School fee
-
చదువు ఖర్చులు తల్లిదండ్రుల నుంచి పొందడం కుమార్తెల హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కుమార్తెలు తమ చదువులకయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్మును పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చిచెప్పింది. పెద్దలు తమ స్థోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది. విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. మనోవర్తి కింద భార్యకు రూ.73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు రూ.43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్లో చదువుతోంది. తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకొనేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలనని, ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలనని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదవులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెకు ఉందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వాలని సూచించింది. -
స్కూళ్ల ఫీ‘జులుం’కు చెక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ముకుతాడు వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. ప్రైవేటు స్కూళ్లను వర్గీకరించడంతోపాటు ఆయా స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం ఇవ్వాలని.. ప్రైవేటు స్కూళ్లను ఎంఈవో స్థాయి అధికారి తనిఖీ చేయాలనే సిఫార్సు చేయనుంది. అలాగే మౌలిక వసతుల కల్పన, అనుభవజు్ఞలైన టీచర్లు, ఇతర సిబ్బందికి అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అన్ని స్కూళ్లను ఆడిట్ పరిధిలోకి తేవడాన్ని సరైన విధానంగా భావిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో మరికొన్ని షరతులు విధించాలనే యోచనలో ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ సిఫా ర్సు మేరకే ఫీజులు ఉండాలనే ప్రభుత్వానికి సూచించాలని భావిస్తోంది. రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు స్కూళ్లు భారీగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. అలాగే పుస్తకాలు, దుస్తులు, ఇతర అవసరాల పేరుతో అదనంగా వసూళ్లు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక కార్పొరేట్ స్కూళ్లు అయితే రూ. 5 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వార్షిక ఫీజులు దండుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లను కట్టడి చేసేందుకు సిఫార్సులు చేయాలని విద్యా కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ నివేదిక అనంతరం వచ్చే ఏడాది నుంచి ఫీజుల కట్టడికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్ల వాదన ఇలా.. ⇒ రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేసే స్కూళ్లను.. రూ. 50 వేలలోపు ఫీజులు తీసుకొనే స్కూళ్లను ఒకే గాటన కట్టకూడదు. ∙ఏటా 15 శాతం ఫీజు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కార్పొరేట్ స్కూళ్ల డిమాండ్ ఇదీ.. ⇒ మారిన విద్యా విధానంలో కంప్యూటర్ విద్యకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. సబ్జెక్టు టీచర్ల వేతన భారం పెరిగింది. ⇒ ఏటా ఫీజులు పెంచుకొనే అవకాశం ఇవ్వాలి.అందరికీ ఆమోద యోగ్యంగా నివేదిక..ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విధానం ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. విద్యా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ స్కూళ్ల యాజమాన్యాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలతోనే నివేదిక రూపొందిస్తున్నాం. ఫీజుల నియంత్రణ వల్ల పేద వర్గాలకు ఊరట ఉంటుందని ఆశిస్తున్నాం. – ఆకునూరి మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ -
ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
అక్షరాల రూ.4.27 లక్షలు. ఇదేదో వార్షికవేతనం అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎడ్యుకేషన్ ఫీజు. ‘అందులో ఏముంది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో అంత అవుతుంది కదా’ అంటారా. ఇది కేవలం ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన ఫీజు. అవును.. మీరు విన్నది నిజమే. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో తన కూతురు ఒకటో తరగతి స్కూల్ ఫీజును రాషబ్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దాంతో ఇదికాస్తా వైరల్గా మారింది.‘నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1లో చేరుతుంది. అందుకోసం మా నగరంలో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాం. ఆ స్కూల్ ఫీజు చూసి షాకయ్యాను. ఇతర స్కూళ్లలోనూ సుమారు ఇదే తరహా ఫీజు ఉంది. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు: రూ.2,000, అడ్మిషన్ ఫీజు: రూ.40,000, కాషన్ మనీ (వాపసు): రూ.5,000, వార్షిక పాఠశాల ఫీజు: రూ.2,52,000, బస్ ఛార్జీలు: రూ.1,08,000, పుస్తకాలు, యూనిఫాం: రూ.20,000, మొత్తం రూ.4,27,000! ఇది భారతదేశంలో నాణ్యమైన విద్య ధర. మీరు ఏటా రూ.20 లక్షలు సంపాదించినా దీన్ని భరించలేరేమో’‘మీరు నెలకు 2000 డాలర్లు(రూ.1.68 లక్షలు) సంపాదిస్తే అందులో ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్పై వ్యాట్, రోడ్డు పన్ను, టోల్ ట్యాక్స్, ఫ్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. దానికితోడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వృద్ధాప్య పెన్షన్ కోసం పీఎఫ్, ఎన్పీఎస్ చెల్లించాలి. రూ.20 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు. ఎలాంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందలేరు. అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఫుడ్, బట్టలు, అద్దె, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు.. దేనిపై ఖర్చు చేయాలో నిర్ణయించుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.Good education is a luxury - which middle class can not affordMy daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.- Registration Charges: ₹2,000-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..ఈ పోస్ట్కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫీజు ఇలాగే కొనసాగితే 12 సంవత్సరాలలో దాదాపు రూ.కోటి-1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉటుంది. మధ్యతరగతి వారు ఇంత అధిక ఫీజులను భరించలేరు. ఇది తీవ్రమైన సమస్య. దీనిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం’ అని రిప్లై ఇస్తున్నారు. -
ఫీజుకు బదులు ప్లాస్టిక్!
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్గా ప్రశంసలు అందుకుంటోంది.ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.ప్లాస్టిక్ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులుఎవరు చేరుతారు?స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.ప్లాస్టిక్ ఇటుకలు..‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’.. -
ఫీజుల ‘మోత’..‘నా కుమారుడి ప్లేస్కూల్ ఫీజు రూ.4.3 లక్షలు’
న్యూఢిల్లీ : అక్షరాల రూ.4.3లక్షల ఫీజు. ఇది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో కాదు. ప్లేస్కూల్!! కోసం. అవును మీరు విన్నది కరెక్టే కొత్త విద్యా సంవత్సరం వస్తోంది. అప్పుడే దోపిడీ ప్రణాళిక కూడా మొదలైంది. గత ఏడాది కంటే 40 శాతం నుంచి 50 శాతం వసూలు చేసేందుకు ఢిల్లీ కార్పొరేట్ స్కూల్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల్ని అష్టకష్టాలు పడుతున్న పేరెంట్స్ చివరికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తమ పిల్లల స్కూల్ ఫీజు రసీదులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. My son's Playschool fee is more than my entire education expense :) I hope vo ache se khelna seekhle yaha! pic.twitter.com/PVgfvwQDuy — Akash Kumar (@AkashTrader) April 12, 2024 ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన కుమారుడు ప్లేస్కూల్ ఫీజు గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను మొత్తం చదివిన చదువుకు ఎంత ఫీజు చెల్లించానో.. అంతకంటే ఎక్కువగా నా కుమారుడు ప్లేస్కూల్ కోసం చెల్లిస్తున్నాను. ఆ స్కూల్లో కనీసం ఆడటం నేర్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఫీజు రిసిప్ట్ను సైతం ట్వీట్లో చేశారు. అందులో ఏప్రిల్ 2024 - మార్చి 2025 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ఫీ - రూ.10వేలు ఏడాది ఫీజు - రూ.25వేలు టర్మ్-1 (ఏప్రిల్ - జూన్ 2024) - రూ.98,750 టర్మ్-2 (జులై- సెప్టెంబర్ 2024) - రూ.98,750 టర్మ్-3 ( అక్టోబర్ -డిసెంబర్ 2024) - రూ.98,750 టర్మ్ -4 ( జనవరి - మార్చ్ 2025) - రూ.98,750 టోటల్ ఫీజు - రూ.4,40,000 అంటూ స్కూల్ ఫీజు గురించి షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఈ స్టోరీ పోస్ట్ చేసే సమయానికి 2.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ట్వీట్పై ఢిల్లీలోని అనేక మంది తల్లిదండ్రులు తమ అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. గుర్గావ్లోని ఒక వ్యక్తి ఇటీవల తన 3వ తరగతి కుమారుడి స్కూల్ ఫీజు నెలకు రూ. 30,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆ లెక్కన అతను ఇంటర్ వచ్చేసరికి ఆ మొత్తం సంవత్సరానికి రూ. 9 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేశారు. -
బరితెగించిన ‘భాష్యం’!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘భాష్యం’ విద్యా సంస్థలు బరితెగించాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష్యం విద్యా సంస్థలకు బ్రాంచ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ఖర్చుల కోసమంటూ ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను వేధిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా భాష్యం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే బడికి పంపాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో భాష్యం స్కూల్ ఉంది. అధినేత ఎన్నికల ఖర్చులకు డబ్బులు అవసరమని పై నుంచి ఆదేశాలు రావడంతో ఫీజుల కోసం సిబ్బంది విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లలను బడికి పంపండి.. లేకుంటే పంపొద్దు అని తల్లిదండ్రులకు కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన 1–9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల ప్రారంభానికి ముందు ఫీజు చెల్లించిన వారినే పరీక్షలకు అనుమతిస్తామని భాష్యం యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఉన్నట్టుండి ఒత్తిడి చేయడంతో మరికొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పిల్లల నిర్బంధం పూర్తి ఫీజు చెల్లించలేదనే నెపంతో పది రోజుల క్రితం అనంతపురం భాష్యం స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులను రోజంతా సిబ్బంది ఒక గదిలో నిర్బంధించారు. తరగతుల్లో కూర్చోబెట్టకుండా వారందరినీ ఒక గదిలో కూర్చోబెట్టారు. అదికూడా బెంచీలపై కాకుండా నేలపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక వారిని ఇళ్లకు పంపడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గోడు చెప్పుకున్నారు. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాల ఇన్చార్జ్ అనిల్కుమార్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ యాజమాన్యం నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, తామేమీ చేయలేమని విద్యార్థుల తల్లిదండ్రులకు తేలి్చచెప్పారు. ఎవరితోనైనా చెప్పుకోండి.. ముందు ఫీజు కట్టండని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరగబడ్డారు. సమస్య పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 12లోపు అందరూ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే భాష్యం పాఠశాలల యాజమాన్యం చేస్తున్న అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
లక్షల్లో నర్సరీ ఫీజు.. పేరెంట్ ఓరియెంటేషన్ చార్జీలు అదనం..!
కోకాపేటలోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ సంవత్సరం 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. వచ్చే ఏడాది అయిదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలని తల్లిదండ్రులకు మెసెజ్ వెళ్లింది. అంటే పైతరగతికి అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది. ఉప్పల్ చౌరస్తా సమీపంలోని ఓ ప్రముఖ పాఠశాలలో చాలా వాటితో పోలిస్తే అక్కడ కొంత రుసుములు తక్కువనే పేరుంది. అయినా ఈసారి ఒకటో తరగతిలో ప్రవేశానికి 14 శాతం పెంచడం గమనార్హం. అక్కడ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించగా.. వచ్చే ఏడాదికి దాన్ని రూ.57 వేలకు పెంచారు. పాఠశాల ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. డిజీ తరగతులు, ఏసీ క్లాస్రూం, టెక్నాలజీ నేర్పుతున్నామని చెబుతూ యాజమాన్యాలు లక్షల్లో బాదుతున్నారు. అవి ఎందుకు కడుతున్నారో తల్లిదండ్రులకు సరైన వివరాలు అందుబాటులో ఉండవు. పాఠశాల యాజమాన్యం ఫలానా మొత్తం చెల్లించాలని చెప్పగానే.. వీలైతే కొంత బేరమాడి, లేదంటే వారు చెప్పినంత ముట్టజెప్పడం అలవాటైంది. కానీ పాఠశాలకు చెల్లిస్తున్న ఫీజులో అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ట్రావెల్ చార్జీలు, కాషన్ మనీ, వార్షిక చార్జీలు.. ఇలా రకరకాలుగా విభజించి తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. తాజాగా ఓ స్కూల్ యాజమాన్యం 2024-25 విద్యాసంవత్సరానికిగాను నర్సరీ, జూనియర్ కేజీకి ఏకంగా రూ.1,51,656 వసూలు చేస్తుంది. అందుకు అదనంగా ‘పేరెంట్ ఓరియంటేషన్’ పేరుతో రూ.8,400 చెల్లించాలని కోరింది. అయితే అందుకు సంబంధించిన ఫీజు వివరాలతో ఉన్న కాపీ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. अब समझ आ रहा है, पिता जी ने मुझे सरकारी स्कूल में क्यों पढ़ाया था 😭 pic.twitter.com/fkyPlDT6WP — Raja Babu (@GaurangBhardwa1) December 7, 2023 ఫీజుల వినియోగం ఇలా... విద్యాసంస్థల్లో గరిష్ఠంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో పాటు... వసూలు చేసిన ఫీజులను ఎలా వినియోగించాలో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: ఆ సిటీలో 8,500 ఎకరాల్లో సోలార్ప్లేట్లతో పార్కింగ్ స్థలం నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతాన్ని టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్ వేతనాలకు, మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్కు ఖర్చు చేయాలి. అలాగే మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధికి వినియోగించాలి. అలాగే ఆయా విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వివరాలతో పాటు వారి విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాల సమాచారాన్ని విద్యాశాఖకు తెలియజేయాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యాసంస్థల వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలి. -
ఈ స్కూళ్లో ఫీజులుండవు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
అస్సాంలోని పామోహి ప్రాంతంలో ఉన్న ‘అక్షర్ స్కూల్’ ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూల్లో ఫీజులకు బదులు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటారు. పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ అనే దంపతులు ఈ స్కూల్ను స్థాపించారు. ఫీజుల రూపంలో వచ్చిన బాటిల్స్ను వివిధ రూపాల్లో పునర్వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ను ఎలా రీసైకిల్ చేయాలో విద్యార్థులకు నేర్పుతున్నారు. నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఈ స్కూల్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ‘గుడ్ ఐడియా’ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపించారు. If this doesn't surprise you, what does?#Incredible_NorthEast Credit: northeastview_ pic.twitter.com/6RO1SqhaNa — Temjen Imna Along (@AlongImna) October 12, 2023 -
ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్లో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్ వెబ్సైట్లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఫీజుల వివరాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో విద్యా సంస్థ నిర్వాహకుడు లేదా కరస్పాండెంట్ అధ్యక్షుడుగా ఉండాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్ ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడాదిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం ఫీజులో యాజమాన్య ఆదాయం 5 శాతం, స్కూల్ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతాలకు 50 శాతం, పాఠశాల ఉద్యోగుల గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివరాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్ చేత ఆడిట్ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
Telangana: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాదుడు.. ఎల్కేజీకి లక్షన్నర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు ఈసారి ఫీజులు భారీగా పెంచినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని బడుల్లో ఏకంగా 50 శాతం వరకూ ఫీజులు పెంచారని వాపోతున్నారు. కోవిడ్ తర్వాత గత ఏడాది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని తల్లిదండ్రుల నుంచి అందినంతా దోచేస్తున్నాయి. అదీగాక, సగం ఫీజును ముందుగానే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అంటూ అదనపు బాదుడు సరేసరి. ఇంకోవైపు డీజిల్ ధర విపరీతంగా పెరిగిందంటూ రవాణా చార్జీలూ 30 శాతం వరకూ పెంచారు. దీంతో పేదవాడికి ప్రైవేటు విద్య తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా అంతంతమాత్రంగానే చదువు సాగుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. చదవండి: కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజ్.. నియంత్రణ ఏమైనట్టు? ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. దీంతో ఫీజుల నియంత్రణ కోసం 2016లో ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. స్కూల్లో విద్యార్థిని చేర్చేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్లు, కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకూ పెంచుతున్నట్లు కమిటీ దృష్టికొచ్చింది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఇష్టానుసారం కాకుండా మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని కమిటీ సూచించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ విధానం కనుమరుగు... రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఫీజుల నియంత్రణను బడ్జెట్ స్కూళ్లు (వార్షిక ఫీజు రూ. 20 వేలలోపు ఉండేవి) స్వాగతించాయి. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15% ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇక్కడే సమస్య వస్తోంది. పెద్ద స్కూళ్లు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతీ గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపి 25 శాతం ఫీజు పెంచారు. ప్రతీ స్కూలు 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చు. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల నియంత్రణ కమిటీ పరిశీలిస్తుంది. పాఠశాల యాజమాన్యం ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానాతోపాటు గుర్తింపు రద్దు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఫీజుల పెంపును పరిశీలించేందుకు 2018లో తిరుపతిరావు కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. దాదాపు 4,500 స్కూళ్లు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘంగత ఏడాది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫీజులనియంత్రణ కార్యాచరణకు నోచుకోలేదు. -
ఇన్ కమ్ ట్యాక్స్ : ఈ సెక్షన్తో పిల్లల స్కూల్ ఫీజులు క్లెయిమ్ చేసుకోవచ్చు!
సెక్షన్ 80సి ప్రకారం ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంటుకు సంబంధించినవి.. కొన్ని ముందు జాగ్రత్త కోసం దాచుకునేవి .. కొన్ని చేసిన అప్పులు తీర్చేవి.. కొన్ని విధిగా ఖర్చులు పెట్టేవి.. ఉద్యోగస్తులకు పీఎఫ్ తప్పనిసరి. ఒక్కొక్కప్పుడు పీఎఫ్ మొత్తం గరిష్ట పరిమితి రూ. 1,50,000 దాటిపోతుంటుంది. పిల్లల స్కూలు ఫీజు విషయంలో ఇద్దరికి మినహాయింపు.. మూడో పిల్లలకు ఫీజు కడితే మినహాయింపు ఇవ్వరు. ఇలాగే అన్ని విషయాల్లో ఆంక్షలు. అయితే, కొన్ని కేసులు చదవండి. ♦వామనరావు పెద్ద జీతగాడు. కంపల్సరీ పీఎఫ్తో సెక్షన్ 80సి పరిమితి దాటిపోతుంది. అందుకని ఇతర సేవింగ్స్ తన పేరు మీద చేయడు. జీవిత బీమా తన తల్లిదండ్రుల అకౌంటులో చేశాడు. ఇల్లు మీద లోన్ తన భార్య సత్యవతి పేరిట తీసుకుని వాయిదా లు చెల్లిస్తాడు. తన భార్య ఇంట్లో తాను అద్దెకు ఉంటున్నట్లు క్లెయిమ్ చేస్తాడు. ఇంట్లో అందరూ 80సి కింద గరిష్ట పరిమితులు క్లెయిమ్ చేస్తున్నారు. సత్యవతి జీతం, ఇంట ద్దె అన్నీ కలిపినా 20 శాతం శ్లాబు దాటలే దు. వామనరావుగారు హమేషా 30 శాతం శ్లాబు తగ్గలేదు. కొంచం ఆలోచిస్తే 10 శాతం పన్ను సేవ్ చేసింది ఈ కుటుంబం. ♦ఇల్లరికం అని అనుకోకుండా.. ఇంట్లో పూర్తిగా సెటిల్ అయిపోయాడు అల్లుగారు అరవిందరావు. మామగారికి అద్దె ఇచ్చినట్లు రాస్తాడు. ఇస్తాడో .. ఇవ్వడో ఎవరికీ తెలీదు. మావగారు పెన్షనర్.. పన్ను పరిధిలోకి రారు. ఇటువంటి అల్లుళ్లు, కొడుకులు ఎంత మందో! కోడళ్లు .. కూతుర్లు ఎంత మందో! అరవిందరావు గారు చేసే ఇతర వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ చదువుకోని భార్య సరస్వతి పేరు మీద చేస్తారు. 80సి కింద అర్హత ఉన్న సేవింగ్స్ ఆవిడ పేరు మీదే. ♦కుటుంబరావుగారికి, సంతానలక్ష్మి గారికి ఇంటి ఆనవాయితీ ప్రకారం కాబోలు రెండుసార్లు కవలలు. మొత్తం నలుగురు పిల్లలు. నలుగురినీ చదివించారు. ఇద్దరూ కలిసి వ్యాపారంలో బాగా రాణించారు. నలుగురి పిల్లల విషయంలో చెల్లించిన స్కూలు ఫీజులు ఒక్కొక్కరు .. ఇద్దరి ఇద్దరి ఫీజులను క్లెయిమ్ చేసేవారు. ♦ఇద్దరు ఆడపిల్లల తర్వాత అబ్బాయి కోసం మూడో కాన్పుకి వెళ్లింది కాంతమ్మ. బాబు పుట్టాడు. ముగ్గుర్నీ చదివించింది ఆ జంట. ఎక్కువ ఆదాయం ఉన్న తండ్రి.. ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్ చేయగా.. మూడో సంతానం స్కూలు ఫీజుని కాంతమ్మగారు క్లెయిమ్ చేశారు. ♦ఇలా అవకాశం ఉన్నతవరకూ చట్టపరిధి దాటకుండా మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. చదవండి👉 ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
స్కూల్ ఫీజు కట్టలేదని.. విద్యార్థులను రోజంతా ఎండలో..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చోబెట్టింది యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాల్ విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫీజు కట్టనందుకు టీచర్లు తమను రోజంతా ఎండలోనే కూర్చోబెట్టారని ఓ విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. పరీక్షలు కూడా రాయనివ్వలేదని వాపోయింది. ఫీజు విషయంపై తల్లిదండ్రులకు చెప్పానని, వారు ఒక్కరోజులో చెల్లిస్తామన్నారని పేర్కొంది. ఈ విషయం టీచర్లకు చెప్పినా వినిపించుకోకుండా తమకు ఈ శిక్ష విధించారని రోదించింది. यूपी : उन्नाव के एक प्राइवेट स्कूल में बच्चों की फीस नहीं पहुंची तो पूरा दिन धूप में खड़ा रखा गया एग्जाम नहीं देने दिया, कब हम फ्री स्कूल-अस्पताल पर बात करेंगे? pic.twitter.com/KrBDnL6ity — Nigar Parveen (@NigarNawab) October 17, 2022 పిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చొబెట్టిన పాఠశాల యాజమాన్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. చదవండి: క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా.. -
విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? అడిగే దిక్కేది!
నిజామాబాద్అర్బన్: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్ నిజామాబాద్, బోధన్, భీమ్గల్, డిచ్పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్ పిల్లవాడికి నిజామాబాద్ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్ పాఠవాల వసూలు చేస్తోంది. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసిపేట్లోని ఓ ప్రైవేట్ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. చదవండి👉🏻అసలే కానిస్టేబుల్.. ఆపై తులం బంగారమిస్తే డబుల్ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి! ఉత్తర్వులు అమలెక్కడ....? విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చదవండి👉🏻పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు ప్రైవేట్లో ఫీజుల వివరాలు.. చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి. భారం మోయలేకపోతున్నాం.. పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము. – మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్ నిబంధనల ప్రకారం వసూలు చేయాలి ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, డీఈవో -
40 శాతం పెరిగే..
బాచుపల్లిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో లలిత్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఫస్ట్క్లాస్లో చేరేప్పుడే ఏటా ఎంత ఫీజు పెరుగుతుందో అప్పుడే చెప్పారు. ఈ మేరకు ఏటా 25 శాతం పెరుగుదలతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. 2019లో రూ.3.10 లక్షలు కట్టారు. 2020, 2021లో ఫీజులు పెంచలేదు. కానీ 2022లో ఏకంగా రూ.4.50 లక్షలు అన్నారు. రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ళలో 2019లో (కోవిడ్ కన్నా ముందు) కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.33 వేల వరకూ వార్షిక ఫీజులున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడవి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకూ పెరిగాయి. ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకూ రూ. 25 వేలు, ఆ తర్వాత టెన్త్ వరకూ రూ.55 వేల వరకూ తీసుకుంటున్నారు. స్కూలును బట్టి ఫీజుల్లో హెచ్చుతగ్గులున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో సగటున రూ.40 వేలు, కార్పొరేట్ స్కూలైతే రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజు లేకుండా అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజుల్ని కొన్ని యాజమాన్యాలు రెట్టింపు చేశాయి. ఇక పుస్తకాలు, యూనిఫామ్లకయ్యే ఖర్చు వీటికి అదనం. కాగా జూన్ ఆరంభం నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందే 50 శాతం మేర ఫీజులు కట్టేయాలంటూ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాము అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. నియంత్రణ ఏదీ? ► ఫీజుల నియంత్రణకు 2016లో ఆచార్య తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 10,800 ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు తెచ్చిన చట్టాలను కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులు చేసింది. ► దీనిప్రకారం ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి ఫీజులు పెంచే స్కూళ్లు తాము చేసిన ఖర్చు (స్కూలు అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు) ప్రతి పైసాకు లెక్క చూపాలి. బ్యాంకు ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. అవకతవకలుంటే భారీ జరిమానాకు, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దుకు కమిటీ సిఫారసు చేస్తుంది. ► ఈ విధానం అమలు చేస్తే చాలా స్కూళ్ళు 10 శాతం లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతి రావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతానికి పైగా ఫీజులు పెంచుకునేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ► గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం తిరుపతిరావు కమిటీ సిఫారసులతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ దిశగా అడుగులు పడలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల వైపు మొగ్గు కోవిడ్ కారణంగా చితికిపోయిన కుటుంబాలుప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడుతున్నాయి. పైగా సర్కారీ బడుల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి వస్తుండం, కోవిడ్ కేసులు పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే తాము కట్టే ఫీజులూ వృధా అవుతాయనే ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇప్పటికే లక్ష దాటాయి. హైదరాబాద్లోని ఒక స్కూల్లో (ఐఏఎస్ ఫౌండేషన్ ప్రత్యేక స్కూలు) నిశాంత్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. 2019లో వార్షిక ఫీజు రూ. 3.50 లక్షలు ఉంది. ఇప్పుడే ఏకంగా రూ.4.10 లక్షలు కట్టమన్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే కొంత తగ్గిస్తామన్నారు. 2019లో డీజిల్ ధర లీటర్ రూ.68 ఉంది. ఇప్పుడు రూ.98 అయింది. పాఠశాల బస్సు ఫీజులు 2019లో దూరాన్ని బట్టి రూ.22 నుంచి రూ.48 వేల వరకూ ఉండగా.. ఇప్పుడివి రూ.28 వేల నుంచి రూ.58 వేల వరకూ పెరిగాయి. అప్పులు చేసే పరిస్థితిని నివారించాలి కరోనా నష్టాల పేరుతో ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్ళు సగటున 40 శాతం మేర ఫీజులు పెంచాయి. డీజిల్ ధరలు పెరిగాయని బస్సు ఫీజులూ విపరీతంగా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలు పిల్లల చదువు కోసం అప్పులు చేసే దారుణమైన పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ఒకేసారి పెంచేశారు మా పిల్లాడి స్కూల్లో ఫీజు ఒకేసారి 40 శాతం పెంచారు. కోవిడ్ సమయంలో బకాయి పడిన మొత్తంతో పాటు ఈ ఏడాది ఫీజు సగం ఇప్పుడే కట్టమంటున్నారు. బతిమిలాడితే ఒక నెల గడువు ఇచ్చారు. ఫీజు కట్టడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. – గుర్రం రామకృష్ణ (విద్యార్థి తండ్రి, మల్లెపల్లి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా) -
AP: అట్టడుగు వర్గాలకు అక్షర కాంతులు
ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ సిద్దాంతాన్ని బలంగా విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా రంగ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో 35 శాతం సీట్లు పేదలకు కేటాయింపు చేయాలనే నిర్ణయాలు ఎంతో దార్శనికతతో తీసుకున్నవిగా స్పష్టమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకంలో భాగంగా, పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తంగా అందిస్తున్న జగనన్న కిట్లు మధ్యతరగతి, పేద విద్యార్థులకు వరంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్పుచేసే విధంగా 44,512 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం, తొలి దశలో రూ. 3,625 వేల కోట్లతో 15,715 పాఠశాలలను అద్దంలా, సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు అందించిన విధానం నభూతో న భవిష్యతి అన్న చందంగా సాగింది. ప్రధానంగా గతంలో గ్రామాలలో నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలచిన పాఠశాలలకు నాడు–నేడు పథకంలో పుష్కలంగా నిధులు సమకూర్చి అభివృద్ధి చేసిన విధానం పల్లె ప్రజల మనసులను చూరగొంది. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!) పనుల్లో పారదర్శకతను పాటిస్తూ తమ పాఠశాలను తామే అభివద్ధి చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. పాఠశాల చిన్నారులను ఆకర్షించే విధంగా రంగురంగుల వర్ణ చిత్రాలు, తరగతి గదుల్లో విద్యుత్ దీపాలు, విద్యార్థులు కూర్చునే బెంచీలు వంటి సకల వసతులను కల్పించడంతో పాటు, బాలికలకు అత్యంత ఉపయుక్తంగా నిలిచే శౌచాలయాలను నిర్మించి అందించింది. బాలికల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ, హాజరు శాతం పెంపుదల చేయడానికి ఇది ఒక కారణంగా నిలుస్తుంది. గత పాలకులు పాఠశాల విద్య విషయంలో కాగితాల్లో లెక్కలకే పరిమితం అయ్యారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయివరకు విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నూతన పంథాలో నడిపించడానికి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్ర విద్యార్థులను సమాయత్తం చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) ‘ప్రపంచంలో నిజమైన శాంతిని కోరుకుంటున్నట్లయితే మనం చిన్నారులను విద్యావంతులుగా తయారు చేయాల’న్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను నిజం చేస్తూ పాఠశాల విద్యను అందరికీ చేరువ చేసే ప్రయత్నం ఏపీలో జరుగుతోంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు ఖరారు చేయడం దేశంలోనే ఒక నూతన ఒరవడికి నాందిగా చెప్పవచ్చు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో పాఠశాలల ఫీజులు రూ. 10 వేల నుంచి 18 వేల వరకు, జూనియర్ కాలేజీలకు రూ. 12 వేల నుంచి 20 వేల వరకు ఉండాలని, అదే విధంగా హాస్టల్ రుసుములు సైతం రూ. 18 వేల నుంచి రూ. 24 వేల మధ్యలో ఉండాలని నిర్ణయించారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తూ అందరికీ విద్యను చేరువ చేసే దిశగా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన తరుణమిది. పేద విద్యార్థులకు అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిభ కలిగిన విద్యార్థులు పేదరికం కారణంగా విద్యకు దూరం కారాదనే దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ నిర్ణయం నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు వర్సిటీలలో ప్రవేశం పొందడం వలన పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెనతో వసతి భోజన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తూ విద్యార్థికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యను పొందే వ్యవస్థను కల్పించాలని సంకల్పించారు. ఈ విధానంలో రిజర్వేషన్ అమలు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బాలికలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్ అమలు జరిగి అట్టడుగు వర్గాలకు సంపూర్ణ న్యాయం చేకూరుతుంది. భవిష్యత్తులో జరిగే సంస్కరణలకు కేవలం ఇవి తొలి అడుగుగా భావించాలి. ఎంతో ఆర్థిక భారాన్ని భరిస్తూ రాష్ట్రంలో పేద, అట్టడుగు వర్గాల చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే సమున్నత సంకల్పం ఎంతో అభినందనీయం. ఈ పథకాలను మరో దశాబ్ద కాలం అమలు జరిపితే ప్రతీ కుటుంబం విద్యావంతులతో సుసంపన్నం అవుతుంది. తద్వారా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, మరొకరికి చేయూతనందించే స్థాయికి చేరుకుంటారు. - డా. టి. షారోన్ రాజు వ్యాసకర్త విద్యా విభాగాధిపతి ఆంధ్ర విశ్వవిద్యాలయం -
నాణ్యమైన విద్య కోసమే ఫీజుల పెంపు
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య కోసం సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ కోర్సుల్లో ఫీజులు పెంచక తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ డాక్టర్ వి.ప్రవీణ్రావు స్పష్టం చేశారు. ఒకేసారి డొనేషన్ ఫీజు కింద రూ.10 లక్షలు, ఏడాదికి రెగ్యులర్ ఫీజు కింద రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. ఈవిధంగా వచ్చిన సొమ్మును హాస్టళ్ల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులు ఫైవ్స్టార్ స్థాయిలో ఉనప్పటికీ ఫీజులు మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 20–25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు. కొత్తగా 11 రకాల వంగడాలను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రవీణ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత ఐదారేళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామన్నారు. ఐదు రకాల వరి కొత్త వంగడాలు కొత్తగా విడుదల చేస్తున్న 11 వంగడాల్లో ఐదు వరి రకాలు, రెండు జొన్న, కంది, పెసర, సోయా చిక్కుడు, నువ్వులకు చెందిన వంగడాలు ఒకటి చొప్పున ఉన్నాయని ప్రవీణ్ రావు తెలిపారు. జొన్న రకాల వంగడాలను పండించాక వాటిని తిన్నవారికి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనమన్నారు. చీడపీడల్ని తట్టుకునే వంగడాల రూపకల్పనకి వర్సిటీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వర్సిటీ విద్యార్థులు ఏటా 30కిపైగా జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్)లు సాధిస్తున్నారన్నారు. రోబోటిక్స్తో కలుపు నివారణ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వంటి అధునాతన పరిజ్ఞాన వినియోగంలో వర్సిటీ ముందంజలో ఉందని ప్రవీణ్ రావు వివరించారు. ‘రోబోటిక్స్ సాంకేతికతను మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించుకోవచ్చు. డ్రోన్ పరిజ్ఞానాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. తద్వారా డ్రోన్లతో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయొచ్చు. డ్రోన్లపై నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు. ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో త్వరలోనే అగ్రిహబ్ని ప్రారంభిస్తున్నాం. కేంద్రప్రభుత్వం ఈ మధ్య ఒక జిల్లాకి ఒక పంట పథకంలో భాగంగా మన వర్సిటీకి మూడు జిల్లాలకి రూ.8.4 కోట్లు మంజూరు చేసింది. వాటిని జగిత్యాలలో వరి, మామిడి, వరంగల్ జిల్లాలో పసుపు, మిరప, హైదరాబాద్ రాజేంద్రనగర్లో చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం’అని వివరించారు. వర్సిటీ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాయిల్ మ్యాపింగ్ పూర్తయిందని ఆయన చెప్పారు. -
ఫీజు కట్టడానికి డబ్బు లేదా.. అయితే ప్లాస్టిక్ ఇవ్వండి!
చాలా దుకాణాల్లో మనమిచ్చిన నోట్లకు చిల్లర లేకపోతే బదులుగా చాక్లెట్లు చేతిలో పెట్టడం ట్రేడ్ ట్రెండ్ అయింది!అసోంలోని ఓ బడిలో.. ఫీజు కట్టడానికి డబ్బులేకపోతే పోగేసిన ప్లాస్టిక్ను ఇచ్చి బడిలో పాఠాలు నేర్చుకోవచ్చు అనేది పాలసీగా మారింది! ఆ పాఠశాల పేరు అక్షర్.. గువాహటిలో ఉంది. అదెలా మొదలైందంటే.. న్యూయార్క్లో ఉండే మజిన్ ముఖ్తార్ విభిన్నమైన స్కూల్ ప్రాజెక్ట్తో 2013లో ఇండియాకు తిరిగి వచ్చాడు. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో మాస్టర్స్ చేస్తున్న పర్మిత శర్మను అనుకోకుండా కలిశాడు. విద్యారంగంలో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోన్న పర్మిత..ముఖ్తార్తో కలసి 2016లో అక్షర్ స్కూల్ను ఏర్పాటు చేశారు. చక్కటి కరిక్యులమ్తో సాఫీగా సాగిపోసాగింది. ఒకరోజు బడి ఆవరణలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టారు. తరగతి గదుల్లోకి పొగవాసన రావడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు పిల్లలు. అది విద్యార్థుల ఆరోగ్యానికీ, పర్యావరణ హితానికి ఎంత హానికరమో గ్రహించారు పర్మిత, ముఖ్తార్లు. ఆ ప్లాస్టిక్ను ఇటు బడిలోని పిల్లలకు ఉపయుక్తంగా.. అటు పర్యావరణానికి క్షేమంగా మార్చాలని నిర్ణయించుకున్నా రిద్దరూ. ఫీజుకు బదులుగా ప్లాస్టిక్ను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టారు. ఇప్పుడు అక్షర్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా ప్రతిరోజూ పుస్తకాల సంచితోపాటు ప్లాస్టిక్ వ్యర్థాల సంచినీ పట్టుకొని బడికెళ్తున్నారు. వాళ్లందరికీ అక్కడ చదువు ఉచితం. ఆ ప్లాస్టిక్ను ఏం చేస్తున్నారు? ఇరవై మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ స్కూలు స్ట్రెన్త్.. ప్లాస్టిక్ను ఫీజుగా తీసుకోవడం మొదలుపెట్టేప్పటికి వందకు పైనే దాటింది. తమ పరిసరాల్లోంచి తెచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులు బడి ఆవరణలో పోగేస్తారు. వాటిని ఎలా రీసైకిల్ చేయాలి? చేసిన వాటిని తిరిగి ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకుంటున్నారు ఒకేషనల్ ట్రైనింగ్లో భాగంగా. ఇదివరకే ఉన్న ఆటలు, పాటలు, నృత్యం, సోలార్ ప్యానెలింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎంబ్రాయిడరీ, కాస్మెటాలజీ, కార్పెంటరీ, గార్డెనింగ్, ఎలక్ట్రానిక్స్తో పాటు ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిలింగ్ కూడా స్కూల్ కరిక్యులమ్లో భాగమైంది. ఈ రీసైకిల్ ప్లాస్టిక్ను తరగతి గదులు, టాయ్లెట్ల నిర్మాణానికి మెటీరియల్గా వాడుతున్నారట. టాయ్మనీ.. ‘మా ప్రతిపాదనను తొలుత అయిష్టంగానే ఒప్పుకున్నారు స్థానికులు. వీళ్లలో ఎక్కువ మంది క్వారీల్లో కూలికి వెళ్తూ రోజుకి 150 నుంచి 200 రూపాయలు సంపాదించేవాళ్లే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే గగనం. బడి ఫీజులేం కట్టగలరు? అందుకే చాలా మంది పిల్లలు స్కూల్కి వచ్చేవారు కాదు. ఫీజుకు బదులు ప్లాస్టిక్ను తీసుకుంటే ఇటు పిల్లలనూ బడికి రప్పించిన వాళ్లమవుతాం.. అటు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహనా కల్పించిన వాళ్లమవుతాం అనిపించింది. ఊహించినట్టుగానే రెండూ జరుగుతున్నాయి. పిల్లలు చదువు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం తెచ్చుకునేలా వాళ్లను ట్రైన్ చేస్తున్నాం. హైస్కూలు పిల్లలతో ట్యూషన్స్ చెప్పించి వాళ్లకు కొంత డబ్బులు (టాయ్మనీ) ఇస్తున్నాం. అవి వాళ్లకు స్నాక్స్, బట్టలు, బొమ్మలు, షూలు వంటివి కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి’ అని చెప్పారు పర్మిత, ముఖ్తార్. అక్షర్ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మరో వంద స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టూ తెలిపారు. – విజయాదిలీప్ -
ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ క్లాసులు ఎలా ఆపుతారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజలు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్పై పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం చేసిన అప్పీల్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణచేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషన్దారు కోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్లైన్ తరగతులు బోధించడం లేదన్నారు. పిటిషనర్ వాదనలకు బదులిస్తూ.. 10 శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతోపాటు.. ఇప్పటికే 10వేల రూపాయల ఫీజు తగ్గించామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ తరగతులు ఎలా ఆపుతారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అలా ఆపితే పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులతో ముడి పెట్టకుండా ఆన్లైన్ బోధన కొనసాగించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ జూలై 13కి వాయిదా వేసింది. -
స్కూలు ఫీజులు పెంచారని చెబితే.. వెళ్లి చావండన్న మంత్రి
భోపాల్: స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తమ గోడును వెళ్లబోసుకోవడానికి వెళ్లిన పేరెంట్స్పై సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే నోరు పారేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భోపాల్లోని స్కూలు పిల్లల తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పాలక్ మహాసంఘ్ అనే బ్యానర్ కింద ఓ యూనియన్గా ఏర్పడి, అధిక ఫీజుల విషయమై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ను కలిసేందుకు అతని నివాసం వద్దకు వెళ్లారు. కరోనా కారణంగా అధిక స్కూల్ ఫీజులు భారంగా మారాయని, వెంటనే వాటిని నియంత్రించాలని వారు మంత్రికి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో సదరు మంత్రి స్పందన చూసి పేరెంట్స్ కమిటీ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పేరెంట్స్ అభ్యర్ధనను విన్న మంత్రి.. ‘వెళ్లి చావండి, మీకిష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ తిట్టిపోయడంతో అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈయనేం మంత్రిరా బాబు..! బాధను చెప్పుకుందామని వెళితే మాపైనే ఫైరయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను అక్కడున్న సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. తలిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా, నోరు పారేసుకున్న మంత్రిని నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆ రాష్ట్ర హైకోర్టు ఇదివరకే తీర్మానం చేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు సంబంధిత మంత్రికి తమ గోడు వెళ్లబుచ్చుకుందామని వెళ్లారు. బాధితుల ఫిర్యాదుకు మంత్రి రెస్పాన్స్ చూసి వారంతా షాక్కు గురయ్యారు. తమపై నోరుపారేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయమై వెంటనే కల్పించుకుని తమకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు సంబంధిత మంత్రిని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో మంత్రి రాజీనామా విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయమై మంత్రి స్పందించకపోవడం గమనార్హం. -
25 శాతం స్కూలు ఫీజు రద్దు
అహ్మదాబాద్: గుజరాత్లోని సెల్ఫ్ ఫైనాన్స్డ్ పాఠశాలలు 2020–21 విద్యా సంవత్సరానికి గానూ 25 శాతం ట్యూషన్ ఫీజును తగ్గించుకోవడానికి అంగీకరించాయని గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చూడసమ తెలిపారు. రాష్ట్రంలోని సీబీఎస్ఈ పాఠశాలలు సహా అన్ని పాఠశాలలు దీన్ని అనుసరించాల్సిందేనని ఆయన అన్నారు. పాఠశాలలు రవాణా ఫీజులు సహా ఎలాంటి అదనపు ఫీజులను వసూలు చేయబోవని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే, వాటిని రాబోననే నెలలకు అడ్జస్ట్ చేయాలని చెప్పారు. గుజరాత్ లో గత 180 రోజులకు పైగా మూసే ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులకు కేవలం 40శాతం విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు చెప్పారు. -
వేధించే స్కూళ్లకు పాఠం
సాక్షి, హైదారబాద్: ‘కారణం చెప్పకుండా పిల్లల్ని ఒక్కసారిగా చదువుకి దూరం చేస్తే.. తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోండి’ అంటూ ఆమె చెమర్చిన కళ్లతో ప్రశ్నిస్తుంటే.. నగరంలో పలువురు తల్లిదండ్రుల కళ్లు తడిదేరాయి. ఎందరో మధ్యతరగతి పేరెంట్స్కి పిల్లల కోసం చదువు‘కొనే’ తమ కష్టాలు గుర్తొచ్చాయి కార్పొరేట్ స్కూళ్ల కాఠిన్యంపై ధ్వజమెత్తారు సినీ సెలబ్రిటీ జంట శివబాలాజీ, స్వప్నమాధురి దంపతులు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాల నిర్వాకాలను తప్పనిసరి భరించే ఎందరో పేరెంట్స్కు భిన్నంగా సిటీలో తొలిసారిగా స్కూల్పై ఈ తరహా పోరాటం చేసిన పేరెంట్స్గా, స్కూల్ నుంచి తీసేసిన వందలాది మంది పిల్లలకు అండగా నిలిచారు.. తీసేసిన పిల్లల్ని తిరిగి చేర్చుకునేలా చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో స్వప్నమాధురితో సంభాషించినప్పుడు.. పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. ♦ప్రీ మిడ్టర్మ్ పరీక్షల కోసం రివిజన్స్ జరుగుతున్న సమయంలో.. స్కూల్లో ఎనిమిదేళ్లుగా చదువుతున్న మా పిల్లల్ని ఆకస్మికంగా ఆన్లైన్ క్లాసులకు దూరం చేశారు. కారణం ఏంటని ఫ్రంట్ ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేసి అడిగాం. అకౌంట్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేయమన్నారు. అక్కడ నుంచీ రిప్లై లేదు. ♦మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదని కంటిన్యూగా ఫోన్స్ చేస్తున్నా ‘నో రెస్పాన్స్’.. ఫ్రంట్ ఆఫీస్కి కాల్ చేసి ఫోన్ చేసి, మెయిల్కి రిప్లై రావడం లేదంటే.. ఫీజు విషయమై ఉంటుందన్నారు. (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన) ♦ఏదైనా సరే మాకు చెప్పాలి కదా.. ఏదీ చెప్పకుండా సడెన్గా ఇలా చేయడం ఏమిటనడిగితే ప్రిన్సిపాల్తో మాట్లాడిస్తామని చెబుతూ వచ్చారు. అదీ జరగలేదు. ♦కొంత మంది తల్లిదండ్రులు గ్రూప్గా ఏర్పడి ఫీజులు తగ్గించమని అడగడం, ఆ గ్రూప్లో నేనూ ఉండటం వల్లే ఇలా చేశారని ఆ తర్వాత వారి స్పందన ద్వారా అర్థమైంది. ఫీజు తగ్గించమని అడగడం తప్పా? ♦కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఆన్లైన్ క్లాసులంటే.. ల్యాప్ టాప్ కొనాలి. పనులు మానేసి కొన్ని గంటల పాటు సమయాన్ని పిల్లలతో గడపాలి.. ఇవన్నీ సమస్యలున్నాయి. కాబట్టి ఫీజు తగ్గించమని అడగడానికి వందల మంది పేరెంట్స్ కలిసి గ్రూప్గా ఏర్పడ్డారు. ♦ఆ గ్రూప్లో నన్నూ యాడ్ చేశారు. మేమైతే ఫస్ట్ టర్మ్ ఫీజు పూర్తిగా కట్టేశాం అయినా కానీ కట్టలేని వారి గురించీ ఆలోచించాలి కదా.. అందులోనూ వీరెవరూ మొత్తం ఫీజు కట్టం అనలేదు. కాస్త తగ్గించమన్నారంతే. ♦వాళ్లకు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా? తగ్గిస్తున్నామనో.. తగ్గించమనో చెప్పాలి కదా? జూన్లో గ్రూప్ తరఫున మెయిల్ పెడితే ‘మీరు గ్రూప్గా అడిగితే అసలు మేం కన్సిడర్ చేయం’ అంటూ ఆగస్టు 12న రిప్లై వచ్చింది. ♦దాంతో పర్సనల్గా డైరెక్టర్, ప్రిన్సిపాల్ని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ రాశాం. పేరెంట్స్ని తప్పుగా చూడవద్దు. ఈ సమస్య లేకపోతే ఎవరూ ఇలాంటి రిక్వెస్ట్ పెట్టేవారు కాదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ♦విచిత్రమేమిటంటే నేనేమీ నా పిల్లల ఫీజు విషయంలో తగ్గించాలని అడగలేదు. అయినా నా పిల్లలతో పాటు గ్రూప్లో ఉన్న వందలాది మంది పిల్లల్ని క్లాసులకు దూరం చేశారు. పైగా..‘మిగతా పేరెంట్స్ని ఫీజు కట్టకుండా ఆపుతున్నారు మీ మీద యాక్షన్ తీసుకుంటా’మంటూ మాకు మెయిల్ పెట్టారు. ♦నా పిల్లల్ని ఎందుకు తీశారు? కమ్యూనికేషన్ ఎందుకు బ్లాక్ చేసేశారు? మొత్తం ఫీజు కట్టేశాక కూడా నా తప్పు ఏమిటి? ఒక పేరెంట్గా నేను అడిగితే నా మీద పర్సనల్గా ఎందుకు యాక్షన్ తీసుకుంటామంటున్నారు? అంటూ ప్రశ్నలు అడిగితే రిప్లై లేదు. దాదాపు 3 వారాల పాటు చూసి ఇక వేరే గత్యంతరం లేక మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాం. హక్కులేమీ లేవా? పిల్లలను స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు తమకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కదా. ‘మీ వైపు నుంచి ఈ తప్పు జరిగింది.. దాంతో మీ పిల్లల్ని తీసేస్తున్నాం’ అంటూ నోటిస్ ఇచ్చి దానికి స్పందించకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. ►అంతేగాని ఏకపక్షంగా చెప్పాపెట్టకుండా తీసేసి ఎందుకు అలా చేయాల్సి వచి్చందో కూడా సమాచారం ఇవ్వకపోతే ఎలా? ‘ఈ విషయంలో స్కూల్ తప్పేమీ లేదని తేలింది. స్వప్పమాధురి, శివబాలాజీ మీడియా పబ్లిసిటీ కోసమే డ్రామా ఆడుతున్నారు’ అంటూ మిగిలిన పేరెంట్స్ను తప్పుదారి పట్టించేలా స్కూల్ నుంచి మెయిల్స్ పెట్టారు. పిల్లల భవిష్యత్తో డ్రామాలు ఆడతామా? అంత అవసరం మాకేంటి? వదిలేది లేదు.. ప్రస్తుతం చాలా మంది తీసేసిన పిల్లల్ని తిరిగి క్లాసుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ దీన్ని వదిలేది లేదు. మా పిల్లల్ని ఎందుకు తీసేశారు? మాకు కారణం కావాలి. మాకు నగరం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఎందరో తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ కరోనా నేపథ్యంలో తమ కష్టాలు, స్కూళ్ల యాజమాన్యాలతో తమకు ఏర్పడుతున్న సమస్యలు చెబుతున్నారు. వారందరికీ మనోధైర్యం ఇచ్చేలా హెచ్ఆర్సీ జడ్జిమెంట్ రావాలి. ప్రతి స్కూల్కి ఇదొక పాఠం అవ్వాలి. కష్టపడి పిల్లల్ని చదివించే పేరెంట్స్ని అవస్థలు పెట్టడం తప్పు అని స్కూల్స్ తెలుసుకోవాలి. -
ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో విచారణ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల ఆన్లైన్ తరగతులు, ఫీజులపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళ్తె.. ఈ ఏడాది ఫీజులు పెంచవద్దని ఏప్రిల్ 21న జీవో 46ను జారీ అయిందని విద్యాశాఖ కౌంటర్లో పేర్కొంది. జీవో ప్రకారం బోధన రుసుములు నెలవారీగా తీసుకోవాలి, కానీ 55 పాఠశాలలు జీవోని ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. జీవోను ఉల్లంఘించి వసూలు చేస్తున్న 55 పాఠశాలలకు విద్యాశాఖ షోకాజు నోటీసులు జారీ చేసింది. కాగా షోకాజు నోటీసులకు 47 పాఠశాలలు వివరణ ఇచ్చాయి. అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. కాగా జీవోకు విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఎస్ఈ గడువు కోరగా, తదుపరి విచారణను అక్టోబరు 8కు హైకోర్ట్ వాయిదా వేసింది. -
స్పందించిన అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్ కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లాక్డౌన్ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్ఫోన్లో మేసేజ్లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
చెప్పని చదువుకు ఫీజులు
నా పేరు శ్రీనివాస్ (పేరు మార్చాం). ఆదిలాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పట్టణంలోని విద్యార్థి కళాశాల సమీపంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉన్నాను. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులకు వెళ్తున్నాను. అయితే ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం మెస్సేజ్లు పంపుతోంది. ఆలస్యమైనందుకు రూ.60 చొప్పున ఫెనాల్టీ చెల్లించాలట. లేదంటే అడ్మిషన్ను రద్దు చేస్తామని భయపెడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే మా పిల్లల్ని పాఠశాలలో ఉంచుతారో.. లేదోనన్న భయం. చాలా మందిది ఇదే పరిస్థితి. సాక్షి, ఆదిలాబాద్: కరోనాతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మార్చి నుంచి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కొంతమంది చిరు వ్యాపారాలు చేస్తుండటం, మరికొంత మంది కూలీ పనులకు వెళ్లిన విషయం విదితమే. అయితే ఆ సమయంలో విద్యాసంస్థలు బంద్ పాటించగా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పని చదువులకు సైతం ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబాలను పోషించేందుకు అష్టకష్టాలు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఫీజులు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన సాగుతోంది. ఇదివరకే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్ చదువులు ప్రారంభించలేదు. గత మార్చి నుంచి ఆగస్టు వరకు ఫీజు చెల్లించాలని, ఆలస్యమైనందుకు ఫెనాల్టీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా బాగున్న వారు ఈ ఫీజులు చెల్లిస్తుండగా, ప్రైవేట్ ఉద్యోగులు, కూలీనాలి చేసేవారు ఫీజులు ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పని చదువుకు ఫీజు లాక్డౌన్ సమయంలో మార్చి 15 నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం విద్యార్థులందరిని అప్గ్రేడ్ చేస్తూ పైతరగతులకు పంపించింది. జిల్లాలో వందకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా. కొన్ని పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు మే నుంచి ఆగస్టు వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాయి. మరికొన్ని ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం ఆన్లైన్ తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ఈ తతంగం నడిపారు. ఆన్లైన్ తరగతుల ఫీజుల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసిన టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వని యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెస్సేజ్లు పంపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు ఏమాత్రం పాటించకపోయినా ఫీజు జులుం మాత్రం మానడం లేదు. నిబంధనల ప్రకారం పాఠశాలలకు క్రీడా మైదానం, లైబ్రరీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, ఫైర్ అనుమతి, తదితర సౌకర్యాలు ఉండాలి. దీనికి తోడు పాఠశాలల్లోనే షూలు, బెల్టులు, యూనిఫాం, నోటుబుక్లు, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. వీరి ఇబ్బందులతో తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. పెనాల్టీ చెల్లించాలి నెలనెలా ఫీజులు చెల్లించకపోతే జీఓ ప్రకారం ఫెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మా యాజమాన్యం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెస్సేజ్లు పంపించాం. ఏవైన ఇబ్బందులు ఉంటే మమ్మల్ని పాఠశాలలో సంప్రదించాలి. వి ద్యార్థుల తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదు. ఇది వరకు ఫీజులు అడగలేదు కాని, ప్రస్తుతం ఫీజులు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. -ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మెమో జారీ చేస్తాం ఆ పాఠశాల యాజమాన్యానికి మెమో జారీ చేస్తాం. ఫెనాల్టీ ద్వారా ఫీజులు వసూలు చేస్తే సహించేది లేదు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి. – ఎ.రవీందర్ రెడ్డి, డీఈఓ -
ఆన్లైన్ క్లాసులు: ఫీజు చెల్లించకుంటే ‘లైన్’కట్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూలు యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోజుకు చెప్పే రెండు మూడు క్లాసులకే పూర్తి ఫీజులు వసూలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక పక్క కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులకు ఈ ఫీజుల చెల్లింపు తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే ఫస్ట్ టర్మ్ ఫీజులు..పుస్తకాలు, నోటు బుక్స్, ఫోన్లు, కంప్యూటర్ల కొనుగోలు పేరుతో భారీగా ఖర్చు చేసిన తల్లిదండ్రులకు..సెకండ్ టర్మ్ ఫీజుల చెల్లింపు వారి కుటుంబాలను మరింత ఆర్థి్క సంక్షోభంలోకి నెట్టేస్తుంది. మొత్తం ఫీజులో 50 శాతం చెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసుకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఇస్తాం! లేదంటే క్లాసు నుంచి డిస్కనెక్ట్ చేస్తాం! అంటూ యాజమాన్యాలు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేక ఆయా స్కూళ్ల ముందే నిరసనకు దిగుతున్నా పట్టించుకున్న నాధుడే లేరు. అంతేకాదు ఆయా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అనుమతించక పోయినా..ఆన్లైన్ తరగతులు తెలంగాణ వ్యాప్తంగా 10549 పాఠశాలలు ఉండగా, వీటిలో 30 లక్షల మంది వివిధ తరగతులు చదువుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడు వేలకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో పది లక్షల మంది పిల్లలు ఉన్నారు. నిజానికి జూన్ 12 నుంచి అన్ని స్కూళ్లు రీ ఓపెన్ కావాల్సి ఉండగా, కరోనా విజృంభి స్తుండటంతో ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. ప్రభుత్వం అనుమతించక పోయినప్పటికీ నగరంలోని పలు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తుంది. 27 పాఠశాలలపై ఫిర్యాదులు అందినా.. పలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ పాఠాల పేరుతో తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే ఫస్ట్ టర్మ్ ఫీజులు వసూలు చేశాయి. అడిగినంత ఫీజు చెల్లించిన వారికి యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఇచ్చి పాఠాలు వినే అవకాశం కల్పిస్తున్నాయి. ఫీజు చెల్లించని వారిని ఇందుకు దూరంగా ఉంచుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు ఆయా పాఠశాలలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని 27 పాఠశాలపై ఫిర్యాదులు అందాయి. దీంతో సబంధిత అధికారులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, అధిక ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలపై కూడా చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం విశేషం. కరోనా వల్ల ఉపాధి అవకాశాలు లేక ఆదాయం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ఈ ఫీజులు మరింత ఆవేదనను మిగుల్చుతున్నాయి. ఆందోళనకు దిగిన తల్లిదండ్రులపై కేసులు కరోనా సమయంలో ఫీజులు పెంచొద్దని పేర్కొంటూ ప్రభుత్వం జీఓ నెంబర్ 46 జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ నగరంలోని ఏ ఒక్క పాఠశాల కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. పలు కార్పొరేట్ స్కూళ్లు గతేడాది కంటే ఎక్కువ గా రూ. పది వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లను నిరసిస్తూ ఇటీవల పలువురు తల్లిదండ్రులు ఆయా కార్పొరేట్ పాఠశాలల ముందు ఆందోళనకు దిగడం తెలిసిందే. తల్లిదండ్రులకు అండగా నిలువాల్సిన అధికారులు, పోలీసులు ఆందోళనకు దిగిన వారిపై కేసులు నమోదు చేయడం విశేషం. ట్యూషన్ ఫీజుకు మించి వసూలు చేయొద్దు హైదరాబాద్ జిల్లాలోని ఏడు ప్రైవేటు పాఠశాలలపై ఫిర్యాదులు అందాయి. అధికారుల విచారణలో మూడు పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వివరించాం. ఇకపై కూడా ఏదైనా స్కూలుపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడుతాం. అధిక ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే అట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోం. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. అంతకు మించి వసూలు చేస్తే చర్యలు తప్పవు. – వెంకటనర్సమ్మ, డీఈఓ, హైదరాబాద్ ఇంటర్ కళాశాలల్లోనూ అంతే! సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన మధుప్రియ దిల్సుఖ్నగర్లోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గతేడాది ఫస్టియర్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం సెకండియర్కు చేరుకుంది. అయితే సెకండియర్కు అడ్మిషన్ రెన్యూవల్ చేయాలంటే తొలి విడతగా రూ.20 వేలు ఫీజు చెల్లించాల్సిందిగా కాలేజీ నుంచి ఆమె తండ్రికి ఫోన్ చేశారు. లేదంటే అడ్మిషన్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఇది ఒక మధుప్రియ తండ్రికి ఎదురైన అనుభవం మాత్రమే కాదు.. పలు కార్పొరేట్ కాలేజీల్లో ఫస్టియర్ పూర్తి చేసుకుని సెకండియర్లోకి అడుగుపెడుతున్న అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీలు ఫీజులు పేరుతో వేధింపులకు దిగుతున్నాయి. క్లాసుల నిర్వహణ, ఫీజుల వసూలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ తరగతులకు ఆఫ్లైన్లో చెల్లించే మొత్తం ఫీజులను ఎలా చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తరగతుల ప్రారంభానికి ముందే.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో గత విద్యా సంవత్సరం 2,00,332 మంది విద్యార్థులు ఫస్టియర్ పూర్తి చేసుకోగా.. మరో 2,03,948 మంది సెకండియర్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఫస్టియర్ పూర్తి చేసుకుని సెకండియర్లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు అధికారికంగా ఇప్పటివరకు తరగతులు ప్రారంభం కాలేదు. కానీ.. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. మొత్తం ఫీజులో 50 శాతం తొలి విడతగా చెల్లించాలని, లేదంటే అడ్మిషన్ రద్దు చేస్తామన్న కాలేజీల హెచ్చరికలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు తెరవకముందే అప్పుడే 50 శాతం ఫీజు ఎలా చెల్లిస్తామని వాపోతున్నారు. నిజానికి ఫస్టియర్లో చేరిన విద్యార్థి అడ్మిషన్ ఆటోమెటిక్గా సెకండియర్కు రెన్యూవల్ అవుతుంది. -
ఫీజు వసూలుపై ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఇష్టారాజ్యం
దిల్సుఖ్నగర్కు చెందిన మాలతి సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఇంటి వద్ద నుంచే బోధన సాగిస్తోంది. కానీ జూలై 27వ తేదీ వచ్చినా ఈనెల వేతనం తన ఖాతాలో జమ కాలేదు. అంతేకాదు, జూన్ నెలలో ఇవ్వా ల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. కారణం స్కూల్ యాజమాన్యం తనకు నిర్దేశించిన ఫీజు వసూలు లక్ష్యాన్ని సాధించకపోవడమే. దీంతో రెండు నెలలుగా జీతమే లేదు. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా టీచర్లకుండే లక్ష్యాలు అత్యుత్తమ బోధన, మెరుగైన ఫలితాలు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల లక్ష్యాలు మారిపోయాయి. ఆన్లైన్లో ఎలాగోలా బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీచర్లకు విద్యార్థుల నుంచి నెలవారీ ఫీజు డబ్బులను వసూలు చేయడాన్ని యాజమాన్యాలు లక్ష్యాలుగా నిర్దేశించాయి. దీంతో ఫీజులు వసూలు చేసిన టీచర్లకు సగం వేతనాలు ఇస్తుండగా... వసూలు చేయని వారికి మొండిచేతులు చూపిస్తున్నారు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో 20 వేలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. ఇందులో 65 శాతంపైగా స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. రోజుకు రెండు లేదా మూడు సబ్జెక్టుల చొప్పున మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో బోధనా సిబ్బందికి ప్రతిరోజూ తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆన్లైన్ తరగతుల ద్వారా బోధనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి సగం వేతనం చొప్పున ఇవ్వనున్నట్లు యాజమాన్యాలు తొలుత ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ మేరకు సైతం చెల్లింపులు చేయడం లేదు. ప్రతి క్లాస్ టీచర్కు ఆ తరగతిలోని విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో ఆన్లైన్ తరగతి పూర్తయిన తర్వాత ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లాక్డౌన్ అనంతర పరిణామాలతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపార రంగం సైతం క్షీణించడంతో ఆదాయం పతనమైంది. ఈ క్రమంలో ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ టీచర్లు వారికి ఫోన్లు చేసి కొంత మొత్తమైనా చెల్లించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు గొడవలకు సైతం దారితీస్తుండడం గమనార్హం. వేతన వెతలు... ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వేతనాల కోసం అల్లాడుతున్నారు. మార్చి నెల నుంచి లాక్డౌన్ మొదలైంది. దీంతో అప్పట్నుంచి వేతన చెల్లింపులు గందరగోళంగా మారిపోయాయి. ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. కొన్ని సంస్థలు మాత్రం ఏప్రిల్ నెలలో సగం వేతనంతో సరిపెట్టగా మెజార్టీ విద్యా సంస్థలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. మే నెలలో 90 శాతం సంస్థలు జీతాలకు మంగళం పాడేశాయి. జూన్, జూలై నుంచి ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నప్పటికీ వేతనాలు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఫీజు వసూళ్ల బాధ్యతలు టీచర్లపైకి నెట్టేశాయి. నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తేనే వేతనాలిస్తామని చెప్పడంతో వేలాది మంది ఉద్యోగులు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
రెండో తరగతికి లక్షపైనే...
బోడుప్పల్లోని సిద్ధార్థ స్కూల్లో తన కుమారుడిని రెండో తరగతిలో చేర్పించేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. క్లాసులు..టీచర్ల వివరాలు మాట్లాడిన తరువాత ఫీజు గురించి చెబితే అతని కళ్లు బైర్లు కమ్మాయి. రూ. లక్ష వరకు చెల్లించాలని చెప్పారు. అదేమని అడిగితే ఆన్లైన్ క్లాస్..ల్యాప్టాప్..బుక్స్..డ్రెస్.. ట్రాన్స్పోర్ట్ ఇలా కబుర్లు చెప్పారు. వామ్మో..ఇంకా మొదలే కాని స్కూలుకు ఇంత ఫీజా.. వద్దులే బాబూ అనుకొని సారథి హైస్కూల్కు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి. ఉప్పల్లోని శ్రీచైతన్య స్కూల్లో విచారించాడు. రూ.38,500 చెప్పారు. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం చెప్పింది కదా అని అడిగితే మాకేం తెలియదు సార్.. ఫీజు కట్టాల్సిందే అని నిర్లక్ష్యంగాసమాధానం ఇచ్చారు. డబ్బుచెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులతోచదువులు మొదలవుతాయి. సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు కరోనా కాలంలోనూ కనికరంలేకుండా ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై జులం ప్రదర్శిస్తున్నాయి. విద్యాశాఖలో ఉన్న పర్యవేక్షణ లేమి ఈ విద్యా సంస్థలకు కలిసి వస్తోంది. ఆన్లైన్ క్లాసులు, అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46కు తూట్లు పొడుస్తున్న అనేక విద్యా సంస్థలు వివిధ రకాల పేర్లు చెప్పి అందినకాడికి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు తాము నిర్దేశించిన ఫీజులు చెల్లించకపోతే ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ ఇవ్వమంటూ ఎస్సెమ్మెస్లు పంపించి బెదిరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో? ఎవరికి ఫిర్యాదు చేయాలో? అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. తాజా విద్యా సంవత్సరంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం ఈ విద్యా సంస్థలకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. దీంతో సొంత సిలబస్లో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టి, యథేచ్ఛగా కొనసాగించేస్తున్నాయి. ‘సాక్షి టీవీ’ నిఘాలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. (వారు కంపార్టుమెంటల్ పాస్) రెండో తరగతికి రూ.లక్షపైనే... బోడుప్పల్లోని సిద్ధార్థ స్కూల్ వ్యవహారం ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారానికి ఓ మచ్చుతునక మాత్రమే. ఆ పాఠశాలకు రెండో తరగతిలో చేరే విద్యార్థి తండ్రిగా వెళ్లిన ‘సాక్షి’ ప్రతినిధికి అక్కడి ఉద్యోగులు చెప్పిన ఫీజుల లెక్క అవాక్కయ్యేలా ఉంది. అడ్మిషన్ మొదలుకొని వివిధ ఫీజుల కింద రూ.లక్ష డిమాండ్ చేశారు. ఆ ఫీజులో కాస్త తగ్గించమని కోరగా.. ఆ పాఠశాల ఉద్యోగుల నుంచి స్పందన కరువైంది. సమీపంలోని సారథి హైస్కూల్లోనూ రెండో తరగతి విద్యార్థికి స్కూలు ఫీజు కింద రూ.60 వేలు, యాక్టివిటీ ఫీజు కింద మరో రూ.40 వేలు కలిపి రూ.లక్షగా చెప్పారు. దీనికి అదనంగా రవాణా, పుస్తకాలు తదితరాలు అదనంగా ఉంటాయని ఉంటాయని స్పష్టం చేశారు. ఉప్పల్లోని శ్రీచైతన్య స్కూల్లో ట్యూషన్ ఫీజుగా రూ.31 వేలు, పుస్తకాలు, యూనిఫాం తదితరాలకు మరో రూ.7,500 చెల్లించాలని అక్కడి ఉద్యోగులు చెప్పారు. మిగిలిన రెండు స్కూళ్ల కంటే ఇక్కడ తక్కువే అయినా.. సామాన్యుడికి మాత్రం భారమే. కేవలం ఈ మూడే కాదు.. నరగంలోని దాదాపు ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లోనూ ఫీజుల తీరుతెన్నులు ఇలానే ఉన్నాయి. పాత స్టూడెంట్స్ నుంచి మరోలా.. కొత్తగా చేరాలని భావించిన విద్యార్థుల నుంచి వసూళ్లు ఇలా ఉంటే.. ఇప్పటికే తమ విద్యార్థులుగా ఉన్న వారి నుంచి ఈ స్కూళ్లు మరోలా పిండుకుంటున్నాయి. దీనికోసం ఆన్లైన్ క్లాసుల పేరును వాడుకుంటున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఈ విద్యా సంస్థలు తమ సొంత సిలబస్తో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టేశాయి. ఫీజుల పేరుతో ప్రతి పైసా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. జరుగుతున్నవి ఆన్లైన్ క్లాసులే అయినప్పటికీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల వసూళ్లలో తగ్గట్లేదు. ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, స్కూలు యూనిఫాం ఫీజు, స్కూలు డెవలప్మెంట్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు... ఇలా అందినకాడికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నాయి. ఇవి చాలవన్నట్లు ఆన్లైన్ క్లాసుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన ల్యాప్టాప్, ట్యాబ్లు తమ వద్దే కొనాలంటూ కొత్త మెలిక పెడుతున్నాయి. వీటిలో ఏ ఫీజు చెల్లించకపోయినా, పుస్తకాలు కొనకపోయినా ఆన్లైన్ క్లాసుల యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వమని, పరీక్షలు రాయనిచ్చేది లేదంటూ ఎస్సెమ్మెస్లు, ఫోన్కాల్స్ ద్వారా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాయి. వారి బాధలు వర్ణనాతీతం... నగరానికి ఎన్నో ఏళ్ల క్రితం వలసవచ్చిన బడుగుజీవులు ఎందరో ఉన్నారు. తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నది వీరి కల. దీనికోసం కడుపుకట్టుకుని పిల్లల్ని సమీపంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని ఉపాధి, ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లు ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం మరో షాక్ ఇస్తోంది. ఇన్నాళ్లు ఏదో ఒక రకంగా ఫీజులు చెల్లిస్తూ వస్తున్నామని, ప్రస్తుత కరోనా పరిణామాలతో అది సాధ్యం కావట్లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు వ్యయప్రయాసలకు ఓర్చినా.. ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. టీచర్లు బోర్డు వైపు తిరిగి బోధిస్తున్న ఈ ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు అర్థం కావట్లేదు. వీరికి సందేహాలు వస్తే తీర్చే నాథులే కరువయ్యారు. ఈ ఇబ్బందులు అదనం... ఈ ఆన్లైన్ క్లాసుల కోసం గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ చూస్తున్న పిల్లల కళ్లు, వెన్నుముకలపై తీవ్ర ప్రభావం ఉంటోంది. అనేక మంది చిన్నారులు తల, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇంటర్నెట్లో ప్రవేశించినప్పుడు అనేక మంది చిన్నారులకు అశ్లీల సైట్ల పాప్అప్స్, బూతు బొమ్మలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆ క్లాసులు జరిగినంత సేపూ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పని మానుకుని పిల్లల వద్దే కూర్చోవాల్సి వస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు భారం పెరుగుతోంది. వారికి కచ్చితంగా ఒక్కో ఫోన్ లేదా ట్యాబ్ సమకూర్చాల్సి వస్తోంది. ఒకే సమయంలో ఆన్లైన్ క్లాసులు కావడంతో ఇది తప్పట్లేదు. కూలినాలీ చేసుకుని జీవించే కుటుంబాల్లో కనీసం స్మార్ట్ ఫోన్ కూడా ఉండట్లేదు. దీంతో వీరి పిల్లలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. ఈ ట్యూషన్ ఫీ అంతా కట్టమంటున్నారు కరోనా కష్టకాలంలో స్కూళ్లలో ఫీజులు పెంచవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కానీ విద్యా సంస్థలు మాత్రం లాస్ట్ ఇయర్ ఫీజు రూ.75 వేలను చెల్లించమంటున్నారు. దాన్ని ట్యూషన్ ఫీజు కింద చూపించి కట్టమని ఫోర్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫీజు మొత్తాన్నే ఈ ఏడాది కూడా చెల్లించాలని.. అది కూడా తొమ్మిది వాయిదాల్లో కట్టాలంటున్నారు. ఈ విషయంలో ఎంత చెప్పినా స్కూల్ యాజమాన్యాలు రాజీపడటం లేదు. – ఓ విద్యార్థి తండ్రి ఈ క్లాసులు ఏం రీచ్ అవుతాయి? ప్రభుత్వం జస్ట్ జీవో ఇచ్చి వదిలేసింది.మానిటరింగ్ ఏంలేదు. స్కూల్ నుంచి మామూలుగా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ఉన్న ఫీజునే ఇప్పడు మంత్లీ పే చేయమంటున్నారు. ఈ విషయంలో స్కూల్ వాళ్లుడిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ రూ.20 వేలు, రూ.30 వేలు కట్టాలంటున్నారు. కడితేనే బుక్స్ అంటున్నారు. బుక్స్ లేకుండా క్లాసులు చెప్పడమేంటి.. వాళ్లు చెప్పినా ఏం రీచ్ అవుతుంది. అసలు నెక్ట్స్ క్లాసు బుక్స్ ఏం ఉంటాయోతెలియకుండా ఎలా..? అదేమంటే బుక్స్ లేకుండా క్లాసులు చెబుతున్నాం.. నోట్స్ ఫ్రిపేర్ చేయండని చెబుతున్నారు. – ఓ విద్యార్థి తల్లి ఛాన్స్ ఇవ్వడం లేదు.. ఆన్లైన్ క్లాసుల్లో టీచర్లు చెప్పేది ఏం అర్థం కావడం లేదు. డౌట్స్ అడుగుదామంటే అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. వాళ్ల మానాన వాళ్లు చెప్పుకుంటూ వెళ్లుతున్నారు. కానీ క్లాసు లాస్ట్లో చెబుతాంటున్నారు. ఏమీ ఉండటం లేదు. అర్థం కావడం లేదని చాలా చెప్పాం. కానీ క్లాసుకు టైమ్ అయిపోతుందని చెప్పుకుంటూ వెళ్తున్నారు. – ఓ విద్యార్థి పేరెంట్స్కు కష్టమే.. ఎల్కేజీ వాళ్లకు కూడా ఆన్లైన్ పాఠాలు చెబుతున్నారు. పెద్ద క్లాసు వాళ్లు అంటే వింటారు. కానీ చిన్నపిల్లలకు ఏం అర్థం అవుతుంది. వీళ్లకేమీ అర్థమవుతుంది. ఇది పేరెంట్స్కు చాలా బర్డెన్. చేసే పనులను మానుకుని పిల్లలతో పాటు కూర్చుకోవాల్సి వస్తుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువ అవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాఠాలు మర్చిపోతారనే భయంతోనే ఆన్లైన్ క్లాసుల్లో కూర్చోపెట్టాల్సి వస్తుంది. – ఓ విద్యార్థి తల్లి బ్యాక్ పెయిన్ వస్తోంది ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేగాకుండా ఐ సైట్ ప్రాబ్లమ్ వస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురికి డివైజ్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే.. చిన్న పిల్లలకు క్లాసులంటే టూ మచ్. వాళ్లకి ఏం అర్థమవుతుంది. మేడమ్ ఫాస్ట్ ఫాస్ట్గా చెబుతున్నారు. నేను మళ్లీ చెప్పాల్సి వస్తుంది. - ఓ విద్యార్థిని తల్లి ఫోన్ లేక పాఠాలు సాగడం లేదు చేతన్బాగ్ స్కూల్లో మా అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు. ఫోన్ ద్వారానే క్లాసులు జరుగుతున్నాయి. ఫోన్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఫోన్ లేక పాఠాలు ఆగిపోయాయి. పక్కింటికి వెళ్లాలంటే.. కరోనా వల్ల ఎవరూ రానివ్వడం లేదు. ఇలా కాకుండా ప్రతి ఇంటికి టీవీ ఉంటుంది. దాన్లో చెబితే ఇంత టెన్షన్ ఉండదు కదా.. మరి మా పరిస్థితి ఏంటి..? – విద్యార్థి తల్లి, చేతన్బాగ్ -
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విద్యాశాఖ అధికారుల విచారణ
-
స్కూళ్ల ‘ఆన్లైన్’ మాయ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు, కార్పొరేటు, అంతర్జాతీయ పాఠశాలలు కరోనా కల్లోల సమయంలోనూ ఫీజుల దందాను ఆపట్లేదు. ఉద్యోగాలు పోయి కొందరు, జీతాల కోతలతో మరికొందరు సామాన్యులు లబోదిబోమంటున్నా స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం వసూళ్లకు వెనకడుగు వేయట్లేదు. పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాకముందే ఆన్లైన్ బోధన పేరిట భారీ మొత్తంలో ఫీజులు గుంజేందుకు సిద్ధమయ్యాయి. కరోనా లాక్డౌన్తో గత విద్యా సంవత్సరం పూర్తికాకుండానే స్కూళ్లు మూతపడగా అప్పటి ఫీజు బకాయిలతోపాటు కొత్త ఫీజులపై దృష్టి పెట్టాయి. కొన్ని స్కూళ్లు నేరుగా ఫీజులను పెంచగా, మరికొన్ని స్కూళ్లు ట్యూషన్ ఫీజులో ఇతరత్రా ఫీజులను కలిపేసి ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. స్కూళ్లే ప్రారంభం కాకముందు ఫీజులను ఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు పెంచొద్దన్నా.. రాష్ట్రంలోని 10,547 ప్రైవేటు పాఠశాలల్లో పేరున్న, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు 2,500 వరకు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లలో చదివే 31 లక్షల మంది విద్యార్థుల్లో ఇలాంటి స్కూళ్లలోనే 40 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా వల్ల ప్రజలకు ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో స్కూలు ఫీజులు పెంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పైగా ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలని, అదీ నెలవారీగానే తీసుకోవాలని తేల్చిచెప్పింది. అందుకు అనుగుణంగా విద్యాశాఖ గత నెలలో జీవో 46ను జారీ చేసింది. అయినా కొన్ని స్కూళ్లు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఫీజులను పెంచగా మరికొన్ని స్కూళ్లు దొడ్డిదారిన అధిక ఫీజుల వసూళ్లకు చర్యలు చేపట్టాయి. లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్, ఐక్యూ జీనియస్, ఫీల్డ్ ట్రిప్ ఫీజులను ట్యూషన్ ఫీజులోనే కలిపేసి ఆ మొత్తాన్ని చెల్లించాలని తల్లిదండ్రులకు హుకుం జారీ చేశాయి. దీనికితోడు పిల్లలకు ఆన్లైన్ తరగతుల కోసం ట్యాబ్, ల్యాప్టాప్లను కొనుగోలు చేసుకోవాలని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం... ఆన్లైన్ పాఠాలంటూ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు చేస్తున్న మాయాజాలం తమ పిల్లలకు పెద్దగా ఉపయోగపడట్లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వారు చెప్పేది అర్థంకాక, అప్పటికప్పుడు ప్రశ్నలు అడిగే పరిస్థితి లేక ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందంటున్నారు. గంటల తరబడి ట్యాబ్లు, ల్యాప్టాప్ల వాడకం వల్ల పిల్లల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని, అధిక రేడియేషన్ మెదడు నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆన్లైన్ తరగతులు పిల్లల మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ పేర్కొంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు ఆన్లైన్ పాఠాలను నిషేధించింది. కానీ రాష్ట్రంలో ఆ దిశగా చర్యల్లేవు. టీచర్లకు జీతాలు ఎగనామం... కార్పొరేట్, ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు గుంజుతున్నా టీచర్ల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే దాదాపు లక్షన్నర మంది టీచర్లలో దాదాపు 70 వేల మంది ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారు. వారికి ఏప్రిల్, మే వేతనాలను ఇవ్వని యాజమాన్యాలు ఇప్పుడు పాత, కొత్త ఫీజులు వసూలు చేయాలని వారికి టార్గెట్లు పెట్టాయి. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేలా ఒప్పించే వారికి సగం వేతనాలను ఇస్తామని చెబుతున్నాయి. దీంతో టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలంటూ బతిమిలాడుకుంటున్నారు. సాధారణ స్కూళ్లపై ప్రభావం.. కార్పొరేట్ స్కూళ్ల ఆన్లైన్ మాయాజాలం ప్రభావం సాధారణ ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లపై తీవ్రంగా పడే ప్రమాదం నెలకొంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ఆన్లైన్ తరగతులంటూ ముందుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్లవైపు తల్లిదండ్రులు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ ప్రైవేటు స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లకు నష్టం జరగొచ్చు. అందుకే వాటిని కట్టడి చేయాలి. – యాదగిరి శేఖర్రావు, తెలంగాణ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
స్కూళ్లు ఫీజులు వసూలు చేసుకోవచ్చు!
చండీగఢ్: కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పలు నిబంధనలు సడలించిన కేంద్రం... విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మాత్రం తెరవకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా ఫీజులు వసూలు చేయరాదని, ఉద్యోగుల జీతాల్లో కోత విధించవద్దని నిబంధనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ స్కూల్ అసోసియేషన్ ఆఫ్ చండీగఢ్ తమ ఇబ్బందులను వివరిస్తూ దాఖలు చేసింది. పాఠశాలల యాజమాన్య హక్కులు కాపాడాలని.. అలాగే జీతాలు చెల్లించడంతో పాటుగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఫీజు వసూలు చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించింది.(మీడియాకు ముఖం చాటేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ) ఇక ఇందుకు స్పందించిన విద్యాశాఖ ప్రైవేటు స్కూళ్లు నెలవారీ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేసింది. అయితే ఏప్రిల్, మే నెలల ఫీజును మే 31 వరకు చెల్లించవచ్చని.. అయితే ఇందుకు ఎలాంటి పెనాల్టీలు విధించకూడదని స్పష్టం చేసింది. కాగా ఫీజు వసూళ్ల చెల్లింపు అంశంపై తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారోనన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వ నిర్ణయం సరికాదని.. ఫీజు విషయంలో మరింత గడువు ఇవ్వాలని పలువురు హితవు పలుకుతున్నారు. (బస్సుల గోల.. కాంగ్రెస్పై అదితి ఫైర్) -
వద్దంటే వింటారా... పిండుడు మానుతారా..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇప్పటివరకు ఆరో తరగతి చదివిన విద్యార్థి వార్షిక ఫీజు రూ.1,72,650. ఇప్పుడు అదే విద్యార్థి 7వ తరగతికి వచ్చాడు. అతనికి పాఠశాల యాజమాన్యం నిర్ణయించిన వార్షిక ఫీజు రూ. 2,20,170. ...అంటే అదనంగా 47,520 పెంచారు. దాదాపు 27%పెరిగిందన్నమాట. అదనంగా కన్వేయన్స్ చార్జీలు 50,400. లంచ్ చార్జీలు రూ. 32వేలు అంటూ.. సదరు యాజమాన్యం ఆన్లైన్లోనే తల్లిదండ్రులకు అప్డేట్ చేసింది. ఇక హైదరాబాద్ నగరంలోని మరో ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి విద్యార్థి ఫీజు రూ. 42 వేలు. ఆ విద్యార్థి 9వ తరగతికి వచ్చాడు. అతనికి నిర్ణయించిన ఫీజు రూ.47 వేలు. అంటే రూ.5 వేలు (10 శాతానికి పైగా) పెంచేశారు. ఇవే కాదు.. కార్పొరేట్ స్కూళ్లు కూడా 15 శాతం ఫీజు పెంచుతామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు ఫీజు దోపిడీకి ఏర్పాట్లు సన్నద్ధమయ్యాయి. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మానసికంగా సిద్ధం చేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఫీజులను పెంచవద్దని స్పష్టం చేసినా యాజమాన్యాలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. కరోనా నేపథ్యంలో స్కూల్ ఫీజులను పెంచడానికి వీల్లేదని, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే, అదీ నెలవారీగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టంగా చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా బేఖా తరు చేసి స్కూళ్లు తెరవగానే పెంచిన ఫీజులను దండుకునేందుకు సిద్ధం అయ్యాయి. రెండేళ్లుగా వద్దంటున్నా పట్టింపేదీ రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను పెంచవద్దని ప్రభు త్వం రెండేళ్లుగా చెబుతూనే ఉంది. ఫీజుల నియంత్రణ చర్యలపై మాజీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో ప్రభుత్వం 2017 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ 2018లో నివేదికను అందజేసింది. అందులో పాఠశాలలు ఏటా 10% వరకు ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు ఉండటంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. 2018–19లో పాఠశాలలు ఫీజులను పెంచవద్దని ప్రభుత్వం స్పష్టం చేసినా యాజమాన్యాలు వినిపించుకోలేదు. ఫీజుల నియంత్రణ నివేదిక ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందుకే 2019–20 విద్యా ఏడాదిలో ఫీజులను పెంచవద్దని అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో జారీ చేశారు. అయినా యాజమాన్యాలు తల్లిదండ్రులపై భారం మోపాయి. కొద్దిగా పేరున్న స్కూళ్లనుంచి టాప్ స్కూళ్లలో అధిక మొత్తం ఫీజులను పెంచేశాయి. దీనిపై హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్చంద్రన్కు ఫిర్యాదు చేశారు. సగం స్కూళ్లలో ఫీజు పెంపు రాష్ట్రంలో 10,549 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 31,21539 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ప్రైవేటు స్కూళ్లలో సగం వరకు సాధారణ పాఠశాలలు ఉండగా, మిగతా వాటిలో సగం వరకు మధ్య తరహా పాఠశాలలే. మిగతా వాటిల్లో టాప్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ పాఠశాలల్లో పెద్దగా ఫీజుల పెంపు అంశం రాకపోగా, మిగతా వాటిల్లోనే చాలావరకు పెంచుతూ యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకున్నాయి. పాఠశాల స్థాయిని బట్టి 10 శాతం నుంచి 28 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. ట్యూషన్ ఫీజులే కాదు ఇతరత్రా ఫీజులనూ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. -
స్కూళ్ల ఫీజులపై ఏపీ సర్కారు ఆదేశం
-
ఏపీ: స్కూల్ ఫీజు వసూలుపై కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిల్లోనూ పలు యాజమాన్యాలు మాత్రం ఫీజులు కట్టాలంటూ పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీ ఫీజులపై పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు పలు ఆదేశాలు జారీచేశారు. లాక్డౌన్ సమయంలో ఫీజులు కట్టాలని ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అది కూడా మొదటి త్రైమాసిక కాలం ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. మొదటి త్రైమాసిక ఫీజును కూడా రెండు విడతలుగా వసూలు చేయాలని చెప్పారు. రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పేరుతో ఎవ్వరికీ అడ్మిషన్లు తిరస్కరించకూడదని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
లాక్డౌన్లో ఫీ‘జులుం’!
సాక్షి, హైదరాబాద్ : ఓవైపు లాక్డౌన్.. మరోవైపు పనుల్లేక ఖాళీ.. ఇంట్లో నిత్యావసర సరుకుల కొనుగోలుకే కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. పైసా అప్పు పుట్టని ఈ పరిస్థితుల్లోనూ ఫీజులు అడుగుతుండటంతో పాఠశాలల యాజమాన్యాలపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆన్లైన్లో ఫీజులను చెల్లించాలంటూ పట్టణ ప్రాంతాల్లోని యాజమాన్యాలు మెసేజ్లు పంపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా అసలే ఇబ్బందులు పడుతుంటే స్కూల్ యాజమాన్యాల తీరు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. ఫీజు వసూలే టార్గెట్ రాష్ట్రంలో 10,546 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో కార్పొరేట్ స్కూళ్లు 800 వరకు ఉండగా మిగతా వాటిలో మరో 3వేల వరకు కాస్త పేరున్నవి. మిగతావి సాధారణ పాఠశాలలు. లాక్డౌన్ నేపథ్యంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు మార్కులతో నిమిత్తం లేకుండా విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే పూర్తయినట్టే. అయితే, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫీజులు మామూలుగా వార్షిక పరీక్షల సమయంలో చెల్లిస్తుంటారని, సరిగ్గా పరీక్షలకు ముందే లాక్డౌన్ ప్రకటించడంతో అవి వసూలుకాక ఇబ్బంది పడుతున్నామని ప్రైవేట్ విద్యాసంస్థలు అంటున్నాయి. ఫీజుల వసూలుతో నిమిత్తం లేకుండా టీచర్లకు వేతనాలిస్తున్నామని, ఇప్పుడు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఓ స్కూల్ కరస్పాండెంట్ చెప్పారు. కాగా, ఆయా తరగతులకు చెందిన క్లాస్ టీచర్లతో తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్యాలు ఫోన్లు చేయిస్తూ, ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తండ్రికి టీచర్ ఫోన్ చేయించడంతో అసలే పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫీజులు అడుగుతారా? అని ఆయన కొంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాగా, తరగతుల వారీగా ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులు వివరాలను టీచర్లకు అప్పగించి యాజమాన్యాలు టార్గెట్లను విధిస్తున్నాయి. ఫీజులు చెల్లించేలా చూస్తేనే పూర్తి వేతనం చెల్లిస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో టీచర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొన్ని యాజమాన్యాలైతే ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులకు మెస్సేజ్లు పంపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రైవేట్ పాఠశాలలు- 10,546 కార్పొరేట్, కాస్త పేరున్న స్కూళ్లు- 3,800 లాక్డౌన్లో అడ్మిషన్ల ప్రచార గోల అత్యవసర సేవలు తప్ప అన్ని రంగాలను ప్రభుత్వం మూసివేసినా కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయంటూ ప్రచారానికి దిగాయి. తమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని, తమ వద్ద చదివితే ర్యాంకులు వస్తాయని ప్రచారం చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ప్రచార వ్యవహారాలపై తల్లిదండ్రుల సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం చివరి టర్మ్ ఫీజు చెల్లింపును రద్దు చేసిందని, రాష్ట్రంలోనూ అటువంటి చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్చంద్రన్కు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రమాదకర యాప్లతో ఆన్లైన్ పాఠాలు ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లతోపాటు కాస్త పేరున్న స్కూళ్లు ఇప్పుడు ఆన్లైన్ తరగతులు కొనసాగిస్తున్నాయి. ఇంట్లో సరదాగా గడుపుతున్న 5వ తరగతి విద్యార్థులను కూడా ఆన్లైన్ పాఠాల పేరుతో కూర్చోబెడుతున్నాయి. ఇంట్లో ఉండి పాఠం విన్నా స్కూల్ యూనిఫాం ధరించాలని, విద్యార్థులు చదువుకునేటప్పుడు వీడియోతీసి పంపించాలని మెున్నటివరకు నిబంధనలు విధించాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆన్లైన్ పాఠాల నెపంతో ఫీజుల వసూలుపై పడ్డాయి. అవసరం లేకున్నా ఆన్లైన్ పాఠాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెక్యూరిటీపరంగా శ్రేయస్కరం కాని జూమ్ వంటి యాప్లను వినియోగించవద్దని కేంద్రం చెబుతున్నా అలాంటి యాప్లతో తరగతులను కొనసాగిస్తున్నాయి. వాట్సాప్లలో వర్క్షీట్స్ పంపించడం, ప్రశ్నలు ఇవ్వడం వంటి చర్యలతో తరగతులను కొనసాగిస్తున్న పాఠశాలలు జూమ్ ద్వారా తరగతుల వారీగా గ్రూప్లను ఏర్పాటుచేసి పాఠాలను బోధిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలవే ఫీజు ఆగడాలు ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సును పక్కనపెట్టి కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలే వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాంటి వ్యాపార సంస్థలను, వారి ఆగడాలను ఖండించాల్సిందే.–ప్రైవేటు యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు -
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు
-
ఏపీ : ప్రైవేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 130 పాఠశాలలను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, బోధించే వారి అర్హతలు, పాఠశాల భవనాలు తదితరాలను పరిశీలించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 24 పాఠశాలలలో తనిఖీలు చేపట్టి.. మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతపురం జిల్లాలోని ఏపీ పాఠశాల విద్య కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పలు ప్రైవేట్, కొర్పొరేట్ పాఠశాలలకు వెళ్లి మౌలిక సదుపాయాలు, ఫీజు వివరాలపై అధికారులు ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ పాఠశాల విద్యా కమిషన్ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 130 పాఠశాలలలో తనిఖీలు చేపట్టామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని, పదేపదే చేస్తే లైసెన్స్లను రద్దు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిబంధనలను మరింత పకడ్బంధీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వెట్టి చాకిరి సహించేది లేదని స్పష్టం చేశారు. తిరుపతి, ప్రకాశం, ఒంగోలు, టంగుటూరు, దర్శి, చీరాలలోని పలు ప్రైవేట్ పాఠశాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
స్కూల్ ఫీజు అడిగిందని కూతుర్ని..
సాక్షి, చండీగఢ్ : స్కూల్లో ఫీజు కట్టడానికి డబ్బులు అడిగిందని కన్న కూతురినే చంపేశాడో దుర్మార్గపు తండ్రి. ఈ దారుణ ఘటన హరియాణాలోని కురుక్షేత్ర సమీపంలోని దబ్ఖేరా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దబ్ఖేరా గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్, అతడి భార్య హర్జీందర్ కౌర్, ఆరేళ్ల కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. సింగ్ రోజువారి కూలిపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు స్కూల్ ఫీజుకు సంబంధించి అతడిని డబ్బులు అడిగిన ప్రతిసారీ విసుక్కునేవాడు. ఈ క్రమంలో తాజాగా కుమార్తె స్కూల్ ఫీజుకు సంబంధించి గొడవ జరిగింది. దీంతో ఏకంగా కూతుర్ని గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మీరు నడిపేది బ్యాంకా.. స్కూలా..?
సాక్షి, ధర్మవరం: పాఠశాల అంటే వివేకానందుని సూక్తులో.. గాంధీజీ చెప్పిన మాటలో గోడలపై రాస్తారు.. మేము క్యాష్తోపాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా అంగీకరిస్తామని బోర్డులు పెడతారా.. ఏందిది..? మీరు నడుపుతుండేది స్కూలా..? లేక బ్యాంకా..? అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలల ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన ధర్మవరంలోని రవీంద్రభారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు వెళ్లారు. క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయురాలి గదిలో ఫీజులు క్యాష్లెస్ ద్వారా తీసుకుంటామన్న బోర్డును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే పరమావధిలా మీ పాఠశాల పనిచేస్తుందనడానికి ఈ బోర్డు ఒక్కటే చాలంటూ మండిపడ్డారు. తల్లిదండ్రుల బలహీనతను ఆసారా చేసుకుని దందా నడుపుతారా అంటూ నిప్పులు చెరిగారు. -
చదువు ‘కొనా’ల్సిందే
విద్య వ్యాపారంగా మారడంతో ప్రైవేటు స్కూళ్లల్లో చదివించాలంటేనే బెంబేలెత్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం పిల్లలకు పుస్తకాల భారంతో తల్లిదండ్రులకు ఫీజుల బరువును తీసుకువచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని ‘క్యాష్’ చేసుకోనేందుకు ప్రైవేట్ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. టెక్నో, డిజి, ప్రైమ్, స్పేస్, ఐఐటీ, ఒలింపియాడ్, ఈ–టెక్నో, ఆక్స్ఫర్డ్... తదితర పేర్లతో ఆకర్షిస్తున్నాయి. తమ పిల్లలకు ఉత్తమ భవిష్యత్తునివ్వాలన్న ఏకైక ఆశతో ఉన్న తల్లిదండ్రుల బలహీనతే ప్రైవేట్ విద్యాసంస్థలకు వరంగా మారుతోంది. దీన్ని ఆసరా చేసుకుని వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సాక్షి, నిర్మల్: శ్రీనివాస్.. ఓ మధ్యతరగతి తండ్రి. తనకున్న చిన్నపాటి వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన రెండేళ్ల పాపను మంచి స్కూళ్లో చదివించాలని ముందుగా ఓ పేరున్న స్కూల్లో ఫీజులు, పుస్తకాలు, వాతావరణం, విద్య.. ఎలా ఉందో తెలుసుకునేందుకు వెళ్లాడు. అక్కడ వాతావరణం చూస్తే బాగానే ఉంది. కానీ ఫీజుల విషయానికి వచ్చేసరికి శ్రీనివాస్కు దిమ్మతిరిగినంత పనైంది. తన ముందున్న మేడమ్ ఫీజుల వివరాలు, పుస్తకాలు, యూనిఫాం ధరలు చెబుతుంటే నోరెళ్లబెట్టాడు. ‘మేడమ్ నాపాప రెండో తరగతి..’ అని చెబుతున్నంతలోనే ఆమె ‘ఎస్ సర్.. నేను చెప్పేది రెండో తరగతికే.. అంతా కలిపి రూ.35వేలు అవుతాయి..’ అని కరాఖండిగా చెప్పేసింది. శ్రీనివాస్ నోట మరో మాట రాలేదు. లేచి అలాగే.. బయటకు వచ్చేశాడు. ఓవైపు తన బిడ్డ భవిష్యత్తు.. అలాగని అంతంత ఫీజులు కట్టలేని పరిస్థితి. చివరకు చేసేది లేక.. తమ వద్ద ఉన్న రూ.20వేలకు మరో రూ.15వేలు అప్పు తీసుకుని బిడ్డను చదివించేందుకు సిద్ధమయ్యాడు.ఇలా ఈ ఒక్క శ్రీనివాస్కే కాదు. ఇవ్వాళ్ల చాలామంది పేద,మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. పుట్టుకొస్తున్న ప్రైవేట్ స్కూళ్లు... ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత కలిపి గత ఏడాది వరకు మొత్తం 196 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 50వేలకుపైగానే విద్యార్థులు చదువుతున్నారు. పలు మండలాలు, గ్రామాల్లో గుర్తింపు లేని పాఠశాలల సంఖ్య ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వం పేర్కొంటున్న కనీస నిబంధనలనూ పాటించని స్కూళ్లే అధికం. మైదానం లేని పాఠశాలలు సంఖ్య 100కుపైనే ఉంటుంది. ఇక ఈఏడాది మరిన్ని ప్రైవేటు స్కూళ్లు ఏర్పడ్డాయి. గల్లీకో స్కూల్ చొప్పున కొత్తగా ప్రైవేటు బడులు వెలుస్తూనే ఉన్నాయి. భారీగా ఫీజులు... ఓ వైపు కోర్టులు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేపట్టాలంటూ సూచనలు చేసినా సర్కారు పట్టించుకోవడం లేదు. ఇదే ప్రైవేటు విద్యాసంస్థలకు అవకాశంగా మారుతోంది. నర్సరీ చదువులకే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ.30వేల నుంచి సుమారు రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అదే 6వ గరతి నుంచి 10వ తరగతి వరకు రూ.40వేల నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నారు. పరీక్ష ఫీజు, స్పెషల్ ఫీజు, బస్ ఫీజు వీటికి అదనం. అంతేకాకుండా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, టై, బెల్టు, బ్యాడ్జీ తదితర వస్తువులన్నీ సంబంధిత పాఠశాలనే విక్రయిస్తోంది. లేదంటే తమకు చెందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలని హుకూం జారీ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఉన్న ధరలకంటే పాఠశాలల్లో వీటి ధర అధికంగా ఉంటోంది. అయినా అడిగేవారు లేకపోవడంతో దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ లెక్కన ఏడాదికి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో విద్యావ్యాపారం దాదాపు రూ.100కోట్ల వరకు సాగుతోందని అంచనా. చెక్కులు వద్దంటున్నారు... కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ లావాదేవీలను కఠినతరం చేయడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించే సమయంలో చాలా స్కూళ్లల్లో నగదు మాత్రమే తీసుకురావాలని సూచిస్తున్నారు. చెక్కులు అయితే ప్రతీ లావాదేవీ అకౌంటబుల్ అవుతుంది. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. వీలున్నంతవరకు నగదు రూపంలో ఫీజులు చెల్లించాలని, లేని పక్షంలో ఏటీఎం కార్డుల ద్వారా కట్టాలని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే చెక్కులు తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లేకపోవడంతో తల్లిదండ్రులు చెక్కులు ఇవ్వడానికే ఆసక్తిచూపుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఉత్తర్వులు బేఖాతరు... ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టం నిబంధనలను ప్రైవేట్ స్కూళ్లు తుంగలో తొక్కుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం నిబంధనల అమలును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పాటించని నిబంధనలు.. జిల్లాలో ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయలేదు. ♦ ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల ముచ్చటే లేదు. ♦ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూ నిఫాం తదితరాలను విక్రయించొద్దని నిబం ధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ♦ పాఠశాల ఫీజులతో పాటు పరీక్షల ఫీజులను నోటీసు బోర్డులపై పెట్టడం లేదు. ♦ పాఠశాలల పేర్ల వెనుక డీజీ, టెక్నో, టాలెంట్, ప్రైమ్, స్పేస్ తదితర తోక పేర్లు రాయకూడదు. వీటిని పెద్దగా పట్టించుకోడం లేదు. ♦ విద్యాహక్కు చట్టం నిబంధనలతో పాటు ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదు. -
ప్లాస్టిక్ వ్యర్థాలే స్కూలు ఫీజు
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు అస్సాం దిస్పూర్లోని అక్షర్ ఫోరం స్కూలు వినూత్న పథకాన్ని ప్రారంభించింది. తమ స్కూలు విద్యార్థులు ఫీజుకు బదులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి విద్యార్థి ప్రతీవారం కనీసం 20 పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు తెచ్చివ్వాలని, అలా తెస్తే వారికి ఉచితంగా చదువు చెప్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు తమ ఇళ్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చి స్కూల్లో ఇస్తున్నారు. కిందటేడాది వరకు ఈ స్కూల్లో ఉచితంగానే చదువు చెప్పేవారు. అయితే, ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు తెస్తేనే ఉచితంగా చదువు చెబుతామని స్కూలు యాజమాన్యం స్పష్టం చేసింది. పిల్లల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిలింగ్ చేసి ఉపయోగిస్తున్నట్టు స్కూలు యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల చేత ప్లాస్టిక్ సీసాల్లో ప్లాస్టిక్ కవర్లను నింపిస్తున్నారు. దాంతో అవి పర్యావరణానుకూల ఇటుకలుగా(ఎకో బ్రిక్స్) తయారవుతున్నాయి. ఇలా చేసినందుకు విద్యార్థులకు కొంత సొమ్ము కూడా చెల్లిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ ఇటుకలతో స్కూలు భవనాలు, మరుగుదొడ్లు, ఫుట్పాత్లు నిర్మిస్తున్నారు. -
అమ్మో..జూన్!
ఆదిలాబాద్టౌన్ : పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు సర్వస్వం ధారపోస్తున్నారు. ఎంత ఖర్చయినా తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో నిలపాలని ఆశిస్తున్నారు. వారి ఆశలను కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యజమాన్యాలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. వేలాది రూపాయల ఫీజుల పేరిట వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఐటీ, ఈటెక్నో, డీజీ, మోడల్, కాన్సెప్ట్, గ్రామర్ అంటూ కొత్తకొత్త పేర్లు స్కూళ్లకు తగిలించి ఫీజులు, డొనేషన్ల పేరిట అందినంతా దండుకుంటున్నారు. ఫలితంగా పాఠశాల విద్య పోషకులకు భారంగా మారుతోంది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో అందరిలో ఫీజుల భయం మొదలైంది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం 16 సంవత్సరాల క్రితం జారీ చేసిన జీఓ నంబర్ 1 అటకెక్కింది. జీఓ అమలుకు ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ కమిటీలు యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నాయి. కమిటీలో అనుకూలమైన పేరెంట్స్ను సభ్యులుగా నియమించుకుని ఫీ‘జులుం’ చేస్తున్న పాఠశాలలే అత్యధికం. ఫీ‘జులుం’.. పదేళ్ల క్రితం జిల్లాలో ఒకటి, రెండు మాత్రమే కార్పొరేట్ విద్యాసంస్థలు ఉండగా ప్రస్తుతం వీధికొకటి వెలిశాయి. జిల్లా కేంద్రంలో కార్పొరేట్ పాఠశాలలు ఎల్కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.21 వేలు వసూలు చేస్తుండటం గమనార్హం. పుస్తకాలు, యూనిఫాం, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అదనంగా మరో రూ.10వేలు ఖర్చు అవుతోంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్కూల్ అండ్ హాస్టల్కు రూ.45వేల నుంచి రూ.60వేల వరకు ముట్టజెప్పాల్సిందే. వీటితోపాటు పుస్తకాలు, ఇతర ఖర్చులకు రూ.20వేలు అదనం. స్థానికంగా పేరుగాంచిన పాఠశాలల్లో ఫీజుల వివరాలు వింటే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఐఐటీ, ఈటెక్నో, డీజీ, మోడల్, కాన్సెప్ట్, గ్రామర్ డిజిటల్ అంటూ కొత్తకొత్త పేర్లు తగిలించి వేలాది రూపాయలు గుంజుతున్నారు. ఇక అడ్మిషన్ ఫీజు పేరిట యథేచ్ఛగా డొనేషన్లు వసూలు చేస్తున్నారు. వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. తరగతి ఆధారంగా అడ్మిషన్ ఫీజు రూ.4వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేçస్తున్నారు. వాస్తవానికి ఈ ఫీజు అంశాన్ని పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశంలో చర్చించి కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనిని డీఈఓ దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసుకోవాలనే నిబంధన ఉంది. కానీ ఎక్కడా ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో 90శాతం పాఠశాలలకు మైదానాలు, పార్కింగ్ స్థలాలు లేవనేది అధికారులకు తెలియనిది కాదు. కనీస వసతులైన తాగునీరు, విద్యార్థులకు తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలోనూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అర్హులైన బీఈడీ, డీఎడ్ చదివిన ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నా.. చాలా పాఠశాలల్లో వీరి జాడ లేదు. అర్హతలు లేనివారితో బోధన చేయించి తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది.. ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు. అర్హత కలిగిన టీచర్లతో విద్యాబోధన చేపట్టాలి. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ (ప్రైవేట్ పాఠశాలలు) పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలి. అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం, బడి నుంచి తీసేయడం నిషేధం. బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలి. సర్కారు బడుల్లో చేర్పించండి తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్పించాలి. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. – రవీందర్రెడ్డి, డీఈవో -
అక్షరాలా అక్కడ ఫీజు లేదు
ప్రైవేట్ పాఠశాల అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఫీజులు. చదువు సంగతి ఎలా ఉన్నా.. ఫీజుల వసూళ్లలో మాత్రం పక్కాగా ఉంటాయి. అయితే అసోంలోని ఓ పాఠశాల మాత్రం విద్యార్థుల దగ్గర స్కూల్ ఫీజులను తీసుకోవడం లేదు. అందుకు బదులుగా కాసిన్ని ప్టాస్టిక్ వ్యర్థాలను ఇస్తే చాలని చెబుతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా... ఇది మాత్రం నిజం. అసోంలోని పమోహీలోగల ‘అక్షర ’ పాఠశాల పేరుకు ప్రైవేటు పాఠశాల అయినప్పటికీ ఇక్కడ ఫీజు వసూలు చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఈ పాఠశాలలో ఫీజు కట్టాలంటే నోట్ల కట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే సరి. ఫీజు కట్టినట్లు రసీదు ఇచ్చేస్తారు. పాఠాలు మాత్రం చక్కగానే చెబుతారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఫీజుగా తీసుకొని పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారని అనుమానం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం... పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన విద్యాలయమిది.ఈశాన్య రాష్ట్రమైన అసోంలో చలి ఎక్కువ. దీంతో చలిమంటల కోసం అక్కడి ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలనే ఉపయోగిస్తారు. నిజానికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఇలా బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విషవాయువులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్పభ్రావాన్ని చూపుతున్నాయి. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మిత శర్మకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే న్యూయార్క్లో ఓ స్కూల్ ప్రాజెక్టు చేస్తున్న మజిన్తో తన ఆలోచనను పంచుకుంది. టీఐఎస్ఎస్ (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్)లో మాస్టర్స్ డిగ్రీ చేసిన పర్మిత... అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర’ విద్యాలయం. సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యాశిక్షణకు మధ్య ఉన్న దూరానికి వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. అక్కడి పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేసేవారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా ఉపాధి పొందే విద్యాబోధనతో ‘అక్షర’ పాఠశాలను ఏర్పాటు చేశారు. డబ్బుకు ప్రత్యామ్నాయం... దగ్గరే ఉన్న షాపులో స్నాక్స్, బొమ్మలు, చాకొలెట్లు వంటివి కొనుక్కోడానికి టాయ్ కరెన్సీని వాడే వీలు కల్పించారు. ‘విద్యార్థులు తమ సేకరణలతో ఆన్లైన్లో వస్తువులు కొనేందుకు మా వద్దకు వస్తారు. మేం వారి కలెక్షన్స్ను తీసుకొని, డబ్బు చెల్లించి, అమెజాన్లో వారికి ఆ వస్తువులను కొనిపెడతాం. అంతేకాదు.. ప్లాస్టిక్ను కాల్చడం వల్ల కలిగే ముప్పు గురించి పిల్లల ద్వారానే తల్లిదండ్రుల్లో అవగాహన కలిగించాం. అందులో భాగంగా వ్యర్థాల రీసైకిలింగ్ డ్రైవ్ చేపట్టాం. మా వద్ద పోగయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రకరకాల నిర్మాణ సామగ్రి తయారీని కూడా చేపట్టాం’’ అంటున్నారు పర్మిత. దేశవ్యాప్తంగా అక్షర లాంటి స్కూళ్లను ఓ వంద వరకు ఏర్పాటు చేయాలన్న మజిన్, పర్మితల ఆశయం నెరవేరాలని ఆశిద్దాం. – లక్ష్మీలావణ్య ఆర్. సాక్షి స్కూల్ ఎడిషన్ -
తండ్రి మనసు
ఓ రోజు స్కూలు ప్యూను ఒక లిస్టు పట్టుకుని పేర్లు చదువుతున్నాడు. ఆ పేర్లు గల వాళ్లంతా వచ్చి అతడి ఎదురుగా నిలబడుతున్నారు. అలా ఏకంగా 45 మంది అమ్మాయిలు దీనంగా నిలబడ్డారు. కర్నాటక రాష్ట్రం, కల్బుర్గి జిల్లా, మక్తంపురాలో ఓ తండ్రి. పేరు బసవరాజ్, గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్కు. కూతురు ధానేశ్వరి అంటే తండ్రికి పంచప్రాణాలు. మక్తంపురాలో ఉన్న హైస్కూల్లో చదువుతోంది. గత ఏడాది ఊహించని అనారోగ్యం ఆమెను ఉన్న పళంగా తీసుకుపోయింది. గుండె బద్దలయ్యేలా ఏడ్చినా పోయిన కూతురు రాదని తెలుసు. కానీ కన్నీళ్లకు ఆ సంగతి తెలియదు. బసవరాజ్ ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ కూతురు చదివిన స్కూలు బాట పట్టాడు. అదే స్కూలు ఆవరణ నిండా తన కూతురు వయసు పిల్లలు గుంపులు గుంపులుగా కనిపించారు. అంతమందిలో తన కూతురు లేదన్న బాధతో.. వాళ్లలో తన కూతుర్ని చూసుకున్నాడు. నెలలు గడుస్తున్నాయి. రోజూ సాయంత్రం ఓ గంట సేపు స్కూలు దగ్గరకొచ్చి.. గ్రౌండ్లో ఆడుతున్న, చెట్టు కింద కూర్చుని చదువుకుంటున్న అమ్మాయిలను చూస్తూ ఉండేవాడు. ధానేశ్వరి వాళ్లందరిలో కనిపించేదతడికి. ఓ రోజు స్కూలు ప్యూను ఒక లిస్టు పట్టుకుని పేర్లు చదువుతున్నాడు. ఆ పేర్లు గల వాళ్లంతా వచ్చి అతడి ఎదురుగా నిలబడుతున్నారు. అలా ఏకంగా 45 మంది అమ్మాయిలు దీనంగా నిలబడ్డారు. ‘వారం రోజుల్లోగా ఫీజు కట్టాలని’ ప్యూను చెప్తున్నాడు. కట్టక పోతే స్కూలుకు రాకూడదని కూడా హెచ్చరిస్తున్నాడు. చాలా మంది అమ్మాయిలకు వాళ్ల ఇంటి పరిస్థితి కళ్ల ముందు మెదిలింది. గవర్నమెంట్ స్కూల్లో ఫీజు నామమాత్రంగానే ఉంటుంది. ఆ కొద్దిపాటి ఫీజు కట్టడం కూడా కష్టమైన కుటుంబాల పిల్లలు వాళ్లంతా. అది చూసిన బసవరాజ్కు గుండె బరువెక్కింది. ధానేశ్వరే దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. దాంతో అతడు హెడ్మాస్టరు దగ్గరకు వెళ్లి ‘‘వాళ్లందరి ఫీజు నేనే కడతాను, ఈ ఒక్క ఏడాదికే కాదు, ఏటా కడతాను. ఈ స్కూల్లో చదువుతున్న ఏ ఆడపిల్లకూ ఫీజు కట్టలేని కారణంగా చదువు మానేయాల్సిన దయనీయమైన స్థితి రాకూడదు’’ అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే హెడ్ మాస్టరు సంతోషంగా చూశాడు. వెంటనే... ‘ఇతడేదో ఎమోషన్లో అంటున్నాడు కానీ నిజంగా ఫీజు కడతాడా’ అనే సందేహం కూడా కలిగిందతడికి. ఈ సందేహాలేవీ అవసరం లేదని ఆ మరుసటి రోజే తెలిసింది. ఎందుకంటే... బసవరాజు పదివేల రూపాయలు స్కూలు అకౌంట్లో జమ చేసి, ‘ఫీజు కట్టలేని ఆడపిల్లలందరి ఫీజులూ కట్టేయండి. ఇలా ఏటా మీకు ధానేశ్వరి పేరుతో డబ్బు అందుతుంది’ అని చెప్పాడు. ‘‘ఆర్థిక కారణాలతో అర్ధంతరంగా చదువు మానేస్తున్న వాళ్లు ఈ స్కూలు నుంచి ఏటా చాలా మందే ఉంటున్నారు.బాగా చదివే పిల్లలు ఇలా బడి మానేస్తుంటే బాధనిపిస్తుంది. బసవరాజ్ తీసుకున్న నిర్ణయంతో చాలామంది జీవితాలలో చదువుల వెలుగులు పూస్తాయి’’ అని టీచర్లందరూ సంతోషిస్తున్నారు. – మంజీర -
ఆధార్ లేదని ప్రవేశాలు నిరాకరించొద్దు
న్యూఢిల్లీ: ఆధార్ లేదన్న కారణంతో విద్యార్థులకు పాఠశాలల ప్రవేశాలను నిరాకరించరాదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కావని పేర్కొంది. ఆధార్ లేనందుకు కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలేదన్న ఆరోపణలు తన దృష్టికి రావడంతో యూఐడీఏఐ స్పందించింది. విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలు, హక్కులను ఆధార్ను కారణంగా చూపుతూ దూరం చేయకూడదని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఇప్పటి వరకూ ఆధార్ పొందని, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోని విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాల ను నిర్వహించే బాధ్యత సంబంధిత పాఠశాలలదే అని స్పష్టం చేసింది. స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా అధికారులు, రాష్ట్ర విద్యా శాఖ సమన్వయంతో పాఠశాలలే అలాంటి విద్యార్థుల కోసం ఆధార్ నమోదు, అప్డేట్ శిబిరాలు నిర్వహించాలని సూచించింది. ఏటా కనీసం రెండు సార్లు అన్ని పాఠశాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.విద్యార్థులు ఆధార్ పొందే వరకు, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునే వరకు ప్రత్యామ్నాయ గుర్తిం పు మార్గాలను అనుమతించాలంది. 5–15 ఏళ్లు నిండిన చిన్నారుల ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరని పేర్కొంది. -
అధికారంలోకి రాగానే స్కూళ్లు కాలేజీల ఫీజులు తగ్గిస్తాం
-
ప్రాణం తీసిన పిల్లల స్కూల్ ఫీజు !..
చల్లగుండ్ల(నకరికల్లు) : పిల్లల స్కూల్ ఫీజు దగ్గర జరిగిన ఘర్షణలో ఓ వివాహిత భర్త ధాష్టీకానికి బలైపోయింది. ఈ దుర్ఘటన మండలంలోని చల్లగుండ్లలో బుధవారం చోటు చేసుంది. మాచర్ల మండలం గన్నవరానికి చెందిన పల్లా వెంకటనర్సమ్మ(29)కు, నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన పల్లా నాగరాజుతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. నర్సమ్మ నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో నర్స్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ముగ్గురు పిల్లలున్నారు. నాగరాజు మద్యానికి బానిస కావడంతో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. బుధవారం పిల్లల స్కూల్ ఫీజు కట్టేందుకు భర్తకు డబ్బులివ్వగా మొత్తం కట్టకుండా అందులో కొంత నగదుతో మద్యం తాగాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఈ గొడవలో నాగరాజు భార్యను తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందింది. విషయం తెలుసుకొని మృతురాలి బంధువులు పెద్దసంఖ్యలో చల్లగుండ్లకు చేరుకున్నారు. తల్లి పట్టెం రోశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బి.ప్రభాకర్, ఎస్ఐ జి.అనిల్కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఘటనకు దారితీసిన కారణాలు వాకబు చేశారు. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఫీ జులూం ఇంకెన్నాళ్లు ?
-
ఫీ'జులుం' భరించలేం
ఓ కార్పొరేట్ స్కూల్ అయితే పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు కూడా వారి దగ్గరే కొనాలంటోంది.బయట మార్కెట్లో రూ.800 ఉన్న బ్యాగ్కు స్కూల్ లోగో తగిలించి ఏకంగా రూ.2,000కి అమ్ముతున్నారు. పుస్తకాల ధరలు అయితే మరీ దారుణం. అన్యాయంగా దోచుకుంటున్నారని తెలిసినా సరే.. చదువుకున్న వారు సైతం పిల్లల కోసం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు. ‘రాజధాని అమరావతిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో మా అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తే రూ.2,000 పెంచారు. మరో రూ.4,000 కడితే చిప్తో కూడిన పాఠాల సిలబస్ ఇస్తామన్నారు. దీని ద్వారా రోజూ చదవాల్సిన పాఠాలు, టెస్టులతో ఎప్పటికప్పుడు ఫెర్ఫామెన్స్ను మీకు తెలియజేస్తామన్నారు. అయితే.. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇస్తారా అని అడిగితే అలాగేమీ ఉండదన్నారు. అయితే, చిప్ అక్కర్లేదు అని చెప్పి వచ్చేశాను. తీరా చూస్తే మా అబ్బాయిని ఏ1 గ్రూపు నుంచి ఏ4 గ్రూపులోకి మార్చారు. మర్నాడు స్కూల్కి వెళ్లి గ్రూపు ఎందుకు మార్చారు అని అడిగితే చిప్ తీసుకున్న వాళ్లని ఏ1, ఏ2 గ్రూపుల్లో.. చిప్ తీసుకోని వాళ్లని ఏ3, ఏ4ల్లోకి మార్చామన్నారు. మా అబ్బాయి మానసికంగా ఎక్కడ కుంగిపోతాడోనన్న ఉద్దేశంతో.. వాళ్లతో వాదించలేక రూ.4,000 కట్టి వచ్చేశాను.’ – కార్పొరేట్ స్కూళ్లలో పరిస్థితిపై ఇదీ ఓ విద్యార్థి తండ్రి ఆవేదన సాక్షి, అమరావతి : ఏటా ఏదో ఒక పేరు చెప్పి వేలకు వేలు ఫీజులు పెంచేసి.. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నారు. టెన్త్లోపు పిల్లలకు ఏటా ఏదో రూపంలో రూ.2,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేసి పిండేస్తున్నారు. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూళ్లలో అయితే ఈ మొత్తం రూ.5,000 పైనే దాటుతోంది. ఇంటర్కు వచ్చేసరికి ఈ దోపిడీ మరీ దారుణంగా ఉంటోంది. ఏటా కనీసం రూ.10,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. డే స్కాలర్గా అయితే ఏడాదికి సుమారు లక్ష రూపాయలు అవుతుంటే అదే హాస్టల్లో ఉండి చదివిస్తే రూ.2.25 లక్షలు తక్కువ కావడంలేదని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఏటా ఫీజులు పెంచేస్తుండడంతో తల్లిదండ్రులు బడ్జెట్ సమకూర్చుకోలేక అప్పుల పాలవుతున్నారు. మరీ ఇంత దారుణమా? ఈ ఒక్క ఏడాదిలోనే ఇంటర్, స్కూల్ విద్యార్ధుల తల్లిదండ్రులు రూ.5,068 కోట్లు అదనంగా చెల్లించారంటే నమ్ముతారా? ఈ ఏడాది పెరిగిన ఫీజులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే టెన్త్లోపు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా వ్యయం సగటున 18 శాతం పెరిగితే ఇంటర్ విద్యార్థులకు 27 శాతం వరకు పెరిగింది. ఫీజులతో పాటు ఈ ఏడాది పుస్తకాలు, రవాణా వ్యయం, యూనిఫాం, బూట్లు వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే వారికి ఫీజుల పెంపు లేకపోయినా పెరిగిన పుస్తకాలు, రవాణా, యూనిఫాం వంటి వాటివల్ల వారికి కూడా అదనపు ఖర్చులు తప్పడంలేదు. పాఠశాలల్లో.. ప్రతీ పాఠశాలలో గత ఏడాది ఫీజులు సగటున రూ.30,000 వరకు ఉండగా ఈ ఏడాది రూ.35,000 వరకు పెరిగాయి. అలాగే, పుస్తకాల వ్యయం రూ.3,200 నుంచి రూ.4,000 వరకు చేరుకున్నాయి. యూనిఫాం (మూడు జతలు) రూ.1,800 నుంచి రూ.2,750, బూట్లు (రెండు జతలు) రూ.3,000 నుంచి రూ.4,000కు పెరిగాయి. ఇక రవాణా, బ్యాగులు వంటి ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే గతేడాది కంటే రెట్టింపయ్యాయి. ఈ విధంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో విద్యార్థిపై సగటున రూ.7,350 వరకు భారం పెరిగింది. అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.2,350 వరకు ఖర్చు పెరిగినట్లు అంచనా. స్కూల్ విద్యార్థులపై పెరిగిన భారం రూ.3,167కోట్లు పైనే 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 69,61,058 మంది విద్యార్ధులు స్కూళ్లలో చదువుతున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30.62 లక్షల మంది చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 38.98 లక్షల మంది చదువుతున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది రూ.2,251.20 కోట్లు భారం పడినట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న వారికి రూ.916.2 కోట్లు అదనపు భారమైంది. ఈ విధంగా చూస్తే మొత్తం రూ.3,167.4 కోట్లు తక్కువ కాకుండా భారం పెరిగిందని లెక్కగా తేలింది. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూల్స్లో ఉన్న ఫీజులను లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం పెరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాలేజీల్లో... ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం ఇలా ఉంటే.. కార్పొరేట్ కాలేజీల తీరు మరోలా ఉంది. ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఆన్లైన్ టెస్టుల పేరుతో ఫీజులు గుంజడం ఎక్కువైందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సామాన్య స్థాయి పైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫీజులు గతేడాది పోలిస్తే సగటున రూ. 55,000 నుంచి రూ.65,000కు పెరిగాయి. అలాగే పుస్తకాలు, రవాణా, బ్యాగ్లు వంటి ఇతర ఖర్చులు తీసుకుంటే రూ.24,800 నుంచి రూ.36,200 పెరిగాయి. 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య 10,05,958గా ఉంది. ఇందులో ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు సుమారుగా 7,54,530 గా ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 2,51,428 చదువుతున్నారు. ఇలా పెరిగిన ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది సుమారు రూ.285 కోట్ల అదనపు భారం పడితే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు రూ.1,900.7 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది కేవలం డేస్కాలర్స్ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తేనే ఇలా ఉందని, అదే రెసిడెన్షియల్ విద్యార్థుల భారాన్ని కూడా తీసుకుంటే ఈ మొత్తం మూడు రెట్లు అవుతుందంటున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఇలా వేల రూ. కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థపై నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
'పే' స్కూల్స్..!
సాక్షి, అమరావతి : ‘నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో పిల్లలకు చిన్నప్పుడే నేర్పాలి. ప్లే స్కూల్లో వెయ్యాలి. పిల్లల బుర్రలు ఐదేళ్లలోపు చురుగ్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్లకు బాగా నేర్పిస్తే తర్వాత చదువుల్లో బాగా ఎదుగుతారు’.. అంటోంది లలితమ్మ. నాలుగిళ్లల్లో పనిచేస్తేనే ఆమె కుటుంబం గడుస్తుంది. ఆయినప్పటికీ అప్పుచేసి మరీ తన కొడుకును ప్లే స్కూల్లో చేర్పించింది. ‘నా కూతురి ప్లే స్కూలుకు చెల్లించిన ఫీజు నేను ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు చెల్లించిన ఫీజుకు రెట్టింపుగా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా నా బిడ్డ ఎదగాలనే కోరికతో అప్పుచేసి మరీ చేర్పించా’నంటున్నారు విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీరామ్. ..ప్లేస్కూళ్ల యజమానులు సాగించే ప్రచారం ఏ స్థాయిలో ఉందో.. కిందిస్థాయి వర్గాలను సైతం అది ఏ విధంగా ప్రభావితం చేస్తోందో గ్రహించడానికి ఇదో ఉదాహరణ. ప్రధానంగా పై తరహా ఆలోచన విధానమే ప్లే స్కూళ్ల మార్కెట్ ఏటా 32 శాతం వృద్ధితో దూసుకుపోయేందుకు కారణమవుతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లో పిల్లల బాగోగుల గురించి పట్టించుకునే వారే లేకపోవడం.. పిల్లల భవిష్యత్తు గురించి పెద్దలు భారీగా కలలు కనడం, పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనుకబడిపోతారేమోనని భావిస్తుండటం వంటి అంశాలు.. ప్లే స్కూళ్ల విస్తరణకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగడం వంటివి కూడా ప్లే స్కూల్ మార్కెట్ పెరగడానికి దోహదం చేస్తున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలకు 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిస్తామంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న భారీ ప్రచారం కూడా పెద్దల్ని కొంతమేర ప్రభావితం చేస్తోంది. అయితే, పెద్దలు ఈ తరహా ప్రచారంలో కొట్టుకుపోరాదంటున్నారు హైదరాబాద్కు చెందిన చైల్డ్ సైకాలజిస్ట్ సి.వీరేందర్. ‘హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని భవిష్యత్తు పేరుతో ఒత్తిడికి గురిచేయొద్దు. వాళ్లను కుటుంబంతో, తాతయ్య అమ్మమ్మలతో గడపనివ్వండి’ అని సలహా ఇస్తున్నారు. వేల నుంచి లక్షల్లో ఫీజులు.. నిన్నమొన్నటి వరకు కేవలం నగరాలకే పరిమితమైన ప్లే స్కూళ్ల సంస్కృతి ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించింది. ‘సాక్షి’ పరిశీలన ప్రకారం.. నగరాల్లో పేరున్న స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. విశాఖ, తిరుపతిలోని ప్లే స్కూళ్లలో లక్ష, లక్షన్నర రూపాయల ఫీజు కడితేనే సీటు. విజయవాడలో సీటు కావాలంటే పాతిక వేల నుంచి లక్ష వరకూ చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలోని టాప్ ప్లే స్కూళ్లు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు కట్టించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు కలిగిన కంగారు, యూరో కిడ్స్, బచ్పన్, కిడ్జస్ వంటి సంస్థలు నగరాన్ని బట్టి ఫీజుల్ని నిర్దేశిస్తున్నాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన అనంతరం.. విజయవాడలో ఏర్పాటుచేసిన ప్లే స్కూళ్లల్లో ఆశించిన రీతిలో పిల్లలు చేరలేదు. సచివాలయం వచ్చినప్పటికీ, చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాల్ని ఇక్కడకు తీసుకురాకపోవడంతో అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగడం లేదంటున్నారు విజయవాడలోని బచ్పన్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు కాళేశ్వరరావు. ఒంటరిగా ఉంచలేక.. ఐదేళ్లు వచ్చే వరకు మా అబ్బాయిని బడికి పంపకూడదనుకున్నాం. కానీ, ఇంతలో తిరుపతికి బదిలీ అయ్యింది. మూడు గదుల ఇంటిలో నేనూ, మా వారూ, బాబు మాత్రమే ఉంటున్నాం. అదే మా ఊళ్లో అయితే ఆడుకోవడానికి విశాలమైన స్థలం ఉంటుంది. ఇక్కడ బయటకు వెళ్లే అవకాశమే లేదు. అందుకే ఇష్టం లేకపోయినా ప్లే స్కూల్కు పంపుతున్నాను. – బి.వీణ, తిరుపతి పిల్లలతో కలసి ఉంటారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరమూ ఉద్యోగానికి వెళ్తేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. పిల్లాణ్ణి ఇంటి దగ్గరుంచితే వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్ వదలడు. ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఎవరూ అందుబాటులో లేరు. అందుకే ప్లే స్కూలుకి పంపుతున్నాం. అక్కడ ఉల్లాసంగా గడిచిపోతుంది. పైగా నాలెడ్జ్ కూడా అందుతుంది. – మాధురి, తల్లి, విశాఖపట్నం నిరుడు ఇద్దరే.. ఇప్పుడు 45 మంది ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్లే స్కూల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అందుకు మా స్కూలే ఉదాహరణ. ఏడాది కిందట ఇద్దరు పిల్లలతో స్కూల్ ప్రారంభించాం. ఇప్పుడు పిల్లల సంఖ్య 45కి చేరింది. ప్లే స్కూల్లో పిల్లలపట్ల తగిన కేర్ తీసుకుంటాం. అవసరమయ్యే శిక్షణను అందిస్తాం. వీటి నిర్వహణ చాలా కష్టం. – మల్లిక, ప్రిన్సిపల్, లిటిల్ డాక్లింగ్ స్కూల్, విశాఖపట్నం కేంద్రం ఏం చెబుతోంది? కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ’ (ఈసీసీఈ–2013) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు విద్య, ఆటపాటలు నేర్పాలి. ప్రైవేటు సంస్థలు కూడా ఈ పాలసీ తాలూకు విధివిధానాలకు కట్టుబడి నడుచుకోవాలి. - ప్రతీ 20 మంది పిల్లలకు ఒక టీచరు, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. - ప్లేస్కూల్ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. - పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలి. - పిల్లలకు అనుకూలమైన బాత్రూంల ఏర్పాటు, సీసీటీవీ, అగ్నిమాపక రక్షణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కలిగి ఉండాలి. - ప్రతీ మూడు నెలలకు ఒకసారి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించాలి. - ముఖ్యంగా రోజుకు 3–4 గంటలకు మించి ప్లే స్కూల్ నిర్వహించకూడదు. - చిన్న పిల్లలకు ఏం నేర్పించాలనే దానిపై కూడా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బోధన ప్రణాళిక రూపొందించింది. ప్రతీ ప్లే స్కూల్ నిర్వాహకులు దీన్ని విధిగా పాటించాల్సి వుంది. ఈ దిశగా.. శిశు సంక్షేమ శాఖ తనిఖీలు జరపాల్సిన అవసరముందనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. -
స్కూల్ ఫీజుల నియంత్రణకు కేంద్రం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై కేంద్రం దృష్టి సారించింది. ప్రైవేటు పాఠశాలల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ జాతీయ బాలల హక్కుల, పరిరక్షణ కమిషన్కు (ఎన్సీపీసీఆర్) ఫిర్యాదులు వస్తున్న నేçపథ్యంలో ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. అనేక పాఠశాలలు వివిధ ఆకర్షణీయ పేర్లతో భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయని తమకు వచ్చిన ఫిర్యాదులతో కూడిన వివరాలను ఇటీవల ఎన్సీపీసీఆర్ మానవ వనరుల అభివృద్ధి శాఖకు (ఎంహెచ్ఆర్డీ) అందజేసింది. దీంతో పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న అంశాలపై తమకు సమగ్ర నివేదిక అందజేయాలని ఎన్సీపీసీఆర్కు సూచించింది. ఆ నివేదిక ఎంహెచ్ఆర్డీకి అందగానే మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాల్లో నిబంధనలను రూపొందిం చి, అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. -
నవోదయం.. జాప్యం
వర్గల్(గజ్వేల్) : జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష(జేఏన్వీఎస్టీ–2018) ఫలితాల వెల్లడిలో అంతులేని జాప్యం కొనసాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఫలితాల జాడ లేదు. ఈక్రమంలో ఫలితాల కోసం వేచి చూడాలా? లేక ప్రైవేటు స్కూళ్లలో చేర్పించాలా? అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఫలితాలపై ఆరా తీసే వారికి నవోదయ వర్గాలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా(మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట) వ్యాప్తంగా ఆరో తరగతిలో కేవలం 80 సీట్లకు గాను సగటున ఒక్కో సీటుకు 100 మంది చొప్పున పోటీపడుతూ మొత్తం 8,456 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6,623 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ లెక్కలే తల్లిదండ్రుల్లో నవోదయపై ఉన్న క్రేజ్ను స్పష్టం చేస్తుంది. ఎంట్రన్స్ నిర్వహణకు సంబంధించి సీబీఎస్ఈతో నవోదయ విద్యాలయ సమితి టైఅప్ అయ్యింది. దీని ప్రకారం ప్రవేశ పరీక్షను నవోదయ విద్యాలయ సమితి అధికారులు నిర్వహించగా, సీబీఎస్ఈ అధికారులు ప్రశ్నపత్రాలను వాల్యూయేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. అక్కడి నుంచే మెరిట్, రిజర్వేషన్ప్రకారం ప్రవేశార్హత సాధించిన 80 మంది విద్యార్ధుల పేర్లతో కూడిన జాబితా విడుదల అవుతుంది. దీని ఆధారంగా ఆయా జిల్లాలలోని నవోదయ విద్యాలయాలు ఫలితాలు రిలీజ్ చేస్తాయి. ఆలస్యంగా ఎంట్రన్స్ పరీక్ష సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లో ఏటా ఫిబ్రవరి 10న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా 2018 విద్యా సంవత్సరం కోసం వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఫిబ్రవరి 10న ఎంట్రస్ పరీక్ష జరుగుతుందని ప్రాస్పెక్టస్లో స్పష్టం చేశారు. ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ సరళీకరణ కోసం మాన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా అధికారులు ఎంట్రన్స్ నిర్వహించలేదు. నూతన విధానంలో దరఖాస్తుల సమర్పణ, సాంకేతిక సమస్యలు తలెత్తడం, కొత్త విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ ప్రణాళిక రూపొందించుకోకపోవడం తదితర కారణాలు ఎంట్రన్స్ పరీక్ష వాయిదాకు దారి తీశాయి. సాంకేతిక కారణాలు గా చూపుతూ ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన పరీక్షను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్టు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. దా దాపు రెండున్నర నెలలు ఆలస్యంగా ఏప్రిల్ 21న ఎంపిక పరీక్ష నిర్వహించారు. దీంతో రిజల్ట్ వెల్లడిలో అంతులేని తాత్సారం కొనసాగుతోంది. జూ న్ ముగిసినా ఎంట్రన్స్ ఫలితాలు రాకపోవడంతో సీబీఎస్ఈ వైఫల్యంపై విమర్శలువస్తున్నా యి. అంతా అయోమయం ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి కాకపోవడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. నవోదయ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తే ఫీజుల భారం తగ్గుతుందని, నాణ్యమైన విద్యతో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని భావించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నా ఫలితాలు జాడలేకపోవడంతో ఆర్థిక స్తోమత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు మాత్రం ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. గిట్లయితే నవోదయ పేరు చెడిపోతది మేము పేదోళ్లం. నవోదయల సదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతదని నమ్మకం. ఐదో తరగతి చదువుతుండగానే మా కొడుకుతోని నవోదయ పరీక్ష రాయించిన. సీటొస్తే ఫీజుల బాధ పోతది. బాగ చదువొస్తదనుకున్న. నమ్మకంగా సీటొస్తదనుకుంటే బడులు మొదలై నెలరోజులు దాటినా రిజల్ట్ వస్తలేదు. గిట్లయితే నవోదయ పేరు ఖరాబైతది. నమ్ముకం పోతది. బిరాన రిజల్ట్ పెడితే అయోమయం పోతది. – అశోక్, నెంటూరు ఫలితాల్లో జాప్యం వాస్తవమే.. నవోదయ ఎంట్ర¯Œస్ట్ టెస్ట్ ఫలితాల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. సీబీఎస్ఈ ఫలితాల జాబితా పంపిన వెంటనే విడుదల చేస్తాం. ఆన్లైన్ నేపథ్యంలో ఫిబ్రవరి 10న జరగాల్సిన పరీక్ష ఏప్రిల్ 21కి వాయిదా పడింది. రిజల్ట్స్ కోసం తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. జూలై మొదటి వారంలోగా రిజల్ట్స్ వస్తాయనుకుంటున్నాం. ఫలితాలు వెల్లడి కాగానే వెంటనే పత్రికల ద్వారా విడుదల చేస్తాం. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు. – వెంకటరమణ, ప్రిన్సిపాల్, వర్గల్ నవోదయ -
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా: గట్టు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు దందా సాగే విధంగా విద్యను వ్యాపారంగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. యాజమాన్యాల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో ప్రతి ఏడాది 10 శాతం రుసుములు పెంచుకోవచ్చని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతి మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఫీజులు పెంచుకునేలా ఉత్తర్వులున్నాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే అడ్డగోలుగా ఉన్న ఫీజుల తగ్గింపునకు చర్యలు తీసుకోని ప్రభుత్వం జోనల్ ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి 10 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని చెబుతోందన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవటంతో సుమారు 162 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అపరిమితంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఇటీవల కాగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. -
రాజ్భవన్ స్కూల్ వద్ద గందరగోళం
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. ఎండల తీవ్రత తగ్గనప్పటికీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో వేసవి సెలవులు ముందుకు జరిగాయి. వార్షిక విద్యా ప్రణాళికలను ఖరారు చేసిన ప్రభుత్వం.. సర్కారు బడుల్లో బడిబాటకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే జూన్ 1 నుంచే పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాజ్భవన్ ప్రభుత్వం పాఠశాల ఈరోజు ప్రారంభమైంది. దీంతో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద బారులు తీరారు. అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే.. అడ్మిషన్లు ఎలా పూర్తి అవుతాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులకు సర్దిచెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. -
తల్లిదండ్రుల వివరాలు తెలిస్తేనే..
చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం విద్యార్థుల స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే 100 పాయింట్లతో కూడిన దరఖాస్తుని పూర్తి చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో వివాదం ఏముందని అనుకుంటున్నారా.. అందులోని అంశాలని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మాములుగా పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలంటే వారి తల్లిదండ్రుల పేర్లు, చిరునామా సమర్పిస్తే సరిపోతుంది. కానీ హర్యానాలో పిల్లల తల్లిదండ్రులు చట్టవిరుద్ధ వృత్తిలో కొనసాగుతున్నారా, ఆదాయం, పన్ను చెల్లింపుల సంబంధించిన ప్రశ్నలను అప్లికేషన్ ఫామ్లో పొందుపర్చారు. అంతేకాకుండా ఆధార్ నంబర్లు, విద్యార్హతలు, మతం, కులం, జన్యుపరమైన లోపాలు వంటివి కూడా దరఖాస్తులో పేర్కొనాలి. హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజల కుల, మత వివరాలు సేకరించడంలో మునిగిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత రణ్దీప్సింగ్ సూర్జేవాలా ట్విటర్లో ఆరోపించారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పిల్లలతో పాటు తల్లిదండ్రులపై నిరంతరం నిఘా ఉంచడానికే అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఈ నిబంధనను వెనక్కి తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
అచ్చం సినిమాలాగే.. బుక్కైన తండ్రి!
సాక్షి, న్యూఢిల్లీ : అచ్చం ‘హిందీ మీడియం’ సినిమా తరహాలోనే ఓ వ్యక్తి తన కొడుకుకు ప్రముఖ పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు అక్రమమార్గం తొక్కాడు. తాము సంపన్నులు అయినప్పటికీ.. నిరుపేదగా పేర్కొంటూ నకిలీ పత్రాలు పొంది.. కొడుకును ప్రఖ్యాత విద్యాసంస్థలో చేర్పించాడు. తాజాగా నకిలీ ధ్రువపత్రాల రాకెట్ పట్టుబడటంతో అతని బాగోతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన గౌరవ్ గోయల్ తన కుమారుడిని న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదివించాలని ఆశపడ్డాడు. నకలీ సర్టిఫికేట్స్ సృష్టించి ఆర్థికంగా వెనుకబడినవర్గం కింద 2013 సంవత్సరంలో ఆ పాఠశాలలో కొడుకును చేర్పించాడు. తాజాగా అతని గుట్టురట్టు కావడంతో జైలుపాలైయ్యాడు. శనివారం అతనితోపాటు ఈ వ్యవహారంలో కీలకంగా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మాధుర్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం, కొడుకుని ఉన్నత పాఠశాలలో చేర్పించడం కోసం గౌరవ్ గోయల్ నకిలీ ఇన్కం సర్టిఫికేట్ సంపాదించాడు. దీనితోపాటు అడ్మిషన్కు కావల్సిన ఇతర పత్రాలను కూడా నకిలీవి సృష్టించాడు. 2015లోనే ఉన్నత విద్యాసంస్థల్లో నకిలీ పత్రాల రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధాన సూత్రధారి నీరజ్ కుమార్ వద్ద నుంచి గౌరవ్ ఈ నకిలీ పత్రాలు పొందాడు. సర్టిఫికేట్ బ్రోకర్ అయిన నీరజ్ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడంతో గౌరవ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కో నకిలీ పత్రాన్ని సృష్టించేందుకు ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు నీరజ్ ఒప్పుకున్నాడు. -
ఆధార్ లేకున్నా ఆ మూడింటికి ఢోకా లేదు
ఆధార్ లేకపోతే... ఇటీవల కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రేషన్ రాక, ఆకలి తట్టుకోలేక మృత్యువు బారిన కూడా పడుతున్నారు. అయితే ఆధార్ లేకపోయినా..... కనీస సేవలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని యూఐడీఏఐ ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య సేవలు, స్కూల్ అడ్మినిషన్లు, తక్కువ ధరలకు రేషన్ ఈ మూడు సర్వీసులను ఆధార్ లేకున్నా తప్పక ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఆధార్ నెంబర్ లేదని, కనీస సేవలు తిరస్కరించవద్దని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ లేకపోవడంతో, లబ్దిదారులకు సామాజిక సర్వీసులు అందించడం లేదు. అయితే నిజమైన లబ్ధిదారుడికి ఆధార్ లేదని ప్రయోజనాలను తిరస్కరించకూడదని ప్రభుత్వ ఏజెన్సీలకు 2017 అక్టోబర్ 24నే యూఐడీఏఐ నోటిఫికేషన్ జారీచేసింది. ఆధార్ లేదని, నిజమైన లబ్దిదారున్ని ఆసుపత్రిలో చేర్చుకోలేదని మీడియా రిపోర్టులు వెలువడిన సంగతి తెలిసిందే. గుర్గావ్లో ప్రభుత్వ ఆసుపత్రి ఆధార్ లేదని ఓ నిండు గర్భిణిని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆమె గేటు వద్దే ప్రస్తావించింది. దీనిపై పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై మరోసారి యూఐడీఏఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖ రాసింది. ఆధార్ లేకపోతే, బేసిక్ సర్వీసులు అందించడం తిరస్కరించవద్దని హెచ్చరించింది. -
ఫీజులు పెంచొద్దు!
వనపర్తి విద్యావిభాగం : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చని ఇచ్చిన తిరుపతిరావు కమిటీ నివేదిక పరిశీలనలోనే ఉందని తెలిపింది. ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు గతేడాది ఫీజులనే కొనసాగించాలని స్పష్టంగా ఆదేశించింది. నిబంధనలు తూచ్! జిల్లాలో ఉన్న 110ప్రైవేట్ పాఠశాలల్లో 50వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే టెక్నో, టాలెంట్, ఒలంపియాడ్ తదితర పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్, బ్యాడ్జ్ల పేరుతో ఫీజుల భారం మోపుతున్నారు. తిరుపతిరావు కమిటీ నివేదికపై నిరసనలు కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని పేరెంట్స్ కమిటీల పోరాటాలతో ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశీలన అనంతరం ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం 10శాతం ఫీజులు పెంచుకోవచ్చని ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే ఫీజుల భారంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు తిరుపతిరావు కమిటీ నివేదికపై మండిపడుతున్నారు. తిరుపతిరావు కమిటీ నివేదికను అమలు చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోసారి ఆదేశాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని బుకాయిస్తున్నాయి. దీంతో తాజాగా ప్రభుత్వం మంగళవారం మరోసారి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫీజులు పెంచొద్దని గతేడాది వసూలుచేసిన పాత ఫీజుల ప్రకారం అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ అధిక0గా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
మరింత దోచుకోమని సిఫారసులా?
హైదరాబాద్లో నివాసం ఉంటున్న నవీన్ ఓ ప్రైవేటు కంపెనీలో సాధారణ ఉద్యోగి. ఆయన కొడుకు యూకేజీ ఫీజు ఏడాదికి రూ.42 వేలు. ఆటో ఫీజు కోసం మరో రూ.15 వేలు చెల్లిస్తున్నారు. మరో ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ ప్లే స్కూల్లో తన కూతురుకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు. వరంగల్లో ప్రైవేటు ఉద్యోగి గోపాల్ ఓ సాధారణ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న తన మూడో తరగతి కూతురికి ఏటా రూ.20 వేలు చెల్లిస్తున్నారు. అదే తన మూడేళ్ల చిన్న కూతురు ప్లే స్కూల్కు మాత్రం రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఖమ్మంలోని ఓ సాధారణ స్కూల్లో ఐదో తరగతి చదివే తన కూతురుకు ఏటా రూ.30 వేలు ఫీజు కడుతున్నారు. చిన్నవాడైన తన కొడుకుకు నర్సరీకి రూ.20 వేలు చెల్లిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్ ..ఇలా 31 లక్షల మంది సాధారణ, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలు ఏటా భారీ మొత్తంలో ఫీజులను పెంచుతుండటంతో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో తల్లిదండ్రుల కమిటీలు ఆందోళన చేశాయి. అయితే ఏడేళ్లుగా ఫీజుల తగ్గింపు కోసం తల్లిదండ్రుల కమిటీలు ఆందోళనలు చేయడం.. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని కోర్టుల్లో యాజమాన్యాలు సవాలు చేయడం.. చివరకు జీవోలు కొట్టివేయండం.. సర్వసాధారణంగా జరుగుతుండటంతో ఫీజుల నియంత్రణ అటకెక్కింది. యాజమాన్యాల అనుకూలతపైనే దృష్టి యాజమాన్యాల అనుకూల విధానాలపైనే ప్రధాన కమిటీ దృష్టి సారించిందని, అందుకే ఈ సిఫారసులు చేసిందంటూ తల్లిదండ్రుల కమిటీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క సిఫారసు కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను కలసి విన్నవించాయి. ఆ నివేదికను ఆమోదించవద్దని కోరాయి. ఫీజులు మరింత పెంచేలా.. పట్టణ ప్రాంతాల్లో కనీసంగా రూ.12 వేల నుంచి టాప్ స్కూళ్లలో 2.5 లక్షల వరకు ఫీజులను యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను చదివిస్తున్న 31 లక్షల మంది తల్లిదండ్రుల్లో సాధారణ, మధ్య తరగతి వారే 80 శాతం వరకు ఉన్నారు. వారు చదివిస్తున్న పాఠశాలల్లో కనీస ఫీజు రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంది. ఈ మేరకు ఉన్న ఫీజులను తగ్గించేలా కమిటీ శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తుందని భావించినా.. అందుకు భిన్నంగా సిఫారసు చేయడంతో ఉసూరుమంటున్నారు. ఏఎఫ్ఆర్సీ తరహాలో చేయలేరట రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఖరారు చేస్తోంది. ఉన్నంతలో శాస్త్రీయ విధానమూ ఇదే. కాని అది సాధ్యం కాదని తిరుపతిరావు కమిటీ తేల్చేసింది. పైగా ఫీజుల పెంపునకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుపుతూ యాజమాన్య అనుకూల విధానాన్ని సిఫారసు చేసింది. ఏటా పెంపు.. ఇదేం విధానం? కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఏఎఫ్ఆర్సీ మూడేళ్లకోసారి ఫీజులను ఖరారు చేస్తోంది. మరి అలాంటపుడు పాఠశాలల్లో ఏటా ఫీజుల పెంపునకు సిఫార్సు చేయడంపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గుజరాత్లో మూడేళ్లకోసారి స్కూల్ ఫీజులను పెంచే విధానం ఉంది. మహారాష్ట్ర రెండేళ్లకోసారి 15 శాతం వరకు ఫీజులను పెంచే విధానం ఉంది. కానీ రాష్ట్రంలో ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన సరికాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని తల్లిదండ్రుల కమిటీల నేతలు నారాయణ, ఆశిశ్ హెచ్చరించారు. 9 నెలల అధ్యయనం.. ఫీజు పెంచుకునేందుకు సిఫారసులు ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం 2017 మార్చిలో మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసి, సిఫారసులు చేయాలని సూచించింది. దాదాపు 9 నెలలపాటు అధ్యయనం చేసిన కమిటీ.. తన నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అప్పగించింది. ఫీజుల తగ్గింపు సంగతి దేవుడెరుగు.. ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే ఏటా 10 శాతం వరకు ఫీజుల పెంపునకు కమిటీ సిఫారసు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జోనల్ ఫీజుల నియంత్రణ కమిటీల ఆమోదం తీసుకొని ఇష్టమొచ్చిన తీరులో ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
ఫీజుల వివరాలా...మేం ఇవ్వం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విధానాన్ని ఖరారు చేసేందుకు మూడేళ్ల ఆదాయ వ్యయాల వివ రాలు ఇవ్వాలని విద్యాశాఖ మొత్తుకుంటున్నా.. పాఠశాలల యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. వివరాలు అందజేసేందుకు 45 రోజులు గడువిచ్చినా మూడో వంతు పాఠశాలలు కూడా ఇవ్వకపోవడం గమ నార్హం. రాష్ట్రవ్యాప్తంగా 11 వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. 2,962 స్కూళ్లు మాత్రమే ఆదాయ వ్యయాల వివరాలను అందజేశాయి. తమకు మరింత సమయం కావాలని ప్రైవేటు స్కూల్ ఫీజుల విధానంపై ఏర్పాటైన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని కోరుతున్నాయి. అడ్డగోలుగా వసూలు చేస్తూ.. ప్రైవేటు స్కూళ్లలో పట్టణాల్లోని టాప్ స్కూళ్లు, కార్పొరేట్ పాఠశాలలే ఐదు వేల వరకు ఉన్నాయి. అవి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. రూ.35 వేల నుంచి రూ.3 లక్షలకు పైగా వసూలు చేస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలన్న డిమాండ్తో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో 2015–16, 2016–17 విద్యా సంవత్సరా లకుగాను ఫీజులు, ఇతరత్రా రూపంలో వచ్చిన ఆదాయం, ఖర్చు చేసిన మొత్తా ల వివరాలను, ఆడిట్ రిపోర్టులను, 2017–18 విద్యా సంవత్సరంలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను అందించాలని విద్యా శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని స్కూళ్లు స్పందించి వివరాలు అందజేసినా.. టాప్ స్కూళ్లు, ఇంట ర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు తమ ఆదాయ వ్యయాల వివరాలను ఇవ్వలేదు. లోపాలు కప్పిపుచ్చుకునేందుకే.. చాలా టాప్, కార్పొరేట్ పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజులకు, కల్పిస్తున్న వసతులకు, పనిచేసే టీచర్లకు ఇస్తున్న వేతనాలకు పొంతన లేకుండా ఉంటోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ట్యూషన్ ఫీజు, ఇతరత్రా సదుపాయాల పేరుతో వసూలు చేస్తున్న మొత్తాలకు ఎలా లెక్కలు చూపించాలో యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. ఆదాయ వ్యయాల వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ పలుమార్లు నోటీసులివ్వడంతోపాటు సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెప్పింది. దీంతో లెక్కలు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా స్కూళ్లు తమ లోపాలను కప్పిపుచ్చుకొని తప్పుడు లెక్కలతో రిపోర్టులు తయారు చేసు కునే పనిలో పడ్డాయి. అందుకే వివరాలు ఇచ్చేందుకు సమయం కావాలని కోరుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వివరాలు వెల్లడించాల్సిన గడువు ఈ నెల 15తోనే ముగిసినా గడువు పెంచాలని స్కూళ్లు కోరుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డిలలోనే అత్యధికం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 40 శాతం పాత హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 2 వేల వరకు ప్రైవేటు స్కూళ్లు ఉంటే.. వివరాలు ఇచ్చింది కేవలం 219 పాఠశాలలే. రంగారెడ్డి జిల్లాలో 1,310 స్కూళ్లకుగాను 271 స్కూళ్లు మాత్రమే వివరాలు అందజేశాయి. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ పలు పాఠశాలలు వివరాలిచ్చినా అవి అసమగ్రంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని స్కూళ్లు 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కలే ఇస్తే.. మరికొన్ని స్కూళ్లు 2016–17కు సంబంధించిన లెక్కలను మాత్రమే అందజేసినట్లు చెబుతున్నారు. అయితే అన్ని పాఠశాలల నుంచి వివరాలు వచ్చాక వాటిల్లో లోపాలు, ఇతర వివరణలపై దృష్టి సారించాలని విద్యాశాఖ భావిస్తోంది. -
ఫీజు చెల్లించలేదని ఎండలో నిలబెట్టారు
ఆకివీడు: స్కూలు ఫీజు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల్ని ఎండలో నిలబెట్టింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని రవీంద్రభారతి విద్యాసంస్థలో రెండు రోజులుగా విద్యార్థుల్ని తరగతి గది నుంచి బయటకు పంపించి బాత్రూమ్ ఉన్న ప్రాంతం వైపు నుంచోబెడుతున్నారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి స్కూల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఫీజులు చెల్లించకుంటే విద్యార్థుల్ని బాత్రూముల వద్ద ఎండలో నుంచోబెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకటి, రెండు, మూడు తరగతులు చదువుతున్న దున్నల ప్రసన్న, డి.సాయివరప్రసాద్, వాసా యషిత మాట్లాడుతూ ఫీజు చెల్లించలేదని తమను బయటకు పంపి బాత్రూమ్ వద్ద నుంచోబెట్టారని విలేకరులతో చెప్పారు. ఇదే విషయాన్ని స్కూల్కు వచ్చిన ఎంఈవో ఎ.రవీంద్రకు వివరించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు దున్నల శ్రీనివాస్, మువ్వల నాగరాజు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఎంఈవో చెప్పారు. -
ఫీజులపై మరో ‘సారీ’!
- ఈసారి కూడా స్కూల్ ఫీజుల నియంత్రణ అటకెక్కినట్టే! - మొన్నటి వరకు గుజరాత్లో అధ్యయనం అన్నారు.. - ఇప్పుడు స్కూళ్ల మూడేళ్ల ఆదాయ వ్యయాల పరిశీలన - అసలు విధానమే రూపొందించకుంటే యాజమాన్యాలు లెక్కలు చెబుతాయా?... పైగా ఆదాయ వ్యయాల అధ్యయనం తరువాత విధానం రూపకల్పనా? - ఇప్పటికే ఉన్న జీవోల అమలును పట్టించుకోరెందుకు? - ఎనిమిదేళ్లుగా నానుతున్న ఫీజుల నియంత్రణ వ్యవహారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఈసారి కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా కసరత్తు జరుగుతున్నా ప్రతిసారీ ఏదో ఓ కారణంతో ఆగిపోతూనే ఉంది. తొలుత న్యాయ వివాదాలు, కొన్నిసార్లు విద్యాశాఖ అలసత్వం, మరికొన్నిసార్లు అధ్యయనాల పేరుతో వాయిదా పడుతూ రాగా... ఈసారి కూడా మరో అధ్యయనం పేరుతో జాప్యం జరుగుతోంది. మొత్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం.. ఇప్పట్లో ఫీజుల నియంత్రణకు విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విధానం రూపొందించేదెప్పుడు? గతేడాది ఫీజుల నియంత్రణ అంశంపై విద్యాశాఖ ఓ అడుగు ముందుకు వేసినా ఆచరణకు నోచుకోలేదు. దాంతో విద్యార్థులపై అడ్డగోలుగా ఫీజుల భారం తప్పలేదు. ఈసారైనా ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతారని భావించినా ఫలితం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమవుతాయన్న తరుణంలో మార్చిలో ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా.. అధ్యయనానికి మరింత సమయం కావాలంటూ కమిటీ గత నెలాఖరు వరకు జాప్యం చేసింది. ఇక గుజరాత్తో అధ్యయనం చేసి.. ఆ తరహా చట్టం రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఈ నెల మొదట్లో ప్రభుత్వం పేర్కొంది. తాజాగా గత మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలు ఇవ్వాలంటూ ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అధ్యయనం చేసి విధానం రూపొందిస్తామని చెబుతోంది. అసలు ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానమూ రూపొందించకుండానే.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లెక్కలు ఎలా చెబుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ యాజమాన్యాలు లెక్కలు చెప్పినా... దాదాపు 11 వేలకుపైగా ఉన్న పాఠశాలల మూడేళ్ల ఆదాయ వ్యయాలను పరిశీలించేదెప్పుడు? విధానం రూపొందించేది ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఏకంగా 30 శాతం నుంచి 40 శాతం వరకు ఫీజులను పెంచేయడం గమనార్హం. ఏళ్ల తరబడి సాగదీత.. 2009లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు జీవో 91, 92లను జారీ చేసింది. ఆ నిబంధనల ప్రకారం.. ప్రతి ప్రైవేటు పాఠశాలలో గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయాలి. జిల్లాస్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలి. పాఠశాల గవర్నింగ్ బాడీలు ప్రతిపాదించే ఫీజులను డీఎఫ్ఆర్సీ పరిశీలించి తుది ఫీజులను ఖరారు చేయాలి. వాటినే స్కూళ్లలో వసూలు చేయాలి. అంతేకాదు గరిష్టంగా వసూలు చేయాల్సిన ఫీజులను కూడా ప్రభుత్వం ఆ జీవోలలో స్పష్టంగా పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేలు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ దీనిపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించగా.. డీఎఫ్ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదంటూ 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. తరువాత విద్యాహక్కు చట్టం అమల్లోకి రావడంతో ప్రభుత్వం జీవో 91, 92లను పక్కన పడేసి జీవో 41, 42లను జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం... ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లోనైతే గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వార్షిక ఫీజుగా వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లోనైతే రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800కు మించి వార్షిక ఫీజు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ జీవోలపైనా ప్రైవేటు యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో జీవోల అమలు ఆగిపోయింది. తర్వాత కూడా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం హడావుడి చేయడం, ఆగిపోవడం పరిపాటిగా మారింది. హైకోర్టు ఆదేశాలతో కదలిక.. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందం టూ గతేడాది ఫిబ్రవరిలో ఓ పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. దాంతో విద్యాశాఖ నామమా త్రంగా 162 స్కూళ్లకు నోటీసులిచ్చి మిన్నకుండిపోయింది. ఆ స్కూళ్లపై ఏ చర్యలు తీసుకున్నారన్న వివరా లూ బయటికి రాలేదు. అయితే మళ్లీ అదే కేసుపై విచారణ ఉండటంతో గతేడాది సెప్టెం బర్లో విద్యాశాఖ కార్యాచరణకు దిగింది. నెలల తరబడి చేసిన కసరత్తు వృథా.. పాఠశాల విద్య కమిషనర్ స్వయంగా తల్లిదండ్రుల కమిటీలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో పలు దఫాలుగా చర్చించారు. వారి సూచనలు, సలహాలు స్వీక రించి.. ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టిన ప్రభుత్వం.. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేస్తూ మార్చి 21న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తిరుపతిరావు కమిటీ మళ్లీ తల్లిదండ్రుల సంఘాలు, పాఠశాలల యాజమాన్యాలతో చర్చలు ప్రారంభిం చారు. ఎవరి వాదనలు వారు వినిపించ డంతో అవి ఓ కొలిక్కి రాలేదు. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయిం చేందుకు ‘ప్రవేశాలు– ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)’తరహా కమిటీ ఏర్పాటు చేయాలని.. జీవో నంబర్ 1లోని నిబంధనలు కచ్చితంగా పాటించాలని తల్లిదండ్రుల కమిటీలు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు శ్లాబ్ల విధానంలో ఫీజులు ఉండా లని ప్రైవేటు యాజమాన్యాలు కోరాయి. ఇదిలా ఉండగానే... ప్రైవేటు స్కూళ్లు మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలు ఇవ్వాలని.. వాటి ఆధారంగా ఫీజుల నియంత్రణ విధానాన్ని రూపొందిస్తామని సర్కారు కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇది మరింత జాప్యానికి అవకాశం కల్పించింది. 30 లక్షల మందిపై భారం రాష్ట్రంలో మొత్తంగా 41,337 పాఠశా లలు ఉండగా వాటిలో 5,86,67,586 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 11,372 కాగా వాటిలోని విద్యార్థులు 30,08,185 మందిగా విద్యాశాఖ లెక్కలు వేసింది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు భారంగా మారిన ఫీజులను నియంత్రించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా తల్లిదండ్రులపై ఫీజుల భారం తప్పడం లేదు. జీవో నంబర్ 1 అమలు చేయరా? ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1994లో జారీ చేసిన జీవో నంబర్ 1 ప్రకారం ప్రైవే టు పాఠశాలలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు, 15 శాతం పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పన, 15 శాతం పాఠశాల నిర్వహణ, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం ఉపయోగించాలి. యాజమాన్యం 5 శాతాన్ని మాత్రమే లాభంగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనల అమలును అధికా రులు పట్టించుకోవడం మానేశారు. -
జూన్ నుంచి స్కూల్ ఫీజుల నియంత్రణ
29న స్కూల్ ఫీజుల కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటినుంచే ఫీజుల నియంత్రణను అమలు చేసేలా ప్రభుత్వానికి సిఫా రసు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం పాఠ శాల విద్యాశాఖ కార్యాలయంలో యాజమాన్యాలు, తల్లి దండ్రులతో కమిటీ సమావేశం నిర్వహించింది. యాజమాన్యాలు తాము మరిన్ని ప్రతిపాదనలు అందజేస్తామని, ఇందుకు సమయం కావాలని కోరాయి. ఈ నెల 25న సాయంత్రం 4లోగా ప్రతిపాదనలు అందజేయాలని కమిటీ యాజమాన్యాలకు సూచించింది. ఈ నెల 29న నివేదిక ను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. యాజమాన్యాలు ఇప్పటికే ఎక్కువ ఫీజులను వసూలు చేసి ఉంటే వాటిని తర్వాత సర్దుబాటు చేసేలా చర్యలు చేపట్టాలన్న ఆలోచనకు వచ్చింది. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా రిటైర్డ్ జడ్జి లేదా ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి లో పని చేసిన రిటైర్డ్ అధికారిని డీఎఫ్ఆర్సీ చైర్మన్గా నియమించేలా సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. -
జూన్ తొలి వారంలో స్కూల్ ఫీజుల నివేదిక!
- నివేదిక సిద్ధం చేస్తున్న ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ - హాస్టళ్లు, స్కూళ్లకు వేర్వేరు అకౌంట్లు నిర్వహించేలా చర్యలు - స్కూళ్లవారీగా ఫీజులు..కనీస,గరిష్ట ఫీజుల విధానానికి నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా నివేదిక రూపొందించి, జూన్ మొదటి వారంలో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది. పాఠశాల వారీగా ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించేందుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. హాస్టల్ వసతి కలిగిన పాఠశాలల్లో నివాస వసతి కింద, ఫీజుల కింద వసూలు చేస్తున్న మొత్తం, సహపాఠ్య కార్యక్రమాలు కాకుండా ఇతర కార్యక్రమాల కింద వసూలు చేసే మొత్తాలకు వేర్వేరు అకౌంట్ల ను నిర్వహించేలా నిబంధనలను పొందుపరుస్తున్నట్లు సమాచారం. జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు (డీఎఫ్ఆర్సీ) చైర్మన్గా ఎవరిని నియమించాల న్న విషయంలో తర్జనభర్జన పడుతోంది. జిల్లా జడ్జి చైర్మన్గా ఉంటే బాగుంటుందా.. అయితే వారికి సమయం సరిపోతుందా, లేదా, అన్న ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జడ్జిని డీఎఫ్ఆర్సీ చైర్మన్గా నియమిస్తే బాగుంటుందని భావిస్తోంది. కనీస, గరిష్ట ఫీజుల విధానం ఉండదు.. యాజమాన్యాలు కోరిన కనీస, గరిష్ట ఫీజుల విధానం ఉండే అవకాశం లేదు. పాఠశాల ఆదాయ వ్యయాల ప్రకారమే ఫీజులను నిర్ణయించేలా సిఫారసు చేసే అవకాశం ఉంది. ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతం టీచర్ల వేతనాల కు, 15 శాతం పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు, ఇంకో 15 శాతం పాఠశాల నిర్వహణకు, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమానికి వెచ్చించాలని, యాజమన్యాలు 5 శాతం డబ్బునే లాభంగా తీసుకోవాలనే జీవో–1 నిబంధనలు అమలు చేసేలా సిఫారసు చేసే అవకాశం ఉంది. యాజమాన్యాలు తీసుకునే 5 శాతం మొత్తాన్ని పెంచాలని, సంక్షేమానికి వెచ్చించాల్సిన 15 శాతంలో మార్పులు చేయాలని యాజమాన్యాలు కోరినా, ఆ దిశగా సిఫారసు ఉండే అవకాశం లేదు. -
జోరుగా ముందస్తు అడ్మిషన్లు
ప్రైవేటు స్కూల్స్ అడ్డగోలు అడ్మిషన్లకు తెరలేపాయి. విద్యా సంవత్సరం ముగింపుకాకముందే ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయి. ఇస్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ, నిలువు దోపిడీ చేస్తున్నాయి. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో వసూళ్ల పర్వానికి తెరలేపాయి. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ► నిబంధనలకు నీళ్లొదులుతున్న కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ► అధిక ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోని విద్యాశాఖ కడప ఎడ్యుకేషన్: ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందుగా సీట్ బుక్ చేసుకుంటే రాయితీ ఇస్తామని మభ్యపెడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్లో నిర్ణీత ఫీజుల బోర్డులు ఏర్పాటు చేసి విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాలి. కానీ, నగరంలోని కొన్ని స్కూళ్లు చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ‘బ్రాండ్’ పేరు చెప్పుకుని అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్నాయి. యాజమాన్యాలపై చర్యలేవీ..?: నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిరన కాడికి దండుకుంటున్నాయి. నర్సరీకే రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. దీనికి స్కూల్ యూనిఫాం, పుస్తకాలు అదనం. వీటన్నింటిని అంగీకరించి ముందుగానే అడ్మిషన్ ఫీజు మొత్తం చెల్లించాలి. లేకపోతే అడ్మిషన్ ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నట్లు సమాచారం. వసతులు లేకున్నా...: కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీస వసతులు లేకున్నా రూ. వేలల్లో ఫీజులు వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పదవ తరగతిలోపు విద్యార్థులకు రూ. 10 వేలలోపే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. కానీ, ఈ నిబంధన ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారేరీ.?: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొది వసూళ్ల పర్వానికి తెరలేపాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్..: జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు చేయించుకునేందుకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే ఉద్యోగానికి ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది. అడ్మిషన్లు చేస్తే చర్యలు తీసుకుంటాం: కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్లో విద్యా సంవత్సరం ముగియక ముందే అడ్మిషన్లు చేయకూడదు. అలా చేసుకుంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆరోపణలు వస్తున్న స్కూళ్లపై విచారించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. -----పొన్నతోట శైలజ, ఇన్చార్జి డీఈఓ -
ఫీజు కట్టలేదని.. పిల్లాడిని కొట్టి చంపేశారు!
తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయారనే కారణంతో ఆరో తరగతి చదువుతున్న ఓ పిల్లాడిని స్కూలు అధికారులు దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో జరిగింది. సురేష్ తొంగ్బ్రమ్ అనే విద్యార్థిని కొట్టినందుకు స్కూలు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిది అసహజ మరణం అని తేలితే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. తమది పేద రైతు కుటుంబం కావడంతో ఇంఫాల్ సమీపంలోని లాంగోల్లో గల రెసిడెన్షియల్ కిడ్స్ కేర్ స్కూలు ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించలేకపోయానని సురేష్ తండ్రి బీరా తొంగ్బ్రమ్ చప్పారు. తమ అబ్బాయి రెండేళ్ల క్రితం ఆ స్కూల్లో చేరాడన్నారు. ఫీజులు చెల్లించాలి లేదా పిల్లాడిని తీసుకెళ్లిపోవాలని వాళ్లు చెప్పారని, దాంతో ఏమీ చేయలేక తాను పిల్లాడిని తీసుకెళ్లిపోదామని స్కూలుకు వెళ్తే.. ఫీజులు చెల్లించనిదే తీసుకెళ్లడానికి వీల్లేదన్నారని ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి స్కూలు వాళ్లు తన కొడుకును ఇంటికి తీసుకొచ్చారని, అతడి శరీరం అంతా వాతలు తేలి ఉన్నాయని.. ఏంటని అడిగితే క్రమశిక్షణ తప్పడం వల్ల శిక్షించినట్లు చెప్పారని అన్నారు. అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోతూ ఈనెల 31 లోగా మొత్తం ఫీజు చెల్లించాలని తనకు చెప్పారన్నారు. ఇంటికి రాగానే కుప్పకూలిపోయిన సురేష్.. ఆ మర్నాడే మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. తనకు న్యాయం జరిగేవరకు కొడుకు శవాన్ని తాను తీసుకెళ్లేది లేదని బీరా తొంగ్బ్రొమ్ చెప్పారు. స్కూలు వాళ్లు ఇష్టం వచ్చినట్లు కొట్టడం వల్లే సురేష్ చనిపోయాడని ఆయన అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్కూలు వర్గాలు ఏమీ స్పందించలేదు. -
తండ్రి స్కూలు ఫీజు నిరాకరించడంతో..
జైపూర్: తండ్రి స్కూలు ఫీజు కట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్ లో బుధవారం చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం...శిల్ప కుమార్(18) 12 వ తరగతికి చదువుతోంది. తండ్రి స్కూలు ఫీజు ఇవ్వడానికి నిరాకరించడంతో మనోవేదనకు గురైన శిల్ప ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆమెను ఉదయ్ పూర్ లోని ఎమ్ బీ ఆస్పత్రికి తరళించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించిందని అధికారులు తెలిపారు. -
డాన్బాస్కో స్కూల్ ఎదుట ఆందోళన
హైదరాబాద్: స్కూల్ ఫీజులు పెంచడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని ఎర్రగడ్డ మోతీనగర్ డాన్బాస్కో స్కూల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహించిన తల్లిదండ్రులు శనివారం ధర్నా చేశారు. అడ్మిషన్లు తీసుకునే సమయంలో తక్కువ ఫీజులు చెప్పి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని, పాఠశాల యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు. -
పాఠశాల ఎదుట ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం
పెంచిన స్కూల్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. హయత్నగర్ మండలం లకా్ష్మరెడ్డిపాలెం గ్రామంలోని కాండోర్ షేన్ స్కూల్ యాజమాన్యం ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తుండటంతో.. ఆగ్రహించిన ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాలలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తె లుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. -
జూన్ నెల.. జేబు విలవిల
ప్రత్తిపాడుకు చెందిన సాయిరాం ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంటుగా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. నెల జీతం రూ.11 వేలు. ప్రతి నెలా కుటుంబ ఖర్చులుపోనూ వెయ్యో, పదిహేను వందలో మిగులుతాయి. ఇప్పుడు జూన్ గండమొచ్చింది. స్కూల్ ఫీజు, వ్యాన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, నోట్ బుక్స్, టెక్స్ట్బుక్స్.. ఇలా అనేక ఖర్చులు అదనంగా వచ్చి కూర్చున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం.. పొదుపునకు సరిపడా ఆదాయం రాకపోవడంతో వడ్డీ వ్యాపారుల తలుపుతట్టాడు. * ఈ నెలలో ఇంటి బడ్జెట్ తారుమారు * సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అప్పులపాలు * పిల్లల చదువులతో ఆర్థిక భారం * ముందస్తు ప్రణాళిక అవసరమంటున్న ఆర్థిక నిపుణులు ప్రత్తిపాడు : జూన్ వచ్చిందంటే స్కూలుకు వెళ్లే పిల్లలున్న ఇంట ఒక్కటే టెన్షన్.. ఇంటి బడ్జెట్ లెక్కలన్నీ తారుమారవుతాయి. సామాన్య, మధ్య తరగతిపై ‘జూన్ భారం’ పెనుభారమవుతుంది. ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేస్తుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ధరలు, కూరల ధరలు పెరిగి సగటు జీవి మనుగడ ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్య కోసం వెచ్చించాల్సి మొత్తం రెట్టింపై కూర్చుంది. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడడం లేదు. ఇదే అదనుగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు జేబులు గుల్ల చేస్తున్నారు. పల్లెల్లో పక్క ఇంటి వారితో పోటీపడుతూ ఉంటారు. వారి పిల్లలు కాన్వెంట్లో చదువుతున్నారంటే..తమ పిల్లలను అలానే చదివించాలనే తలంపుతో ఉంటారు. దీని కోసం ఎంత అప్పు చేయడానికైనా వెనుకాడరు. అయితే ఆర్థిక ప్రణాళికతో ఇలాంటి గండాలను అధికమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న ఫీజులు.. ప్రతి ఏటా చదువులకు సంబంధించి ఖర్చులు పెరిగిపోతున్నాయి. నర్సరీ నుంచే వేలకు వేలు ఫీజులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఒక్కో తరగతి పెరిగే కొద్దీ పది నుంచి ఇరవై శాతం వరకు ఫీజులను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాల స్థాయిని బట్టి ఫీజులు నిర్ణయిస్తున్నారు. ఎల్కేజీకే ఐదు వేల నుంచి ఫీజులు ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్లో అయితే ఎల్కేజీకి రూ.8 వేల నుంచి రూ.పది వేల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రైమరీ తరగతులకు రూ. 15 వేల నుంచి రూ.20 వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఖర్చులు భారంగా మారాయి జూన్లో ఖర్చులు ఒకేసారి రావటంతో భారంగా మారాయి. పిల్లలను పాఠశాలల్లో చేర్చే సమయం, పొలాలకు పెట్టుబడులు సమయం ఒకేసారి వచ్చాయి. ఒక పక్క పెరిగిన ఫీజలు, పుస్తకాల ధరలు, మరో పక్క పెరిగిన కౌలు ధరలు, విత్తనాల రేట్లతో అల్లాడిపోతున్నాం .దీంతో కూడబెట్టుకున్న డబ్బులు సరిపోక అప్పులు తీసుకురావల్సి వస్తుంది. - కంచర్ల సింగారావు జూన్ వస్తే దడే జూన్ వస్తే చాలు ఇబ్బం దులు తప్పడం లేదు. నా నెల సంపాదనలో అగ్రభాగాన్ని పిల్లల చదువులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి నెలా ఏదో రకంగా ఖర్చులకు మా సంపాదన సరిపోతుంది. కానీ ఈ నెల మాత్రం ఆర్థిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. అన్ని రకాల విద్యా సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. - టీ రవి -
'హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ కాదు.. దోపిడీ అడ్డా'
హైదరాబాద్: హైదరాబాద్ నాలెడ్జి హబ్ కాదని, దోపిడీకి అడ్డాగా మారిందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. విద్యా వ్యాపారం ప్రజాస్వామ్యానికి దెబ్బ అని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా శనివారం ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ... తల్లిదండ్రులను కస్టమర్లుగా చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పిల్లల ఫీజులను పెట్టుబడిగా పెట్టి మంత్రుల పదవులను కొంటున్నారని వ్యాఖ్యానించారు. మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించిన ఘటన ఈ ప్రభుత్వాలదేనని మండిపడ్డారు. విప్లవం ఎంతో దూరంలో లేదన్నారు. స్కూల్ మేనేజ్మెంట్లు దిగిరావాలని, స్కూల్ కమిటీలో తల్లిదండ్రులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. -
మంత్రి కార్యాలయం ముట్టడి..
విశాఖ: ఆంధ్రప్రదేశ్లో స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఆదివారం ఉదయం విశాఖలోని మంత్రి గంటా క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘ నాయకులు ముట్టడించారు. తమిళనాడు తరహాలో రెగ్యులేటరీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఏబీవీసీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
ఫీజు రద్దు చేస్తారా.. ఉగ్రవాదులతో దాడి చేయించాలా?
పిల్లలకు స్కూలు ఫీజులు కట్టడం చాలా కష్టం అయిపోతోంది. ఆ భారం భరించలేక తల్లిదండ్రులు నానా బాధలు పడుతున్నారు. ఇలాగే స్కూలు ఫీజులు కట్టలేని ఓ తండ్రి.. ఏకంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో స్కూలు మీద దాడి చేయిస్తానని బెదిరించాడు. మర్యాదగా తన పిల్లలిద్దరి ఫీజులు మాఫీ చేయాలని, లేకపోతే ఉగ్రవాద దాడి తప్పదని, ప్రిన్సిపాల్ను నిలువునా తగలబెట్టేస్తానని కూడా బెదిరించాడు. బీసీఎం స్కూలు ప్రిన్సిపాల్ వెర్గెస్ జోసెఫ్కు ఇలా బెదిరింపు లేఖ రాసినందుకు ఉస్మాన్ అనే సదరు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. ఉస్మాన్ తన పిల్లలకు ఫీజుగా రూ. 44వేలు చెల్లించాల్సి ఉంది. ఇంతకుముందు కూడా ఫీజు కట్టమని చెబితే, చంపుతానని బెదిరించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే ఉస్మాన్ ఇప్పుడు రాసిన లేఖ కూడా కేవలం బెదిరించడానికేనని, అంతే తప్ప అతడికి ఏరకంగానూ ఇస్లామిక్ స్టేట్తో సంబంధం లేదని తెలుస్తోందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. స్కూల్లో ఉన్న పిల్లలు, టీచర్లందరి చేతిరాతను కూడా తాము సేకరిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఇవి కూడా కీలకమని చెప్పారు. నేరపూరితంగా భయపెట్టినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే, అసలు తాను అలాంటి లేఖ రాయలేదని, ఎవరో తన పేరును దుర్వినియోగం చేశారని ఉస్మాన్ అంటున్నాడు. తాను ఫీజు కట్టని మాట వాస్తవమేనని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్లే కట్టలేదు తప్ప ప్రిన్సిపాల్తో తనకు గొడవలు ఏమీ లేవని అన్నాడు. త్వరలోనే ఫీజు కూడా కట్టేస్తానన్నాడు. -
స్కూల్ ఫీజుల పెంపుపై ఆందోళన
హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారంటూ ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం బంజారాహిల్స్లోని కల్పా స్కూల్ వద్ద పెద్ద సంఖ్యలో పేరెంట్స్ పాల్గొని నినాదాలు చేశారు. ప్రతి ఏడాది అధికంగా ఫీజులు పెంచుతున్నారని... గత మూడేళ్లలో 70 శాతానికి పైగా ఫీజులు పెంచారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. నగరంలోని ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థులను చదివించడం పెను భారంగా మారుతుందని... దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఫీజులు కట్టలేక పిల్లల్ని కడతేర్చాడు..
బెంగళూరు: కర్ణాటక కేపీ అగ్రహారలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి పిల్లల పట్ల కాలయముడిలా మారిపోయాడు. స్కూలు ఫీజులు కట్టే విషయంలో భార్యతో గొడవపడ్డ శివకుమార్.. కన్నబిడ్డల్నే దారుణంగా హతమార్చాడు. వారిని దుస్తులతో కట్టేసి, కత్తితో పొడిచి చంపేశాడు. స్థానికంగా బీభత్సాన్ని సృష్టించిన ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పనీపాటా లేకుండా ఆవారాగా తిరిగే శివకుమార్ తరచు భార్య తాయమ్మతో గొడవపడేవాడు. తాజాగా పిల్లల స్కూలు ఫీజు విషయంలో భార్యతో ఘర్షణకు దిగాడు. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే తాయమ్మ బయటకు వెళ్లాక.. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులు పవన్ (8), సించన (4) పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పిల్లలిద్దరినీ కట్టేసి మరీ పొడిచి హత్యచేశాడు. అనంతరం గోనెసంచుల్లో కుక్కి ఇంటి వెనకాల నిర్జనప్రదేశంలో పడేసి అక్కడినుంచి పారిపోయాడు. పని నుంచి ఇంటికి తిరిగివచ్చిన తల్లి తాయమ్మ బిడ్డలు కనిపించకపోవడంతో శివకుమార్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె బంధువులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో శివకుమార్ అఘాయిత్యం బయటపడింది. పిల్లల మృతదేహాలను గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, శివకుమార్ ను అరెస్ట్ చేశారు. -
సంగారెడ్డిలో ఫీజుల కలకలం..
మెదక్ జిల్లా సంగారెడ్డిలో కలకలం రేగింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్న బీసీ సంఘం నేత సిరిబాబు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో ఆయనకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సిరిబాబు.. ఉన్నట్టుండి వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో ఆయన కాళ్ల నుంచి పైన పొట్ట వరకు శరీరం కాలిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిరిబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విలేకరులతో మాట్లాడిన సిరిబాబు ప్రవైవేటు పాఠశాలల తీరుపై విరుచుకుపడ్డారు. నర్సరీకి కూడా 45 వేలు వసూలు చేస్తూ స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఇక భర్తలు లేని మహిళలైతే తమ పిల్లల్ని చదివించుకునేందుకు పడుతున్న బాధలు చెప్పరానివన్నారు. అధిక ఫీజులపై ఎంఈవో, డీఈవోలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఆందోళనను ఉదృతం చేసే క్రమంలో తాను ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందన్నాడు. -
అమ్మో జూన్..!
- బెంబేలెత్తిస్తున్న స్కూల్ ఫీజులు - జిల్లాలో ఒక్క నెలలో రూ.150 కోట్ల ఖర్చు - తల్లిదండ్రులకు తలకు మించిన భారం జూన్ అంటేనే సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. పాఠశాలల అడ్మిషన్, టెర్మ్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, ఇతర స్టేషనరీ అన్నింటి భారం ఒకేసారి నెత్తిన పడుతుంది. దీంతో సామాన్యుడిపై దాదాపు రూ.30 వేల భారం ఒకేసారి పడనుంది. శ్రీనివాస్ ఓ చిరుద్యోగి. తన కుమారుడిని నాలుగో తరగతిలో చేర్చేందుకు పటమట లోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థకు వెళ్లాడు. అక్కడి ఫీజుల చిట్టా చూసి అవాక్కయ్యాడు. వార్షిక ఫీజు రూ.40 వేలు, పుస్తకాలకు రూ.4 వేలు, స్కూల్ యూనిఫాం రూ.3,500, స్కూల్ షూస్, సాక్సులు కలిపి రూ.1500, ఇవి కాకుండా మెడికల్, ఇతర అవసరాల కోసం రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలి. వీటిలో ఫీజు మాత్రమే మూడు వాయిదాల్లో చెల్లించాలి. మిగిలినవన్నీ అడ్మిషన్ సమయంలోనే చెల్లించాలన్నది ఆ చిట్టాలో చివరన ఉన్న నిబంధన. సాక్షి, విజయవాడ : జూన్ నెల వచ్చిం దంటే సాధారణ ఉద్యోగి జేబుకు భారీ చిల్లుపడినట్లే. స్కూల్ ఫీజులు మొదలు అన్ని ఖర్చులు ఒక్కసారిగా మీదపడతాయి. స్కూల్ స్థాయిని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు ఈ నెలలోనే ఖర్చు పెట్టకతప్పని పరిస్థితి. జిల్లాలో 3,340 ప్రభుత్వ పాఠశాలలు, సుమారు 1200 వరకు ప్రయివేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరు లక్షల మంది వరకు విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం మొదలవుతుంది. ప్రభుత్వ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఈ నెల 10 నుంచి కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఒక్క జూన్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం రూ.150 కోట్ల పైనే ఖర్చుచేయాల్సి వస్తోంది. కార్పొరేట్కు పడని ముక్కుతాడు కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలై మెంది. నిబంధనల ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం ఫీజుల చిట్టాలను జిల్లా విద్యాశాఖకు సమర్పించి ఆమోదం పొందాలి. విద్యాసంవ్సరం ప్రారంభానికి ముందే పాఠశాలల్లో వసతులను విద్యాశాఖ అధికారులు పరిశీలించాలి. ప్రముఖ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను ఉచితంగా పేద విద్యార్థులకు ఇవ్వాలి. అయితే వీటిలో ఏ ఒక్కటీ అమలు కావడంలేదు. స్కూల్స్ నిర్ణయించిన ఫీజుల్లో 30 శాతం లాభం, 70 శాతం స్కూల్ నిర్వహణ, సిబ్బంది జీతాలకు కేటాయించాలి. అయితే 70 శాతం లాభం, 30 శాతం నిర్వహణ ఖర్చుగా మారింది. తనిఖీలు చేస్తాం పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రస్తుతం బిజీగా ఉన్నామని, మూడు రోజుల తర్వాత నుంచి జిల్లాలోని ప్రయివేట్ పాఠశాలలను తనిఖీ చేస్తామని జిల్లా విద్యాశాఖధికారి కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. స్కూల్స్లో సౌకర్యాలను, ఫీజుల వివరాలు, అన్నింటిని పరిశీలించి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశిస్తామన్నారు. నిబంధనలు పాటించ కుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
ఫీ‘జులుం’
{పైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలుగా ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్న యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం విస్తృత ప్రచారం వసతులు లేకున్నా.. ఆర్భాటం కనీస విద్యార్హతలేని వారితో బోధన పట్టించుకోని అధికారులు ఆందోళనలో తల్లిదండ్రులు జూన్ నెల అనగానే పిల్లల తల్లిదండ్రుల గుండెలు జారి పోతున్నాయి. జూన్లో స్కూళ్లు పునఃప్రారంభం కానుండడంతో ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీ అప్పుడే మొదలైంది. ఆకర్షణీయమైన కరపత్రాలు ముద్రించి.. ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఫీజులు కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఏటా వేలాది రూపాయల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు సతమతమవుతుంటారు. ఫీజులేగాక బుక్స్, డ్రెస్సులు, బెల్ట్, టై ఇతర ఖర్చులు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలను కట్టడి చేసే వారు లేకపోవడంతో వారు అడిగిన ఫీజు చెల్లించడం తప్ప మరో మార్గం లేదంటూ తల్లిదండ్రులు నిస్సహయతను వ్యక్తం చేస్తున్నారు. మెదక్ టౌన్ : ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియకు ప్రైవేట్ పాఠశాలలు తెర లేపాయి. మరో 15 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ప్రైవేట్ స్కూళ్ల సిబ్బంది రంగు రంగుల కరపత్రాలు పట్టుకొని రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇంటింటికి తిరుగుతున్నారు. చాలా పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోయినా కరపత్రాల ద్వారా నమ్మిస్తున్నారు. కొన్ని పాఠశాలలకు సౌకర్యాలు లేకపోగా, మరికొన్నింటికి అసలు ప్రభుత్వ గుర్తింపు లేదు. అదీగాక పాఠశాల పేర్ల చివరన కాన్వెంట్, టెక్నో, ఈ-టెక్నో, టాలెంట్, పబ్లిక్ వంటి పేర్లను తగిలిస్తూ పిల్లల తల్లిదండ్రులను మాయ చేస్తున్నారు. పాఠశాల పేర్ల చివరన తోకలను తొలగించాలని ప్రభుత్వ రెండేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. భారీగా ఫీజులు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. కానీ జిల్లాలో ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే వేలాది ఫీజులు గుంజుతున్నాయి. స్పోకెన్ ఇంగ్లిష్, డిజిటల్ క్లాస్, కరాటే, డాన్స్, డ్రాయింగ్ కోచింగ్లు నిర్వహిస్తామంటూ అదనంగా మరింత వసూలు చేస్తున్నాయి. వీటికితోడు యూనిఫారాలు, పుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, సాక్స్, టై, బెల్టు పేరిట మరికొంత గుంజుతున్నాయి. వీటిని కూడా పాఠశాలలోనే విక్రయిస్తున్నాయి. వారి వద్దే కొనాలనే నిబంధన కూడా విధిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలనే విషయాన్ని కూడా మరిచిపోతున్నారు. సౌకర్యాలు సున్నా.. చిన్న చిన్న తరగతులకే వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు పాఠశాలల్లో మాత్రం సౌకర్యాలు అరకొరే. డిజిటల్ క్లాసులు, పిల్లల విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రత్యేక కార్యక్రమాలు, ఎక్స్ట్రా కేర్, డాన్స్, గేమ్స్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టడం మినహా వారు చెప్పినవన్నీ పాటించే పాఠశాలలు చాలా తక్కువే. నిబంధనలకు నీళ్లు.. ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు. కానీ చాలా స్కూళ్లల్లో దీన్ని పాటించడం లేదు. ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వారికే అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చిన్న వయస్సులోనే మానసికంగా కుంగిపోయి చదువుపై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. అర్హత లేనివారితో బోధన.. చాలా పాఠశాలల యాజమాన్యాలు డిగ్రీ, ఇంటర్ చదివిన వారితోనే విద్యా బోధన సాగిస్తున్నాయి. కరపత్రాల్లో మాత్రం ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తాకొట్టిస్తున్నాయి. కేరళ యాజమాన్యం, కేరళ సిబ్బంది అంటూ బూటకపు ప్రచారాలు చేస్తున్నాయి. పదోతరగతి ఫలితాలను ఇష్టానుసారంగా ప్రచారం చేయొద్దంటూ ప్రభుత్వం జీపీఏ పద్ధతి ప్రవేశ పెట్టినా వాటిని ఆసరా చేసుకుని మరింత విచ్చలవిడిగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అనుమతి లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం... ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలను ఏర్పాటు చేయకూడదు. మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాలు కల్పించాలి. అడ్మిషన్ వేళ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు. శిక్షణ పొందిన వారితోనే విద్యా బోధన చేపట్టాలి. అనాథలు, హెచ్ఐవీ బాధితులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, రూ.60 వేలలోపు వార్షిక ఆదాయం ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలలో 1:35 చొప్పున ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి కచ్చితంగా అమలు చేయాలి. -
పాఠశాల ప్రవేశాలకు ప్రత్యామ్నాయం
* వయసుకు సంబంధించిన గందరగోళానికి తెర * 9 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్లు పుణే: పాఠశాల అడ్మిషన్లలో వచ్చే ఏడాది నుంచి ఒకే వయో పరిమితిని అమలు చేయనుండటంతో ఈ ఏడాది అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ మరో మార్గం ఆలోచించింది. అడ్మిషన్ సమయంలో వయస్సుకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించడానికి ఈమేరకు ఓ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పాఠశాలలు విద్యార్థుల వయస్సు వివరాలు విడివిడిగా ఇవ్వాలని, ఆ ప్రకారమే అడ్మిషన్లు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మనే శనివారం తెలిపారు. నాసిక్లో ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న రిజిస్ట్రేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తులు 16 నుంచి 28 వరకు స్వీకరిస్తారు. పుణే, పింప్రి, చించ్వాడ్, ముంబై, థాణే, కల్యాణ్ దోంబివలి, నాగ్పూర్, భీవండి-నిజాంపూర్, ఉల్హస్నగర్, మిరా-భయందర్, నవీ ముంబై, అమరావతి, లాతూర్, ఔరంగాబాద్, కొల్హాపూర్లలో ఈ నెల 16 నుంచి 21 వరకు ఈ పద్ధతి కొనసాగుతుందని అధికారులు వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తులు ఫిభ్రవరి 23 నుంచి మార్చి 7 వరకు స్వీకరిస్తారని వారు వెల్లడించారు. డిప్యూటీ డెరైక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెరిఫికేషన్ సెంటర్ను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు (rte25admission. maharashtra.gov.in)ను సంప్రదించాలని చెప్పారు. ఆర్టీఈ చట్టం ప్రకారం చేరిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.26 కోట్ల ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. ఓ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై జరిగిన అత్యాచార కేసు విషయంలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రాథమిక విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మానే తెలిపారు. అయితే గతంలో మూడు పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసు పురోగతి గురించి ప్రశ్నించగా చివరి నివేదిక సమర్పించడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులకు వారం రోజులు గడువిచ్చినట్లు తెలిపారు. -
పిల్లలకూ బీమా ధీమా కావాలి!
తల్లిదండ్రులెవరైనా తమ పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని కోరుకుంటారు. వారి భావి జీవితం గురించి గొప్ప కలలుకంటారు. అయితే... వారి భవిష్యత్తుకి తగిన విధంగా పొదుపు చేస్తున్నామా లేదా విషయంలో వారు కొంత నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఉదయం పిల్లలను పాఠశాల వద్ద దింపడం... వారిని ఇంటివద్ద చదివించడం సెలవు రోజుల్లో పార్కులకు, షికార్లకు, సినిమాలకు తిప్పడం... బొమ్మలూ అవీ ఇవీ కొనివ్వడం... వారు మురిసిపోవడం చూసి ఆనందంతో ఉప్పొంగిపోవడం.. దీనితో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోతుందా? వారి బంగారు భవిష్యత్తుకు ఇవి మాత్రమే బాటలు పరుస్తాయా..? చేయాల్సింది ఎంతో... పిల్లల విషయంలో పైన పేర్కొన్న వన్నీ అవసరమే. అయితే వారికి సంబంధించి ఇంకా చేయాల్సింది ఎంతో ఉంటుంది. పిల్లల పెంపకం ఒక్కరోజుతో అయిపోయే పనికాదు. వారు పెరుగుతూ ఉంటే... వారికి సంబంధించిన అవసరాలూ పెరుగుతూ ఉంటాయి. స్కూల్ ఫీజులు, ప్రాజెక్ట్ ఐటమ్స్, అదనపు క్లాసులు, ట్యూషన్లు, ఉన్నత విద్య... వీటన్నింటికీ ఊహించినదానికన్నా అధిక వ్యయాన్ని చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తల్లిదండ్రులకు రోజురోజుకూ... ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారుతుండడాన్ని కూడా చూస్తుంటాం. ఇక్కడే పొదుపు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే పదాలకు కీలక ప్రాధాన్యత ఏర్పడుతుంది. మార్కెట్లో ఇందుకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్ట్రమెంట్లు ఎన్నో కనబడతాయి. ఇక్కడ బీమా రంగంలో పిల్లల ప్రొడక్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లక్ష్యం చేరుకునేలా ఉండాలి... భవిష్యత్ బాగుండాలని మనం కోరుకోగలంకానీ... ఇలానే ఉండాలని నిర్దేశించుకోలేం. భవిష్యత్తుకు సంబంధించి మంచితోపాటు చెడునూ ప్రాక్టికల్గా ఊహించగలగాలి. మన పిల్లల పట్ల మన కోరికలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగారిపోకుండా గరిష్ట స్థాయిలో ప్రణాళిక వేసుకోవడం ఇక్కడ అవసరం. ఇంకా చెప్పాలంటే... భవిష్యత్తులో భౌతికంగా పేరెంట్ అండ ఉన్నా, లేకున్నా... పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగేలా తల్లిదండ్రులు ముందే చర్యలు తీసుకోవాలి. ఇందుకు బీమానే అండాదండా. రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు... కానీ... పిల్లల భవిష్యత్కు సంబంధించి ఎంచుకునే బీమా ప్రొడక్ట్ మంచి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. అయితే దురదృష్టవశాత్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నడిపే వ్యక్తి మరణిస్తే... బాధిత కుటుంబం విషయంలో బీమా తదుపరి ప్రీమియంల రద్దు... బీమా మొత్తం చెల్లింపులు... పిల్లల భవిష్యత్ విద్యకు సంబంధించి ఆర్థిక అవసరాలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా చూసే పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. టర్మ్ కవర్తో పోల్చకూడదు... టర్మ్ ఇన్సూరెన్స్ కవర్కూ- దీనికి తేడా ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ఒకేలా అనిపిస్తున్నా... కొంత వ్యత్యాసం ఇక్కడ ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న సందర్భంలో పేరెంట్కు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితేనే బీమా ప్రయోజనం అందుతుంది. అయితే పిల్లల భవిష్యత్కు సంబంధించి తీసుకునే బీమా పథకాల్లో... పేరెంట్కు ఏదైనా జరిగితే తదుపరి ప్రీమియం చెల్లింపు అవసరం ఉండదు. అదే సమయంలో ‘అండ కోల్పోయిన’ చిన్నారి విద్యా అవసరాలకు సంబంధించి ఒక ప్రణాళికా బద్ధంగా తగిన రీతిలో బీమా సొమ్ము అందుతుంది. డబ్బుకు సంబంధించి పిల్లలు ఏ దశ, స్థాయిలోనూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంతా అనుకున్నది అనుకున్నట్లు మంచిగా జరిగిపోతే బీమా మొత్తం మెచ్యూరిటీ సమయంలో కొంత బోనస్తో వెనక్కువచ్చే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. మీ చేతుల్లో పెరిగిన మీ పసిబిడ్డ ఉన్నత స్థానంలో నిలబడ్డం... మీరు బీమా నిమిత్తం చెల్లిస్తూ వచ్చిన సొమ్ము మొత్తం ఏకమొత్తంగా కొంత బోనస్తో మీ చేతుల్లో ఉండడం... ఒకేసారి డబుల్ బొనాంజాను మీరు చూడగలుగుతారు. చివరిగా ఇలాంటి బీమా ప్రొడక్టుల ఆఫర్ విషయంలో కంపెనీ-కంపెనీకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్ విద్యా ప్రణాళికకు అనుగుణంగా తగిన మంచి ప్రొడక్ట్ను ఎంచుకోండి. తక్షణం మీ సంపాదనలో కొంత మొత్తం ఈ తరహా పథకాలపై వెచ్చించాలన్న విషయాన్ని మర్చిపోవద్దు..! -
వామ్మో.. జూన్!
- స్కూల్ ఫీజులు భారం - పెరిగిన పుస్తకాల ధరలు - బెంబేలెత్తిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కామారెడ్డి, న్యూస్లైన్, మరో పక్షం రోజుల్లో బడులు తెరుచుకోనున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. జూన్ పేరు వింటేనే హడలిపోయేవారున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి వారు పిల్లల ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు..ఇతర సామాగ్రి కొనుగోలు వంటి విషయాల్లో ఆందోళనతో ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అప్పుడే చదువుల ఖర్చుల గురించి లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ఫీజులను చూసి జడుసుకుంటున్నారు. జిల్లాలో ఏడాదికేడాది ప్రైవేటు పాఠశాలల్లో ఏదో కొత్తదనమంటూ ఫీజులను పెంచేస్తున్నారు. పాఠశాలల మధ్య ఎంత పోటీ ఏర్పడుతున్నా ఫీజుల విషయంలో మాత్రం అందరూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, ఉపాధ్యాయుల కొరతను తీర్చకపోవడం వంటి కారణాలతో పాటు కొందరు ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో దురభిప్రాయం ఏర్పడింది. పేదవారైన సరే తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను అడ్డగోలుగా పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర భారం మోపుతున్నాయి. వారి జేబులను ఖాళీ చేస్తున్నాయి. పాఠశాలలు తెరవడానికి మరో పక్షం రోజుల సమయం ఉన్నప్పటికీ యాజమాన్యాలు అప్పుడే ప్రచార పర్వం మొదలుపెట్టాయి. టెక్నో, గ్రామర్, మోడల్, కాన్సెప్ట్ వంటి తోక పేర్లు తగిలించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పుస్తకాల ధరలు ఆకాశంలో.. ప్రైవేటు పాఠశాలల్లో ఉపయోగిస్తున్న పుస్తకాలకు సంబంధించి ధరలు చూస్తే విస్తుపోవాల్సిందే. గతేడాది నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ చదివే పిల్లలకు వెయ్యికి తగ్గకుండా పుస్తకాలు, నోటు పుస్తకాలు తీసుకున్నారు. ఈ సారి అవి మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే పేపర్ ధర పెరగడంతో పుస్తకాలు, నోట్పుస్తకాల ధరలు మరింత పెరగవచ్చంటున్నారు. అయితే ఆయా పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు బ్యాగులను కూడా తమ వద్దనే కొనాలనే నిబంధనలు విధిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే కొనాల్సి వస్తోంది. బ్యాగులు, షూస్, అన్నీ భారమే... మార్కెట్లో పిల్లలకు సంబంధించిన పుస్తకాల బ్యాగులు, వాటర్బాటిళ్లు, షూస్.. ఇలా అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడం పేరెంట్స్కు భారంగా మారింది. తోటి పిల్లలు రకరకాల వస్తువులు తెచ్చుకుంటుంటే తమ పిల్లలకు ఏదీ తక్కువ కాకూడదన్న భావనతో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు కావలసిన అన్ని వస్తువులు ఖరీదెంత అయినా సరే కొనుగోలు చేసి ఇస్తున్నారు. మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. జూన్ అంటేనే భయపడుతున్నారు.