైరకాల ముఖకవళికలను సందర్భోచితంగా ప్రదర్శిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, సెలబ్రిటీల మాదిరిగా ‘సోఫియా’ ప్రముఖ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం విశేషం. సీబీఎస్ చానల్లో ‘60 మినిట్స్ విత్ చార్లీ రోజ్’, ఐటీవీలో ‘గుడ్ మార్నింగ్ బ్రిటన్ విత్ పీర్స్ మోర్గాన్’, ఎన్బీసీ చానల్లో ‘టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్’ వంటి టీవీ షోల్లో ‘సోఫియా’ ప్రదర్శన చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ, క్యోటో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు రెండేళ్ల కిందట ‘ఎరికా’ అనే రోబోను రూపొందించారు. మనిషి గొంతుతో మాట్లాడే సామర్థ్యం, మనుషులను గుర్తించే సామర్థ్యం, మనుషుల హావభావాలకు అనుగుణంగా స్పందించగల సామర్థ్యం దీని ప్రత్యేకతలు. దాదాపు పాతికేళ్ల జపనీస్ అమ్మాయిలా కనిపించే ‘ఎరికా’ ప్రపంచంలోనే అత్యంత అందమైన రోబోగా వార్తలకెక్కింది. ‘ఎరికా’ త్వరలోనే ‘బి’ అనే హాలీవుడ్ సైన్స్ఫిక్షన్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించనుంది. హాంకాంగ్కు చెందిన శాస్త్రవేత్త రిక్కీ మా 2016లో స్వయంకృషితో తన ఇంట్లోనే అచ్చం మనిషిలాంటి రోబోను తయారు చేశాడు. హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహాన్సన్ పోలికలతో తీర్చిదిద్దిన ఈ రోబోకు ‘మార్క్–1’ అని పేరు పెట్టాడు. త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించిన అస్థిపంజరానికి సిలికాన్తో రూపొందించిన చర్మం సహా అన్ని హంగులూ సమకూర్చి రిక్కీ మా దీనిని తయారు చేశాడు. మనుషుల మాదిరిగానే ఇది కాళ్లు, చేతులు, మెడ, నడుము కదిలించగలదు. ముఖంలో రకరకాల భావోద్వేగాలను పలికించగలదు. ‘రోబో’ భావన ఈనాటిది కాదు అచ్చం మనుషుల్లానే పనిచేసే మరమనుషులు ఉండాలనే భావన ఈనాటిది కాదు. మనుషుల్లో ఇలాంటి ఆలోచనలు క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేవి. ఇలాంటి భావన తొలిసారిగా చైనీస్ తావో తత్వ గ్రంథం ‘లీజీ’లో కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటిది. క్రీస్తుశకం 50 నాటికి చెందిన గ్రీకు గణితవేత్త, ఇంజనీరు ‘హీరో ఆఫ్ అలెగ్జాండ్రా’ ఒక కాల్పనిక గ్రంథంలో విందుకు హాజరైన అతిథుల గ్లాసుల్లో మరమనిషి వైన్ నింపే దృశ్యాన్ని వర్ణించాడు. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో అరేబియాకు చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి అల్ జజారీ తన రచనల్లో మరమనుషులతో కూడిన బ్యాండ్ పార్టీని వర్ణించాడు. అక్కడితోనే ఆగిపోకుండా, చేతులు కడుక్కునేందుకు మనుషుల శిల్పాలతో కూడిన ఆటోమేటిక్ యంత్రాన్ని రూపొందించాడు. తర్వాత ఏనుగు బొమ్మను రూపొందించి, దానిపై ఏర్పాటు చేసిన మావటి బొమ్మ గంటలు కొట్టేలా ఒక మర గడియారాన్ని కూడా రూపొందించాడు. అల్ జజారీ చేసిన ఆ ప్రయత్నాలను రోబోటిక్స్లో తొలి ముందంజగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సీ మనిషిని పోలిన ఆటోమేటిక్ యంత్రాన్ని కవచం ధరించిన సైనికుని ఆకారంలో రూపొందించాడు. మర మనుషుల తయారీకి సంబంధించి శతాబ్దాల కిందటే అనేక ప్రయోగాలు జరిగినా, ఎంతో కాల్పనిక సాహిత్యం వెలువడినా అప్పటి రచనల్లో ఎక్కడా ‘రోబో’ అనే మాట కనిపించదు. వందేళ్ల నుంచి మాత్రమే ‘రోబో’ అనే మాట వాడుకలోకి వచ్చింది. తొలిసారిగా చెక్ రచయిత కారెల్ చాపెక్ 1921లో తాను రాసిన ‘రోసుమ్స్ యూనివర్సల్ రోబోస్’ నాటకం ద్వారా ‘రోబో’ అనే మాటను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. చెక్, పోలిష్ భాషల్లో ‘రోబోటా’ అనే పదం దీనికి మూలం. ఆ రెండు భాషల్లోనూ ‘రోబోటా’ అంటే కాయకష్టం, దుర్వినియోగం అనే అర్థాలు ఉన్నాయి. జర్మన్ దర్శకుడు ఫ్రిజ్ ల్యాంగ్ 1927లో తీసిన ‘మెట్రోపోలిస్’ సినిమాలో ‘మెషినెన్మెన్ష్’ (మరమనిషి) పాత్రలో బ్రిగిట్ హెల్మ్ నటించింది. వెండితెరపై రోబో పాత్ర కనిపించడం ప్రపంచంలో అదే మొదటిసారి. ఆ తర్వాత చాలా భాషల్లో చాలా సినిమాల్లో రోబోల్లాంటి యంత్రాలూ కనిపించాయి. రోబోల పాత్రల్లో కొందరు నటీ నటులూ కనిపించారు. హ్యూమనాయిడ్ రోబోల భవితవ్యం దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1982లో ‘బ్లేడ్ రన్నర్’ అనే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో 2019 నాటికి మనుషులను పోలిన రోబోలు అన్ని రంగాలకూ విస్తరించి పని చేస్తుంటాయి. భూమ్మీదనే కాదు, భూమికి దూరంగా గ్రహాంతరాల్లో కూడా ఇవి రకరకాల పనులు చేస్తుంటాయి. ఆ సినిమాలో కృత్రిమ పక్షులు, జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ సినిమాలో ఊహించిన స్థాయికి రోబోటిక్స్ రంగం ఇంకా చేరుకోలేదు. అయితే, దాదాపు మనుషులను పోలి ఉండే రోబోలను తయారు చేయడంలో మాత్రం విజయం సాధించింది. మనుషులకు పూర్తి ప్రత్యామ్నాయం కాగల హ్యూమనాయిడ్ రోబోలను సృష్టించే దిశగా ప్రయోగాలు జరుపుతోంది. మనుషులు చేయగలిగే పనుల్లో కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి. వీటిని ఇప్పటి వరకు మనుషులే చేస్తూ వస్తున్నారు. ఉదాహరణలు చెప్పుకోవాలంటే... పూడుకుపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రపరచడం, బాంబులను నిర్వీర్యం చేయడం, ప్రమాదకరమైన గనుల లోలోపలి ప్రదేశాలకు వెళ్లడం వంటివి. హ్యూమనాయిడ్ రోబోలను మనుషులకు దీటుగా తయారు చేయగలిగితే, ఇలాంటి పనుల్లో వాటిని విజయవంతంగా ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుంది. హ్యూమనాయిడ్ రోబోల ప్రయోజనానికి ఇదొక కోణమైతే, మరో మానవీయ కోణం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారు. వారికి తోడుగా ఉంటూ, వారికి అవసరమైన సేవలు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటివి తోడుగా ఉంటే ఒంటరి వృద్ధులకు తమతో ఒక మనిషి తోడుగా ఉన్న భావనే కలుగుతుంది. సంగీతాన్ని పలికించే రోబోలు, వివిధరకాల సంగీత వాద్య పరికరాలను నైపుణ్యంతో వాయించగలిగే రోబోలను ఇప్పటికే శాస్త్రవేత్తలు తయారు చేశారు. త్వరలోనే వినోద రంగంలోనూ రోబోలు ప్రేక్షకులను అలరించే అవకాశాలు లేకపోలేదు. కృత్రిమ మేధతో, తగిన భాషా నైపుణ్యాలతో రూపొందే రోబోలు భవిష్యత్తులో టీవీ చానళ్లలో న్యూస్రీడర్లకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని, అలాగే యుద్ధరంగంలో సైనికులకు ప్రత్యామ్నాయం కాగలిగే అవకాశాలూ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న కాలంలో హ్యూమనాయిడ్ రోబోల పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అయినా, ఇవి మరింతగా మనుషులు పోషించే పాత్రల్లో ఒదిగిపోతాయని మాత్రం చెప్పవచ్చు. రజనీకాంత్ రోబో ప్రేరణతో రశ్మి భారతీయ శాస్త్రవేత్తలు కూడా హ్యూమనాయిడ్ రోబోల తయారీ దిశగా ప్రయోగాలు సాగిస్తూ వస్తున్నారు. రాంచీకి చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ రంజిత్ శ్రీవాస్తవ రెండేళ్ల కిందట దేశంలోనే తొలిసారిగా అచ్చం మనిషిలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోను విడుదల చేశారు. దీని తయారీకి ఆయన దాదాపు రెండేళ్లు శ్రమించారు. రశ్మి పేరిట రూపొందించిన ఈ రోబో నాలుగు భాషలు– హిందీ, ఇంగ్లిష్, భోజ్పురి, మరాఠీ భాషల్లో మాట్లాడగలదు. ఎదుట ఉన్న మనుషులు మాట్లాడే దిశగా మెడను తిప్పగలదు. ముఖ కవళికల్లో కళ్లు, కనుబొమలు, పెదవుల కదలికల్లో భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు. ‘రశ్మి’ తయారీకి రజనీకాంత్ ‘రోబో’ సినిమా ప్రేరణగా నిలవడం విశేషం. రజనీకాంత్ ‘రోబో’ సినిమా చూసి వచ్చాక రంజిత్ శ్రీవాస్తవ కుమారుడు తనకు అలాంటి రోబో కావాలని మారాం చేశాడు. కొడుకు కోరికను సవాలుగా తీసుకున్న రంజిత్, తనకు ఎలాంటి లాబొరేటరీ లేకున్నా, సాంకేతిక బృందం సహకారం లేకున్నా పట్టుదలతో ‘రశ్మి’ రోబోను తయారు చేసి కొడుకు కోరికను తీర్చడమే కాదు, రోబోటిక్స్లో మన దేశం మరో మైలురాయిని అధిగమించేందుకు దోహదపడ్డారు. -
ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే
చెన్నై: కరోనా వచ్చిన నాటి నుంచి పలు దేశాల్లో రోబోల వాడకం పెరిగిపోయింది. కరోనా కట్టడి కోసం సామాజక దూరం తప్పని సరి కావడంతో రోబోల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఓ బట్టల దుకాణాదారుడు.. కస్టమర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచన చేశాడు. దానిలో భాగంగా షాప్లోకి వచ్చే కస్టమర్లకు శానిటైజర్ అందించడం.. టెంపరేచర్ చెక్ చేయడం కోసం ఓ రోబోను ఏర్పాటు చేశాడు. అంతటితో ఊరుకోక ఆ రోబోకు చక్కగా చీర కట్టి అందంగా ముస్తాబు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.(కరోనాపై పోరుకు కొత్త అస్త్రం!) సుధా రామేన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ‘తమిళనాడులోని ఓ బట్టల దుకాణం సాంకేతికతను సరైన మార్గంలో వినియోగించుకుంటోంది. చీర కట్టులో మెరిసిపోతున్న ఓ మర మనిషి కస్టమర్ల దగ్గరకు వెళ్లి శానిటైజర్ అందిస్తోంది’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 35వేల మంది లైక్ చేశారు. ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే.. మోడల్ కం హెల్పర్.. మీ ఐడియా సూపర్’ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు.(‘గాడిద సార్.. మాస్క్ ధరించదు’) -
కరోనా చికిత్సల్లో రోబో
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బం ది జంకుతున్నారు. నేరుగా వారి వద్దకు వెళ్లి చికిత్స చేయడం ప్రాణసంకటంగా మారుతోం ది. సాధారణ ప్రజల కంటే వైద్య సిబ్బందే కరో నా బారినపడే ప్రమాదం అధికంగా ఉంది. మరోవైపు వైద్యులు తమ వద్దకు వచ్చి చికిత్స చేయడం లేదన్న ఫిర్యాదులు కూడా కరోనా రోగుల నుంచి వస్తున్నాయి. కరోనా యుద్ధం లో ముందుండి పోరాడే వైద్య సిబ్బందిని కా పాడుకోవడం, కరోనా రోగులకు సక్రమంగా వైద్యం చేయడం ఇప్పుడున్న ప్రధాన సవాల్. ఈ సవాల్ను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఎదుర్కోవాలన్న దానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు రోబోలను రంగంలోకి దింపారు. తద్వారా అక్కడ అనేకమంది వైద్య సిబ్బందిని కాపాడుకోగలిగారు. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో రోబోలను కరోనా రోగులకు సేవలు అందించడంలో భాగస్వామ్యం చేస్తున్నారు. రోగికి రోబోనే అండాదండ... రోబోలను ఉపయోగించడం వల్ల రోగికి, వైద్య సిబ్బందికి మధ్య భౌతిక దూరాన్ని పాటించడానికి వీలు కలుగుతుంది. చైనాలో అనేక ఆసుపత్రులు రోగులకు ఆహారాన్ని అందించడం, జ్వ రాన్ని తెలుసుకోవడం, మందులను పంపిణీ, ఆసుపత్రులను పూర్తిస్థాయిలో క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయడం వంటి వాటికి హైటెక్ రోబోలను ఉపయోగించారు. స్పానిష్ ప్రభుత్వం రోజుకు 80 వేల మంది రోగులను పరీక్షించడానికి రో బోలను ఉపయోగించింది. మన దేశంలో చూస్తే చెన్నైలోని ప్రభు త్వ స్టాన్లీ బోధనాసుపత్రిలో కరో నా రోగుల సేవకు రోబోటిక్ నర్సు ను అందుబాటులోకి తెచ్చారు. రోగికి నర్సు చేసే అన్ని సపర్యలనూ రోబోటిక్ నర్సు చేస్తుంది. అలాగే రోగులకు ఆహారం, నీరు, మందులను కూడా రోబోనే అందిస్తుంది. ఆ రోబోను ఎలా ఉపయోగించాలో నర్సుకు శిక్షణ ఇచ్చా రు. రోగి ఇబ్బందులను కూడా రోబోనే తెలుసుకుంటుంది. తద్వారా నర్సు ఇచ్చే ఆదేశాల ను రోబో పాటించి ఆ మేరకు రోగికి సేవలు చేస్తుంది. అలా రోబోకు రిమోట్ ద్వారా ఆదేశా లిస్తూ కరోనా రోగులకు సేవలు చేసే వీలు ఏర్పడింది. కేరళలో మాస్క్లు, శానిటైజర్ల పం పిణీకి హ్యూమనాయిడ్ రోబోలను ఉపయోగించారు. అలాగే కొచ్చికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించడానికి ఒక రోబోను అభివృద్ధి చేసింది. 3 చక్రాల రోబో ఆహారం, వైద్య, క్లినికల్ వినియోగ వస్తువులను తీసుకువెళ్ళగలదు. దీన్ని ప్రధానంగా ఐసోలేషన్ వార్డుల్లో ఉపయోగించుకునేలా రూపొందించారు. వీడియో కాలింగ్ ద్వారా వైద్యులు లేదా బంధువులు రోగులతో మాట్లాడేలా దీన్ని తయారు చేశారు. ఇదిలా ఉండగా నటుడు మోహన్ లాల్ తన ఫౌండేషన్కు చెంది న వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డులో రోబోను వినియోగిస్తున్నారు. ఇక ఢిల్లీ ఎయి మ్స్ ఆసుపత్రి కరోనా వార్డుల్లోని ఫ్లోర్లను క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయడానికి హ్యూమనాయిడ్ రోబోట్ను ఉపయోగిస్తున్నా రు. బెంగళూరులోని ఒక ఆసుపత్రి ప్రాంగణం లోకి ప్రవేశించే వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ పరీక్షించడానికి ప్రవేశద్వారం వద్ద ఇంటరాక్టివ్ రోబోట్ను ఉపయోగిస్తున్నారు. జార్ఖండ్లోని చైబాసా పట్టణంలో జిల్లా డిప్యూ టీ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి ఆదిత్య రంజన్ చైనా ఎలా రోబోలను వినియోగించుకుందో అధ్యయనం చేసి, ఆ ప్రకారం తాను అటువంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. ఇలా మన దేశంలో కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బంది పనిభారాన్ని రోబోలు పంచుకుంటున్నాయి. ఆస్పత్రులను క్రిమి సంహారకం చేయడం నుండి, రోగులను పర్యవేక్షించడం, వారికి భోజనం, మం దులు, శానిటైజర్ల పంపిణీ వరకు ఉపయోగపడుతున్నాయి. జ్వరం, పల్స్, బీపీ చెక్ వంటివి ఇవే చేస్తున్నాయి. -
కరోనాపై పోరుకు కొత్త అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రీవాక్స్ ఫార్మా ఓ వినూత్నమైన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లోని ఐసీయూ వార్డుల్లో ఉండే పడకలను కరోనా వైరస్ రహితంగా మార్చేందుకు ఓ రోబోటిక్ శుద్ధి యంత్రాన్ని సిద్ధం చేసింది. 5 నిమిషాల్లోనే ఓ పడకను తనంతట తానే అన్ని వైపుల నుంచి శుద్ధి చేయడం ఈ యంత్రం విశేషం. యూవీ–బీఆర్ అని పిలుస్తున్న ఈ యంత్రంలో బ్యాక్టీరియా/వైరస్లోని డీఎన్ఏను నాశనం చేయగల స్థాయిలో అతినీలలోహిత కిరణాలను ప్రసారం చేస్తుంది. ఐసీయూ పడకలను శుద్ధి చేసేందుకు ప్రస్తుతం రసాయనాలను వాడుతున్నారని యూవీ–బీఆర్ మాత్రం వాటితో పనిలేకుండా కరోనా వైరస్ మాత్రమే కాకుండా దాదాపు 11 రకాల వైరస్లను, 14 రకాల బ్యాక్టీరియాను 99.99 శాతం చంపేయగలవని రీవాక్స్ ఫార్మా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జి.ప్రణయ్రెడ్డి తెలిపారు. అతినీలలోహిత కిరణాలతో వైరస్లను నాశనం చేసే పరికరాలు కొన్ని ఇప్పటికే మార్కెట్లో ఉన్నా.. యూవీ–బీఆర్ వాటికంటే శక్తిమంతమైందని, 254 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యపు కిరణాలను విడుదల చేస్తుందని వివరించారు. యూవీ–ఎస్టీ పేరుతో ఇంకో యంత్రాన్ని కూడా తయారు చేశామని, దీన్ని ఫార్మా కంపెనీలు, ఆహార పరిశ్రమల్లో వాడొచ్చని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఏడిద జగన్ తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్పత్రుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు యూవీ–బీఆర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ యంత్రంపై తాము ప్రత్యేక పేటెంట్ కూడా సంపాదించామని చెప్పారు. విజయవంతంగా పూర్తయిన పరీక్షలు.. యూవీ–బీఆర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో జరిపిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని, మెడికవర్, విరించి ఆస్పత్రులు కూడా ఈ యంత్రాలను కొనుగోలు చేశాయని ప్రణయ్రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆస్పత్రులతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. యంత్రం ఖరీదు వివరాలు త్వరలోనే చెబుతామని, వీలైనంత తక్కువ ధరలోనే అందరికీ ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. -
కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోతో సేవలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోలతో సేవలు అందించనున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రోబోల సేవలను తొలిసారిగా నెల్లూరులోనే ప్రేవేశపెట్టామన్నారు. కాగా రీజనల్ కోవిడ్ సెంటర్లలో ఇకపై రోబోలు సేవలు అందించనున్నాయని చెప్పారు. నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను జిల్లా అధికారులకు అందించి దీని పనితీరుపై ఆ సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ డెమో ఇచ్చారు. (లాక్డౌన్: ఇళ్లకు వెళతాం.. వదిలేయండి!) కాగా డెమోలో రోబో పనిదీరుపై కోవిడ్-19 ప్రత్యేక ఐఏఎస్ అధికారి రామ్ గోపాల్, కలెక్టర్ శేషగిరి బాబు, జేసీ డాక్టర్ వినోద్ కుమార్లు పరీశిలించి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ రోబో ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని పాజిటివ్ వ్యక్తులకు సరఫరా చేస్తుందని అధికారులతో పేర్కొన్నారు. అంతేగాక జిల్లాకు మరో రెండు రోబోలను కూడా అందుబాటులోకి తెస్తామని సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ అధికారులకు తెలిపారు. (న్యూయార్క్లో లాక్డౌన్ పొడగింపు!) -
రోబోలతో రోబోల కోసం
చందమామని అందుకోవాలన్న భారత్ కలలు ఈ ఏడాది కొంతవరకు ఫలించాయి. ఇస్రో చంద్రయాన్–2 ఇంచుమించుగా విజయం సాధించింది. చిన్న సాంకేతిక లోపంతో చంద్రుడిపైకి వెళ్లి కూడా నిలబడలేకపోయింది. ఒకట్రెండు సంవత్సరాల్లో చంద్రుడిపైకి మనుషుల్ని పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకుడిపైకి మనుషుల్ని పంపే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జపాన్ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. 2020లో చంద్రుడిపై ఒక స్థావరం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్థావరం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని రోబోలే నిర్మిస్తాయి. ఆ స్థావరంలో రోబోలే ఉంటాయి. చంద్రుడికి ఆవలివైపు వెళ్లాలన్నా, ఖగోళ రహస్యాలను ఛేదించాలన్నా, అంగారకుడిపై పరిశోధనలు చేయాలన్నా చంద్రుడిపై ఇంధనం నింపుకోవడానికి ఒక స్థావరం ఎంతో అవసరం. చంద్రుడిపై హీలియం నిల్వలు ఉన్నాయని భావిస్తుండటంతో అక్కడే ఇంధనం తయారు చేయొచ్చన్న ఆలోచనలూ ఉన్నాయి. -
మీ లంచ్ను రోబోలు తెచ్చేస్తాయి!
టెక్నాలజీ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి అవసరానికి కూడా టెక్నాలజీ వచ్చేసింది. ఆన్ లైన్లో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి చిన్నదానికి కూడా ఇబ్బంది లేకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక రోబోలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కారం కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సినిమాలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో అన్ని పనులు చేయగలుగుతుంది. మాట్లాడుతుంది. పనిచేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది. కోపం వస్తే కొట్టేస్తుంది. మనం ఏం చెబితే అదే చేస్తుంది. ప్రస్తుతం మనుషులు చేస్తున్న, చేయలేని దాదాపు అన్ని పనులనూ రోబోలు చేస్తున్నాయి. సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే వరకు.. ఇలా అన్ని రంగాల్లోనూ మర మనుషులు సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ రంగంలోకి రోబోలు వచ్చేశాయి. ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫేమస్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. వెంటనే ఓ రోబో ఆ రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడున్న ఓ వెయిటర్.. సదరు వ్యక్తి ఆర్డర్ చేసిన పుడ్ను ఆ రోబోలో సర్దాడు. అంతే ఆ రోబో రోడెక్కింది. నెమ్మదిగా బయలుదేరి ఆ వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వెంటనే మీ ఫుడ్ మీ ఇంటి ముందుకు వచ్చింది అంటూ ఓ మెసేజ్ వచ్చింది. తలుపు తీసి చూస్తే ఓ బుల్లి రోబో ఇంటి ముందు వేయిట్ చేస్తోంది. స్మార్ట్ఫోన్లో ఓ బటన్ నొక్కగానే రోబో తన మూతను అన్లాక్ చేసింది. వెంటనే ఆవ్యక్తి ఫుడ్ తీసుకున్నాడు. రోబో థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. ఇదంత వినడానికి ఆశ్చర్యంగా, ఏదో సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది కదా..! కానీ ఇది నిజం. తమ విద్యార్థులకు పుడ్ డెలివరీ చేయడం కోసం బుల్లి రోబోలను ఉపయోగిస్తుంది అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం. విద్యార్థులకు ఫుడ్ సరఫరా చేయడం కోసం స్టార్షిప్ టెక్నాలజీస్ సంస్థ నుంచి 30 రోబోలను కొనుగోలు చేసింది. సమయం ఆదా.. రోబోలతో పుడ్ డెలివరీ చేయడం ద్వారా విద్యార్థులకు విలువైన సమయం ఆదా అవుతుందని యూనివర్సీటీ యాజమాన్యం చెబుతోంది. భోజనం కోసం లైన్లో నిలబడటానికి ఇష్టపడని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ రోబోలను తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ఆదా అయిన సమయాన్ని ఇతర అంశాలపై పెట్టి వారు అనుకునేది సాధించగలరనే ఆశాభావంతో రోబోలను ప్రవేశపెట్టామని యూనివర్సీటీ యాజమాన్యం పేర్కొంది. ఎలా పనిచేస్తాయి స్టార్షిప్ యాప్ ద్వారా కావాల్సిన రెస్టారెంట్లో ఫుడ్ను ఆర్డర్ చేయాలి. డబ్బులు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. తర్వాత స్టార్షిప్ టెక్నాలజీస్ నుంచి ఆరుచక్రాల ఓ రోబో ఆ రెస్టారెంట్కు వెళ్తుంది. అక్కడ ఉన్న వెయిటర్.. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ను రోబోలో సర్దుతారు. వెంటనే ఆ రోబో రోడెక్కి మన దగ్గరకు వస్తుంది. మన ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. బుల్లి రోబో మనవద్దకు రాగానే స్మార్ట్ఫోన్ ద్వారా ఓపెన్ బటన్ నొక్కాలి. వేంటనే రోబో మూత తెరచుకుంటుంది. పుడ్ను తీసుకోగానే అన్లాక్ అవుతుంది. అనంతరం రోబో అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. బర్గర్, కాఫీ.. ఏదైనా.. స్టార్షిప్ సంస్థ వారి యాప్ ద్వారా బర్గర్, కాఫీ, టీ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో మూడు రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆరు కాళ్లు ఉండే ఈ రోబోలు ఆ వస్తువులు ఎక్కడ డెలివరీ ఇవ్వాలో వారి ఇంటి ముందుకు వెళ్లి ఇచ్చేలా వీటిని రూపొందించారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఈ రోబోలు మెట్లు ఎక్కగలవు, ఎత్తైన ప్రదేశాల నుంచి వెళ్లగలవు. రోడ్డుపై వాహనాలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలవు. ప్రతి రోబోలో తొమ్మిది కెమెరాలు అమర్చారు. 100 యూనివర్సీటీలు లక్ష్యం స్టార్షిఫ్ రోబోలు ఇప్పటి వరకు నాలుగు యూనివర్సీటీలలో ఉపయోగిస్తున్నారు. మొదటగా జార్జ్ మాసన్ యూనివర్సీటీలో, తర్వాత నార్తర్న్ అరిజోనా, పర్డ్యూ, విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయాల్లో వినియోగించారు. రానున్న రెండేళ్లల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 యూనివర్సీటీలకు తమ రోబోలను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్టార్షిప్ టెక్నాలజీస్ సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల్లో ఈ బుల్లి రోబోలను అన్ని నగరాల్లోనూ చూడగలుగుతామేమో! -
స్పర్శను గుర్తించే రోబో చర్మం
బెర్లిన్: ఇకపై రోబోలు స్పర్శకు స్పందిస్తాయి. చుట్టూ ఉన్న వేడిని, వాతావరణంలో మార్పును, ప్రమాదాలను గుర్తించగలవు. రోబో శరీరంపై అమర్చిన ప్రత్యేకమైన చర్మం ద్వారా అవి వీటిని చేయగలవు. రోబోలు ఈ పనులు చేయగలిగేలా చేసే చర్మాన్ని జర్మనీకి చెందిన మునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు తయారుచేశారు. చర్మం తీరిది... ఈ చర్మంలో హెక్సాగోనల్ సెల్స్ను అమర్చారు. ఇందులోని ప్రతి సెల్ ఒక మైక్రోప్రాసెసర్ను, కొన్ని సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇవి వేగాన్ని, ఉష్ణోగ్రతను, చిన్న మార్పులను సైతం గుర్తించగలవు. స్పర్శాజ్ఙానం పెరగడం వల్ల, రోబోలు మరింత కచ్చితత్వంతో పనిచేస్తాయని చర్మాన్ని రూపొందించిన గోర్డోన్ చెంగ్, అతని బృందం తెలిపారు. చర్మం సెల్స్ను పదేళ్ల క్రితమే తయారుచేశామని అయితే దాన్ని రోబోలు ఆకళింపు చేసుకునేలా సాంకేతికత అభివృద్ధి చెందడానికి సమయం పట్టిందన్నారు. సెన్సార్ల నుంచి వచ్చే సమాచారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమాచారం ఎక్కువ కాకూడదు.. గతంలో తయారుచేసిన సెల్స్తో సమాచారం అధికంగా వచ్చేదని దీని వల్ల పనితీరు 90 శాతం వరకూ తగ్గిందని తెలిపారు. మనుషుల్లాగే సమాచారాన్ని పంపే వ్యవస్థ తయారీ కోసం లోతైన పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఉదాహరణకు మనిషి టోపీ ధరిస్తే, పెట్టుకున్న వెంటనే సమాచారం అందుతుంది. కానీ సమయం గడిచే కొద్దీ టోపీ ఉందన్న సంగతి కూడా మర్చిపోతాం. రోబో చర్మాన్ని కూడా అలాంటి సమాచార వ్యవస్థతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడ ఉపయోగపడతాయంటే.. ప్రస్తుతం తయారుచేసిన రోబోలో 1,260 సెల్స్ ఉన్నాయి. అందులో 13 వేలకు పైగా సెన్సార్లు ఉన్నాయి. వీటిని తల, చేతులు, మొండెం, కాళ్లు, కాలి వేళ్లలో అమర్చారు. వీటి వల్ల స్పర్శను గుర్తించే శక్తి రోబోకు అందుతుంది. నేల చదునుగా ఉన్న ప్రాంతాల్లో కాలి వేళ్ల సెన్సార్ల ద్వారా గుర్తించి జాగ్రత్తగా నడుస్తుంది. మనుషులకు హాని కలగకుండా ఆలింగనం చేసుకోగలదు. ఒకే కాలిపై నిలబడగలిగే సదుపాయాన్ని కూడా ఇందులో పొందుపరచారు. అయితే ఈ రోబోలు పరిశ్రమల అవసరాలకు ఉపయోగవడవు. వృద్ధులు, రోగులకు సహాయం అందించడం, మనుషులతో దగ్గరగా ఉండే పనులు చేయడంలో మాత్రమే ఉపయోగపడతాయి. -
రోబో 2.0 రీలోడెడ్..
ఆ పని.. ఈ పని అని లేదు.. అన్నింటా మేమే అన్నట్లు తయారయ్యాయి ఈ రోబోలు.. కొత్త కొత్త రంగాల్లోకి దూసుకుపోతున్నాయి.. రోబో 2.0 రీలోడెడ్ టైపన్నమాట. ఇంతకీ విషయమేమిటంటే.. అమెజాన్ ప్రైమ్.. దీని గురించి తెలియని వారుండరు. తెలియని విషయమేమిటంటే.. ఇప్పుడా అమెజాన్ ప్రైమ్ డెలివరీలు మనుషులు కాకుండా రోబోలు చేయనున్నాయి. ఇందుకోసం అమెజాన్ తన పరిశోధన కేంద్రంలో ప్రత్యేకమైన సెల్ఫ్ డ్రైవింగ్ డెలివరీ రోబోలను తయారుచేసింది. అంతేకాదు.. త్వరలో 6 స్కౌట్ రోబోలు వాషింగ్టన్లోని స్నహామిష్ కౌంటీలో డెలివరీలు కూడా ప్రారంభిస్తాయని ప్రకటించింది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ రోబోలు తమంతట తామే అడ్రస్కు వెళ్లి.. సరుకులు ఇచ్చి వస్తాయి. ఎవరినీ గుద్దేసే ప్రసక్తే లేదు.. ఎదురుగా ఎవరైనా వస్తే.. సైడిచ్చి మరీ ముందుకెళ్తాయి. అయితే, సదరు వినియోగదారులు అసలైనవారో కాదో అన్న విష యం ఇదె లా నిర్ధరించుకుంటుందన్న వివరాలను మాత్రం అమెజాన్ తెలియజేయలేదు. గతంలో వచ్చిన ఫుడ్ డెలివరీ రోబోలో అయితే వినియోగదారులు తమ మొబైల్కు వచ్చే.. ఓ ప్రత్యేకమైన కోడ్ను రోబో స్క్రీన్ మీ ద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తొలి దశలో తమ సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తారని.. తదనంతర దశలో ఇవి తమంతట తాము వెళ్లి డెలివరీ చేస్తాయ ని అమెజాన్ తెలిపింది. రోబోలే కాదు.. డెలివరీ డ్రోన్లను కూడా తాము తయారుచేస్తున్నామని.. తదనంతర దశలో ఉపయోగిస్తామని పేర్కొంది. ఎయిర్పోర్టులో పార్కింగ్ అంటే పెద్ద పరేషానీనే.. అయితే, ఆ పనిని కూడా సునాయాసంగా చేయడానికి రోబోలు వచ్చేశాయి. చూశారుగా.. దీని పేరు స్టాన్. ఈ ఆగస్టులో బ్రిటన్లోని గాట్విక్ ఎయిర్పోర్టులో ఈ రోబో వ్యాలెట్లు రంగంలోకి దిగనున్నాయి. వీటిని ఫ్రాన్స్కు చెందిన స్టాన్లీ రోబోటిక్స్ కంపెనీ తయారుచేసింది. ఆగస్టు నుంచి 3 నెలలపాటు వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూడనున్నారు. ఇంతకీ ఇదేం చేస్తుందో తెలుసా? మీరు మీ కారును డ్రాపింగ్ జోన్లో వదిలేస్తే.. ఇది దాన్ని తీసుకెళ్లి.. జాగ్రత్తగా పార్క్ చేసి పెడుతుంది. కారు వద్దకు వెళ్లేందుకు.. ఆ కారును పార్కింగ్ ప్లేస్ వద్దకు తీసుకెళ్లేందుకు స్టాన్.. సైన్యంలో వాడే అత్యున్నత స్థాయి జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకుంటుంది. కారు షేప్, సైజును ఇవి స్కాన్ చేసుకుని.. దానికి తగ్గట్లుగా జాగా చూసుకుని పార్క్ చేస్తాయి. దీని వల్ల ప్రయాణికులకు సౌలభ్యం మాట పక్కనపెడితే.. మామూలుగా మనం.. 170 కార్లు పార్క్ చేసే స్థలంలో.. ఇవి 270 కార్లను పట్టించేస్తాయట. అదీ ఒకదానికి ఒకటి తగలకుండానే.. మళ్లా అవసరం పడితే.. వాటిని అక్కడి నుంచి తెచ్చి.. మనకు అందుబాటులో ఉంచుతాయి. బాగుంది కదూ.. -
రోబో రైతులకు పొలం పరీక్ష!
అన్ని రంగాల్లోకి విస్తరించిన రోబోలు ఇప్పటివరకూ వ్యవసాయంలో అడుగు పెట్టింది మాత్రం తక్కువే. ఈ లోటును పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్లోని ఓ సూపర్ మార్కెట్. స్మాల్ రోబోట్ పేరున్న కంపెనీ తయారు చేసిన బుల్లి రోబోలను లెక్ఫోర్డ్ ఎస్టేట్లో మూడేళ్ల పాటు పరీక్షించేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్టేట్లో టామ్, డిక్ అండ్ హ్యారీ అనే మూడు రోబోలు పనిచేయడం మొదలుపెట్టనున్నాయి. గోధుమలు పండించే ఈ పొలంలో రోబోల వల్ల దిగుబడి ఏమైనా పెరుగుతుందా? అన్నది పరిశీలిస్తారు. పెరిగిపోతున్న సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు.. పర్యావరణానికి మేలు చేసేందుకు ఈ రోబోలు ఉపయోగపడతాయని స్మాల్ రోబోట్ కంపెనీ అంటోంది. ఒక్కో రోబో పది కిలోల బరువు ఉంటుందని కెమెరాల సాయంతో ఇది పొలం మొత్తం తిరుగుతూ ప్రతిమొక్కను పరిశీలిస్తుందని లెక్ఫోర్డ్ ఎస్టేట్కు చెందిన ఆండ్రూ హోడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రతి మొక్కకు వాటి ఆరోగ్యం ఆధారంగా కావాల్సినంత మేరకే ఎరువులు వేయడం, క్రిమి సంహారక మందులు వాడటం ఈ రోబోల ప్రత్యేకత. ఈ చర్యల ఫలితంగా పంట సాగు ఖర్చు 60 శాతం వరకూ తగ్గుతుందని, ఆదాయం 40 శాతం వరకూ పెరుగుతుందన్నది తమ అంచనా అని ఆండ్రూ తెలిపారు. చీడపీడలను నాశనం చేసేందుకు ఒక రోబో లేజర్ కిరణాలను వాడుతుందని చెప్పారు. -
యుద్ధరంగంలో రోబోలు
ఇంగ్లండ్: ప్రస్తుతం మనుషులు చేస్తున్న, చేయలేని దాదాపు అన్ని పనులనూ రోబోలు చేస్తున్నాయి. నైపుణ్యంతో సంబంధం ఉన్న పనులను కూడా రోబోలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మనల్ని మరింత ఆశ్చర్యానికి, భయానికి లోనుచేసే ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే... త్వరలో రోబోలు యుద్ధరంగంలోకి అడుగుపెట్టబోతున్నాయట. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నా.. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం ముందడుగు వేసింది. బ్రిటిష్ సైన్యంలో రోబోలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆటోమెటిక్ ఆయుధాలను పరీక్షించే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఎక్కడో దూరంగా ఉండి కంట్రోల్ చేసే సాయుధ వాహనాలు, రోబో గన్లను విజయవంతంగా పరీక్షించారు. అయితే తాము మనుషులను చంపే రోబోలను తయారు చేయడం లేదని బ్రిటన్ చెబుతోంది. కానీ ఇలాంటి ఆయుధాల వినియోగంపై కొన్ని నైతికపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘మేం మానవ నియంత్రణ లేకుండా యుద్ధ రంగానికి వెళ్లి, పోరాటం చేసే ఆటోమెటిక్ వాహనాలను ఎప్పుడూ ఉపయోగించబోమ’ని బ్రిటిష్ సైన్యానికి చెందిన బ్రిగేడియర్ కెవిన్ కాప్సీ తెలిపారు. అయితే యుద్ధంలో వాటంతటవే పనిచేసే ఆయుధాలను ఉపయోగించడంపై ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు లేవు. ఈ విషయమై నోబెల్ గ్రహీతలు, హక్కుల సంస్థలు మాత్రం ఇలాంటి ఆయుధాలను నిషేధించాలని కోరుతున్నారు. -
ఈ అవతార్.. కొత్తది యార్..
జాబిల్లి మట్టిని ముట్టుకుంటే ఎలా ఉంటుంది? అంగారకుడిపై ఉండే అగ్నిపర్వతం ఎత్తు ఎంత? ఇవేమిటి.. వీటితోపాటు సుదూర గ్రహాల విషయాలు మీరు స్వయంగా అనుభూతి పొందే రోజు వచ్చేస్తోంది ఎలాగంటారా? మీ అవతారాలను రోబోల రూపంలో ఇతర గ్రహాలపైకి పంపేస్తే సరి అంటోంది జపాన్! అవతార్ గుర్తుంది కదా.. హాలీవుడ్లో సూపర్హిట్ సినిమా ఇది. మనిషి పండోరా అనే గ్రహంపైకి వెళ్లడం.. ఆ గ్రహంపై హీరో ఓ యంత్రంలో పడుకుంటాడు. యంత్రం ఆన్ కాగానే.. అతడి మెదడులోని ఆలోచనలన్నీ ఆ గ్రహంపై ఉండే జీవి శరీరంలోకి చేరిపోతాయి. ఆ అవతారంతో గ్రహంపై హీరో కొన్ని పనులు చక్కబెట్టడం స్థూలంగా ఆ సినిమా ఇతివృత్తం. జపాన్ విమానయాన సంస్థ ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ (ఏఎన్ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)లు ఇప్పుడు ‘అవతార్ ఎక్స్’ పేరుతో చేపట్టిన ఓ ప్రాజెక్టు అవతార్ సినిమా కథకు ఏమాత్రం తీసిపోనిది. కాకపోతే ఇందులో యుద్ధాలు ఏమీ ఉండవు అంతే తేడా. మరి ఏముంటాయి అంటారా? మనిషి భూమ్మీద డ్రిల్లింగ్ మెషీన్తో పనిచేస్తూంటే.. ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ల దూరంలో రోబోల రూపంలో ఉండే మనిషి అవతారాల చేతుల్లోని యంత్రాలు పనిచేస్తాయి! జాబిల్లిపైకి కానివ్వండి.. మనం ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్న అంగారకుడిపైన కానివ్వండి ప్రయోగాలు చేయడం ఆషామాషీ కాదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాల ద్వారా మనిషి ఇప్పటివరకూ చేరగలిగింది జాబిల్లిపైకి మాత్రమే. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి మనిషిని పంపే ఆలోచనలు ఉన్నా అవి ఎంత వరకు విజయవంతమవుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో జపాన్ సంస్థలు ఓ వినూత్న ఆలోచనతో అవతార్–ఎక్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. ఇతర గ్రహాలపైకి మనిషిని పంపకుండానే.. అవసరమైన అన్ని ప్రయోగాలు చేసేందుకు రోబోలను మాధ్యమంగా ఎంచుకున్నాయి. ఇందుకోసం ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వర్చువల్ రియాలిటీ, హ్యాప్టిక్ టెక్నాలజీ (స్పర్శ, రుచి, వాసన వంటి అనుభూతులను కలిగించేవి)లను వాడుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది మార్చిలోనే భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఏఎన్ఏ ‘అవతార్ విజన్’ పేరుతో జాక్సా ‘జే–స్పార్క్’ పేరుతో ఈ పథకానికి సంబంధించిన ప్రణాళికను విడుదల చేశాయి. తాజాగా ఈ రెండు సంస్థలు కలసి ‘అవతార్ – ఎక్స్’కు శ్రీకారం చుట్టాయి. ఒయిటాలో అత్యాధునిక పరిశోధనశాల.. అవతార్–ఎక్స్ కోసం జపాన్లోని క్యూషూ దీవిలో ఉండే ఒయిటా ప్రాంతంలో ఓ భారీ ప్రయోగశాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అభివృద్ధి చేసే కొత్త కొత్త సాంకేతికతలన్నింటి ప్రయోగాలు ఇక్కడే జరుగుతాయి. 2020–25 మధ్యకాలంలో ఈ టెక్నాలజీలన్నింటినీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, భూమి దిగువకక్ష్యల్లో పరిశీలించి చూస్తారు. ఈ సమయంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించేందుకు కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఏ టెక్నాలజీలు మనిషి ఇతర గ్రహాలపై సుఖంగా నివసించేందుకు అవసరమైన అన్ని టెక్నాలజీలను అవతార్ ఎక్స్లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. రోబోలను భూమ్మీద నుంచే నియంత్రిస్తూ అంతరిక్షంలో నిర్మాణాలు ఎలా చేయాలి.. ఆయా గ్రహాలపై ఎగిరే విమానాలను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా భూమ్మీది పైలట్లు నియంత్రించడం ఎలా.. అన్నవి కూడా ఇందులో ఉంటాయి. భవిష్యత్తులో జాబిల్లి, అంగారక గ్రహాలపై మనిషి ఏవైనా కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. వాటిని ఇక్కడి నుంచే నియంత్రించడం ఎలా అన్నది కూడా అవతార్ ఎక్స్లో భాగంగా ఉంటుంది. ఆయా గ్రహాలపై ఉన్న అనుభూతిని అందరికీ కలిగించగలిగే టెలీప్రెజెన్స్ టెక్నాలజీల ద్వారా సామాన్య ప్రజలకు వినూత్నమైన వినోదాన్ని అందించొచ్చని జాక్సా, ఏఎన్ఏలు భావిస్తున్నాయి. టెలీప్రెజెన్స్ టెక్నాలజీ కోసం ఏఎన్ఏ రూ.700 కోట్ల మొత్తంతో అవతార్ ఎక్స్ ప్రైజ్తో ఓ పోటీని కూడా ఏర్పాటు చేసింది. – సాక్షి, హైదరాబాద్ -
చైనా రెస్టారెంట్లలో అన్ని పనులకూ రోబోలే!
షాంఘై: మొబైల్లో బుక్ చేసుకుని చైనాలోని ఈ రెస్టారెంట్కి వస్తే చాలు. సాదరంగా ఆహ్వానించి కోరిన పదార్థాలు తెచ్చి వడ్డిస్తారు. ‘ఎంజాయ్ యువర్ మీల్ ’అని విష్ చేసి వెళ్తారు. వీరు టిప్ కూడా అడగరు! అవును.. వీరు అంటే మనుషులు కాదు రోబోలు! చైనా వ్యాపార దిగ్గజం ఆలీబాబా ఈ కామర్స్లో భాగంగా ఇలాంటి రెస్టారెంట్లను నిర్మించాలయోచిస్తోంది! 2020 వరకు చైనాలో ఇలాంటివి వెయ్యి ప్రారంభించాలని సంకల్పించింది. చైనాలో వెయిటర్స్ జీతాలు పెరిగిపోతున్నాయని, నెలకు రూ.లక్ష చెల్లించాల్సి వస్తోందని ఈ ప్రతిపాదన రూపకర్త, అలీబాబా ప్రోడక్ట్ మేనేజర్ కావ్ హైతో పేర్కొన్నారు. ఈ భారం వినియోగదారులపై పడి రెస్టారెంట్లలో తినడానికే జంకుతున్నారట. ప్రస్తుతం నలుగురు కలసి భోజనం చేయాలంటే రూ.4,000 ఖర్చవుతుంది. ఈ ప్రతిపాదనతో అది రూ.1,000కి దిగివస్తుందని అంచనా. ‘కార్మికుల జీతాలు ఇలాగే పెరుగుతూ పోతే మనుషుల స్థానంలో రోబోలు వస్తాయనడంలో అనుమానం లేదు’అని రోబోటిక్స్ ప్రొఫెసర్ వాంగ్ అంటున్నా -
క్రికెటర్లు రోబోలు కాదు...
మైదానంలో భావోద్వేగాలు ప్రదర్శించడం, దూకుడుగా కనిపించడం ఆటలో భాగమే. మైదానంలో రోబోల్లా కనిపించే ఆటగాళ్లను మేం చూడాలనుకోవడం లేదు. అయితే క్రికెటర్లు తమ పరిధి దాటకుండా ఉండటం కూడా ముఖ్యం. బూతులు మాట్లాడకుండా కూడా దూకుడు ప్రదర్శించవచ్చు. ఇటీవలి జరిగిన కొన్ని సంఘటనలకు (రబడ తరహా) నేను మద్దతివ్వడం లేదు కానీ శిక్షల భయంతో ఆటగాళ్లు కనీసం ఒకరి వైపు మరొకరు కూడా చూసుకోకుండా ఉండే పరిస్థితి రావడం మంచిది కాదు. – బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ -
డీఎన్ఏ రోబోలతో కేన్సర్ వేట
కాగితాన్ని రకరకాల ఆకారాల్లోకి మడిచేసే ఒరిగామి.. రక్తాన్ని గడ్డకట్టించేందుకు వాడే మందు.. అప్పగించిన పని తు.చ. తప్పకుండా చేసే రోబో..! ఈ మూడు అంశాల్లో ఏమైనా సారూప్యం ఉందా? మామూలుగా చూస్తే అస్సలు ఉండదుగానీ.. ప్రాణాంతకమైన కేన్సర్ పనిపట్టేందుకు శాస్త్రవేత్తలు ఈ మూడింటిని ఒక దగ్గరకు చేర్చారు! అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్నేళ్లలో.. డీఎన్ఏ రోబోలు మన రక్తంలో ఈదుకుంటూ వెళ్లి.. కేన్సర్ కణితులను మాయం చేసేస్తాయి! సాక్షి హైదరాబాద్ : కేన్సర్.. పేరు వినగానే చాలామంది ఇక చావు తప్పదన్న నిర్ధారణకు వచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాధిబారిన పడినా.. ఏళ్లపాటు జీవించేందుకు అవకాశాలున్నాయి. అయితే ఆయుష్షు కొంతవరకూ పెంచగలమేమోగానీ.. పూర్తిస్థాయిలో చికిత్స అన్నది ఇప్పటికీ సాధ్యం కాదనే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం చెబుతోంది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. శరీరంలో కేన్సర్ కణితులు ఎక్కడున్నా గుర్తించి మరీ వాటికి రక్తం సరఫరా చేసే నాడులను అడ్డుకోగల అద్భుత వ్యవస్థను వీరు రూపొందించారు. కేన్సర్ కణితులు వేగంగా విభజితమవ్వాలంటే కణాలకు బోలెడంత శక్తి కావాలి. ఈ శక్తి కోసం కేన్సర్ కణాలు కొత్త కొత్త రక్తనాడులను సృష్టించుకుంటాయి. దీన్నే యాంజియోజెనిసిస్ అంటారు. ఇలా కొత్త రక్తనాళాలు పెరిగే వేగాన్ని తగ్గించగలిగితే కణితుల సైజును నియంత్రించడంతోపాటు వ్యాధి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ పని ఎలా చేయాలన్న విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలోని బయోడిజైన్ ఇన్స్టిట్యూట్కు చెందిన సెంటర్ ఫర్ మాలిక్యులర్ డిజైన్ అండ్ బయో మిమిటిక్స్ విభాగపు ప్రొఫెసర్ హోయాన్ వినూత్నమైన రీతిలో పరిశోధనలు నిర్వహించారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఒరిగామి అనే జపనీస్ కళ గురించి తెలసుకోవాల్సి ఉంటుంది. కాగితాన్ని మడత పెడుతూ రకరకాల ఆకృతులను సృష్టించడం ఒరిగామి ప్రత్యేకత. కాగితానికి బదులుగా మన కణాల్లోని డీఎన్ఏతో ఓ గొట్టం లాంటి ఆకారాన్ని తయారు చేశారు ప్రొఫెసర్ హోయాన్. ఈ గొట్టం లోపలిభాగంలో రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఉపయోగించే థ్రోంబిన్ అనే మందును ఉంచారు. డీఎన్ఏ గొట్టంతో కలసి మందు రక్తనాళాల్లో కేన్సర్ కణాల పరిసరాల్లోకి చేరుతుంది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్ మూలకాలకు స్పందించి డీఎన్ఏ గొట్టం విచ్చుకుంటే.. దాంట్లోని మందు పనిచేయడం మొదలుపెడుతుంది. ఇంకేముంది.. ఆ ప్రాంతంలోని రక్తనాళం పూడిపోవడం.. దాంతోపాటే కేన్సర్ కణితి నాశనమైపోవడం చకచకా జరిగిపోతాయి. తెలివైన డిజైన్.. మామూలుగా రోబో అనగానే మనకు యంత్రుడు గుర్తుకొస్తాడు గానీ.. దీనిని డీఎన్ఏనే చాలా తెలివిగా డిజైన్ చేసి తయారు చేసిన రోబోగా చెప్పాలి. చికిత్సకు ఉపయోగించే మందు కణితి వద్దకు వెళ్లకుండానే రక్తంలో కలిసిపోకుండా ఉండేందుకు డీఎన్ఏ పోగులతో చేసిన గొట్టం లాంటి నిర్మాణాన్ని ఉపయోగించారు. పైగా మందుల జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అది అవసరమైనప్పుడే కణితుల వద్ద విడుదలయ్యేలా ఈ డిజైన్ ఉపయోగపడింది. కేన్సర్ కణాలకే పరిమితమైన ప్రొటీన్ను గుర్తించి అతుక్కునేలా ఈ గొట్టం చివరల్లో ప్రత్యేకమైన మార్కర్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ మందు ఆరోగ్యకరమైన కణాల వద్ద పనిచేసి దుష్ప్రభావాలు చూపే అవకాశాలను తగ్గించారన్నమాట. ఏఏ కేన్సర్లకు వాడవచ్చు.. ఈ కొత్త నానో డీఎన్ఏ రోబో విధానాన్ని ఎలుకల్లోని రొమ్ము కేన్సర్పై పరీక్షించి చూశారు. ఊపిరితిత్తుల కేన్సర్తోపాటు గర్భాశయ కేన్సర్లు ఉన్న ఎలుకల్లోనూ ఈ విధానం మెరుగైన ప్రభావం చూపినట్లు నేచర్ బయోటెక్నాలజీ టుడేలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. మూడు రోజుల్లో ఈ నానో డీఎన్ఏ రోబోలు కేన్సర్ కణితుల చుట్టూ ఉన్న రక్తనాళాలను మూసేయడంలో విజయం సాధించాయని, రక్త కేన్సర్ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్త కేన్సర్ల విషయంలో ఎనిమిది ఎలుకల్లో మూడింటిలో కణితులు పూర్తిగా తొలగిపోగా.. మిగిలిన వాటిలో సైజు గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా వాటి జీవితకాలం కూడా రెట్టింపు అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కణితులు ఉన్న ప్రాంతానికి దూరంగా రక్తనాళాలపై ఎలాంటి చెడు ప్రభావం చూపకపోవడం ఈ విధానం ఇంకో ప్రత్యేకత. ఎలుకలతోపాటు తాము పందులపై కూడా ప్రయోగాలు జరిపి మంచి ఫలితాలు సాధించామని ప్రొఫెసర్ హోయాన్ అంటున్నారు. ఈ నానో డీఎన్ఏ రోబోలను కేన్సర్కే కాకుండా ఇతర వ్యాధులకు చికిత్స అందించేందుకూ ఉపయోగించవచ్చని.. అవి మోసుకెళ్లే మందును మారిస్తే చాలని తాము అంచనా వేస్తున్నట్లు యాన్ చెప్పారు. -
'ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమే'
దావోస్ : ప్రపంచీకరణను ఎవరూ ఆపలేరని, ఒకవేళ ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమవుతుందని చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్మా హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచీకరణను కొనసాగించాల్సివసరం ఉంటుందని, ఇది మన బాధ్యత అని జాక్ మా తెలిపారు. దీన్ని మెరుగుపరిచే అవకాశం కూడా మనదేనన్నారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచంలో పెద్ద మొత్తంలో మార్పులు సంభవిస్తాయని ఆందోళన చెందుతుంటే, వ్యాధులు, వాతావరణ కాలుష్యం, పేదరికంపై యుద్ధం చేయాల్సి ఉందన్నారు. ఎవరూ కూడా ప్రపంచీకరణను ఆపలేరని కూడా ఉద్ఘాటించారు. వాణిజ్య లావాదేవీలు, బాంబులాంటివన్నారు. ''ఎవరూ ప్రపంచీకరణను ఆపలేరు. ఒకవేళ ట్రేడ్ ఆపితే, ప్రపంచమే ఆగిపోతుంది. ట్రేడ్ కేవలం యుద్ధం బారి నుంచి బయటపడేయగలదు. కానీ యుద్ధాన్ని సృష్టించదు'' అని పేర్కొన్నారు. టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం పరివర్తన దశలో ఉందని, ఇది ప్రజలకు ఆసక్తికరమైన కెరీర్లను సృష్టించడానికి సాయపడుతుందని తెలిపారు. కానీ కొన్ని సామాజిక సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచ వాణిజ్యం చాలా సాధారణంగా, ఆధునీకరంగా ఉండాలన్నారు. పలు అంశాలపై మాట్లాడిన జాక్ మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ), మానవ వనరులకు పెద్ద ముప్పుగా మారుతోందని, భవిష్యత్తులో చాలా మందిని ఇది రీప్లేస్ చేస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉద్యోగాలను ఏఐ, రోబోట్స్ హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ, మానవ వనరులకు మద్దతు ఇచ్చేలా ఉండాలని, టెక్నాలజీ ఎల్లప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేసేలా ఉండాలని కానీ, డిసేబుల్ చేసేలా ఉండకూడదన్నారు. ఈ శతాబ్దంలో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, అలీబాబాలు చాలా అదృష్టకర కంపెనీలని అన్నారు. -
రోడ్డున పడనున్న కోట్ల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని వింటుంటాం. కానీ దాని గురించి అంతపెద్దగా పట్టించుకోం. కానీ సమస్య అనుకున్నంత చిన్నదిగా మాత్రం లేదు. రోబోలు, ఆటోమేషన్ కారణంగా ఎంత మంది ఉపాధి కోల్పోతారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే తాజాగా తన సర్వేలో పేర్కొంది. ఈ సంఖ్య ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతుకు సమానం కావడం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించింది. ఆటోమేషన్ త్వరితగతిన విస్తరిస్తే మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్–ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని, వారికి కష్టకాలం తప్పదని పేర్కొంది. ఒకవేళ రోబోలు, ఆటోమేషన్ అనుకున్నంత వేగంగా విస్తరించకపోతే అప్పుడు వచ్చే 13 ఏళ్లలో 40 కోట్ల మంది మాత్రం కొత్త ఉద్యోగాలను వెతుక్కోవలసి ఉంటుందని తెలిపింది. మెకిన్సే 46 దేశాల్లో ఈ సర్వే చేసింది. భారత్లో 12 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!! రోబోలు, ఆటోమేషన్ వల్ల మనకూ ప్రమాదం పొంచి ఉంది. భారత్లో 11–12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావొచ్చని మెకిన్సే అంచనా వేసింది. ఇక ఎక్కువ ఉద్యోగాల కోత చైనాలో ఉండొచ్చని పేర్కొంది. ఇక్కడ దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోనున్నారని తెలిపింది. ఇక అమెరికాలో 5–8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. చైనా, భారత్, అమెరికా దేశాల తర్వాత జపాన్, మెక్సికో, జర్మనీ దేశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది. -
రోబోలు జాబ్లు మింగేయకుండా..
సాక్షి,న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ ఉద్యోగాలను కొల్లగొట్టేస్తున్న క్రమంలో మానవ వనరులను కాపాడుకునేలా నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. 1991 పారిశ్రామిక విధానం, యూపీఎ సర్కార్ 2011లో ప్రకటించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ స్ధానంలో నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటిస్తామని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. దశాబ్ధాల కిందటి పారిశ్రామిక విధానాన్ని కాలానుగుణంగా ప్రక్షాళన చేయడంతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగి సంస్కరణల వేగం పెంచేందుకు నూతన విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు ఈ ఏడాది ఆగస్ట్లో పారిశ్రామిక విధానం, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ చర్చా పత్రాన్ని జారీ చేసింది. భవిష్యత్కు సన్నద్ధంగా ఉండే పారిశ్రామిక విధానం అవసరమని పేర్కొంది. ఆటోమేషన్ దెబ్బతో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి..మరోవైపు వృద్ధి మందగమనంతో తగ్గుతున్న ఉపాథి అవకాశాల వంటి సవాళ్ల నేపథ్యంలో మెరుగైన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. -
కిల్లర్ రోబోలపై చర్చలు
జెనీవా: మానవ ప్రమేయం లేకుండానే శత్రువుల్ని గుర్తించి హతమార్చే రోబోల వినియోగంపై చర్చించేందుకు, నిబంధనల్ని రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కు చెందిన ఓ కమిటీ శుక్రవారం అంగీకారం తెలిపింది. ఐదు రోజుల పాటు ‘కిల్లర్ రోబో’ల వినియోగంపై సాగిన ఈ సమావేశంలో ఈ రోబోల్ని నిషేధించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ రోబోల వినియోగంలో కొంతైనా మానవప్రమేయం ఉండాలన్నాయి. సైనిక బడ్జెట్తో పాటు సాంకేతికత తక్కువగా ఉన్న 22 దేశాలు ఈ మేరకు స్పందించాయి. ఈ సమావేశం నిబంధనల రూపకల్పనలో తొలి అడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధ రంగంలో రోబోల వాడకంలో మానవ ప్రమేయం కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీలో ఆయుధ విభాగం చీఫ్ కత్లీన్ లాల్యాండ్ తెలిపారు. ఈ రోబోలు సామూహిక జనహనన ఆయుధాలని విమర్శించారు. కిల్లర్ రోబోల వినియోగంపై వచ్చే ఏడాది మళ్లీ సమావేశమయ్యేందుకు పలు దేశాలు అంగీకరించాయి. -
రోబోలను నమ్మలేం!
న్యూఢిల్లీ: రోబోలు తీసుకునే నిర్ణయాలపై విశ్వాసం ఉంచలేమని భారత్ సహా పలు దేశాల్లోని యువతరం చెబుతోంది. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) చేసిన తాజా సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 180 దేశాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసున్న 31 వేల మందితో డబ్ల్యూఈఎఫ్ ‘గ్లోబల్ షేపర్స్ యాన్యువల్ సర్వే–2017’ను నిర్వహించింది. సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, విలువలు, ఉద్యోగాలు, పరిపాలన తదితర అంశాలకు సంబంధించి యువతరం అభిప్రాయాలను నమోదు చేసింది. ‘అవినీతి, అసమానతలు, ఉద్యోగ, ఆర్థిక వృద్ధికి అవకాశాల కొరత, వాతావరణ మార్పులు అన్నింటికన్నా ప్రధాన సమస్యలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతరం భావిస్తోంది’ అని సర్వే నివేదిక పేర్కొంది.‘సామర్థ్యాల పెంపునకు తోడ్పడేలా మీ శరీరంలో ఏదైనా పరికరాన్ని అమర్చడానికి ఒప్పుకుంటారా?’ అని ప్రశ్నించగా 44 శాతం మంది నిరాకరించారు. మనుషుల్లా ఉండే, ప్రవర్తించే రోబోలకు కొన్ని హక్కులు కల్పించడానికి ఒప్పుకుంటారా అంటే 50 శాతం మంది ఒప్పుకోమని చెప్పగా 14 శాతం మంది మాత్రమే సరేనన్నారు. 36 శాతం మంది ఎటూ తేల్చలేకపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కలల దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. -
ఆర్మీ సేవల్లో ఇక రోబోలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో రాళ్ల దాడులు, ఉగ్ర దాడులను ఎదుర్కోవడంలో భారత సైన్యానికి త్వరలో రోబోలు సహకరించనున్నాయి. ఉగ్ర దాడులు, అల్లరి మూకల విధ్వంసాలను అదుపు చేసే క్రమంలో సైనికులకు ఎదురయ్యే కష్టనష్టాలను తగ్గించే క్రమంలో రోబోటిక్ వెపన్స్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. తమకు 544 రోబోలు అవసరమని సైనిక అధికారులు పంపిన ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించినట్టు తెలసింది. గత ఎనిమిది నెలలుగా డీఆర్డీవో లేబొరేటరీ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నది. సైనిక కార్యకలాపాల్లో భారత సేనలకు రోబోటిక్ వెపన్స్ వ్యూహాత్మకంగా సహకరిస్తాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. పలు వాతావరణ, ప్రాదేశిక పరిస్థితుల్లో సైనికులు పనిచేస్తున్న క్రమంలో అందుకు దీటుగా ఈ రోబోలకు రూపకల్పన చేశారు. పలు కీలక స్ధావరాల వద్ద వీటిని మోహరించడంతో పాటు ఇండోర్లోనూ ఇవి సేవలు అందించగలవని ఆ వర్గాలు తెలిపాయి. -
అమెరికన్ ఉద్యోగాలకు భారీ ముప్పు
వాషింగ్టన్: ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతున్న అమెరికన్లకు మరో బ్యాడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ వర్కర్లు తమ ఉద్యోగాలను రోబోట్లకు వదులుకోవాల్సి వస్తుందని.. దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువగా ప్రభావితం కానుందని తాజా రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే పదిహేనేళ్లలో దాదాపు 38 శాతం అమెరికన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని పీడబ్ల్యూసీ తాజా రిపోర్టు వెల్లడించింది. అదేవిధంగా యూకేలోనూ 30 శాతం ఉద్యోగాలు పోనున్నాయని పేర్కొంది. ఇదే రకమైన ప్రమాదం జపనీస్లకు పొంచి ఉందని తెలిసింది. అమెరికా, యూకే లేబర్ మార్కెట్లో సర్వీసు ఉద్యోగాలు ఎక్కువగా ఆధిపత్యం కొనసాగిస్తుంటాయని, అదే స్థాయిలో కీలకరంగాలైన ఫైనాన్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, మానుఫ్రాక్ట్ర్చరింగ్, ఫుడ్ సర్వీసులల్లో ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తుంటారని రిపోర్టు తెలిపింది. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఉద్యోగాలు తీసుకుంటే, రోబోట్స్ తో రీప్లేస్ అయి, 61 శాతం ఉద్యోగాలు హరించుకుపోతాయని రిపోర్టు వెల్లడించింది. అయితే యూకేలో మాత్రం ఫైనాన్సియల్ జాబ్స్ 32 శాతం మాత్రమే కోల్పోనున్నాయని పేర్కొంది. అయితే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ వర్క్ లో పనిచేసే ఉద్యోగులు ఈ రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తక్కువగా ప్రభావితమవుతారని పీడబ్ల్యూసీ తెలిపింది. ఎక్కువ రోబోట్ల వాడకం సామాజిక అంతరాలకు కూడా దారితీయనుందని పీడబ్ల్యూసీ అథార్స్ చెప్పారు. -
డాక్టర్లతో సమానంగా రోబోలు!
న్యూఢిల్లీ: రోగులకు చికిత్స అందించడంలో ఇటీవలి కాలంలో యంత్రాల ఉపయోగం విస్తృతంగా పెరిగిపోతోంది. రోబోలు డాక్టర్లతో సమానంగా శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని సార్లు డాక్టర్లు చేసే శస్త్రచికిత్సల కన్నా రోబోలు చేసే శస్త్రచికిత్సలే మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తాజాగా ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశీలనలో తేలింది. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన వారిపై నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం స్పష్టమైంది. ప్రోస్టేట్ గ్రంధిని తొలగించడానికి డాక్టర్లు నిర్వహించిన ఓపెన్ సర్జరీల్లో రోగులు ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉండాల్సి రావటంతో పాటు.. సర్జరీ అనంతరం వారం రోజుల వరకు తమ రోజువారి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడినట్లు తేలింది. అయితే రోబోలతో నిర్వహించిన సర్జరీలో మాత్రం డాక్టర్లు చేసిన సర్జరీతో పోలిస్తే తక్కువ రక్తం నష్టపోవడంతో పాటు త్వరగా కోలుకుంటున్నట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. ప్రొస్టేట్, సర్వికల్, కిడ్నీ, లంగ్ క్యాన్సర్ల చికిత్సలో రోబోలను విరివిగా ఉపయోగిస్తున్నారు. -
ఆపరేషన్ తలాష్
విమానం గాలింపులో రోబోలు ఏడురోజులైనా దొరకని ఆచూకీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈనెల 22న గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన విమానం ఏఎన్-32 ఆచూకీపై కొనసాగుతున్న వివిధ శాఖల సమష్టి కృషికి ఆపరేషన్ తలాష్ అని నామకరణం చేశారు. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టనున్నారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు. మారిషస్ దీవుల్లో ఉన్న ఈ నౌకను చెన్నైకి రప్పిస్తున్నారు. ఈ నౌక కు అత్యాధునిక రోబోలను అమర్చి నడిసముద్రంలోని లోతుల్లో గాలింపు చర్యలు చేపడతామని చెబుతున్నారు. గజ ఈతగాళ్లు ఎంతటి మాస్క్లు, యంత్రాలు వినియోగించినా 120 అడుగుల కంటే లోతుకు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదం. బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అభిప్రాయపడుతున్నారు. అందుకే చక్రనిధి నౌకకు అడుగుభాగంలో అత్యాధునికమైన రోబోలను అమర్చి గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈరోబోలకు పొడవైన కేబుల్ ద్వారా అత్యధిక వెలుతురు నిచ్చే లైటు, కెమెరా అమర్చి ఉంటుందని తెలిపారు. ఈ రోబోలను సముద్రపు అడుగుభాగం వరకు పంపి విమానం కోసం వెతుకుతామని చెప్పారు. రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. ఈ రోబో సేవలు గురువారం నుంచి వినియోగించే అవకాశం ఉందని వివరించారు. -
బెడ్ రూంలో పాగా వేయనున్న రోబో!
ఇప్పటికే మానవ సంబంధాల్లో రోబోలు కీలపాత్ర పోషిస్తున్నాయి. పలు కార్యాలయాల్లో సెక్యురిటీ గార్డులుగా, ఆఫీసు మేనేజర్లుగా తిష్ట వేసుకొని కూర్చున్న రోబోలు.. ఇక ముందు బెడ్ రూంలలోనూ పాగా వేయనున్నాయని తెలుస్తోంది. మానవ సంబంధాల ప్రిడిక్టర్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ వెల్లడించిన నివేదికలో లైంగిక సంబంధాల విషయంలో రానున్న విప్లవాత్మక మార్పులను గురించి తెలిపారు. దీనిలో ఆశ్చర్యకరంగా 2050 నాటికి మనుషులు మనుషులతో కంటే ఎక్కువగా రోబోలతోనే లైంగిక సంబంధాలకు మొగ్గుచూపుతారని వెల్లడించారు. బొండారా అడల్ట్ అన్లైన్ స్టోర్ వెల్లడించిన నివేదికలో '2030 నాటికి ఎక్కువ మంది వర్చువల్ రియాలిటీ ద్వారా లైంగిక సంతృప్తి పొందుతారు' అని తెలిపారు. ఇప్పటివరకు కొన్ని దేశాల్లో పురుష కస్టమర్లు మాత్రమే సెక్స్ డాల్ మార్కెట్ను ముందుకు తీసుకుపోతున్నా.. ముందుముందు మహిళలు సెక్స్ రోబోల వాడకంతో ఈ మార్కెట్ మరింత దూసుకుపోనుందని వెల్లడించారు. -
రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయా?
కార్టలన్ః యాంత్రీకరణ పలు రకాల ఉద్యోగాలు అంతర్థానమయ్యేలా చేస్తోంది. వీటి ప్రభావం ఉపాధిని భారీగా దెబ్బతీస్తోంది. కంప్యూటరరీకరణ వల్ల ఉపాధి శాతం ఇప్పటికే తగ్గిపోగా.. ఆధునిక రోబోట్లు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే కొనసాగితే వచ్చే 20 ఏళ్ళలో ప్రపంచమే రోబోట్ లా మారిపోతుందేమోనన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇటీవల ఓ ఫుడ్ కంపెనీలో పనికోసం ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్ బార్న్ స్లే లోని కారల్టన్.. ప్రిమియర్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్తగా ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో.. అనేకమంది కార్మికుల ఉపాధిని కొల్లగొట్టింది. ఆ సరికొత్త యంత్రం.. వందలకొద్దీ మిస్టర్ క్లిప్పింగ్ కేక్ లను సునాయాసంగా బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేసేస్తోంది. ఇక్కడ ఈ యంత్రానికి సంబంధించిన అన్ని పనులు ఆపరేషన్ప్ మేనేజర్ డారన్ రైనే చూసుకుంటాడు. పని సరిగా చేయడం లేదు, ప్యాకింగ్ సరిగా లేదు అంటూ కార్మికులపై అరవాల్సిన పని ఇప్పుడతడికి లేదు. పనికోసం అధికశాతం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనేక చేతులున్న మనుషుల్లాగా పనిచేసే ఆరోబో... ఎంతోమంది కార్మికులు చేయాల్సిన పనిని స్వయంగా చేసేస్తోంది. ప్రిమియర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొత్తగా ప్రవేశపెట్టిన డజన్లకొద్దీ చేతులున్న ఆ యంత్రం.. సుమారు వెయ్యి కేక్ ముక్కలను కేవలం ఒక్క నిమిషంలోనే ప్యాక్ చేసేస్తుంది. రోబోకి ఏర్పాటు చేసిన కళ్ళు.. కేక్ ఆకారాన్ని గుర్తుపట్టగల్గుతాయి. దీంతో ట్రేలో సర్దుకునే ముందే వాటిలో లోపాలను గుర్తించి, ఏమాత్రం తేడా కనిపించినా వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఈ మిషన్ తో కేవలం ఒక్క నిమిషంలో 1000 వరకూ కేక్ లు ప్యాక్ అయిపోవడం చూసినవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోబోకు ఏర్పాటు చేసిన చేతులు అతి వేగంగా ఒక్కో ముక్కను ఎంచుకోవడం, ట్రేలో పెట్టి నిమిషాల్లో ప్యాక్ చేసేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కార్మికులు కేవలం మిషన్ ను ఆపరేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి మాత్రమే అవసరం అవుతారు. దీంతోపాటు రోబో తీసుకోకుండా వదిలేసిన ముక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించి ఫ్యాక్టరీ ఉద్యోగుల షాప్ కు తరలిస్తారు. బ్రిటన్ ఫ్యాక్టరీల్లో ఈ ఆటోమేషన్ ఉపయోగం ఇటీవల చాలా మామూలైపోయింది.ఇటువంటి అత్యాధునిక రోబోలు నిజంగా అద్భుతమే అనిపించినప్పటికీ, ఇక్కడ కార్మిక శక్తి తగ్గిపోవడం, ఉపాధి మార్గాలు కరువవ్వడం మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది. చివరికి మనుషులు.. ఫ్యాక్టరీల్లో చెత్తను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది. -
ఈ రోబోలు మరింత సురక్షితం!
లండన్: రానున్న రోజుల్లో నర్సుల స్థానంలో రోబోలే రోగులకు సంరక్షకులుగా మారనున్నాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత టెక్నాలజీలో మార్పులు చేయడం ద్వారా రోబోలను రోగులకు సహాయపడేలా చేయవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య, సంరక్షకుల వేతనాలు పెరిగే అవకాశం ఉండే నేపథ్యంలో రోబోలే అసిస్టెంట్లుగా మారతాయని నెదర్లాండ్స్ల్లోని ట్వంటీ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే రోబోలు అంగవైకల్యం ఉన్న వారికి రోజువారి పనుల్లో సహాయపడుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉన్న రోబోలు దృఢంగా ఉండటంతో సరళంగా ఉండవని, చేసిన పనుల్నే మళ్లీ చేస్తుండడంతో సంరక్షకులుగా పనిచేయడానికి సరిపోయేవి కావని చెప్తున్నారు. ఇప్పటి రోబోలకు ఎలాస్టిక్ స్ప్రింగ్లను ఏర్పాటు చేయడం ద్వారా సురక్షితమైనవిగా మార్చవచ్చని తెలిపారు. ఈ టెక్నాలజీని ఇంతకుముందు ఉపయోగించ లేదని, ఈ సరికొత్త టెక్నాలజీతో రోజువారీ పనుల్ని రోబోలు సురక్షితంగా నిర్వర్తిస్తాయని చెబుతున్నారు. -
25 శాతం ఉద్యోగాలు రోబోట్స్ చేస్తాయ్!
ముంబైః మరో పదేళ్ళలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఉద్యోగాల్లో నాలుగో వంతు ఉద్యోగాలు రోబోట్స్, స్మార్ట్ సాఫ్టవేర్లతో నిర్వహించే అవకాశం కనిపిస్తోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేస్తోంది. మరోవైపు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ.. 'ఎమోజీ'ల రూపకల్పన కూడ మరో దశాబ్ద కాలంలో అతి పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ వెనుక బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషించనుంది. రోబోట్స్, స్మార్ట్ సాఫ్ట్ వేర్ లు.. పావుశాతం ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. దీంతో కేవలం జాబ్స్ స్వభావం మారడమే కాక, సంస్థల పనితీరులో కూడ ప్రధాన మార్పు సంభవించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ప్రతి విషయంలోనూ బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్ కీలకాంశమైపోయింది. దీంతో ప్రఖ్యాత విద్యా సంస్థలు సైతం డేటా సైన్స్, బిగ్ డేటా ను అందుబాటులోకి తెస్తున్నాయి. యువ శ్రామికులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో 'బిగ్ డేటా' కీలకంగా మారింది. ప్రస్తుతం నగరాల్లో బిగ్ డేటా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోందని బిగ్ డేటా ను బోధించే మహేంద్రా మెహతా చెప్తున్నారు. ఒకప్పుడు బిగ్ డేటా విశ్లేషణలను అభివృద్ధి పరిచేందుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితిలో తీవ్ర మార్పు సంభవించినట్లు ఆయన చెప్తున్నారు. చిన్న పెట్టుబడితో కూడ అభివృద్ధి చేసే అవకాశం రావడంతో ఇప్పుడు చిన్నపాటి కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడ సాఫ్ట్ వేర్ జోలికి పోకుండా బిగ్ డేటాను ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పరిశోధనాత్మక విధానాలకు, సంస్థల్లో ప్రావీణ్యతను అభివృద్ధి పరిచేందుకు బిగ్ డేటా ఎనలటిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. నిజానికి అత్యాధునిక విషయాలను అందుబాటులోకి తెచ్చే బిగ్ డేటా ప్రయోజనాలను వినియోగించుకోలేని సంస్థలు.. వారి పోటీతత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ డేటా లో శిక్షణ, తర్ఫీదుపొందడం కూడ..భవిష్యత్తు కెరీర్ కు భారీ ప్రయోజనాలను కల్పిచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విప్లవాత్మక డేటా సైన్స్ పావు వంతు ఉద్యోగాలను తన పేరులో వేసుకునే అవకాశం కూడ ఉంది. -
నాకు హక్కులు కావాలి
కవర్ స్టోరీ నేడు కార్మిక దినోత్సవం మనిషి శ్రమను సులువు చేయడానికి పుట్టింది. మనిషి పరిశ్రమను తగ్గించడానికి పుట్టింది. మనిషి అవసరాలు తీర్చడానికి పుట్టింది. కానీ మనిషిని మింగేయడానికి పుట్టలేదు. కాని రాబోయే రోజుల్లో యంత్రం మనిషిని పక్కన పెట్టనుందా? మనిషి శ్రమను తానే చేసి మనిషిని పస్తు పెట్టనుందా? రోబోల విజృంభణతో ఆ ప్రమాదమే కనిపించనుందని విజ్ఞులు భాష్యం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో, అంటే 2045 కల్లా చైనాలో 77 శాతం ఉద్యోగాలు ‘మనుషులు’ పోగొట్టుకో నున్నారు. భారత్లో ఈ సంఖ్య 69 శాతం అని అంచనా. అమెరికాలో ఇది కేవలం 47 శాతమే. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రోబోల వాడకం ఉంది కాబట్టి. మనిషి తప్పు చేస్తాడు. తప్పుల నుంచే పాఠాలు నేర్చుకుంటాడు. అందులో నుంచే ఎదుగుతాడు. కాని యంత్రం తప్పు చేయదు. పైగా అది జీతం పెంచ మని అడగదు. సమ్మె నోటీసు ఇవ్వదు. యాజమాన్యాలు ఆరోపించినట్టుగా ‘పని ఎగ్గొట్టి’ టీలు కాఫీలు అని క్యాంటీన్లో గంటలు గంటలు గడపదు. అంతెందుకు... అది ఇంటికి పోదు. ఇంటి నుంచి రాదు. కనుక లేట్ ఎంట్రీ సమస్య కూడా ఉండదు. దానికి తెలిసింది పని చేయడమే. కనుక రోబోను ఎందుకు పెట్టుకోకూడదు? అనే ఆలోచన చాలా సంస్థల యాజమాన్యాలకు వస్తోంది. చైనాలో ‘ఫాక్స్కాన్’ అనే అతి పెద్ద కాంట్రాక్ట్ ఉత్పత్తి సంస్థలో పది లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. 2011లో ఆ సంస్థ పది వేల రోబోలను పనిలో విని యోగించింది. సంవత్సరానికి ముప్ఫై వేల రోబోలను పెంచుకుంటూ పోయింది. దాని వల్ల ప్రస్తుత సంవత్స రంలో భవిష్యత్ అవసరాలకు అవసరమైన పది లక్షల మంది మానవ కార్మికులను పనిలోకి తీసుకోవా ల్సిన అవసరం లేదని కంపెనీ తేల్చింది. అంటే అంతమంది చైనా కార్మికుల నోట ఒరిజినల్ మట్టే పడిందన్న మాట. అమెరికా యూరప్లలో అంటే ఎక్కడైతే మానవ కార్మికుల పనికి ఎక్కువ వేతనం చెల్లించాల్సి వస్తున్నదో అక్కడ మనుషుల కంటే రోబోలకే ప్రాధాన్యం ఇవ్వొచ్చనే వాదన బలపడుతోంది. దాని ఫలితంగా డ్రైవర్లు, సేల్స్ బాయ్లు, గోడౌన్ కీపర్లు, క్యాషియర్లు, చిన్నా చితకా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వీళ్లంతా 2025 నాటికే పెద్ద స్థాయిలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఆరోగ్య రంగంలో ఇప్పటికే అనస్తీషి యన్లుగా రోబోలు పని చేస్తున్నాయి. క్యాన్సర్ను గుర్తించే రేడియాలజిస్టులుగా మనుషుల కంటే రోబోలే సమర్థంగా పని చేస్తున్నాయనే పరిశీలన ఉంది. ఈ నేపథ్యంలో రోబోల ఆక్రమణ ఎక్కడి దాకా వెళ్లనుందనేది అనూహ్యంగా ఉంది. మనిషికి ఉన్న అతి పెద్ద ఆయుధం ఊహాశక్తి. రోబోలకు లేనిది మనిషికి ఉన్నది అదే. కాని రోబోలు కూడా ఆయా సంస్థల అవసరాల రీత్యా కొన్ని ‘ఊహలు’, ‘ప్రతిపాదన’లు చేయగలిగే స్థితికి టెక్నాలజీ అభివృద్ధి అవుతోంది. ముఖ్యంగా రోబోల వల్ల ఉత్పత్తి పెరగడం. భారీ ఉత్పత్తిని కోరే వారు అందువల్ల కూడా వీటిని ఆదరిస్తు న్నారు. ఇంకో పెద్ద ప్రమాదం ఏమంటే మనిషి ఐ.క్యు. (ఇంటెలిజెన్స్ కోషియెంట్) తీవ్రంగా పెరుగుతూ పోదు. కాని ఈ సంతవ్సరం తయారయ్యే రోబో ఐ.క్యు. కంటే రాబోయే రెండేళ్లలో తయా రయ్యే రోబో ఐ.క్యు. చాలా ఎక్కు వగా ఉండే అవకాశం ఉంది. అంటే రోబోలు తమ మేధస్సును పెంచుకుంటూ పోయి మనిషిని వెనక్కు వదిలేస్తాయన్న మాట. వీటితో మనిషి ఏ మాత్రం పోటీ పడగలడు? మన పురణాలు దేనినీ వదల్లేదు. ఇలాంటి వాటికి కూడా నమూనాలను ఇచ్చి వెళ్లాయి. భస్మాసురుడు తన వరంతో తనే నాశనమయ్యాడు. మనిషి కూడా తను కని పెట్టిన రోబోతోనే తన ఉపాధిని నాశనం చేసుకోబోతున్నాడు. మనిషి యంత్రం కంటే మెరుగ్గా అవిశ్రాంతంగా పని చేయక పోవచ్చు. కాని హృదయంతో పని చేస్తాడు. శ్రద్ధతో పని చేస్తాడు. ఆవేశంతో పని చేస్తాడు. అనురక్తితో పని చేస్తాడు. ఆ పని వెనుక ఆ శ్రమ వెనుక ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. కృతజ్ఞత ఉంటుంది. తాను ప్రకృతికి సమాజానికి ఇవ్వగలిగింది ఇస్తున్నాననే ధన్యత కనిపిస్తుంది. మనిషికి మంచి చెడు తెలుసు. చెడును తగ్గించి మంచిని పెంచుకుంటూ పోవడం తెలుసు. కాని యంత్రానికి అది తెలియదు. అది వికాసం కోసమే కాదు వినాశనం కోసం కూడా పని చేయగలదు. స్పందనే సృష్టికి ఆయువు. స్పందన లేని లోహం ప్రమాదానికి హేతువు. యంత్రం వర్సెస్ మనిషి మనుగడలో మనిషే గెలుస్తాడని మా నమ్మకం! అది రోబోల రాజ్యం! ఇటీవలి కాలంలో చైనాలో రోబోల వినియోగం బాగా పెరిగింది. దానికి ఉదాహరణ రోబో రెస్టారెంట్. గాంగ్జో నగరంలో ఉన్న ఈ రెస్టారెంట్లో మనుషులకు బదులుగా రోబోలు వెయిటర్లుగా పని చేస్తున్నాయి. కస్టమర్ల దగ్గరకు వచ్చి ఆర్డర్ చెప్పమని అడుగుతాయి. చెప్పినవి రాసుకుని కిచెన్లోకి వెళ్లి చెఫ్కి ఇస్తాయి. వంటకాలను తీసుకొచ్చి సర్వ్ చేస్తాయి. ట్రాలీలో డ్రింక్స్ పెట్టి తోసుకుంటూ రెస్టారెంట్ అంతా తిరుగుతుంటాయి. బిల్ ఇస్తాయి. కస్టమర్లు వెళ్లాక గిన్నెలు తీస్తాయి. టేబుల్ క్లీన్ చేస్తాయి. వాటి పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రోబోలైతే టిప్ కూడా ఇవ్వక్కర్లేదు అని మురిసిపోతున్నారు! రోబోటిక్ లాన్ మౌవర్స్ లాన్లలో పెరిగిన గడ్డిని సమంగా కట్ చేస్తాయి. మొక్కలకు నీళ్లు కూడా పెడతాయి. ఆటోమేటెడ్ పూల్ క్లీనర్స్ అతి పెద్ద స్మిమ్మింగ్ పూల్ను కూడా మూడు గంటల్లో శుభ్రం చేసేస్తాయి. పూల్ను ముందుగా స్క్రబ్ చేసుకుంటూ వెళ్లి, ఆపైన మంచి నీటితో కడిగేస్తాయి. చెత్త ఉంటే పూర్తిగా తీసేస్తాయి. ‘రూంబా’ అనే వాక్యూమ్ క్లీనర్ రోబోలు ఇంట్లో నేలను చక్కగా శుభ్రం చేస్తాయి. ‘డ్రెస్మ్యాన్’ అనే రోబోలు బట్టలు ఉతికి, వాటిని ఇస్త్రీ కూడా చేస్తాయి. మరికొన్ని రోబోలు కూరగాయలను కూడా ఇట్టే కట్ చేస్తాయి. అదే విధంగా కొన్ని దేశాల్లో అయితే వంట చేసే రోబోలు కూడా వచ్చేశాయి! టీచింగ్ రోబోలు పిల్లలతో హోమ్వర్క్ చేయిస్తాయి. దగ్గర కూర్చుని చదివిస్తాయి. చిన్నపిల్లలకు రైమ్స్ దగ్గర నుంచి పెద్ద వాళ్లకు కాలేజీ పాఠాల వరకూ అన్నిటినీ బోధిస్తాయి. అన్ని దేశాల పరిశ్రమల్లోనూ రోబోలను ఉపయోగించడం ప్రారంభించారు. పరిశ్రమల్లో పని చేసే రోబోల కొనుగోళ్లు ఒక్క 2014లోనే 29శాతం పెరిగినట్లు ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్’ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే తొలి ‘రోబో ఫామ్’ 2017లో జపాన్లో క్యోటో సమీపంలో ప్రారంభం కానుంది. ఈ కూరగాయల ఫ్యాక్టరీలో పూర్తిగా రోబోలే పనులు, పర్యవేక్షణ విధులు నిర్వహిస్తాయి. మనిషి అన్నవాడే అందులో ఉండడట! చైనాలో ‘ఫాక్స్ కాన్’ అనే అతి పెద్ద ఉత్పత్తి సంస్థకు పది లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. 2011లో ఆ సంస్థ 10,000 రోబోలను పనిలో వినియోగించింది. సంవత్సరానికి 30,000 రోబోలను పెంచుకుంటూ పోయింది. దాని వల్ల భవిష్యత్ అవసరాలకు అవసరమైన మానవ కార్మికులు పది లక్షల మందిని పనిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ తేల్చింది. జర్మనీలో కూడా ప్రజల ఉపాధి అవకాశాలకు రోబోలు పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఉపాధిలో 59 శాతం రోబోలు ఆక్రమించుకుంటున్నాయి. రాబోయే కాలంలో కోటి ఎనభై లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. సెక్యూరిటీ రోబోలు ఇంటికి అపరి చితులు వస్తే వెంటనే యజ మాని ఫోన్కు మెసేజ్ పంపు తాయి. ఇంట్లో దొంగలు పడితే ఆ తతంగాన్ని రికార్డు చేసి వీడియోను కూడా పంపిస్తాయి. కర్టెసీ: డిజిటల్ -
రోబోలకూ ‘స్మార్ట్’ చర్మం!
బీజింగ్: తమ చుట్టూ ఉన్న వస్తువులను రోబోలు తాకి గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పారదర్శకమైన ‘స్మార్ట్’ చర్మాన్ని అభివృద్ధిపరిచారు. రోబోల కృత్రిమ అవయవాలకు ఈ చర్మాన్ని అమర్చడం ద్వారా మానవుల మాదిరిగానే స్పర్శ తెలుస్తుంది. రోబోలకు అమర్చేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో రకాల చర్మాలను తయారు చేశారు. అయితే వీటిల్లో స్పర్శకు సంబంధించిన ఎలక్ట్రోడ్ల సంఖ్య చర్మం పరిమాణాన్ని బట్టి పెరగడం వల్ల ఖర్చు కూడా ఎక్కువవుతోంది. మరికొన్నింటిని ఆపరేట్ చేసేందుకు బయటి నుంచి బ్యాటరీలు, వైర్లు తదితరాలు అవసరం వస్తుండటంతో వాటిని వాడటం కష్ట సాధ్యమే. ఈ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీని పక్క నుంచి తేనెటీగ వెళ్లినా వెంటనే ఈ చర్మం గుర్తిస్తుంది. -
కాల్ చేయగానే.. రూం వద్దకు వచ్చేస్తుంది
హోటల్ రూం సర్వీసుకు ఫోన్ చేసి.. కాఫీ తెమ్మంటే.. రోబోలే తెచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో అలాంటి రోబోలు చకచకా తిరిగేస్తూ.. తమ సేవలను అందించేస్తున్నాయి. ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి రోబోనే. దీన్ని ‘సవియోక్’ అనే కంపెనీ తయారుచేసింది. ఈ రిలే రోబోలు మూడడుగుల ఎత్తు ఉంటాయి. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందంటే.. మనం రూం సర్వీసుకు కాల్ చేయగానే.. అక్కడి సిబ్బంది వినియోగదారుడికి కావాల్సిన వస్తువులను ఈ రిలే రోబోట్ పైన ఉన్న భాగంలో ఉంచుతారు. దాని మీద ఉన్న ఎల్ఈడీ తెరపై రూం నంబర్ టైప్ చేయగానే.. అది వైఫై, కెమెరాల సాయంతో తనకు తానుగా ఆ రూం వద్దకు వెళ్లిపోతుంది. అక్కడికి వెళ్లగానే.. రోబో నుంచి గది లోపల ఉన్న ఫోన్కు తాను వచ్చినట్లు తెలుపుతూ.. ఆటోమేటిక్గా కాల్ వెళ్లిపోతుంది. వినియోగదారులు తమకు కావాల్సిన సామాన్లు తీసుకోగానే.. రోబో తిరిగి చార్జింగ్ స్టేషన్కు వెళ్లిపోతుంది. ప్రస్తుతం 12 రోబోలు సర్వీసులో ఉన్నాయని.. భవిష్యత్తులో వాటి సంఖ్య మరింత పెరగనుందని ‘సవియోక్’ సీఈవో స్టీవ్ చెప్పారు. 2015లో ఈ రోబోల బృందం మొత్తం 11 వేల డెలివరీలు(సామాన్ల చేరవేత) చేశాయన్నారు. -
రోబోల రాజ్యం..
మీరెన్నో హోటళ్లలో ఉండి ఉంటారు.. చాలా వాటిని చూసి ఉంటారు. కానీ ఈ రోజు మేం చెప్పబోయే హోటల్ను అయితే.. ఇప్పటివరకూ చూసి ఉండరు.. కావాలంటే మీరే చూడండి.. పదండి.. జపాన్లోని సాసెబోలో ఉన్న హెన్నా హోటల్లో ఓ టూరేసి వద్దాం.. రోబోల రాజ్యంలో అడుగుపెట్టి వద్దాం.. రిసెప్షన్.. హోటల్లోకి ఎంటరవగానే కనిపించే ఈ రాక్షసబల్లిని చూసి దడుచుకునేరు. మరేం పర్లేదు. రండి.. ఎందుకంటే.. ఇదిక్కడ రిసెస్షనిస్టుగా పనిచేస్తోంది. ఇది రోబోనే.. మనల్నేం అనదు.. ఇదే కాదు.. ఈ అమ్మాయి(ఇదీ రోబోనే), ఆండ్రాయిడ్ రోబో ఇవన్నీ ఇక్కడ రిసెప్షన్లోనే ఉంటాయి. మనం రాక్షసబల్లి వద్దకు వెళ్లామనుకోండి. ‘రూం కావాలంటే ఒకటి నొక్కండి’ అని అది ఎంతో వినయంగా చెబుతుంది. మనం అక్కడుండే కంప్యూటర్ మీద మన వ్యక్తిగత సమాచారం నింపి.. ఎంటర్ కొట్టాల్సి ఉంటుంది.. అంతే చెక్ఇన్ అయిపోయినట్లే.. క్లోక్ రూం.. రూంకు వెళ్లేముందు మనం బయట తిరగాలి అనుకుంటే.. అంతలోపు మన సామాన్లను అక్కడుండే క్లోక్ రూంలో ఉంచుకోవచ్చు. మన సామాన్లను డబ్బాలో ఉంచితే చాలు.. ఇక్కడ ఉండే భారీ రోబో చేయి వాటిని తీసి.. క్లోక్రూంలో పెడుతుంది. బెల్బాయ్.. బయట తిరిగే పనిలేదు. నేరుగా రూంకు వెళ్లిపోదామనుకుని సామాన్లు పట్టుకెళ్లడానికి బాయ్ కోసం చూసేలోపే.. మరో రోబో వచ్చేసి.. మన సామాన్లను గది వద్దకు చేరుస్తుంది. రూం ఎంట్రన్స్.. మిగతా హోటల్స్లా.. ఇక్కడ రూం కీలు, స్వైప్ కార్డులు ఉండవు. ఇందాక.. కంప్యూటర్లో మన వ్యక్తిగత వివరాలు నమోదు చేసినప్పుడే.. మన ఫొటో కూడా రిజిస్టరైపోతుంది. ఇక్కడ రూం తెరవడానికి మన మొహమే కీ అన్నమాట. అంటే.. అక్కడున్న స్క్రీన్పై మీరు మొహం ఉంచితే.. రూం ఓపెన్ అవుతుంది. బాగుంది కదూ.. రూం లోపల.. ఇక మన పడక పక్కనే మరో చిన్న రోబో. మీరు అడిగినప్పుడల్లా టైం, వాతావరణ వివరాలు చెబుతుంది. అంతేకాదు.. హోటల్లో లభించే వంటకాల వివరాలను తెలియజేసి.. ఆర్డర్ తీసుకుంటుంది. రూంలోని ఉష్ణోగ్రత కూడా మన శరీర ఉష్ణోగ్రతను బట్టి ఆటోమెటిక్గా మారుతుంటుంది. రూం సర్వీసును పిలవడానికి ఫోన్ ఎత్తాల్సిన పనిలేదు. అక్కడుండే ట్యాబ్ను తీసుకుని.. అందులో ఉండే వివరాల ఆధారంగా రూం సర్వీసును పిలవచ్చు. ఇంకా.. ఇటీవలే ప్రారంభమైన ఈ హోటల్లో చాలా పనులు ఈ రోబోలే చేస్తాయి. వంట వండటం, బెడ్షీట్లు పరవడం, సెక్యూరిటీ వంటి పనులకు మాత్రం చేయలేవు. అయితే.. త్వరలో రూం సర్వీసును కూడా రోబోల చేతే చేయించాలని దీని యజమాని హిదియో అనుకుంటున్నారు. రోబోల వినియోగం వల్ల ఖర్చులు కూడా కలిసివస్తాయంటున్నారు. ఇంతకీ ఈ హోటల్లో ఓ రోజు ఉండాలంటే ఎంత చెల్లించాలో తెలుసా? కేవలం రూ.6 వేలే. -
లోపాలను సరిచేసుకునే రోబోలు
లండన్: రోబోల అభివృద్ధిలో భాగంగా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. రోబోల్లో ఏవైనా లోపాలు ఏర్పడితే కేవలం రెండు నిమిషాల్లో ఆ ఇబ్బందులను వాటికవే సరిదిద్దుకునే కొత్త తరం రోబోలను లండన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆరు కాళ్ల రోబో నడుస్తున్నప్పుడు దాని రెండు కాళ్లు విరిగిపోతే, దానికదే ఎలా సరిచేసుకుంటుందో చూపించే ఒక వీడియోను కూడా ప్రదర్శించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎటువంటి సాధనాలను ఏ విధంగా అమర్చాలో రోబో చేతులకు కూడా ఇన్పుట్ అందిస్తారు. ‘ఒక కాలు విరిగిన కుక్క మిగిలిన మూడు కాళ్లతో పట్టుదలగా తన పనులు ఏ విధంగా చేసుకుంటుందో మనం చూస్తుంటాం. అలాగే మనకి కూడా కాలికి గాయమై నడవలేని పరిస్థితులో ఉన్నప్పుడు.. ఆ గాయం నుంచి ఎంత తొందరగా బయటపడాలా అని ఆలోచిస్తాం..’ ఇలాంటి సంఘటనలే మా పరిశోధనకు స్ఫూర్తిగా నిలిచాయని శాస్త్రవేత్తలు అన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైతే ఏ విధంగా స్పందించాలో ఈ రోబోలకు ముందే ప్రోగ్రామ్ చేస్తారు. సంబంధిత కంప్యూటర్ నుంచి వీటికి ఎప్పటికప్పుడు ఉద్దీపనలు అందుతాయి. వీటి ఆధారంగానే రోబోలు స్పందిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాటికి సమస్యలు ఎదురైనప్పుడు ఇవి శాస్త్రవేత్తలుగా మారిపోతాయని అంటున్నారు. ఈ అధునాతన పరిజ్ఞానం భవిష్యత్తులో రోబోల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మనం రోబోలను తయారుచేయకూడదు!
మన విద్యావ్యవస్థ రోబోలను తయారుచేయకూడదు.. ఈ మాటలు అన్నదెవరో తెలుసా? ప్రధానమంత్ర నరేంద్రమోదీ. విద్యావ్యవస్థలో మంచి అధ్యాపకులుండాలని, వారు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి తప్ప.. వాళ్లను యాంత్రికంగా మార్చకూడదని ఆయన చెప్పారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గంగానది ప్రవహించే ఈ భూమిలో సాంస్కృతిక విద్య ఉండేదని, అంతకంటే ముఖ్యంగా విద్యాసంస్కృతి అలరారిందని ప్రధాని చెప్పారు. మన పిల్లలు మంచి ఉపాధ్యాయులుగా ఎలా తయారవుతారో మనం ఆలోచించాలన్నారు. దేశంలో మంచి ఉపాధ్యాయులుంటే.. పిల్లలు వాళ్లంతట వాళ్లే బాగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఉపాధ్యాయుడు అవ్వాలనుకునే విద్యార్థి కేవలం పరీక్షల కోసం చదవడం కాకుండా.. తన ఉపాధ్యాయులను జాగ్రత్తగా పరిశీలిస్తాడని మోదీ అన్నారు. ప్రపంచానికే మంచి ఉపాధ్యాయులను మనం అందించాలని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం టీచర్లు కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. -
అభిమాన రోబోగణం..
అన్నిట్లోనూ రోబోలు వచ్చేస్తున్నాయి. చివరికి అభిమానుల ప్లేసునూ ఇవి ఆక్రమించేస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇవి ఫాన్బోట్స్. ఈ రోబోలు దక్షిణ కొరియాకు చెందిన బేస్బాల్ టీం హన్వా ఈగల్స్ అభిమానులు! రోబో ఫాన్స్ పెట్టారంటే.. ఇదేదో పెద్ద టీం అనుకునేరు.. పేరుకు తగ్గట్లే.. ఈ టీం పని ‘ఈగల్స్’ తోలుకోవ డమే! చిన్నాచితకా మ్యాచ్లు కలిపి హన్వా ఈగల్స్ గత ఐదేళ్లలో 400 మ్యాచ్లు ఓడిపోయింది. దీనికితోడు ఈ టీం సభ్యులను ప్రోత్సహించడానికి వచ్చే అభిమానులు ఎప్పుడూ అవమానాలను ఎదుర్కొంటారట. వేరే టీంల అభిమానులు వీరిని తెగ ఏడిపిస్తారట. దీంతో చాలా మంది రావడం మానుకున్నారు. ఇంట్లోనే మ్యాచ్లు చూడ్డం మొదలెట్టారు. అసలే టీం ఆట అంతంతమాత్రం.. ఇక అభిమానుల ప్రోత్సాహం కూడా కరువైతే.. ఇంకేమైనా ఉందా.. అందుకే హన్వా ఈగల్స్ యాజమాన్యం రోబోలను దింపింది. చీర్లీడర్స్లాగా ఇవి తమ టీంను ప్రోత్సహిస్తూ.. ఉత్సాహపరుస్తాయి. అంతేకాదు.. మ్యాచ్కు రాని అభిమానులు ఆన్లైన్ ద్వారా వీటిని కంట్రోల్ చేస్తూ.. స్టేడియంలో ఉన్న తమ టీంకు మద్దతిచ్చే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. రోబోల ముఖాల స్థానంలో ఉన్న స్క్రీన్స్పై సదరు అభిమాని ఫొటో ప్రదర్శితమయ్యే సదుపాయాన్నీ కల్పించారు. అంటే.. మనం రోబో రూపంలోకి వెళ్లి.. పరోక్షంగా మన టీంను ఉత్సాహపరచవచ్చన్నమాట. -
రోబోల సహాయంతో తయారయ్యే అందమైన కార్లు
-
రోబోటిక్స్ విప్లవం ముంగిట్లో మనం!
సాక్షి, హైదరాబాద్: రోబోటిక్స్ రంగంలో పెను విప్లవానికి రంగం సిద్ధమైందని, త్వరలోనే అసాధ్యాలను సుసాధ్యం చేయగల రోబోలు అందుబాటులోకి రానున్నాయని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.అయనా హోవర్డ్ తెలిపారు. రోబోల విషయంలో ఇప్పటివరకూ జరిగిన సాంకేతిక అభివృద్ధి ఒక ఎత్తై రానున్న పదిహేనేళ్లలో జరగబోయేది మరో ఎత్తని ఆమె అన్నారు. ఇక్కడి విద్యారణ్య పాఠశాలలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో హోవర్డ్ ప్రసంగించారు. రోబోల రాకతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. పేద వారికీ అద్భుత ప్రయోజనాలు ఒనగూరే అవకాశముందన్నారు. రోబోలకు మనిషిని పోలిన చైతన్యం అందిస్తే కొన్ని చిక్కులు వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. అతిపిన్న వయస్సులోనే ప్రపంచంలోనే మేటి రోబో శాస్త్రవేత్తగా ఎదిగిన డాక్టర్ అయానా హోవర్డ్ ‘హ్యూమనైజ్డ్ ఇంటెలిజెన్స్’పై విసృ్తత పరిశోధనలు చేస్తున్నారు. ‘మంథన్’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు అజయ్గాంధీతోపాటు అమెరికా దౌత్య కార్యాలయ పబ్లిక్ ఎఫైర్స్ ఆఫీసర్ ఏప్రిల్ వేల్స్ తదితరులు పాల్గొన్నారు.