sanjay singh
-
మీది శీష్ మహల్.. మీది రాజమహల్
న్యూఢిల్లీ: అద్దాల మేడ(శీష్ మహల్)లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ రాజ మహల్లో విలాస జీవితం గడుపుతున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ బంగ్లాల వ్యవహారంలో బుధవారం ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. ప్రజల సొమ్ముతో అద్దాల మేడలో కేజ్రీవాల్ ఖరీదైన ఏర్పాట్లు చేసుకున్నారని బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయడానికి ఆప్ అగ్రనేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తమ అనుచరులతో కలిసి మీడియాను వెంటబెట్టుకొని 6, ఫ్లాగ్స్టాఫ్ రోడ్లోని ఈ బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలిపారు. బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని చెప్పారు. శీష్ మహల్ లోపల ఏముందో చూసేందుకు బీజేపీ నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఎక్కడున్నాయో చూపించాలని నిలదీశారు. ప్రధాని మోదీ అధికార నివాసం ఒక రాజమహల్ అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ రాజ మహల్లోకి మీడియాను అనుమతించే దమ్ముందా? అని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్ సమీపంలో బైఠాయించారు. మరోవైపు బీజేపీ నాయకులు ఢిల్లీ సీఎం ఆతిశీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఏబీ 17 మథుర రోడ్లోని బంగ్లాను మీడియాకు చూపించారు. ఇప్పటికే అధికారిక బంగ్లాను కేటాయించగా, మరో బంగ్లా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. బంగ్లాల సందర్శన పేరిట ఆప్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. -
ఎంపీ సంజయ్ సింగ్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు భారీ షాక్ తగిలింది. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో తన ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ సింగ్పై గోవా సీఎం ప్రమాద్ సావంత్ సతీమణి రూ.100కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి గోవా కోర్టు సంజయ్ సింగ్కు నోటీసులు పంపించింది. పరువు నష్టం దావా కేసుపై జనవరి 10లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్లోని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో కేసు వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్ పాయ్ వెర్నేకర్ తెలిపారు. తాత్కాలిక సివిల్ జడ్జి ఆ పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు వెర్నేకర్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీ మీడియా సమావేశంలో సులక్షణ సావంత్పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై సులక్షణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. పరువుకు భంగం కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్ సింగ్ తనకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తన గురించి సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. -
కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
కాంగ్రెస్కు ఆప్ అల్టిమేటం!
ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.‘ఆప్ హర్యానా చీఫ్గా నేను 90 అసెంబ్లీ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నాను. పొత్తు గురించి పార్టీ హైకమాండ్ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈరోజు నిర్ణయం రాకపోతే, సాయంత్రంలోగా మొత్తం 90 స్థానాలకు మా జాబితాను విడుదల చేస్తాం’ అని గుప్తా తెలిపారు.కాగా హర్యాలో పోటీకి ఆప్ పూర్తిగా సిద్దంగా ఉందని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొలిక్కివచ్చిందని, పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన అనంతరం అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుపై కొనసాగుతున్న తరుణంలో.. పార్టీ తరపున చర్చలకు నాయకత్వం వహిస్తున్న ఆప్ ఎంపీ రాఘవ్ మాట్లాడుతూ.. పొత్తుపై సానుకూల ఫలితం వస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగించేలా పొత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారుఅక్టోబర్ 5న జరిగే హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పలువురు చెబుతున్నా కార్యాచరణలో అది సాధ్యమయ్యేలా లేదని సమాచారం. కొన్ని సీట్లపై ఆప్ పట్టుబడుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని తెలుస్తోంది. 20 స్ధానాలు కావాలని ఆప్ డిమాండ్ చేస్తుండగా సింగిల్ డిజిట్ స్ధానాలనే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుండటంతో చర్చలు ఓ కొలిక్కిరావడం లేదని తెలిసింది. -
కేజ్రీవాల్ ప్రాణాలతో బీజేపీ చెలగాటం: ఆప్ ఎంపీ సంజయ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ బరువు 8. 5 కేజీలు తగ్గారని, అదేవిధంగా ఆయన షుగర్ లెవల్స్ 5 సార్లు 50 ఎంజీ/డీఎల్ కిందికి పడిపోయాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ జైలులో తీవ్రమైన అనారోగ్యంతో బాధపెట్టాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలా చేయటం అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నారు.‘‘మార్చి 21 తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్ట్ చేసేనాటికి ఆయన బరువు 70 కేజీలు, కానీ, ప్రస్తుతం కేజ్రీవాల్ బరువు 61. 5 కేజీలకు పడిపోయింది. అంటే 8. 5 కేజీల బరువు తగ్గారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ను చిత్రహింసలకు గురిచేసి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా కేజ్రీవాల్ను బాధ పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా బరువు తగ్గటంపై ఎటువంటి పరీక్షలు నిర్వహించటం లేదు. బరువు తగ్గటం, షుగర్ లేవల్స్ పడిపోవటం కేజ్రీవాల్ తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు. ఇప్పటికే ఐదుసార్లు షుగర్ లేవల్స్ లెవల్స్ పడిపోయాయి. 50 ఎంజీ/డీఎల్ కంటే కిందికి పడిపోతే ఆరోగ్యం క్షీణించి కోమాకు వెళ్తారు. కేజ్రీవాల్పైనే ఎందుకు ఇలా చేస్తున్నారు?’అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయటంతో కేజ్రీవాల్ ఏప్రిల్1 నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ అరెస్ట్ కేసులో శుక్రవారం కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజారు చేసింది. అయినా కూడా కేజ్రీవాల్ తిహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. లిక్కర్ కేసులో ఆయన్ను దర్యాప్తు కోసం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
క్షీణించిన మంత్రి అతిశీ ఆరోగ్యం.. నిరసన దీక్ష విరమణ
ఢిల్లీ: ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ విరమించారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.‘‘మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె బీపీ లెవల్స్ పడిపోయాయి. ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆమెను ఆస్పత్రితలో చేరి చికిత్స తీసుకోవాలన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను కేటాయించాలని ఆమె గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్జేపీ ఆస్పత్రి ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.తీవ్ర నీటీ సంక్షోభ సమయంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి అతిశీ జూన్ 21 నుంచి నిరవధిక నిరాహారాదీక్ష చేపట్టారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించి హాస్పిటల్లో చేరారు. -
ఢిల్లీలో ఆప్ జలదీక్ష
న్యూఢిల్లీ: నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలంటూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సింగ్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. యమునా నది అదనపు జలాలను హరియాణా తక్షణం ఢిల్లీకి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్ఘాట్లో గాం«దీజీకి నివాళులరి్పంచి దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.విమర్శించిన బీజేపీ దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్ ప్రదేశ్ నుంచో, ఆప్ పాలిత పంజాబ్ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.నా భర్త ఏమన్నా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదా: సునీతా కేజ్రీవాల్తన భర్త ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన బెయిల్ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్ ఉత్తర్వు వెబ్సైట్లో అప్లోడ్ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ దీక్షా స్థలి వద్ద మండిపడ్డారు. -
ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్: సాక్షితో ఎంపీ సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలు సాధించబోతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడారు.‘‘ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి బీజేపీ హింసిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము జైలు అంశాన్ని ప్రచారం చేస్తున్నాం. ‘జైలు కా జవాబ్ ఓటు సే’అనే నినాదంతో ఎన్నికల్లో దిగాం. ఆప్కు ఓటేస్తే దేశవ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రైతులకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధర ఇస్తాం. పంజాబ్కు బీజేపీలో అవకాశం ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడతాం. బీజేపీకి చందాలు ఇచ్చిన వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఈడీ బీజేపీ నాయకులపై ఎందుకు సోదాలు చేయడం లేదు. మమ్మల్ని బలవంతంగా జైల్లో పెట్టారు. ఇదే అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తే, సానుభూతి కోసమని ఎలా అంటారు?. కేజ్రీవాల్ దేశం కోసం పని చేస్తే, మోదీ తన దోస్తుల కోసం పనిచేస్తున్నారు. దేశంలో ఉన్న ఎయిర్పోర్టులు, పోర్టులు తన దోస్తులకు కట్టబెట్టారు’’ అని సంజయ సింగ్ మడ్డారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో తీహర్ జైలులో కస్టడీలో ఉన్న సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
తమ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై జరిగిన దాడి నిజమేనని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతి మాలివాల్పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ దాడిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, తగిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ సంజయ్ సింగ్ వెల్లడించారు.అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ఎంపీ స్వాతి మలివాల్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రాయింగ్ రూమ్లో ఉన్న కేజ్రీవాల్ను కలిసేందుకు ఎదురు చూస్తున్న సమయంలో బిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సంజయ్ సింగ్ అన్నారు. బిభవ్ కుమార్పై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆప్ ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్ స్థానాన్ని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన తనపై దాడిచేసినట్లు బిభవ్పై స్వాతి మలివాల్ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దాడి వ్యవహారం మరింత చర్చకు దారి తీసింది. మరోవైపు బీజేపీ.. ఆప్పై విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో అప్ ఎంపీ సంజయ్ సింగ్ దాడిని ఖండించారు. -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్లో నేను రిలాక్స్గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్తో పాటు ఆర్యన్ కూడా సోషల్మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్కు క్లీన్ చిట్ దక్కింది. -
‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్ కేజ్రీవాల్ని’
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశానికి, ఢిల్లీ ప్రజలకు కోసం ఒక కుమారుడుగా, సోదరుడుగా పనిచేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తీహార్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని మీడియాకు సంజయ్ సింగ్ వెల్లడించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ను తీహార్ జైల్లో గ్లాస్ గోడ ద్వారా కలిశాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్పై ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. 24 గంటలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ‘జైలులో ఉన్నది సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓ మట్టి మనిషి.. అయన్ను ఎంత విచ్ఛినం చేయాలని చూసినా అంతే బలంగా తిరిగి వస్తారు. తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కలసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇది మనందరికీ చాలా ఉద్వేగభరితమైన విషయం. ప్రధాని మోదీ, బీజేపీకి సిగ్గు చేటు’ అని సంజయ్ సింగ్ అన్నారు. ‘ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల పథకం ఉత్తమమైనది అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ సుప్రీ కోర్టు తీర్పును అవమానించారు. మోదీ సుప్రీం కోర్టుక, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. -
AAP MP Sanjay Singh: తీహార్ జైల్లో కేజ్రీవాల్ హక్కులకు భంగం
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు అధికారులు అనుతి వ్వడం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్న మిదని అన్నారు. సాధారణ ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగానే కుటుంబసభ్యులను కేజ్రీవాల్ కలుసుకునేందుకు అవకా శమిస్తున్నారన్నారు. కరడుగట్టిన నేరగాళ్లకూ వ్యక్తిగత సమావేశాలకు అనుమతులున్నాయన్నారు. సీఎంగా ఎన్నికైన వ్యక్తిని సాధారణ ఖైదీగా చూస్తున్నారన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అమానవీయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు. జైలులోని ఓ గదిలో ఇనుప మెష్కు ఒక వైపు ఖైదీ, మరోవైపు సందర్శకులుంటారు. ఇలా ఇద్దరూ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే ఏర్పాటు పేరే ‘ములాఖత్ జంగ్లా’. -
కేజ్రీవాల్ను సునీత కలిస్తే తప్పేంటి?: సంజయ్ సింగ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మానీలాండరింగ్ అభియోగాల కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వకపోవటంపై ఆప్ నేత సింజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జైలు కిటికీ వద్దనే కలవడాకి అనుమతించటం చాలా అమానవీయమని అన్నారు. సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘భయంకరమైన నేరాలకు పాల్పడినవారిని సైతం తమ బ్యారక్లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. మూడుసార్లు సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ను మాత్రం జైలు రూం గ్లాస్ కిటికీ వద్ద కలవమనటం సరికాదు. ఎందుకు ఇంత అమానవీయం?. సునితా కేజ్రీవాల్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని అప్పీల్ కూడా చేసుకున్నారు. తీహార్ జైలు అధికారులు రూంలో వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం జైలు రూం కిటికీ వద్ద కలవడానికే మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇది సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అవమానించటమే కాకుండా నైతిక విలువలను ఉల్లంఘించటం’ అని తీహార్ జైలు అధికారులపై సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను కలిసి సమావేశం కావడాన్ని సంజయ్ సింగ్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రద్దు చేసుకున్నారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘నితీష్- మమత.. నింగి-నేల’ ఆప్ నేత ఎందుకన్నారు?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్- మమతలను నింగి-నేలతో పోల్చారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం ఆప్ సాగిస్తున్న ప్రచారం గురించి కూడా సంజయ్ సింగ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 23 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోందని, కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన బీహార్ సీఎం నితీష్ కుమార్పై సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కుమార్ నిష్క్రమణ అనూహ్యమని, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన హఠాత్తుగా ఎన్డీఏలో చేరారన్నారు. ఈ విధంగా పార్టీలు మారితే స్వల్పకాలంలో అధికారాన్ని, ప్రయోజనాన్ని పొందవచ్చని, తరచూ పార్టీలు మారితే చరిత్ర హీనులవుతారని ఆరోపించారు. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు దానికి నితీష్ తలొగ్గుతారని తాను భావించలేదన్నారు. ఇక మమతా బెనర్జీ విషయాని కొస్తే ఆమె బీజేపీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారని సంజయ్ సింగ్ అన్నారు. అందుకే మమతకు నితీష్ కుమార్కు మధ్య నింగికి నేలకు ఉన్నంత తేడా ఉన్నదన్నారు. మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుండగా, నితీష్ కుమార్ బీజేపీకి సాగిలపడ్డారని ఆరోపించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక బీజేపీ సీనియర్ కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అవకతవకల కేసులో బీజేపీ సీనియర్ నేత ఒకరు కుట్ర పన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ్పై ఒత్తిడి చేసి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా చేశారని శుక్రవారం ఢిల్లీలో పత్రికాసమావేశంలో సంజయ్ చెప్పారు. ఇదే కేసులో చాలా వారాలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండి సంజయ్ రెండు రోజుల క్రితమే బెయిల్పై విడుదలైన సంగతి విదితమే. ‘‘ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని లోక్సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ఒప్పకోలేదు. దీంతో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్చేశారు. పలుమార్లు అధికారులు ప్రశ్నించడంతో మాగుంట రాఘవ్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఇలా పెద్ద కుట్రలో భాగమయ్యారు. ఢిల్లీ సీఎంను కటకటాల వెనక్కి పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’ అని సంజయ్ అన్నారు. -
కేజ్రీవాల్ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్: సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని అన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఇదే సమయంలో లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా, సంజయ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్కు కుట్రలు చేశారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆప్ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోంది. బీజేపీతో కలిస్తే ఎలాంటి కేసులు ఉండవు. అలాగే, కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్కు టీడీపీ టికెట్ ఇచ్చారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగింది. ఆయన ఇప్పుడు మోదీ ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు’ అని కామెంట్స్ చేశారు. #WATCH | Delhi: Aam Aadmi Party MP Sanjay Singh says, "There is one person, Magunta Reddy, who gave 3 statements, his son Raghav Magunta gave 7 statements. On 16th September, when he (Magunta Reddy) was first asked by ED whether he knew Arvind Kejriwal, he told the truth and said… pic.twitter.com/YzyPrZxYAQ — ANI (@ANI) April 5, 2024 ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఆర్నెల్ల పాటు తీహార్ జైల్లో ఉన్న సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. రెండు కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’ అని అన్నారు. -
AAP MP Sanjay Singh: బీజేపీకి గట్టిగా బదులిస్తాం
న్యూఢిల్లీ: విపక్షాలపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచి్చందని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆర్నెల్ల పాటు తిహార్ జైల్లో గడిపిన ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట రాగా ఓపెన్ టాప్ కార్లో ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. 2 కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’’ అని అన్నారు. అవినీతి ఆరోపణలపై విపక్ష పాలిత రాష్ట్రాల పోలీసులు మోదీ ఇంటి తలుపు తడితే విచారణకు ఆయన సహకరిస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. -
లిక్కర్ కేసు: తీహార్ జైలు నుంచి ‘ఆప్’ ఎంపీ రిలీజ్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే సంజయ్సింగ్కు ఆప్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆరు నెలల తర్వాత విడుదలైన తమ నేతపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి సంజయ్సింగ్ మాట్లాడారు. ‘ఇది మనం వేడుక చేసుకునే టైమ్ కాదు. పోరాడాల్సిన సమయం. మన నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారంతా జైలు తాళాలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తారని నాకు నమ్మకం ఉంది’అని సంజయ్సింగ్ అన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సంజయ్ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ను కలిశారు. #WATCH | After spending six months in jail, AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail. He was greeted by party leaders and workers on his release. pic.twitter.com/dTybWdb7C4 — ANI (@ANI) April 3, 2024 ఇదీ చదవండి.. సంజయ్ సింగ్ రాక.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు -
సంజయ్సింగ్కు బెయిల్.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు !
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలు జైలులో మగ్గుతున్న ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి సంజయ్ సింగ్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లిక్కర్ కేసులో గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్సింగ్ బుధవారం(ఏప్రిల్ 2) సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని తమ పార్టీకి ‘మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హోప్’గా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు. ఆప్ సీనియర్ నేత అయిన సంజయ్సింగ్కు మంచి ఎన్నికల వ్యూహకర్తగా, వక్తగా పేరుంది. పకడ్బందీ ఎన్నికల వ్యూహాలు రచించి పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చి ఎన్నికల్లో విజయాలు సాధించడంలో సంజయ్సింగ్ది అందె వేసిన చేయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆప్ సాధించిన అన్ని విజయాల్లో సంజయ్సింగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్రస్తుతం పార్టీ కీలక నేతలు జైలులో ఉన్న వేళ లోక్సభ ఎన్నికల ప్రచారం సంజయ్ సింగ్ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లగలరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన -
Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిమాణం.
-
లిక్కర్ కేసు: ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంలో బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ సింగ్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో జైలు పాలైన సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ విచారణ ముగిసే వరకు ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం సిండికేట్కు సంబంధించి లంచంగా తీసుకున్నారని ఆరోపిస్తున్న ఈ కేసులో సంజయ్ సింగ్ వద్ద ఒక్క పైసా కూడా లభించనప్పుడు.. 6 నెలలుగా జైలులో ఎలా ఉంచుతారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ప్రశ్నించింది. ఆప్ ఎంపీపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని తెలిపింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా సంజయ్ సింగ్ పాల్గొనవచ్చని పేర్కొంది. కాగా లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ను ఆప్ గతేడాది అక్టోబర్లో అరెస్ట్ చేసింది. గత ఆరు నెలలుగా సంజయ్సింగ్ తీహార్ జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలో తన రిమాండ్ను వ్యతిరేకిస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా సంజయ్ సింగ్కు బెయిల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ పేర్కొంది. అనంతరం సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్త, జస్టిస్ పిబి.వరాలే ధర్మసనం బెయిల్ ఉత్తర్వులను జారీ చేసింది. చదవండి: ‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్ -
కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాక్
అహ్మదాబాద్: ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ డిగ్రీపై దూషణపూర్వక, వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో కేజ్రీవాల్కు కింది కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ హస్ముఖ్ సుతార్ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. ఇద్దరు నేతలు తమ వాదనలను ట్రయల్ కోర్టు ముందే వినిపించాలని సూచించింది. ప్రధాని డిగ్రీపై తమ వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ సెషన్స్కోర్టులో కాకుండా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టడాన్ని తొలుత సెషన్స్ కోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు. కేజ్రీవాల్ రివిజన్ పిటిషన్ను సెషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు సూచనలతో హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. కాసేపటికే -
ఆప్ నేత సంజయ్ సింగ్కు చుక్కెదురు
ఢిల్లీ: ఆప్ నేత సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించారు. సంజయ్ సింగ్ వ్యవహారం ప్రివిలేజెస్ కమిటీ వద్ద ఉందని ధంఖర్ తెలిపారు. సంజయ్ సింగ్పై ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ విచారిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్ను రాజ్యసభ ఎంపీగా ఆప్ మరోసారి నామినేట్ చేసింది. సంజయ్ సింగ్తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు, ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏడు రోజుల మధ్యంతర బెయిల్ను కోరుతూ సంజయ్ సింగ్ ఫిబ్రవరి 1న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే.. పార్లమెంటుకు ప్రమాణం చేయడానికి మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్ను గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. డిసెంబర్ 22, 2023న బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత జనవరి 3న ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా.. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్లో ఉంచింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. బయటకు వస్తే కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్కు బలపరీక్ష -
ఆప్ నేతకు తొలగిన అడ్డంకి.. ప్రమాణ స్వీకారానికి అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకి తొలగింది. సంజయ్ సింగ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి శనివారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేయటానికి సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని.. ప్రత్యేక న్యాయముర్తి ఎం.కే నాగ్పాల్ అనుమతి ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని కోర్టు పొడగించింది. సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలను ఫిబ్రవరి 17 తమ ముందు ప్రవేశపెట్టాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఎంపీగా సంజయ్ సింగ్ పదవి కాలం జనవరి 27న ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్ గవర్నర్ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా -
ఆప్ తరఫున రాజ్యసభకు మలివాల్ సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మళ్లీ అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. అదేవిధంగా, పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మరో విడత ఎగువసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. హరియాణా రాజకీయాల్లో కీలకంగా ఉండాలన్న రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అభిప్రాయం మేరకు ఆయన స్థానంలో స్వాతి మలివాల్కు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఆమె 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు శుక్రవారం సాయంత్రం డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వినతి మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టు..ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సంజయ్ సింగ్కు వెసులుబాటు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. -
Wrestling Federation of India: సస్పెన్షన్ను పట్టించుకోం... కమిటీని గుర్తించం!
న్యూఢిల్లీ: ఇంత జరిగినా కూడా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడాశాఖ విధించిన సస్పెన్షన్ను పట్టించుకోమని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నియమించిన అడ్హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ పోటీలను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. ‘మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాం. రిటరి్నంగ్ అధికారి దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేశారు. అలాంటి కార్యవర్గాన్ని ఎందుకు విస్మరిస్తారు. అడ్హక్ కమిటీతో మాకు సంబంధం లేదు. మా సమాఖ్యను మేమే నడిపించుకుంటాం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పోటీల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకుంటాం’ అని సంజయ్ వెల్లడించారు. నియమావళిని అతిక్రమించలేదని ఇదివరకే క్రీడాశాఖకు సంజాయిషీ ఇచ్చామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. -
WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యాను! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది
Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు. వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. సంజయ్ సింగ్కు షాకిచ్చిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పునియా, జితేందర్ సింగ్ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్భూషణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనిత షెరాన్ ప్యానెల్పై.. బ్రిజ్భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్ పునియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్ భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మంచో.. చెడో.. రిటైర్ అయ్యాను.. నాకేం సంబంధం లేదు ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యానంటూ బ్రిజ్భూషణ్ సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యాను. సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్భూషణ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
WFI: కొంపముంచిన స్వామిభక్తి! కోర్టులోనే తేల్చుకుంటాం
WFI New President Sanjay Singh Comments: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ను ఎత్తేయాలని డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ కేంద్ర క్రీడా శాఖను కోరారు. తమకు సమయమిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో నిబంధనల్ని అతిక్రమించలేదని నిరూపిస్తామనన్నారు. అలా కాదని సస్పెన్షన్ను కొనసాగిస్తే మాత్రం సహించబోమని.. కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. వేటు వేసిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఓ అడుగు ముందుకేస్తే... రెండడుగులు వెనక్కి అన్నట్లుంది వ్యవహారం. మహిళా రెజ్లర్ల పోరాటం, పోలీసు కేసులు, హైకోర్టు స్టేలను దాటుకొని ఎట్టకేలకు సమాఖ్యకు ఎన్నికలు జరిగి, కొత్త కార్యవర్గం ఏర్పాటైందన్న ముచ్చట మూణ్నాళ్ల ముచ్చటే అయింది. డబ్ల్యూఎఫ్ఐపై కేంద్ర క్రీడాశాఖ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకపక్ష నిర్ణయాలు సహించేది లేదు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్కు విధేయుడైన సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఇలా ఎన్నికయ్యారో లేదో అప్పుడే స్వామిభక్తి మొదలుపెట్టారు. అండర్–15, అండర్–20 జాతీయ జూనియర్ చాంపియన్షిప్ పోటీలను బ్రిజ్భూషణ్ హవా నడిచే గోండా (యూపీ) పట్టణంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ఏకపక్ష విధానంపై కేంద్ర క్రీడాశాఖకు డబ్ల్యూఎఫ్ఐ కార్యదర్శి ప్రేమ్చంద్ ఫిర్యాదు చేయడంతో వెంటనే సమాఖ్యను సస్పెండ్ చేసింది. ‘కొత్త కార్యవర్గం ఏకపక్ష నిర్ణయంతో డబ్ల్యూఎఫ్ఐ నియమావళిని అతిక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ వేటు వేశాం. ఇది అమల్లో ఉన్నంతవరకు సమాఖ్య రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం లేదు’ అని క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఏ జూనియర్, సబ్–జూనియర్, సీనియర్ టోర్నమెంట్ అయినా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే చర్చించి నిర్ణయించాలి. కొంపముంచిన స్వామిభక్తి కానీ సంజయ్ మితిమీరిన స్వామిభక్తితో ఏకపక్ష నిర్ణయం తీసుకొని అడ్డంగా బుక్కయ్యారు. తాజా సస్పెన్షన్తో గోండాలో ఈనెల 28 నుంచి 30 వరకు జరగాల్సిన పోటీలు వాయిదా పడ్డాయి. అయితే, ఈ విషయంపై స్పందించిన సంజయ్ సింగ్.. ‘‘టోర్నీల నిర్వహణ విషయంలో డబ్ల్యూఎఫ్ఐ ‘నియామావళి’ ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నాం. ఇది నా ఒక్కడి ఏకపక్ష నిర్ణయం కానేకాదు. 24 రాష్ట్ర సంఘాలను సంప్రదించిన మీదటే టోర్నీ ఆతిథ్య వేదికను ఖరారు చేశాం. అన్నింటికి ఈ–మెయిల్ సాక్ష్యాలున్నాయి. కావాలంటే వీటిని నిరూపిస్తాం’’ అని సవాల్ విసిరారు. చదవండి: PKL 2023: పవన్ పోరాటం వృథా -
కేజ్రీవాల్కు ఏదో జరగబోతోంది
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఇరుకున పెట్టేందుకు పెద్ద కుట్ర జరగబోతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడం మాత్రమే కాదు. అంతకంటే మించి ఏదో చేయడమే ఆ కుట్ర’ అని అన్నారు. మద్యం విధానం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించని విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. -
లిక్కర్ స్కాం: సంజయ్ సింగ్కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: కోర్టు హాల్లో రాజకీయ ప్రసంగం చేసినందుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా వాదనలు వినిపించే క్రమంలో వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లు ఎత్తినందుకు సంజయ్ సింగ్కు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాదనలు జరుగుతాయని న్యాయమూర్తి తెలిపారు. సంబంధం లేని విషయాల గురించి మాట్లాడవద్దని న్యాయమూర్తి సంజయ్ సింగ్కు హెచ్చరించారు. గౌతమ్ అదానీపై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సంస్థలు పనిచేయడం లేదని సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో తనను కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారని సంజయ్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. 'నా తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నాను. నా భార్యకు ఎందుకు రూ.10,000 ఎందుకు పంపాను. అనవసమైన ప్రశ్నలతో ఈడీ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్గా మారింది. అన్నీ అబద్దాలే. అదానీపై ఫిర్యాదు చేశాను. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.' అని సంజయ్ సింగ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు వారాలు రిమాండ్ పెంచాలని ఈడీ అభ్యర్థన మేరకు.. న్యాయస్థానం అక్టోబర్ 27 వరకు సంజయ్ సింగ్ రిమాండ్ను పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త దినేశ్ అరోరా లొంగిపోవడంతో సంజయ్ సింగ్పై ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే అరెస్టైన దినేశ్ అరోరా, మనీష్ సిసోడియాకు మధ్య మీటింగ్ను సంజయ్ సింగ్ ఏర్పాటు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంలో సంజయ్ సింగ్ ఎక్సైజ్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఈడీ ఆయన నివాసంపై దాడి చేసి కీలక పత్రాలను కూడా ఇప్పటికే స్వాదీనం చేసుకుంది. ఇదీ చదవండి: Operation Ajay News: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక అప్డేట్
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్ను కూడా ఆయన ఛాలెంజ్ చేయనున్నారు. ఈ వ్యవహారంపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేయనుంది. 2020-21 నాటికి చెందిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో మరికొన్ని నిజాల్ని రాబట్టాల్సి ఉందని దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయడంతో సంజయ్ సింగ్కు రిమాండ్ను ట్రయల్ కోర్టు అక్టోబర్ 13కు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు సంజయ్ సింగ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లిక్కర్ స్కాంలో సంబంధం ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంజయ్ సింగ్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. AAP MP Sanjay Singh arrested following the ED raid at his residence in connection with the Delhi excise policy case. pic.twitter.com/tvOxDaOg5b — ANI (@ANI) October 4, 2023 మరోవైపు.. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్న సందర్భంగా ఆప్ ఎంపీ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. #WATCH | Delhi | Supporters of AAP MP Sanjay Singh sit outside his residence and raise slogans. ED raid is going on at his residence since today morning in connection with the Delhi excise policy case. pic.twitter.com/gGTvE3y2uk — ANI (@ANI) October 4, 2023 ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
నన్ను పోలీస్ లాకప్కు పంపొద్దు
న్యూఢిల్లీ: ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి తనను పోలీస్ లాకప్కు తరలించకుండా అడ్డుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్సింగ్ కోర్టును కోరారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో శనివారం ఈ మేరకు పిటిషన్ వేశారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఆయనను బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే. కోర్టు ఆయనకు ఈనెల 10 దాకా రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయంలోని లాకప్ రూంలో ఉంచారు. అక్కడ పురుగు మందులు కొడుతున్నారనే నెపంతో తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయతి్నంచారని సంజయ్సింగ్ ఆరోపించారు. తనను టార్చర్ చేసేందుకు కుట్ర పన్నారన్నారు. తరలింపు ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అమానవీయంగా వ్యవహరించారన్నారు. -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. అరెస్టైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు కూడా సమన్లు జారీ చేసింది. సంజయ్ సింగ్కు అతి సన్నిహితులైన వివేక్ త్యాగి, సర్వేశ్ మిశ్రాలను శుక్రవారం ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ సింగ్పై దర్యాప్తులో భాగంగా ఆప్ అధికార ప్రతినిధి సర్వేశ్ మిశ్రా పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంజయ్ సింగ్ తరుపున సర్వేశ్ మిశ్రా కోటి రూపాయలు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్తో పాటు సర్వేశ్ మిశ్రా, వివేక్ త్యాగిలను కూడా ఈడీ ప్రశ్నించనుంది. మద్యం కుంభకోణం కేసులో సంజయ్ సింగ్ అక్టోబర్ 10 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారిలో ఈయన మూడో వ్యక్తి. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు అరెస్టయ్యారు. బుధవారం 10 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత సంజయ్ సింగ్ను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయన ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు కూడా చేసింది. నిందితుడు దినేశ్ అరోరా నుంచి సంజయ్ సింగ్ రూ.2 కోట్లు అందుకున్నాడనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు -
ఆప్కు కాంగ్రెస్ చురకలు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మద్దతునిస్తూనే ఆప్కు కాంగ్రెస్ చురకలంటించింది. ఇండియా కూటమి భాగస్వామైన ఆప్ను కాపాడుకుంటూనే పంజాబ్లో తమ నేతలను అరెస్టు చేయడంపై విరుచుకుపడింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. బీజేపీ ప్రతికార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాయని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. బీజేపీ ప్రతికార రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు పూర్తి మద్దతుగా నిలుస్తామని అన్నారు. అదే క్రమంలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై ఆప్ను నిందించారు. AAP MP Sh. @SanjayAzadSln ji's arrest by the ED takes the BJP's vendetta politics to another level. We stand in complete solidarity with him and reject the use of law enforcement agencies to settle political scores. For this reason, we also oppose the arrests of All India… — K C Venugopal (@kcvenugopalmp) October 5, 2023 పంజాబ్లో 2015నాటి డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైరాను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మఖ్యమంత్రి ఓపీ సోనీని కూడా అరెస్టు చేశారు. పంజాబ్లో ఆప్ అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ నేతలను అరెస్టు చేయడం పట్ల కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నేతల అరెస్టులు న్యాయబద్ధంగా జరలేదని ఆరోపించారు. కూటమిలో పోరు: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్కు మద్యం కుంభకోణం కేసులో మద్దతుగా నిలుస్తోంది. అటు.. పంజాబ్లో సొంత అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లో ఆప్, కాంగ్రెస్కు మధ్య సీట్ల షేరింగ్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. అవినీతి మయమైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆప్ నేతలు అంటున్నారు. కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉంటుందని పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం: మద్యం కుంభకోణంలో అక్రమాలకు పాల్పడి ఆ డబ్బును పార్టీ ప్రచారాల కోసం వినియోగించారని ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే జైలు పాలయ్యారు. తాజాగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇదీ చదవండి: వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? -
వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఏవైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు సీబీఐను ప్రశ్నించింది. ఇదే కేసులో నిందితుడైన దినేశ్ అరోరా వాంగ్మూలం మినహా ఇంకా ఏం ఆధారాలున్నాయని అడిగింది. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ పేర్కొంది. కొన్ని వాట్సాప్ సందేశాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యం ఆమోదయోగ్యమేనా? అప్రూవర్గా మారిన వ్యక్తి ఇచి్చన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా ఎలా భావించగలం? అని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారని అభిప్రాయపడింది. సిసోడియా ముడుపులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, మరి ఆ డబ్బులు ఆయనకు ఎవరిచ్చారు? డబ్బులిచి్చనట్లు ఆధారాలున్నాయా? ఈ కేసులో అరోరా వాంగ్మూలం కాకుండా సాక్ష్యాలున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సంజయ్ సింగ్కు ఐదు రోజుల కస్టడీ బుధవారం అదుపులోకి తీసుకున్న ఆప్ నేత ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అధికారులు గురువారం ప్రత్యేక కోర్టు జడ్జి నాగ్పాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో మిగతా నిందితులతో కలిపి ఆయన్ను విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. దీంతో జడ్జి నాగ్పాల్ ఆయన్ను విచారణ నిమిత్తం అయిదు రోజుల ఈడీ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జడ్జి అనుమతి మేరకు సంజయ్ సింగ్ కోర్టులో మాట్లాడారు. -
లిక్కర్ స్కాంలో ఆప్ ఎంపీ సంజయ్కు మరో షాక్..
ఢిల్లీ: దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ సంజయ్ సింగ్ను కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు సంజయ్ సింగ్ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను కోర్టు ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. బుధవారం సంజయ్ను అధికారులు కోర్టులో హాజరు పరచగా.. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు ఆయన్ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈడీ అధికారులు సంజయ్ సింగ్ను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోరా.. సంజయ్కు డబ్బులు ఇచ్చినట్టు రికార్డు చేసిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాన్ని సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు, ఈడీ అధికారులు సంజయ్ సింగ్ను అవమానించేందుకే అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ అరెస్టు చేసిన దినేశ్ అరోడా అప్రూవర్గా మారారని.. ఈ కేసులో ముందుగా ఎప్పుడూ సమన్లు కూడా ఇవ్వలేదని వాదించారు. ఇదిలా ఉండగా.. తన అరెస్ట్కు ముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదానీ స్కామ్లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, దాడులు, అరెస్టులు వంటి వాటి ద్వారా విజయం సాధించలేరని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేస్తున్నదని చెప్పారు. తనపై చేసినవన్నీ నిరాధార, తప్పుడు ఆరోపణలేనన్నారు. ఇలాంటి వాటికి భయపడబోమని.. పోరాటం చేస్తామని చెప్పారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద ఫొటో.. రావణుడితో పోల్చి.. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్
-
కేజ్రీవాల్కు షాక్.. లిక్కర్ స్కాంలో ఆప్ ఎంపీ అరెస్ట్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. దీంతో, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ సర్కార్కు మరో షాక్ తగిలింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. కాగా, ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి సంజయ్ సింగ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లిక్కర్ స్కాంలో సంబంధం ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంజయ్ సింగ్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. AAP MP Sanjay Singh arrested following the ED raid at his residence in connection with the Delhi excise policy case. pic.twitter.com/tvOxDaOg5b — ANI (@ANI) October 4, 2023 మరోవైపు.. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్న సందర్భంగా ఆప్ ఎంపీ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను విచారించిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు రావాలని కూడా ఇటీవలే నోటీసులు ఇచ్చింది. #WATCH | Delhi | Supporters of AAP MP Sanjay Singh sit outside his residence and raise slogans. ED raid is going on at his residence since today morning in connection with the Delhi excise policy case. pic.twitter.com/gGTvE3y2uk — ANI (@ANI) October 4, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గ్యాస్ ధర తగ్గింపు.. -
వెయ్యి సార్లు వెతికినా చిల్లిగవ్వ దొరకదు: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ 1000 సార్లు దాడులు చేసినప్పటికీ లిక్కర్ స్కాంలో కేసులో అక్రమంగా సంపాదించినట్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. "Nothing will be found at his residence," Arvind Kejriwal reacts to ED's raid on Sanjay Singh Read @ANI Story | https://t.co/oTADiHIxnP#ArvindKejriwal #EDRaid #SanjaySingh pic.twitter.com/txzXtqdGgQ — ANI Digital (@ani_digital) October 4, 2023 'ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లోనూ ఏమీ లభించలేదు. గత ఏడాది నుంచి లిక్కర్ స్కాం అంటూ దర్యాప్తు చేస్తున్నారు. అయినా.. లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి సార్లు సోదాలు చేశారు.. కానీ ఏమీ లభించలేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి పరాజయం తప్పదు. ఇదే వీరికి చివరి అవకాశం' అంటూ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు ఆప్ ఎంపీ(రాజ్యసభ) సంజయ్ సింగ్కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. బీజేపీ ఫైర్ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా మండిపడింది. దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఆప్ నేతలకు ఎందుకు భయమైతుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడు నెలలుగా ఆప్ నేత మనీష్ సిసోడియా జైలులోనే గుడుపుతున్నారు.. త్వరలో మరో నేత జైలు కెళ్లబోతున్నారని ఆప్ భయపడుతోందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇదీ చదవండి: Delhi Liquor Policy Case: ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బులు.. అందుకే సంజయ్ సింగ్ ఇంట సోదాలు? -
ED Raids: ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బులు?
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో మరో ఆప్ కీలక నేత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ స్కామ్కు సంబంధించి పలువురు అప్రూవర్లుగా మారారనే కథనాల నడుమ.. తాజా సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఎన్నికల్లో ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బుల్నే ఉపయోగించారన్న అభియోగాలపై ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఆప్ ఎంపీ(రాజ్యసభ) సంజయ్ సింగ్కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. అంతేకాదు.. లిక్కర్ డిపార్ట్మెంట్తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని కూడా ఆరోపించింది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో.. సంజయ్ సింగ్ పేరును మాత్రం నిందితుల జాబితాలో ఈడీ చేర్చలేదు. అయితే ఛార్జిషీట్లో పేరు చేర్చినప్పటికీ.. ఇప్పటిదాకా సమన్లు జారీ చేయడం గానీ, ఆయన స్టేట్మెంట్నుగానీ రికార్డు చేయలేదు. మనీశ్ సిసోడియా తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ.. మరో ఆప్ నేత సంజయ్ సింగ్పై ఫోకస్ సారించింది. ఇదిలా ఉంటే.. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది సీఐబీ. అంతేకాదు ఏప్రిల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తొమ్మిది గంటలపాటు ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్..! ఆప్ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పొరపాటుగా పేరు చేర్చినందుకు ఆప్ నేత సంజయ్ సింగ్కు క్షమాపణలు చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. టైపోగ్రాఫికల్/క్లరికల్ తప్పిదం వల్ల రాహుల్ సింగ్ పేరుకు బదులు సంజయ్ సింగ్ అని అచ్చయ్యిందని తెలిపింది. ఈ మేరకు ఆయనకు అధికారిక లేఖ పంపింది. లిక్కర్ స్కాం కేసు ఛార్జ్షీట్లో ఆప్ నేత సంజయ్ సింగ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అసలు ఏ సంబంధం లేని తన పేరును ఛార్జిషీట్లో చేర్చడంపై సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠ దెబ్బతీశారని ఈడీకి లీగల్ నోటీసులు పంపారు. దీంతో తప్పు తమవైపు నుంచే జరిగిందని ఈడీ అంగీకరించింది. సంజయ్ సింగ్కు క్షమాపణలు చెప్పింది. అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చరిత్రలో తొలిసారి ఈడీ క్షమాపణలు కోరతూ తనకు లేఖ రాసిందని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ED के झूठ का पर्दाफ़ाश करेंगे। अग्रिम कार्यवाही के लिये भारत सरकार के वित्त सचिव को मेरा पत्र। pic.twitter.com/84f9NLk9Id — Sanjay Singh AAP (@SanjayAzadSln) May 3, 2023 ఢిల్లీ లిక్కర్ స్కాం ఫేక్ కేసు: కేజ్రీవాల్.. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఏ సంబంధం లేని సంజయ్ సింగ్ను కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి లాగాలని ఈడీ చూసిందని , కానీ లీగల్ నోటీసులు పంపడంతో క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్ అని తెలిపేందుకు ఇదే పెద్ద నిదర్శనమన్నారు. నిజాయితీ గల తమ పార్టీని, నాయకుల ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే ప్రధాని మోదీ ఈడీతో ఈ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి ఆదరణ పెరగడం చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. क्या किसी का नाम चार्जशीट में गलती से भी डाला जाता है? इस से साफ़ है कि पूरा केस फ़र्ज़ी है। केवल गंदी राजनीति के तहत देश की सबसे ईमानदार पार्टी को बदनाम करने और सबसे तेज़ी से बढ़ने वाली पार्टी को रोकने के लिए प्रधान मंत्री जी ऐसा कर रहे हैं। उन्हें ये शोभा नहीं देता। https://t.co/xu5kywg5Fz — Arvind Kejriwal (@ArvindKejriwal) May 3, 2023 కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్లోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు ప్రముఖులను సీబీఐ ఈ కేసులో విచారించిన విషయం తెలిసిందే. చదవండి: శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..! -
కేజ్రీవాల్, సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు నోటీసులు.. కారణం ఇదే..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదంపై కేజ్రీవాల్కు మరోసారి షాక్ తగిలింది. ఈ వివాదంపై తాజాగా కేజ్రీవాల్ సహా ఆప్ ఎంపీ సంజయ్కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23వ తేదీలోపు సమాధాని ఇవ్వాలన్ని నోటీసుల్లో పేర్కొంది. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ గుజరాత్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా గుజరాత్ యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయేశ్భాయ్ చోవాటియా ఆదేశించారు. ఇక, అంతకుముందు.. ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటే.. వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్ సర్టిఫికెట్ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో అని అన్నారు. ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలు చెప్పుకునేవి కదా! అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ సంజయ్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని వర్సిటీ నిరూపించిందన్నారు. -
సర్కారు బడి కూల్చివేతకు బీజేపీ యత్నాలు: ఆప్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లో కొత్తగా నిర్మించే పార్టీ కేంద్ర కార్యాలయం కోసం బీజేపీ ప్రభుత్వ పాఠశాలను కబ్జా చేస్తోందని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న పాఠశాల స్థలాన్ని ఇప్పటికే కొంత ఆక్రమించిన బీజేపీ..ఇప్పుడు అభివృద్ధి పేరుతో భవనాన్ని సైతం కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆప్ అలా జరగనీయబోదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. స్కూలు భవనాన్ని కూలగొడితే 350 మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఒక్క స్కూల్ను కూడా ధ్వంసం కానివ్వమన్నారు. -
సీబీఐని నాకు అప్పగిస్తే.. వాళ్లను రెండు గంటల్లో అరెస్టు చేయిస్తా: ఆప్ ఎంపీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐని తనకు అప్పగిస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని రెండు గంటల్లోనే అరెస్టు చేయిస్తానని చెప్పారు. డిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలతో కలిసి సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు సంజయ్. వీరిని అరెస్టు చేసిన పోలీసులు కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్కు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఫలించవు అని పేర్కొన్నారు. 'మోదీ నియంతృత్వానికి త్వరలోనే ముగింపు ఉంటుంది. దేశంలోనే ప్రముఖ విద్యా మంత్రిని ఆయన అరెస్టు చేశారు. కేజ్రీవాల్ ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు వల్ల ఆయనపై ఎలాంటి ప్రభావం ఉండదు. దర్యాప్తు సంస్థలతో సిసోడియాను అరెస్టు చేయించడం కేంద్రం పిరికిపంద చర్య.' అని సంజయ్ సింగ్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీశ్ సిసోడియాను ఆదివారం 8 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది సీబీఐ. సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. చదవండి: సిసోడియాను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ..ఐదు రోజుల కస్టడీపై తీర్పు రిజర్వ్.. -
Rajya Sabha: ఆరోపణలు సరే.. ఆధారాలేవీ?
న్యూఢిల్లీ: సభలో తగిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని రాజ్యసభ సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ హితవు పలికారు. అలాంటి ఆరోపణలు చేయడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమని తేల్చి చెప్పారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని, కానీ, కేవలం 23 మంది దోషులుగా తేల్చారని చెప్పారు. సంజయ్ సింగ్ వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలుగజేసుకోవాలని సభాపతిని కోరారు. దీంతో చైర్మన్ ధన్ఖడ్ స్పందించారు. సభలో ఎవరు ఏం మాట్లాడినా అది కచ్ఛితత్వంతో కూడినది అయి ఉండాలని సూచించారు. తగిన ఆధారాలతో మాట్లాడాలన్నారు. ఆధారాలు లేని గణాంకాలను సభలో చెబుతామంటే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇష్టారీతిన తోచింది మాట్లాడడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమేనని ఉద్ఘాటించారు. ఇలాంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తానన్నారు. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోమన్నారు. సభలో ఏదైనా ఆరోపణ చేసినప్పుడు చట్టబద్ధ∙డాక్యుమెంటేషన్ ఉండాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గోయెల్ మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ఈడీ 3,000 సోదాలు చేసిందనడం పూర్తిగా అవాస్తవమని తేలి్చచెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని అన్నారు. సంజయ్ స్పందిస్తూ.. అధికార పార్టీతో సంబంధాలున్న అవినీతిపరులపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. -
ఆప్ నాయకులకు పరువు నష్టం నోటీసులు... భయపడేదే లేదంటూ ముక్కలు ముక్కలుగా చించేసి...
న్యూఢిల్లీ: మద్యంపాలసీకి సంబంధించిన స్కీంలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై సీబీఐ దాడుల జరిపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆప్ నాయకులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ వర్సస్ ఎల్జీ(లెఫ్టినెంట్ గవర్నర్), స్కామ్ వర్సస్ స్కామ్ రాజకీయం అన్నట్లుగా ఇద్దరి మధ్య వాడి వేడిగా విమర్శలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖాదీ స్కాం విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పై ఆప్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ సక్కేనా ఆప్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్, అతిషి, సౌరభ్ భరద్వాజ్ల తోపాటు జాస్మిన్ షాలకు పరువు నష్టానికి సంబంధించిన లీగల్ నోటీసులు పంపించారు. అంతేకాదు ఇలా పార్టీలోని సభ్యులందరూ ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగా దురుద్దేశపూర్వకంగా, నిరాధారమైన తప్పుడు ప్రకటనలతో తన పరువుకి భంగం కలిగేంచే వ్యాఖ్యలను వ్యాప్తి చేసే అలవాటును మానుకోవాలంటూ ఒక పత్రిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మేరకు ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ..."భారత రాజ్యంగం నాకు మాట్లాడే హక్కును ఇచ్చింది. అలాగే రాజ్యసభ సభ్యునిగా నిజం మాట్లాడే హక్కు నాకు ఉంది. ఒక దొంగ, అవినీతిపరుడు పంపిన నోటీసులకు భయపడను అంటూ ముక్కలు ముక్కలుగా చించేశారు. అలాంటివి ఎన్ని నోటీసులు పంపించినా చించేయగలను, విసిరి పారేయగలను" అని ఆగ్రహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తమపై ఇలా రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆప్ పేర్కొంది. అంతేకాదు సక్కేనా 2015 నుంచి 2022 వరకు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీన్ కమిషన్(కేవీఐసీ) చైర్పర్సన్గా ఉన్నప్పుడూ అనేక అవకతవకలు జరిగాయని ఆప్ ఆరోపించింది. పైగా ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ అసెంబ్లీలో మాట్లాడుతూ...కేవీఐసీ ఉద్యోగులపై సుమారు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ పలు ఆరోపణలు చేశారు. అంతేకాదు మంబైలోని ఖాదీ లాంచ్ ఇంటీరీయర్ డిజైనింగ్ కాంట్రాక్టును కూడా తన కుమార్తెకు ఇచ్చారంటూ ఆరోపణలు గుప్పించారు. తాము చేస్తున్న పోరాటంలో పలు ప్రశ్నలు ఉంటాయని వాటిని ఎదర్కునేందుకు సిద్ధంగా ఉండండి అని సవాలు ఆప్ నేత సంజయ్ సింగ్ సవాలు విసిరారు. సుప్రీం కోర్టు ఆప్ నేతలకు ఈ నోటీసులను బుధవారం పంపిచింది. ఈ కేసు విచారణను ధర్మాసనం అక్టోబర్ 11 వ తేదికి వాయిదా వేసింది. (చదవండి: 'బీజేపీలో ఉంటూనే ఆప్ కోసం పనిచేయండి'.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు) -
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై సస్పెన్షన్ వేటు
-
ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు. ఆర్యన్ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ డ్రగ్స్తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్ నుంచి ఢిల్లీలోని ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుల్ని విచారించడానికి ఎన్సీబీ సీనియర్ అధికారి సంజయ్ సింగ్ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్, నటుడు అర్మాన్ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని అందులో వాంఖెడే వాటా రూ.8 కోట్లు అంటూ ఈ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై వాంఖెడేపై శాఖాపరమైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక మంత్రి నవాబ్ మాలిక్ అడుగడుగునా వాంఖెడేపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్సీబీ మాత్రం డ్రగ్స్ కేసులో జాతీయ, అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని, దీనిపై లోతుగా విచారించడం కోసమే సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. వాంఖెడే ముంబై జోనల్ డీజీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయించుకున్నాడు. బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ ఇస్తూ ప్రతీ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. బెయిల్ వచ్చి న తర్వాత తొలిసారి శుక్రవారం మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి ఆర్యన్ వచ్చాడు. -
గెలిస్తే ఉచితంగా 300 యూనిట్ల కరెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గురువారం లక్నోలో ఆప్ యూపీ ఇన్ఛార్జి సంజయ్ సింగ్తో కలిసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. బీజేపీ హయాంలో గృహ అవసరాల నిమిత్తం 300 యూనిట్ల విద్యుత్తుకు రూ.1,900 చెల్లిస్తున్నారని అదే ఆప్ ప్రభుత్వం వస్తే ఏమీ చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. యూపీలో గెలిస్తే అధిక కరెంట్ బిల్లులతో సతమతమవుతోన్న 48 లక్షల కుటుంబాల విద్యుత్ బిల్లులను రద్దుచేస్తామన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామని, పాత బకాయిలు మాఫీ చేస్తామని సిసోడియా పేర్కొన్నారు. ఇదే తరహా హామీని ఇప్పటికే ఆప్ పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లోనూ ఇచ్చింది. యూపీలోని మొత్తం 403 స్థానాల్లో పోటీకి దిగుతామని ఆప్ గతంలోనే స్పష్టంచేసింది. ఢిల్లీలో విజయవంతం అయిన విద్యుత్తు ఫార్మూలాను 2017లో పంజాబ్ ఎన్నికల్లో ప్రయోగించి అత్యధిక స్థానాలు పొందిన రెండో పార్టీగా ఆప్ నిలిచింది. ఈ సారి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ల్లోనూ తమదైన ముద్ర వేయాలని ఏడాది నుంచే పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల మొదటి వారంలో వివిధ సర్వేలు పంజాబ్లో ఆప్ గణనీయమైన పురోగతి సాధిస్తుందని పేర్కొనడంతో పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించడానికి సరైన తరుణమని కేజ్రీవాల్ భావించారు. ఉత్తరప్రదేశ్లాంటి పెద్ద రాష్ట్రంలో పార్టీని ప్రజల్లోకి తీసుకురావాలంటే ఛరిష్మా ఉన్న అగ్రనేత తప్పనిసరి. ఇటు అధికార బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పునాదులు బలంగా ఉండడంతో ఢిల్లీ విద్యుత్ ఫార్మూలానే యూపీలోనే ప్రయోగించాలని ఆప్ విశ్వసిస్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం మంది ఆదాయం పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా తరలివెళ్లిన వలస కార్మికులు కరోనా వల్ల తిరిగి రావడమూ ఓ కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఫార్మూలా యూపీలో ప్రభావం చూపుతుందని ఆప్ భావిస్తోంది. -
సజీవదహనం చేస్తామంటూ ఆప్ ఎంపీకి బెదిరింపులు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. హిందూ వాహినికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి చంపుతామంటూ సంజయ్ సింగ్పై బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన ఆయన నార్త్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'హిందూ వాహిని' నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు సంజయ్సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. '7288088088 మొబైల్ నంబర్ నుంచి నాకు తెలియని వ్యక్తి నుంచి కాల్స్ వస్తున్నాయి. సోమవారం కూడా అదు నెంబర్ నుంచి నాకు ఫోన్ రావడంతో నా సహోద్యోగి అజిత్ త్యాగి ఫోన్కు మళ్లించాను. మధ్యాహ్నం 3.59 గంటలకు కాల్ తీసుకోగా.. కాల్ చేసిన వ్యక్తి తనను చంపేస్తానంటూ బెదిరించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తానుగా హిందూ వాహిని నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించాడని' ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ను సంజయ్ సింగ్ తన ట్విటర్లో షేర్ చేశారు. -
ఆప్ ఎంపీపై సిరా దాడి
హాథ్రస్/లక్నో: ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్పై హాథ్రస్లో సోమవారం ఒక వ్యక్తి సిరా పోసి నిరసన తెలిపాడు. హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్తున్న సంజయ్ సింగ్పై గుర్తు తెలియని వ్యక్తి సిరా పోశాడు. ‘పీఎఫ్ఐ దళారి.. వెనక్కు వెళ్లిపో’ అని అతడు గట్టిగా అరిచాడు. అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. యూపీ ప్రభుత్వ తీరుకు ఇది అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిధులిచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. దేశద్రోహం కేసు: కుల ఘర్షణలకు ప్రయత్నిస్తున్నారని, కులం ప్రాతిపదికన విద్వేషం రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్పా పోలీస్స్టేషన్లో వారిపై దేశద్రోహం సహా పలు తీవ్ర అభియోగాలు మోపారు. హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఇలా ఉండగా, బాధిత దళిత యువతి ఇంటి వద్ద సెక్యూరిటీ పెట్టామని, ఆమె ఇద్దరు సోదరులకు ఇద్దరు గన్మెన్లను ఏర్పాటు చేశామని ఓ అధికారి చెప్పారు. -
రాజ్యసభ సమావేశాల బహిష్కరణ
న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో సభలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సస్పెండైన 8 మంది విపక్ష ఎంపీలు తమ నిరవధిక నిరసనను మంగళవారం విరమించారు. ఈ రాజ్యసభ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పార్లమెంటు వెలుపల పోరాటం చేస్తామన్నారు. నిరవధిక దీక్షలో భాగంగా సోమవారం రాత్రి అంతా వారు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దనే గడిపారు. అర్ధరాత్రి దాటాక కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, పాటలతో హోరెత్తించారు. నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా, సమాజ్వాదీ పార్టీ నేత జయాబచ్చన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, శశి థరూర్ వారిని కలిసి సంఘీభావం తెలిపారు. పార్లమెంటు చరిత్రలో రాత్రంతా ఆ కాంప్లెక్స్లోనే నిరసన దీక్ష జరపడం ఇదే ప్రథమమని పలువురు వ్యాఖ్యానించారు. ప్రచారం కోసమే.. హరివంశ్ ప్రచారం కోసమే దీక్ష జరుగుతున్న ప్రదేశానికి వచ్చారని, తనతో పాటు పెద్ద సంఖ్యలో మీడియా కెమెరామెన్లతో ఆయన వచ్చారని దీక్షలో పాల్గొన్న ఒక ఎంపీ పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో రూల్ బుక్ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్పై విసిరి, బల్లలపైకి ఎక్కి నినాదాలతో నిరసన తెలిపిన విపక్ష సభ్యుల్లో టీఎంసీ, కాంగ్రెస్, ఆప్, సీపీఎంలకు చెందిన 8 మందిని సోమవారం సస్పెండ్ చేయడం తెల్సిందే. తమకు సంఘీభావంగా విపక్ష పార్టీలు సభా కార్యాక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో నిరసనను విరమిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ చెప్పారు. విపక్షం వాకౌట్ సస్పెన్షన్ను వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, మంగళవారం రాజ్యసభ నుంచి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, డీఎంకే పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు, సస్పెన్షన్ను వెనక్కు తీసుకునేవరకు విపక్షాలన్నీ రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. క్షమాపణ చెప్తే ఓకే: మరోవైపు, సభలో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులు క్షమాపణ చెప్తే, వారిపై సస్పెన్షన్ను ఎత్తివేసే విషయాన్ని ఆలోచిస్తామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సభా కార్యక్రమాలను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని విపక్ష పార్టీలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో డెప్యూటీ చైర్మన్ హరివంశ్ నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని, పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. హరివంశ్ నిరసన రాజ్యసభలో ఆదివారం విపక్ష సభ్యులు తనకు చేసిన అవమానంపై ఆవేదనతో ఒక రోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో అయినా విపక్ష సభ్యుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు హరివంశ్ లేఖ రాశారు. రాష్ట్రపతికి హరివంశ్ రాసిన లేఖను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఆ లేఖ నేను చదివాను. అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రతీ ఒక్కరు చదవాల్సిన లేఖ అది’ అని ఆ లేఖను ట్యాగ్ చేస్తూ, మోదీ ట్వీట్ చేశారు. సమావేశాలు నేటితో ఆఖరు! కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచ్చిం ది. పార్లమెంట్ సభ్యుల్లోనూ కొందరు కరోనా బారిన పడడంతో షెడ్యూల్ కంటే 8 రోజులు ముందుగానే సమావేశాలు ముగి యనున్నాయి. బుధవారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధ వారం రాజ్యసభలో ఐదు బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. అలాగే లోక్సభలో జీరో అవర్ అనంతరం సభ వాయిదా పడనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెం బర్ 14న ప్రారంభమైన సంగతి తెలిసిందే. చాయ్పే చర్చ! దీక్షలో ఉన్న సభ్యులకు మంగళవారం ఉదయం అనుకోని అతిథి దర్శనమిచ్చారు. ఎవరి కారణంగా వారు దీక్షకు దిగాల్సి వచ్చిందో, ఆ వ్యక్తి.. రాజ్యసభ డిప్యూటి చైర్మన్ హరివంశ్ ఉదయమే వారి ముందుకు వచ్చారు. వారికి టీ, స్నాక్స్ తీసుకుని వచ్చి ఆశ్చర్యపరిచారు. ఆయన తెచ్చిన టీ, స్నాక్స్ను తాము స్వీకరించలేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. కాగా, హరివంశ్ పెద్దమనసును ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘తనపై దాడి చేసి అవమాన పరిచిన వారికి స్వయంగా టీ తీసుకురావడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ప్రతీ ప్రజాస్వామ్యవాది గర్వపడేలా హరివంశ్ ప్రవర్తించారు’ అని ట్వీట్ చేశారు. -
ఎంపీ చొరవతో విమానం ఎక్కనున్న 33 మంది
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సాయమందించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన 33 మంది బిహార్ వాసులను విమానంలో తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్ చేశారు. ఎంపీ కోటాలో తనకు కేటాయించే 34 బిజినెస్ క్లాస్ టికెట్లకు ఎంపీ బుక్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం తెలిపింది. వలస కార్మికులతో పాటు ఎంపీ సంజయ్ కూడా గురువారం సాయంత్రం బిహార్ వెళ్తారని వెల్లడించింది. ఎంపీ చొరవను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. ‘దేవుడు ఇతరుల సేవకై పనిచేసే అవకాశాలు ఇచ్చినప్పుడు. వాటిని బాధ్యతగా నెరవేర్చాలి. ఎంపీ సంజయ్ అభినందనీయుడు’అని సీఎం పేర్కొన్నారు. ప్రజా సేవకై రాజకీయాల్లోకి వచ్చానని, సీఎం కేజ్రీవాల్ సారథ్యంలో ఎప్పుడూ ప్రజా సేవకు అంకితమవుతానని ఎంపీ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. కాగా, ప్రతియేడు ఎంపీలకు 34 బిజినెస్ క్లాస్ టికెట్లను విమానయాన శాఖ కేటాయిస్తుంది. (చదవండి: ముంబైని తాకిన నిసర్గ తుఫాను) -
అంకిత్ శర్మ హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన హత్యలో ఆమ్ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో గత బుధవారం ఐబీ అధికార అంకిత్ శర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అంకిత్ను దారుణంగా హత్య చేసిన దుండగులు.. మృతదేహాన్ని మురికి కాలువలో పడేసి వెళ్లారు. అయితే ఈ హత్యను తాహిర్, అతని మద్దతుదారులే చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్ బాగ్ లోని ఆప్ నాయకుడు, మునిసిపల్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు చెందిన భవనం నుండి కొంతమంది వ్యక్తులు రాళ్ళు రువ్వారని అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అంకిత్ దాడి చేశారని అంకిత్ తండ్రి రవీందర్ కుమార్ పేర్కొన్నారు. (చదవండి : ఢిల్లీ అల్లర్లు : 35కు చేరిన మృతుల సంఖ్య) అయితే ఈ ఆరోపణలను తాహిర్ తీవ్రంగా ఖండించారు. అంకిత్ మృతికి తనకు సంబంధం లేదన్నారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిల్ మిశ్రా విద్వేషపూరిత ప్రసంగాల వల్లే ఈ దాడులు మొదలయ్యాయని ఆరోపించారు. అల్లరు కూడా మొదటగా కపిల్ మిశ్రా ఇంటి సమీపంలోనే జరిగాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. హింసాకాండ సమయంలో తన ఇంట్లోకి ఓ గుంపు ప్రవేశించిందని, ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. సమాచారం అందించిన 8 గంటల తర్వాత పోలీసులు వచ్చి తనను, తన కుటుంబీకులను రక్షించారని చెప్పారు. తన ఇంట్లోకి ప్రవేశించిన గుంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాహిర్ స్పష్టం చేశారు. కాగా, అక్కడ లభించిన వీడియోలో తాహీర్ చేతిలో రాడ్ పట్టుకొని బిల్డింగ్పై తిరుగుతూ కనిపించడం గమనార్హం. నేరం చేస్తే చర్యలు తీసుకోవచ్చు : సంజయ్ సింగ్ ఇంటెలిన్స్ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్పై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ స్పందించారు. ఏ వ్యక్తి అయినా.. ఏ మతానికి చెందినవాడైనా నేరం చేస్తే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. హింసాకాండ సమయంలో ఇంట్లోకి ఒక గుంపు ప్రవేశించడంపై మీడియాకు, పోలీసులకు తాహిర్ సమాచారం ఇచ్చారన్నారు. పోలీసులు 8గంటలు ఆలస్యంగా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నేరం చేస్తే ఏ పార్టీ నాయకుడైనా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో గురువారం నాటికి మృతుల సంఖ్య 35కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. -
తేజస్వీ యాదవ్ పుట్టినరోజుపై విమర్శలు
పాట్న: ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పుట్టినరోజు వేడుకను విలాసవంతంగా జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా..తేజస్వీ యాదవ్ ఈ నెల 9న తన 30వ పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకమైన చార్టర్డ్ విమానంలో జరుపుకున్నారు. బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలను రాంచీలోని రాక్ గార్డెన్ రిసార్ట్ డైరెక్టర్ సిద్ధాంత్ సుమన్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతోపాటు తేజస్వీ యాదవ్ ఫేస్బుక్ ఖాతాకు ట్యాగ్ చేశారు. ఈ ఫోటోల్లో తేజస్వీ బర్త్డే కేకును కట్ చేస్తున్నవి, సిద్ధాంత్తో కలిసి అల్పాహారం తింటున్నవి, కట్ చేసిన కేకును సిద్ధాంత్కు తినిపిస్తున్నవి ఉన్నాయి. తేజస్వీతో పాటు ఆర్జేడీ ఎమ్మెల్యే భోలా యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, మణి యాదవ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో తేజస్వీ యాదవ్ను పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి గురించి మాట్లాడే.. తేజస్వీ యాదవ్ విలాసవంతంగా చార్టర్డ్ విమానంలో పుట్టినరోజు జరుపుకున్నారు. అలా విమానాల్లో వేడుకలు జరుపుకోవడానికి బిల్లులు ఎవరు చెల్లించారని దుయ్యబట్టారు. కేక్ అందిస్తున్న సిద్ధాంత్ సుమన్ ఎవరని ప్రశ్నించారు. ఆర్జేడీ నేతలు పేదలు, అణచివేతకు గురైన వారిపట్ల మొసలి కన్నీళ్లు పెట్టుకుంటారని ఆయన ఆరోపించారు. ఎప్పుడూ పేదల నుంచి భూమిని లాక్కుని, అవినీతి కేసులకు పాల్పడుతారని విమర్శించారు. ఓ వైపు తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగాలేదనే ఆందోళన కొంచం కూడా లేకుండా తేజస్వీ యాదవ్ తన పుట్టినరోజు వేడుకలు ఆకాశంలో జరుగుపుకోవడానికి సిగ్గుచేటు అని సంజయ్సింగ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రజా జీవితంలో ఇలాంటి విపరీత జీవనశైలిని నివారించాలని, ఈ సంఘటన పార్టీకి సమస్యలు కలిగించిందని కొందరు ఆర్జేడీ నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే తేజస్వీ యాదవ్ మాత్రం ఇప్పటివరకూ ఈ వివాదంపై పెదవి విప్పలేదు. -
ట్రిపుల్ తలాక్ ఎఫెక్ట్: కాంగ్రెస్ ఎంపీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. అమిత్ షా సమక్షంలో రేపు బీజేపీ చేరబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. కాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని అమేథికి చెందిన సంజయ్ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రాజీనామాతో పార్టీ నేతలు షాక్కిగురయ్యారు. -
కాంగ్రెస్తో పొత్తు లేదు: ఆప్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తేల్చి చెప్పింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, హరియాణాల్లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరని కారణంగానే పొత్తు కుదరలేదని స్పష్టం చేసింది. ‘బీజేపీకి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే ఆప్.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనుకుంది. కానీ అందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదు. పొత్తులో భాగంగా మేం 18 సీట్లు అడిగాం. కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదు. ఇరు పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించేవాళ్లం’అని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విలేకరులతో వెల్లడించారు. -
ఢిల్లీలో పొత్తుపై తేల్చాల్సింది ఆప్: కాంగ్రెస్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయాన్ని తేల్చాల్సింది ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రమేనని, ఇప్పుడు బంతి ఆప్ కోర్టులో ఉందని కాంగ్రెస్ తెలిపింది. తాము పొత్తుకు సుముఖత వ్యక్తం చేశామని, ఆప్కు 4, కాంగ్రెస్కు 3 చొప్పున సీట్లు కేటాయించేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా వెల్లడించారు. ఈ విషయమై తమ పార్టీ అధినేత రాహుల్గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు. ఆప్ తో పొత్తు ఢిల్లీలో మాత్రమే ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో ఉండదని తెలిపారు. అయితే, పొత్తుపై కేజ్రీవాల్ యూ టర్న్ తీసుకున్నారని రాహుల్గాంధీ సోమవారం ఒక ఎన్నికల బహిరంగసభలో ఆరోపించారు. ఆప్ కు 5, కాంగ్రెస్కు 2 చొప్పున సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్తో పొత్తుకు తాము సిద్ధమని ఆప్ నేత సంజయ్సింగ్ పేర్కొన్నారు. పంజాబ్లో ఆప్కు నాలుగు ఎంపీలున్నా ఒక్క స్థానం కూడా కేటాయించేందుకు కాంగ్రెస్ ముందుకు రాలేదని, ఢిల్లీలో కాంగ్రెస్కు ఒక్క ఎంపీ సీటు కూడా లేకున్నా మూడు స్థానాలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. -
సీఎం బామ్మర్ది అయితే!
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వారాసివని నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యోగేంద్ర నిర్మల్నే బీజేపీ మళ్లీ బరిలో దించింది. మాములుగా అయితే ఈ స్థానంపై పెద్ద ఆసక్తేమీ ఉండదు. కానీ.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బావ (మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్)కు హ్యాండిచ్చి.. కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్న సంజయ్ సింగ్ మసానీ బీజేపీపై పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. వృత్తిరీత్యా వైద్యుడైన మసాని వారాసివని నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో మసాని ఈ నెల 3వ తేదీన కమల్నాథ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమల్నాథ్ కృషి ఫలితంగా కాంగ్రెస్ నాలుగో జాబితాలో మసానీకి చోటు దక్కింది. బావ పార్టీపై బామ్మర్ది ఆగ్రహం బీజేపీలో బంధుప్రీతి హద్దులు దాటిందని, వారసులకే పెద్ద పీట వేస్తున్నారని 60 ఏళ్ల మసాని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, కూతుళ్లకే ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చౌహాన్ కంటే కమల్నాథ్ అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే, మసానీకి టికెట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మసానీ అక్రమాలను పలుమార్లు కాంగ్రెస్ పార్టీయే అసెంబ్లీలో ఎత్తిచూపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మద్దతుగా ఎలా ప్రచారం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ బలమెక్కువ మధ్యప్రదేశ్లో బాలఘాట్ జిల్లా పరిధిలోకి వచ్చే వారాసివనిలో.. 2013లో ఆరెస్సెస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి యోగేంద్ర నిర్మల్.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్పై 17,755 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2008లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జైస్వాల్ గెలిచారు. 10మంది పోటీలో ఉన్నా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నప్పటికీ బీఎస్పీ కూడా తీవ్రమైన పోటీనిస్తోంది. -
మధ్యప్రదేశ్ సీఎంకు బావమరిది ఝలక్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆయన సొంత బావమరిదే షాక్ ఇచ్చారు. బీజేపీకి చెందిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భార్య సాధనా సింగ్కు స్వయానా సోదరుడైన సంజయ్ సింగ్ మసానీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్, సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మధ్యప్రదేశ్కు శివరాజ్ అవసరం లేదు. కమల్నాథ్లాంటి నేత కావాలి. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. నన్ను ముఖ్యమంత్రి కుటుంబసభ్యుడిగా కాకుండా కేవలం బంధువుగా మాత్రమే చూడండి’ అని అన్నారు. కమల్ నాథ్ మాట్లాడుతూ.. ‘బీజేపీ, శివరాజ్సింగ్ చౌహాన్ పాలనతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. మసానీ కాంగ్రెస్లో చేరడం కూడా ప్రజల అభీష్టానికి అద్దం పడుతోంది’ అని అన్నారు. దాదాపు ఇలాంటి పరిణామమే 2003 ఎన్నికలకు ముందు చోటుచేసుకోవడం గమనార్హం. అప్పటి సీఎం దిగ్విజయ్ సింగ్ సోదరుడు అర్జున్సింగ్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలుకాగా, అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. -
ముఖ్యమంత్రికి ఝలక్ ఇచ్చిన బావమరిది!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్సింగ్ చౌహాన్కు స్వయాన బావమరిది ఝలక్ ఇచ్చారు. చౌహాన్ బావమరిది సంజయ్సింగ్ మసానీ శనివారం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌహాన్ సతీమణి సాధనాసింగ్ సోదరుడైన సంజయ్ సింగ్.. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్నాథ్, ప్రచార కమిటీ చైర్మన్ జ్యోతిరాదిత్య సింథియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మధ్యప్రదేశ్కు కమల్నాథ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందని, 13 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన శివ్రాజ్ అవసరం రాష్ట్రానికి లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీ వారసత్వ రాజకీయాలను పెంచిపోషిస్తోందని సంజయ్సింగ్ విమర్శించారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 28న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శుక్రవారం 177 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. -
మోదీ పాకిస్తాన్తో మాట్లాడతారు కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఐఏఎస్ అధికారుల సమ్మె, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ మంత్రుల ధర్నాలతో రాజధాని అట్టుడుకుతుండగా కేంద్రం మౌనం దాల్చడాన్ని ఆప్ తప్పుపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడేందుకు సమయం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆక్షేపించారు. ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రైన కేజ్రీవాల్తో ప్రధాని తక్షణమే సంప్రదింపులు జరపాలని సింగ్ డిమాండ్ చేశారు. చర్చలకు ఢిల్లీ సీఎం, ఢిల్లీ సర్కార్ సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా లేదని మండిపడ్డారు. ప్రధాని పాకిస్తాన్తో మాట్లాడతారు..కానీ తమతో సంప్రదించేందుకు ఆయనకు సమయం లభించదని విమర్శించారు. మరోవైపు ఐఏఎస్ అధికారుల సమ్మెను నివారించాలని కోరుతూ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గ్రామీణాభివృద్ధి మంత్రి గోపాల్ రాయ్తో కలిసి ఎల్జీ బైజల్ కార్యాలయంలో ధర్నాను కొనసాగిస్తున్నారు. -
ఆప్ మరో ముందడుగు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొనసాగుతున్న ‘దుకాణాల మూసివేత’(సీలింగ్ డ్రైవ్)ని నిలిపివేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సభ్యుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం రాజ్య సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి దుకాణాల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రైవేటు బిల్లుతో తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. బిల్లుకు మిగతా పార్టీలు మద్దతు ఇవ్వాలని సంజయ్ సింగ్ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు 14 ప్రయివేట్ బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. అయినా మేము ధైర్యంగా ఈ బిల్లు ప్రవేశ పెట్టాము. బిల్లుకు ప్రతిపక్ష పార్టీలన్నిమద్దతు ఇవ్వాల’ని విజ్ఞప్తి చేశారు. నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న దుకాణాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. సీలింగ్ డ్రైవ్ వల్ల వేలాదమంది వ్యాపారులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టం చేయడం లేదా ఆర్డినెస్స్ జారీ చేయడం ఒక్కటే సీలింగ్ డ్రైవ్కు పరిష్కారమని ఆప్ తొలి నుంచి చెప్తోందని ఆయన గుర్తుచేశారు. -
ఆప్లో మొదలైన కల్లోలం!
కొనసాగుతున్న రాజీనామాల పర్వం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కల్లోలం రేగుతోంది. తాజా ఓటమితో పార్టీ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా రాజనామాల బాట పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీలో పరిణామాలు మరింత నష్టం కలిగించకుండా నివారణ చర్యలు తీసుకునేందుకే ఈ భేటీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ చిత్తయిన నేపథ్యంలో ఆ పార్టీ పంజాబ్ ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు రాజీనామాను కేజ్రీవాల్కు పంపినట్టు ఆయన తెలిపారు. ఆయనతోపాటు పంజాబ్ సహ పరిశీలకులు దుర్గేష్ పాఠక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లలో 67 స్థానాలు గెలుచుకున్న ఆప్.. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 270 స్థానాలకు 48 సీట్లు గెలిచి ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరాభవం నేపథ్యంలో నాయకత్వంపై నేతలు భగ్గుమంటున్నారు. బుధవారమే ఆప్ ఢిల్లీశాఖ కన్వీనర్ దిలీప్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. ఆప్ ఢిల్లీ ఇన్చార్జి ఆశిష్ తల్వార్ సైతం తన పదవిని వీడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యే అయిన అల్కా లంబా సైతం తన శాసనసభ సభ్యత్వంతోపాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. మొత్తానికి తాజా పరాభవం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ను కుదిపేస్తున్నది. ఈ రాజీనామాల పర్వంతో ఆప్ అంతర్గత నిర్మాణం పూర్తిగా మారే అవకాశముంది. -
‘నా రాజీనామా లేఖను సీఎంకు ఇచ్చేశా’
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సంజయ్ సింగ్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో నేత, పంజాబ్ పార్టీ పరిశీలకుడిగా పనిచేస్తున్న దుర్గేశ్ పాఠక్ కూడా తన రాజీనామా లేక సమర్పించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో తాము రాజీనామా చేసినట్లు తెలిపారు. ‘నేను నా రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇచ్చేశాను. నాతో పాటు మరో నేత కూడా చేశారు’ అని ఆయన చెప్పారు. గురువారం ఉదయమే తాను రాజీనామా లేఖ కేజ్రీవాల్కు అందజేసినట్లు తెలిపారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పార్టీకి విజయాన్ని కట్టబెట్టడంలో కూడా సంజయ్ సింగ్ వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. -
అవినీతిని పట్టించుకోరా.. ఇదిగో చెంపదెబ్బ!
-
అవినీతిని పట్టించుకోరా.. ఇదిగో చెంపదెబ్బ!
ఢిల్లీలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని పార్టీలలో ప్రకంపనలు రేపుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో అవినీతి పెరిగిపోతోందని.. అయితే ఆ విషయాన్ని ప్రస్తావించేందుకు తనకు అవకాశం రావట్లేదని ఆగ్రహం చెందిన ఓ మహిళ.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ను లాగి లెంపమీద కొట్టారు. సిమ్రన్ బేడీ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త. తాను చెప్పే విషయాలను వినిపించుకోడానికి కూడా ఆయన నిరాకరించడం వల్లే చెంపదెబ్బ కొట్టానని ఆమె అన్నారు. సిమ్రన్ బేడీ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, టికెట్ అడిగితే తననున డబ్బులు అడిగారని అంటున్నారు. రాజౌరి గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంజయ్ సింగ్ ప్రచారం చేస్తుండగా ఆయన మీద ఈ దాడి జరిగింది. పార్టీలో పెరిగిపోతున్న అవినీతి గురించి ప్రస్తావించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశానని, వాటిని వినిపించుకోకపోవడం వల్లే ఆయనను కొట్టానని సిమ్రన్ అన్నారు. తాను అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ లాంటి అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నించానని, కానీ ఏ ఒక్కరూ తన మాట వినిపించుకోలేదని చెప్పారు. ఆప్ నాయకులు టికెట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నట్లు ఓ వీడియో కూడా ప్రచారంలోకి వచ్చింది గానీ, దాన్ని పార్టీ నాయకులు ఖండించారు. ఈ ఘటన చాలా సిగ్గుచేటైనదని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆప్ ఢిల్లీ కన్వీనర్ దిలీప్ పాండే అన్నారు. రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలలో ఆప్ విజయాన్ని ఇలాంటి దాడులు ఆపలేవని చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆప్ సభ్యుడు జర్నైల్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
'బీజేపీ ఓటమితో దేశం పటాసులు కాలుస్తుంది'
లక్నో: బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆమ్ ఆద్మీ పార్టీ జోస్యం చెప్పింది. ఆ ఓటమిని చూసి జనాలంతా పటాసులు కాలుస్తారని పేర్కొంది. ఆప్ అధికారి ప్రతినిధి సంజయ్ సింగ్ బీహార్ ఎన్నికలపై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీహార్ ఓడిపోయే సమయం వచ్చిందని అన్నారు. ఈ ఓటమితో దేశం మొత్తం మతాబులు కాల్చి పండుగ చేసుకుంటుందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో మతవిద్వేషాలు ఎన్డీయే హయాంలో పెచ్చరిల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయని, మిగిలిన ఎన్నికల్లో మతం పేరిట చీలికలు తీసుకొచ్చే కుట్రలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్నారని ఆరోపించారు. -
అమేథీలో ఘర్షణలు
పోలీస్ మృతి ఆరుగురికి గాయాలు అమేథి: ఉత్తరప్రదేశ్లోని అమేథిలో కాంగ్రెస్ ఎంపీ సంజయ్సింగ్ కుటుంబ సభ్యుల మధ్య ఓ వివాదం ఆదివారం ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపడంతోపాటు నిషేధాజ్ఞలను జారీ చేశారు. ఎంపీ సంజయ్సింగ్కు అమేథీలో వారసత్వంగా వచ్చిన ‘భూపతి భవన్’ ఉంది. సంజయ్సింగ్, ఆయన రెండో భార్య అమిత ఈ భవనం వద్దకు రానున్నారనే సమాచారంతో... సంజయ్సింగ్ మొదటి భార్య గరిమ, ఆమె కొడుకు అనంత్ విక్రంసింగ్ ఆ భవనాన్ని ఆక్రమించుకున్నారు. బయట వారి మద్దతుదారులు గుమికూడారు. ఎంపీ సంజయ్ సింగ్ తన రెండో భార్యతో కలసి భూపతి భవన్ వద్దకు రావడంతో వివాదానికి దారి తీసింది. విక్రంసింగ్ మద్దతుదారులు, పోలీసుల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. అల్లరి మూకల కాల్పుల్లో కానిస్టేబుల్ విజయ్ మిశ్రా(45) మృతి చెందినట్లు ఏఎస్పీ మున్నాలాల్ తెలిపారు. -
జైల్లో కేజ్రీవాల్ ను కలిసిన భార్య సునీత
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈ ఉదయం ఆయన భార్య సునీత కలిశారు. ఆమె తన భర్త కోసం బట్టలు, మందులు తీసుకొచ్చారు. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, అశతోష్ కూడా కేజ్రీవాల్తో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. జైలు గార్డులు, జైలు సిబ్బందితోనూ కేజ్రీవాల్ మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుడిలా పోరాడుతున్నందునే తాను జైలుకు రావాల్సివచ్చిందని కేజ్రీవాల్ అన్నట్టు జైలు సిబ్బంది తెలిపారు. రాత్రంతా జైల్లో ఆయన బాగానే నిద్రపోయారని చెప్పారు. తెల్లవారుజామునే లేచి జైలు ప్రాంగణంలోనే నడక సాగించారని తెలిపారు. తర్వాత తన సెల్ కు తిరిగి వచ్చి అల్పాహారం తీసుకున్నారని వెల్లడించారు. -
ఆప్ అన్ని పార్టీల్లాంటిదేనా?
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని పార్టీల్లాంటిదేనా? ఆ పార్టీ నేతలు పొద్దస్తమానం విమర్శించే పార్టీలకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి తేడా లేదా? అలహాబాద్ లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ పై ప్రశ్నలు సంధించిన ఇద్దరు మహిళా కార్యకర్తలపై దాడి జరిగింది. వారిని కొట్టి, తిట్టి నేట్టేయడం జరిగింది. సమావేశ ప్రారంభం లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింలకు సీట్లెందుకు ఇవ్వలేదని నాజ్ ఫాతిమా అనే కార్యకర్త ప్రశ్న వేసింది. అంతే ... ఆమెపై దాడి చేసి అక్కడినుంచి బయటకి తోసేశారు. ఆ తరువాత శ్రద్ధా పాండేయ అనే మరో మహిళా కార్యకర్త పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణ చేశారు. ఆమెకు కూడా అదే శాస్తి జరిగింది. అయితే పార్టీ కార్యకర్తలు పలువురు పలురకాల ఆరోపణలు చేశారు. అవినీతిపరులకు టికెట్లివ్వడం నుంచి పలు అంశాలను లేవనెత్తారు. దీంతో సమావేశాన్ని మధ్యలోనే వదిలిపెట్టి సంజయ్ సింగ్ వెళ్లిపోయారు. -
మేధా పాట్కర్కు మద్దతిస్తాం: ఏఏపీ
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మద్దతు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) ప్రకటించింది. సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆమె భావిస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఏఏపీ సీనియర్ నాయకుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. పోటీ చేయాలా, వద్దా అనేది ఆమె నిర్ణయించుకోవాలని సూచించారు. మేధా పాట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఆమెకు సంపూర్ణ మద్దతు పలుకుతామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు ఉద్యమాలు చేసిన మేధా పాట్కర్ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు. అయితే ఇంకా ఏఏపీలో చేరలేదు. వాయవ్య ముంబై స్థానం నుంచి ఆమె పోటీ అవకాశాలున్నాయని సంకేతాలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మురికివాడలను ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నించినప్పుడు మేధా పాట్కర్ బాధితుల తరపున పోరాటం చేశారు.