seema
-
తల్లి కాబోతున్న సీమా హైదర్
ఢిల్లీ : ఆన్లైన్ గేమ్లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్కు వచ్చిన సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భర్త సచిన్ మీనాతో కలిసి సీమా హైదర్ బేబీ బంప్తో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ ఏడాది జులైలో పబ్జీ (pubg) వీడియోగేమ్లో గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో ప్రేమలో పడింది. సచిన్ మీనాకు దూరంగా ఉండలేక తన నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి నేపాల్ మీదుగా భారత్లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్ ఉదంతంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.పాక్ నుంచి భారత్కు వచ్చిన హైదర్ ఆరోపణలు,కోర్టు కేసుల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో మతం మార్చుకుని సచిన్ను వివాహం చేసుకున్నారు. తన మొదటి భర్త సంతానంతో పుట్టిన నలుగురు పిల్లల పేర్లు మార్చారు. నలుగురు పిల్లలతో కలిసి రెండో భర్త సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. తాజాగా, త్వరలో తాను పండంటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. -
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.ఒకప్రాంతంలో... ‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’‘ఫోటో ఉందా?‘లేదయ్యా’మరోప్రాంతంలో...‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు. ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు. -
సల్మాన్ ఖాన్ సోదరుడితో విడాకులు.. ఇప్పుడేమో మాజీ భాయ్ఫ్రెండ్తో!
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య సీమా సజ్దేహ్ ఓ షోలో మెరిసింది. నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో కనిపించింది. ఈ షోలో పాల్గొన్న సీమా సజ్దేహ్ తన వివాహా జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోహైల్ ఖాన్తో పెళ్లికి ముందే ప్రముఖ రచయిత విక్రమ్ అహుజాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ను పెళ్లాడింది. వీరిద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు.తాజాహా నెట్ఫ్లిక్స్ షోలో కనిపించిన సీమా.. తన డేటింగ్ గురించి నోరు విప్పింది. సోహైల్తో డివోర్స్ తర్వాత విక్రమ్ అహుజాతో డేటింగ్లో ఉన్నట్లు సీమా వెల్లడించింది. ప్రస్తుతం అతనితో డేటింగ్లో ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ముంబయిలోని వర్లీ నుంచి బాంద్రాకు మారినప్పుడు తన ఇంటికోసం సాయం చేశాడని సీమా తెలిపింది. తన గురించి నాకంటే అతనికే ఎక్కువగా తెలుసని చెప్పింది. అతనితో మళ్లీ ప్రేమలో పడినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.కాగా.. విక్రమ్ అహుజా ఒక వ్యాపారవేత్త. మల్టీ మిలియనీర్ దేవేంద్ర అహుజా కుమారుడు. అతను సెంచూరియన్ బ్యాంక్ ప్రమోటర్గా పనిచేశాడు. గతంలో సీమా, విక్రమ్ 1990 నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఊహించని కారణాలతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సీమా.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీంతో తాజాగా సీమా తన మాజీ బాయ్ఫ్రెండ్ విక్రమ్ అహుజాతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. నెట్ఫ్లిక్స్ షో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది. -
మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
పాక్ నుంచి పారిపోయివచ్చి, తన ప్రియుడు సచిన్తో పాటు యూపీలోని నోయిడాలో ఉంటున్న సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగా ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానల్లో తెలిపారు. గులాం హైదర్ ఆ వీడియోలో..‘పిల్లలూ మీ నాన్న ఇండియా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడా కోర్టు సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ను జూన్ 10న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే ఆయన ఈరోజు (సోమవారం) నోయిడా కోర్టుకు హాజరు కావాల్సివుంది. సీమా హైదర్ పాక్ నుంచి భారత్ వచ్చినది మొదలు ముఖ్యాంశాలలో కనిపిస్తున్నారు. సీమా-సచిన్ ల ప్రేమకథ దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. సీమా తనతో పాటు తన నలుగురు పిల్లలను కూడా పాకిస్తాన్ నుంచి భారత్కు తీసుకువచ్చారు. ఈ పిల్లలు సీమా, ఆమె పాక్ భర్త గులాం హైదర్లకు జన్మించారు.తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ కోర్టును ఆశ్రయించారు. కరాచీలో నివసిస్తున్న ఆయన.. సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటు కాదంటూ భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతలోనే సీమా తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్కు తిరిగి వెళ్లబోనని, తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని పేర్కొంది.ఈ ఉదంతం గురించి మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన న్యాయబద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలను మత మార్పిడి చేయడంపై నిషేధం ఉన్నదన్నారు. సీమా ప్రస్తుతం భారత్లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని అన్నారు. గులాం హైదర్ తన భార్య సీమా నుంచి ఏమీ కోరుకోవడం లేదని, తన పిల్లలను పాకిస్తాన్కు తీసుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారని అన్సార్ తెలిపారు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నదో వేచి చూడాల్సిందే. -
‘సీమా హైదర్ చాలా డేంజర్’
ప్రియుని కోసం పాక్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన సీమా హైదర్ ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రియుడు సచిన్ మీనా కూడా వార్తల్లో కనిపిస్తున్నాడు. పాకిస్తానీ భాబీగా పేరొందిన సీమా హైదర్, ఆమె భారతీయ భర్త సచిన్ మీనాల సరిహద్దు ప్రేమ కథ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సీమా, సచిన్లు పిల్లలతో పాటు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.తాజాగా సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ సన్నిహితుడొకరు సీమా హైదర్ గురించి మీడియాకు పలు సంచలన విషయాలు తెలిపారు. ఈ వివరాలు అందించిన వ్యక్తికి సీమాహైదర్తోనూ పరిచయం ఉంది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సీమా హైదర్ తరచూ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్లేది. ఆమె కుటుంబ సభ్యులు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె మేనమామ గులాం అక్బర్ పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నాడు.సీమా హైదర్ తన మామను కలవడానికి ఆర్మీ క్యాంపుకు ఒంటరిగా వెళ్లేది. అటువంటి సందర్భంలో చాలా రోజులు అక్కడే ఉండేది. సీమాకు కంప్యూటర్కు పరిజ్ఞానం ఉంది. దీంతో ఆమె ఆర్మీ క్యాంపులో గూఢచర్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి ఉండవచ్చని గులాం హైదర్ సన్నిహితుడు అనుమానం వ్యక్తం చేశాడు.ఈ వివరాలు వెల్లడించిన వ్యక్తి భారత్కు చెందిన గులాం హైదర్ లాయర్ మోమిమ్ మాలిక్తో టచ్లో ఉన్నాడని సమాచారం. కాగా ఈ ఇన్ఫార్మర్ ఎవరనే విషయాన్ని మోమిమ్ వెల్లడించనప్పటికీ ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ తన వద్ద ఉందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ తన పిల్లలను తన దగ్గరకు తెచ్చుకునేందుకు సీమాపై కేసు పెట్టారు. సచిన్తో సీమా వివాహం చట్టవిరుద్ధమని, వారి పిల్లలపై సీమాకు ఎలాంటి హక్కు లేదని గులాం తరపు న్యాయవాది మోమిమ్ పేర్కొన్నారు. -
బీజేపీలో చేరిన సంచలన లాయర్
Nirbhaya Lawyer Seema Kushwaha: సుప్రీంకోర్టు న్యాయవాది, బీఎస్పీ నేత సీమా కుష్వాహా సోమవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్రాస్ సామూహిక అత్యాచారం, శ్రద్ధా వాకర్ హత్య వంటి ల్యాండ్మార్క్ కేసుల్లో బాధితుల తరపున వాదించి కుష్వాహా ప్రసిద్ధి చెందారు. ఎవరీ సీమా కుష్వాహ? సీమా కుష్వాహా 2022 జనవరిలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి తరపున వాదించిన తర్వాత కుష్వాహాకు ఎనలేని గుర్తింపు లభించింది. మరోవైపు నిర్భయ జ్యోతి ట్రస్ట్ను స్థాపించి అత్యాచార బాధితుల తరపున న్యాయం కోసం వాదించే ప్రచారాన్ని కుష్వాహా ప్రారంభించించారు. కుష్వాహాతో పాటు ఉత్తరప్రదేశ్ లాల్గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్ కూడా బీజేపీలో చేరారు. సంగీత భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా ఆమెతో పాటు కాషాయ శిబిరంలో చేరారు. నిర్భయ అత్యాచారం కేసు 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై 2012 డిసెంబర్లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, దాడి చేసి రోడ్డు మీదకి తోసేశారు. బాధితురాలు చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29న మృతి చెందారు. బాధితురాలికి న్యాయం చేయడానికి ఏడేళ్లు పట్టింది. నిర్భయ కేసులో నలుగురు దోషులను 2020 మార్చి 20న ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. #WATCH | BSP MP Sangeeta Azad, party leader Azad Ari Mardan and Supreme Court lawyer Seema Samridhi (Kushwaha) join the BJP, in Delhi. pic.twitter.com/oaLN8Hg1Fo — ANI (@ANI) March 18, 2024 -
Nayi Disha Seema Seth: కార్పొరేట్ రంగం నుంచి కార్మిక లోకానికి...
కార్పొరేట్ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన సీమా సేథ్ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది.... ‘ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్ దాస్ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు. ‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు. ‘సీమా మేడమ్ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్. బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్ను మార్చివేసింది సీమ. ‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్పూర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు. ‘లేదు’ అని చెప్పింది సీమ. తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడిగింది సీమ. ‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్. ఆ తరువాత... ‘మేడమ్... మీరు అక్కడ స్కూల్ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్. సీమ ఆలోచనలో పడింది. ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్ స్టార్ట్ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది. గురుగ్రామ్లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్కు వచ్చి కంప్యూటర్ నుంచి థియేటర్ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది. ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు. ‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ. ‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్. ‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు. సిలబస్ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్–టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. ‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్ ఒక మీటింగ్లో చెప్పారు’ అంటున్నాడు అశోక్రావు అనే పేరెంట్. వినే వారు తప్పకుండా ఉంటారు మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి. – సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు -
సీమా హైదర్కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!
పాక్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ తెలిపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. -
సీమా హైదర్ కేసులో కొత్త మలుపు?
తన నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారత్కు వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కేసు కొత్త మలుపు తిరిగింది. సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్కు తిరిగి తెచ్చుకునేందుకు ఒక భారతీయ న్యాయవాదిని నియమించుకున్నారు. మానవ హక్కుల కార్యకర్త ఒకరు పాక్లోని కరాచీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సీమా, సచిన్ మీనాల కేసును ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. వీరిని నోయిడా పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత 2023 జూలైలో ఈ జంటను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సీమా 2023 మేలో తన నలుగురు పిల్లలతో పాటు రబుపురా ప్రాంతంలో రహస్యంగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె పిల్లలందరూ ఏడేళ్లలోపు వారే. సీమా, మీనాలను గత ఏడాది జులై 4న అరెస్టు చేసిన స్థానిక కోర్టు జూలై 7న వారికి బెయిల్ మంజూరు చేసింది. పాక్లోని సింధ్ ప్రావిన్స్లో గల జాకోబాబాద్కు చెందిన సీమా హైదర్ కరాచీలోని తన ఇంటి నుంచి నేపాల్ మీదుగా గత ఏడాది మేలో తన పిల్లలతో కలిసి భారత్కు వచ్చింది. ఆ సమయంలో సీమా భర్త గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. కాగా పాక్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ, సీమా భర్త గులాం హైదర్ తన నలుగురు పిల్లల సంరక్షణలో సహాయం కోసం తనను సంప్రదించారని చెప్పారు. ఈ నేపధ్యంలో తాము భారతీయ న్యాయవాది అలీ మోమిన్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. అలాగే భారతీయ న్యాయస్థానాలలో చట్టపరమైన చర్యలను ప్రారంభించేందుకు పవర్ ఆఫ్ అటార్నీని పంపామని తెలిపారు. మానవ హక్కుల కార్యకర్త బెర్నీ ఒక ట్రస్ట్ను కూడా నడుపుతున్నారు. ఇది తప్పిపోయిన, కిడ్నాప్కు గురయిన పిల్లలను వెదికేందుకు పనిచేస్తుంది. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలకు సాయం అందించేందుకు కూడా ఆయన ముందుకు వచ్చారు. కాగా సీమా హైదర్ తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్కు తిరిగి వెళ్లనని స్పష్టం చేసింది. తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని సీమా పేర్కొంది. కాగా గులాం హైదర్ వాదన బలంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న వయసు కలిగిన పిల్లల మత మార్పిడి నిషేధమని బర్నీ తెలిపారు. సీమ ప్రస్తుతం భారత్లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని, వారు చిన్న వయస్సులో ఉన్నందున వారిపై పూర్తి హక్కులు తండ్రికి ఉంటాయని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. గులాం హైదర్ తన భార్య నుండి ఏమీ కోరుకోవడం లేదని, కేవలం తన పిల్లలను మాత్రమే పాకిస్తాన్కు తీసుకురావాలని కోరుకుంటున్నాడని బర్నీ తెలిపారు. భారతదేశంలోని సీమా హైదర్, సచిన్ మీనా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన గురించి తమకు ఇంకా తెలియలేదని, దీని గురించి అధికారికంగా తెలియగానే స్పందిస్తామన్నారు. -
అయోధ్యకు సీమా హైదర్ పాదయాత్ర.. సీఎంకు అభ్యర్థన!
అయోధ్యలో కొలువైన రామ్లల్లాను దర్శించేందుకు సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్పై ప్రేమతో పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది. సీమా హైదర్ తాను కృష్ణ భక్తురాలిని చెప్పుకుంటుంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది. ఈ వీడిలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీమా హైదర్ తాను హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని అమె వెల్లడించింది. సోషల్ మీడియాలో సీమాహైదర్కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్తో కలిసి ఉంటోంది. కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్న సీమా హైదర్ ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్ ప్రయత్నిస్తున్నారు. సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నదని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. కుటుంబ సభ్యులందరితో కలిసి రామ్లల్లా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నట్లు సీమా మీడియాకు తెలిపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
ప్రశ్నించేవారికి షరతు విధించిన సీమాహైదర్!
పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, యూపీ నివాసి సచిన్ మీనాల ప్రేమకథ దేశంలో సంచలనంగా నిలిచింది. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో సీమాహైదర్ ప్రతిరోజూ హెడ్లైన్స్లో కనిపిస్తుంటుంది. ఈ వీడియోలు చూసిన చాలామంది ఆమె గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె వీడియోల కింద తమ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు జోడిస్తుంటాడు. తాజాగా సీమా హైదర్కు చెందిన ఒక వీడియో వైరల్గా మారింది. ఇందులో సీమ.. తనును ఎవరైనా ఎటువంటి ప్రశ్ననైనా అడగవచ్చని, అయితే దానికి ఒక షరతు ఉందని పేర్కొంది. సచిన్, సీమ హైదర్ ప్రేమకథ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల క్రితం ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ నేపాల్లో కలుసుకున్నారు. అక్కడే తాము పెళ్లి చేసుకున్నామని గతంలో వారు చెప్పారు. సీమా పాకిస్తాన్ నుంచి తన నలుగురు పిల్లలతో సహా భారత్కు అక్రమంగా తరలి వచ్చింది. అప్పటి నుంచి ఆమె నోయిడాలో భర్తతో పాటు ఉంటోంది. సచిన్, సీమా హైదర్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని రోజుల క్రితం సీమా హైదర్, సచిన్ల వీడియో వైరల్గా మారింది. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు ఏదైనా ప్రశ్న అడగవచ్చని ఆమె పేర్కొంది. తన గత, ప్రస్తుత జీవితం గురించి ఎవరైనా ఏదైనా అడగవచ్చని, అయితే మంచి విషయాలు గురించి అడిగితే మాత్రమే సమాధానం తన నుంచి వస్తుందని తెలిపింది. అంటే మంచి ప్రశ్నలను మాత్రమే అడగాలని ఆమె షరతు విధించించిందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీమా హైదర్ ఇటీవల హిందూ పండుగలను జరుపుకుంటూ వార్తల్లో నిలిచారు. -
రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్
ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్గా మారింది. సచిన్-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jist (@jist.news) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్లో ఉంటున్నారు. -
‘సీమా హైదర్ ఒక దొంగ.. నేరస్తురాలు.. ఉరికంబం ఎక్కిస్తా’
పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ తన ప్రియుడు సచిన్ మీనా కోసం తన పిల్లలతో సహా భారత్కు వచ్చేసింది. ఆమె భారతదేశానికి వచ్చినప్పటి నుండి.. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తన భార్య సీమా హైదర్ను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాడు. గులాం హైదర్కు చెందిన పలు వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో ఆమెను వెనక్కి పంపించాలంటూ అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కనిపిస్తుంది. సీమా హైదర్ భారతదేశానికి వచ్చిన తర్వాత, పాకిస్తాన్లోని ఆమె భర్త గులాం హైదర్ సోషల్ మీడియా ప్లాట్ఫారంపై తన సొంత యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించాడు. ఈ ఛానెల్ ద్వారా గులాం హైదర్ తన సందేశాన్ని భారత్, పాకిస్తాన్ ప్రజలకు తెలియజేయజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల గులాం హైదర్కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను భారత ప్రభుత్వానికి మరోమారు విజ్ఞప్తి చేస్తూ కనిపిస్తున్నాడు. గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్కు తిరిగి పంపించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. మరోవైపు సీమా హైదర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్, నేత్రపాల్లను గులాం హైదర్ హెచ్చరిస్తూ కూడా వీడియోలో కనిపిస్తున్నాడు. వీలైనంత త్వరలో తాను పాకిస్తాన్ నుంచి భారత్కు వస్తానని కూడా గులాం హైదర్ ఆ వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోలో గులాం హైదర్ తన భార్య సీమా హైదర్పై పలు ఆరోపణలు చేస్తూ.. తన పిల్లలను పాకిస్తాన్ నుంచి భారత్కు అక్రమంగా తీసుకెళ్లిందని ఆరోపించాడు. తన పిల్లలను తనతోపాటు తీసుకురావడానికి తాను ఖచ్చితంగా భారతదేశానికి వెళ్తానని, భారతదేశ ప్రజలపై, భారతదేశ చట్టాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని గులాం హైదర్ పేర్కొన్నాడు. తన పోరాటానికి భారత్లో తప్పకుండా మద్దతు దొరుకుతుందని అన్నాడు. ‘సీమా హైదర్ ఒక దొంగ... నేరస్తురాలు.. నా ఆస్తి, ఇల్లు అమ్మేసి ఇండియా పారిపోయింది. అందుకే ఈరోజున నేను రోడ్డున పడ్డాను. సీమా.. ఇక నువ్వు ఏం చేసినా తప్పే.. నువ్వు ఏడుస్తావు.. పశ్చాత్తాపపడతావు.. బాధపడతావు.. ఆర్తనాదాలు చేస్తావు.. ఏదో ఒక రోజు నేను నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను.. ఇదే నా జీవిత లక్ష్యం’ అని ఆ వీడియోలో గులాం హైదర్ పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగితో పాటు పాకిస్తాన్ ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని గులాం హైదర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అలాగే సీమా హైదర్ ప్రేమికుడు సచిన్ మీనా, ఏపీ సింగ్, నేత్రపాల్లను హెచ్చరించాడు.. ‘గుర్తుంచుకోండి.. మీరు ఇప్పటివరకు ఏమి చేసినా.. ఏదో ఒకరోజు మీ అందరికీ శిక్ష పడుతుంది’ అని పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
కొత్త సంవత్సరంలో సీమా హైదర్ ప్లానేమిటి?
2023 ముగిసింది. 2024 నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అందరూ తమ ఆశలు, అంచనాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు. 2023లో వార్తల్లో కనిపించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ కూడా కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. 2023 తనకు ఎంతో మంచి చేసిందని సీమా హైదర్ మీడియాకు తెలిపారు. 2024లో తన సమస్యలన్నీ తొలగిపోతాయని, కుటుంబంతో కలిసి భారతదేశంలో స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం దక్కుతుందని ఆశ పడుతున్నానని ఆమె పేర్కొన్నారు. మే 2023లో నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో సహా యూపీ చేరుకున్న సీమా హైదర్ ప్రస్తుతం రబుపురా గ్రామంలోని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలనే నిబంధన ఉందని, అందుకే ఇంటిలోనే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నానని సీమా తెలిపారు. తనకు బయటకు వెళ్లే అవకాశం దొరికినప్పుడు దేశమంతా పర్యటించాలని కోరుకుంటున్నానని, తన భర్త, పిల్లలు ఇంటి బయట నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. అయితే తన నలుగురు పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉందని, అందుకే వారు ట్యూషన్కు వెళుతున్నారని ఆమె తెలిపారు. అయితే 2024లో తన పిల్లలను బడికి పంపించే అవకాశం దక్కుతుందనుకుంటున్నానని సీమ పేర్కొన్నారు. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి 2023, మే 13న నేపాల్ మీదుగా భారత్కు తరలివచ్చారు. తరువాత రబుపురా గ్రామం చేరుకుని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. కాగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాపై గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను, సచిన్, సచిన్ తండ్రిని అరెస్ట్ చేశారు. ముగ్గురినీ గత జూలై 4న అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురికీ బెయిల్ మంజూరైంది. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు -
బీజేపీ పెద్దలకు సీమా హైదర్ రాఖీ..
లక్నో: ప్రియుని కోసం పాకిస్థాన్ వదిలి భారత్ వచ్చిన సీమా హైదర్ ప్రధాని మోదీకి రాఖీ పంపించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్తో సహా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు కూడా రాఖీలు పంపించింది. ఈ నెల 30న రాఖీ పండగ సందర్భంగా రాఖీలను పోస్టు చేసినట్లు తెలిపింది. 'ఈ దేశ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నా సోదరులకు రాఖీలను పింపించాను. జై శ్రీరాం, జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్.' అంటూ సీమా హైదర్ నినాదాలు చేసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్యాగ్రౌండ్లో 'బయ్యా మేరే రాఖీ కె బంధన్ కో నిభానా' అనే సాంగ్ కూడా ప్లే అవుతోంది. సీమా తన పిల్లలతో కలిసి రాఖీ కడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. పబ్జీలో పరిచయమైన సచిన్ అనే యువకున్ని ప్రమించి అతని కోసం స్వదేశమైన పాక్ను దాటి వచ్చేసింది సీమా హైదర్. పిల్లలతో కలిసి దుబాయ్ మీదుగా నేపాల్ చేరి అటునుంచి ఉత్తరప్రదేశ్కి చేరింది. ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె తన ప్రియునితో కలిసి నోయిడాలో జీవిస్తోంది. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు!
ప్రేమ కోసం దేశ సరిహద్దులను లెక్కచేయకుండా పాకిస్తాన్ నుంచి భారత్కు తరలివచ్చిన సీమా హైదర్ కథ మరచిపోకముందే అలాంటి అనేక ప్రేమ కథలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్కు చెందిన ఒక మహిళ తన ఏడాది కుమారునితో పాటు భారత్కు తరలివచ్చింది. ఆమె తన పేరు సానియా అఖ్తర్ అని చెబుతోంది. సానియా బంగ్లాదేశ్నుంచి వీసా తీసుకుని, తన భర్త సౌరభ్ కాంత్ తివారిని కలుసుకునేందుకు వచ్చింది. సానియా, సౌరభ్లు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని సమాచారం. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ఇప్పుడు ఏడాది వయసు. సానియా ఇప్పుడు కుమారుడిని తీసుకుని, తన భర్త ఉంటున్న నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చాక భర్త మరో వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసింది. సానియా మీడియాతో మాట్లాడుతూ తన భర్త సౌరభ్ తనకు ఇప్పుడు ఆశ్రయం కల్పించడం లేదని, తనను మోసం చేసిన సౌరభ్ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని తెలిపింది. కాగా ఈ ఉదంతం నోయిడా పోలీసుల వరకూ చేరింది. ఆమె తన కుమారుడిని తీసుకుని సెక్టార్ 108లో ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్ బంగ్లాదేశ్లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. -
స్వాతంత్య్ర వేడుకల్లో సీమా హైదర్.. జేజేలు కొడుతూ..
లక్నో: పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ ఉత్తరప్రదేశ్లో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. ప్రియుడు సచిన్ కోసం స్వదేశం దాటిన ఈ వివాహిత తిరంగ జెండాను ఎత్తి నినాదాలు చేస్తోంది. యూపీలో 'హర్ గర్ తిరంగ' వేడుకల్లో భాగంగా నోయిడాలో తన తరుపున వాదించిన లాయర్తో సహా కలిసి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్గా మారాయి. అయితే.. పాక్ దేశీయురాలు సీమా హైదర్కు ఇటీవల ఓ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. 'కరాచీ టు నోయిడా' పేరుతో నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ముందుకొచ్చారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. మహారాష్ట్రకు చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేనా(ఎమ్ఎన్ఎస్) సీమా హైదర్కు హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఆమె తన బాలీవుడ్ మూవీ ఆఫర్ను తిరస్కరించానని తాజాగా ప్రకటించారు. #Pakistan national #SeemaHaider was seen hoisting the Tricolour at her house in #Noida as part of #HarGharTiranga campaign ahead of #IndependenceDay.https://t.co/NUvcWcZMeB — IndiaToday (@IndiaToday) August 14, 2023 తన పిల్లలతో కలిసి పాకిస్థాన్ వదిలి నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చేరింది సీమా హైదర్. తన ప్రియుడు సచిన్తో కలిసి నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తోంది. తాను తన ప్రియునితోనే ఉంటానని పాక్ పంపించవద్దని రాష్ట్రపతికి కూడా ఇటీవల అప్పీల్ చేసింది. సీమా మిస్టరీ.. 2019లోనే సిమా హైదర్, సచిన్ ఆన్లైన్ గేమ్ పబ్జీలో పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత సచిన్ కోసం ఆమె దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వెళ్లింది. అక్కడి నుంచి భారత్ చేరుకుంది. పాకిస్థాన్ ఆర్మీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో యూపీ యాంటీ టెర్రర్ విభాగం, ఇంటెలిజన్స్ విచారణ జరిపింది. సచిన్తోనే గాక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువకులతో పబ్జీలో ఆమెకు పరిచయం ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: అజిత్తో రహస్య భేటీ.. ఇంట్లో వ్యక్తిని కలిస్తే తప్పేంటన్న శరద్ పవార్ -
సీమాను పాక్ పంపాలంటూ హిందూ దేవాలయంపై దాడి
పాకిస్తాన్లోని దక్షిణ ప్రావిన్స్కు చెందిన సింధ్లోని ఒక హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. సింధ్లోని కాష్మోర్ జిల్లాలో స్థానిక హిందూ సంఘాలు నిర్మించిన ఒక దేవాలయంపై దాడి చేయడానికి దుండగులు రాకెట్ లాంచర్ను ఉపయోగించారు. అలాగే మైనారిటీ హిందూ కమ్యూనిటీ సభ్యుల ఇళ్లపై వారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న కాష్మోర్-కంద్కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఇర్ఫాన్ సమ్మో నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. రాకెట్ లాంచర్తో దాడి పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం బగ్రీ కమ్యూనిటీ వార్షిక మతపరమైన సేవల కోసం తెరిచిన ఆలయంపై దుండగులు రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడి అకస్మాత్తుగా జరిగింది. కాగా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకునేంతలో దాడికి పాల్పడినవారు అప్పటికే పారిపోయారు. ఈ దాడిలో 8-9 మంది సాయుధ దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. బగ్రీ వర్గానికి చెందిన డాక్టర్ సురేష్ మాట్లాడుతూ దుండగులు ప్రయోగించిన రాకెట్ వల్ల ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతవాసులు భయంతో కాలం గడుపుతున్నారు. సీమా హైదర్ను తిరిగి పాకిస్తాన్ పంపించకపోతే ఇలానే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తామని ఆ దుండగులు బెదిరించారు. 2019లో పాక్కు చెందిన సీమా ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ, హిందూ వ్యక్తిని ప్రేమించానంటూ, తన నలుగురు పిల్లలతో సహా భారతదేశానికి వచ్చింది. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు సీమాను గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆమె ప్రేమికుడు సచిన్ ఆ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అక్రమ వలసదారునికి ఆశ్రయం కల్పించినందుకు సచిన్ను కూడా అరెస్టు చేశారు. అయితే అతను ఇటీవలే విడుదలయ్యాడు. హిందూ సభ్యుల కిడ్నాప్ కాష్మోర్, ఘోట్కీ జిల్లాల్లో శాంతిభద్రతలు క్షీణించడంపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీపీ) ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ సమాజానికి చెందిన 30 మంది సభ్యులను వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాలు కిడ్నాప్ చేశాయని హెచ్ఆర్సీపీ పేర్కొంది. ఈ ముఠాలు అధునాతన ఆయుధాలను ఉపయోగించి హిందూ ప్రార్థనా స్థలాలపై దాడి చేస్తామని బెదిరించినట్లు తమకు సమాచారం అందిందని వివరించింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని సింధ్ హోం శాఖను కమిషన్ కోరింది. కరాచీ అనేక పురాతన హిందూ దేవాలయాలకు నిలయంగా ఉంది. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో హిందూ కమ్యూనిటీ సభ్యులు అధికంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో చైనా ‘పెంగ్’.. భారత్లోకి చొరబడుతూ.. -
పరిచయం కాస్త ప్రేమగా.. పలుమార్లు కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా..
రాంచీ: పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన సీమా బాటలోనే పోలాండ్కు చెందిన ఓ మహిళ కూడా తన ప్రియుని కోసం జార్ఖండ్కు వచ్చింది. హజారీబాగ్ జిల్లాలోని కటకంసంది మండలం ఖుత్రా గ్రామానికి చేరుకుని ప్రియుడు షాబాద్ మాలిక్ను కలుసుకుంది. ఐదేళ్ల కూతురుతో కలిసి 45 ఏళ్ల విదేశీ మహిళ చేరుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఆమె పేరు బార్బరా పొలాక్ (45) పొలాండ్కు చెందిన మహిళ. తమ భర్తతో విడాకులు తీసుకుంది. అక్కడ సొంతంగా ఓ కంపెనీలో 50 శాతం షేర్తో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు షాబాద్ మాలిక్(27). వారిమధ్య కొన్నాళ్ల పరిచయం కాస్త ప్రేమగా పరిణమించింది. అనంతరం ఇరువురూ ముంబయిలో పలుమార్లు కలుసుకున్నారు. ఇక షాబాద్ను కలవడానికి ఖుత్రా గ్రామానికి బార్బరా రావడం ఇదే మొదటిసారి. వీసా కారణాల వల్ల బార్బరా.. షాబాద్తో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇక పూర్తి స్థాయిలో వీసా రావడంతో ఏకంగా ఖుత్రా గ్రామానికి చేరుకుంది. ఖుత్రా గ్రామానికి చేరుకున్న బార్బరా.. షాబాద్ ఇంట్లోనే పోలాండ్ వంటకాలను తయారు చేస్తోంది. ఇంట్లో ఏసీ పెట్టించింది. బార్బరా కూతురు అనియా పోలాక్.. షాబాద్ను డాడీ అని పిలుస్తోంది. కాగా.. బార్బరా మొదటి భర్త విడాకుల అనంతరం న్యూజిలాండ్లో ఉంటున్నారు. పోలాండ్ మహిళ గ్రామానికి వచ్చిందనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఖుత్రా గ్రామానికి చేరుకున్నారు. బార్బరాకు 2028 వరకు వీసా ఉన్నట్లు స్థానికి డీఎస్పీ తెలిపారు. దర్యాప్తు ముగిసేవరకు హోటల్లో బస చేయాల్సిందిగా బార్బరాకు చెప్పారు. అయితే.. షాబాద్ను తనతోపాటే పోలాండ్కు తీసుకువెళతానని బార్బరా తెలిపారు. ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి..
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనే అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఆమెను విచారిస్తున్న ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(యూపీ ఏటీఎస్)ముందు ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పబ్జీ ఆడుతూ భారత్కు చెందిన యువకుడు సచిన్ ప్రేమలో పడి, అక్రమంగా నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించిన సీమాకు సంబంధించిన పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సీమా సోదరుడు, మామ పాక్ ఆర్మీ సభ్యులు తాజాగా సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో పని చేస్తున్నాడని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. అలాగే ఆమె మామ గులాం అక్బర్ కూడా పాక్ పాక్ సైన్యంలోనే పనిచేస్తున్నాడని తేలింది. ఈ విషయాన్ని సీమా భర్త గులాం హైదర్ విచారణ అధికారులకు స్వయంగా చెప్పడం విశేషం. పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్, అతని సోదరి, తన భార్య అయిన సీమా తరచూ మాట్లాడుకునేవారనే విషయాన్ని సీమా భర్త గులాం అధికారుల సమక్షంలో వెల్లడించాడు. సీమా మామ పాక్ ఆర్మీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని, ఆయన ఇస్లామాబాద్లో ఉంటున్నాడని గులామ్ తెలిపాడు. సీమా హైదర్కు పాక్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో గల సంబంధాలపై ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఢిల్లీలో మరికొంతమందితో ఆమెకు పరిచయం యూపీకి చెందిన సచిన్ మీనా అనే యువకుడి ప్రేమలో పడ్డానంటూ భారత్లోకి అక్రమంగా ప్రవేశించి నివాసముంటున్న పాక్ మహిళ సీమా గులాం హైదర్ను ఉత్తర్ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) పోలీసులు విచారిస్తున్నారు. పాక్ నుంచి నేపాల్ మీదుగా భారత్లోకి అక్రమంగా చొరబడిన తర్వాత సీమా ముందుగా సచిన్ మీనాను కలుసుకోలేదని విచారణలో తేలింది. ఆమెకు రాజధాని ఢిల్లీలో మరికొంతమందితో పరిచయం ఉన్నన్నదని ఏటీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎస్ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకు సీమా ఎంతో ఆలోచించి తెలివిగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి! ఆశ్యర్యపరుస్తున్న సీమా ఆంగ్ల పరిజ్ఞానం విచారణలో సీమా హైదర్ ఎంతో తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి కీలక విషయాలకు సమాధానాలు రాబట్టడం అంత సులభం కావడంలేదని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో సీమాకు గల ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. ఇదిలావుండగా సీమా హైదర్ పాక్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి అక్కడికి పంపాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెసేజ్ చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పాక్ పంపించండి: భర్త వేడుకోలు యూపీ ఏటీఎస్ అధికారుల విచారణకు ముందు సీమా ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నివాసం ఉంటున్నందున సీమాను నోయిడా పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్తోపాటు అతడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిలు లభించింది. ప్రస్తుతం ఈ ముగ్గురిని యూపీ ఏటీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా సీమా తాను పూర్తిస్థాయిలో హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోనని పోలీసులకు తెలిపింది. అయితే ఆమెను ఎలాగైనా పాక్కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్ పోలీసులను కోరుతున్నాడు. ఇది కూడా చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. -
14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం
తక్కువ కాలంలో మంచి నికరాదాయం పొందాలనుకుంటే సీమ పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు యువ మహిళా రైతు రాచెల్లి అనూష. తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రం సిద్దిపేటకు 12 కిలో మీటర్ల దూరంలోని మల్యాలకు చెందిన అనూష సీమ పందులను పెంచుతూ చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టభద్రురాలైన అనూష తన భర్త మల్లేశం ప్రోత్సాహంతో తన నాలుగు ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం నుంచి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాల పాలయ్యారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, నాటుకోళ్లు, కంజు పిట్టలు, కుందేళ్లు, కొర్రమీను చేపలు.. ఏవి పెంచినా కలిసిరాలేదు. మూడేళ్లు తిప్పలు పడిన తర్వాత వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులు డా. ప్రసాద్, డా. విద్య సలహా మేరకు సీమ పందుల ఫాంను ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు. పందులు పెంచటం ఏమిటని బంధువులు వారించినా పట్టించుకోకుండా భర్త సహకారంతో 2020 మార్చిలో 14 సీమ పందులను కొని తెచ్చుకొని పెంపకం ప్రారంభించారు. లార్ట్ వైట్ యార్క్ షేర్, ల్యాండ్రెస్, డ్యూరార్, లార్జ్ బ్లాక్ యార్క్ షేర్ వంటి సంకర జాతి పందులను ఆమె పెంచుతున్నారు. ఫాంలో ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగింది. ఫాం సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని నిరంతరం తానే స్వయంగా అన్ని పనులూ చేసుకోవటం ద్వారా అనూష చక్కటి ఫలితాలు పొందుతున్నారు. మార్కెటింగ్ సమస్య లేదని అంటూ.. కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి సీమ పందులను కొనుక్కెళ్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి రైతులు వచ్చి ఫాంను చూసి, పిల్లలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారన్నారు. వారానికో రోజు పంది మాంసాన్ని కిలో రూ. 280 చొప్పున ఫాం దగ్గరే విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు! సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. పోటీ తక్కువ. శ్రమ తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ సమస్య లేదు. ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుంది. దాణా, గడ్డి రోజుకు రెండు సార్లు వేయాలి. ఎప్పుడైనా వీలుకాకపోతే సాయంత్రం వేయకపోయినా పర్వాలేదు. 200 పందులను ఒక్కరే చూసుకోవచ్చు. పందులను సాదుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. – రాచెల్లి అనూష, యువ రైతు 75 రోజుల్లో 20 కేజీలు కోతకు అమ్మే పందులను, బ్రీడింగ్ కోసం అమ్మే పందులను ప్రత్యేక షెడ్లు వేసి వేర్వేరుగా పెంచుతున్నారు. పంది పిల్ల 75 రోజుల్లో 20 కేజీల బరువు పెరుగుతుందని అనూష వివరించారు. బ్రీడింగ్ కోసం 20 కేజీల బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. మాంసం కోసం కోతకైతే సుమారుగా 80 కిలోలకు పైగా బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. బ్రీడింగ్ పందులకు గడ్డితో పాటు రెండు పూటలా దాణా పెడుతున్నారు. కోతకు వెళ్లే పందులకు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా మేపుతున్నారు. పశు వైద్యుడు డా. అభిలాష్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అనేక వ్యాక్సిన్లతోపాటు, ఇతర ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇస్తూ నాణ్యమైన మేతను అందిస్తే సీమపందుల పెంపకం సులభమేనని అంటారు అనూష భర్త మల్లేశం (97044 99873). – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ; ఫోటోలు: కె. సతీష్ కుమార్ (చదవండి: సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం) -
పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత అరెస్టు
రాంచీ: బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జార్ఖండ్ మహిళా నాయకురాలు సీమ పాత్రను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గరిజన తెగకు చెందిన పనిమనిషిని చిత్రహింసలు పెట్టిందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలిస్తామని అధికారులు చెప్పారు. సీమపాత్ర ఇంట్లో పనిచేసే గిరిజన మహిళ సునీత ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది. రోజూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పింది. తనతో టాయిలెట్ను నాకించడమే గాక.. వేడి వేడి వస్తువులతో వాతలుపెడుతూ సీమ పాత్ర వికృత చర్యలకు పాల్పడుతున్నారని సునీత వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీమ పాత్ర కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆమె పరారైంది. చివరకు పోలీసులు ఆమెను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ సీమపాత్ర రోడ్డుపైనుంచి వెళ్తున్న సమయంలో చాకచక్యంగా పట్టుకున్నారు. సునీత ఆరోపణల అనంతరం జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై స్పందించింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. విచారణ పారదర్శకంగా చేపట్టాలని సూచించింది. మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్ర సతీమణి అయి ఉండి సీమ పాత్ర ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు.. -
ఇన్స్టా అకౌంట్ నుంచి భర్త పేరును తొలగించిన నటి
సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్తో విడిపోయిన అనంతరం సీమా ఖాన్ తన అత్తింటి పేరును తొలగించింది. ఇప్పటికే ఈ స్టార్ కపుల్ విడాకుల విషయం బాలీవుడ్లో హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్బై చెబుతూ ఈ జంట ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. విడాకుల కోసం ముంబై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల అనంతరం సీమా ఖాన్ తన భర్త పేరును ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొలగించింది. గతంలో సీమా ఖాన్గా ఉన్న ఆమె ఇప్పుడు 'సీమాకిరణ్ సజ్దేహ్' పేరుతో ఇన్స్టా అకౌంట్ పేరును మార్చుకుంది. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సోహైల్ ఖాన్-సీమా ఖాన్లు 24ఏళ్ల వివాహం అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. గతంలోనూ సల్మాన్ ఖాన్ మరో తమ్ముడు అర్భాజ్ ఖాన్ సైతం మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా సోహైల్ ఖాన్ కూడా విడాకులు తీసుకోనుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. -
స్టార్ కపుల్ విడాకుల వెనుక ఆ హీరోయిన్ ఉందా?
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఎంతో అన్యోన్యంగా కలిసున్న సోహైల్- సీమా ఖాన్లు 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ కోర్టు మెట్లు ఎక్కారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు ఇప్పుడు తమ బంధానికి ముగింపు పలకడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది.దీని వెనుక కారణం ఏంటన్నదానిపై ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నాడంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలోనూ ఇలాంటి వార్తలు రాగా, సోహైల్ తనకు అన్నలాంటి వాడని చెప్పి హ్యూమా ఖురేషీ అందరి నోరూ మూయించింది. మరి ఇప్పుడు ఏకంగా ఆ జంట విడాకులు తీసుకోవడంతో మరోసారి ఈ బ్యూటీ పేరు జోరుగా వినిపిస్తుంది. -
విడాకులు తీసుకోనున్న స్టార్ కపుల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎంతో అన్యోనంగా ఉండే సోహైల్ ఖాన్- సీమా ఖాన్లు పెళ్లయిన 24ఏళ్ల అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబై ఫ్యామిలీ కోర్టుకు చేరుకున్న ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకోవడం బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియలేదు. కాగా 1998లో సోహైల్ ఖాన్- సీమా ఖాన్లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి నిర్వాన్, యోహాన్ పిల్లలు. గతంలో 2017లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అని వార్తలు హల్చల్ చేయగా సీమా వాటిని ఖండించింది. ఏ బంధంలో అయినా గొడవలు సహజమని, తమకు అన్నింటి కంటే తమ పిల్లలే చాలా ముఖ్యమని పేర్కొంది. తాజాగా ఈ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం బీటౌన్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. -
@ హెయిర్ బై సీమ
కట్టుబాట్లు, హద్దులు ఎన్ని ఉన్నా.. అన్నింటిని చెరిపేసి అనేక రంగాల్లో తమదైన ముద్రవేస్తున్న మహిళలెందరినో చూస్తున్నాం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తమలోని ప్రతిభతో వెలుగులోకి వచ్చి ప్రపంచానికి తామేంటో నిరూపిస్తూ ఎంత మందికి ఉదాహరణగా నిలుస్తున్నారు మరికొందరు. ఈ కోవకు చెందిన వారే సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ సీమా మనే. షోలాపూర్లోని బర్షీలో పుట్టింది సీమా మనే. చిన్నతనంలో అనేక కష్టాలను చూస్తూ ఆశ్రమంలో పెరిగిన సీమ.. తొమ్మిదో తరగతి అయిన తరువాత చదువు మానేసింది. ఆశ్రమంలోనే హెల్త్ సెంటర్లో పనికి చేరింది. తర్వాత కొన్నేళ్లకు పెళ్లి కుదిరింది సీమకు. వివాహం తరువాత భర్త అండతో తన కష్టాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఐదేళ్ల తరువాత భర్త ప్రోత్సాహంతో తనకెంతో ఇష్టమైన హెయిర్ కటింగ్ కోర్సు చేయాలనుకుంది. భర్త సహకారం అందించడంతో పదోతరగతి చదువుతూనే హెయిర్ కటింగ్లో డిప్లొమా చేసింది. కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే ఒక సెలూన్ ఏర్పాటు చేసుకుంది. అలా రెండేళ్లపాటు సెలూన్ నిర్వహించిన తరువాత సీమకు ఓ ఫ్యాషన్ షోలో హెయిర్ స్టైలిస్ట్గా అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో వెరైటీ, మోడ్రన్ హెయిర్ స్టైల్స్తో మోడల్స్ను తీర్చిదిద్దడంతో ఈ ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. దీంతో సీమకు మంచి హెయిర్ స్టైలిస్ట్గా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ‘ఎట్ ది రేట్ హెయిర్బై సీమ’ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ను ప్రారంభించింది. ఈ అకౌంట్లో సరికొత్త హెయిర్ స్టైల్స్ను పోస్టు చేస్తుండేది. ఈ హెయిర్ స్టైల్స్ నచ్చడంలో గ్లామర్ ప్రపంచంలో సీమ బాగా పాపులర్ అయ్యింది. దీంతో సినిమాలు, ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్స్లో పనిచేయడానికి అవకాశాలు వచ్చేవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభతో సరికొత్త హెయిర్స్టైల్స్ను రూపొందించి తానేంటో నిరూపించింది. దీంతో సెలబ్రిటీల దృష్టిలో పడింది సీమ. ఒక్కోమెట్టు ఎక్కుతూ... అంతర్జాతీయంగానూ సీమ హెయిర్స్టైలిస్ట్గా పనిచేసిన సెలబ్రెటీలలో మాధురీ దీక్షిత్, అలియా భట్, తాప్సీ పన్ను, కియరా అడ్వాణి, బిపాషా బసు, కత్రినా కైఫ్, అంబాని కుటుంబానికి చెందిన విభూతి ఉన్నారు. అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ఏ సూటబుల్బాయ్’ లో టబుకు హెయిర్ స్టైలిస్ట్గా పనిచేసింది. ‘ఘాజీ’ సినిమాలో తాప్సీకి, నామ్ షబాన, లక్ష్మీబాంబ్, సూర్మ, మన్ మర్జియా, జుడ్వా–2 సినిమాలకు పనిచేసింది. కళంక్, గుడ్న్యూస్, ఎంఎస్ ధోణి, కబీర్ సింగ్ సినిమాల్లో కియరా అడ్వాణికి హెయిర్ స్టైల్స్ చేసింది. తెలుగు సినిమా బాద్షాలో కాజల్ అగర్వాల్కు మోడ్రన్ హెయిర్ స్టైల్స్ను అందించింది. ఒక్క ఇండియాలోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ సీమకు మంచి గుర్తింపు లభించింది. 2016లో ఓ పెళ్లిలో హెయిర్స్టైల్స్ చేయడానికి ఇటలీ వెళ్లగా, ఆ ఏడాది విడుదలైన ‘ద వోగ్ వెడ్డింగ్ బుక్’లో సీమ పేరు ప్రస్తావించారు. చేసే పనిలో నిజాయితీ ఉండాలి ‘‘నిజాయితీగా పనిచేస్తే ఫలితం మనకు వందశాతం అనుకూలంగా వస్తుందని అమ్మ చెప్పేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా నిబద్ధతతో పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. తాప్సీ, కియరా లాంటి సెలబ్రెటీల సాయంతో బాలీవుడ్లో నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం ప్రారంభించబోయే హెయిర్ అకాడమీ, స్టూడియోల ద్వారా నాలా మరికొంతమందిని ఇండస్ట్రీకి అందించడమే నా లక్ష్యం’’ అని చెబుతోంది సీమ. మనలో కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనడానికి సీమ జీవితమే నిదర్శనం. -
Amritha Aiyer: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర లక్ష రూపాయలకు పైమాటే!
Amritha Aiyer Dress By Seema Gujral: అమృతా అయ్యర్.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అంటూ పరిచయమై.. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ అభిమాన ధనాన్ని పెంచుకుంటోంది. ఆమె సినిమాలే కాదు ఫ్యాషన్ బ్రాండ్స్ పట్లా అంతే నిక్కచ్చిగా ఉంటుందని ఈ డిజైనర్ వేర్ చూస్తే తెలిసిపోతుంది. సీమా గుజ్రాల్.. కళ్యాణ వేదిక మీద పెళ్లి కూతురు రాజకుమారిలా కనిపిస్తోందంటే.. ఆమె సీమా గుజ్రాల్ డిజైన్ చేసిన దుస్తులను ధరించింది అని అర్థం. ఎటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా.. కేవలం ముగ్గురు ఉద్యోగులను నియమించుకుని 1994లో సీమా ప్రారంభించిన ఓ ఫ్యాషన్ హౌస్ ఇప్పుడొక పాపులర్ వెడ్డింగ్ వేర్ బ్రాండ్గా మారింది. దాదాపు చాలామంది సెలబ్రిటీల పెళ్లిబట్టలను ఆమే డిజైన్ చేసింది. అభిరుచికి తగ్గట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశమూ ఉంది. ఆ దుస్తుల ధరలు డిజైన్ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్లైన్లోనూ ఈ డిజైన్ వేర్ అందుబాటులో ఉంది. పండోరా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్లో పండోరా ఒకటి. 1982లో డెన్మార్క్లో ప్రారంభించిన ఈ బ్రాండ్.. గత ఐదు దశాబ్దాలుగా అరుదైన, అందమైన డిజైన్స్లో ఆభరణాలను అందిస్తూ అమ్మాయిల మనసు దోచుకుంటూనే ఉంది. కారణం ఇందులో పనిచేసే ఆభరణాల నిపుణులే. సుమారు ఆరు ఖండాల్లోని వంద దేశాలకు చెందిన 2,600 హస్తకళా నిపుణులు ఈ ఆభరణాలను రూపొందిస్తుంటారు. ఎక్కువగా థాయ్లాండ్కు చెందిన వారే కావడంతో మన దేశ సంప్రదాయ ఆభరణాలు కాస్త తక్కువగానే కనిపిస్తాయి ఇక్కడ. అయితే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది మరి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ లభిస్తాయి. నా టేస్ట్కు తగ్గట్టే నాకు గ్లామర్ పాత్రలు సౌకర్యంగా అనిపించవు. ఇప్పటి వరకూ నా టేస్ట్కు తగ్గట్టే నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. – అమృతా అయ్యర్. బ్రాండ్ వాల్యూ డ్రెస్ డిజైనర్: సీమా గుజ్రాల్ ధర: రూ. 1,28,000 జ్యూయెలరీ బ్రాండ్: పండోరా ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Amala Paul: అమలాపాల్ కట్టిన చీర ధరెంతో తెలుసా? -
శాస్త్ర అస్త్రాలతో...
శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళల ప్రాతినిధ్యం, వారి విజయాల గురించి తలచుకునే అవకాశం ఇస్తుంది.. ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ డే ఫర్ వుమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ దినోత్సవం. డా. ఏ.సీమ కేరళ త్రిసూర్లోని ‘సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సి–మెట్) విభాగంలో సైంటిస్ట్. ఒకసారి ఆమె ‘మలబార్ క్యాన్సర్ సెంటర్’కు వెళ్లినప్పుడు ఆ సంస్థ డైరెక్టర్ ‘బ్రెస్ట్ క్యాన్సర్’ గురించి తనతో కొంతసేపు మాట్లాడారు. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పరీక్షలు చేయించుకోవడానికి మహిళలు చొరవ చూపకపోవడం వెనుక ఉన్న పరిమితులు తెలిశాయి. ఈ నేపథ్యంలో సీమ తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించగలిగే, ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లగలిగే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాన్ని తయారు చేశారు. ఇలాంటి పరికరం దేశచరిత్రలోనే ప్రథమం. రేపటి విజయాల కోసం నిన్నటి విషయాలను గుర్తు చేసుకోవాలంటారు. అలా ఒకసారి వెనక్కి వెళితే... పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనంది బాయి, 1883లో ‘ఫస్ట్ ఫిమేల్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడికల్ హిస్టరీ’ (ఇండియా)గా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. సౌమ్య స్వామినాథన్.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిప్యూటి డైరెక్టర్గా ప్రపంచాన్ని మెప్పించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తి ఇచ్చారు. విజ్ఞాన్ ప్రసార్ ‘విజ్ఞాన్ విదూషి’ (ఇండియన్ వుమెన్ సైంటిస్ట్స్) పుస్తకం స్పేస్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, సైన్స్ అడ్మినిస్ట్రేషన్.. మొదలైన శాస్త్రీయరంగాల రోల్మోడల్స్గా చెప్పుకునే మహిళల గురించి చెప్పడమే కాదు, వారు ఎలాంటి పరిమితులు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించడానికి చేసిన కృషి గురించి చెప్పడం ఈ తరానికి స్ఫూర్తి ఇస్తుంది. -
Seema Rayal: ప్రమాదకరమైనా... భర్తతో పాటు కుటుంబ ప్రోత్సాహంతో..
పెళ్లిచేసి అత్తారింటికి పంపించే ఆడపిల్లకు చదువెందుకు? చదివి ఊళ్లు ఏలాలా! దేశాన్ని ఉద్ధరించాలా? వంటి మాటలన్నెంటినో దాటుకుని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజినీర్గా రాణిస్తోంది సీమా రాయల్. మగవాళ్లు ఎక్కువగా ఉండే ఈ రంగంలో ఈజీగా ఆయిల్ను తోడేస్తోంది. రాజస్థాన్కు చెందిన సీమా రాయల్కు ముగ్గురు తమ్ముళ్లు. ఒక్కతే అమ్మాయి కాబట్టి అల్లారుముద్దుగా పెరిగి ఉండొచ్చు అనుకోవడానికి లేదు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి అనేక అడ్డంకులను దాటాల్సి వచ్చింది. ఆడపిల్ల ఇంటి పనులు నేర్చుకుంటే చాలన్న భావన ఉన్న సమాజంలో పుట్టిన సీమకు చదువుకోవడమే పెద్ద సవాలు. చదువు ఎందుకు అనే మాటలను పోగొట్టడానికి ఆమె చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదువుకునేది. జూడో, కరాటే ప్రాక్టీస్ చేస్తూనే ఇంటి పనులన్నింటినీ నేర్చుకుంది. సీమ చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి మాటలను పట్టించుకోకుండా తనని చదువుకునేందుకు ప్రోత్సహించేవారు. ఫైనలియర్లో ఉండగానే.. చిన్నప్పటి నుంచి క్రీడల్లో చురుకుగా ఉండే సీమ ..ఇంజినీరింగ్ కాలేజీలో తోటి విద్యార్థులు ఎవరూ క్రీడలపై ఆసక్తి కనబర్చక పోవడం కనిపించింది. దీంతో సీమానే అమ్మాయిలతో ఒక టీమ్ను ఏర్పరిచి రకరకాల ఆటలపోటీలలో పాల్గొనేది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటూనే ఇంజినీరింగ్ సబ్జెక్టులను ఏకాగ్రతతో చదివేది. ఫైనలియర్లో ఉండగా కాలేజీలో క్యాంపస్ ఇంటర్య్వూలు జరిగాయి. ఇంటర్య్వూలో పాసవ్వడంతో.. కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సీమకు ఉద్యోగం వచ్చింది. కానీ ఇంటికి దూరంగా బర్మర్ ప్రాంతంలో కంపెనీ ఉంది. ‘‘అంతదూరం వెళ్లి అమ్మాయి ఉద్యోగం చేయాలా? ఆయిల్ కంపెనీ అంటే అంతా మగవాళ్లే ఉంటారు! ఎందుకొచ్చిన గోల ’’ అంటూ ఇరుగుపొరుగు సీమ తల్లిదండ్రులకు పదేపదే చెప్పేవారు. ఈ మాటలేవీ పట్టించుకోని కుటుంబసభ్యులు సీమను ఉద్యోగం చేసేందుకు అనుమతించారు. దీంతో కెయిర్న్ కంపెనీలో ‘ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్’గా చేరింది. కంపెనీలో పనిని వేగంగా నేర్చుకుని పై అధికారుల మన్ననలను అందుకుంది. సీమ పనితీరు మెచ్చిన కంపెనీ యాజమాన్యం ఆమెను అనేక పదోన్నతులతో ప్రోత్సహించింది. ప్రమాదకరమైనప్పటికీ.. ‘‘ఇన్స్ట్రమెంట్ ఇంజినీర్ అంటే చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఆటోమాటిక్గా పనిచేసే అనేక పరికరాలను చూసుకోవాల్సి ఉంటుంది. బావి నుంచి ఆయిల్ తియ్యాలి. కొన్ని మెషిన్లతో, కొన్నింటిని మ్యానువల్గా తీయాలి. నీళ్లు, గ్యాస్, మట్టి నుంచి ఆయిల్ను వేరుచేసి పైప్లైన్లకు పంపించాలి. ఈ మొత్తం ప్రక్రియలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ఇనుస్ట్రుమెంట్ ఇంజినీర్ నుంచి సీనియర్ ఇంజినీర్గా పదోన్నతి వచ్చినప్పుడు బాధ్యతలు పెరిగాయి. ప్రస్తుతం సూపరిండెంట్, ఇన్స్టాలేషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. పద్నాలుగేళ్లలో నేను ఎదిగేందుకు కంపెనీ అనేక అవకాశాలు కల్పించింది. ఇప్పటికీ రాజస్థాన్లో ఉన్న అమ్మాయిలు అంత చురుగ్గా ముందుకు సాగడం లేదు. టీచర్ ఉద్యోగం చేస్తే చాల్లే అనుకునేవారే ఎక్కువ. ఇంతకు మించి ఆలోచించడం లేదు. ఆయిల్ గ్యాస్ కంపెనీలవైపు అసలే చూడడంలేదు. నా పెళ్లి అయ్యాక భర్తతో పాటు కుటుంబం కూడా చాలా ప్రోత్సహించింది. వృత్తిపరంగా కొన్నిసార్లు ఇంటికి దగ్గరగా, మరికొన్ని సార్లు ఇంటికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా వాళ్లు నాకు అండగా నిలిచారు. అందువల్లే ఒకపక్క ఉద్యోగం, మరోపక్క పిల్లల్ని చూసుకోగలిగాను. ఎప్పుడూ మంచి జరుగుతుందనే ఆశావహ దృక్పథంలో ఉండేదాన్ని. ఎంతవరకు కష్టపడగలమో అంతవరకు శ్రమిస్తే విజయం దానంతట అదే వస్తుందని నేను నమ్ముతాను. కష్టాలనేవి సహజం. వాటిని దాటుకుని ముందుకెళ్తేనే జీవితంలో విజయం సాధించగలం. అందుకే ఎంతటి కఠిన రంగంలోనైనా రాణించగలరు’’ అని చెప్పే సీమ ఎంతో మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’
లండన్: ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’ టాప్–10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారి(18)కి చోటు లభించింది. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్తో సత్కరిస్తారు. చెగ్.ఓఆర్టీ వెబ్సైట్ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్ 10న ప్రకటించనున్నారు. భారత్లోని జార్ఖండ్కు చెందిన సీమా కుమారి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది. జార్ఖండ్లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ‘యువ’ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్ యూనివర్సిటీలో చేరింది. టాప్–10 ఫైనలిస్టుల్లో తన పేరు ఉండడం పట్ల సీమా కుమారి ఆనందం వ్యక్తం చేసింది. -
USA: సీమా నందా నియామకానికి సెనేట్ ఆమోదం
వాషింగ్టన్ : అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ సంతతి మహిళకి చోటు లభించింది. కార్మిక శాఖ సొలిసిటర్గా భారత సంతతికి చెందిన పౌరహక్కుల న్యాయవాది సీమా నందా నియామకానికి అమెరికన్ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 48 ఏళ్ల వయసున్న సీమా నందా డెమొక్రాటిక్ నేషనల్ కమిటీకి సీఈఓగా కూడా పని చేశారు. ఒబామా హయాంలో కార్మిక శాఖకి సేవలు అందించారు. కాగా నందా నియామకాన్ని సెనేట్ 53–46 ఓట్లతో ఆమోదించింది. సీమా నందా నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా ముప్పు, వాతావరణంలో మార్పులతో యాజమాన్యాలు, కార్మికులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టున్న తరుణంలో కార్మిక శాఖ సొలిసిటర్గా ఆమె నియామకం అత్యంత కీలకంగా మారింది. -
‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’...
జెనీవాలో బుధవారం మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మండలి అది. అత్యంత కీలకమైన సమావేశం. దేశాలన్నీ బాధ్యతగా హాజరవుతాయి. మానవ హక్కుల గురించి మాట్లాడతాయి. మనమూ వెళ్లాం. మన పొరుగున ఉండే పాకిస్తాన్ కూడా వచ్చింది. ఎప్పటిలా జమ్మూ–కశ్మీర్లో ఉగ్రవాదం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం మొదలు పెట్టింది! మాట్లాడినంతా మాట్లాడనిచ్చి, మన దౌత్య అధికారి సీమా పూజాని మైక్ అందుకున్నారు. ‘నీకు సంబంధం లేని విషయం లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?’ అని ప్రశ్నించారు. ‘ఆగస్టులో జరిగిన సదస్సులో కూడా ఇలాగే ఎక్కువ చేశావు’ అని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు. ఆ దేశం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతోంది, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకుంటోందో మండలి సభ్యులందరి దృష్టికి తెచ్చారు. ఆ యువ ఐ.ఎఫ్.ఎస్. ఇచ్చిన ‘రైట్ ఆఫ్ రిప్లయ్’కి దేశంలో ఇప్పుడు ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ∙∙ సీమా పూజాని ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున మాట్లాడే హక్కు కలిగిన సెకెండ్ సెక్రెటరీ. దౌత్య అధికారి. ఆమె ఇచ్చిన సమాధానం గానీ, చేసిన ప్రకటన గానీ భారత్ తరఫున అధికారికం అవుతుంది. అందుకే హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ ఆరోపణలను ఆమె తిప్పికొట్టిన విధానానికి దౌత్యపరమైన ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ భాషలో చెప్పాలంటే.. ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని ఆ దేశానికి చెప్పడమే. సీమను తగిన పోస్ట్లోనే నియమించుకుంది భారత్. 2014 సివిల్స్లో ఆలిండియా ర్యాంకర్ ఆమె. 34వ ర్యాంకు సాధించి, ఇండియన్ ఫారిన్ సర్వీసును ఎంచుకున్నారు. అప్పటికి ఆమె ‘లా’ పూర్తయింది. ‘లా’ లోనే పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడి ప్రతిష్టాత్మక బ్యూసెరియస్ లా స్కూల్ చేరుదామని అనుకుని కూడా.. సివిల్స్ సాధించాలనే తన కలలోకి మళ్లీ వెళ్లిపోయారు. రెండో అటెంప్ట్తో ఆమె కల నిజమైంది. సీమ హర్యానా అమ్మాయి. ఫరీదాబాద్లో పుట్టింది. ఇంట్లో తనే చిన్న. మిగతా ఇద్దరూ అక్కలు. తండ్రి అమర్నాథ్ పూజానీ రిటైర్డ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. తల్లి గృహిణి. సీమ మొదట ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. ఇంటర్లో సైన్స్ తీసుకున్నారు. ఇంటర్ తర్వాత మాత్రం ఇంజనీరింగ్ చేయలేదు. ‘లా’ వైపు వెళ్లిపోయారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదివారు. అప్పుడే విస్తృతంగా సామాజిక అంశాల అధ్యయనం చేశారు. దాంతో సివిల్స్ వైపు వెళ్లాలన్న ఆలోచన కలిగింది. మరీ చిన్నప్పుడైతే ఆమెకు వెటరినరీ డాక్టర్ అవాలని ఉండేదట. చివరికి ఆరోగ్యకరమైన దౌత్య సంబంధాలను నెరిపే బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. అవసరమైతే మాటకు మాటతో చికిత్స కూడా. సమితి మానవ హక్కుల మండలిలో మొన్న పాకిస్తాన్కు ఆమె చేసిన చికిత్స అటువంటిదే. సమితి హక్కుల ‘మండలి’లో సీమ మాటకు మాట -
సీమా.. తడాఖా.. సూపర్ కాప్
ఆమె పేరు సీమా ఢాకా.. ఢిల్లీ పోలీసు డిపార్ట్మెంటులోనే కాదు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె ఓ సూపర్కాప్. ఢిల్లీలో తప్పిపోయిన చిన్నారులను ఒక్కరోజులో ఆచూకీ కనిపెట్టగల సత్తా ఆమె సొంతం. కేవలం మూడు నెలల కాలంలోనే ఏకంగా 76 మంది తప్పిపోయిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన అరుదైన ఘనత ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె పనిచేస్తోన్న సమయ్పూర్ బద్లీ పోలీస్స్టేషన్ సీమా ఢాకా పనితీరు వల్ల చాలా ప్రసిద్ధి చెందింది. ఎంతగా అంటే.. ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. ఈమెనే దర్యాప్తు చేయమనేంతగా..! సివంగి వేటకు దిగితే.. ఏ జంతువైనా తలవంచాల్సిందే.. ఈ సీమా ఢాకా దర్యాప్తుకు దిగితే.. తన తడాఖా చూపిస్తుంది ఎలాంటి మిస్సింగ్ కేసైనా 24 గంటల్లో పరిష్కారం కావాల్సిందే. హెడ్ కాన్స్టేబుల్గా పని చేస్తూ ఇటీవలే ఏఎస్ఐగా పదోన్నతి అందుకున్న సీమా ఢాకా తన విధులు, వ్యక్తిగత జీవితంపై పలు విషయాలు ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ► ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సూపర్ కాప్ అని పిలిపించుకోవడం ఎలా ఉంది? సీమ: చిన్నారుల జాడ కనిపెడితే కలిగే సంతృప్తి నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆ పిల్లలను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరిస్తే.. వారి కళ్లల్లో కనిపించే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. నేనూ తల్లినే..! బిడ్డ కాసేపు కనబడకపోతే తల్లడిల్లిపోయే తల్లులు నా వద్దకు వస్తే.. నేను తట్టుకోలేను. వెంటనే రంగంలోకి దిగిపోతాను. ► మీ స్పీడ్ దర్యాప్తులోని సీక్రెట్ ఏంటి? సీమ: నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. టెక్నాలజీ, ఇంటలిజెన్స్ను సమర్థంగా వాడతా. ఠాణాలో పిల్లలు తప్పిపోయారన్న ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తా. అలాగైతే.. పిల్లలు సరిహద్దులు దాటకముందే పట్టుకోవచ్చు. జాప్యం చేసే కొద్దీ వారు దూరం వెళ్లిపోతారు. ► తప్పిపోయిన పిల్లల విషయం లో మిమ్మల్ని కదలించిన ఘటన ఏదైనా ఉందా? ఉంది. 2016లో ఓ ముసలావిడ మా స్టేషన్కి వచ్చింది.. తన మనవరాలు తప్పిపోయిందని ఫిర్యాదు చేసింది. తన కొడుకు–కోడలు మరణించారని, మనవరాలు తప్ప ఈ లోకంలో తనకు ఎవరూ లేరని బోరుమంది. ఎంక్వైరీ చేస్తే నిజమే అని తెలిసింది. వాస్తవానికి హెడ్ కానిస్టేబుల్గా ఉన్న నాకు ఆ కేసు దర్యాప్తు చేసేందుకు అధికారాలు లేవు. కానీ, ఉన్నతాధికారుల వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టాను.. 13 ఏళ్ల ఆ అమ్మాయిని పక్కింట్లో అద్దెకుండే ఓ యువకుడు మాయమాటలు చెప్పి బిహార్కు తీసుకెళ్లాడనే విషయాన్ని కనిపెట్టి, అక్కడ నుంచి బాలికను క్షేమంగా తీసుకొచ్చి నానమ్మకు అప్పగించా. అప్పుడు ఎంతో సంతోషం కలిగిందో చెప్పలేను. ► ఇంత తక్కువ సమయంలో 76 మంది పిల్లలను ఎలా గుర్తించగలిగారు? ఇదంతా మా ఢిల్లీ పోలీస్ కమిషనర్ సార్ కల్పించిన అవకాశం. 14 ఏళ్లలోపు చిన్నారుల మిస్సింగ్ కేసులను ర్యాంకులతో సంబంధం లేకుండా ఎవరైనా కనిపెట్టవచ్చు అంటూ ఇచ్చిన ఆదేశాలను నేను సమర్థంగా వినియోగించుకున్నాను. వాస్తవానికి 12 నెలల్లో 50 మంది పిల్లల ఆచూకీ కనిపెట్టాలని డిపార్ట్మెంట్ నాకు టార్గెట్ ఇచ్చింది. కేవలం తొలి పదిరోజుల్లోనే 12 మంది పిల్లల ఆచూకీ కనిపెట్ట గలిగాను. దాంతో నామీద నాకు, డిపార్ట్మెంట్కు నమ్మకం పెరిగింది. కేవలం 70 రోజుల్లో ఆ సంఖ్య 76కి చేరుకుంది. మిస్సింగ్ కేసుల్లో ఠాణా పరిమితులు లేకపోవడంతో ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. నా వద్దకు వచ్చిన కేసులను దర్యాప్తు చేస్తున్నాను. ► పిల్లల కోసం ఏయే రాష్ట్రాలు వెదికారు? ఎలాంటి సవాళ్లు ఉండేవి? ఢిల్లీలో తప్పిపోయిన పిల్లలు ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో దొరికారు. కేసు వస్తే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా లెక్కచేయను. పిల్లలను రెండు రోజుల్లో పట్టుకునేదాన్ని. తరువాత సీడబ్ల్యూసీ వాళ్ల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించినపుడు ఆ కష్టం మొత్తం మర్చిపోతాను. వెంటనే ఒక చాయ్ తాగేసి, టేబుల్ మీద ఉన్న కొత్త కేసు ఫైల్ అందుకుంటా! ► పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి ప్రధాన కారణాలేంటి? పేదరికం. అవును, మీరు వింటున్నది నిజమే! ఢిల్లీకి బతుకుదెరువు కోసం వచ్చే పేదపిల్లలే ఎక్కువగా అదృశ్యమవుతుంటారు. కుటుంబ సమస్యలు, చెడుసావాసాలు, తల్లిదండ్రులు సమయం కేటాయించకపోవడం, ప్రేమపేరుతో మాయమాటల కారణంగా పిల్లలు ఇల్లు విడుస్తున్నారు. వీరుగాకుండా మానవ అక్రమ రవాణా ముఠాలు కిడ్నాప్ చేస్తుంటాయి. ► పిల్లలు తప్పిపోయిన విషయంలో తప్పుడు ఫిర్యాదులేమైనా వస్తుంటాయా? వస్తుంటాయి. అసలు కారణాలను వదిలేసి, పిల్లలు పారిపోయిన విషయాన్నే చెబుతుంటారు చాలామంది. పేదరికం, సహజీవనం, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం... ఇలాంటి వాటికి మూలకారణం. దానివల్ల దర్యాప్తు ఆలస్యమవుతుంది. ఈ విషయంలో కారణాలేమైనా.. మేం పిల్లల్ని వెదికి పట్టుకుంటాం. తరువాత అందరికీ కౌన్సెలింగ్ చేసి పంపిస్తాం. ► కిడ్నాప్ కేసులు ఏమైనా మీ వద్దకు వచ్చాయా? లాక్డౌన్లో ఒక విచిత్రమైన కేసు మావద్దకు వచ్చింది. ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉన్న ఓ యువకుడు ఆమె తనను కలిసేందుకు రావడం లేదని ఆమె మూడేళ్ల కూతురుని కిడ్నాప్ చేశాడు. తల్లి మాకు అసలు విషయం చెప్పలేదు. మూడేళ్ల చిన్నారిని విడిపించాక, అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు జైలుకు వెళ్లడంతో తల్లీ పిల్లలకు విముక్తి కలిగింది. ► మీరు ఆచూకీ కనిపెట్టిన 76 మంది తల్లిదండ్రులను చేరుకున్నారా? దేవుడి దయవల్ల అంతా తల్లిదండ్రులను కలుసుకున్నారు. కొందరు తల్లిదండ్రులు భాగస్వాములకు తెలియకుండా దత్తతకిచ్చి, తరువాత గొడవలు రాగానే తప్పిపోయారని ఫిర్యాదు చేస్తారు. లాక్డౌన్ కాలంలో కొందరు ఫిర్యాదులు ఇచ్చి రాంగ్ అడ్రస్లు ఇచ్చారు. కొందరు ఫోన్నెంబర్లు మార్చారు. మరికొందరు ఏకంగా ఢిల్లీ వదిలి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈసారి తల్లిదండ్రులను కూడా పట్టుకోవాల్సి వచ్చింది. అంతవరకూ పిల్లలను షెల్టర్ హోంలో ఉంచాల్సి వచ్చింది. ► కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి చెబుతారా? మాది యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలోని షమ్లీ ప్రాంతం. డిగ్రీవరకూ అంతా అక్కడే చదివాను. సంప్రదాయ కుటుంబం. అమ్మానాన్నలు టీచర్లు. మా కుటుంబంలో నేనే తొలి పోలీసు ఆఫీసర్. ఉద్యోగమొచ్చాక ఢిల్లీకి మారాను. ఇంట్లో నేను మా ఆయన అనిత్ ఢాకా, మా అబ్బాయి ఆరవ్ ఢాకా ఉంటాం. మా ఆయన కూడా పోలీసే. నా భర్త నా బ్యాచ్మేటే. మా కజిన్ ఈ సంబంధం తీసుకువచ్చాడు. దీంతో అనుకోకుండానే బ్యాచ్మేట్ను వివాహం చేసుకున్నాను. క్షణం తీరిక లేకున్నా.. ఇంట్లో అంతా నన్ను ప్రోత్సహిస్తారు. నా విజయాలను వారి విజయాలుగా చెప్పుకుంటారు. వారి ప్రోత్సాహంతోనే కూతురిగా, భార్యగా, తల్లిగా పోలీసు అధికారిగా ఇపుడు అన్ని బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలుగుతున్నాను. ► పోలీసు జాబును ఎందుకు ఎంచుకున్నారు? సీమ: 2006 ఊళ్లో కొందరు అమ్మాయిలు దరఖాస్తు చేస్తుంటే నేనూ చేశాను. సెలెక్టయ్యాను. కానీ, బంధువులంతా నాన్నను భయపెట్టారు. పోలీసైతే పెళ్లి అవదు అని, మగరాయుడిలా పోలీసును చేస్తావా? అంటూ సూటిపోటి మాటలు అన్నారు. దానికి తగ్గట్టు శిక్షణకు వెళ్లొచ్చాక కొద్దిగా నల్లబడ్డాను. ‘చెబితే విన్నావా? అసలే ఆడపోలీసు...అంటుంటే.. ఇపుడు నల్లబడింది. మీ అమ్మాయికి ఇక పెళ్లవదు...’ అంటూ శాపనార్థాలు పెట్టారు. 2014లో పదోన్నతితో హెడ్ కానిస్టేబుల్ అయ్యాను. 76 మంది పిల్లల జాడ పట్టుకున్నాక.. ఈ ఏడాది నవంబరులో ఏఎస్ఐగా పదోన్నతి వచ్చింది. ఇలాంటి ప్రమోషన్ ఢిల్లీ పోలీసు చరిత్రలో నాకే తొలిసారిగా దక్కింది. దీంతో నాడు వెక్కిరించినవారే... నేడు మా బంధువుల అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటున్నారు. – అనిల్కుమార్ భాషబోయిన సాక్షి, హైదరాబాద్ భర్త, కుమారుడితో సీమ -
హాథ్రస్ ఘటన: అంతా ఆ నలుగురి వైపే
ఆరేళ్లు నడిచింది నిర్భయ కేసు. హాథ్రస్కి ఇంకా నడకే రాలేదు. అసలు నడవనిచ్చేలానే లేరు! కోర్టుకు వెళ్తేనే కదా తొలి అడుగు. ఆ అడుగునే పడనివ్వడం లేదు. ఊళ్లోకి దారులన్నీ మూసేశారు. కొన్ని నోళ్లను కూడా!! ‘నిర్భయ’ లాయర్ వచ్చారు. ‘పో.. పోవమ్మా’ అని ఆపేశారు. ఆమె ఆగిపోతారనా?! నిర్భయ లాయర్ మాత్రమే కాదు.. లాయర్ నిర్భయ కూడా.. సీమ! తల్లీకూతుళ్లు పంట పొలంలో పచ్చిక కోస్తున్నారు. కోస్తూ కోస్తూ కూతురు కొంచెం దూరం వెళ్లింది. చిన్నపిల్లేం కాదు, ‘ఎక్కడుందో?’ అని తల్లి వెతుక్కోడానికి. పందొమ్మిదేళ్ల యువతి. సమయం గడిచింది. అలికిడి లేదు. అప్పుడు అనుమానం వచ్చి తలతిప్పి చూసింది. చూపు ఆనే దూరంలోనూ కూతురు కనిపించలేదు. కూతురు స్లిప్పర్స్ మాత్రం కనిపించాయి. తల్లి గుండె గుభేల్మంది. స్పిప్లర్స్ కనిపించాక, మనిషిని ఈడ్చుకెళ్లిన జాడలు కనిపించాయి. ‘తల్లీ’.. అని కూతురు ఏ లోకాన ఉన్నా వినిపించేలా అరచి, ఆక్రోశించింది తల్లి గుండె. సెప్టెంబర్ 14 న ఇది జరిగింది. సామూహిక అత్యాచారంలో ప్రాణం కోసం కొట్టుకుని కొట్టుకుని సెప్టెంబర్ 29 న ఆసుపత్రిలో ఆ కూతురు కన్నుమూసింది. తల్లిని కూడా దగ్గరికి రానివ్వకుండా పోలీసులే కూతుర్ని దహనం చేశారు! హాథ్రస్ ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా. ఆ జిల్లాలోని బుల్గడీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామంలో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. సీమ ‘నిర్భయ’ కేసు లాయర్. ఆ కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష పడి, నిర్భయకు కొంతైనా న్యాయం జరిగిందంటే ఆమె వల్లనే. నిర్భయ కేసులో ఉన్నట్లే హాథ్రస్ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. హాథ్రస్ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు! ‘‘ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు’’ అని అడిషనల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అంటున్నారు. ‘‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’’ అని జిల్లా మేజిస్ట్రేట్ అంటున్నారు! జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్ అధికారులు హాథ్రస్ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియా ను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాథ్రస్లోకే అడుగు పెట్టనివ్వడం లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టాక జిల్లా ఎస్పీని, మరో నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం మాత్రమే మృతురాలి కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు దక్కిన న్యాయం. ఈ తరుణంలో హాథ్రస్ కేసును తను వాదించడానికి ముందుకు వచ్చిన సీమా సమృద్ధికీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కేసును చేపట్టాలని సీమ కృతనిశ్చయంతో ఉన్నారు. మృతురాలు చనిపోయే ముందు ఆసుపత్రిలో ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను బట్టి ఆమెపై జరిగింది కేవలం దాడి మాత్రమే కాదు, అత్యాచారం కూడా అని రుజువు చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బహిరంగ సాక్ష్యంగా ఉంది. వీడియో వరకు ఎందుకు? మృతురాలి తల్లి మాటలు చాలవా?! ‘‘ఈడ్చుకెళ్లిన జాడల వైపు నడుచుకుంటూ వెళ్లాను. ఓ చోట నా కూతురు స్పృహలో లేకుండా పడి ఉంది. ఒంటి మీద బట్టల్లేవు. నోట్లోంచి రక్తం కారుతోంది’’ అని ఆమె చెప్పిన నాలుగు ముక్కలు చాలు సీమ ఆ కేసును వాదించడానికి. సీమది కూడా ఉత్తరప్రదేశే. అక్కడి ఎటావా స్వస్థలం. తండ్రి బలాదిన్ ఖుష్వహ.. బిధిపూర్ గ్రామ మాజీ సర్పంచి. కూతుర్ని ఆమె ఇష్ట ప్రకారం ‘లా’ చదివించాడు. లా తర్వాత జర్నలిజం, పొలిటికల్ సైన్ కూడా చదివారు సీమ. 2012లో నిర్భయ ఘటన జరిగే నాటికి ఆమె ఇంకా విద్యార్థినిగానే ఉన్నారు. తర్వాత రెండేళ్లకు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆ నలుగురికీ ఉరిశిక్ష పడాల్సిందేనని గట్టిగా వాదించినప్పుడు తొలిసారిగా ఆమె పేరు దేశానికి తెలిసింది. కేసు నడుస్తున్నప్పుడు ‘నిర్భయ జ్యోతి ట్రస్టు’కు ఆమె సలహాదారుగా ఉన్నారు. ఆ ట్రస్టును నెలకొల్పింది నిర్భయ తల్లిదండ్రులు. అత్యాచార బాధితుల న్యాయపోరాటాలకు ఆర్థికంగా తోడ్పాటును అందివ్వడం ట్రస్టు ధ్యేయం. మిగతా సామాజిక అంశాలలో కూడా సీమ చురుగ్గా ఉన్నారు. నిర్భయ దోషులు చట్టంలోని వెసులుబాట్లను ఉపయోగించుకుని చివరి వరకు బయట పడాలని చూసినట్లే, వారిని ఉరికంబం ఎక్కించేందుకు సీమ చివరి వరకు ప్రయత్నించి నిర్భయకు కనీస న్యాయం జరిపించారు. ఇప్పుడీ హాథ్రస్ కేసు స్వీకరించడం కూడా తన ధర్మం అని ఈ న్యాయవాది మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. -
2020 ఎన్నికలు: సీమా నంద అనూహ్య నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన, భారత సంతతి న్యాయవాది సీమా నందా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సీఈఓగా వ్యవహరిస్తున్న ఆమె తన పదవి నుంచి వైదొలిగారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం సీమా వెల్లడించలేదు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న 48 ఏళ్ల సీమ.. 2018లో డీఎన్సీ సీఈఓగా ఎన్నికయ్యారు. తద్వారా ఈ పదవిని అలంకరించిన తొలి ఇండో- అమెరికన్గా నిలిచారు. ‘‘రెండేళ్ల తర్వాత డీఎన్సీ సీఈఓ పదవి నుంచి నిష్క్రమిస్తున్నాను. నేను సమకూర్చిన మౌలిక సదుపాయాల కంటే ఓ బృందంగా మేము చేసిన దాని పట్ల సంతోషంగా ఉంది’’అని ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు నా పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. (ప్రమాదకర సలహాలు.. మాట మార్చిన ట్రంప్!) కాగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బిడెన్ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేందుకే సీమా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక జో బిడెన్ క్యాంపెయిన్ కోసం 3,60,600 అమెరికా డాలర్ల నిధులు సేకరించడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి‘‘బిడెన్ విక్టరీ ఫండ్’’అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డీఎన్సీ తెలిపింది. ఇక సీమా నంద స్థానంలో మేరీ బెత్ కాహిల్ డీఎన్సీ సీఈఓగా ఎన్నిక కానున్నట్లు సమాచారం. కాగా సీమా నంద తల్లిదండ్రులు దంత వైద్యులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కనెక్టికట్లో పెరిగారు. బ్రౌన్ యూనివర్సిటీలో చదివారు. బోస్టన్ కాలేజీ లా స్కూల్ నుంచి పట్టా పుచ్చుకున్నారు. సివిల్ రైట్స్ డివిజన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సంస్థలో పనిచేశారు. (సౌదీ కీలక నిర్ణయం.. మరో సంస్కరణ!) -
వెయిట్లిఫ్టర్ సీమాపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్లో పట్టుబడిన భారత వెయిట్లిఫ్టర్ సీమాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2017 కామన్వెల్త్ చాంపియన్íÙప్లో 75 కేజీల విభాగంలో రజత పతకం గెలిచిన సీమా, 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన జాతీయ మహిళల వెయిట్లిఫ్టింగ్ చాంపియన్íÙప్ సందర్భంగా ఆమె నుంచి ‘నాడా’ అధికారులు శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్ష చేయగా అందులో అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధించిన ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. దీంతో ‘నాడా’కు చెందిన డోపింగ్ నిరోధక క్రమశిక్షణా ప్యానెల్ ఆమెపై వేటు వేసింది. -
బిందుసేద్యం లక్ష్యాలు పూర్తి
- టార్గెట్ రీచ్ అయిన ఏపీఎంఐపీ - 15వేల హెక్టార్లకు గాను 15179 హెక్టార్లకు సూక్ష్మసేద్యం - మార్చిలోనే 3500 హెక్టార్లకు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)జిల్లాలో 2016-17 లక్ష్యాలను అధిగమించింది. కరువు సీమలో డ్రిప్, స్ప్రింక్లర్ల వ్యవసాయం భారీగా పెరిగింది. వర్షాలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోతున్న నేపథ్యంతో నీటిని పొదుపుగా వినియోగించి అధిగ దిగుబడులు సాధించేందుకు రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యం వైపు దృష్టి సారించారని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 2016-17లో జిల్లాకు 15వేల హెక్టార్లకు సూక్ష్మసేద్యం కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.106 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 15,179 హెక్టార్లకు సూక్ష్మసేద్యం మంజూరు చేశారు. అయితే ఒక్క మార్చిలోనే 3500 హెక్టార్లకు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 11వేల హెక్టార్లకు పరికరాలను కూడా అమర్చారు. మిగిలిన వాటికి నెలాఖరులోగా పూర్తి చేస్తామని పీడీ స్పష్టం చేశారు. 2015-16లో 7380 హెక్టార్లకు మాత్రమే డ్రిప్ కల్పించారు. అదే 2016-17లో రెట్టింపు కంటే ఎక్కువగా ప్రగతి సాధించారు. రూ.106 కోట్లు బడ్జెట్ ఇవ్వగా రూ.86 కోట్లు వ్యయం చేశారు. స్ప్రింక్లర్ల సేద్యం పెరగడం వల్ల నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాలేదు. 7700 హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించగా మిగిలినది స్ప్రింక్లర్ల సేద్యమే. ముఖ్యంగా సూక్ష్మ సేద్యం కారణంగా అరటిలో దిగుబడులు భారీగా పెరిగాయి. ఎస్సీ రైతులకు 1600 హెక్టార్లు, ఎస్టీ రైతులకు 650 హెక్టార్ల వరకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించారు. -
సీమపై సీఎం వివక్ష
- ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు సిటీ: రాయలసీమను సీఎం చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారని, ఈ విషయంపై దమ్ముంటే టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని రాయసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ ప్రజలకు ఉద్యోగాల్లోనూ, పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన ప్రముఖ విద్యా సంస్థలను కోస్తా ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 1974లో జోనల్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. సీమ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే ఇటీవల ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్బాబు.. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించారన్నారు. అయితే గతంలో ఇలా చేసిన ప్రకటనలకు దిక్కు లేకుండా పోయిందని..చిత్తశుద్ధి ఉంటే ఫ్రీజోన్ ప్రకటనకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. సీమలో కనీసం తాగు నీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. చట్ట ప్రకారం కేటాయించిన వాటా మేరకు నీరు అందడం లేదన్నారు. పది డిమాండ్లతో ఈ నెల 18, 19తేదీల్లో దీక్షలు చేపట్టనున్నట్లు బైరెడ్డి తెలిపారు. -
బాబు పాలనలోనే సీమకు అన్యాయం
బనగానపల్లె రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలోనే రాయల సీమకు సాగు నీటి విషయంలో పూర్తి అన్యాయం జరిగిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం బనగానపల్లె పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో రాయలసీమ సాగునీటి సాధన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ శైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులను జీవో నంబర్ 69 ద్వారా తగ్గించింది చంద్రబాబునాయుడేనని చెప్పారు. రాయలసీమకు సాగునీరు, తాగు నీరు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే 1996లో ఆ జీవో విడుదల చేశారని ఆరోపించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమేనన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో పథకం నిర్మాణం అగిపోయిందన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితితో పాటు ఇక్కడి రైతులు చేస్తున్న ఉద్యమాలకు కంటితుడుపు చర్యగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని బాబు ప్రారంభించారన్నారు. బాబుకు ధైర్యం ఉంటే పట్టిసీమ ద్వారా రాయలసీమకు వచ్చే 191 టీఎంసీల నీటి హక్కులపై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. సీమకు ఇచ్చే నీటి విషయంలో చట్టబద్ధత కల్పించాలని మే నెలలో నంద్యాల లేదా సిద్ధేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ ఎత్తున రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ ఎ. రామచంద్రారెడ్డి, నంద్యాల రైతు సంఘం నాయకులు వై.ఎన్.రెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు జిల్లెల్ల శివరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు దొనపాటి యాగంటిరెడ్డి, మహానందరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు. -
వలసలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
– ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపణ – సీమ ప్రగతికోసం ఐక్య ఉద్యమాలకు పిలుపు కర్నూలు(హాస్పిటల్): విద్యతోపాటు ఇతర అన్ని రంగాల్లో పూర్తి వెనుకబాటుతో ఉన్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలు, బెంగళూరు సహా దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పైగా కోసిగి నుంచి బెంగళూరుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును తిప్పుతూ వలసలను మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సీమ సమగ్రాభివద్ధి కోసం గత నెల 24న హాలహర్వి మండలం గూళ్యం నుంచి ప్రారంభమైన జీపు జాతా మంగళవారం కర్నూలులో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక సి.క్యాంపు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ గేయానంద్ మాట్లాడారు. రాయలసీమలో అత్యధిక నీటి వనరులున్న కర్నూలు జిల్లాలో కూడా జనం తాగునీటికి సైతం అల్లాడుతుండడం దురదష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లతోపాటు పాఠశాలలనూ ప్రభుత్వం మూసివేస్తోందని, పిల్లలంతా బడిమానేసి పనికి వెళ్తున్నారన్నారు. కన్నడ, ఉర్దూ మీడియం పిల్లలు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి విద్య కోస ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా 2వేల మంది ఉపాధ్యాయులను నియమించాలన్నారు. నిరుద్యోగులకు రూ.2వేల భతి ఇవ్వాలని కోరారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్నారు. రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చెన్నయ్య ప్రసంగించారు. ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి. శంకరశర్మ, రాయలసీమ అభివద్ధి వేదిక అనంతపురం జిల్లా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, వివిధ సంఘాల నాయకులు పెద్దస్వామి, నరసింహ, కవి అజీజ్, మహేశ్వరరావు, బాషా, సునయ కుమార్, రామశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష
– అనంతపురానికి వెళ్లనున్న ఇంజినీర్లు కర్నూలు సిటీ: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలోని ఆయా సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లు పెండింగ్ పనుల పురోగతి, సాగు నీటి వివరాలతో కూడిన నివేదికలతో వెళ్లనున్నారు. సాగు నీటి కాల్వల కింద సాగైన ఆయకట్టు, దీనికి అవసరమైన నీరు, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వివరాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో ఎండుతున్న పంటలు, వాటిని కాపాడేందుకు రెయిన్ గన్స్ ద్వారా నీరు ఇచ్చేందుకు ఉండే అవకాశాలతో కూడిన నివేదికలను ఇంజినీర్లు సిద్ధం చేసుకున్నారు. సీఈకి అదనపు బాధ్యతలు జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈగా పని చేస్తున్న నారాయణరెడ్డికి ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నూలు సీఈగా రాకముందు ఈయన అక్కడే పని చేసే వారు. దీంతో ఖాళీగా ఉన్న ఆ స్థానంలో తిరిగి అదనపు బాధ్యతలు ఆయనకే ఇచ్చారు. -
సీమ అభివృద్ధికి ఉద్యమిద్దాం
ఎస్టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నరసింహులు డోన్ టౌన్: రాయలసీమ అభివృద్ధికి ఉద్యమిద్దామని ఎస్టీయూ రాష్ట్రగౌరవాధ్యక్షుడు నరసింహులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్జీవోస్ హోంలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన జిల్లాలోని హŸళగుంద నుంచి ప్రారంభమయ్యే జీపుజాత 30వ తేదీన డోన్ చేరుకుంటుందన్నారు. ఈ జాతాను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులను కోరారు. విద్యా, వైద్య రంగాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. సమావేశంలో కన్వీనర్ ఎన్ఎస్బాబు కో కన్వీనర్ శివశంకర్, అఖిలపక్ష నాయకులు మాణిక్యం శెట్టి, ప్రసాద్రెడ్డి, రాజ్కుమార్, శ్రీనివాసశర్మ, మద్దయ్య, శివరామ్, ఎల్లయ్య, రామాంజనేయులు, భాస్కర్రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సీమ ద్రోహి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి – శ్రీశైలంలో కనీస నీటిమట్టం పాటించాలని డిమాండ్ – త్వరలో ఆరు జిల్లాల రైతులు, మేధావులతో సదస్సు కోడుమూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల నీటిమట్టం లేకుండానే నాగార్జునసాగర్కు విడుదల చేయడం సరికాదన్నారు. కనీస నీటి మట్టం పాటించకుంటే పాలమూరు, డిండి ప్రాజెక్టులతోపాటు హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలకు నీరు చేరదని, అదే జరిగితే రాయలసీమ ప్రాంతం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ రైతుల కోసం పార్టీలకు అతీతంగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులు, మేధావులను ఏకం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. త్వరలో 6 జిల్లాల రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో పాలన అస్తవ్యస్తం.. జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరున్నప్పటికీ జనం తాగు, సాగునీటికి అవస్థలు పడే పరిస్థితి నెలకొందన్నారు. 38 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే నంద్యాల వాటర్ స్కీం రెండేళ్లుగా పని చేయకపోయినా కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధికార పార్టీ తొత్తుగా మారారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీబీ లత, సింగిల్విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కె.హేమాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమకు న్యాయం చేయండి
– కృష్ణా జలాల విడుదలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మొర – జెడ్పీ సర్వసభ్య సమావేశంలో డ్యామ్ నీటిమట్టంపై రగడ – 854 అడుగులు ఉండేలా తీర్మానం – పుష్కర పనుల్లో భారీగా అవినితీ : పీఏసీ చైర్మెన్ – విచారణ చేయిస్తామన్న ఇన్చార్జ్ మంత్రి కర్నూలు సిటీ: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని తాగునీటి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశంలో పీఏసీ చైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమెహన్, జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, వైస్ చైర్మెన్ పుష్పావతి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బీసీ జనార్ధన్రెడ్డి, మణిగాంధీ పాల్గొన్నారు. సమావేశంలో సంజామల మండలం జెడ్పీటీసీ చిన్నబాబు ప్రస్తావించిన ప్రశ్నతో సభ ప్రారంభం అయ్యింది. శ్రీశైలం జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు వస్తుందని, రాయల సీమ ప్రాజెక్టులకు నీరు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని పీఏసీ చైర్మెన్ సభ దష్టికి తీసుకవచ్చారు. కష్ణా జలాల్లో రాయల సీమ ప్రాజెక్టులకు రావాల్సిన వాటా మేరకు ఈ ఏడాది నీరు ఇచ్చిన తరువాతనే మిగతా వారికి ఇవ్వాలన్నారు. ఓ వైపు బుగ్గన మాట్లాడుతుండగా సీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలని ఇటీవలే సీఎంను కలిసి విన్నవించామని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి అన్నారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వావాదం చోటు చేసుకుంది. కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా తీర్మానం శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు జెడ్పీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరను చరితా రెడ్డి పట్టుబట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు అంతరాష్ట్రాలకు సంబంధించిందని చైర్మన్ చెప్పడంతో కొంత సేపు సభలో గందరగోళం నెకొలకొంది. ఎట్టకేలకు చివరికి 854 అడుగుల కనీస నీటి మట్టం ఉండేలా చూడాని జెడ్పీ తీర్మానానికి ఇన్చార్జ్ మంత్రితో పాటు సభ్యులందరు అంగీకరించడంతో తీర్మానం చేశారు. అనంతరం కష్ణా పుష్కారాల పనుల్లో భారీగా అవినీతి జరిగిందని పీఏసీ చైర్మెన్ బుగ్గన ప్రస్తావించారు. రెండు నెలలుగా పనులు చేస్తున్నా నేటీకి పూర్తి కాలేదని, నాణ్యత లేకపోవడంతో ఘాట్ల మెట్లకు వేసిన టైల్స్ నీటి తాకిడికే కోట్టుకపోతున్నాయన్నారు. ఇందుకు ఇన్చార్జి మంత్రి స్పందించి నాసిరకమై పనులపై విచారణ చేయిస్తామన్నారు. నాణ్యత పాటించలేదంటే అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు అయినా బిల్లులు నిలిపి వేసి, భవిష్యతులో ఆ కాంట్రాక్టర్కు ఎలాంటి పనులు చేయకుండా అనర్హుడిగా ప్రకటిస్తామన్నారు. ప్రొటోకాల్పై మళ్లీ వివాదం గ్రామీణ ప్రాంతాల్లో పలు అబివద్ధి పనులు ప్రారంభోత్సవంలో మండల అధికారులు జెడ్పీటీసీలను పట్టించుకోడవం లేదని సి.బెళగల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ సభ దష్టికి తెచ్చారు. మండలంలో ఇటీవల 22 కోట్ల అబివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు జెడ్పీటీసీకి, ఎమ్పీటీసీ సభ్యులకు అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్ స్పందించి జిల్లాలో కొత్తగా రాజకీయాలు చేయవద్దని అనడంతో .. జెడ్పీటీసీలందరు చైర్మన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి తోడు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సైతం సభ్యులకు మద్దతూగా మాట్లాడుతూ ‘అధ్యక్షా...నియోజకవర్గానికి ఎమ్మెల్యేలయిన మాకే ప్రొటోకాల్ విషయంలో దిక్కులేదు, ఎలాంటి హోదా, పదవీ లేని వ్యక్తులకు పోలీసులు సైరైన్ వాహనాలతో వెళ్లి స్వాతగం పలికి మర్యాదులు చేస్తున్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల సేవల్లో మునిగి తెలుతున్నారు’.. అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి జిల్లాలో ఇకపై ప్రొటోకాల్ విషయంలో ఫిర్యాదులు వస్తే సంబంధింత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు: జిల్లా స్థాయిలో మూడు నెలలకోసారి జరిగే సమావేశానికి కూడా ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేవారు. జెడ్పీ మీటింగ్ అంటే తమాషాగా ఉందా మీకు.. కలెక్టర్గారు జిల్లా అధికారులపై ఇదేనా మీ పర్యవేక్షణ అంటు అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి గైర్హాజరైన జల వనరుల శాఖ ఎస్ఈలకు షోకాజ్ నోటీస్లు ఇవ్వాలని, హాజరుకాకపోవడానికి వివరణ ఇవ్వాలని సీఈఓకు సూచించారు. కాల్వలే పూర్తి కాలేదు నీరెలా ఇస్తారు: ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే సాగునీటి ప్రాజెక్టులకు చెందిన కాల్వల పనులే పూర్తి కాలేదు.. సాగు నీరు ఇస్తామని అంటున్నారు. మచ్చుమర్రి పథకాన్ని ఈనెల 15కు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ అక్కడ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కేసీకి నీరు ఎప్పటీ నుంచి ఇస్తారో చెప్పడం లేదు. చెరువుల కింద సాగు చేసుకునేందుకు పంట కాల్వలే లేవు. రైతులకు పరిహారం ఏదీ: గౌరు చరితా రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గతేడాది ఏప్రిల్ నెలలో కురిసిన వడగండ్ల వానకు రైతులు పంట నష్టపోయారు. ఇంత వరకు పరిహారం రాలేదు. ప్రధానమంత్రి ఫజల్ యోజన పథకం బీమా కింద మొక్క జొన్నకు ఇవ్వలేదు. ఈ పంట జిల్లాలో ఇటీవల అధిక శాతం మంది సాగు చేస్తున్నారు. మొక్కజొన్నకు కూడ బీమా సౌకర్యం కల్పించాలి. సర్పంచ్లు కమీషన్లు అడుగుతున్నారు: బీసీ జనార్ధన్రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే గ్రామాల్లో మ్యాచింగ్ గ్రాంట్స్తో చేసే పనులకు చాలా చోట్ల సర్పంచ్లు కమీషన్లు అడుగుతున్నారు. ఎంపీఈఓలను సొంత నియోజకవర్గాల్లోనే నియమించాలి. దూర ప్రాంతాలకు నియమించడంతో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోతున్నారు. మహిళలు దూరప్రాంతాల్లో పని చేయలేరు. క్రషర్ మీషన్లు, క్వారీల అనుమతులపై విచారణ చేయించాలి. అవుకు వాటర్ స్కీమ్ కాంట్రార్ రద్దు చేయాలని తొమ్మిది సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. కాల్వల్లో ఎక్కడి మట్టి అక్కడే: బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే పోతిరెడ్డిపాడు నుంచి ఎస్ఆర్ఎంసీకి నీరు విడుదల చేస్తామంటున్నారు. కాల్వల్లో ఎక్కడి మట్టి అక్కడే ఉంది. పూర్థి స్థాయిలో చేయలేదు. కేసీ డైవర్షన్ కోసం కూల్చిన వంతెనల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. అయినా నీరు ఇస్తామంటున్నారు. ఎలా సాధ్యం. మినుములు రాయితీపై ఇవ్వాలి. సున్నిపెంటలో తాగు నీటి సదుపాయంపై అధికారులు స్పందించడం లేదు. -
సీమకు అన్యాయం చేస్తే ప్రత్యేక ఉద్యమం
– కలెక్టరేట్ ముట్టడిలో అఖిలపక్ష నేతలు కర్నూలు : శ్రీశైలం జలాల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రత్యేక ఉద్యమం వస్తుందని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. శ్రీశైలం నీరు సాగర్కు విడదుల చేయడానికి నిరసనగా రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చాయి. ఈ సందర్భంగా రాయలసీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి∙మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలలమని, నీటి పంపకాల విషయంలో తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి సీమ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం విచారకరమన్నారు. సీమకు ప్రత్యేక హోదా కంటే సాగు నీరే ముఖ్యమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రాంతాల మద్య విభేదాలు వచ్చి ప్రత్యేక ఉద్యమాలకు దారితీస్తాయన్నారు. తీరు మార్చుకోకపోతే సీమలో సీఎం చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయల సీమకు చెందిన తెలుగు దేశం పార్టీ నేతలు అన్యాయంపై నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. కలెక్టరేట్ ముట్టడిలో వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు, రైతు సంఘాలు నాయకులు పాల్గొన్నారు. -
సీమ, తెలంగాణలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోనూ, దక్షిణ మధ్యప్రదేశ్పై ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు రాయలసీమలో, మంగళ, బుధవారాల్లో తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. కోస్తాలో మాత్రం బుధవారం నుంచి రెండ్రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురవొచ్చని పేర్కొంది. ఆవర్తనాల వల్ల ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలపై దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ చలి ప్రభావం తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉండొ చ్చంటున్నారు. గత 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే నెలకొంది. -
జూబ్లీహిల్స్లో అర్థరాత్రి హిజ్రా హల్చల్
-
జూబ్లీహిల్స్లో అర్థరాత్రి హిజ్రా హల్చల్
అది హైదరాబాద్లో సంపన్నులు ఉండే ప్రాంతం. అర్ధరాత్రి దాటినా రోజులాగే వాహనాలతో రద్దీగా ఉంది ఆ ప్రాంతం. అంతేకాదు.. వారాంతం కావటంతో మందుబాబుల హంగామా కూడా అంతా ఇంతా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్కు ఫుల్స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఖాకీలు.... జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అంతే అక్కడ వున్న పోలీసులు.... మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. తీరా విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంత హడావుడికి కారణం ముంబైకి చెందిన సీమా అనే ఓ హిజ్రా. లిప్ట్ అంటూ ఓ కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక... కారు నడుపుతున్న వ్యక్తి మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోబోయింది. అంతే... పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు... ఇదేమిటిరా అని తేరుకున్న కారు డ్రైవర్ అరవటం మొదలుపెట్టాడు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు హిజ్రాను పట్టుకునే యత్నం చేశారు. అది చూసి... మీడియాపై రాళ్లు రువ్వే యత్నం చేసింది. అంతేకాకుండా తాను దొంగను కాదు... కారు డ్రైవర్ బంగారు గొలుసు... బండిలోనే ఉందంటూ... దబాయించింది. చివరికి... పారిపోతున్న హిజ్రాను పట్టుకుని పోలీసులు తమ వాహనంలో లిప్ట్ ఇచ్చి స్టేషన్ను తీసుకెళ్లారు. -
సీమలో రాజధాని ఏర్పాటుకై రోడ్డెక్కిన విద్యార్థులు
-
నాసా-స్పేస్ కాంటెస్ట్లో ప్రపంచ నం.1గా శ్రీచైతన్య
హైదరాబాద్: అమెరికా, నాసా (నేషనల్ స్పేస్ సొసైటీ)లు సంయుక్తంగా చేపట్టిన ప్రపంచ స్థాయి నాసా-స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ చరిత్రలో ఒకే సంవత్సరంలో అత్యధిక ప్రాజెక్టుల(13) విజేతగా శ్రీచైతన్య రికార్డు సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్ డెరైక్టర్లు సీమ, సుష్మలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో-2, రెండో స్థానంలో-5, మూడో స్థానంలో-3, ఇతర స్థానాల్లో-3 ప్రాజెక్టులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రపంచంలో ఒకే విద్యాసంస్థ నుంచి అత్యధికంగా ఎంపికైన విద్యార్థుల సంఖ్య(55)లో గానీ, అత్యధిక విన్నింగ్ ప్రాజెక్టుల(13-62 శాతం) సంఖ్యలో గానీ తమ సంస్థ నంబర్-1గా నిలిచిందన్నారు. -
నవంబర్ 1 సీమకు చీకటి దినం
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీ రాయలసీమ చరిత్రలో చీకటి దినమని రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. కర్నూలులో ఉన్న రాజధానిని ఆ రోజు హైదరాబాద్కు తరలించడంతోనే సీమకు కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. శుక్రవారం ఆర్పీఎస్ఎస్ఎఫ్, టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రీ ఎస్టేట్ నుంచి కలెక్టరేట్ వరకు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్పీఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, టీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ చంద్రప్ప ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడారు. రాయలసీమ వాసుల త్యాగంతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాజధానిని కర్నూలుకు కేటాయించాలని కోరుతూ తక్షణమే అన్ని రాజకీయ పార్టీలూ లేఖలు ఇవ్వాలని కోరారు. రాజధాని చేయలేకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో సైన్స్ సిటీ, మదనపల్లిలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీను, రాజు, రవి, జనార్ధన్, వినయ్ పాల్గొన్నారు.