Short films
-
సినివారం.. లఘు చిత్రాల సమాహారం..
సినిమా.. సినిమా.. అంటూ జీవితాన్ని సైతం అంకితం చేసి ఈ రంగంలో రాణించడానికి, వెండి తెరపైన తమకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ రాసుకోవాలని తపించే, పరితపించే సినిమా ప్రేమికులెందరో. విభిన్న కళల సమాహారం సినిమా. కథకుడు, దర్శకుడితో మొదలై.. నటీనటులు, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఆర్ట్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్.. ఇలా విభిన్న కళాకారుల సమిష్టి కృషి సినిమా. ఈ వేదికపై తమ పేరును చూసుకోవాలన్నా, వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్నా ఎక్కడో సాయం అందాలి.ఇప్పుడిప్పుడే సినీ రంగం వైపు అడుగులేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి..?! సినిమానే లక్ష్యంగా లఘుచిత్రాలు రూపొందిస్తూ, బిగ్ స్క్రీన్ కోసం ప్రయత్నిస్తున్న సినీపిపాసులను ఆదరించే ప్రోత్సాహం అవసరం.. ఇలాంటి వారందరినీ సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది ‘సినివారం’. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున కొలువుదీరిన రవీంధ్రభారతి వేదికగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న ‘సినివారం’ ఈ తరం సినీ ప్రేమికులకు స్వర్గధామం. ఉత్తమ షార్ట్ ఫిలింస్ నిర్మించే వారిని గుర్తించి వారి ప్రయాణానికి రెడ్ కార్పెట్ వేస్తోంది రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ‘సినివారం’. – సాక్షి, సిటీబ్యూరోవినీలాకాశంలాంటి సినీ ప్రపంచంలోకి అడుగులేసిన యువతరానికి గుర్తింపునివ్వాలనే లక్ష్యంతో 2016 నవంబర్ నెలలో పురుడుపోసుకుంది ‘సినీవారం’. సృజనాత్మకత ఉండి, సినిమాపై ప్రేమతో మొదటి ప్రయత్నంగా లఘు చిత్రాలు రూపొందిస్తున్న తెలంగాణ యువత ఎందరో. వారందరికీ ఒక అవకాశంతో పాటు, సినిమా రంగానికి వారి సృజనాత్మకతను తెలియజేసేది ఆ షార్ట్ఫిల్మ్ మాత్రమే. అనంతరం దానిపై సినీ రంగ ప్రముఖులతో చర్చిస్తుంది ఈ సినీవారం. ఇందులో భాగంగా ఈ ఎనిమిదేళ్లలో కొన్ని వందల లఘు చిత్రాలు ఈ తెరపై ప్రదర్శితమయ్యాయి. వీటిని రూపొందించిన సినీ ప్రేమికులకు నేరుగా అవకాశాలు లభించాయి. నూతన తెలంగాణలో సినీ ప్రేమికులకు ఇదొక అవకాశాల పుష్పక విమానం. నైపుణ్యాలను గుర్తించి.. లోపాలను సవరిస్తూ.. తెలంగాణకు సినిమా కొత్త కాదు. ఆ రోజుల్లోనే బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న మొదటి తరం సినీ రంగ ప్రముఖులు.. పైడి జయరాజ్. ఆయన గౌరవార్థం రవీంద్రభారతిలోని థియేటర్కు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని నామకరణం చేశారు. ఈ థియేటర్లోనే ఈ తరం యువకులు తీసిన లఘు చిత్రాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్.. ఇలా తెలంగాణలోని విభిన్న ప్రాంతాల్లో యువతరం తీసిన షార్ట్ ఫిల్మŠస్, డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించి వారికి ఒక గుర్తింపునిస్తోంది రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. ఈ ప్రయత్నంలో వారి నైపుణ్యాలను, లోపాలను ఇదే వేదికపై తెలియజేసేలా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, సినీ ప్రముఖులు, నిపుణులు, ప్రముఖ సినీ విమర్శకులతో చర్చా గోష్టిని నిర్వహిస్తున్నారు. అనంతరం వారికి సినిమా అవకాశాలు లభించేలా ఒక దారిని చూపిస్తోంది.మహామహులంతా ఇక్కడి నుంచే.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ చిత్రాలతో ఫేమస్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్, మెయిల్ సినిమాతో చిన్న సినిమాకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చిన ఉదయ్ గుర్రాల, దొరసాని ఫేం కేవీఆర్ మహేంద్ర వంటి ఈ తరం సినీ దిగ్గజాలు తమ మొదటి సినీ ప్రయత్నాలను ఈ సినీవారం వేదికగానే ప్రదర్శించారు. ఇలా దర్శకులు, నటులు, సినీ రచయితలతో పాటు సిని పరిశ్రమకు అవసరమయ్యే విలువైన ముడిసరుకు కొంతమేర ఈ సినీవారం వేదికగా సమకూరుతోంది. ఇక్కడ ప్రదర్శించే లఘుచిత్రాలు ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పోరాటాలు, యధార్థగాథలతో పాటు నేటి మోడ్రన్ కమర్షియల్ సినిమాల నాణ్యతను పరిచయం చేస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్... పదేళ్ల కృషికి నిదర్శనం ఇది.. ప్రస్తుత సినిమాల్లో తెలంగాణ నేపథ్యమున్న కళాకారులు, కథలు, సినిమాలు, టెక్నీషియన్లు వారి విజయాలు..!! ఈ లక్ష్యం నిర్దేశించుకునే 2016లో ‘సినివారం’ను ప్రారంభించాం. గతంలో ముంబైలోని బాలివుడ్ కమర్షియల్ సినిమాలకు కేంద్రం. కానీ అక్కడి మరాఠీ సినిమాలు కూడా వాటి ప్రత్యేకతను, ప్రాధాన్యతను, ప్రశస్తిని కొనసాగించాయి. అలాగే హైదరాబాద్లోనూ తెలుగు సినిమా సైతం తన వైవిధ్యాన్ని, విశిష్టతను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయత్నానికి నాంది పలికాం. ఇందులో భాగంగా కళ, నైపుణ్యాలు, సృజనాత్మకత ఉండి, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు అద్భుత వేదికను నిర్మించాం. ఈ సినివారం వేదికగా ఇప్పటి వరకూ దాదాపు 27 మంది ఈ తరం దర్శకులు పరిచయమయ్యారు. అంతేకాకుండా 24 క్రాఫ్టŠస్కు చెందిన నిపుణులు గుర్తింపును, అవకాశాలను పొందారు. ఇలాంటి ఔత్సాహికుల కోసం ఇక్కడ వారి షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో పాటు వర్క్షాప్లు, శిక్షణా తరగతులు, అవగాహనా సదస్సులు, ఇంటరాక్టివ్ సెషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అందించే సేవలన్నీ ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలే సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత పైన వర్క్షాప్ నిర్వహించాం. సినిమా రంగంలోని అధునాతన మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం.భవిష్యత్లోనూ ఈ తరం సినిమా ప్రేమికులకు మరిన్ని అవకాశాలను భాషా సాంస్కృతిక శాఖ అందిస్తుంది. – మామిడి హరిక్రిష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు -
లఘు చిత్రాలతో ‘నల్సా’ పథకాలు ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: సినిమా అనేది ఒక బలమైన మాధ్యమమని, పోక్సో, సైబర్ క్రైమ్, దాంపత్య వివాదాలు తదితర అంశాలపై తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రూపొందించిన లఘు చిత్రాలతో న్యాయ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అభిప్రాయపడ్డారు. పేదలతోపాటు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఈ సంస్థ అందిస్తున్న న్యాయ, ఇతర సేవలు లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయన్నారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన 10 లఘు చిత్రాలను బంజారాహిల్స్లోని ప్రసాద్ లాబ్స్లో శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్ఎల్ఎస్ఏ పాట్రన్–ఇన్–చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువురాని వారికి కూడా పథకాలు తెలిసేలా ఈ చిత్రాలు ఉన్నాయని దర్శకుడు సాయిప్రసాద్ను అభినందించారు. సినిమాలతో ఎక్కువ మంది ప్రభావితం అవుతారని, అందుకే నల్సా పథకాలపై లఘు చిత్రాలను రూపొందించామని టీఎస్ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్ కోషి తెలిపారు. ఉచిత, సమర్థ న్యాయ సేవలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు సులువుగా చేరువ చేస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ పథకాలు చేరాలన్నదే తమ లక్ష్యమని టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రాలను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వీక్షించేలా పలు భాషల్లోకి అనువదించనున్నట్లు దర్శకుడు సాయిప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీత కథ, అంకురం, సంకల్పం, ప్రేరణ, వల, ముందడుగు, నాంది, గెలుపు, జోజో పాపాయితోపాటు టీఎస్ఎల్ఎస్ఏ ఇతర సేవల లఘుచిత్రాలను ప్రదర్శించారు. -
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
ఇన్ఫినిటమ్ అంటేనే ఒక వైబ్రేషన్...యూత్ కలల డెస్టినేషన్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫినిటమ్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. యువత కలల సాధనకు వారధిగా నిలుస్తోంది. అరుదైన యుత్ ఐకాన్స్ కు ఇన్ఫినిటమ్ అడ్డగా నిలుస్తోంది. ఇన్ఫినిటమ్ ఈవెంట్ అదరహో అనే స్థాయిలో సాగింది. స్పూర్తిని నింపేలా ఈవెంట్ సంథింగ్ స్పెషల్గా నిలిచింది. యువతలో స్పూర్తిని నింపే ఎంతో మంది ఒకే వేదిక మీదకు ఇన్ఫినిటమ్ తీసుకొచ్చింది. డిజిటల్ ప్లాట్ఫారమ్లలో సాధించిన విజయం అద్భుతం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య సంస్థలను పరిచయం చేసింది. తమ లక్ష్యం ఏంటో ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. సెలబ్రెటీస్ సందడి.. ప్రముఖుల బ్లెస్సింగ్ నడుమ పండుగ వాతావరణంలో ఈవెంట్ సినీ ఎంట్రీ గ్రాండ్ లాంచ్ చేసింది. ఇన్ఫినిటమ్ ఈవెంట్కు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలి వచ్చారు. ఏషియన్ గ్రూప్ జాహ్నవి నారంగ్, ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇన్ఫినిటమ్కి విషెస్ చెప్పారు. ఏషియన్ మూవీతో టై అప్ అయిన ఇన్ఫినిటమ్ జయ క్రిష్ణ ముకుంద మురారీ తొలి మూవీ టైటిల్ ను ఆవిష్కరించారు. ఇక ఈవెంట్ కలర్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ గా గ్రాండ్ ఫీస్ట్ గా నిలిచింది. ఎంతో మంది యువ కళాకరులను ఈ వేదిక ద్వారా పరిచయం చేసింది. ఇన్ఫినిటమ్ కోర్సులను ఈవెంట్ లో ఆవిష్కరించారు. యూఎస్ లో ఇన్ఫినిటమ్ ఆపరేషన్స్ ను ఇదే ముహూర్తంగా అధికారికంగా లాంఛ్ చేసారు. ట్రిపుల్ ఆర్ మూవీ ఫేం రాహుల్ సిప్లిగంజ్, బేబీ ఫేం వైష్ణవి చైతన్యను సత్కరించారు. ఇన్ఫినిటమ్ పిక్చర్స్ సభికుల హర్షధ్వానాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేసారు. 2023 ఇన్ఫినిటమ్ వైటీ క్యాలెండర్ ను ప్రకటించారు. స్టూడెంట్ వెబ్ సిరీస్ లిరికల్ సాంగ్ రిలిజ్ చేశారు. ఇదే సమయంలో ఇన్ఫినిటమ్ ఏషియన్ భాగస్వామ్యంతో కొనసాగనున్న ప్రణాళికలు..ప్రకటనలను ఈవెంట్ లో ప్రకటించి ఆసక్తిని పెంచారు. యువ కళాకారుల అభిరుచులకు ఇన్ఫినిటమ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేందుకు వేదికగా నిలుస్తోంది. వారు సక్సెస్ అవ్వటంలో రోల్ మోడల్ గా ఖ్యాతి దక్కించు కుంది. ఇలాంటి ప్రతిభ.. సమర్ధతకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఇన్ఫినిటమ్ను గెస్టులు మనస్పూర్తిగా అభినందించారు. భవిష్యత్లో మరెన్నో సక్సెస్ లకు చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. -
రైల్వే భద్రతపై లఘు చిత్రాలతో అవగాహన
సాక్షి, హైదరాబాద్: రైల్వేభద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రైలు ప్రమాదాల నియంత్రణ, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గురువారం ఇక్కడ డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన స్టేట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ ఫర్ రైల్వేస్ (ఎస్ఎల్ఎస్సీఆర్) సమావేశం నిర్వహించారు. రైల్వే అడిషనల్ డీజీపీ బి.శశిధర్రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్, సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ రాజారామ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ.. ►రైల్వే ట్రాక్లపై మరణాలు, రైళ్లలో మానవ అక్రమ రవాణా, రైళ్లలో చోరీల కట్టడి, కదులుతున్న రైళ్లపై రాళ్ల దాడుల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ►రైల్వే ట్రాక్ల సమీపంలో నివాసం ఉండే ప్రజలకు రైల్వే ట్రాక్లపై పాటించాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు, రైళ్లలో మొబైల్ చోరీలు వంటి అంశాల్లో జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా లఘు చిత్రాల నిర్మాణం ►రైళ్లో మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా మత్తు పదార్థాల రవాణా ముఠాలపై చట్టపరమైన చర్యలు, రైలు టికెట్ బుకింగ్లో అక్రమాల కట్టడికి చర్యలు ►రైల్వే ట్రాక్లు, ప్లాట్ఫాంలపై ప్రమాదాలతోపాటు మృతుల గణాంకాలు వెల్లడిస్తూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
సినిమాలకు ఎల్బీ శ్రీరాం ఎందుకు దూరమయ్యారు?.. కారణం ఇదే
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): నాకు నచ్చనిది ఏదైనా వదులుకుంటా.. నచ్చిన చోటే సంతృప్తిగా జీవిస్తా.. పదేళ్ల పాటు సినీ నటుడిగా ఎన్నో హాస్య, సందేశాత్మక చిత్రాల్లో నటించా.. అక్కడ మంచి క్యారెక్టర్లు చేసి సంతృప్తి చెందా.. హాస్య నటుడి నుంచి బయటపడాలనే సినిమాలకు స్వస్తి చెప్పి సామాజిక సందేశాలిచ్చే లఘు చిత్రాల రూపకల్పన, నిర్మాణాలపైనే దృష్టి పెట్టానని సినీ, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, ఎల్బీ హార్ట్ ఫిలిం మేకర్ ఎల్బీ శ్రీరామ్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్ భవనంలో ఆయన విలేకర్లతో శనివారం రాత్రి మాట్లాడారు. అమలాపురంలో అమర గాయకుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఘంటసాల విగ్రహాన్ని ఎల్బీ శ్రీరామ్ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ లోగా ఆయన తన మనోగతాన్ని విలేకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. తమ సొంతూరు కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరు అగ్రహారం అని ఆయన తెలిపారు. ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడైన తాను 23 ఏళ్ల కిందట సినీ అవకాశాలను అన్వేషించుకుంటూ సినీ పరిశ్రమకు వెళ్లానని శ్రీరామ్ చెప్పారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆరిస్ట్గా తనను చిత్ర పరిశ్రమ గుర్తించిందన్నారు. ఈ ఒరవడిలోనే ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రంలో నటన ద్వారా పరిశ్రమ తనలో కొత్త నటుడిని చూసిందని శ్రీరామ్ వివరించారు. ఇప్పటి వరకూ 500 చిత్రాల్లో నటించానని పేర్కొన్నారు. ఆరేళ్లుగా పరిశ్రమకు దూరంగా... ఆరేళ్ల నుంచి తాను పావుగంట సమయంలో సందేశాత్మకతను అందించే లఘు చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టానని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నానన్నారు. హాస్య నటుడి ముద్ర నుంచి బయట పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఆరేళ్లలో 60 లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించానని అన్నారు. ప్రతి లఘు చిత్రంలోనూ సమాజానికి ఎన్నో సందేశాత్మక కథాంశాలు అందించానన్న సంతృప్తి ఉందన్నారు. ఇదే ఉత్సాహం, సంతృప్తితో మరి కొన్నేళ్లు సమాజానికి పనికి వచ్చే లఘు చిత్రాలు నిర్మిస్తానని శ్రీరామ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తానున్న సమయంలో దాదాపు 40 మంది హాస్య నటులు ఉండేవారని, అందులో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నానని వివరించారు. ఇప్పుడు సమాజ హితం కోసం లఘు చిత్రాలు నిర్మిస్తున్నానని అన్నారు. వుడయార్ శిల్పకళాధామం అత్యద్భుతం కొత్తపేట: వుడయార్ శిల్పకళాధామం అత్యద్భుతం.. శిల్పాలకు ప్రాణం పోసినట్టు ఈ ప్రాంగణంలో విగ్రహాలు జీవకళతో ఉట్టిపడుతున్నాయంటూ ప్రముఖ సినీ హాస్య, క్యారెక్టర్ ఆర్టిస్టు, సినీ నాటక రచయిత, దర్శకుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్ రూపొందించగా ఆ విగ్రహాన్ని అమలాపురంలో నెలకొల్పారు. దానిని ఆదివారం ఎల్బీ శ్రీరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అమలాపురం వెళుతూ శ్రీరామ్ మార్గం మధ్యలో కొత్తపేటలో వుడయార్ శిల్పకళాధామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్పి రాజ్కుమార్ మలిచిన విగ్రహాలు రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పగా చూశానన్నా రు. ఈ శిల్పి గురించి విన్నానని, ఎప్పటి నుంచో ఈ శిల్పకళాధామాన్ని సందర్శించాలనే కోరిక ఇప్పటికి నెరవేరిందన్నారు. ఈ ప్రాంగణంలో విగ్రహాలు కళాఖ ండాలని, అన్నీ జీవకళ ఉట్టిపడుతున్నాయంటూ వుడయార్ శిల్పకళా నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం ఎల్బీ శ్రీరామ్ను శిల్పి రాజ్కుమార్ శాలువా, పూలమాల, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. చదవండి: టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్ -
రివర్స్ గేర్లో వచ్చి.. స్టార్స్ అయ్యారు
హీరో కావాలంటే ఏం కావాలి ? టాలెంట్. ఎవరినడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. మరి…ఒక్క టాలెంట్ ఉంటే సరిపోతుందా ? ఈ ప్రశ్నకు మాత్రం వెంటనే జవాబు రాదు.నిజమే కదా…నెపోటిజం నుంచి మొదలుపెడితే సవాలక్ష అడ్డంకులను అధిగమించాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్లు లేకుండా, కేవలం టాలెంట్ పెట్టుకుని వెండితెర మీద వెలిగిపోవడం అంత తేలికేం కాదు. ఆఫీస్ల చుట్టూ తిరగాలి. ఇండస్ట్రీలో వాళ్లనీ, వీళ్లనీ ఇంప్రెస్ చేయాలి. గంటల పాటు స్టూడియోల ముందు, షూటింగ్ స్పాట్ల ముందు వెయిట్ చేయాలి. అయినా ప్రతిఫలం ఉంటుందో, ఉండదో క్లారిటీ ఉండదు. మరేం చేయాలి ? ఇంకేముంది. రివర్స్ గేర్ వేయాలి. టైమ్ వేస్ట్ చేయకుండా…షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టడమే. ముందు ప్రేక్షకులకు దగ్గర కావడమే. వాళ్ల మెప్పు పొందితే…ఇండస్ట్రీ నుంచే పిలుపొస్తుంది. వీళ్లు రివర్స్ గేర్లో వచ్చారు. ముందు ప్రేక్షకుల మెప్పు పొందేశారు. ఆ తర్వాత సినిమా చాన్సులు సంపాదించారు. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ కలిగించిన సంచలనం టాలీవుడ్ దాటి బాలీవుడ్ దాక వెళ్లిపోయింది. మరి దానికి ముందు విజయ్ దేవరకొండ ఏంటి అనగానే పెళ్లి చూపులు సినిమా గుర్తొస్తుంది. దానికి ముందు అని మళ్లీ ప్రశ్నిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా అన్న ఆన్సర్ వినిపిస్తుంది. కానీ…షార్ట్ ఫిల్మ్స్తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు విజయ్. 2011లో కొంచెం టచ్లో ఉంటా అనే షార్ట్ షార్ట్ ఫిల్మ్ మొదలైన ప్రయాణం…అతన్ని టాలీవుడ్ స్టార్ని చేసింది. (చదవండి: తరుణ్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్) సుహాస్.. కలర్ ఫోటో మూవీ హీరో. కథానాయకుడు అంటే ఇలానే ఉండాలి అన్న అడ్డుగోడ లను బద్దలుకొట్టిన హీరో. షార్ట్ ఫిల్మ్స్తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. తన నటించిన చాలా షార్ట్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. షార్ట్ ఫిల్మ్స్తో క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు నుంచి హీరో ఫ్రెండ్గా సుహాస్ జర్నీ వేగంగానే సాగింది. ప్రతి రోజు పండుగ, మజిలీ చిత్రాల్లో ముఖ్య పాత్రలతో ప్రేక్షకులకు మరింతగా దగ్గరైయ్యాడు. హీరో ఫ్రెండ్గా ఇటు కామెడీని పండిస్తూ, అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉనికిని చాటు కుంటోన్న సుహాస్ని…కలర్ ఫోటో హీరో చేసేసింది. ఇండస్ట్రీకి కొత్త స్టార్ దొరికేశాడు. ఆరు పాట లు, ఐదు ఫైట్స్ తరహా మూస సినిమాలని బ్రేక్ చేయాలని ప్రయ త్నించే దర్శకులకు సుహాస్ ఇప్పుడు బిగ్ స్టార్. నవీన్ పొలిశెట్టి. ముంబై బేస్డ్ కామెడీ కంపెనీ ఏఐబీ(A.I.B)లో చాలా వీడియోలు చేశారు. అందులో ఇంజినీరింగ్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చేసిన వీడియో… సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నేషనల్ వైడ్ నవీన్ పొలిశెట్టికి పావులారిటీ తెచ్చింది. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుంచి అనేక సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ వచ్చా డు నవీన్. కానీ…A.I.B వీడియోస్ క్లిక్ అయ్యేదాకా పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. ఇంజినీరింగ్ వీడియో క్లిక్ అయిన తర్వాత…హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ ఇచ్చాడు నవీన్. ఆ తర్వాత జాతిరత్నాలు లాంటి మరో హిట్ మూవీతో స్టార్ అయిపోయాడు. -
తెలంగాణలో నూకలంపాడు గ్రామానికి జాతీయ అవార్డు.. ఏం చేశారంటే?
ఏన్కూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలానికి చెందిన నూకలంపాడు గ్రామం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రూపొందించిన లఘుచిత్రం (షార్ట్ ఫిలిం) జాతీయ స్థాయిలో రెండో బహుమతి గెలుచుకుంది. ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ స్వచ్ఛతా దివస్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ ఇంజం శేషయ్య అవార్డు అందకోనున్నారు. ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేస్–2లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ విభాగంలో గ్రామపంచాయతీల్లో మరుగుదొడ్ల వాడకం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తదితర అంశాలపై జాతీయ స్థాయిలో లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తారు. గత ఏడాది జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మి పంచాయితీ ఎంపికైంది. ఈ ఏడాది ఏన్కూరు మండలం నూకలంపాడు పంచాయతీ ఎంపిక కావడం విశేషం. అందరి సహకారంతో.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి వెనుక సర్పంచ్ ఇంజం శేషయ్య ప్రధాన పాత్ర పోషించారు. గ్రామంలోని ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి గ్రామాభివృద్ధి వైపు నడిపించారు. ఇప్పటికే గ్రామంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం జరుగుతుండగా, వ్యక్తిగత పరిశుభ్రత, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను విక్రయిస్తుండడంతో పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. అలాగే, గ్రామంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలుచేస్తున్నారు. ఇలా గ్రామాభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న పనులతో రూపొందించిన లఘుచిత్రం జాతీయ స్థాయిలోనే రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు ఉపసర్పంచ్.. ఇప్పుడు సర్పంచ్ నూకలంపాడు గ్రామపంచాయితీలో 1,260 మంది జనాభా, 950 మంది ఓటర్లు ఉన్నారు. ఏజెన్సీ మండలం అయినందున ఎస్టీ అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవాలి. కానీ ఎస్టీలు లేకపోవడంతో ఎనిమిది వార్డులకు గాను నాలుగు వార్డులకే ఎన్నిక నిర్వహిస్తారు. గత ఎన్నికలో నాలుగు వార్డులకు గాను మూడు వార్డులు గెలిచిన పార్టీ అభ్యర్థిని ఉపసర్పంచ్గా ఎన్నుకోగా, ఆయనే సర్పంచ్గా విధులు నిర్వర్తించారు. ఇక 2019 ఎన్నికల్లో నాలుగు వార్డులకు రెండు పార్టీల అభ్యర్థులు రెండేసి వార్డులు గెలుచుకున్నారు. ఈ మేరకు లాటరీ పద్ధతిలో సర్పంచ్ను ఎన్నుకోగా ఇంజం శేషయ్యకు అవకాశం దక్కింది. గతంలో ఉపసర్పంచ్గా అనుభవం ఉండడంతో ఇంజం శేషయ్య గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయడమే కాక సొంత ఖర్చుతో గ్రామంలో బోర్లు, రహదారులు, కాల్వ రోడ్డుకు గ్రావెల్ తోలకం చేపట్టారు. ఇంకా వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, రోడ్ల వెంట మొక్కలు నాటించడంతో గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. అందరూ ఆదర్శంగా తీసుకోవాలి జాతీయస్థాయిలో ఉత్తమ లఘుచిత్రం అవార్డు సాధించిన నూకలంపాడు గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యారాములు సూచించారు. నూకలంపాడు గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన సర్పంచ్ ఇంజం శేషయ్య – స్వరూప దంపతులను సత్కరించి మాట్లాడారు. కొన్నేళ్లుగా గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. కలెక్టర్ అభినందనలు.. ఇక, జాతీయ స్థాయి షార్ట్ఫిల్మ్ పోటీల్లో రెండో స్థానం దక్కించుకున్న నూకలంపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ అభినందించారు. ఈమేరకు సర్పంచ్ శేషయ్య, పాలకవర్గం, సిబ్బందిని ఆయన శుక్రవారం సన్మానించి మాట్లాడారు. మిగతా గ్రామాల పాలకవర్గాలు స్ఫూర్తిగా తీసుకుని అవార్డులు సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత, డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాపై బాధ్యత పెరిగింది నూకలంపాడు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాను. గతంలో జిల్లాస్థాయి అవార్డులు వచ్చినా, ఇప్పుడు జాతీయస్థాయిలో పేరు రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుతో మాపై ఇంకా బాధ్యత పెరిగినట్లయింది. ఎమ్మెల్యే కేటాయించనున్న నిధులతో డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతాం. –ఇంజం శేషయ్య, సర్పంచ్ -
PVR Raja: షార్ట్ ఫిలిమ్స్లో ఆస్కార్ అవార్డే లక్ష్యం
విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్లో ఆస్కార్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్లో గిటార్ తదితర ఇన్స్ట్రుమెంట్స్పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూ.లలల్లా మ్యూజిక్ బ్యాండ్హంట్లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. – పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం -
ఎంటర్టైన్మెంట్ కావాలా? లంచ్ టైంలో ఇవి చూసేయండిలా!
సినిమాలు చూడాలంటే ఇంట్రస్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గట్లుగా కొంత సమయం కూడా కావాలి. రెండు, మూడు గంటలు ఓపికగా కూర్చోవాలి. అంత టైం దొరకాలంటే అది వీకెండో, హాలీడేనో అయి ఉండాలి. మరి ఆఫీస్లోనో లేదంటే కాలేజీలోనూ ఏదైనా సినిమా చూడాలంటే.. వారికోసం షార్ట్ ఫిలింస్ ఉండనే ఉన్నాయి. యూట్యూబ్లోనే కాదు ఓటీటీలోనూ లఘుచిత్రాలను అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో హాట్స్టార్లో కేవలం లంచ్ టైంలో చూసేయగలిగే షార్ట్ ఫిలింస్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ► మరాఠా మందిర్ సినిమా ► ఔచ్ ► దేవి ► అధీన్ ► ది స్కూల్ బ్యాగ్ ► టెరీర్ ► చట్నీ చదవండి: సిరిని అర్థం చేసుకోవడం కష్టం, తనకు ఎవరూ సాయం చేయలేదు ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! -
World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే.. పక్షులకు సేనాపతి
పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్. ఆమె పరిచయం. ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్ ఒకరు. స్టూడెంట్ నుంచి యాక్టివిస్టుగా పూర్ణిమ దేవి బర్మన్ది గౌహటి. వైల్డ్లైఫ్ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసింది. 2007లో గ్రేటర్ అడ్జటంట్ స్టార్క్స్(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి. పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది. పీహెచ్డి ఏం చేసుకోవాలి? పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది. విప్పారిన రెక్కలు 2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం. హార్గిల్లా ఆర్మీ ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి. -
Karimnagar: సిల్వర్ స్క్రీన్పై కరీంనగర్ వెలుగులు
ఒక్కచాన్స్.. ఒకేఒక్క చాన్స్ అంటూ వీళ్లు క్రిష్ణానగర్ చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు.. సినిమాల్లో అవకాశం కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూడలేదు. చేస్తున్న పనిని, అన్నం పెడుతున్న ఊరును వదిలిపెట్టలేదు. ఉన్నచోటు నుంచే తమ ప్రతిభను ప్రదర్శించారు. అవకాశాన్ని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. యూట్యూబ్లో సొంతంగా ఒక వేదికను ఏర్పాటుచేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. షార్ట్ఫిల్మ్లు, ప్రయివేటు ఆల్బంల ద్వారా తమ టాలెంటును మొదట ప్రజలు గుర్తించేలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇప్పుడు వారిని స్టార్లను చేసింది. అనతికాలంలోనే సినిమాల్లో, పెద్దపెద్ద రియాలిటీషోల్లో అవకాశం వచ్చేలా చేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్పై ఉమ్మడి కరీంనగర్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మై విలేజ్ షో ద్వారా ఫేమ్ అయిన బిగ్బాస్ గంగవ్వ, అనిల్ జీల సినిమాల్లో బిజీగా మారారు. మరికొందరు యాక్టర్లు, సింగర్లు, డైరెక్టర్లు పలు సినిమాల్లో ప్రతిభ చూపి స్టార్.. స్టార్.. సూపర్స్టార్ అనిపించుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా రంగుల ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై వెలుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ కళాకారులపై ‘సాక్షి’ వీకెండ్ స్పెషల్..!!] పేరు: గంగవ్వ యూట్యూబ్ చానల్ మై విలేజ్ షో షార్ట్ఫిల్మ్: 120కి పైగా సినిమాలు: 4 ‘ఇస్మార్ట్’ గంగవ్వ మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్షో గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. బడిముఖం చూడని గంగవ్వ కష్టాల కడలిని ఈదింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని ఆమె మనసు.. ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్గా పరిచయం చేశాయి. ఇదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ ప్రారంభించిన మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ గంగవ్వ జీవితాన్ని మార్చివేసింది. 120కిపైగా వీడియోల్లో, నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. ఓ రియాలిటీ షోతో మరింత ఫేమస్ అ యిన గంగవ్వ.. ఇల్లు కట్టుకోవాలనే తనకలను నెరవేర్చుకుంది. జీవితమంతా.. ముళ్లబాటే గంగవ్వ జీవితమంతా ముళ్లబాటలోనే సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బీడీలు చేస్తూ తమ్ముళ్లకు ఆసరాగా నిలిచింది.ఐదేళ్లలో బాల్య వివాహం జరిగింది. అత్తాగారిల్లే జీవితమైంది.భర్త గంగయ్య పదిహేనేళ్లపాటు గల్ఫ్ వెళ్లాడు. ఐదేళ్లపాటు దుబాయ్ నుంచి కబురు లేకపోవడంతో ఉన్నాడో లేడో కూడా తెలియని వేదనతో గడిపింది. మరో పదేళ్లు గల్ఫ్ వెళ్లినా నయాపైసా పంపలేదు. ఇక్కడి నుంచే అప్పుచేసి, పైసలు పంపిస్తే ఇంటికి తిరిగివచ్చాడు. కలోగంజో తాగి, పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి, రాత్రి బీడీలు చేస్తూ పిల్లలను పెద్ద చేసింది. ఆరుపదుల వయసులో.. గంగవ్వకు మై విలేజ్ షో మరో జన్మనిచ్చింది. అవ్వలోని సహజ నటిని మై విలేజ్ షో దర్శకుడు శ్రీరాం శ్రీకాంత్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నెట్ కష్టాలు అనే షార్ట్ఫిల్మ్తో యూ ట్యూబ్లో అడుగుపెట్టి.. సుమారు 120కిపైగా లఘుచిత్రాల్లో నటించింది. సినీ నటులుసైతం గంగవ్వతో సెల్ఫీకోసం ఎదురుచూసేలా ఎదిగింది. గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, రాజరాజచోర, లవ్స్టోరీలో తనేంటో నిరూపించుకుంది. రెండు టీవీ రియాలిటీషోల్లో అదరగొట్టింది. గంగవ్వ మాట తీరు..ఆప్యాయత..కల్మ షం లేని తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ అవసరం ఉన్నా ఇప్పటికీ ప్యాసింజర్ ఆటోల్లో వెళ్తుండడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. ‘చిన్నప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపిన. పొద్దంతా వ్యవసాయ పనికి వెళ్లివచ్చి, బీడీలు చేసేదాన్ని. సదువు అసలే రాదు. ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి అచ్చి.. సెల్ఫీలు దిగుతున్నరు. ఇంటికాడ ఉంటే శ్రీకాంత్ అచ్చి, నేను చెప్పినట్టు చేత్తవా గంగవ్వ అని, షూటింగ్ మొదలు పెట్టిండు. ఇంట్ల టీవీ కూడా లేదు. సినిమాలో నటిస్తా అని అనుకోలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు విడుదల ఐనయ్. ఇంకా వేరే సినిమాలో నటిస్తున్న.. ఇప్పుడు కూడా ఊటీలో షూటింగ్లో ఉన్న.. నాకు తెలిసింది ఒక్కటే. నా పని నేను సేత్త’ అని గంగవ్వ చెప్పుకొచ్చింది. పేరు: రాదండి సదయ్య యూట్యూబ్ చానల్ సదన్న కామెడీ షార్ట్ఫిల్మ్లు: 200కి పైగా సినిమాలు: 10 ఆర్ఎస్ నందా.. కామెడీకి ఫిదా విద్యానగర్(కరీంనగర్): ఆర్ఎస్ నంద.. యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం కాకముందే ఇతని కామెడీ షార్ట్ఫిల్మ్లను సిడీల రూపంలో అభిమానులు వీక్షించేవారు. రెండు వందలకు పైగా షార్ట్ఫిల్మ్లు తీసిన ఆర్ఎస్ నందకు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నటన అంటే ప్రాణం ఓదెల మండలం కనగర్తికి చెందిన రాదండి సదయ్యకు చిన్నతనం నుంచే నటన అంటే ప్రాణం. పదేళ్ల వయసులోనే బుర్రకథలు చెప్పేందుకు ఆసక్తి చూపేవాడు. 2007నుంచే లఘుచిత్రాలు తీయడం ప్రారంభిచాడు. యూట్యూబ్ హవా ప్రారంభం కావడంతో 2013లో కోడెం సంతోశ్తో కలిసి ‘సదన్న కామెడీ’ చానెల్ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో యూట్యూబ్లో తొలి అడుగువేశాడు. ఇప్పటివరకు దాదా పు 200కు పైగా విలేజ్ కామెడీ షార్ట్ఫిలిమ్స్ చేశాడు. కామెడీ స్టార్గా దేశవిదేశాల్లో గుర్తింపు సాధించాడు. సినిమా అవకాశాలు కూడా రావడంతో బతుకమ్మ, నానీ బుజ్జి బంగారం, తుపాకీ రాముడు, సంత, చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలో, నేనేసరోజన, గున్నమామిడి కొమ్మ మీద తదితర 10కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లోనూ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. పేరు: అనిల్ జీల యూట్యూబ్ చానల్: మై విలేజ్ షో షార్ట్ఫిల్మ్లు: 200 కి పైగా సినిమాలు: 5 క్రేజీహీరో.. అనిల్ మల్యాల(చొప్పదండి): ఎన్ఎస్ఎస్ వలంటీర్గా సేవచేసేందుకు లంబాడిపల్లి వెళ్లి.. యూట్యూబర్గా తనలోని ప్రతిభకు పదును పెట్టుకుని.. ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి, యువతకు క్రేజీ హీరోగా మారాడు అనిల్ జీల. ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు బోధిసూ్తనే తన ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ.. సహచరుడు, మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీరాం శ్రీకాంత్తో జట్టుకట్టాడు. మై విలేజ్ షోలో నటిస్తూ.. తనలో దాగిఉన్న ప్రతిభను చాటుకున్నాడు. స్వయంగా వ్లాగ్ నిర్వహిస్తూ ఏకంగా 7లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూనే.. యూత్ ఐకాన్గా నిలిచాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన నిర్మల–మల్లేశం కొడుకు అనిల్ జీల. టీటీసీ చేసేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా లంబాడిపల్లికి వచ్చాడు. అప్పుడే శ్రీరాం శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. జమ్మికుంటలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఐదేళ్లక్రితం వేసవిసెలవుల్లో లంబాడిపల్లికి వచ్చిన అనిల్ జీల శ్రీకాంత్ దర్శకత్వంతో పాటు ఇతర లఘుచిత్రాలు సుమారు 200లకుపైగా నటించారు. కికీ చాలెంజ్ తన జీవితాన్ని మలుపు తిప్పగా, రైతు పడుతున్న కష్టాల వీడియోతో అనిల్కు ఫాలోయింగ్ పెరిగింది. ఏడు లక్షల ఫాలోవర్స్.. మై విలేజ్ షో వీడియోలతోపాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలను అప్లోడ్ చేసేందుకు అనిల్ జీల వ్లాగ్ ప్రారంభించాడు. షూటింగ్లో.. ఇంట్లో.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ విశేషాలు తెలిసేలా వ్లాగ్లో పెడుతుండడంతో ప్రస్తుతం అనిల్కు 7లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. యూట్యూబ్ వీడియోల్లో నటిసూ్తనే సినిమాల్లో చాన్స్ కొట్టేశాడు అనిల్. ఇతడి సహజమైన నటనతో నేటియువతకు హీరోగా మారాడు. అనిల్ నటనకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్తోపాటు, ఎస్ఆర్ కల్యాణ మంటపం సినిమాలు ఇప్పటికే రిలీజ్ కాగా, దర్శకుడు నవీన్ బేతిగంటి తీస్తున్న ‘రామన్న యూత్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మై విలేజ్ షో తీస్తున్న ఓ వెబ్సిరీస్లోసైతం నటిస్తున్నాడు. పాటల మాంత్రికుడు మల్లిక్ గొల్లపల్లి(ధర్మపురి): పల్లెపదాలు ఆయన పాటలకు ప్రాణాలు. తాను రాసే పాటలోని ప్రతీ అక్షరం గ్రామీణ జీవన సుమధురం. మట్టిమనుషుల మధ్య బాధలు, బంధుత్వాలను జానపదాలుగా మలిచి చిత్రీకరిస్తూ.. జానపద ఆణిముత్యంగా రాణిస్తున్నాడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన ఎస్వీ మల్లిక్తేజ. ఎస్వీ మ్యూజిక్ చానల్ ద్వారా 150కి ప్రయివేటు పాటలు రాసి, పాడిన, వీక్షకులకు అందించగా.. ఆరులక్షల మంది పాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు మల్లిక్తేజ. ఇటీవల వచ్చిన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. చిన్నతనం నుంచే.. మల్లిక్తేజ డిగ్రీవరకు చదివాడు. చిన్నతనం నుంచి అమ్మమ్మవాళ్ల ఊర్లో పెరిగాడు. తాత మ్యాకల వెంకయ్యతో గొర్రెలు మేపేందుకు వెళ్లి జానపదాలు నేర్చుకున్నాడు. ఆ పాటలనే స్కూళ్లో పాడేవాడు. ఇంటర్లోనే పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. అప్పుడే జగిత్యాలకు వచ్చిన సుద్దాల అశోక్తేజ మల్లిక్పాటకు ముగ్దుడయ్యాడు. మల్లిక్ను హైదరాబాద్ పిలిపించుకుని మెలకువలు నేర్పించాడు. తరువాత యూట్యూబ్లో ఎస్వీ మ్యూజిక్ చానల్ను ప్రారంభించాడు. 2018 జనవరిలో తీసిన ‘నేనొస్తాబావ’ పాటకు 3కోట్లవ్యూస్ను సాధించాడు. ‘మదనాసుందారి’ పాట అత్యంత ప్రేక్షక ఆదరణ సాధించింది. ఎస్వీ మ్యూజిక్ చానల్ద్వారా 150కి పైగా ప్రయివేటు పాటలు చిత్రీకరించాడు. ఆరులక్షల పాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో అవకాశం రావడంతో 2019 ఏప్రిల్లో విడుదలైన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కన్నడంలో భన్నదకనుసు, రంగిన దునియాకు మ్యూజిక్ డైరెక్టరుగా పరేషాన్ సినిమాలో పాట పాడాడు. పాటే రమేశ్ ప్రాణం గొల్లపల్లి(ధర్మపురి): యక్షగానం నుంచి పుట్టిన జానపద కళాకారుడు గడ్డం రమేశ్. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెందిన రమేశ్ తండ్రి అనంతం యక్షగానం చేస్తుండేవాడు. తండ్రిని అనుకరిస్తూ రమేశ్ తాను చదువుతున్న పాఠశాల వేదికపై యక్షగానం ప్రదర్శిస్తుండేవాడు. తరువాత జానపద పాటలు పాడిన రమేశ్ స్థానికంగా పేరు సంపాదించాడు. 2002లో రమేశ్ ప్రతిభను గుర్తించిన ధర్మపురి సీఐ హోంగార్డుగా ఉద్యోగం కల్పించాడు. పోలీసు కళాబృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రజలను చైతనం చేస్తున్నాడు. 2011లో రేలారెరేలా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో యూట్యూబ్లో గడ్డం మ్యూజిక్ చానల్ ప్రారంభించాడు. ‘నీలమ్మ నిమ్మసుక్క రాయిడు సోలో’ పాట మంచి గుర్తింపు పొందింది. ‘అత్తకొడుకా.. ముద్దల మారెల్లయ్య’ పాట 37లక్షల వ్యూస్ దాటింది. రమేశ్ ప్రతిభను జగిత్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్ రాజ్నరేంద్ర, నిర్మాత గుగ్గిల్ల శివ ప్రసాద్ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇలా సింగర్గా సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అంచెలంచెలుగా.. ఇల్లందకుంట(హుజురాబాద్): ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఆ కుర్రాడికి సిని మాలంటే పిచ్చి. చూసిన ప్రతీ సినిమాను ‘అక్కడ ఆ సీన్ ఉండాల్సింది కాదు.. అక్కడ ఆ ఫైట్ ఇలా తీయాల్సి ఉండే’ అంటూ స్నేహితులతో పంచుకునేవాడు. అలా సినిమాలపై అతడికి ఉన్న ఆసక్తి డైరెక్టర్గా కావాలని సంకల్పిచింది. మొదట్లో అవకాశం రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా లఘుచిత్రాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు జమ్మికుంటకు చెందిన సూర్యతేజ. తన ప్రతిభను గుర్తించిన చాలా మంది నిర్మాతలు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. గుంటూరుకు చెందిన రాములు– శ్రీదేవి కుటుంబం 20ఏళ్ల క్రితమే కరీంనగర్కు వచ్చింది. రాములు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వంటమనిషిగా చేసేవాడు. వీరికొడుకు సూర్యతేజకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. స్నేహితులు తమాషాగా సినిమా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అవకాశం కోసం తిరిగితే ఎవరూ ఆదరించలేదు. సినిమారంగంపై ఉన్న మక్కువతో సొంతంగా కెమెరా కొనుక్కుని లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. పోలీసు డిపార్టుమెంటు చేస్తున్న సేవలపై 500కు పైగా లఘుచిత్రాలు తీశాడు. 2013లో తీసిన దేశం కోసం లఘుచిత్రం పేరుతెచ్చి పెట్టింది. తరువాత దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేశాడు. ఆనంద్సాయి, ఈశ్వర్, పైడిరమేతో పాటు పెద్దదర్శకుల వద్ద సలహాలు తీసుకుని సొంతంగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో షైన్పిక్చర్స్ బ్యానర్పై తీసిన ‘తలచినదే జరిగిందా’ సినిమా సూర్యకు గుర్తింపునిచ్చింది. వెండితెరపై మరెందరో.. విద్యానగర్(కరీంనగర్): కళలు, కళాకారులకు వేదికైన కరీంనగర్ నుంచి చాలామంది వెండితెరపై సైతం వెలుగుతున్నారు. కరీంనగర్లోని మార్కెండేయకాలనీకి చెందిన జి.రాధిక ఇంటర్నుంచే నటనలో పేరు సాధించింది. భర్త ప్రోత్సాహంతో లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. తక్కువ సమయంలో పేరు సంపాదించి, సహజనటిగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకు 700కు పైగా షార్ట్ఫిల్మ్లతో పాటు దొరసాని, విరాటపర్వం, భిక్ష, గల్లీగ్యాంగ్, స్కైలాబ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార బ్యానర్పై నిర్మిస్తున్న సినిమాలో కీరోల్ చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్న 250 లఘుచిత్రాల్లో నటించింది. గల్లీగ్యాంగ్, పరేషాన్, నువ్వునేను ఒక్కటైతే, బతుకంతాబ్రహ్మచారి, బిచ్చగాడా మజాకా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బైరాన్పల్లి సినిమాలో నటిస్తోంది. వేములవాడకు చెందిన గోలి శివరామ్రెడ్డి నాటకాల్లో నటిస్తారు. 15 షార్ట్ఫిల్మ్లు చేశారు. పరేషాన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నటించిన తుపాకులగూడెం సినిమా విడుదలకు సిద్ధమైంది. -
తెరపైకి వర్చువల్ ఆడియో సినిమాలు
సాక్షి, హైదరాబాద్: అందరికీ వినోదం పంచే ‘సినిమా’ కాలానుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. నాటి బ్లాక్ అండ్ వైట్, మూకీ సినిమాలు మొదలు ప్రస్తుత త్రీడీ, యానిమేటెడ్ మూవీస్ వరకు కొత్తదనాన్ని, నూతన సాంకేతికతను తనలో కలుపుకుంటూనే ఉంది. సినిమాని కేరీర్గా ఎంచుకునే యువతరం పెరగడంతో షార్ట్ఫిల్మ్ హవా కూడా పెరిగింది. పొట్టి ఫ్లాట్ఫార్మ్పై తమదైన ముద్ర వేయాలనే తపనతో యువత కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో వినూత్న వర్చువల్ ఆడియో ఫిల్మ్ తెరపైకి వచ్చింది. ప్రయోగాలకు వెనుకంజ వేయని నగర యువతను తన వైపు ఆకర్షిస్తోంది.. ఈ తరహా ఫిల్మ్లపై దృష్టి పెట్టేందుకు లాక్డౌన్ టైమ్ వారికి ఉపయోగపడింది. వర్చువల్ ఆడియో ఫిల్మ్ అంటే.. వినడానికి కొత్తగా ఉన్న వర్చువల్ ఆడియో ఫిల్మ్ నిజానికి వినడం మాత్రమే చేయగలం. ఈ చిత్రం.. చూసేందుకు మాత్రం వినూత్నంగా ఉంటుంది. అందరికీ తెలిసిన షార్ట్ ఫిల్మŠస్ అంటే ఆర్టిస్ట్లు, క్యాస్టూమ్స్, లొకేషన్స్, పాటలు, ఫైట్లు..! ఇవి లేకుండా ఏ సినిమానీ ఊహించుకోలేరు. కానీ వర్చువల్ ఆడియో ఫిల్మ్లో ఇవేవి కనపడవు. కానీ వినపడతాయి. ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రత్యేకతే అది. ఒక సన్నివేశాన్ని, సందర్భాన్ని తెరపైన కనపడకుండా కేవలం మాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్తోనే కళ్లకు కట్టినట్టు కథ చూపించడం, వినిపించడం దీనిలో విశేషం. ఫిల్మ్ ఫెస్టివల్కి ‘డార్క్’ మూవీ.. ‘ఎ డేట్ ఇన్ ద డార్క్’ పేరుతో నగరవాసి సింగార మోహన్ ఒక వర్చువల్ ఆడియో ఫిల్మ్ని రూపొందించారు. ఆద్యంతం చీకటిలోనే నడిచే సున్నితమైన ప్రేమకథ ఇది. సినిమా దర్శకుడిగా మారాలనే ఆశయంతో వచ్చిన మోహన్ మొదటి ప్రయత్నంగా ఈ షార్ట్ మూవీని రూపొందించాడు. దర్శకుడిగా నిరూపించుకోవాలంటే విభిన్నమైన సినిమాని చేయాలన్న ఆలోచనతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమాకి సోషల్ మీడియాలో మంచి ఆదరణ అభించింది. ఇప్పటి వరకు 6 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఎంపిక కాగా అందులో రెండింటిలో ఫైనల్ లిస్ట్లో కొనసాగుతుంది. తక్కువ ఖర్చుతో ప్రయోగం.. కనపడకుండా కేవలం వినపడటం ద్వారా ఓ చిత్రాన్ని పొయెటిక్గా రూపొందించడం. అంత సులభం కానప్పటికీ హత్తుకునే కథా, కథనం సన్నివేశాన్ని మాటలతోనే ఆసక్తి రేకించే పనితనం అన్నింటికీ మించి మానసిక స్పందనలను ప్రభావితం చేయగల నేర్పరితనంఉంటే ఈ చిత్రం ‘చెవుల్ని’ కట్టి పడేస్తుంది. ఈ మూవీలో నటీనటుల మాటలు, వారి చుట్టూ ఉన్న పరిసరాల్లోని సౌండ్స్ మాత్రమే ఉంటాయి. వీటి ద్వారానే జరుగుతున్న సన్నివేశాన్ని కనపడకుండా చూపించగలగాలి. ఒక సీన్ నుంచి ప్రేక్షకుడి ధ్యాస మరల్చకుండా తీయగలగాలి. అతితక్కువ ఖర్చుతో ఈ సినిమా తీసే అవకాశం ఉంది. మేకప్,కాస్టూమ్స్, ట్రావెలింగ్ తదితర ఖర్చులేమి ఉండవు. ఈ విధమైన సినిమాలు ఇంతకు ముందు తీసిన సందర్భాలు చాలా అరుదు. సినిమాలో కొత్తదనం కోరుకునే కొందరు దర్శకులు మాత్రం వీటికి సై అంటున్నారు. రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు.. ఈ షార్ట్ఫిల్మ్ గురుంచి మోహన్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ లవ్ స్టోరీస్ తీయాలని ఇష్టం. అందుకే స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ సినిమా తీశాను. కంటికి కనపడకుండా ఒక అనుభూతిని ప్రేక్షకుడికి అందించాలంటే స్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. దాన్ని అనుకున్నట్టుగా తీయడం చాలా కష్టం. మన దగ్గర అతి తక్కువ మంది ఈ విధమైన సినిమాలు తీశారు. వర్చువల్ ఆడియో ద్వారా దేశంలోనే మొదటి సారిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన ‘డైలాగ్ ఇన్ ద డార్క్’ నా సినిమాకు ప్రేరణ. 11 నిమిషాల సినిమా నిర్మించడానికి దాదాపు 40 రోజులు శ్రమించామన్నారు. పాటకు డిజిటిల్ ప్లాట్ఫామ్ సాక్షి, హైదరాబాద్: మనమంతా.. మనసంతా.. ఆన్లైన్పైనే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పండుగైనా, పబ్బమైనా, ఆటలైనా, పోటీలైనా.. ఆన్లైన్ను ఆశ్రయించాల్సిందే. కరోనా తనతో పాటు డిజిటల్ వాడకాన్ని కూడా బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో పాటల పోటీలను కూడా డిజిటల్ పంథాలో తొలిసారిగా తెలుగు డిజిటల్ ఐడల్ పోటీలను నిర్వహిస్తోంది సిటీకి చెందిన టెంపుల్ బెల్ ఈవెంట్స్. ఈ పోటీ నిర్వాహకులు కౌశిక్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. దివంగత గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం టీవీ తెర వేదికగా ఎందరో గాయనీ గాయకులను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం మనకు తెలియంది కాదు. ఆయన స్ఫూర్తితో ఎన్నో పాటల పోటీలకు బీజం పడింది. ఓ ఏడెనిమిది నెలల క్రితం వరకూ మనకు టీవీ షోల రూపంలోగానీ, బయట గానీ అనునిత్యం ఎక్కడో ఒకచోట పాటల పోటీలు జరుగుతూనే ఉండేవి. అయితే కరోనా కారణంగా అన్నింటితో పాటు అవీ అరకొరగానే మారిపోయాయి. ఆన్లైన్ కార్యకలపాలు తప్పనిసరిగా మారిన ప్రస్తుత పరిస్థితి వల్ల డిజిటల్ వేదికను ఉపయోగించుకుని పాటల పోటీ నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నచ్చిన తానా అధ్యక్షులు జె.తళ్లూరి కూడా నిర్వహణలో చేయి కలిపారు. సాంగు భళా.. పోటీ ఇలా.. ఈ పోటీల పోస్టర్ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా పోటీదారుల రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్ ఫైనల్స్కి, ఐదుగురు సెమీఫైనల్స్కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్గానే జరుగుతుంది. సాంగు భళా.. పోటీ ఇలా.. ఈ పోటీల పోస్టర్ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా పోటీదారుల రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్ ఫైనల్స్కి, ఐదుగురు సెమీఫైనల్స్కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్గానే జరుగుతుంది. -
వృత్తి కాంపౌండర్.. ప్రవృత్తి యాక్టర్
కలలు కనండి.. నిజం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం.. నేటి యువత అదే చేస్తున్నారు.. సినిమాల్లోకి వెళ్లాలనుకున్న వారికి కలను నిజం చేసుకునేందుకు ‘షార్ట్’కట్ ఎంచుకున్నారు. షార్ట్ఫిల్మ్ మేకింగ్ ద్వారా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.. అయితే చిన్న సినిమా అని అదేదో ఆషామాషీ విషయం అనుకోకండి.. కేవలం 15 నిమిషాల నిడివిలో రెండున్నరగంటల సినిమా చూపించాలి.. లైక్లు కొట్టించాలి.. ఈ విషయంలో పాలుకొల్లు డైరెక్టర్లు ప్రేక్షకుల నాడిపట్టారనే చెప్పవచ్చు.. దాసరి, కోడి రామకృష్ణ వారసత్వం కదా! ఆ మాత్రం విషయం ఉంటాది మరి. పాలకొల్లు అర్బన్: పాలకొల్లు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు ఐదు నుంచి 15 నిమిషాల నిడివితో లఘు చిత్రాన్ని నిర్మించి వారి ప్రతిభను చాటుకుంటున్నారు. సినిమాల్లో అవకాశం దక్కించుకుంటున్నారు. పట్టణానికి చెందిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అలాగే చాన్స్ కొట్టారు. హీరో రాజశేఖర్తో ఆయన కల్కి సినిమా తీసి తన టాలెంట్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం పాలకొల్లు కేంద్రంగా 20 మంది ఔత్సాహిక దర్శకులు ఉన్నారు. వీరిలో సుమారు 10 మంది కంటిన్యూగా ఒకటి తర్వాత ఒకటి షూటింగ్లతో బిజీగా ఉంటున్నారు. పాలకొల్లు కేంద్రంగా మూడు సంవత్సరాలుగా లఘు చిత్రాల నిర్మాణం ఎక్కువగా సాగుతోంది. గోదావరి నదీ ప్రాంతాలతో పాటు, పేరుపాలెం బీచ్, రిసార్ట్సు, సుందరమైన ఆలయ గోపురాలు, పచ్చని వరి పొలాలు, జలజలా పారే పిల్ల కాలువలే వీరి లొకేషన్లు. అలాగే పాలకొల్లులో కొంతకాలంగా క్షీరపురి అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పేరుతో పోటీలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు ఔత్సాహికులు. అలాగే కాకినాడ, విశాఖపట్టణం, హైదరాబాద్, విజయవాడ, భీమవరం, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తుండటంతో యువత పట్టుదలతో హిట్ కొట్టాలని కృషి చేస్తున్నారు. లఘు చిత్రంలో ఓ సన్నివేషంలో ఆర్ఎంపీ వైద్యుడు చిర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు, లఘుచిత్రం చిత్రీకరణలో నటుడు అంబటి పెదవెంకట్రాజు వృత్తి కాంపౌండర్.. ప్రవృత్తి యాక్టర్ తనకు పాలకొల్లు గద్దర్గా పేరుందని నటుడు అంబటి పెద వెంకట్రాజు తెలిపాడు. స్వతహాగా తాను గాయకుడ్నినని, ఆర్కెస్ట్రాతో పాటు ఆధ్యాత్మిక గీతాలు పాడుతుంటానని చెప్పాడు. వృత్తిరీత్యా పాలకొల్లులోని డా.నెక్కంటి నరేంద్ర గారి ఎముకల ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నానని, ఇప్పటివరకు 29 లఘుచిత్రాల్లో నటించానని చెప్పాడు. పలు చిత్రాలకు అవార్డులు అందుకున్నట్టు తెలిపాడు. ఎందుకే ప్రేమ.. ఈ చిత్రంలోని యువకుడి పేరు కానుకొలను శ్రీరామ్ (పవన్). పాలకొల్లులో 15 ఏళ్లుగా పండ్లవ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్లుగా లఘుచిత్రాలపై మోజు పెంచుకున్నాడు. తనే స్వయంగా స్టోరీ రాసుకుని, డైరెక్ట్ చేస్తూ నటిస్తూ విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఎందుకే ప్రేమ (ప్రేమకథా చిత్రం), మాయ(హర్రర్ మూవీ), లిక్కర్, నా లైఫ్ కి నేనే హీరో లఘు చిత్రాలను చిత్రీకరించాడు. సినిమాలంటే పిచ్చి డిగ్రీ పూర్తి చేశా. నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే చదువు పూర్తికాగానే చెన్నై, కేరళలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. ప్రస్తుతం లఘు చిత్రాలు నిర్మిస్తున్నా. 11 లఘు చిత్రాలు నిర్మించా. స్త్రీ, ట్రూ లవ్ స్టోరీ, 50 లక్షలు లఘు చిత్రాలకు క్షీరపురి అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డులు లభించాయి. సినిమా రంగంలో స్థిర పడడమే తన లక్ష్యం. –నవీన్ ఏబీ, పాలకొల్లు లఘుచిత్రంలో డబ్బింగ్ చెబుతున్న ఆర్టిస్ట్కి సూచనలు చెబుతున్న దర్శకుడు, నిర్మాత నవీన్ ఏబీ 50 లఘు చిత్రాల్లో నటించా.. నేను ఆర్ఎంపీ వైద్యుడ్ని. ఒక వైపు వృత్తి చేసుకుంటూ లఘుచిత్రాల్లో గత ఐదారు సంవత్సరాల నుంచి నటిస్తున్నా. జై భారత్లో పిచ్చివాడి వేశానికి అవార్డు వచ్చింది. లఘుచిత్రాల్లో నటించడం ద్వారా, టీవీ సీరియల్, సినిమా అవకాశాలు వచ్చాయి. మౌన రాగాలు సీరియల్ చేశా. హీరో గోపీచంద్ సరసన ఎమ్మెల్యే పాత్ర చేసే అవకాశం వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల యాక్ట్ చేయలేకపోయాను. –చిర్ల శ్రీనివాసరెడ్డి, పాలకొల్లు టాలెంట్ని గుర్తిస్తున్నారు ద మేట్ లఘు చిత్రంలో నటించా. దీన్ని యూ ట్యూబ్లో ఆరు లక్షల మంది చూశారు. హలో మాస్టారు, ఆడది... ఆడదాని బ్రతుకు లఘు చిత్రాలు పేరు వచ్చాయి. కడప సేన, దేశానికి రైతే ప్రాణం లఘు చిత్రాలు నటించాను. ఈ రెండు త్వరలో యూ ట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నారు.–ఉమాదేవి, ఆర్టిస్ట్ 22 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు టిక్టాక్లు చేయడం సరదా. ఫేస్బుక్లో పాలకొల్లు పద్దుగా పేరు. 22 వేల మంది టిక్టాక్ ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ సీరియల్స్, లఘు చిత్రాల్లో నటిస్తున్నా. ఇటీవల దేశానికి రైతే ప్రాణం లఘు చిత్రంలో టీచర్ పాత్ర చేశా. ఔత్సాహిక నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. –వడ్లమూడి పద్మ, పాలకొల్లు సినిమా నటి కావాలని.. నేను ప్రస్తుతం పాలకొల్లులో ఓ ప్రయివేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నాకు సినిమా నటి కావాలని కోరిక. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు నేర్చుకుంటున్నా. నా తండ్రి లక్ష్మీపతి హైస్కూల్లో టీచర్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుగా లఘు చిత్రాల్లోనూ, కవర్ సాంగ్స్లో నటిస్తున్నాను. –ముంజులూరి సాయి ప్రకర్ష, పాలకొల్లు డబ్బింగ్ థియేటర్ పెట్టా... పాలకొల్లు కళలకు పెట్టింది పేరు. నేను చదువు పూర్తయిన తర్వాత ముంబయ్లో స్టుడియోలో యానిమేషన్ వర్కు సొంతంగా చేసుకునేవాడ్ని. ఇటీవల పాలకొల్లు వచ్చాను. సొంతంగా డబ్బింగ్ థియేటర్ పెట్టాను. నెలకి మూడు నుంచి నాలుగు షార్ట్ ఫిలింలకు డబ్బింగ్ చేస్తున్నా. –బంగారు మణికంఠ, పాలకొల్లు -
యూ'స్టార్స్'.. గంగవ్వకు జై..
యూట్యూబ్ ఛానల్స్లో సిటీ యువత హల్చల్ చేస్తోంది. లక్షలు,మిలియన్ మంది వీక్షకుల మదిని దోచేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు.. కంటెంట్ కన్నా మిన్నగా డైలాగ్ డెలివరీ,రక్తికట్టించే నటీనటుల హావభావాలు వీక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ప్రాచుర్యం కోసం ఒకప్పుడు సినిమా, టీవీ అవకాశాల వైపు మాత్రమే చూసిన యువత ఇప్పుడు సోషల్ వేదికలనే టార్గెట్ చేస్తోంది.సిటీయువత నిర్వహిస్తున్న కొన్న యూ ట్యూబ్ చానెల్స్ విశేషాలివి... గ్రామీణ నేపథ్యమే..సక్సెస్కు సారథ్యం... పండుగల విశిష్టతను చాటుతూ అచ్చమైన తెలంగాణ యాసలో గ్రామీణ నేపథ్యంతో క్రియేటివ్ థింక్స్ ఆకట్టుకుంటోంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ‘మాకాడ మహాశివరాత్రి’ లఘుచిత్రం వీక్షకుల్ని మెప్పించింది. గంగమ్మ (నది) చెంతకు వెళ్ళి మట్టితో శివలింగం చేసి అభిషేకం చేయడం, గ్రామంలోనే పూజ చేసేందుకు అవసరమయ్యే వస్తువుల సేకరించడం, ఆ తరువాత జాగరణ వంటి పండుగ విశేషాలతో తెరకెక్కించిన ఈ లఘు చిత్రం నాలుగు రోజుల్లోనే 1.2 మిలియన్ వ్యూస్ అందుకుంది. ⇒ వాలంటైన్స్ డే పురస్కరించుకుని ‘లవ్ దే’ పేరిట అప్లోడ్ చేసిన వీడియో వారం వ్యవధిలోనే 1.4 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. లవర్స్ కాని జంటకు ప్రేమ్దళ్ పేరిట కొందరు యువకులు పెళ్ళి చేయడం, ఆ పెళ్ళి విషయం ఇంట్లో తెలవగా వారు ఏవిధంగాఆ పెళ్ళి తంతు నుంచి బయటపడ్డారో అనేది వీక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ⇒ మాఘమాసం మంట, అష్టాచమ్మా, బరుతుడే, విలేజ్లో గండాలు, విలేజ్లో శ్రీమంతుడు, సెల్ కల్లు తాగితే, అప్పాలు చేయబోతే, థర్టీఫస్ట్ దావత్, మాకాడ బతుకమ్మ వంటి లఘు చిత్రాలు హిట్స్ కొట్టాయి. వీరు తెరకెక్కించే ప్రతి వీడియోలోనూ గ్రామీణ వాతావరణం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇప్పటివరకు 58 వీడియోల ద్వారా వీక్షకులకు వినోదాన్ని పంచింది. ప్రస్తుతం 1.15 మిలియన్ సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతోంది. గంగవ్వకు జై.. హాస్యపు జడివానలో వీక్షకులను తడిసిముద్దయ్యేలా చేస్తోంది మై విలేజ్ షో అంతేకాదు కొత్త సినిమాలకు ప్రమోషన్కు అడ్డాగా కూడా ఇది అవతరించింది. ఇందులో గంగవ్వ నటన ఎనలేని ఆదరణ పొందింది. నకిలీ పోలీసులు ఏవిధంగా దండుకుంటున్నారు, ఆర్టీఏ కార్యాలయం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తప్పుడు చలాన్లను ఇళ్ళకు పంపించి ఏవిధంగా తమ అకౌంట్లో డబ్బును జమ చేయించుకుంటున్నారు?ఇలాంటివి హాస్య నేపథ్యంగా చూపించిన తీరు హాట్సాఫ్ అనిపించుకుంది. ‘విలేజీలో డ్రంక్ అండ్ డ్రైవ్’ పేరిట అప్లోడ్ చేసిన ఈ వీడియో 4.2 మిలియన్ల వ్యూస్ను క్రాస్ చేసేసింది. ఇదే కోవలో ‘చేపల దొంగలు’ వీడియోకు 5.3 మిలియన్ వ్యూస్ వచ్చి చేరాయి. 31 దావత్ ప్లాన్ చేస్తే, విలేజ్ సమ్మర్ ప్రాబ్లమ్స్, దొంగల భయం, పిసినారి రాజు, విలేజ్లో దీపావళి, అమెరికా సోకు, ఇస్మార్ట్ గంగవ్వ, కరోనా కలకలం, విజయ్ పెండ్లి గోసలు, విలేజ్ పబ్ వంటి కామెడీ వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ను మూటగట్టుకున్నాయి. అలాగే బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియో సైతం హల్చల్ చేసింది. 2019లో యూట్యూబ్ తెర పైకి వచ్చిన మై విలేజ్ షో ఛానల్లో ఇప్పటివరకు 193 వీడియోలు వినోదాన్ని పంచాయి. 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతుంది. దంచికొడుతున్న దేత్తడి.. ‘దేత్తడి’ ఛానల్ మోస్ట్ పాపులర్ అయ్యింది. ఇందులో హారిక అలేఖ్య నటన కుర్రకారుకు క్రేజీగా మారింది. 2018 ఏప్రిల్లో యూట్యూబ్లోకి ప్రవేశించిన ఈ ఛానల్ ఇప్పటికే 1 మిలియన్ పైచిలుకు సబ్స్క్రైబర్స్ను సొంతం చేసుకుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు కామెడీని జోడించి తెరకెక్కించే తీరు వీక్షకులకు దగ్గర చేసింది. మెడికల్ షాప్కు వచ్చే వారి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు మెడికల్ దుకాణం పేరిట తీసిన షార్ట్ వీడియో రెండు నెలల్లోనే 1 మిలియన్ వ్యూవర్స్ను మూటగట్టుకుంది. దేత్తడి ఛానల్స్ ద్వారా ఇప్పటివరకు అప్లోడ్ చేసిన 94 వీడియోలు యూట్యూబ్ లవర్స్ మదిని దోచేశాయనే చెప్పాలి. సినీనటుడు సుశాంత్ సైతం హారికతో జతకట్టి ‘పెళ్ళి గోల’ షార్ట్ఫిల్మ్లో వినోదాల జల్లులు కురిపించారు. -
సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్
సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్లో సైతం నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో.. గణేష్ ప్రారంభంలో రియల్ లవ్ నెవర్ డై, ల్యాజిక్ ఆఫ్ లైవ్ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్డే బాయ్ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్ లవ్ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్మెంట్ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్లలో నటించాడు. సినీ హీరో కావాలన్నదే నా కోరిక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. – గణేష్, నటుడు -
షార్ట్.. ఓకే
బిజీబిజీ లైఫ్లో.. రెండున్నర గంటల సినిమా అంటే కష్టం..అంతసేపు థియేటర్లో కూర్చొనే ఓపిక ఎవరికీ ఉండటం లేదు.. ఏదైనా, షార్ట్కట్లో సింపుల్గా చెబితేనే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.. అందుకే ప్రస్తుతం షార్ట్ ఫిల్ముల హవా కొనసాగుతోంది.. చిన్న చిత్రాలైనా.. పెద్ద సందేశాలతో ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి.. మన జిల్లాలో గోదావరి పరిసరాల్లోని యువత ఇటువంటి షార్ట్ ఫిలింలు తీసి హిట్టు టాక్ సొంతం చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా..–కొవ్వూరు రూరల్ సినిమాలను తలదన్నే ఇతివృత్తాలతో జిల్లాలోని యువత షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నారు. సమాజానికి మంచి సందేశాలను అందిస్తున్నారు. చిత్ర నిర్మాణంపై ఉన్న ఆసక్తితో పలువురు యువకులు ఒక బృందంగా ఏర్పడి నిర్మించిన షార్ట్ ఫిలింలు ఆలోచింపజేస్తున్నాయి. తమ పాకెట్ మనీతో చిన్ని చిత్రాలను రూపొందించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. వీరికి అవసరమైన సహాయం అందిస్తే పెద్ద చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని లఘు చిత్రాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నేడు కొందరు యువత చెడు మార్గంలో పయనిస్తుంటే.. తమకొచ్చిన చిన్న పాటి ఆలోచనలను చిత్రాలు రూపొందిస్తూ తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. పబ్జి ప్రభావం షార్ట్ ఫిలింలో ఓ సన్నివేశం చుట్టుపక్కల సంఘటనలేఇతివృత్తాలు సమాజంలో తమ చుట్టూ జరిగే యదార్థ సంఘటనలనే ఇతి వృత్తాలుగా యువత కథాంశాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, బంధాలు, బం«ధుత్వాలు, స్నేహం వాటికి ఉన్న విలువలను ప్రస్పుటంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం యువత తెరకెక్కిస్తున్న చిత్రాల్లో మనం సమాజానికి ఏమి చేయగలం అనే ఆంశాలను చూపిస్తున్నారు. మానవ విలువలను చాటిచెబుతున్నారు. దీంతో అవి యూట్యూబ్లో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమే యువతలోనే ఉన్న ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు ప్రొత్సాహం తోడైతే వారు సినీ దర్శకులుగా, నటి నటులుగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారి ద్వారా మంచి సందేశాత్మక చిత్రాలు సమాజానికి అందుతాయి. సెల్ఫోన్లు,చిన్న కెమెరాలతోనే షూటింగ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ సెల్ఫోన్లలోనే యువత షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నారు. నటనపై ఆసక్తి ఉన్న వారు, దర్శకత్వం చేయగలిగిన యువకులు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఈ లఘు చిత్రాలు రూపొందిస్తున్నారు. ఒకరు స్నేహమేరా జీవితం అంటే, మరొకరు కుటుంబ వ్యవస్థను మించింది లేదని, ఇంకొకరు కులాల కుంపట్ల వల్ల సమాజం దెబ్బతింటుందని, రాజకీయ వ్యవస్థ మారాలంటూ పలు సందేశాలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. అయితే కొందరు ఔత్సాహికులు ప్రతిఫలం ఆశించకుండా పెట్టుబడికి ముందుకు రావడంతో ఖర్చు వెనుకాడకుండా మంచి కెమెరాలు, డ్రోన్లతో షూటింగ్ జరపడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిర్మాతలు కావలెను షార్ట్ ఫిలిం నిర్మించాలన్నా తమకు చాలా ఖర్చు అవుతోందని కొందరు యువత వాపోతున్నారు. ఆసక్తి కొలదీ నటీనటులు, దర్శకుడు ఉన్నా పెట్టుబడి పెద్ద సమస్యగా మారుతోంది. నిర్మాణం పూర్తైన దానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, కెమెరా వంటివి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఆసక్తి ఉన్నా మధ్యలోనే వదిలేస్తున్నారు. అయితే తాజాగా నెట్లో పలు రకాల యాప్లు అందుబాటులోకి రావడంతో వాటి ద్వారానే ఎడిటింగ్, డబ్బింగ్ వంటి ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే వాటిలో అంతగా క్వాలిటీ లేకపోవడంతో మంచి సందేశం ఉన్నా ఆంతగా ఆదరణ నోచుకోవడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులేనిలొకేషన్లు కొవ్వూరు పరిసరాల్లో పలు ప్రాంతాలు షూటింగ్కు అనువుగా ఉండటంతో షార్ట్ ఫిలింల నిర్మాణం జోరందుకుంటుంది. ముఖ్యంగా కొవ్వూరు గోష్పాదక్షేత్రం, కుమారదేవం, వాడపల్లితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద పెద్ద దర్శకులు చిత్రాలను నిర్మించడంతో, ఆ ప్రభావం ఈ ప్రాంత యువతపై పడిందని చెప్పవచ్చు. ఎక్కువగా కొవ్వూరు నుంచి పోలవరం వరకూ పెద్ద చిత్రాల షూటింగ్ జరుగుతోంది. వీటి ప్రేరణతోనే లఘ చిత్రాలను తీస్తున్నామని ఈ ప్రాంత యువత చెబుతున్నారు. ఎన్నో కథలు ఉన్నాయి షార్ట్ ఫిలింలు నిర్మించడానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో కథలు ఉన్నాయి. ఒక్కో షార్ట్ ఫిలిం నిర్మించాలంటే అతి తక్కువగా రూ.20 వేల నుంచి 50 వేల వరకూ అవుతుంది. అయితే పెట్టుబడి లేకపోవడంతో మాకు అందుబాటులో ఉన్న వాటితోనే నిర్మిస్తున్నాం. మాలాంటి యువతకు ఫిలిం మేకింగ్తో ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం లభిస్తే మంచి సందేశాలు ఉన్న షార్ట్ ఫిలింలు నిర్మించ గలుగుతాం. –పి. భరత్కుమార్, షార్ట్ ఫిలిం డైరెక్టర్, కొవ్వూరు సొంత ఖర్చుతోనే నిర్మాణం సినిమాలపై ఉన్న ఆసక్తితో సొంత ఖర్చుతోనే షార్ట్ ఫిలింలు నిర్మిస్తున్నాం. సమాజానికి మంచి సందేశం ఇవ్వడంతో పాటు, మాలో ఉన్న ప్రతిభను భయపెట్టేందుకు అవి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. అయితే రానురాను షార్ట్ ఫిలింల నిర్మాణంలో ఖర్చు పెరుగుతుంది.–బి. ప్రసాద్, కొవ్వూరు నటనపై ఆసక్తి ఉంది నటించాలన్న ఆసక్తి ఉంది. అందుకే షార్ట్ ఫిలింలో నటిస్తున్నాను. చిన్ననాటి స్నేహితులమందరం కలిసి షార్ట్ ఫిలింలు నిర్మించి, నటిస్తున్నాం. మంచి సందేశం ఉన్న చిత్రాలను నిర్మించాలన్నదే లక్ష్యంగా ఉన్నాం. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తే మరిన్ని చిత్రాలు తీయవచ్చు–కొత్తమాసు వినయ్కుమార్ మార్పు కోసమే లఘు చిత్రాలు సమాజంలో ఎంతో కొంత మార్పు తేవాలన్న ఉద్దేశంతో షార్ట్ ఫిలింలు తీస్తున్నా. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో “్ఙమార్పు’’ అనే పేరుతో ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై సందేశాన్ని ఇచ్చాను. అయితే షార్ట్ ఫిలింలు తీసే వారికి ప్రభుత్వం సహాయం చేస్తే మంచి చిత్రాలు అందించవచ్చు. –ఎన్ఎస్వీఎస్ఎం సాయి పవన్ కృష్ణ -
మనం చూడని మనదేశం
చూడాలి.. తెలుసుకోవాలి.. వెలుగులోకి తేవాలి..స్ఫూర్తి చెందాలి.మనకు ఉన్నవన్నీ సవాళ్లే అనుకుంటే వీళ్ల జీవితాలు చూడాలి.. మనకు కనపడని దేశం ఇది..ఈ నెల పన్నెండున తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో జరిగిన ‘జై చండీరాం మెమోరియల్ సెకండ్ నేషనల్ కమ్యూనిటీ మీడియా ఫెస్టివల్’లో ప్రదర్శించిన డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్లో మనం చూడని.. మనకు తెలియని దేశం కనిపించింది. మచ్చుకు మూడు.. సాల్ట్ ఇన్ మై విలేజ్ సముద్రపు నీటితోనే కాదు.. కొండవారగా పారే నీటితోనూ ఉప్పు తయారవుతుంది. అదే నాగాలాండ్ కథ.. సాల్ట్ ఇన్ మై విలేజ్. 1960ల్లో నాగాలాండ్లో జరిగిన ఘర్షణ, హింస నుంచి బతికి బయటపడ్డ మహిళలు ఇలా ఉప్పును తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్హెక్ జిల్లాలోని మాతిక్రూ గ్రామంలోని ఆడవాళ్లకు ఇదే ప్రధాన ఆర్థిక వనరు. కొండ మీద నుంచి చిన్న చిన్న పాయలుగా పారుతున్న నీటిని వెదురు బుంగలు, క్యాన్లలో పట్టుకొని కడవల్లో పోసి కాస్తారు. నీరంతా మరిగి మరిగి... ఆవిరై అడుగున ఉప్పు తయారవుతుంది. వీటిని అచ్చులుగా చేసి (తాటి బెల్లంలా) చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో అమ్ముతారు. డబ్బుతోపాటు ఆరోగ్యం అనీ చెప్తారు దీన్ని తయారు చేసే స్త్రీలు. మరుగుతున్న ఈ నీటి ఆవిరిని పీల్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, కొన్ని శ్వాసకోశ వ్యాధులూ నయమయ్యాయని అంటారు. అంతేకాదు, ఈ ఉప్పు కూడా ఆరోగ్యకరమే అని చెప్తారు. ఉప్పు తయారీతో అల్లుకుని ఉన్న ఆ మహిళల జీవన విధానాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ట్రేడింగ్ చైల్డ్హుడ్ ఛత్తీస్గఢ్లోని బరిమా గ్రామం. ఊళ్లో చాలా మంది పిల్లలు బాలకార్మికులే. పశువులు కాస్తూ, పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్లందరి ఇంటర్వ్యూలతో ఆ ఊరి చిత్రాన్ని చూపించిన సినిమా ఇది. పేదరికం, వాటికి కారణమైన దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులను పరోక్షంగా ప్రశ్నించిన ఈ ఫిల్మ్ పెద్దల బాధ్యతను గుర్తుచేస్తుంది. సమ్ఝౌతా.. సమ్ఝౌతా .. అంటే ఒప్పందం. ఎవరితో.. శవాలతో! అవును. ఇది ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ స్త్రీల జీవన చిత్రం. స్థానిక మీడియా చూసినా.. చదివినా.. బుందేల్ఖండ్లో ఒక్క నేర వార్త కూడా కనిపించదు. అసలక్కడ క్రైమ్ రేటే ఉండదు. మరి శవాలతో సమ్ఝౌతా ఏంటీ? అదే సినిమా! వరకట్నం వేధింపులు, వాటివల్ల ఆత్మహత్యలు, ఈవ్టీజింగ్లు, రేప్లు, హత్యలు.. ఏం జరిగినా బాధితుల తరపు కుటుంబ సభ్యులను పిలిచి నేరస్తుల కుటుంబ సభ్యులతో సమ్ఝౌతా కుదిరిస్తారు గ్రామ సర్పంచ్లు, పెద్దలు వగైరా! అవును, ఖాప్ పంచాయత్లే. నేరం ఎంత పెద్దదయినా సరే.. సమ్ఝౌతానే శరణ్యం. ఫిర్యాదులు నమోదు అవడానికి వీల్లేదు. విచారణ పేరుతో పోలీసులు ఆ ఊళ్లలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. అందుకే క్రైమ్ రిపోర్ట్లో... పోలీసుల వైపు కెమెరా పెడితే.. ‘‘ఫిర్యాదు రాదు.. ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఫిర్యాదు వస్తే... తప్పకుండా న్యాయం చేస్తాం’’ అంటారు. ఇదే సమ్ఝౌతా! చూస్తున్న వాళ్లకు షాక్. ‘సభ్య’ సమాజానికీ అశనిపాతం. ఇవన్నీ తీసినవి ఫిల్మ్మేకింగ్లో మాస్టర్స్ కాదు. కష్టాల బడిలో ఆరితేరిన వాళ్లు. ఆ డాక్యుమెంటరీల్లో వాళ్లు అనుభవించిన సమస్యలున్నాయి. అందుకే అవి మనసును తడి చేస్తాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించిన మహిళా రైతుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర్లోని పస్తాపూర్కు చెందిన వాళ్లు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మ ఇంకా కొందరు మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లు. తమలా సమస్యల సవాళ్లతో జీవితంలో నెగ్గుతున్న వాళ్లు.. వాళ్ల కోణంలో.. వాళ్లు చూసిన సమాజాన్ని కెమెరాలో బంధించి.. డాక్యుమెంటరీలుగా.. షార్ట్ఫిల్మ్స్గా తీస్తే.. ఎందరికో స్ఫూర్తిగా ఉంటుందని ఈ బాధ్యతను చేపట్టారు. దూరదర్శన్ తొలితరం ప్రొడ్యూసర్లలో ఒకరైన మహిళ.. జై చండీరాం. ఆమె జ్ఞాపకార్థం ‘జై చండీరాం మెమోరియల్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో 2017లో ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుతున్నారు. ఇది రెండవ యేడాది. ఈ ఇద్దరూ బాల్యపు హక్కులు, ప్రత్యేకతలు, జ్ఞాపకాలు లేకుండా పెరిగారు. ‘రెలు’ కూడా వాళ్లకు అందమైన ఊహ. ఇప్పుడు ఫ్లయిట్లో ఈ ఫెస్టివల్కు వచ్చారు. ఆ మాటను మెరిసే కళ్లతో చెప్తారు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మకు .. వాళ్ల నాయకత్వంలోని ఇతర మహిళలకూ చదువురాదు. అయితేనేం బతుకు తెలిసిన జ్ఞానవంతులు. అందుకే షూటింగ్కి చెందిన హై యాంగిల్, లో యాంగిల్, ఐ లెవెల్ షాట్స్ వంటి సాంకేతిక భాషకు ప్రత్యామ్నాయంగా వీళ్లు కొత్తపరిభాషను ఏర్పాటు చేసుకున్నారు. గాయ్దోళ్ల షాట్, పటేల్ షాట్, సంఘం షాట్గా! వాటిని కాయిన్ చేసుకోవడానికి వారి ప్రాంతపు సంస్కృతి, సామాజిక పరిస్థితులే ప్రేరణ, కారణం. దొరతనానికి బానిసలు, ఆర్థికలేమి, నిర్వాసితులుగా వాళ్లు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధల్లోంచి పుట్టిన పదాలు అవి. పటేల్ అంటే దొర.. ఎప్పుడూ తన ఎదుట నేల మీద కూర్చుని ఉన్న కూలీలతో కిందకు చూసే మాట్లాడ్తాడు కాబట్టి లో యాంగిల్ షాట్ను తమకు అర్థమయ్యేలా పటేల్ షాట్ అని పిలుచుకుంటున్నారు. హై యాంగిల్ షాట్ గాయ్దోళ్ల షాట్ ఎందుకు అయింది? గాయ్దోళ్లు అంటే వెట్టి కూలీలు. తమ ముందు నిలబడి ఉన్న దొరకు సమాధానం ఇవ్వాలంటే పైకి చూస్తూనే మాట్లాడాలి. ఆ సన్నివేశాన్నే వాళ్లు ఊహించుకుని హై యాంగిల్ షాట్కి ఆప్ట్ అయ్యేలా గాయ్దోళ్ల షాట్ అని నామకరణం చేసుకున్నారు. సంఘం షాట్.. సంఘం లేదా... సమావేశంలో వాళ్లంతా ఒకచోటే కూర్చుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఎవ్వరూ తల ఎత్తాల్సిన అవసరం లేదు. తలదించాల్సిన అగత్యం లేదు. అందుకే ఐ లెవెల్ షాట్... సంఘం షాట్లా అనిపించింది వాళ్లకు. ఇది వాళ్లు కల్పించుకున్న స్పృహ.. తెచ్చుకున్న అవగాహన. దక్కన్ రేడియోతో తెలుగు రాష్ట్రాల్లో తొలి కమ్యూనిటీ రేడియోను, వీడియో కెమెరా ఆపరేటింగ్తో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్నూ తీస్తున్నారు. తమను చూసి నొసటితో వెక్కిరించిన నోళ్లకు తమ చేతలతో మర్యాద నేర్పుతున్నారు. లక్ష్మణ్ మూడి.. ‘ట్రేడింగ్ చైల్డ్హుడ్’ దర్శకుడు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న పెంచి పెద్ద చేశాడు. లక్ష్మణ్ కూడా ఒకప్పుడు బాలకార్మికుడే. తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. పెద్దవాళ్లకు తెలియకుండా.. తెలిసిన పెద్దలను ఒప్పిస్తూ ఈ డాక్యుమెంటరీ తీశాడు. బాగా చదువుకోవాలనేది లక్ష్మణ్ ఆశయం. థెనిలో.. ‘సాల్ట్ ఇన్ మై విలేజ్’ డాక్యుమెంటరీ దర్శకురాలు. పదో తరగతితో చదువు ఆపేసింది ఆర్థిక స్తోమత లేక. ఆమె చేనేత కార్మికురాలు కూడా. ఇప్పటికే నాలుగు షార్ట్ఫిల్మ్స్ తీసింది. స్క్రీనింగ్ కోసం పలు ప్రాంతాలకు వెళ్లింది. ‘‘మంచి ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నా’’ అంటుంది. – సరస్వతి రమ -
లఘుచిత్రాల సినిమాటోగ్రాఫర్
జూబ్లీహిల్స్: చిట్టీలు వేసి డబ్బులు జమ చేసి చిన్న 5డీ కెమెరాను కొనుగోలు చేసిన సుధాకర్... షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్గా రాణిస్తున్నాడు. యూసుఫ్గూడ వెంకటగిరిలో నివసించే సుధాకర్ ఇప్పటికే వందలాది ఫార్ట్ఫిలిమ్స్ను తెరకెక్కించాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుధాకర్కు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్న కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్ఫోన్లలో అత్యుత్తమ నాణ్యతతో కెమెరాలు రావడంతో... ఫోన్లోనే షార్ట్ఫిలిమ్స్ చిత్రీకరించి శెభాష్ అనిపించుకున్నాడు. 150కి పైగా షార్ట్ఫిలిమ్స్... నాలుగైదేళ్లుగా షార్ట్ఫిలిమ్స్ ట్రెండ్ పెరగడంతో ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకున్నాడు సుధాకర్. షార్ట్ఫిలిమ్ మేకింగ్లో పట్టు సాధించి ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా లఘుచిత్రాలకు కెమెరామెన్గా పని చేశాడు. త్వరలో విడుదల కానున్న ‘రహస్యం’ సినిమాకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్గా పని చేశాడు. మరో రెండు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్ తెరకెక్కించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ ,శ్వాసనువ్వే, రుధిరం తదితర లఘు చిత్రాలకు మంచి పేరొచ్చింది. వర్మ స్ఫూర్తితో.. తిలక్ దగ్గర ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ‘మా ఊరి వంట’ కార్యక్రమానికి అసిస్టెంట్గా పని చేశాను. రామ్గోపాల్వర్మ స్ఫూర్తితో చిట్టీలు వేసి డబ్బులు జమ చేసుకొని 5డీ కెమెరా కొనుగోలు చేశాను. షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తూ పేరు సంపాదించాను. మంచి సినిమాటోగ్రాఫర్గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను.– సుధాకర్ -
సందేశం..లక్ష్యం
పినపాక ఖమ్మం : అల్లరిచిల్లరిగా తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా..సమాజానికి ఏదైనా సం దేశం ఇవ్వాలనే లక్ష్యంతో షార్ట్ఫిల్మ్లు రూ పొందిస్తూ.. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం, సీతంపేట గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు ఆకట్టుకున్నారు. వీరంతా ఓ బృందం గా ఏర్పడి..లఘు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలనే ధ్యేయంతో భిన్నంగా ఆలోచిస్తూ..శెభాష్ అనిపించుకుంటున్నారు. ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన పులివర్తి పెద్దాచారి, సీతంపేటకు చెందిన ఆర్.రాజశేఖర్లు టీం లీడర్లుగా ఉంటూ మరో 20మంది యువకులతో ప్రత్యేకం గా బృందాన్ని ఏర్పరుచుకుని..తొలినాళ్లలో కేవ లం కామెడీ అంశాలను ఆధారంగా చేసుకొని షార్ట్ఫిల్మ్లు తీశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న పరిసరాలను, పొలాలను, పాఠశాలలను, రైతుల నే ఇతివృత్తంగా చేసుకుని చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆర్ఎస్ క్రియేషన్స్ పేరుతో 25షార్ట్ఫిల్మ్లు చిత్రీకరించే వరకు వీరి ప్రయాణం సాగింది. రైతులకు పెట్టుబడి ధరలు రావాలని, పంటల సాగుకు ప్రోత్సాహమివ్వాలని, ఊర్లను బాగు చేయాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సర్కారు బడులను ప్రోత్సహించాలని..సందేశమిచ్చేలా షార్ట్ఫిల్మ్లు తీశారు. యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తుం డడంతో వేలామంది వీక్షకులు వాటిని చూశారు. ఈ లఘుచిత్రాలన్నీ సెల్ఫోన్ ద్వారానే తీశామని ఆనందంగా అంటున్నారు. వీడియో కెమెరా కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని, మొబైల్లోనే ఎడిటింగ్ ప్రక్రియను కూడా పూర్తిచేస్తున్నామని వివరించారు. దాతలు సహకరించాలి.. సమాజంలో ప్రజలను చైతన్యపరిచేందుకు షార్ట్ఫిల్మ్లు నిర్మిస్తున్నాం. ముందుగా ఐదుగురితో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు 20 మందికి చేరుకుంది. ఆర్థిక పరిస్థితి చాలక..వీడియో కెమెరా కొనలేదు. సెల్ఫోన్తోనే చిత్రాలు నిర్మిస్తున్నాం. దాతలు సహకరిస్తే సమాజంలో సమస్యల పరిష్కారానికి, మార్పు కోసం మా వంతుగా కృషి చేస్తాం. –పి.పెద్దాచారి, ఏడూళ్లబయ్యారం, పినపాక మండలం యూట్యూబ్లో చూడండి.. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తున్న మా యువకులకు చెందిన ఆర్ఎస్ క్రియేషన్స్ పేరిట ఉన్న యూబ్యూబ్ చానెల్ను ప్రజలు ఆదరిస్తున్నారు. మరింతగా ఆదరిస్తే మాకు వచ్చే పాయింట్ల మూలంగా మరింత ఉత్సాహంగా షార్ట్ఫిల్మ్లు నిర్మిస్తాం. – ఆర్.రాజశేఖర్, సీతంపేట, పినపాక మండలం -
స్టోరీ.. స్క్రీన్ప్లే.. డైరెక్షన్.. అన్నీ వారే..
సుజిత్.. ఒకప్పుడు షార్ట్ ఫిలిం మేకర్.. సినీ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకున్న అతనిలో ఓ షార్ట్ ఫిలిం ఆత్మవిశ్వాసాన్ని నింపింది.. ప్రస్తుతం రూ.300 కోట్లతో ప్రభాస్ హీరోగా నిర్మి స్తున్న ‘సాహో’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేసేలా చేసింది. సుజిత్ ఎక్కడ అవకాశాల కోసం వెదకలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకున్నాడు.. అవకా«శాన్ని అందిపుచ్చుకున్నాడు.. తన సినీ ప్రస్థానాన్ని సిల్వర్స్క్రీన్ వైపు నడిపించాడు.. ఫన్ బకెట్.. యూట్యూబ్లో అత్యంత హిట్ కొట్టిన నవ్వుల షార్ట్ ఫిలిం.. ఇందులో కనిపించే యువకులంతా ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.. వారు అవకాశాల కోసం ఎదురుచూడలేదు.. కాళ్లు అరిగేలా తిరగలేదు.. కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లోనే తమ ఆశయానికి నారు పోశారు. అదే ఫన్ బకెట్గా నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో నటించిన మిల్క్ మహేష్ తదితర నటులకు సినీ అవకాశాలను కల్పించింది. అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన రామ్ కట్రూకు సినిమాలంటే ప్యాషన్. ఇక్కడికొచ్చిన అతనికి సినిమా తీయడానికి కొంత ఇబ్బంది ఎదురైంది. తన ప్రతిభను చూపడానికి సినిమా ఒకటే అవకా«శం కాదు.. అందుకే.. తనలాంటి ఆలోచనలు ఉన్న ఒక టీంతో ఆయన కలిశాడు. అంతే.. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం తనకు తాను రాసుకున్నారు.. కృష్ణానగర్, గచ్చిబౌలి, మసీదు బండ ప్రాంతాల్లో ‘ప్రక్షాళన’ పేరుతో ఒక షార్ట్ ఫిలింను తెరకెక్కించాడు.. ఇది 16 ఫిలిం ఫెస్టివల్స్లో నామినేట్ అయ్యింది. ప్రతిభ ఒకరి సొత్తు కాదని కృష్ణానగర్ అడ్డాగా నిరూపితమైంది. బంజారాహిల్స్: సినిమాల్లో అవకాశాలు నేరుగా ఎవరికీ రావు. అదృష్టం ఉంటే తప్ప. ఇప్పుడు అదృష్టం ఉండాల్సిన పనిలేదు. ప్రతిభ ఉండి, పట్టుదల ఉంటే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అందుకే.. కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్కాలనీ ప్రాంతాల్లో ప్రతి రోజు ఔత్సాహిక యువకులు షార్ట్ ఫిలింల రూపకల్పనతో బిజీగా ఉంటున్నారు. కృష్ణనగర్లో ఉండేటువంటి పార్కులు, బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు ఇలా అన్ని ప్రాంతాలు వీరికి లోకేషన్లుగా మారుతున్నాయి. అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో నివసించే చాలా మంది ఔత్సాహిక కళాకారులు తమను తాము నిరూపించుకొంనేందుకు ఈ లఘుచిత్రాల బాట పడుతున్నారు. ఇందుకు కృష్ణానగర్ ప్రాంతమే అడ్డాగా నిలుస్తోంది. ముడి సరుకులు అవే.. సమాజంలోని చిన్నచిన్న సంఘటనలే కథకు ముడి సరుకులుగా మారుతున్నాయి. ఇక ప్రతిభ ఉన్నవారు, ఉత్సాహం ఉన్నవారు వారికి వారే కథను రాసుకుంటున్నారు. స్క్రీన్ప్లే, దర్శకత్వం చేస్తున్నారు. యాక్షన్ దగ్గరి నుంచి మొదలుకొని ప్యాకప్ వరకు అంతా వారే చూసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ముందడుగు వేసి హీరోలుగా తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 నిమిషాల నుంచి అరగంట నిడివి ఉండేటువంటి షార్ట్ ఫిలింలు ఇప్పుడు యూట్యూబ్లో హిట్ కొడుతున్నాయి. మహాతల్లి, ఫ్రస్టేషన్ ఉమెన్లాంటి స్వీయ కార్యక్రమాలతోపాటు ఫన్బకెట్, మై విలేజ్ షో, దేత్తడి, పక్కింటి కుర్రాడు ఇలాంటి షోలన్నీ ఇప్పుడు పెద్ద పాపులర్గా మారాయి. ఇంతెందుకు నిన్నామొన్నటి వరకు కృష్ణానగర్ వీధుల్లో తిరిగి జబర్దస్త్ టీంలో చేసి మహేష్ ఏకంగా ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్ తేజ పక్కన చాన్స్ కొట్టాడు. కృష్ణానగర్ వీధుల్లో లఘు చిత్రాల చిత్రీకరణ అన్నీ ఇక్కడే.. లఘుచిత్రాలు చేయడమంటే కేవలం నటించడమే కాదు.. పాత్రకు తగిన విధంగా గెటప్ వేస్తున్నారు. భాష, యాస, మేకప్, దుస్తులు ఇలా అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. ఇక వీటన్నింటికీ కృష్ణానగర్ ప్రాంతమే అడ్డా. కెమెరాలు ఇక్కడే అద్దెకు లభిస్తాయి. చిన్న కెమెరాల నుంచి మొదలుకొని పెద్ద కెమెరాల వరకు ఇక్కడ అద్దెకు ఇస్తారు. దుస్తులు, విగ్గులు, వివిధ వేషధారణలకు తగిన ఉత్పత్తులు ఇలా అన్నీ కృష్ణానగర్ అడ్డాలోనే లభిస్తాయి. అందుకే.. ఒకప్పుడు కేవలం అవకాశాల కోసం ఏర్పడిన కృష్ణానగర్ నేడు అవకాశాలు సృష్టించుకొనే డిజిటల్ స్థాయి వైపు తీసుకెళ్తోంది. ఆలోచనలే కాదు.. కృష్ణానగరూ మారుతోంది. షార్ట్ ఫిలిం నుంచిఫీచర్ ఫిలింకు.. సినిమాల్లో అవకాశం కోసం చాలా రోజులు కష్టపడ్డాం. కృష్ణానగర్ వీధులన్నింటినీ పరిచయం చేసుకున్నాం. అవకాశాలు అంత సులువుగా రాలేదు. చివరికి ప్రక్షాళన పేరుతో చేసిన షార్ట్ ఫిలిం చేశాం. అది ప్రపంచ స్థాయిలో ఆకర్షించింది. అంతే.. చాలా మంది పెద్ద డైరెక్టర్లు భుజం తట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. – భరత్రాజు, నటుడు షార్ట్ఫిలింలో పాత్ర కోసం క్యాస్టూమ్స్ అద్దెకు తీసుకుంటూ.. అవకాశాలను సృష్టించుకొన్నాం.. ఫన్బకెట్లో దాదాపు 90 ఎపిసోడ్లు చేశాను. అదంతా కృష్ణానగర్, శ్రీనగర్కాలనీ ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొనే వాళ్లం. అలా నా వీడియో చూసి మొదటిసారి దర్శకులు తేజ అవకాశం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అవకాశం కల్పించారు. ఇప్పటికీ 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. పట్టుదల ఉంటే మనమే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం చేసుకోవడమే కాదు.. నటించి మనల్ని మనం నిరూపించుకోవచ్చు. – మహేష్ విట్టా, నటుడు, ఫన్ బకెట్ ఫేం -
వెండి తెరపై అనుభవ పాఠాలు
హన్మకొండ చౌరస్తా : మారుమూల గిరిజన తండాలో పుట్టిన వారిద్దరు.. సమాజంలో కొనసాగుతున్న వివక్షను చిన్ననాటి నుంచే స్వయంగా ఎదుర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా చిన్నచూపు చూడడం భరించలేకపోయారు. ఈ క్రమంలో వివక్షపై పోరాటం చేయాలని ఆ ఇద్దరు యువకులు నిర్ణయించుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో ఒకరు రాజకీయాల్లోకి అడుగిడితే, మరొకరు వైద్యుడయ్యారు. వారు చేస్తున్న వృత్తితో ఆర్థికంగా స్థిరపడ్డారు. అయితే వారు చిన్నతనంలో ఎదుర్కొన్న వివక్షను నిర్మూలించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సినిమాలు, షార్ట్ఫిల్మ్లను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలోని తండాకు చెందిన ఎన్.సారయ్యనాయక్.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పీజీ పూర్తి చేశారు. సమాజంలో నిమ్న కులాలపై వివక్ష కొనసాగడంపై చలించిపోయారు. తండావాసుల సహకారంతో 2001లో గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. తండావాసులకు విద్య, వైద్యం కోసం శ్రమించారు. మరొకరు ఆనంద్.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి తండావాసి. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆయుర్వేద కళాశాలలో వైద్యవిద్య చదవివారు. ప్రస్తుతం ఢిల్లీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సమాజంలో దళిత, గిరిజనులు, బాలికలపై కొనసాగుతున్న వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నారు. అందుకు సినీ తెరను వేదికగా ఎంచుకున్నాడు. అనుకోకుండా 2010లో ఒక వేదికపై సారయ్యనాయక్, ఆనంద్లు పరిచయమయ్యారు. వారు మూడు లఘుచిత్రాలు, రెండు సినిమాలు నిర్మించారు. ప్రముఖుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. చిరుతేజ్సింగ్పై లఘుచిత్రం జ్ఞాపకశక్తిలో గిన్నిస్ రికార్డు సాధించిన వరంగల్ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల చిరుతేజ్సింగ్పై రూపొందించిన లఘుచిత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిరుతేజ్సింగ్ కేవలం ఒక నిమిషంలో 81 దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పగలగడం అతడి ప్రతిభ. ‘హార్మోన్స్’ చిత్రానికి అవార్డులు.. బంజార మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై 2011లో నిర్మించిన హార్మోన్స్ చిత్రం 2012లో రాష్ట్రవ్యాప్తంగా 60 థియేటర్లలో విడుదలైంది. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మొదలు ఢిల్లీ వరకు ఈ సినిమా ప్రముఖులచే ప్రశంసలు, అవార్డులను అందుకుంది. సామాజిక దృక్పథతో విద్య, వైద్యం, వ్యవసాయం అంశాలపై తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలంగాణ యువతకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నటనలో కొత్తైనా సామాజిక అంశం కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కేయూ మాజీ వీసీ గోపాల్రెడ్డి, రిటైర్డ్ ఐజీ.జగన్నాథరావు తదితరులు నటించడం విశేషం. అంతేకాకుండా బాలికల విద్యా హక్కు చట్టం, అంటరానితనం, దళిత గిరిజనులపై వివక్ష’ తదితర అంశాలపై రూపొందించిన లఘుచిత్రాలు మేధావులను సైతం ఆలోచింపజేశాయి. వివక్షను తరిమికొట్టడమే లక్ష్యం స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ దళిత, గిరిజనులపై వివక్ష, దాడులు జరుగుతుండడం బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో దళిత, గిరిజనుల్లో చైతన్యం నింపి, రాజ్యాంగ హక్కులను అందించడమే మా లక్ష్యం. అందుకు సినీ తెరను వేదికగా మలుచుకున్నాం. ప్రజలపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. – సారయ్యనాయక్, సినీ నిర్మాత మెరుగైన విద్య, వైద్యం అందినప్పుడే అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు నగరాల్లోని మురికివాడల్లో నివసించే వారిలో అత్యధిక శాతం దళితులు, గిరిజనులే ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్య, వైద్యం అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందితుంది. ఆ దిశగా గిరిజనుడిగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నా. – ఆనంద్, సినీ దర్శకుడు -
వరంగల్ ఒక అద్భుతం : ఎల్బీ శ్రీరామ్
సాక్షి, వరంగల్ రూరల్ : వరంగల్ ఒక అద్భుతమని, తెలుగు వారు తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఓరుగల్లు దాటాల్సిందేనని నటుడు, రచయిత ఎల్బీ శ్రీరాం అన్నారు. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చిన ఆయనను సోమవారం సాక్షి పలకరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... వరంగల్కు అనేక సందర్భాల్లో వచ్చాను. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం రావడం ఇదే మొదటి సారి. చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. 17 సంవత్సరాల పాటు నాటికలు రచించి నటించాను. రిహార్సల్కు కోసం వరంగల్, నిజామాబాద్ వెళ్లేవాడిని. తెలుగువాళ్లు హైదారాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లాలన్నా, తిరుగుప్రయాణమైనా వరంగల్ దాటాల్సిందే. గేట్ వే ఆఫ్ తెలు గు పీపుల్గా ఓరుగల్లుకు సుస్థిర స్థానం ఉంది. వారం రోజులు.. మూడు షార్ట్ ఫిల్మ్లు షార్ట్ ఫిలిం తీసేందుకు 24 విభాగాలతో కూడిన టీంతో వచ్చాను. కథకు అనువైన ప్రాంతాలను ఎంచుకుని షూట్ చేస్తున్నప్పుడు పొందే అనుభూతే వేరు. వారం రోజుల్లో మూడు షార్ట్ ఫిల్మ్లు పూర్తి చేయాలి. ఈ మూడు సినిమాలకు కథలు వరంగల్కు చెందిన రచయిత రామచంద్రమౌళి అందించారు. వరంగల్, హన్మకొండలలో ఉన్న ప్రాంతాలన్నింటినీ తిప్పి చూపించారు. ఆయన రాసిన కథలు ఆయా ఏరియాలతో పెనవేసుకుని ఉన్నాయి. నేను ఒక రచయితగా రామచంద్రమౌళి రచనలను ఎంతగానో ఇష్టపడుతాను. షార్ట్ ఫిలిం షూట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన రచనలు షూట్ చేయాలనుకున్నాను. మీరు సహకరిస్తే చేస్తా అని చెప్పాను. రామచంద్రమౌళి మరోమాట చెప్పకుండానే అంగీకరించాడు. అన్ని లోకేషన్లు వరంగల్లో ఉన్నాయని చెప్పారు. వర్ధన్నపేట సర్పంచ్ గాడిపెల్లి రాజేశ్వర్ రావు, కాజీపేట తిరుమలయ్య, మెరుగు సాంబయ్య, చిప్ప వెంకటేశ్వర్లు, డాక్టర్ మురళీకృష్ణ ఎంతగానో సహకరిస్తున్నారు. కోటల అందాలు.. వరంగల్లో ఉన్న వేయిస్థంభాల దేవాలయం, ఖిలావరంగల్, రామప్ప, లక్నవరం ఇలా అన్నీ అద్భుతాలే. వరంగల్లో ఏ వీధికి వెళ్లినా మగ్గాలు కన్పిస్తుంటాయి. కాకతీయ కోట, రామప్ప గుడి ఎలా చరిత్రను నిలబెడుతున్నాయో చేనేత కార్మికులు సైతం వాళ్ల వృత్తిని నమ్ముకుని చరిత్రలో నిలిచిపోతారు. గూగుల్ మాయ.. ఇప్పటి తరం యువకులు ఏది కావాలన్న గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. అలాంటిది నేటి యువత గూగుల్కు దాసోహం కావడం బాధేస్తుంది. ప్రస్తుతం మానవ విలువలు హరించుకుపోతున్నాయి. మంచి సందేశంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే షార్ట్ ఫిల్మ్లు తీయాలని నిర్ణయానికి వచ్చా. సంప్రదాయాలకు పెద్దపీట.. మన సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరం వాళ్లకు అందించే ప్రయత్నంలో భాగంగానే షార్ట్ ఫిల్మ్లు తీస్తున్న. ఇప్పటి వరకు 20 షార్ట్ ఫిల్మ్లు తీశాను. ఇతరులు తీసిన 10 షార్ట్ ఫిల్మ్లలో నటించాను. డోలు అనే షార్ట్ ఫిల్మ్కు నంది అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు తీసిన షార్ట్ ఫిల్మ్లను యూట్యూబ్లో రెండున్నలక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. 500 సినిమాల్లో నటన.. ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. ఛత్రపతి, చాలా బాగుంది, స్టాలిన్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, సొంత ఊరు, సరైనోడు లాంటి సిని మాలు నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వపరంగా నాలుగు నంది అవార్డులు వచ్చాయి. 40 సినిమాలకు డైలాగులు రాశాను. -
షార్ట్గా.. షార్ప్గా..
తూర్పు గోదావరి, రాయవరం (మండపేట): ఏదో సాధించాలనే తపన..పదిమందిలో ఒకరిగా నిలవాలనే పట్టుదల.. వీటికి తోడు నిరంతర కృషి ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. తాను రాసిన కథలు, దర్శకత్వం ద్వారా పసలపూడికి గుర్తింపు తీసుకుని వచ్చిన సినీ దర్శకుడు ‘వంశీ’ బాటలో నడుస్తున్నాడు మరో యువకుడు. కెమెరామన్గా, దర్శకుడిగా షార్ట్ ఫిల్మస్ చేస్తూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తున్న ఆయన రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ఉత్తమ తృతీయ బహుమతిని గెల్చుకుంది. తృతీయ బహుమతి గెల్చుకున్న‘చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్’.. సోషల్ మీడియా ఫర్ సొసైటీ(ఎస్ఎంఎస్) నేటి చదువులు అనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో షార్ట్ ఫిల్మ్స్ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 73 లఘుచిత్రాలు పోటీలో పాల్గొనగా, 11 చివరి పోటీకి నిలిచాయి. వీటిని వీక్షించిన కమిటీ రాయవరం మండలం పసలపూడికి చెందిన లఘు చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్’ షార్ట్ ఫిల్మ్ తృతీయ బహుమతిని గెల్చుకొంది. సీని దర్శకుడు వీఎన్ ఆదిత్య న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కాన్వెంట్ చదువుల పేరుతో బాల్యాన్ని పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్న చదువులు, నేటి చదువుల్లో రావాల్సిన మార్పులపై ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిల్మ్ న్యాయ నిర్ణేతలను ఆలోచింపజేసింది. కెమెరామెన్, దర్శకుడిగా.. 2012 నుంచి ఇప్పటి వరకు కృష్ణారెడ్డి కెమెరామెన్గా, దర్శకుడిగా తనదైన శైలిలో లఘుచిత్రాలను రూపొందించాడు. సామాజిక ఇతివృత్తాలను ప్రధానంగా తీసుకుని ఇప్పటి వరకు 25 లఘుచిత్రాలకు కెమెరామెన్గా, దర్శకుడిగా పనిచేశాడు. స్నేహం గొప్పదనాన్ని తెలియజేసేలా ‘నేనెందుకు’ అనే లఘుచిత్రంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. యువత ఖాళీగా ఉండకూడదంటూ ‘టైమ్ వేస్ట్ చెయ్యొద్దు’ అనే లఘుచిత్రంతో పాటు ప్రేమ పేరుతో జీవితాలను పాడు చేసుకోవద్దంటూ ‘గాల్లో ప్రేమ కథలు’, సమాజం కోసం పోరాడాలంటూ ‘భీష్మ’, నిజమైన ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసే ‘ట్రు లవ్’ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చవద్దంటూ ‘శిల్పి’ తదితర 25 లఘుచిత్రాలను కృష్ణారెడ్డి రూపొందించారు. సినీ దర్శకుడిగా రాణించడమే లక్ష్యం.. సినీ దర్శకుడిగా రాణించడమే తన లక్ష్యం. నాలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టుకుంటూ.. కెమెరామన్గా, దర్శకుడిగా షార్ట్ ఫిల్మŠస్ రూపొందిస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే మరిన్ని లఘు చిత్రాలను రూపొందిస్తాను. చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్ తృతీయ బహుమతి గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిల్మ్కు నిర్మాతగా కేశవ సూర్య(రాజోలు), రచయితగా కుమార్(కుతుకులూరు), సహ దర్శకుడిగా మురుగదాస్(నెలపర్తిపాడు), కో–డైరెక్టర్గా ఆర్కే(జి.మామిడాడ), కార్య నిర్వాహక దర్శకుడిగా కర్రి రామారెడ్డి సహకారం అందించారు. – ఎస్వీ కృష్ణారెడ్డి, షార్ట్ ఫిల్మŠస్ దర్శకుడు, పసలపూడి, రాయవరం మండలం -
ఇద్దరూ.. ఇద్దరే!
నాన్న అభిరుచి.. కూతురు ఆసక్తి వెరసి సందేశాత్మక లఘుచిత్రాలుగా వస్తున్నాయి. సమాజంలోని అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని తక్కువ నిడివితో లఘుచిత్రాలు నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు గోదావరిఖనికి చెందిన తండ్రీకూతుళ్లు. తండ్రి దర్శకత్వం వహిస్తూ, నటిస్తుండగా.. కూతురు మొబైల్ కెమెరాలో చిత్రీకరిస్తూ.. సంగీతాన్ని సమకూర్చుతోంది. సామాజికాంశాలే తనకు ప్రేరణ అంటున్న తండ్రి.. నాన్న ఆసక్తికి తోడుగా నిలుస్తున్న కూతురు గురించి తెలుసుకుందాం.. కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిచౌరస్తా సమీపంలో నివసిస్తున్న సింగరేణి ఉద్యోగి, స్మైల్ప్లీజ్ లాఫింగ్క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతుల చంద్రపాల్ సింగరేణి సంస్థ ఆర్జీ–3లోని ఓసీపీలో డ్రాగ్లైన్ ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు శాంతినిరీక్షణ. నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్ పేరిట తండ్రి, కూతురు సందేశాత్మక లఘుచిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ షార్ట్ఫిల్మ్కు చంద్రపాల్ కూతురు కెమెరా, సంగీతం అందించి తండ్రి ఆలోచనలను వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు లఘుచిత్రాలు, ఆరు డాక్యుమెంటరీలు, ఐదు టెలీఫిల్మ్లు తీశారు. టెలిఫిల్మ్లు మినహా మిగతావన్నీ కేవలం స్మార్ట్ఫోన్ ద్వారానే చిత్రీకరించడం గమనార్హం. స్మార్ట్ఫోన్తో చిత్రీకరణ బీఎస్సీ నర్సింగ్ చదివిన శాంతినిరీక్షణ.. తండ్రి ఆలోచనలను స్మార్ట్ఫోన్ కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా సంగీతం సమకూర్చుతున్నారు. పెద్ద కెమెరాలు, రీ–రికార్డింగ్ స్టూడియోలు వినియోగించకుండానే... కేవలం తండ్రి వాడుతున్న స్మార్ట్ఫోన్తోనే షూటింగ్, డబ్బింగ్, రీ–రికార్డింగ్ చేస్తూ.. నాలుగు నిమిషాల నిడివి గల షార్ట్ఫిల్మ్లను రూపొందిస్తున్నారు. టెలీఫిల్మ్లను మాత్రం మూవీ డిజిటల్ కెమెరాతో వెంకటస్వామి, మహబూబ్, లక్ష్మణ్ అనే కెమెరామెన్లు తీశారు. లఘుచిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు తనే నటిస్తున్నారు చంద్రపాల్. నిర్మించిన చిత్రాలు ♦ లఘుచిత్రాలు: ‘ఒంటరివాడు, ఆధార్కార్డ్, కనబడుట లేదు’ ♦ డాక్యుమెంటరీలు: ‘ఓమానవా, మరణమా? శిరస్త్రాణమా?, హెల్మెట్, నీరు–కన్నీరు, సుజలాం–సుఫలాం, చేతిశుభ్రతే ఆరోగ్య భద్రత’ ♦ టెలీఫిల్మ్లు: ‘మార్గదర్శి, ఖాందాన్, దీర్ఘాయుష్మాన్భవః, ఓ తండ్రి చివరి లేఖ, ఓ తండ్రి డైరీలో చివరి పేజీ,’ ప్రదర్శనలు– అవార్డులు ♦ గతేడాది జూలై 8న రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక మండలి నిర్వహించిన ప్రదర్శనలో ‘మార్గదర్శి’ టెలీఫిల్మ్ను ప్రదర్శించారు. ♦ 2011లో సింగరేణి సంస్థ సీఎండీ నర్సింగారావు చేతుల మీదుగా ‘మార్గదర్శి’ టెలీఫిల్మ్కు ఉత్తమ అవార్డు అందుకున్నారు. ♦ ఈ ఏడాది జనవరిలో నాగ్పూర్లో జరిగిన కోలిండియాస్థాయి పోటీల్లో చంద్రపాల్ చేసిన ‘హాస్యాభినయం’ ప్రదర్శనకు కాంస్య పతకం వచ్చింది. ♦ 2009 డిసెంబర్లో జయశంకర్ భూపాలపల్లిలో ‘హాస్యాభినయం’ ప్రదర్శనకు సింగరేణి సంస్థ సీఎండీ నర్సింహారావు చేతుల మీదుగా ‘ఉత్తమ కళారూపం’ అవార్డు అందుకున్నారు. ♦ త్వరలో ‘తిరగబడ్డ మమకారం’ అనే టెలీఫిల్మ్ను నిర్మిస్తున్నట్లు చంద్రపాల్ తెలిపారు. -
చూపు లేకపోయినా..అంతులేని ఆత్మవిశ్వాసం
-
బీ అలర్ట్.. ఒక్కసారి ఆలోచించండి
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఛేదించటం పోలీస్ శాఖకు అంతే కష్టతరంగా మారింది. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ నడుం బిగించింది. సెలబ్రిటీలతో చెప్పిస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న ఆలోచనతో ఐదు షార్ట్ ఫిల్మ్లను విడుదల చేసింది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, విజయదేవర కొండలతో లఘు చిత్రాల ద్వారా ప్రచారం ప్రారంభించింది. మ్యాట్రీమోనియల్ మోసాలపై తీసిన లఘు చిత్రానికి విజయ్, అపరిచితులతో ఆన్ లైన్ ఛాటింగ్.. వ్యక్తిగత విషయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్టీఆర్తో సందేశం ఇప్పించింది పోలీస్ శాఖ. ఇక ఆన్ లైన్ జాబ్ల పేరిట మోసం చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండంటూ రాజమౌళి ద్వారా మెసేజ్ చెప్పించారు. వీటితోపాటు మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు సంబంధించిన అంశాలపై యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో ఓ లఘు చిత్రం.. మరో లఘు చిత్రాలను కూడా విడుదల చేశారు. ప్రసాద్ ఫిల్మ్ లాబ్స్ లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీవీ శ్రీనివాస రావు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్ విభాగం) స్వాతి లక్రా, నిర్మాత దిల్ రాజు, నటి సుప్రియ తదితరులు పాల్గొన్నారు. వీటిని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. -
‘చిట్టి’ సినిమాల్లో రాణింపు
విజయనగరం టౌన్: ఆ యువకుడికి చిన్ననాటి నుంచి సినిమా రంగం అంటే మక్కువ. కెమెరామెన్, దర్శకునిగా ఎదగాలని కలలు కనేవాడు. ఎక్కడ షూటింగ్ జరుగుతుందన్నా పరుగులెత్తేవాడు. అదే ఇష్టంతో ఇప్పుడు షార్ట్ఫిల్మ్లు తీసే స్థాయికి ఎదిగాడు. చక్కటి సందేశాత్మక చిత్రాలు చిత్రీకరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ కోనసీమ కుర్రోడే చిట్టి. పశ్చిమగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి విజయనగరం వచ్చి స్ధిరపడ్డాడు. అన్ని ప్రాంతాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో తన ఊర్లో ఉన్న పచ్చళ్ల వ్యాపారాన్ని ఇక్కడ ప్రారంభించాడు. గ్రామగ్రామాలు తిరిగి వ్యాపారాన్ని చేస్తూ, మంచి లోకేషన్లను కనిపెట్టాడు. మరోవైపు విజయనగరం, విశాఖలలోని పలు శిక్షణ కేంద్రాల్లో ఫొటోగ్రఫీ, కంప్యూటర్స్లో వెడ్డింగ్ ప్రీమియర్స్, యానిమేషన్స్ కోర్సులను నేర్చుకున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా, కెమెరామెన్గా రాణిస్తున్నాడు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. త్రీజీ లవ్తో క్రేజీ త్రీజీ లవ్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాకేష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రంగీలా’తో పాటు ‘గౌరీ విత్ ఘోస్ట్ హర్రర్ సిని మాకు అసోసియేట్ కెమెరామెన్గా పనిచేశా డు. హంటడ్ బంగ్లా పార్ట్–1,2, ఘోష్ట్ ఫ్రెండ్, ప్రేమ, ఎంసీఏ విద్యార్థుల నిరుద్యోగంపైన, జప్పా ఎఫ్ఎం పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్లు చిట్టికి మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం.. సినీ పరిశ్రమ విశాఖ కు చేరువయ్యే రోజు లు దగ్గర్లోనే ఉన్నా యి. అందుకే విశాఖలో ఫోటోస్టూడియో రన్ చేస్తూ విజయనగరం నుంచి విశాఖ, అక్కడ నుంచి హైదరా బాద్ వరకూ వెళ్తూ షార్ట్ఫిల్మ్లు చేస్తున్నా ను. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. దర్శకునిగా ఎదగాలన్నది లక్ష్యం. – చిట్టి, కెమెరామెన్ -
'సిని'వారం
ప్రతి శనివారంషార్ట్ఫిల్మ్ల ప్రదర్శన సైన్స్ సెంటర్లో మినీ థియేటర్ కొత్త దర్శకులకు ప్రోత్సాహం వచ్చే నెలలో ప్రారంభం రవీంద్రభారతి తరహాలో వరంగల్లో వేదిక సాక్షి ప్రతినిధి, వరంగల్: షార్ట్ఫిల్మ్ మేకింగ్, సినీరంగంపై ఆసక్తి , సృజనాత్మకత ఉన్న వారు తమ ప్రతిభను చాటుకునేందుకు వరంగల్లో వేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో విజయవంతమైన సినివారం కార్యక్రమాన్ని వరంగల్లో ప్రారంభించనున్నారు. తెలుగు మహసభల ప్రారంభోత్సవ సమయానికల్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కొత్త టాలెంట్ను వెతికేందుకు.. కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ సినివారం కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తోంది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు షార్ట్ఫిల్మ్లను ప్రదర్శిస్తున్నారు. 2016 నవంబరు 12న ఈ సినీవారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు వందకు పైగా షార్ట్ఫిల్మ్లను ఇక్కడ ప్రదర్శించారు. వీటిని చూసేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ షార్ట్ఫిల్మ్లను చూడవచ్చు. ప్రదర్శన అనంతరం వాటిని రూపొందించిన వ్యక్తుల పరిచయం, షార్ట్ఫిల్మ్కి సంబంధించిన అంశాలపై వివరణ, కొత్త ఆలోచనలను వీక్షకులతో పంచుకోవచ్చు. కొత్త టాలెంట్ను వెతికి పట్టుకునేందుకు సినీరంగానికి చెందిన ప్రముఖులు ఈ షార్ట్ఫిల్మ్లు చూసేందుకు వస్తున్నారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దీన్ని వరంగల్కు తీసుకువచ్చేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సుముఖంగా ఉన్నారు. వరంగల్లో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందింది. హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ సినీవారం కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధికారులు అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. హంటర్రోడ్డులోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఉన్న మినీ ఆడిటోరియాన్ని ఎంపి క చేశారు. షార్ట్ఫిల్మ్ ప్రదర్శించేందుకు, తిలకించేం దుకు వీలుగా ఇందులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంబంధి త శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా రు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం నాటికి వరంగల్లో సినీవారం కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్లో పర్యాటక ప్రాంతాలు, చారిత్రక నేపథ్యం, ఎంజీఎం ఆస్పత్రి ఈ మూడు అంశాలపై షార్ట్ఫిల్మ్ పోటీలు పెట్టనున్నారు. చక్కని వేదిక.. కొంత కాలంగా వరంగల్ నుంచి అనేక మంది కొత్త తరం దర్శకులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అనేక మంది సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వెలుగులోకి రాకుండా తమ ప్రయత్నాలను కొనసాగించేవారు ఎందరో ఉన్నారు. వీడియో కెమెరాలు, నాణ్యతతో వీడియో తీసే మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ కారణంగా ఎడిటింగ్, మిక్సింగ్ వంటి ఎన్నో సేవలు సులభంగా లభిస్తుండడంతో షార్ట్ ఫిల్మ్ తీసేవారి సంఖ్య పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా దాదాపు 40 బృందాలు రెగ్యులర్గా షార్ట్ఫిల్మ్ తీస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ యూట్యూబ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా మలుచుకుని ప్రతిభను చాటుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో షార్ట్ఫిల్మ్లు ఇందులో అప్లోడ్ అవుతుండడంతో గుర్తింపు సాధించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో సినీ, టీవీ రంగాలకు సంబంధించిన ప్రధాన వేదికల్లో ప్రదర్శన చేసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న ప్రతిభా వంతులకు సినీవారం కార్యక్రమం చక్కని వేదిక కానుంది. -
వెండితెరకు యూట్యూబ్ టీమ్
తమిళసినిమా: సాధారణ చిత్రాలతో నేటి యువతను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. కారణం సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధితో పాటు, యువతలో మారుతున్న అభిరుచి, అంచనాలను రీచ్ అవ్వాలంటే కచ్చితంగా కొత్తదనం అవసరం అవుతోంది. ఇటీవల యూట్యూబ్లో సరికొత్త కాన్సెప్ట్స్తో యువత లఘు చిత్రాలతో విపరీతంగా అలరిస్తున్నారు.అలా ఎరుమ్ సాణి లాంటి షార్ట్ ఫిలింస్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న యూట్యూబ్ టీమ్ తాజాగా వెండితెరపై తమ సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆ టీమ్లో రమేశ్ వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు పేరుతో ఒక వినోదభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీన్ని క్లాప్ బోర్డు పతాకంపై వి.సత్యమూర్తి నిర్మిస్తూ, కథానాయకుడిగా పరిచయం కానున్నారు. విజయ్, హారిజ, ఆర్జే.విక్కీ, గోపీసుధాకర్, షారాఅగస్టియన్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, కథానాయకుడు మాట్లాడుతూ తన టీమ్పై చాలా నమ్మకం ఉందన్నారు. ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రంతో విజయం సాధిస్తామినే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిత్రాన్ని డిసెంబర్లో ప్రారంభించనున్నామని, సమ్మర్ స్పెషల్గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. దీనికి కౌశిక్ రవి సంగీతాన్ని, జోశ్వా జే.ఫిరోజ్ ఛాయాగ్రహణం అందించనున్నారని ఆయన తెలిపారు. -
ఎన్టీఆర్, రాజమౌళి... ఓ సైబర్ క్రైమ్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో బ్లాక్ బస్టర్లను అందించిన విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత జక్కన్న కొత్త చిత్రం ఏది? అన్న ప్రశ్న మొదలైనప్పుడు ఎన్టీఆర్ తో కూడా అన్న పేరు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఓ సదుద్దేశం కోసం వీరిద్దరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రాను రాను పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు, వాటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగర క్రైమ్ బ్రాంచ్ సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించబోయే షార్ట్ ఫిల్మ్లలో ఈ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలిద్దరూ భాగస్వాములు కాబోతున్నారు. లఘు చిత్రాలకు ఎన్టీఆర్, రాజమౌళిలు స్వచ్ఛందంగా వాయిస్ ఓవర్ అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే తారక్ తన పని పూర్తి చేయగా, తన గొంతుకను అందించటంతోపాటు ఆయా చిత్రాల్లో చిన్న చిన్న మార్పులను సూచించేందుకు రాజమౌళి రెడీ అయిపోయాడు. వీటిని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, షాపింగ్ మాల్, టీవీలలో త్వరలో ప్రదర్శితం చేయనున్నారు. -
థియేటర్లలో లఘు చిత్రాలు
థియేటర్లలో లఘు చిత్రాల ప్రదర్శన ఇప్పటివరకూ జరగలేదు. అలాంటిది భారతదేశంలోనే తొలిసారిగా ఐదు ఉత్తమ లఘు చిత్రాల ప్రదర్శనకు తమిళనా డులో శ్రీకారం జరిగింది. మూవీ బ ఫ్, ఫస్ట్ క్లాప్ సంస్థలు సంయుక్తం గా గతేడాది డిసెంబర్లో నిర్వహించిన లఘు చిత్రాల పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. 250 లఘు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఐదు లఘు చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ ఐదు లఘు చిత్రాలు ఈ నెల 10 నుంచి ఏప్రి ల్ నెల 13వ తేదీ వరకూ తమిళనాడులో ని 150 థియేటర్లలో వారానికి ఒక లఘు చి త్రం చొప్పున క్యూబ్ సినిమా నెట్వర్క్ సంస్థ ప్రదర్శించనుంది. కాగా ఈ ఐదు చిత్రాల్లో ఆన్లైన్ కాంటెస్ట్లో అధిక ప్రజాదరణ పొం దిన మూడు చిత్రాల దర్శకులకు నటుడు సూర్య 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నగదు బహుమతులతో పాటు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించనుందని ఈ సంస్థ నిర్వాహకుడు సోమవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో 250 లఘు చిత్రాల్లో ఉత్తమ లఘు చిత్రాలుగా ఎంపికయిన అప్లాక్ చిత్ర దర్శకుడు ప్రదీప్ రంగనాథన్, ఇందనాళ్ ఇనియనాళ్ చిత్ర దర్శకుడు హహేశ్ బాలసుబ్రమణ్యం, అవళ్ అళగు చిత్ర దర్శకుడు శ్రీ విజయ్గణపతి, థింక్ అండ్ ఇంక్ చిత్ర దర్శకుడు నట్టుదేవ్, ఎన్నంగ సార్ ఉంగ చట్టం చిత్ర దర్శకుడు ప్రభు జయరామ్లతో పాటు దర్శకుడు జయేంద్ర, క్యూబ్ సినిమా నెట్వర్క్ నిర్వాహకుడు తదితరులు పాల్గొన్నారు. యువ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ లఘు చిత్రాల పోటీని నిర్వహించినట్లు మూవీబఫ్, ఫస్ట్ క్లాప్ సంస్థల నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఉన్నత విద్యను పూర్తి చేసి సినిమాపై ఆసక్తితో అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరిగిన తమకు ఈ లఘు చిత్రాల పోటీలు సినీరంగ ప్రవేశానికి మంచి మార్గం అవుతాయన్నారు. ఇప్పటికే తమ లఘు చిత్రాలను థియేటర్లలో చూసిన మిత్రులు, బంధువులు చాలా బాగున్నాయని అభినందిస్తున్నారని పోటీలో ఫైనల్కు చేరిన ఐదు లఘు చిత్రాల దర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
లఘుచిత్రోత్సవం నిర్వహించడం అభినందనీయం
పాలకొల్లులో డిసెంబర్లో అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం పాలకొల్లు టౌన్: కలలకు, కళాకారులకు పుట్టినిలై ్లన పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రాలను తీసేవారికి మంచి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు సమాజానికి మంచి సందేశం అందించడానికి క్షీరపురి అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంస్థ చేస్తున్న కషి అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య అన్నారు. పాలకొల్లులో ఆదివారం క్షీరపురి అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంస్థ ముత్యాల శ్రీనివాస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సినీ పరిశ్రమ హైదరాబాద్లో ఉన్నా అనేక సినిమాలు గోదావరి జిల్లాల్లో నిర్మించడం జరిగిందన్నారు. లఘు చిత్రాలు తీసి చలన చిత్రాల్లో ప్రఖ్యాతిగాంచిన దర్శకులు అనేమంది ఉన్నారన్నారు. సమాజ రుగ్మతలను, వ్యక్తి ప్రవర్తన, ఆలోచన విధానాలను మార్పు తీసుకురావడానికి లఘు చిత్రాలు ఎంతో దోహద పడతాయన్నారు. ఇటువంటి లఘు చిలన చిత్రోత్సవాలను నిర్వహించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్న కమిటీని వారు అభినందించారు. మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత డీసెంట్రలైజేషన్లో భాగంగా గోదావరి ప్రాంతాన్ని సినీ ఇండస్ట్రీ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కషి చేయవలసిన అవసరం ఉందన్నారు. పాలకొల్లులో నిర్మితమవుతున్న ఓపెన్ ఎయిర్ థియేటర్ కాంప్లెక్సులో ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమకు అవసరమైన నటులు, టెక్నిషియన్లకు శిక్షణ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వం దష్టికి తీసుకు వెళ్లి కషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీ లోపు షార్ట్ ఫిలిం ఎంట్రీలను పంపించి నమోదు చేసుకోవాలన్నారు. స్క్రూట్నీ అనంతరం ఎంపిక కాబడిన చిత్రాలను డిసెంబర్ 23వ తేదీన ప్రకటిస్తామని, అనంతరం ఫిలిం ఫెస్టివల్ తేదీని ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రోత్సవంలో ఎంపికైన షార్ట్ఫిలింలకు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.60వేలు, రూ.40వేలు, రూ.20వేలు నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. స్క్రూట్నీలో ఎంపికైన ప్రతీ షార్ట్ ఫిలింకు రూ.5వేలు ప్రోత్సాహక బహుమతి అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, డాక్టర్ కేఎస్పీఎన్ వర్మ, ఎం రాంప్రసాద్, ఆర్వీ అప్పారావు, బొక్కా రమాకాంత్, మేడికొండ రామదాసు, గొర్ల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. -
‘షీ–టీమ్స్’ షార్ట్ ఫిల్మ్స్ విడుదల
హిమాయత్నగర్: నగరంలో పోలీస్ శాఖతో సంబంధం లేకుండా జరిపిన సర్వేలో 76 శాతం మంది మహిళలు ‘షీ టీమ్స్’ వల్ల ధైర్యంగా జీవిస్తున్నామని తెలిపారని నగర కమిషనర్ మహేందర్రెడ్డి అన్నారు. మహిళలకు ‘షీ టీమ్స్’పై మరింత అవగాహన కల్పించేందుకు లిటిల్ మ్యూజిక్ ఫౌండేషన్ మ్యుజిషీయన్ రామాచారి, షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ జయభారత్, డబ్బింగ్ ఆర్టిస్ట్ వంశీ నటించి, నిర్మించిన మూడు షార్ట్ ఫిల్మ్స్ ను గురువారం బషీర్బాగ్లోని పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ మహేందర్రెడ్డి ఆవిష్కరించారు. తొలి సీడీని అడిషనల్ కమిషనర్ క్రైమ్ స్వాతిలక్రా, అడిషనల్ సీపీ అడ్మిన్ మురళీకృష్ణ, ట్రాఫిక్ కమిషనర్ జితేందర్, ఎస్బీ జాయింట్ కమిషనర్ ప్రమోద్కుమార్, అడిషనల్ డీసీపీలు అవినాష్మహంతి, రంజన్లకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... నగరంలో మహిళల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నగర వ్యాప్తంగా రెండేళ్ల క్రితం 100 షీటీమ్స్ను ప్రారంభించిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు షీటీమ్స్ బస్టాప్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ నిఘాను ఏర్పాటు చేసి వీడియో రికార్డింగ్ సహాయంతో ఈవ్టీజర్స్ను పట్టుకున్నారన్నారు. నగరంలోని మహిళలకు ‘షీ టీమ్స్’ అభయహస్తంగా పని చేస్తున్నాయన్నారు. మొదటి రెండుసార్లు తప్పుచేసిన వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామని, మళ్లీ వారు తప్పు చేస్తే జైలుకు పంపుతున్నామన్నారు. షీటీమ్స్పై స్త్రీలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ వీడియోలు, ఆడియోలు రూపొందించారన్నారు. స్వాతిలక్రా మాట్లాడుతూ... నిమిషం నిడివి గల ఈ మూడు వీడియోలు అన్ని సినిమా థియేటర్స్లో ప్రదర్శిస్తామని, ఆడియో క్లిప్పింగ్లు ప్రతీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్లే అవుతాయన్నారు. వేధింపులకు గురయ్యేవారు నిర్భయంగా తమను వేధించేవారిపై షీటీమ్స్కు ఫిర్యాదు చేయొచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్వాతిలక్రా భరోసా ఇచ్చారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ నంబర్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ‘షీ టీమ్స్’ ఏసీపీ కవిత పనితీరును మొచ్చుకుంటూ కమిషనర్ మహేందర్రెడ్డి జ్ఞాపికను అందచేశారు. ఈ షార్ట్ఫిల్్మలకు సహకారం అందించిన రామాచారి, జయభారత్, వంశీలను సత్కరించారు. -
సందేశాత్మకం
నిర్మల్ రూరల్ : ‘అయ్యో..! నాడబ్బులు పోయాయి.. ఇప్పడిదిప్పుడే నా ఏటీఎం కార్డు మార్చేసిండ్రు. నా అకౌంట్లో ఉన్న పైసలన్నీ డ్రాజేసి ఎత్తుకెళ్లిండ్రు.. ఇదెక్కడి అన్యాయం..’ ఇది ఏటీఎం మోసగాళ్ల బారిన పడ్డ ఓ బాధితుడి ఆక్రందన. ‘ఇప్పుడేం చేయాలిరా దేవుడా..! ‘మేం అడిగిన వివరాలు చెబితే.. మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి’ అని కాల్ చేశారు.. ఊరికే కాసులు వస్తాయని కక్కుర్తిపడి ఉన్న విషయాలన్నీ చెప్పిన. ఇప్పుడు నా ఖాతాలో నుంచే ఉన్న డబ్బులు ఖాళీ చేసిండ్రు. ఎవరికి చెప్పుకోను నా గోస.. అంటూ ఫేక్కాల్ బారిన పడ్డ బాధితుడి ఆవేదన ఇలా నిత్యం సమాజంలో ఎన్నో నేరాలు, మరెన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అవగాహన లేక కొందరు.. అత్యాశ, అమాయకత్వంతో మరికొందరు మోసగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. ఇలాంటి వాటిపై ఏదైనా చేయాలి.. సమాజంలో జరుగుతున్న నేరాలపై కళ్లకు కట్టించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్న తలంపుతో షార్ట్ల్మ్స్కు శ్రీకారం చుట్టాడు కాండ్రె రాంరాజ్. పట్టణంలోని బేస్తవార్పేట్కు చెందిన కాండ్రె సుష్మ, ప్రేంరాజ్ దంపతులు కుమారుడైన రాంరాజ్ చదువు పూర్తికాగానే కెమెరా చేతపట్టాడు. వీడియోగ్రఫీపై ఇష్టంతో ఆ ఫీల్డ్లోకి అడుగుపెట్టాడు. బతుకుదెరువుకు ఉపయోగపడుతున్న ఈ వీడియోగ్రఫీని సమాజ శ్రేయస్సుకూ ఉపయోగించాలకున్నాడు. నేరాలు, ఘోరాలపై తన ఆలోచనలకు స్థానిక పోలీసుల నుంచి పూర్తి సహకారం అందడంతో రంగంలోకి దిగాడు. వరుసగా షార్ట్ఫిల్మ్స్.. నిర్మల్ డీఎస్పీ మనోహర్రెడ్డి, పట్టణ సీఐ జీవన్రెడ్డి, ఎసై ్సల సహకారం, సూచనలతో తన స్క్రిప్ట్లను తెరకెక్కించాడు. రోడ్డుభద్రత వారోత్సవాల నేపథ్యంలో ‘హెల్మెట్’పై షార్ట్ఫిలిమ్ తీశాడు. హెల్మెట్ ధరించడం వల్ల లాభం.. లేకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటో దీని ద్వారా వివరించాడు. దీన్ని స్థానిక ఛానల్స్లో ప్రసారం చేయడం, ప్రజల్లో మంచి రెస్పాన్స్ రావడంతో రెట్టింపు ఉత్సాహంతో రాంరాజ్ మరిన్ని రచనలు సిద్ధం చేశాడు. మళ్లీ పోలీసులు పూర్తిసహకారం అందించారు. వరుసగా రోడ్డుభద్రత, ఏటీఎంలలో మోసాలు జరుగుతున్న తీరు, ఫేక్కాల్స్, ఆన్లైన్ మోసాలు.. ఇలా పలురకాల నేరాలపై చిన్నచిత్రాలను, ఆడియో, వీడియో సీడీలను రూపొందించాడు. ఈ చిత్రాలు సహజంగా వచ్చేందుకు స్థానిక పోలీసులనే పాత్రధారులుగా ఎంచుకోవడం గమనార్హం. వీటితో పాటు పలు ఇతర షార్ట్ఫిలిమ్స్నూ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు తనతో పాటు జి.రాజశేఖర్, మహేశ్, లక్ష్మణ్, సాయిసింగ్, గోపివర్మ, కపిల్రాథోడ్, అఖిల్, మురళీ, గాయకుడు ఎలిశెట్టి సుదర్శన్ల సహకారంతో ముందుకు సాగుతున్నాడు. ప్రశంసించిన ఎస్పీలు.. పట్టణ పోలీసులు, రాంరాజ్ కలిసి రూపొందించిన సందేశాత్మక షార్ట్ఫిలిమ్స్ సీడీలను గత ఎస్పీ తరుణ్జోషి, ప్రస్తుత ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ ఆవిష్కరించారు. వీటిని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిత్రీకరించిన రాంరాజ్ను ఇద్దరు ఎస్పీలూ అభినందించారు. శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలనూ అందించారు. పట్టణంలోనూ డీఎస్పీ, సీఐ, ఎసై ్సలు రాంరాజ్ అండ్ టీమ్ను ఘనంగా సన్మానించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సైతం రాంరాజ్ తీసిన సందేశాత్మక షార్ట్ఫిల్మ్స్ను ప్రశంసించారు. ప్రజోపయోగం ఉన్న వీటిని ప్రస్తుతం లోకల్ ఛానల్స్లో ప్రసారం చేస్తుండడం విశేషం. వినూత్నంగా చేయాలని.. నేను ఎంచుకున్న వీడియోగ్రఫీ ఫీల్డ్లో ఉంటూనే సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకున్నాను. అందుకే చేతిలోని కెమెరాతోనే వినూత్నంగా ముందుకు వెళ్లాలనుకున్నాను. నా కాన్సెప్ట్స్కు పట్టణ పోలీసుల సహకారం లభించడం, వారూ కొన్ని సూచనలు చేయడంతో సందేశాత్మక షార్ట్ఫిల్మ్స్ రూపొందించాను. ఇద్దరు ఎస్పీలు, మరెందరో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడం చాలా సంతప్తినిచ్చింది. మున్ముందు మరిన్ని చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినిచ్చింది. కాండ్రె రాంరాజ్, షార్ట్ఫిల్మ్స్ డైరెక్టర్ ఈ ‘దాహం..’ తీరనిది.. నిర్మల్ రూరల్ : సకల ప్రాణకోటికి జీవనాధారం నీళ్లు. ప్రస్తుతం ఆ నీళ్లని అవసరానికి మించి వాడుతున్నం. కానీ కొన్ని గ్రామాలు తాగడానికి నీళ్లు దొరకక ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాంటి ఓ గ్రామం కథే ఈ.. ‘దాహం’ అంటూ 7నిమిషాల 30సెకన్లలోనే.. ఒక్క ముక్కమాట లేకుండా.. కేవలం హావభావాలతో నీళ్లకున్న ప్రాధాన్యం, నీటిచుక్క లేక ప్రాణం విడుస్తున్న అడవిపల్లెల గుండెచప్పుడును కళ్లకు కట్టించారు. ఆ పల్లెల దాహం తీరుతుందో.. లేదో.. తెలియదు. కానీ.. సమాజానికి ఏదో చేయాలన్న ఈ ‘నలుగురు’ కుర్రాళ్ల దాహం మాత్రం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఫ(ఫో)ర్ ది పీపుల్.. ఏదైనా చేయాలి చుట్టూ ఉన్న ప్రజా సమస్యలు.. దేశంలోని సమకాలీన పరిస్థితులే వారి చిత్రాలకు మూలాలు. మొదట నలుగురు కలిసి నలుగురికి ఉపయోగపడేలా.. ఫ(ఫో)ర్ ది పీపుల్ అని ఓ బ్యానర్ పెట్టుకుని ముందడుగేశారు. ఇందుకు మూలకారకుడు హరిచరణ్. నిర్మల్లోని బుధవార్పేట్కు చెందిన మౌర్య ఇందిరవదన, పార్థసారథి దంపతుల కుమారుడైన మౌర్య హరిచరణ్ బీఎఫ్ఏ పూర్తిచేశాడు. నిత్యం ఏదో సామాజిక అంశంపై హరిచరణ్, ఆయన స్నేహితులు బారడ్ గౌరవ్, తూము సంపత్, బారడ్ సౌషిల్లు చర్చించేవారు. ఇలా మాటలతోనే కాలం గడిపితే ఏం లాభం.. అన్న ఆలోచనల్లో నుంచి పుట్టిందే షార్ట్ఫిల్మ్ రూపకల్పన. ‘దాహం’తో మొదలు హరిచరణ్ రచన, కథ, కథనం.. ఎలా చేయాలో పూర్తిగా సిద్ధం చేశాడు. ఇందుకు స్నేహితులతో పాటు కళాకారుడు మహేశ్ చేతులు కలిపాడు. ముందుగా జిల్లాలో వేసవి వస్తే నీళ్లచుక్క కోసం తల్లడిల్లే గోండుగూడేల గోడును తెరకెక్కించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ‘దాహం’ పేరుతో కేవలం 7నిమిషాల నిడివిలోనే అర్థవంతమైన చిన్నచిత్రాన్ని రూపొందించారు. ఎలాంటి మాటలు లేకున్నా ఆద్యంతం హావభావాలతోనే సాగిన ఈ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్లో ‘దాహం నిర్మల్’ పేరుతో అప్లోడ్ చేసిన ఈ షార్ట్ఫిల్మ్ వేలాది వీక్షకులను ఆకట్టుకుంటోంది. జాతి పతాక గౌరవం.. జనగణమన హరిచరణ్ అండ్ టీమ్ తెరకెక్కిస్తున్న రెండో షార్ట్ఫిల్మ్ జనగణమన. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిన్నచిత్రం ఆగస్ట్15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలయ్యింది. దేశంలో ఎన్ని కులాలున్నా.. ఎన్ని మతాలున్నా.. అందరూ చేతులెత్తి సెల్యూట్ చేసేది ఒక్క మువ్వన్నెల జెండాకే.. అన్న సందేశంతో దీన్ని చిత్రీకరించారు. ఇటీవల కశ్మీర్లో జాతీయజెండాకు అవమానం జరగడం, భిన్నత్వంలో ఏకత్వం.. ఇలాంటి సామాజిక, సమకాలీన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడైన హరిచరణ్ పేర్కొన్నాడు. మున్ముందు మరిన్ని.. తమదైన శైలిలో సమాజానికి మెసేజ్ ఇవ్వాలన్న లక్ష్యంతో హరిచరణ్ మిత్రబృందం ఆలోచనలు చేస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడుతున్న ఈ యువత.. తమ చిత్రాలకు తాము సంపాదించిన డబ్బులనే పెట్టుబడిగా పెడుతోంది. రూపాయి కూడా ఆశించకుండా సమాజం కోసం నిస్వార్థంగా తమవంతు కృషిచేస్తామంటోంది. మౌర్య హరిచరణ్, షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ ఏదో చేయాలి.. ఏదో సాధించాలి.. అన్న తపనే మమ్మల్ని షార్ట్ఫిల్మ్ప్ వైపు నడిపించింది. దాహం చిత్రం మాకు చాలా పేరుతెచ్చింది. మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇదే ఊపుతో జనగణమన రూపొందించాం. మున్ముందు పెద్ద సినిమా స్థాయికి ఎదగాలని, జనాలందరికీ మా సందేశం అందించాలన్నదే మా లక్ష్యం. -
షార్ట్ కట్... హిట్ కొట్టు!!
‘‘జీవితంలో షార్ట్ కట్లు తీసుకోకూడదు.. జర్నీ ఎంత లాంగ్ అయితే అంత గొప్పవాడివి అవుతావ్.. అసలు, జర్నీని ఎంజాయ్ చేయవోయ్.. లక్ష్యం గురించి ఎందుకు ఆలోచిస్తావ్..’’ ఇది కదా మన పెద్దలు మనకు చెప్పింది. ఇప్పుడు షార్ట్ కట్లోనే లాంగ్ జర్నీ కొట్టేస్తున్నారీ కొత్త డెరైక్టర్లు. షార్ట్ ఫిల్మ్ చేసి పెద్ద సినిమాకి చాన్స్ కొట్టేస్తున్నారు. ఆ ‘షార్ట్ కట్.. హిట్ కొట్టు’ కహానీ ఇది. డైరెక్టర్ కావాలనుందా? అయితే, ముందు మీ టాలెంట్ చూపించేలా ఓ షార్ట్ ఫిల్మ్ తీయండి. తీసి యూట్యూబ్లో పెట్టండి. లేదంటే ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపండి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడానికి షార్ట్ ఫిల్మ్స్... ఓ షార్ట్ కట్! మీ షార్ట్ ఫిల్మ్ బాగుంటే... ఫేమస్ అయితే... ఇండస్ట్రీ నుంచి పిలుపు వస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఓ ఐదు వేలు కూడా లేవనుకుంటున్నారా? చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. ఫోనుతోనే మీ షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి టాలెంట్ చూపించండి. ఏళ్లకు ఏళ్లు ఓ డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్గా పని చేస్తేనేడైరెక్టర్ అవుతారనేది ఒకప్పటి మాట. షార్ట్ ఫిల్మ్స్తో సత్తా చాటి లాంగ్ ఫిల్మ్స్ తీసిన దర్శకులున్నారు. ఇటీవల టాలీవుడ్లో హిట్ హిట్ హుర్రే అంటున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లాంగ్ జర్నీ... స్టార్ తిరిగింది రాజా నాన్న సీఏ, అన్నయ్య అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇంట్లో ఐఏఎస్ లేదా ఐపీఎస్ చదవమంటున్నారు. కానీ, సుజిత్ మనసంతా తెలుగు సినిమాపైనే ఉంది. 17 ఏళ్ల వయసులో నోకియా 6600 ఫోనుతో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. సుమారు 30 షార్ట్ ఫిల్మ్స్ వరకూ తీశారు. ఐదేళ్ల తర్వాత దర్శకుడిగా అవకాశం వచ్చింది. కానీ, షూటింగ్ మరో వారంలో మొదలవుతుందనగా నిర్మాతలు సారీ చెప్పారు. అనుకోని కారణాల వలన సినిమా ఆగింది. కానీ, సుజీత్ తన ఆశలు వదులుకోలేదు. రెండేళ్ల క్రితం యూవీ క్రియేషన్స్ సంస్థ సుజిత్కి ‘రన్ రాజా రన్’ తీసే అవకాశం ఇచ్చింది. ఈ సినిమాతో శర్వానంద్కి కొత్త ఇమేజ్ వచ్చింది. లవ్, కామెడీ మిక్స్ చేసిన క్యారెక్టర్స్ బాగా చేయగలడని పేరొచ్చింది. ‘రన్ రాజా రన్’తో సుజిత్ స్టార్ తిరిగింది. ప్రస్తుతం ప్రభాస్ కోసం ఆయన ఓ కథ సిద్ధం చేశారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రం నిర్మిస్తుందని సమాచారం. గాంధి ఎక్స్ప్రెస్ ‘ఖర్మరా దేవుడా.. బుద్దిగా ఏదో జాబ్ చేయకుండా సినిమా డెరైక్షన్ అంటాడేంటి వీడు’ - సాధారణంగా సినిమా డెరైక్షన్ అంటూ తిరుగుతుంటే ఇంట్లో పెద్దలు అనేమాట. కానీ, మేర్లపాక గాంధీకి ఆ సమస్య లేదు. తండ్రి మేర్లపాక మురళి మంచి రచయిత. అందుకని తనయుణ్ణి ఎంకరేజ్ చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘ఎక్స్ప్రెస్ రాజా’లతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు గాంధి. అంతకు ముందు గాంధీకి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేస్తున్న సమయంలో తీసిన ‘ఖర్మరా దేవుడా’ షార్ట్ ఫిల్మే. నిన్నటి వెన్నెల... రేపటి ఉయ్యాల కొత్త కుర్రాడు విరించి వర్మ చెప్పిన కథ నిర్మాత పి. రామ్మోహన్కి బాగా నచ్చింది. కానీ, సినిమా తీయగలడా? లేదా? చిన్న డౌట్. కుర్రాడి దర్శకత్వ ప్రతిభ తెలుసుకోవడానికి మరో కథతో షార్ట్ ఫిల్మ్ తీయమని అడిగారు. ఫిక్స్డ్ బడ్జెట్లో ‘నిన్నటి వెన్నెల’ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు విరించి వర్మ. రామ్మోహన్ మైండ్లో నో మోర్ డౌట్స్. ఆ కుర్రాడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ కథతో విరించి వర్మ తీసిన సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. సినిమా హిట్టు.. దర్శకుడు కూడా. ఆ జోష్తో రెండో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ప్రస్తుతం నాని ‘మజ్ను’కి దర్శకత్వం వహిస్తున్నారు. బంపర్ ఆఫర్ ‘సైన్మా’.. అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? తెలంగాణ యాసలో సినిమాని గట్లనే అంటారు మరి. ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ముందు షార్ట్ ఫిల్మ్స్తోనే కెరీర్ స్టార్ట్ చేశారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినా... ‘అనుకోకుండా’, ‘సైన్మా’లు సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్కి పిచ్చ పాపులారిటీ తెచ్చాయి. వాటితో టాలీవుడ్లో ఎంట్రీ దొరికింది. ‘సైన్మా’ చూసిన మంచు లక్ష్మీ, నిర్మాత రామ్మోహన్ తదితరులు ఎంకరేజ్ చేశారు. తరుణ్ తండ్రి స్వస్థలం వరంగల్. తరుణ్ పుట్టి పెరిగింది హైదరాబాద్లో. దాంతో తెలంగాణ యాస, భాషపై మంచి పట్టుంది. షార్ట్ ఫిల్మ్స్, సినిమాలో ఆ యాస, భాషలను ఉపయోగించారు. ఇటీవల విడుదలైన ‘పెళ్లి చూపులు’తో హిట్ అందుకున్నారీ హైదరాబాదీ. ఈ సినిమా విడుదల చేసిన డి.సురేశ్బాబు తన సురేశ్ ప్రొడక్షన్స్లో సినిమా చేయమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. భలే మంచి డెరైక్టర్ మనుషులే కాదు.. పుస్తకం, కుర్చీ, గడియారం, టీవీ, ఫోన్లూ షార్ట్ ఫిల్మ్లో పాత్రలే. అవి కూడా నటిస్తాయి. కావాలంటే.. శ్రీరామ్ ఆదిత్య తీసిన ‘ది కాన్స్పిరసీ’ షార్ట్ ఫిల్మ్ చూడండి. దీనికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. 10వ తరగతిలోనే శ్రీరామ్ ఆదిత్యకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇంజినీరింగ్లో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. మొత్తం ఎనిమిది షార్ట్ ఫిల్మ్స్ తీయగా.. రెండిటికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దర్శకత్వంపై మక్కువతో గూగుల్, ఫేస్బుక్ కంపెనీల్లో ఉద్యోగం మానేసి ఫిల్మ్ నగర్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టారు. కొంత స్ట్రగుల్ తర్వాత ‘భలే మంచిరోజు’ అవకాశం వచ్చింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన తర్వాత టాలీవుడ్కి మరో కొత్త దర్శకుడు వచ్చాడన్నారు. ‘శ్రీరామ్తో సీతామాలక్ష్మి’లో అనే షార్ట్ ఫిల్మ్లో ఈ దర్శకుడు నటించారు కూడా. ‘బేవార్స్’, ‘లవ్ ఫార్ములా 31’, ‘లూజర్’ ,‘తూర్పు పడమర’.. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు పవన్ సాధినేని. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో దర ్శకుడయ్యారు. నారా రోహిత్ హీరోగా తీసిన ‘సావిత్రి’ దర్శకుడిగా పవన్ సాధినేని రెండో సినిమా. సిద్దార్ధ్, అమలా పాల్ జంటగా నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా గుర్తుందా? సినిమాగా తీయక ముందు అది ఓ షార్ట్ ఫిల్మ్. ‘కాదలిల్ సొదప్పువదు ఎప్పడి’ అని తమిళంలో బాలాజీ మోహన్ తీసిన 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూసిన సిద్దార్ధ్ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. కథ కూడా షార్ట్ ఫిల్మ్ నుంచే తీసుకున్నారు. ‘మీకు మీరే మాకు మేమే’తో దర్శకుడిగా పరిచయమైన హుస్సేన్ షా కిరణ్ది షార్ట్ ఫిల్మ్స్ నేపథ్యమే. ‘నాన్నకు ప్రేమతో..’ సినిమా స్క్రిప్ట్ విభాగంలో వర్క్ చేశారీయన. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు తీస్తుండడం ఈ న్యూ ఏజ్ డెరైక్టర్స్ స్పెషాలిటీ. హీరోల పాత్రలను యువతరం తమను తాము చూసుకునే విధంగా మలుస్తున్నారు. ఎలాంటి కథలోనైనా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి హిట్స్ అందుకుంటున్నారు. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఫార్ములా సక్సెస్ అయితే దాన్ని చాలామంది ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ డెరైక్టర్స్ని ఆదర్శంగా తీసుకుని చిన్న చిత్రాల నుంచి పెద్ద చిత్రాలకు వచ్చేవారి జాబితా పెరుగుతుందని ఊహించవచ్చు. -
ఒక్క..చాన్స్!!
♦ షార్టఫిల్మ్స్ మేకింగ్లో రాణిస్తున్న యువత ♦ సొంతంగా చిట్టి చిత్రాల రూపకల్పన ♦ యూట్యూబ్లో అప్లోడింగ్ సినిమాలకు దీటుగా నిర్మాణం ♦ సినీ ప్రముఖులను ఆకట్టుకునే ప్రయత్నం వెండితెర అవకాశాలే లక్ష్యం వాళ్లంతా యువతరం.. వెండితెరలో అవకాశం కోసం ‘ఒక్క ఛాన్స.. ఒకేఒక్క ఛాన్స’ అంటూ అన్నపూర్ణ స్టూడియో.. పద్మాలయ స్టూడియో గేటు వద్ద కాపాలా కాయడం లేదు. ఏ దర్శ కుడి వద్దకో.. నిర్మాత వద్దకో వెళ్లి బతిమిలాడుకోవడం లేదు. భిన్నమైన ఆలోచ నలతో శరవేగంగా విస్తరిస్తున్న సామాజిక మాధ్యమాల్లో తమ సృజనను చాటు తున్నారు. చిన్న చిన్న డాక్యుమెంటరీ చిత్రాలతో వెండితెర అవకాశాలు వెతుక్కుంటూ రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఖర్చుకు సైతం వెనుకాడకుండా తమ భావనలకు అద్దం పట్టేలా చిట్టి చిత్రాలను రూపొందిస్తున్నారు. సృజనాత్మకతకు అద్దం పడుతూ నేటి..మేటి చిత్రాలు తీస్తున్న ఈ నవతరంపై ఆదివారం ప్రత్యేకం -శంషాబాద్ ఒకరికొకరు చేయికలిపితే కొండంత లక్ష్యమైనా చిన్నదై పో తుంది. అదే తలంపుతో చిత్రాల్లో కనిపించాలనే తపనతో శం షాబాద్లోని కొందరు యువకులు కలిసి చిన్న చిత్రాలు (షార్ట్ ఫిల్మ్స్) తీసి యూట్యూబ్లో పెడుతున్నారు. కాస్త ఆర్థిక వనరులున్న వారు నిర్మాతగా మారితే.. సృజనాత్మకత కలిగిన వారు దర్శకులుగా మారి కెమెరాల్లోకి ఎక్కిస్తున్నారు. నటలో తమ సత్తా చాటుకునేందుకు నటీనటులు కూడా ఉ న్నారు. ఇలా ఆయా రంగాల్లో వారివారి అభిరుచులకు అను గుణంగా ఓ బృందంగా ఏర్పడి సినిమాలు తీస్తూ ఔరా అని పిస్తున్నారు. శంషాబాద్ పట్టణానికి చెందిన కల్యాణ్శ్రీ వర్మ దర్శకుడిగా ఇప్పటికే యూట్యూబ్లో ఐదు చిత్రాలకు పైగా చేశాడు. అతని తోడుగా స్థానికంగా ఉండే శివదత్త సాయి సాయి ఐసిరి పేరిట నిర్మాతగా మారి ఆర్థిక వనరులు సమ కూరుస్తూ యూట్యూబ్ సినిమాల నిర్మాణం చేపడుతున్నారు. వీరితో పాటు సాయికిరణ్ దేశాయి, విక్రమ్ తలసీల, అభినవసాగర్ తదితరులు తమ నటనాకౌశలంతో ఇప్పటికే పలు చిత్రాల్లో మెప్పించారు. ప్రేమ భావనతో కూ డిన చిత్రా లే కాకుండా సామాజిక మార్పులకు సంబంధిం చిన చిత్రా లు సైతం రూపొందించారు. ఇటీ వల సాయి ఐసిరి ప్రొడ క్షన్పై శివదత్త సాయి నిర్మాతగా ‘ క్యామాన్’ పేరిట తీసిన చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్లో కూడా ప్రదర్శించి పలువురు సినీ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నారు. స్థానిక లొకేషన్లు.. అద్దె కెమెరాలు.. వీరు తమ స్నేహితుల ఇళ్లు.. స్థానికంగా ఉన్న చక్కటి లొకే షన్లను ఎంచుకొని షార్ట్ఫిల్మ్లను పూర్తి చేస్తున్నారు. కెమెరా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రతిరోజు మూడు, నాలుగు వేల రూపాయల అద్దెకు సైతం వెనుకా డకుండా మంచి కెమెరాలను వినియోగిస్తున్నారు.స్టూడియోల్లో డబ్బిం గ్, గ్రాఫిక్ వర్క్స్ కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాల నిడివి చిన్నదైనా పెద్దవాటికి ఏమాత్రం తీసి పోకుండా తీస్తున్న షార్ట్ఫిల్మ్స్ మేకింగ్ ఇప్పుడు యువత రానికి క్రేజీగా మారుతోంది. అంతిమ లక్ష్యం వెండితెరే.. షార్ట్ ఫిల్మ్స్తో హోరెత్తిస్తున్న యువత చివరి లక్ష్యం వెండితెర కు పరిచయం కావడమే. చిన్న చిత్రాలతో వెండితెరకు పరి చయమైన వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా యూట్యూబ్ వేదికగా తమ సృజనాత్మకతను బయపెడుతున్నారు. సృజనాత్మకతకు వేదిక.. వెండి తెరపై దర్శకుడిగా మారాలన్న తపనకు ఈ షార్ట్ఫిల్మ్స్ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ వేదికగా మాలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయగలుగుతున్నాం. యూట్యూబ్లో మేం చేసిన సినిమా లను చూసి చాలామంది ప్రశంసించ డంతో ఉత్సాహం రెట్టింపవుతోం ది. అభిరుచి కలిగిన రంగం లో భవిష్యత్తును వెతుక్కోడానికి ఇదో వేదిక. - కల్యాణ్శ్రీ వర్మ, షార్ట్ఫిల్మ్ దర్శకుడు యువతకు ప్రోత్సాహం.. నటనా రంగంలో యువతలో ఉన్న ఉత్సాహానికి నా వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఎంతో కొంత ఆర్థిక వనరులు అవసరం. అందుకే సారి ఐసిరి ప్రొడక్షన్పై పలు షార్ట్ఫిల్మ్స్ నిర్మాణం చేపట్టాను. అనేకమంది యువత తమ సృజనాత్మకతను బయటపెట్టుకుంటున్నారు. - శివదత్తసాయి, నిర్మాత, సాయి ఐసిరీ ప్రొడక్షన్ -
చిన్న సినిమాకు పెద్ద ప్రోత్సాహం
చిత్రపరిశ్రమ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం తీర్మానాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సినిమా థియేటర్లలో రోజూ 5 ఆటలు ప్రదర్శించాలని, అందులో ఒక ఆటను చిన్న సినిమాకు కేటాయించాలని తీర్మానించింది. సాయంత్రం 4 గంటలకు ఈ చిన్న సినిమాను ప్రదర్శించాలని పేర్కొంది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలపై తీర్మానాలు చేసింది. సినిమా షూటింగ్లకు అనుమతిచ్చే విషయంలో జరుగుతున్న తాత్సారాన్ని నివారించాలని, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయాలని సబ్కమిటీ తీర్మానించింది. షూటింగ్ కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)కు దరఖాస్తు చేసుకుంటే పోలీసు, టూరిజం, ఫారెస్టు, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్కియాలజీ తదితర శాఖలను సమన్వయ పరిచి 48 గంటల్లోపు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఎన్వోసీ కాలపరిమితి పెంపు చిన్న నిర్మాతలు కోరుతున్నట్టుగా లో బడ్జెట్ చిత్రాలకు 35 స్క్రీన్స్ నుంచి 50కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సినిమా థియేటర్ల యాజమాన్యాలు రోడ్లు భవనాల శాఖ, అగ్ని మాపక శాఖల నుంచి పొందే నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కాలపరిమితిని 3 సంవత్సరాల నుంచి ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరహాలో హైదరాబాద్లో నిర్మించ తలబెట్టిన ప్రపంచస్థాయి ఇన్స్టిట్యూట్కు స్థల సేకరణ, విధి విధానాల తయారీ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారికి అప్పగించారు. థియేటర్లు లేని మండల కేంద్రాల్లో 200 సీట్ల సామర్థ్యం గల మిని కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే అనుమతించాలని ఉప సంఘం నిర్ణయించింది. సినీ కార్మికుల ఇళ్ల కోసం చిత్రపురి కాలనీని ఆనుకొని ఉన్న తొమ్మిదెకరాల స్థలం కేటాయింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. చిత్రపురి కాలనీలో రోడ్డు, ఆరోగ్యకేంద్రం, రేషన్షాపు, వైఫై సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది. ‘నంది’కి కొత్త పేరుపై కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ చలన చిత్రాలకు ఇచ్చే నంది అవార్డుల పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ‘నంది’కి బదులుగా ఏ పేరు పెట్టాలన్న అంశంపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఉత్తమ చలన చిత్ర అవార్డులకు పేరు సూచించే బాధ్యతను అప్పగించాలని సబ్కమిటీ నిర్ణయించింది. సమావేశంలో కేబినెట్ సబ్కమిటీ సభ్యులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, కేవీ రమణాచారి, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే బాబుమోహన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అజయ్మిశ్రా, రాజీవ్ త్రివేది, నవీన్మిట్టల్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందనరావు, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, దగ్గుబాటి సురేశ్బాబు, మురళీమోహన్, జి.ఆదిశే షగిరిరావు, శ్యాంప్రసాద్రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, రామ్మోహన్రావు, విజయేందర్రెడ్డి, కొమరం వెంకటేశ్ పాల్గొన్నారు. -
'బాబు బంగారం' యూత్కు కనెక్టయితే హిట్టే
సినీ దర్శకుడు మారుతి చిన్న సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు మారుతి. వరుసగా ఐదు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన తన సక్సెస్ సీక్రెట్ను చెప్పారు. యూత్ ఆలోచనలకు దగ్గరగా సినిమా ఉంటే హిట్టు గ్యారంటీ అని అన్నారు. ప్రస్తుతం తన పంథాను విడిచి పెద్ద హీరో అయిన వెంకటేష్తో ‘బాబు బంగారం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న మారుతి.. భట్లపాలెం బీవీసీ కళాశాలలో జరుగుతున్న హోరైజన్-2కే16 ముగింపు ఉత్సవాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - అమలాపురం రూరల్ ‘‘మచిలీపట్నంలో డిగ్రీ చదివాను. నేమ్ బోర్డులు తయారు చేసేవాడిని. కంప్యూటర్ యానిమేషన్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లాను. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈరోజుల్లో... బస్టాప్ వంటి లో బడ్జెట్ సినిమాలు తీశాను. అవి మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో నిలదొక్కుకున్నాను. నాదంటూ ట్రెండ్ ఏమీ ఉండదు. మనం తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్టయితే తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం హీరో వెంకటేష్తో ‘బాబు బంగారం’ సినిమా తీస్తున్నాను. షూటింగ్ ప్రోగ్రెస్లో ఉంది. త్వరలోనే యానిమేషన్ చిత్రాలు తీయాలనుకుంటున్నాను. దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్, జంధ్యాల, ప్రస్తుత తరంలో రాజమౌళి అంటే ఇష్టం. ఇక నాకంటూ ఓ స్టైల్ ఉంది. దానితోనే సక్సెస్ అవుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. వారితో కలిసి పనిచేశాను. కెరీర్లో స్థిరపడాలంటే యువత లక్ష్యం నిర్దేశించుకోవాలి. మనం ఏం చేస్తున్నా.. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సక్సెస్ అవుతాం.’’ -
సింగిల్ ఎక్స్
చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీసి డెరైక్టర్లవుతుంటే, టాప్ డెరైక్టర్ రామ్గోపాల్వర్మ ఇప్పుడు షార్ట్ ఫిలిం తీయడానికి సిద్ధమవుతున్నారు. ఆర్జీవీ టాకీస్ అనే నిర్మాణ సంస్థ పేరుతో షార్ట్ ఫిలిమ్స్ను తీయనున్నట్లు ఆయన తన ట్విట్టర్లో ప్రకటించారు. ‘‘ ‘సింగిల్ ఎక్స్’ పేరుతో ఓ ఎరోటిక్ థ్రిల్లర్ను మొదటి లఘు చిత్రంగా రూపొందిస్తున్నా. దీన్ని సెన్సార్ బోర్డ్కు అంకితమిస్తున్నా’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. రొమాంటిక్, హారర్ జానర్ లో ఎలాంటి చిత్రాలైనా రూపొందిస్తానని, అలాగని అడల్ట్ కామెడీలు, దేవుడి మీద , ఆటల మీద తాను సినిమాలు తీయబోనని ఆర్జీవీ స్పష్టం చేశారు. అయితే ఆర్జీవీ టాకీస్ను తన చిత్రాలకే పరిమితం చేయకుండా, ఇతరుల షార్ట్ ఫిలిమ్స్కు కూడా వేదిక కల్పిస్తానని వర్మ తెలిపారు. -
చిన్న చిత్రాలకు ప్రోత్సాహం
తొలి అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ ప్రారంభంలో మంత్రి చందూలాల్ సాక్షి, హన్మకొండ: చిన్న చిత్రాలు, లఘు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర గిరిజన పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం (షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్)ను శుక్రవారం వరంగల్లో మంత్రి ప్రారంభించారు. చందూలాల్ మాట్లాడుతూ వరంగల్లో ఇంటర్నేషన్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నం దుకు సంతోషంగా ఉందన్నారు. చిన్న చిత్రాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి త్వరలోనే నిర్ణయాలు వెల్లడిస్తామని ప్రకటించారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుద్రమదేవి నిర్మించానని, ఈ సినిమా తర్వాత గూగుల్లో రుద్రమదేవి, వరంగల్ నగరం గురించి రోజు సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. గూగుల్ సెర్చ్ రికార్డుల్లో దేశవ్యాప్తంగా రుద్రమదేవి పేరు మూడో స్థానంలో నిలిచిందన్నారు. 20 దేశాలు.. 144 షార్ట్ ఫిలిమ్స్ ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, జపాన్ తదితర ఇరవై దేశాలకు చెం దిన 144 షార్ట్ఫిల్మ్లను శని, ఆదివారం ప్రదర్శిం చనున్నారు. ఇందులో 70 విదేశీ చిత్రాలు ఉండగా, మిగిలినవి మన దేశానికి చెందిన లఘు చిత్రాలు. ప్రతీ చిత్రానికి సబ్టైటిల్స్ ఉంటాయి. ఈ చిత్రోత్సవంలో తెలంగాణ చరిత్ర, కోటలకు సంబంధించి మూడు లఘు చిత్రాలున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు చిత్రాలను ప్రదర్శిస్తారు. తొలిరోజు ప్రారంభ చిత్రంగా ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రపై తీసిని లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. జనవరి 8, 9, 10 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. -
పెద్ద దర్శకులు కూడా ఊహించలేకపోయారు!
‘‘ఈ చిత్రకథకు ఎస్టాబ్లిష్డ్ హీరోలు, విలన్లు, కమెడియన్లు అవసరం లేదు. రెగ్యులర్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, కామెడీతో సాగే మంచి కమర్షియల్ మూవీ. సక్సెస్పరంగా ఇప్పటివరకూ ఏ సినిమాకీ కలగనంత నమ్మకం ఈ సినిమాతో కలిగింది’’ అని సుధీర్బాబు అన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్బాబు, వామిక జంటగా విజయ్కుమార్, శశిధర్ నిర్మించిన ‘భలే మంచి రోజు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్బాబు మనోభావాలు... ► ఈ చిత్రనిర్మాతలు విజయ్, శశి నా కాలేజ్మేట్స్, అలాగే రూమ్మేట్స్ కూడా. కృష్ణగారికి విజయ్ పెద్ద ఫ్యాన్. ఆయన డైలాగ్స్ అప్పజెబుతుండేవాడు. హీరోగా నన్ను బాగా ప్రమోట్ చేయడం కోసమే వాళ్ళు ఈ సినిమా తీశారు. బడ్జెట్ ఎక్కువ పెట్టొద్దన్నప్పటికీ రాజీపడలేదు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నిటిలోకీ ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. ► శ్రీరామ్ ఆదిత్య చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూశాను. కేవలం కుర్చీలు, బల్లలు, ఫ్యాన్స్తో తను తీసిన ఓ థ్రిల్లర్ నాకు చాలా నచ్చింది. అందుకే తన దర్శకత్వంలో చేయాలనుకున్నాను. ► ఈ చిత్రకథను ఎంత పెద్ద దర్శకుల దగ్గర చెప్పినా, తర్వాతి సీన్ ఏమిటనేది ఊహించలేకపోయారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగే కథ ఇది. బెంజ్ షోరూమ్లో పని చేసే అబ్బాయి పాత్ర నాది. ఇంట్లో నుంచి బయటకెళ్లిన ఆ అబ్బాయి ఎలాంటి వ్యక్తులను కలుస్తాడు? తర్వాత జరిగే పరిణామాలేంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది. ► హీరోను కాకముందు నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విజయ్తో కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. హీరో ప్రభాస్కి వంశీ మంచి స్నేహితుడనే విషయం తెలిసిందే. వంశీ ద్వారా ప్రభాస్తో ఈ సినిమా గురించి చెప్పాం. పూర్తి సినిమా చూడలేదు కానీ, ప్రభాస్ దాదాపు చూసినట్లే. మహేశ్బాబు ఇంకా చూడలేదు. ‘ఈ సినిమా తర్వాత సుధీర్ స్టార్ హీరో అవుతాడు’ అని మహేశ్ అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నా మీద తనకంత నమ్మకం. ► ప్రస్తుతం హిందీలో ‘భాగీ’ అనే సినిమాలో విలన్గా చేస్తున్నాను. హీరోగా ఇప్పటివరకూ చేయనంత స్ట్రాంగ్ రోల్ అది. చెప్పాలంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు ప్రిపేర్ అయినట్లుగా ఈ సినిమా కోసం చాలా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యాను. -
శ్రుతీహాసన్ ఇసిడ్రో
ఇసిడ్రో అంటే ఏంటి? విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా? ఇదేమీ శ్రుతీహాసన్ కొత్త సినిమా టైటిల్ కాదు. ఈ పేరుతో శ్రుతి సొంతంగా బేనర్ మొదలుపెడుతున్నారు. షార్ట్ ఫిలింస్, డిజిటల్ ఫిలింస్ నిర్మించాలనుకుంటున్నారు. మ్యూజికల్గా కూడా ఏదైనా చేయాలనే ప్లాన్ ఆమెకు ఉంది. ‘సినిమా తప్ప మా కుటుంబానికి వేరే తెలియదు. సినిమా లేకపోతే మేం ఉండలేం’ అని శ్రుతి చెబుతుంటారు. అందుకే, నటిగా, గాయనిగా మిగిలిపోకుండా నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందు లఘు చిత్రాలు, డిజిటల్ మూవీస్తో మొదలుపెట్టి, ఆ తర్వాత వెండితెర కోసం కూడా సినిమాలు నిర్మిస్తారని ఊహించవచ్చు. వాస్తవానికి శ్రుతి చేతిలో ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా రంగంలోకి దిగాలనుకున్నారంటే పకడ్బందీగా ప్రణాళికలే వేసుకునే ఉంటారు. ఇంతకూ ‘ఇసిడ్రో’ అంటే అర్థం ఏంటంటే... ఆలోచనల పుట్ట. చూస్తుంటే శ్రుతి తన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించేటట్టే కనిపిస్తున్నారు. -
సిటీ టూర్.. ‘భంగ్’తో తీన్మార్
- నగరంపై డాక్యుమెంటరీస్ - యూ ట్యూబ్లో పెరుగుతున్న వీక్షకులు షార్ట్ ఫిల్మ్స్ ఎలాగైతే యువతకు ఫ్యాషన్గా మారుతున్నాయో.. నగరంలో కొంతమందికి డాక్యుమెంటరీస్ కూడా అలాగే హాబీగా మారిపోయాయి. వృత్తి వ్యాపకాలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. తమ అభిరుచి మేరకు డాక్యుమెంటరీలు రూపొందించడంలో సిటీజనులు బిజీ అయిపోతున్నారు. సహజంగానే ఈ డాక్యుమెంటరీలు విభిన్న అంశాలపై, సామాజిక స్పృహ పెంచేలా రూపొందిస్తుండడం స్వాగతించదగిన పరిణామం. భాగ్యనగరంలో కేవలం హైటెక్ సిటీని చూస్తే సరిపోదు.. చార్మినార్ను చుట్టొచ్చినంత మాత్రాన అయిపోదు.. నాలుగొందల ఏళ్ల చరిత్ర ఒకవైపు. కొత్తపుంతలు తొక్కే ఆధునికత మరోవైపు. ఒక్క మాటలో చెప్పాలంటే భిన్న పరిణామాల మేలు కలయిక హైదరాబాద్. ఎన్ని చూసినా చూడాల్సినవి మిగిలే ఉన్నాయి అనిపించే ఈ సిటీలో తప్పకుండా చూడాల్సిన వి, చేయాల్సినవి... చెప్తూ నగరవాసి రాజ్కిషోర్ రూపొందించిన ‘టెన్ థింగ్స్ టు డు ఇన్ హైదరాబాద్’ యూట్యూబ్లో ఇప్పటికే లక్షల సంఖ్యలో వీక్షకుల్ని సాధించింది. అదే ఊపులో నగరంలో హోలీ టైమ్లో వినియోగించే ‘భంగు’ మీద కూడా మరో డాక్యుమెంట్ను తీసి అప్లోడ్ చేశాడీ యువ ఈవెంట్ మేనేజర్. ఈ రెండు డాక్యుమెంటరీల విశేషాలు.. ‘భంగ్’ భళా నగరంలో శివరాత్రి, హోలీ వేడుకల్లో భాగంగా చాలామంది ‘భంగ్’ భళా అంటారనేది తెలిసిందే. ఆ సమయంలో బేగంబజార్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా లభించే ఈ భంగ్ అనే మత్తు పదార్థం.. విచిత్రమైన సంప్రదాయ సేవనంగా మారిపోయిందనే విషయాన్ని తెలియజేస్తూంది ఈ డాక్యమెంటరీ. అధికారికంగా షాపులు తెరచి మరీ ఈ భంగ్ను విక్రయించే విశేషాలను ఇది కళ్లకు కడుతుంది. హోలీ వేడుకల పరమార్థం తెలియకపోయినా, భంగ్ అనే మత్తు పదార్థం గురించి చెప్పమంటే ఉత్సాహం చూపే సిటీ యూత్ను మనం ఈ వీడియోలో కలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా భంగ్కు ఉన్న క్రేజ్, దక్షిణాదిలోనూ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వైనాన్ని వివరిస్తూ, దీనివల్ల కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను వైద్యుల ద్వారా చెప్పించారు. సిటీని చుట్టేస్తూ.. నగరంలోని బేగంబజార్ దగ్గర ప్రారంభమై హలీమ్ రుచి చూస్తూ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ విశేషాల్ని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది. నెక్లెస్రోడ్ సౌందర్యాన్ని వివరిస్తూ టాలీవుడ్ పై ఓ లుక్కేయిస్తుంది. లాడ్బజార్ గాజుల గలగలలు వినిపిస్తూ.. హుస్సేన్సాగర్లో కొలువైన బుద్ధుని చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తుంది. గోల్కొండ చరిత్రకు సలామ్ చేస్తూ.. చార్మినార్ విశిష్టతను కళ్లకు కడుతుంది. చివరగా చవులూరించే హైదరాబాద్ బిర్యానీకి అగ్రతాంబూలం ఇస్తుంది. మోడల్ సాత్విక ఈ డాక్యుమెంటరీలో సమర్పకురాలిగా వ్యవహరించారు. ‘సీదా జావ్, ఆగే ఛే’ వంటి సిటీలో తరచుగా వినిపించే పదాలను, సినిమా స్టార్ల పట్ల ఉండే వ్యామోహాన్ని సైతం సరదాగా స్పర్శిస్తూ డాక్యుమెంటరీ సాగిపోతుంది. ‘ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కోసం ఒక డాక్యుమెంటరీని.. యువత జీవితాల్లో భంగ్ వంటి మత్తుపదార్థాలు సంప్రదాయం పేరుతో తిష్టవేసిన వైనాన్ని వివరించడానికి మరో డాక్యుమెంటరీని తీశా’నంటారు రాజ్కిషోర్. మాదాపూర్లో నివసించే ఈయన వృత్తిరీత్యా ఈవెంట్ మేనేజర్. అయితే సహజంగా ఉన్న ఆసక్తితో ఫిల్మ్ అండ్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేశారు. రచయిత, దర్శకుడు, కెమెరా, ఎడిటర్ అన్నీ తనే అయి కేనన్ 5 డి కెమెరాతో ఈ డాక్యుమెంటరీలను రూపుకట్టానని చెప్పారు. -
100 రోజుల ప్రయాణం
లఘుచిత్రాలు అంటే.. ప్రేమ, కామెడీ వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఎంఆర్ ప్రొడక్షన్స్ విలువలతో కూడిన చిత్రాలను తీస్తూ వచ్చింది. వందో చిత్రంగా ‘ప్రయాణం’ లఘుచిత్రాన్ని 45 నిమిషాల నిడివితో తీసింది. వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ వందో చిత్రం.. ఏడు లక్షల మంది వీక్షకులను మూటగట్టుకుంది. మంచి సంభాషణలు, మంచి సంగీతం.. మేళవించిన ‘ప్రయాణం’ పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. ఈ పొట్టిచిత్రంతో పాతకాలపు విలువలను మరోసారి గుర్తుచేశారు యువ దర్శకులు సుభాష్, ధీరజ్రాజ్. నాయికా నాయకులకు సీతారాముల పేర్లను పెట్టారు. పల్లెటూరుకు వెళ్తే నిజమైన ప్రేమ విలువ తెలుస్తుందని సీతను అక్కడకు పంపిస్తుంది ఆమె తల్లి. తాను రామ్ని ప్రేమిస్తున్న విషయం పల్లెకు వెళ్లాక తెలుసుకుంటుంది సీత. పెళ్లిపీటల మీదకు చేరిన ఈ ప్రేమను అందంగా చూపించారు. అలనాటి పెళ్లి ముచ్చట్లతో సరదాగా సాగిపోతుందీ చిత్రం. కాలక్షేపానికి ప్రేమించడం, బ్రేకప్ చెప్పడం, మళ్లీ ప్రేమ, మళ్లీ బ్రేకప్.. జీవితమంటే ఇది కాదని ఈ చిత్రం ద్వారా చెప్పారీ దర్శకులు. - వైజయంతి -
ఈవినింగ్ విత్ షార్ట్ఫిల్మ్స్
రెండున్నర గంటల పెద్ద సినిమాలో కనిపించని ఎన్నో భావాలు పొట్టి చిత్రంలో తొంగిచూస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్గా నిలుస్తున్న నేటి యువత సామాజిక స్పృహను కలిగించే చిత్రాలు తీసి శభాష్ అనిపించుకుంటోంది. అలాంటి చిత్రాలను కొన్నింటిని ఎంపిక చేసి బంజారాహిల్స్ రోడ్నంబర్ 1లోని లామకాన్లో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రదర్శించనున్నారు. ‘ఎ షార్ట్ ఈవినింగ్ విత్ ఫిల్మ్స్-17’ పేరుతో ఆక్టోపస్ స్టూడియోస్ ఈ చిట్టి చిత్రాల ఈవెంట్ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. -
జర్మన్ మూవీ డే
రెండు జర్మనీ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ ఇందులో ప్రదర్శిస్తారు. మొదటిది కామిక్ డాక్యుమెంటరీ ‘రెసిప్స్ ఫర్ డిజాస్టర్’. జాన్ వెబ్స్టర్ దర్శకుడు. రెండోది ‘వెన్డర్ ఈజ్బర్గ్ కల్బ్’. సిల్వీ హాల్బమ్, గ్రేగర్ షుబర్ట్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ఇది. వేదిక: గోథెజెంత్రమ్, బంజారాహిల్స్ సమయం: ఈ నెల 8 ఉదయం 11.30 గంటలకు -
విచిత్రం
మంచి చెడుల విచక్షణ, బాధ్యతారాహిత్యం, బ్యాచులర్ లైఫ్ కామెడీ, పాజిటివ్ ఆటిట్యూడ్... నిత్యం ఎదురయ్యేవే. కానీ జీవితంలో జనం నిశితంగా పరిశీలించని అంశాలను దృశ్యకావ్యంగా మలిచారు ప్రసాద్. ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్గా పనిచేస్తూనే... ప్యాషన్తో డాక్యుమెంటరీస్ను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఆ షార్ట్ఫిల్మ్స్ పరిచయం క్లుప్తంగా.... నరత్వ: తన వరకూ వస్తే గానీ మంచి చెడుల గురించి ఆలోచించనితత్వం గురించి ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ప్రసాద్ ఆర్ భట్టు. ఎంతటి అఘాయిత్యానికైనా వెనుకాడని ఓ వీధి రౌడీ... తన అన్న కూతురు అంటే మాత్రం పంచప్రాణాలు ఇస్తాడు. జీవితంలో తను చేస్తున్న దారుణాల గురించి ఏనాడూ ఆలోచించని ఆ వ్యక్తి... ఆ చిన్నారి కొన్ని రోజుల పాటు తనతో మాట్లాడకపోవటం, అన్నం తినకపోవటం బాధ కలిగిస్తుంది. పాప మౌనానికి కారణం తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు. తన దుర్మార్గాలనుంచి బయటపడతాడు. ఏ డే ఇన్ ఎంప్లాయీస్ లైఫ్ తెల్లవారి లేచింది మొదలు, ప్రతి ఒక్కరి జీవితంలో పరుగులకు కారణం ఉద్యోగం. అయితే ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తున్న సమయంలో ఎన్ని బాధ్యతారహిత పనులు చేస్తుంటామో ఎప్పుడూ మనని మనం గమనించుకోము. తోటి వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించటం నుంచి, వాష్రూమ్లో ట్యాప్ కట్టేయక పోవడం వరకూ మన బాధ్యత కానట్లుగానే వుంటాం. ఈ చిన్న విషయాలు నేరాలు కావు. కానీ విస్మరించాల్సినవీ కావు. ఇలాంటి అంశాలనే కూర్చి బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు. కీ: బ్యాచులర్ లైఫ్లో జరిగిన ఒక చిన్న కామెడీ సంఘటన. విషయం పూర్తిగా వినకపోవటం వల్ల, ఫ్రెండ్ రమ్మన్న చోటుకి కాకుండా వేరే రూమ్కి వెళ్లిన అబ్బాయి గతి ఏమైంది? అనేది ఈ షార్ట్ఫిలిం కథ. సరదాగా సాగే ఈ షార్ట్ఫిలిం బ్యాచ్లర్స్ రూం కీని ఎక్కడ దాస్తారనే సీక్రెట్ని రివీల్ చేస్తుంది. చివరిదాకా చూస్తే కాస్త నవ్విస్తుంది కూడా. హోప్: ఉద్యోగవేటలో వున్న ఇద్దరు అబ్బాయిల గురించి సాగే కథ. అందులో ఒకరు ఆశావాది, మరొకరు నిరాశపరుడు. రెండు ఇంటర్వ్యూలకే విసుగెత్తి ఒకరు ఉద్యోగ ప్రయత్నాలు మానేస్తే, జాబ్ సాధించేదాకా ప్రయత్నం సాగించాలని మరొకరు యత్నిస్తారు. హోప్కి ఒక పాజిటివ్ యాంగిల్ ఇస్తుందీ చిత్రం. ఐకమత్యం: వేరు చేసే ఆలోచనలు, కలత నిండిన మనసులు ఐకమత్యాన్ని కూల్చేస్తాయి. దేశ సమైక్యతను చిన్నాభిన్నం చేస్తాయి. ఇంతటి గంభీరమైన విషయాన్ని చాలా సింపుల్గా చూపించారు దర్శకులు ప్రసాద్. ఆసక్తితోనే... ‘నారాయణ మూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక సినిమా తియ్యడానికి తాను పడిన తపన, కష్టం గురించి చెప్పారు. ఆయన మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఏ బ్యాక్గ్రౌండ్, సపోర్ట్, ట్రెయినింగ్ లేకపోయినా షార్ట్ మూవీస్ అయినా తియ్యాలని అనుకున్నాను. అలా ఇప్పటికి 10 సినిమాలకు పైగా తీసాను. కరీంనగర్ జిల్లా రామగుండం దగ్గర చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాకు ఫిలింమేకర్స్ ఎవరూ తెలియదు. అనుభవం కూడా లేదు. కేవలం ఆసక్తితో, ఫ్రెండ్స్ సహకారంతో జీరో బడ్జెట్లో సినిమాలు తీస్తున్నా’. - ప్రసాద్, షార్ట్ఫిలిం డెరైక్టర్ show time ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యుూత్లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెరుుల్ టు sakshicityplus@gmail.com -
షార్ట్ఫిల్మ్ ఫైల్ను షేర్లో ఉంచడం మరవొద్దు!
‘పూరి జగన్నాథ్ డెరైక్టర్ హంట్’కు తాము రూపొందించిన షార్ట్ఫిల్మ్స్ను అనేకమంది యువదర్శకులు సాక్షి మెయిల్ ఐడీకి పంపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గూగుల్ డ్రైవ్ ద్వారా పంపుతున్న వీడియోఫైల్ను సాక్షి మెయిల్ ఐడీకి షేర్ చేయవలసి ఉంటుంది. ఇలా షేర్ చేసిన వీడియోలను మాత్రమే నిర్ణేతలు డౌన్లోడ్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గూగుల్డ్రైవ్ ద్వారా పంపినవారు కూడా తమ వీడియోఫైల్స్ను షేరింగ్లో ఉంచారో లేదో గమనించాలి. అప్లోడ్ చేయడానికి నేడే చివరి రోజు! -
షార్ట్ఫిల్మ్ ఫైల్ను షేర్లో ఉంచడం మరవొద్దు!
‘పూరి జగన్నాథ్ డెరైక్టర్ హంట్’కు ఔత్సాహికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. పూరి ఇచ్చిన కాన్సెప్టులతో తాము రూపొందించిన షార్ట్ఫిల్మ్స్ను అనేకమంది యువదర్శకులు సాక్షి మెయిల్ ఐడీకి పంపిస్తున్నారు. తక్కువ పరిమాణంతో ఉన్న ఈ షార్ట్ఫిలిమ్ఫైల్స్ను జీమెయిల్ ద్వారా పంపవచ్చు. పరిమాణం విషయంలో జీమెయిల్ పరిధిని దాటితే జీమెయిల్తోనే అనుసంధానం అయిన గూగుల్డ్రైవ్ ద్వారా ఉచితంగానే పంపవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గూగుల్ డ్రైవ్ ద్వారా పంపుతున్న వీడియోఫైల్ను సాక్షి మెయిల్ ఐడీకి షేర్ చేయవలసి ఉంటుంది. ఇలా షేర్ చేసిన వీడియోలను మాత్రమే నిర్ణేతలు డౌన్లోడ్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గూగుల్డ్రైవ్ ద్వారా పంపినవారు కూడా తమ వీడియోఫైల్స్ను షేరింగ్లో ఉంచారో లేదో గమనించాలి. గడువు ఫిబ్రవరి 14 వరకే! అంటే... రేపే చివరి రోజు! (వివరాల కోసం జనవరి 2 నుంచి 11ల మధ్యన వచ్చిన సాక్షి ‘ఫ్యామిలీ’ సంచికలు చూడండి) -
సందేశమే చిత్రం
సమాజంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. అవగాహ లేక కొన్ని... ఆలోచన లేక కొన్ని... ప్రశ్నించేవారు లేక మరికొన్ని... సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. వీటిపై పోరాడాలనుకున్నాడు రాజశేఖర్రెడ్డి దొడ్డ. కానీ... తానొక్కడే ఎంత వరకు మార్పు తేగలడు! అందుకు తనముందున్న మార్గం దృశ్యమే అనుకున్నాడు. తద్వారానే కొంత మందినైనా ప్రభావితం చేయగలుగుతామనే ఆలోచన అతనిది. ఇంజనీరింగ్ పూర్తి చేసి నగరంలోని ప్రాసెస్ వీవర్ కంపెనీలో అసోసియేట్ డెవలపర్గా స్థిరపడ్డ రాజశేఖర్... సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్కు శ్రీకారం చుట్టాడు. ‘ఐయామ్ ఇండియన్ ప్రొడక్షన్స్’ను రెండేళ్ల కిందట నెలకొల్పి... దాని ద్వారా వీటిని చిత్రీకరించాడు. స్నేహితుడు శివనాగేంద్రతో పాటు మరో ముగ్గురు కలసి దీన్ని నడిపిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వం, కథ, మాటలు, స్క్రీన్ప్లేలో తీసిన మూడు చిత్రాల గురించి... - వీఎస్ జీవించు... సమస్యల్లో ఉన్నవారు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఓదార్చేవారు చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నా.. ఓ బలహీన క్షణంలో ఇలా నిర్ణయం తీసుకుంటున్నారు. సమస్యతో ఒత్తిడికి గురికాకుండా... ధైర్యంగా ఆ క్షణాన్ని అధిగమించాలనే సందేశాన్నిచ్చే చిత్రం ‘జీవించు’. శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదనే మార్గదర్శనం అందించేలా తీసిన ఈ లఘు చిత్రం నిడివి 12.4 నిమిషాలు. అధ్యక్ష ‘ఇంకెంత కాలం ఇలా’ అనే ట్యాగ్లైన్తో రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ వినూత్న కథనంతో సాగుతుంది. ప్రేమించిన అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేసే సమయంలో గొడవ జరుగుతుంది. అంతా అబ్బాయిదే తప్పంటారు. కొడతారు. మరో సన్నివేశంలో ఓ అమ్మాయి తనను ప్రేమించమని అబ్బాయి వెంట పడుతుంటుంది. ‘నాకు పెళ్లి కుదిరింది. వదిలెయ్’ అని చెప్పినా... అబ్బాయినే వచ్చి కొడతారు. అసలు విషయం తెలుసుకోకుండా... విచక్షణ మరిచి స్పందించవద్దనే కాన్సెప్ట్ ‘అధ్యక్ష’. ఎవరు తప్పు చేసినా అది తప్పే అనే చక్కని సందేశం ఇస్తుందీ ఫిల్మ్. ఇలాంటి విషయాల్లో ఆడవారే కాదు... మగవారూ బాధపడుతున్నారనేది రాజశేఖర్ అభిప్రాయం. లాస్ట్ నైట్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ కోసం కారులో బయలు దేరిన నలుగురు ఫ్రెండ్స్ మద్యం సేవిస్తుంటారు. నైట్ షిఫ్ట్లో ఆఫీసుకు వెళుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ను ఢీకొడతారు. కిందపడిన ఉద్యోగిని పట్టించుకోకుండా నవ్వుకుంటూ వెళ్లిపోతారా ఫ్రెండ్స్. తరువాత బర్త్డే స్పాట్కు చేరుకుంటారు. పాప కేక్ కట్ చేస్తుండగా ఓ అనాథ వచ్చి ఆకలేస్తుంది, ఏమైనా పెట్టండంటాడు. ఆ కుర్రాళ్లు కోపంగా అతడి ముఖానికి కేక్ పులిమి తోసేస్తారు. చివరకు వారూ తినక, అనాథకూ పెట్టక కేక్ వేస్టయిపోతుంది. కానీ ఆ పాప తన వద్ద ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు అనాథకు ఇస్తుంది. షర్ట్ పోయిన ఆ పిల్లాడికి రగ్గు కప్పుతుంది. ఇది చూసిన ఆ కుర్రాళ్లు సిగ్గుతో తలదించుకుంటారు. పాప చేసిన పని తామెందుకు చేయలేకపోయామని ఫీలవుతారు. పార్టీల్లో మునిగితేలుతున్న యువత మానవత్వాన్ని మరిచిపోతుందనే విషయాన్ని చక్కగా చెబుతుందీ చిత్రం. show time ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యుూత్లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com -
పూరి Idea-4
ఇప్పటికి మీకు మూడు కథలు చెప్పాను. ఈరోజు మాత్రం కథ చెప్పడంలేదు. ఓ ఐడియా చెబుతాను. ఇది 2015 సంవత్సరం కదా! నెక్ట్స్ ఇయర్ ఏం జరుగుతుందో ఓసారి ఊహించండి. కొంచెం కష్టమే అయినా, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదూ! అలా... పాతికేళ్ల తర్వాత అంటే 2040లో ఎలా ఉంటుందో ఊహించండి. 2040కి రోడ్లు ఎలా మారాయి... టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయింది... జనాలు ఏం చేస్తుంటారు.. లాంటివేమీ చూపించనవసరం లేదు. 2040లో ఓ ఇంట్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్లు ఎలా మాట్లాడుకుంటారో నాకు కావాలి. ఎలా బిహేవ్ చేస్తారో నాకు కావాలి. ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పులొచ్చాయి... పెళ్లిళ్లలో ఏవేం మార్పులొచ్చాయి... విధానాల్లో ఎటువంటి తేడాలొచ్చాయి. కొత్త దేవుళ్లు ఎవరైనా పుట్టుకొచ్చారా...! పాత దేవుళ్లలో ఎవరైనా తగ్గిపోయారా...! ఇవన్నీ డిస్కస్ చేసినా ఓకే.అయితే నాకు ప్రధానంగా కావలసింది... 2040లో మనుషులు ఎలా ఉంటారన్నదే! వాళ్ల కేరెక్టర్స్... వాళ్ల బిహేవియర్స్... వాళ్ల కాన్వర్జేషన్స్తో చక్కగా మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తే... నేను చూస్తా! ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ని directorsakshi@gmail.com కి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డైరెక్టర్ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్లో పెడతాం. దీంతో మీకు ఎక్స్పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. 10 డేస్...10 స్టోరీ ఐడియాస్ 10 మినిట్స్... నిన్న మూడో కథ చెప్పా. ఇవాళ నాలుగోది. ఇలా మొత్తం పది కథలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే ... నా బేనర్లో నేనే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డైరెక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా.. లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్ బహుమతులు అందించేవారు.. -
స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!!
-
స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!!
ఎక్కడున్నారు మీరంతా? 15 ఏళ్లుగా సిన్మా ఇండస్ట్రీలో ఉన్నా. వరుసగా సినిమాలు తీస్తున్నా. నాకన్నా తెలివైన వాళ్లు... నా నెక్స్ట్ జనరేషన్ వాళ్లు... చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడెక్కడో ఉన్నారు. ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ కావాలి. కొత్త ట్రెండ్ రావాలి. ఇండస్ట్రీ వెయిటింగ్. ఎక్కడున్నారు మీరంతా?! పది రోజులు.. పది స్టోరీలు.. పది నిమిషాలు.. అంటూ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యంగ్ టాలెంటును ఊరిస్తున్నారు. తాను పది రోజుల పాటు రోజుకో కథ చొప్పున ఇస్తానని, దాన్ని పది నిమిషాల షార్ట్ ఫిలింగా తీసి చూపించాలని అడుగుతున్నారు. లేకపోతే.. తాము తీసిన సినిమాలే చూడాల్సి వస్తుందన్నారు. 'సాక్షి'తో కలిసి తానీ టాలెంట్ సెర్చ్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్కు ఏమాత్రం కొరత లేదని, అందుకే ఎలాంటి డిజిటల్ కెమెరాతోనైనా షార్ట్ ఫిలిం తీయొచ్చని అన్నారు. ఏ కెమెరా చేతిలో లేకపోతే చివరకు ఐఫోన్తో అయినా సరే.. సినిమా తీసేయొచ్చని ఆఫర్ ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం.. స్టోరీ వినండి, కెమెరా పట్టుకోండి, షార్ట్ ఫిలిం తీసేయండి. రేపటి తరానికి మీరే కాబోయే టాప్ డైరెక్టర్!! -
ఐడియాతో వచ్చి పిక్చర్తో వెళ్లండి
చిన్న సినిమాలు తీయాలని, నటించాలని, టెక్నీషియన్స్ కావాలని స్వప్నిస్తున్నారా? మీ కలలను నిజం చేస్తోంది ఆక్టోపస్ స్టూడియోస్. నాలుగేళ్లుగా ధియేటర్ లవర్స్కి, షార్ట్ఫిల్మ్ మేకర్స్కు గైడ్గా వ్యవహరిస్తూ.. మంచి ఆలోచనతో వచ్చిన వారిని సక్సెస్ఫుల్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అయ్యే వరకూ కంటిన్యూయస్ సపోర్ట్ ఇస్తోంది. ఆక్టోపస్ స్టూడియోస్ ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్లు 16వ స్క్రీనింగ్ శుక్రవారం జరిగింది. ‘ద డార్క్ అండ్ బ్యూటిఫుల్’ (డీఐబీ) ఫొటోసిరీస్ ద్వారా ఆక్టోపస్ స్టుడియో బృందం శుక్రవారం సాయంత్రం లామకాన్లో ఫిలింల గురించి ‘షార్ట్ ఈవెనింగ్’ ఏర్పాటు చేశారు. తమ స్టుడియో సహాయ సహకారాలతో రూపొందిన అవార్డ్ విన్నింగ్ చిత్రాలు హేపీ బర్త్డే, గుత్తి-ద రిడిల్ ప్రదర్శించారు. ఆదర్శ్ బాలకృష్ణ, రవి కిరణ్ రాజు, నిజం పరి, అభిరూప్ బసు, సుదీప్ కుమార్ టి.జి, సామిక్, వాలి తదితరులు తాము రూపొందించిన షార్ట్ ఫిలింస్ సంగతులను అభిమానులతో ముచ్చటించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన మొత్తం 86 చిత్రాల నుంచి ఎంపిక చేసిన ఏడు చిత్రాలను ప్రదర్శించినట్లు ఆక్టోపస్ నిర్వాహకుడు రాహుల్ తెలిపారు. కాస్త టచ్లో ఉంటుంది.. షార్ట్ ఫిల్మ్లు రూపొందించాలనుకునే వారికి తగిన వాతావరణం కల్పించడం, స్క్రిప్ట్కు ముందు-తర్వాత, ప్రొడక్షన్ టీ, నటీనటుల ఎంపిక, పోటీలకు పంపే విధానం, ప్రదర్శించే వేదికలను సూచించడం తదితర అంశాలపై తమ స్వానుభవాలను రాహుల్ వివరించారు. ఏదైనా ఇతివృత్తాన్ని షార్ట్ ఫిల్మ్గా రూపొందించాలని భావించేవారు తమ ఆలోచనను ఆక్టోపస్ స్టుడియోకు పంపాలని, ఏ వాణిజ్య సంస్థలకూ సంబంధం లేని నిపుణుల బృందం వీటిని పరిశీలించి తగు సూచనలతో, సహకారంతో, షార్ట్ ఫిల్మ్ రూపొందేవరకూ వెబ్సైట్ (www. octopusstudios.in/ shortfilms.php)ద్వారా రెగ్యులర్గా టచ్లో ఉంటుందని వివరించారు. ఎమోషనల్, పబ్లిక్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు, మనసుకు నచ్చిన చాయ్ గురించి తీసిన షార్ట్ఫిల్మ్ల తయారీ నేపథ్యాన్ని వివరించారు. -
ఒక స్పీల్బర్గ్!
ఆ లఘుచిత్రాలను చూడటానికి చుట్టుపక్కలవారిని 25 సెంట్లకు అనుమతించేవాడు. ఇక వాళ్ల చెల్లేమో ఆ వచ్చిన ‘ప్రేక్షకులకు’ పాప్కార్న్ అమ్మేది. మొన్న కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ కాన్సెప్ట్తో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు రాంగోపాల్వర్మ ఒక సలహా ఇచ్చాడు, అతితక్కువ ఖర్చుతో సినిమాలు చేస్తూ, వాటిని స్థానికంగా చూపించి గిట్టుబాటు చేసుకొమ్మనీ, తద్వారా ఎదుగుదలకు బాటలు పరుచుకొమ్మనీ! అది అయ్యేపనేనా? అని ఎవరైనా అడిగివుంటే, బహుశా, స్టీవెన్ స్పీల్బర్గ్ను ఉదాహరణగా చూపించేవాడేమో! ‘అన్నింటికంటే మించి ఒక మంచి ఇమాజినేషన్ మాత్రమే ఎవరినైనా దర్శకుడిని చేయగలదు. మంచి ఊహవుండి, బాగా కథలు చెప్పే ఆసక్తివుండి, నీ ఆలోచనల్ని కొత్తవారికి చేరవేయగలిగే నేర్పు గనకవుంటే... నువ్వు రాయాలి, లేదా 8ఎంఎం సినిమా మొదలెట్టాలి,’ అంటాడు స్పీల్బర్గ్. తన కౌమారదశలో, వాళ్ల నాన్న బహూకరించిన కెమెరాతో కొన్ని 8ఎంఎం లఘుచిత్రాలు తీశాడు స్పీల్బర్గ్. వాటిని ‘అడ్వెంచర్’ సినిమాలనేవాడు. వాటిని చూడటానికి చుట్టుపక్కలవారిని 25 సెంట్లకు అనుమతించేవాడు. ఇక వాళ్ల చెల్లేమో ఆ వచ్చిన ‘ప్రేక్షకులకు’ పాప్కార్న్ అమ్మేది. మనసులో కళ, మెదడులో ‘వెల’! ఈ గుణాలే భవిష్యత్తుల్లో ఆయన్ని అత్యధిక వసూళ్లు రాబట్టిన మేటి హాలీవుడ్ దర్శకుడిగా నిలబెట్టాయి. తన పదహారో ఏట పూర్తి నిడివి ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘ఫైర్లైట్’ తీశాడు. 1975లో హాలీవుడ్ హిట్గా ‘జాస్’ నిలిచినప్పుడు స్పీల్బర్గ్ వయసు 26 ఏళ్లు! అలాగని వసూళ్లు మాత్రమే ఆయన ఐడెంటిటీ కాదు! ఉత్తినే ఆయన సినిమాల పేర్లను తలుచుకోవడంలోనే ఒక విజువల్ ప్లెజర్ ఏదో ఉంది. ఇ.టి., జురాసిక్ పార్క్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... ఇదొక వరుస! ఇండియానా జోన్స్ సీరిస్ ఒక వరుస! క్యాచ్ మి ఇఫ్ యు కెన్, ద టెర్మినల్... మరొక వరుస! మ్యూనిక్, అమిస్టాడ్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, కలర్ పర్పుల్, లింకన్... ఇంకో వరుస! ఏ వరుసలో చూసినా, సాంకేతికత పరిజ్ఞానానికి మానవీయ స్పృహను అద్దడమే స్పీల్బర్గ్ చేసింది. ప్రతి చిత్రమూ తనను భయపెడుతుందంటాడు స్పీల్. ‘అది కచ్చితంగా భయం కూడా కాదు. తెలియనిదానికోసం ఎదురుచూడటం! ఆ భయాన్ని ఇతరుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా నా భయాల్ని నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తాను. అయినా ఆ సినిమా పూర్తయ్యాక కూడా ఆ భయం ఛాతీలోంచి తొలగిపోదు’. అందుకే మరోటి మొదలుపెడతాడు. అయితే, ‘చిన్నప్పుడు కెమెరాతో స్నేహితుల మీద పెత్తనం చలాయించడమే సినిమాగా ఉండేది. కానీ పెద్దయ్యేకొద్దీ సినిమా అంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రతిభను అభినందించడమేననీ, నువ్వు మాత్రమే ఈ సినిమాలు చేయగలిగేవాడివి కాదనీ తెలుసుకోవడం!’ అంటాడు. సినిమా అనేది నీ కుటుంబంతో కాకుండా ఇంకో కుటుంబంతో కూడా సంబంధం ఉండటంగా అభివర్ణిస్తాడు. ‘ఒక కుటుంబంతో కలిసివుంటావు, ఒక కుటుంబంతో పనిచేస్తావు’! అయితే, ‘సినిమా కథల్లాగా తన జీవితకథను కూడా రాసుకోగలిగితే బాగుండే’దంటాడు. తల్లిదండ్రులు విడిపోవడం ఆయన్ని కలవరపరిచింది. సినిమా కథలన్నీ, ఇంకా చెప్పాలంటే ఏ కథైనా ఏమార్చిన ఆత్మకథలే! అందువల్లేనేమో, స్పీల్బర్గ్ తొలిదశ సినిమాల్లో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగానో, పట్టనట్టుగానో ఉన్న తండ్రి పాత్ర కనబడుతుంది. అదే వాళ్ల నాన్నను పూర్తిగా అర్థం చేసుకుని, తండ్రీకొడుకుల మధ్య తిరిగి బంధం బలపడ్డాక, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి తపనపడే తండ్రుల పాత్రలు ప్రవేశించాయి. మతపరమైన విశ్వాసాలు గాఢంగా లేకపోయినా, ‘షిండ్లర్స్ లిస్ట్’ తీస్తున్నప్పుడు తాను కేవలం ఫిలిం మేకర్గా మాత్రమే ఉండలేకపోయాననీ, యూదుడిగానే మిగిలాననీ దుఃఖిస్తాడు. జర్మనీలో యూదుల మీద నాజీల దురాగతాలని కేంద్రంగా చేసుకున్న ఆ సినిమాను సినిమాగా కాకుండా, పూర్తిగా తనకోసమే... ‘ఎవరు చూడకపోయినా ఫర్లే’దన్నట్టుగా, బ్లాక్ అండ్ వైట్లో చిత్రించాడు. అయినా అది క్లాసిక్గా అందరికీ చేరువ కావడానికి కారణం, మనిషి పట్ల మనిషి మనిషిలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఇంకా ఇంకా పెరుగుతూ ఉండటమే! స్పీల్బర్గ్ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తూ, రోజర్ ఎబెర్ట్ ఒక పాటను ఉటంకిస్తాడు. ‘పత్రికలవాళ్లు అత్యంత ఆసక్తికర మనుషుల్ని కలుస్తారు’ అని దాని సారాంశం. అది నిజమేనేమోగానీ స్పీల్బర్గ్ను కలిసే అవకాశం అందరికీ రాదు, కనీసం తెలుగు పాత్రికేయుడికి! - ఆర్.ఆర్. -
ఐ కెన్ ఫ్లై
A dream is a wish your heart makes... It is a destination you always wanted to reach ‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పే సందేశం నుంచి స్ఫూర్తి పొందినట్టుంది ఇంచుమించు ఈ కోట్ కూడా. ‘కష్టంగా కనిపించేవన్నీ అసాధ్యం కావు. ఒకవేళ దేన్నైనా అసాధ్యం అనుకుంటే దాన్ని ఎప్పటికీ సాధించలేవు’... అంటూ పదకొండు నిమిషాల ఛోటా సినిమా ‘ఐ కెన్ ఫ్లై’ యువతలో చక్కని స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసింది. లక్ష్యం ఉన్నా... దాన్ని చేరుకొనే రాస్తా ఏదో తెలుసుకోలేని అయోమయంలో కొట్టుకుపోతున్న యువతరం భుజం తట్టి భరోసా ఇచ్చే ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు బెల్జియంలోని ఫ్లాండర్స్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పాఠంగా మారింది. హైటెక్ సిటీలో చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవి వీడె ఈ చిత్రానికి రూపకర్త. హాలీవుడ్ సినిమా టేకింగ్లను తలపించేలా ఈ చిత్రాన్ని రూపొందించిన రవి తన అనుభవాలను ‘సిటీ ప్లస్’తో పంచుకున్నాడు. - హనుమా షార్ట్ ఫిల్మ్స్ తీయడం హాబీ. మా ఊరు కాకినాడ నుంచి హైదరాబాద్కు వచ్చాక ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికి పది షార్ట్ ఫిల్మ్స్ తీశా. ‘మై లాస్ట్ ఫొటోగ్రాఫ్’కు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులొచ్చాయి. క్రమంగా టార్గెట్ మారి... ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్ తీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికి ట్రయల్గానే ‘ఐ కెన్ ఫ్లై’ తీశాం. మాది పది మంది టీమ్. అందులో నలుగురు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. మిగిలినవారిలో ఇద్దరు హాలీవుడ్ బ్లాక్బస్టర్స్ ‘గాడ్జిల్లా, ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ గ్రాఫిక్స్ టీంలో వర్క్ చేశారు. అంతా కలసి పెట్టుకున్నదే ‘వీకెండ్ క్రియేషన్స్’. ఈ బ్యానర్ కిందే ‘ఐ కెన్ ఫ్లై’ చేశాం. ఎంతో కష్టపడ్డాం... గత ఏడాది డిసెంబర్లో ఈ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్లో గానీ పూర్తి కాలేదు. నిడివి తక్కువే అయినా... ఒక్కో సన్నివేశానికీ చాలా శ్రమించాల్సి వచ్చింది. భువనగిరి ఫోర్ట్ వద్ద షూటింగ్. ఇంపోర్టెడ్ మోటర్, గోప్రో (హెలికాప్టర్) కెమెరా వంటి అధునాతన పరికరాలు ఉపయోగించాం. ఓ షాట్లో గాలికి పచ్చ గడ్డి కదులుతూ ఉంటుంది. అలాగే ఎత్తయిన కొండ. ఇవన్నీ చూడ్డానికి గ్రాఫిక్స్లా ఉన్నా... ఒరిజినల్గా చేసినవే. మా క్యామ్ ఓ సారి కొండ కొనపై ఇరుక్కుపోతే... ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించిన పూర్ణ, ఆనంద్ టీమ్ హెల్ప్ చేసింది. గ్రాఫిక్స్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. దీని నెరేషన్ రికార్డింగ్ యూఎస్లో చేశాం. లక్షన్నర రూపాయలు ఖర్చయినా... ఫిల్మ్ ఎంతో రిచ్గా వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్లో దీని ప్రీమియర్ చూసి సినీ పెద్దలు ఇంప్రెస్ అయ్యి... రెండు ఆఫర్లు ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఫిబ్రవరీలో నా దర్శకత్వంలో... మా టీమ్ చిత్ర రంగ ప్రవేశం చేస్తుంది. ఇదీ కథ... చాలా మంది విజయానికి రెండు మూడు అడుగుల దూరంలోనే ఉన్నా... ఆ విషయం గ్రహించలేక చివరి నిమిషంలో డ్రాపయిపోతారు. ‘హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్’... ఇవి గోల్ వైపునకు తీసుకు వెళతాయి. ‘ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇన్డిసిప్లీన్, లేజీనెస్’... ఇవి వెనక్కి లాగుతాయి. ఈ రెండింటినీ కచ్చితంగా బ్యాలెన్స్ చేస్తేనే గోల్ను రీచ్ కాగలవు. ఇదే ఈ సినిమా కథ కూడా. ఎంబీబీఎస్లో సీటు కోసం నాలుగేళ్లుగా ట్రై చేస్తున్న ఓ యువకుడుకి... దాన్ని సాధించడమంటే గాల్లో ఎగిరినంత. వాళ్ల నాన్నను అడిగితే... ‘ఎస్... యూ కెన్ ఫ్లై’ అంటూ ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహంతోనే యువకుడు ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో చిత్రం ముగుస్తుంది. ‘కీప్ ట్రయింగ్’ అన్నదానికి కాస్త ఎడ్యుకేషన్ మిక్స్ చేసి దీన్ని రూపొందించాం. బెల్జియంలో పాఠం... ఇది చూసిన బెల్జియంలోని ‘వాన్ ఇన్’ పబ్లిషింగ్ సంస్థ నాకు రైట్స్ కోసం మెయిల్ పంపింది. రాయల్టీ చెప్పమంటే... ఓ మంచి కార్యక్రమం కోసం కనుక, నేను దాన్ని ఉచితంగానే వారికి ఇచ్చాను. డీవీడీ వెర్షన్గా అక్కడి 150 సెకండ్రీ ఎడ్యుకేషనల్ స్కూల్స్ (ఇక్కడ ఏడు, ఎనిమిది)లో పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నారు. మొత్తం నాలుగు వేల మంది విద్యార్థులకు ఇది రీచ్ అవుతుందని వారు తెలిపారు. నిజంగా ఇదో పెద్ద విజయం మాకు. ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ను ఇలా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఉపయోగించిన సందర్భాలు నాకు తెలిసి ఎక్కడా లేవు. ఇది మా టీమ్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యుూత్లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం.మెయిల్ టు sakshicityplus@gmail.com -
సాక్షి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ : 2. 'జస్విక'
-
సాక్షి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ : 3. 'స్పైడర్ బాయ్'
-
సాక్షి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ : 1. 'మాల'
-
షార్ట్ ఫిల్మ్స్
చిన్నారులపై తీసిన షార్ట్ ఫిల్మ్స్ పంపండంటూ ఆహ్వానించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు అనూహ్య స్పందన వచ్చింది. వాటిల్లో బెస్ట్ త్రీ ఫిల్మ్స్ను చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎంపిక చేసి ప్రచురించిన విషయం తెలిసిందే. మిగిలిన చిన్నారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆసక్తి కలిగించిన మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్, వాటి వివరాలను పాఠకులకు పరిచయం చేస్తున్నాం. బహుమతికి ఎంపిక కాకపోయినా... చక్కని నైపుణ్యం కనబరిచిన ఆ చిత్రాల వివరాలు ఈ వారం ‘షార్ట్ సినిమా’లో... చేంజ్ బిగిన్స్ నవ్.. చిన్న చిన్న షాట్స్తో సేవ్ గర్ల్ చైల్డ్, రెస్పెక్ట్ట్ వుమన్ అనే సందేశాన్ని చక్కగా చూపించాడు దుర్గాప్రసాద్. ఒక గంట సమయంలో మొబైల్ ఫోన్తో షూటింగ్ చేసిన ఈ వీడియో నిడివి రెండు నిముషాలు. అమ్మగా, చెల్లిగా, కూతురిగా.. ఇలా అన్ని బంధాల్లో ప్రేమ పంచే స్త్రీలను గౌరవించాలి కానీ హింసించ కూడదు. స్త్రీల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడుదాం, సమాజంలో మార్పుని తీసుకువద్దాం అనే సందేశంతో ఈ చిత్రం ముగించాడు ఈ బుల్లి దర్శకుడు. డెరైక్టర్: కె.దుర్గాప్రసాద్ వయసు:15 ఏళ్లు క్లాస్: 10 తరగతి ఫారిన్ వర్సెస్ ఇండియన్ ఈ రోజుల్లో పిల్లలకు ఉన్న అబ్జర్వేషన్ స్కిల్స్ని మెచ్చుకోక తప్పదు ఈ చిన్ని సినిమా చూశాక. ఒక చిన్న దెబ్బ తగిలితే ఇక్కడి పిల్లవాడు, ఫారిన్లో పిల్లలు ఎలా స్పందిస్తారు, వారి పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంటారో ఈ ముగ్గురు చిన్నారులు ఈ షార్ట్ఫిలింలో చూపించారు. హ్యామ్ క్యాం గ్రూప్గా ఏర్పడి ఫారిన్ వర్సెస్ ఇండియన్ అనే బుల్లి సినిమా రూపొందించడమే కాదు.. ఇందులో కొడుకు, తండ్రి, డాక్టర్ పాత్రల్లో ఈ చిన్నారులు చక్కగా నటించారు. డెరైక్టర్స్, యాక్టర్స్: హృతిక్, ఆదిత్య, మాజిల్ క్లాస్: 10 హ్యూమానిటీ.. రెండు పాత్రలతో సాగే ఈ చిత్రాన్ని హరికిరణ్, సాయి అనుదీప్ నటించి దర్శకత్వం వహించారు. బ్యాట్ కొనుక్కునేందుకు డబ్బులు ఇమ్మని అడుగుతాడు హరి. లేవని పంపించేస్తుంది అమ్మ. బయటకు వెళ్లిన హరికి దారిలో 500 రూపాయలు దొరుకుతాయి. అక్కడే అతని ఫ్రెండ్ సాయి ఏడుస్తూ కనిపిస్తాడు. ఇంట్లో ఇచ్చిన ట్యూషన్ ఫీజు డబ్బులు పోయాయని చెబుతాడు. దొరికిన డబ్బులతో బ్యాటు కొనుక్కోవచ్చని అనుకున్న హరి మనసు మార్చుకుని ఆ డబ్బులు సాయికి ఇచ్చేస్తాడు. ఈ విషయం తెలిసిన హరి తల్లి అతనికి బహుమతిగా 500 ఇవ్వటంతో షార్ట్ఫిలిం ఎండ్ అవుతుంది. చిత్రీకరణ పరంగా మాములుగా ఉన్నా.. చక్కటి సందేశంతో రూపొందించిన ఈ బుడతలను అభినందించాల్సిందే. హరికిరణ్, సాయి అనుదీప్ క్లాస్: 7 తరగతి మంత్రం నాట్యం, మంత్రం అనే షార్ట్ ఫిలింస్ రూపొందించాడు. క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంలో తనకు తెలిసిన కథను జోడించి నాట్యానికి వున్న ప్రాముఖ్యతను తెలియచేసిన చిత్రం నాట్యం. అలాగే హర్రర్ నేపథ్యంగా చిన్న దెయ్యం కథను మంత్రం అనే షార్ట్ ఫిలింగా రూపొందించాడు ఈ చిన్ని దర్శకుడు. వీవీఎస్ తరుణ్ వయసు: 14 ఏళ్లు ఏకలవ్య చిత్తుకాగితాలు ఏరుకునే ఓ అనాథ బాలుడు బడిబాట పట్టిన కథ ఇది. అనాథ అయిన హరి రోడ్డు పక్క చిత్తుకాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. తాను చిత్తుకాగితాలు ఏరుకుంటున్న సమయంలోనే చూడచక్కని దుస్తుల్లో బడికి వెళ్లే పిల్లలను చూస్తుంటాడు. తనకూ బడికి వెళ్లాలని ఉన్నా, వెళ్లలేని పరిస్థితి. రోజూ బడి బయటే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. పిల్లలకు మాస్టారు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకిస్తుంటాడు. మాస్టారు ఓ రోజు పిల్లలను అంతకు ముందు చెప్పిన పద్యం అప్పజెప్పమని అడుగుతారు. ఎవరూ చెప్పలేకపోతారు. అప్పుడు హరి తాను చెబుతానంటూ తరగతి గది బయట నిలుచుని మాస్టారి అనుమతి కోరతాడు. మాస్టారు సరేననడంతో అతడు పద్యం అప్పజెబుతాడు. చదువుకోవాలన్న అతడి కోరిక తెలుసుకుని, మాస్టారు అతడి చదువుకు సాయం చేస్తారు. ఓ మధు ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యుత్లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా...విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెరుల్ టు sakshicityplus@gmail.com -
బిజీ షెడ్యూల్ మధ్య.. లఘు చిత్రంలో...
మొదట్లో తెలుగులో బిజీ బిజీగా సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఇప్పుడు మాత్రం తమిళ చిత్రాలకే పచ్చజెండా ఊపుతున్నారు. తమిళంలో ఈ ఏడాది ఆయన చేసిన ‘జిగర్తండా’ ఘనవిజయం సాధించింది. మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ తాజాగా ఓ లఘు చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ‘పిజ్జా’, ‘జిగర్ తండా’ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సిద్ధు నటించిన ‘జిగర్తండా’కి ఈయనే దర్శకుడు. స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కార్తీక్కి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే గతంలో పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవే ఆయన్ను సినిమా దర్శకుణ్ణి చేశాయి. అందుకే ఇప్పుడు లఘు చిత్రాలు తీసి, థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
చిట్టి కథలు.. గట్టి బుర్రలు
చిన్నారులకు సంబంధించి తీసిన చిత్రాలను పంపమన్న సిటీప్లస్ ఆహ్వానానికి నగరవాసులు గణనీయ సంఖ్యలో స్పందించారు. తాము తీసిన లఘుచిత్రాలను పంపారు. వీటిలో అత్యధిక భాగం చక్కని సందేశాలతో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన విషయాలతో నిండి ఉండడం ఎంతైనా అభినందనీయం. అన్ని చిత్రాలూ బాగున్నా... పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిలో నుంచి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. మాకు పెద్దసంఖ్యలో అందిన మిగతా చిత్రాలను ప్రాధాన్యత క్రమంలో మా ‘షార్ట్ సినిమా’ కాలమ్లో ప్రచురించడం జరుగుతుంది. ఉత్తమ చిత్రాలకు త్వరలోనే బహుమతులు అందజేస్తాం. మాల డైరెక్టర్: విజయ్కుమార్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ కథనం: సర్కస్ ఫీట్స్ చేసి జీవించే కుటుంబంలోని ఓ చిన్నారి వ్యథ చిన్నారులకు సంబంధించి తీసిన చిత్రాలను పంపమన్న సిటీప్లస్ ఆహ్వానానికి నగరవాసులు గణనీయ సంఖ్యలో స్పందించారు. తాము తీసిన లఘుచిత్రాలను పంపారు. ఓ మారుమూల బస్తీలో తాడు మీద నడుస్తూ సర్కస్ఫీట్స్ చేస్తూ జీవించే కుటుంబంలో చిన్నారి వ్యథకు ఇది చిరు తెర రూపం. చదువుకోవాలనే ఆమె ఆశకు ఆర్థిక సమస్యలతో పాటు చిట్టి భుజాల మీద సంపాదన బాధ్యత కూడా తోడవుతుంది. ఆమె తండ్రికి ఈ చిన్నారి మీద ఆప్యాయత, ప్రేమ ఉన్నా... తాగుడు వ్యసనం. ఆ చిన్నారి తన ఫాదర్ని ఎలా మార్చింది? తనెలా చదువుకోవాలనే కలను సాకారం చేసుకుంది అనేది సినిమా కథ. మొత్తం 15 నిమిషాల నిడివి ఉండే ఈ బుల్లి చిత్రాన్ని ఇంగ్లండ్లో కమ్యూనిటీ చానల్ వాళ్లు టెలికాస్ట్ చేశారు. చందానగర్లోని విబ్గ్యార్ ఇంగ్లిష్ మీడియం స్కూలు పిల్లలే పాత్రధారులుగా యాక్ట్ చేసిన ఈ సినిమా రూపకర్త ఆ స్కూల్లో ఇంగ్లిష్ ఫ్యాకల్టీ విజయ్కుమార్. జస్విక కథ దర్శకత్వం: రాజా , ఎడిటింగ్: ఉషామాధవి కథనం: చాకోబార్ కోసం డబ్బు కూడబెట్టి కొనుక్కున్న జస్విక కథ ఇది జస్విక ఓ నాలుగేళ్ల చిన్నారి. ముద్దులొలికే ఆ చిన్నారికి చాకోబార్ తినాలని ఉంటుంది. అమ్మానాన్నలను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోరు. కిట్టీ బ్యాంక్లో ఉన్న రెండు రూపాయలు తీసుకుని ఐస్క్రీమ్ పార్లర్కు వెళ్తుంది. చాకోబార్ రేట్ రూ.20 అని తెలుసుకుని బుంగమూతితో ఇంటికి చేరుతుంది. ఇదే విషయాన్ని అక్వేరియంలో ఉన్న బుల్లి చేపపిల్లతో చెప్పుకుంటుంది జస్విక. ఎలాగైనా రూ.20 కూడబెట్టాలని డిసైడ్ అవుతుంది. రోజూ రెండు రూపాయల చొప్పున పొదుపు చేస్తుంటుంది. ప్రతి రోజూ కిట్టీ బ్యాంక్లో డబ్బులు వేసి ఆ విషయం చేపపిల్లతో చెప్తుంటుంది. పది రోజుల తర్వాత రూ.20 తీసుకెళ్లి చాకోబార్ తెచ్చుకుంటుంది. ఎవరి కంటా పడకుండా బాల్కనీలో తినాలని ప్లాన్ చేస్తుంది. వాళ్లమ్మ పిలవడంతో ఇంట్లోకి వెళ్తుంది. తీరా వచ్చేసరికి చాకోబార్ కాస్తా కరిగిపోతుంది. అది చూసి జస్విక ఏడుపు అందుకుంటుంది. ఆ చిన్నారి బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు.. సాయంత్రం ఓ చాకోబార్ కొనివ్వడంతో కథ ముగుస్తుంది. జస్విక పాత్రలో చిన్నారి జస్విక అదరగొట్టింది. ఓ చిన్నారి అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ షార్ట్ ఫిల్మ్కు దర్శకుడు జస్విక తండ్రి రాజా అయితే, తల్లి ఉషామాధవి ఎడిటింగ్ చేసింది. స్పైడర్ బాయ్ డైరెక్టర్: నిమ్మకాయల రాంజీ వయసు: 9 ఏళ్లు, 4వ తరగతి, డీఏవీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్ కథనం: ప్రాణాపాయంలో ఉన్న స్పైడర్ బాయ్ సమయానికి 108 అంబులెన్స వచ్చి బతుకుతాడు మా మదర్ ఫోన్ తీసుకుని సినిమాల్లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని షూట్ చెయ్యటం ట్రై చేస్తున్నాను. ఆ టెక్నిక్ నేను కనుక్కుని షూట్ చేసి మా డాడీకి చెప్పాను. అప్పుడు ఆయన షార్ట్ ఫిలిం తియ్యమని సజెస్ట్ చేశారు. ఆ తర్వాత టీవీలో స్పైడర్ మ్యాన్ చూసి అందులో సాంగ్తో షార్ట్ఫిలిం ఆలోచన వచ్చింది. మా తాతయ్య స్పైడర్ బాయ్ బొమ్మ కొనిచ్చారు. మొబైల్ కెమెరాతో దీన్ని షూట్ చేశాను. సినిమా కథ ఏంటంటే... స్పైడర్ బాయ్ తన శక్తితో ఎగురుతూ ఉంటాడు. మధ్యలో శక్తి కోల్పోతాడు. అప్పుడు 108 అంబులెన్స్ రావటంతో స్పైడర్ బాయ్ ప్రాణాలు నిలుస్తాయి. ఈ ఫిలిం మేకింగ్కి కజిన్.. అని, అమ్మ, నాన్నతో పాటు ఆయన ఫ్రెండ్స్ చిక్కాల, నవీన్ హెల్ప్ చేశారు. మానాన్న ప్రసాద్ అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. తరువాతి షార్ట్ ఫిలింకి నేనే మ్యూజిక్ చేయాలనుకుంటున్నాను. -
రేప్- ఇట్స్ యువర్ ఫాల్ట్
సినిమా తెరకెక్కడానికి బుల్లి చిత్రాల్ని ఒక సాధనంగా ఔత్సాహికులు మలచుకుంటుంటే... పెద్ద తారలేమో ‘షార్ట్’ మూవీస్లో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకలా.. అంటే కారణాలనేకం. షార్ట్ఫిలింస్ వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే పవర్ఫుల్ మీడియంగా మారాయి. పెద్ద సినిమా చిత్రీకరణ, విడుదలకు ఉండే హడావుడి ఈ చిత్రాలకు లేకపోయినా, ఇంటర్నెట్ ద్వారా ఇమిడియట్గా కోట్లాది మంది వ్యూవర్స్ని చేరుకుంటుండడం ఈ చిత్రాలపై ఆసక్తి పెంచుతోంది. దీంతో సినీ తారలు సైతం వీటిని పట్టించుకోక తప్పని పరిస్థితి. అయితే సంతోషించాల్సిన విషయమేమిటంటే... కమర్షియల్, భారీ బడ్జెట్ సినిమాలలో సాహసించడానికి వీలులేని సందేశాత్మక సామాజిక అంశాలపై స్పందించడానికి వీరు చిన్ని చిత్రాలను ఉపయోగించుకోవడం. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు పొట్టి సినిమాల్లో కనిపిస్తున్నారు. వీరిలో నేటి తరం అలియాభట్, కల్కీ నుంచి నిన్నటి తరం మాధూరీ దీక్షిత్ కూడా ఉన్నారు. దర్శకులదీ ఇదే బాట. ఈ నేపధ్యంలో స్టార్స్ నటించిన కొన్ని పొట్టి చిత్ర విశేషాలివి. వినీల్ మ్యాథ్యూ రూపొందించిన స్టార్ట్ విత్ ద బాయ్స్ అనే బుల్లి సినిమా డొమెస్టిక్ వయోలెన్స్ నేపథ్యంలో చక్కటి సందేశంతో రూపొందింది. అనేక సందర్భాల్లో సహజంగా వచ్చే ఏడుపును నియంత్రించుకోవటం వల్ల అబ్బాయిల్లో పెరిగే క్రోధం, అది అమ్మాయిల పట్ల హింసగా ఎలా మారుతుందనేది రెండు నిముషాల చిత్రంలో చక్కగా చూపారు. ‘పుట్టినప్పటి నుంచి బాయ్స్ ఏడవకూడదని నేర్పించే తల్లిదండ్రలు, ఇక నుంచి, మగపిల్లలు ఆడవారిని ఏడిపించకూడదు అని నేర్పిస్తే మంచిది’ అని మాధురి చెప్పే మాటలతో ముగుస్తుంది. దీనికి యూట్యూబ్లో మంచి హిట్స్ వచ్చాయి. కల్కీ సంచలనం... ‘రేప్- ఇట్స్ యువర్ ఫాల్ట్’... ఈ సూపర్హిట్ షార్ట్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కల్కీ కోచ్లీన్ (షాంగై సినిమా ఫేం) నటించింది. యూట్యూబ్లో ఇదో సంచలనం. ఆడవారిపై జరిగే అన్యాయాలకు వారే కారణమంటూ అడ్డదిడ్డంగా చేసే వ్యాఖ్యలకు సమాధానంగా రూపొందిన ఈ సినిమాకు అశ్విన్శెట్టి దర్శకత్వం. మరెందరో... ఇదే తరహాలో ‘యామ్ నాట్ ఏ వుమన్’ షార్ట్ఫింలో కూడా బాలీవుడ్కి చెందిన రజిత్ కపూర్, మియాంగ్ చాంగ్, అదితి మిట్టల్ తదితరులు నటించారు. ‘దట్ డే ఆఫ్టర్ ఎవ్రీడే’ కూడా మరో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమే. బయటకు వెళ్లే ఆడపిల్లలు బస్సుల్లో, వీధుల్లో ఎదుర్కునే ఈవ్టీజింగ్ సమస్యని ఇందులో చూపారు. రాధికా ఆప్టే, సంధ్యా మృదుల్, అరణ్యకౌర్ మధ్యతరగతి అమ్మాయిల పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించారు. టాలీవుడ్ నటులు కూడా ఇప్పుడిప్పుడే షార్ట్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. రెగ్యులర్ సినిమా తర్వాత గెలుపు, ఓటమి క్రిటిసిజమ్ లాంటి ఎన్నో అంశాలు ఎదుర్కునే ఈ బడా తారలకు ఈ చిన్ని సినిమాల తర్వాత అల్టిమేట్గా మంచి మార్కులు పడుతుండటం విశేషం. ఓ మధు -
లఘు చిత్రాలకు ఇదొక అందమైన వేదిక : బ్రహ్మానందం
‘‘సంప్రదాయ చిత్రాలకు దీటుగా లఘు చిత్రాలు చరిత్ర సృష్టిస్తున్నాయి. అలాంటి చిట్టి చిత్రాలకు వెన్నుదన్నుగా నిలవాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ వెబ్సైట్ సృజనకు అందమైన వేదికగా నిలవాలి’’ అని ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం ఆకాంక్షించారు. డి. రాజ్వికాస్, ఎసీఎస్ శ్రీరామ్, ఎస్. ఆకాశ్ ఏర్పాటు చేసిన noreels.comను హైదరాబాద్లో బ్రహ్మానందం ఆవిష్కరించారు. లఘుచిత్రాలు తీసే దర్శక నిర్మాతలకు చేయూతనందించడంతో పాటు, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా చేస్తామని ప్రమోటర్లు తెలిపారు. -
‘వేశ్య, వ్యభిచారం’...
‘వేశ్య, వ్యభిచారం’... సమాజంలో ఈ విషయాలు మాట్లాడటం పెద్ద తప్పుగా, ఆ పదాలు ‘బీప్’ వాడి వినపడనట్లుగా చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా అవి వినకూడని పదాలా! వారి గురించి మాట్లాడటం, వారితో మాట్లాడటం అంత చేయకూడని పనా..? పెద్ద సినిమాల్లో చిన్న సందేశాల గురించి ఏమో కానీ... ‘బీప్’ అనే చిన్న సినిమా ద్వారా చాలా పెద్ద ఆలోచనను మనసుకు హత్తుకునేలా చూపించారు సుదీప్. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ‘బీప్’ చిత్రానికి ‘దాసరి షార్ట్ఫిలిమ్’ పోటీల్లో రెండో బహుమతి లభించింది. దీని రూపకర్త సుదీప్ ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు... చెన్నైలో బీటెక్ చేస్తున్నప్పటి నుంచే షార్ట్ఫిలిమ్స్ చేసేవాడిని. ఓ చిత్రానికి కాలేజ్లో మంచి పేరు వచ్చింది. అదే నాలో నమ్మకాన్ని పెంచింది. బీటెక్ తర్వాత బ్యాంక్ పీఓగా ఉద్యోగం వచ్చింది. కానీ... ఉద్యోగంలో చేరితే నాకిష్టమైన సినిమాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగమా..? సినిమాలా..? నేను మాత్రం రెండోదానికే ఫిక్సయిపోయా. కానీ ఇంట్లోవాళ్లు, మిత్రులు వద్దంటే వద్దన్నారు. మంచి ఉద్యోగాన్ని వద్దనుకొని భవిష్యత్తుపై భరోసా లేని ఫిల్మ్ ఫీల్డ్కు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. సక్సెస్ కాకపోతే పిచ్చివాడివి అయిపోతావని ఇంకొంతమంది భయపెట్టారు. కానీ... నేను తీసిన ‘బీప్’కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడందరికీ నా మీద నమ్మకం పెరిగింది. మిత్రుడి ఫేస్బుక్ పోస్ట్కు ఇన్స్పైర్ అయ్యి... ఓ యథార్థ సంఘటన ఆధారంగా దీన్ని రూపొందించాం. ‘ఐక్లిక్’ సంస్థ, మిత్రులు సహకరించారు. అంతకుముందు ‘వి’ అనే షార్ట్ ఫిలిం చేశా. అది క్రైం థ్రిల్లర్. షార్ట్ ఫిల్మ్స్ కొనసాగిస్తూనే... భవిష్యత్తులో ఓ మంచి ఫీచర్ ఫిల్మ్ తీయాలన్నదే నా ఆకాంక్ష. -
ఔత్సాహికులకు గైడ్
తపన, పట్టుదల, కార్యదీక్ష ఉంటే తాను ఎంచుకున్న రంగంలో రాణించవచ్చు. నలుగురికీ స్ఫూర్తిదాయకంగా నిలవవచ్చు. అందుకు పుష్పా భాస్కర్ చక్కటి నిదర్శనం. ఆసక్తి తప్ప ఏమాత్రం అవగాహన లేకున్నా మీడియాలోకి వచ్చారు. ఆర్జేగా, రైటర్గా, ఆపై ట్రెయినర్గా మంచి ప్రావీణ్యం సంపాదించారు. షార్ట్ ఫిలింస్ తీసేవారికి గైడ్గా నిలిచారు. పుష్పాభాస్కర్తో ‘సిటీప్లస్’ ముచ్చట్లు... పదేళ్ల క్రితం హౌస్వైఫ్గా ఉన్నప్పుడు మీడియాలోకి రావాలని, ఏదో చెయ్యాలని చాలా ఆసక్తిగా ఉండేది. అప్పుడు ఎలా రావాలో, వచ్చి ఏం చెయ్యాలో తెలియదు. అనుకోకుండా నాకు జపా 4 అనే రేడియో షోలో అవకాశం వచ్చింది. తరువాత ఆలిండియా రేడియో ఎఫ్ఎంలో ఆర్జేగా, టీవీ షోస్కి రైటర్గా, సీనియర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా, ఆర్జే, టీవీ యాంకర్లకి ట్రెయినర్గా చేశా. ప్రస్తుతం అన్నపూర్ణ వారి ఫిలిం స్కూల్ - ఏఐఎస్ఎఫ్ఎంలో యాక్టింగ్ కోర్స్కి ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సినిమా అంటే ప్యాషన్ ఉన్న చాలామందికి బ్యాకింగ్ లేక ముందుకు ఎలా వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి వారి కోసమే అన్నట్టు షార్ట్ఫిలింస్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. చేతిలో కెమెరా, జేబులో కాస్త పాకెట్ మనీ ఉంటే ప్రతీ యంగ్స్టర్ ఒక షార్ట్ఫిలిం తియ్యడం ఈజీ అయింది. కాకపోతే అంతా యూత్ కావటంతో మూస కథలు, అమ్మాయి, అబ్బాయిల ప్రేమ, బ్రేకప్.. ఈ కథలే. వీటిపై నిరాసక్తి కలిగే అవకాశం ఉంది. కథ ఎంచుకునే విధానం నుంచి దాన్ని ఫైనల్ ప్రొడక్ట్కి మార్చే వరకు కొత్తదనం చూపించాలి. షార్ట్ఫిలింని ప్రేక్షకురాలిలా చూస్తాను. వారికి ఏవి అర్థం కావో వాటినే డిస్కస్ చేస్తా. లాజిక్లోకి అమరకపోతే అవి ఎందుకు అలా వున్నాయని అడిగి తెలుసుకుంటాను. మ్యూజిక్, డైలాగ్స్, కెమెరా గురించి టీచర్లా కాకుండా వారి గ్రూప్లో ఒకరిగా డిస్కస్ చేస్తా. అంత అనుభవం లేదు... ఒకరికి సలహాలిచ్చేంత అనుభవం నాకు లేదు. కాని ఒక విషయం, నార్మల్ ప్రేక్షకుడి నుంచి ఒక ప్రొడ్యూసర్ దాకా కట్టిపడేసే సినిమా కథ గురించి ఆలోచిస్తున్నారా.. మీ ఇష్టం కోసం సినిమా తీసుకుంటున్నారా.. అని ఆలోచిస్తే కథలో క్లారిటీ వస్తుంది. మీరు నమ్మిన కొంతమందితో కథ గురించి మాట్లాడండి. అప్పుడు కొన్ని కొత్త కోణాలు తెలుస్తాయి. దాని వల్ల మీకు మరింత క్లారిటీ వస్తుంది. అమ్మాయి లిఫ్ట్ ఇస్తే దర్శకత్వం: బి.సంతోష్కృష్ణ ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అబ్బాయికి తన స్కూటీపై లిఫ్ట్ ఇస్తుంది. అతడు తనకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయితోనే మిస్బిహేవ్ చేసి, సైకోలా నటించి ఆమెను ఫూల్ చేయాలనుకుంటాడు. అనుకోని పరిణామానికి అమ్మాయి తత్తరపడినా, ధైర్యం కోల్పోకుండా దెయ్యంలా నటించి ఆ అబ్బాయిని ఫూల్ చేస్తుంది. కాస్తంత హారర్ కలగలిసిన హాస్యచిత్రం ఇది. నౌ ఏ డేస్ లవ్స్టోరీ కథ, దర్శకత్వం: రాజు కూరెళ్ల ప్రేమ గొప్పదనాన్ని చెప్పేందుకు రాజు కూరెళ్ల రూపొందించిన చిత్రం ఇది. ‘ఎటువంటి స్వార్థం లేనిదే ప్రేమ. నేటి యువతీ యువకుల దృష్టిలో మాత్రం ప్రేమ ఒక వ్యామోహంగా మారింది. ప్రేమించడం తప్పు కాదు కానీ, ఆ ప్రేమను ఎంతమంది పెళ్లి వరకు నిలబెట్టుకుంటున్నారు? ప్రేమ పేరుతో మోసపోయిన వాళ్ల కంటే, ప్రేమ పేరుతో ప్రేమను మోసం చేస్తున్న వాళ్లే ఎక్కువ..’ ఈ విషయాన్ని చెప్పడానికే తాను ఈ షార్ట్ మూవీ తీశానంటున్నారు రాజు కూరెళ్ల మేరా మొబైల్ ఘుమ్ గయా దర్శకత్వం: ఆర్.కె.సాగర్ హైదరాబాదీ యువకుడు ఆర్.కె.సాగర్ రూపొందించిన హాస్యభరిత సందేశాత్మక లఘుచిత్రం ఇది. ఇందులో ఒక యువకుడు తన మొబైల్ఫోన్ పోగొట్టుకుంటాడు. అందులో కీలకమైన అతడి వ్యక్తిగత సమాచారమంతా ఉంటుంది. ఆ మొబైల్ తిరిగి అతడికి దొరికేలోగానే అందులోని సమాచారమంతా ఇంటర్నెట్ ద్వారా లక్షలాది మందికి చేరుతుంది. మొబైల్ఫోన్లను అజాగ్రత్తగా ఉపయోగిస్తే ఎలాంటి అనర్థాలు వాటిల్లుతాయో ఇందులో హాస్యభరితంగా చూపడం విశేషం ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యుూత్లో యువు క్రేజ్. మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెరుుల్ టు sakshicityplus@gmail.com -
హృదయ నగరం
వెరైటీ డ్రెస్సింగ్.. డిఫరెంట్ లుక్స్.. కిక్కిచ్చే డైలాగ్స్.. వెరసి సంపూ! ఉరఫ్ సంపూర్ణేష్ బాబు!! పొట్టి చిత్రాల ప్రపంచంలో రికార్డు లైక్స్ సంపాదించిన ఈ బుల్లోడు.. వెండితెరపై ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చిన్నతనంలో సిటీకి చుట్టపుచూపుగా వచ్చిన నాడే ఈ భాగ్యనగరంపై మనసు పారేసుకున్నాడు. అడుగడుగునా థియేటర్స్ ఉన్న ఒకప్పటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే మనోడికి ప్రాణం. ఇప్పుడన్ని థియేటర్లు లేకపోయినా.. తన హృదయం ఎప్పుడూ ఐ లవ్ హైదరాబాద్ అంటుందని చెబుతాడు. - శిరీష చల్లపల్లి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నాపై వాటి ప్రభావమే ఎక్కువగా ఉండేది. మా ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మా బంధువులు ఉండేవారు. దీంతో మా ఫ్యామిలీ సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలే సినిమాలు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్లం. అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సూపర్గా ఉండేది. ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ థియేటర్లన్నీ మాల్స్లా మారిపోతున్నాయి. అప్పటి క్రాస్ రోడ్స్ మళ్లీ తీసుకురాలేం. కానీ, అక్కడి బావర్చి బిర్యాని టేస్ట్ మాత్రం ఇప్పటికీ మారలేదు. పెద్దమ్మ తల్లో.. సాయంత్రం వేళలో ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి. కాస్త చీకటి పడ్డాక బిర్లా టెంపుల్కు వెళ్లి.. పై నుంచి లైట్ల వెలుతురులో మిరుమిట్లు గొలిపే సిటీని చూస్తే భలేగా ఉంటుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడికి తరచూ వెళ్తుంటాను. నా వరకైతే పెద్దమ్మతల్లి పవర్ఫుల్ దేవత. ఇలా కోరుకోగానే.. అలా తీర్చేస్తుంది. గోల్కొండ చూడ పోత.. గోల్కొండ వెళ్తే ఫుల్ రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. కోట విశేషాలు గైడ్లు చెబుతుంటే.. ఐస్క్రీమ్ తింటూ అవి వింటుంటే ఆ మజాయే వేరు. ఇక రంజాన్ నెలలో చార్మినార్ అందాలు చూడాల్సిందే. అక్కడ షాపింగ్ సరదాగా ఉంటుంది. మక్కామసీద్ ముందుండే పావురాలు..ఎంతో హాయినిస్తాయి. టేస్టీ సిటీ సిటీలో ఒక్కో చోట ఒక్కో రుచి ఫేమస్. పూర్ణ టిఫిన్ సెంటర్లో దోశ అదుర్స్. ఉలవచారు రెస్టారెంట్లో చేపల పులుసు, బిర్యానీ అంటే చాలా ఇష్టం. అమీర్పేట చందనాబ్రదర్స్ బయట స్వీట్కార్న్, ఐస్క్రీమ్ అండ్ సోన్పాపిడి ఎంతో రుచిగా ఉంటాయి. అవి చూడగానే చిన్నపిల్లాణ్ని అయిపోతాను. బేగంపేట లైఫ్స్టైల్ పక్కన ఉన్న ఫ్రాంకీ రెస్టారెంట్లో పనీర్ టిక్కా భలే ఇష్టం. సిటీవాసులు ఎంజాయ్మెంట్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఇక్కడే ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. నేను ఓషన్ పార్క్ వెళ్లానంటే ఓ పట్టాన బయటకు రాను. కల్చర్ నేర్పింది.. హైదరాబాదీతో మాట్లాడుతుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. హైదరాబాదీలు మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. ఇక్కడి జనాలు సిటీ కల్చర్లో పుట్టి పెరిగినా.. కొత్తగా వచ్చిన వారితో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను సిటీ కల్చర్ వాళ్ల నుంచే నేర్చుకున్నాను. -
చిన్న చిత్రం... పెద్ద ప్రమోషన్
ఆక్టోపస్ స్టూడియోస్. షార్ట్ ఫిలిం ప్రమోషనే దాని లక్ష్యం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. స్క్రీనింగ్, ఆన్లైన్ ప్రమోషన్తోపాటు జాతీయ, అంతర్జాతీయ షార్ట్ఫిలిం ఫెస్టివల్స్కు చిన్న సినిమాలను పంపించి ప్రమోట్ చేస్తోంది. ఆక్టోపస్ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ రాహుల్రెడ్డి మాటల్లో... షార్ట్ ఫిలింస్కి క్రేజ్ చాలా ఉంది. కానీ, వాటి స్క్రీనింగ్, ప్రమోషన్కి ఆర్గనైజ్డ్ స్థలం లేదు. ఈవెంట్స్, ఫెస్టివల్స్ ఫలానా టైమ్కి జరుగుతాయనే సమాచారం ఉండదు. ఈ ఇబ్బందులన్నీ గుర్తించి ఆక్టోపస్ స్టూడియోస్ని 2010లో ప్రారంభించాం. ఇప్పటివరకు 100 పైగా ఫిలిం మేకర్స్కు అవకాశం లభించింది. తణికెళ్ల భరణి, నగేష్ కుకునూర్ వంటి వాళ్లతో జ్యూరీ ఏర్పాటు చేశాం. వచ్చిన సినిమాల్లోంచి స్క్రీనింగ్కి ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ కోసం యూకే, యూఎస్ నుంచి కూడా ఎంట్రీలు వస్తుంటాయి. స్క్రీనింగ్స్ ద్వారా సినిమా అవకాశాలు వచ్చినవాళ్లూ ఉన్నారు. హుస్సేన్ షా, ప్రదీప్ అద్వైతమ్ తదితరులంతా ఇక్కడి నుంచే కెరీర్ మొదలు పెట్టారు. కలవాలంటే.. నాకు (rahul@octopusgroup.in) మెయిల్ చేస్తే సరిపోతుంది. సినిమా బాగుంటే ఆక్టోపస్ ఆన్లైన్ చానల్ , ఫెస్బుక్ పేజీ ద్వారా ప్రమోట్ చేస్తాం. మేకర్ అంగీకారంతో వాటిని కాంపిటీషన్స్కి, షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్కి కూడా పంపిస్తాం. ఆక్టోపస్లో మేం 8 ఫిలింస్ ప్రొడ్యూస్ చేశాం. జర్మనీ, టొరంటో, ఆస్ట్రేలియా, లాస్ ఏంజిలిస్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీన్ అయ్యాయి. భవిష్యత్తులో ఆక్టోపస్ను ఇండియాలోని ఇతర నగరాలకు విస్తరించాలని అనుకుంటున్నాం. టచ్ చేశాడు ‘చిన్న చిత్రం’ హరీష్ నాగరాజు జీవితాన్ని పెద్ద వులుపే తిప్పింది. ఫార్మసీ డిగ్రీ చేత పట్టిన ఇతడిని అనూహ్యంగా సినీ పరిశ్రవులో స్థిరపడేలా చేసింది. అతడు నటించిన తొలి లఘు చిత్రం ‘టచ్ చేశాడు’ యుూట్యూబ్లో పదకొండు లక్షల హిట్స్ సంపాదించింది. దెబ్బకు వునోడి కెరీర్కు సిల్వర్ స్క్రీన్ ‘టచ్’ ఇచ్చేసింది. కట్ చేస్తే... ప్రస్తుతం ప్రవుుఖ చిత్రాలకు రైటర్గా, నటుడిగా వూంచి జోష్ మీదున్నాడీ కుర్రాడు. సినీ రంగంలో తన ‘షార్ట్’ జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు... సొంతూరు గుంటూరు. చెన్నైలో బిఫార్మసీ చేశా. మొదటి నుంచీ డ్యాన్స్పై వుంచి పట్టు ఉంది. కాలేజీ డేస్లో కల్చర్ ప్రోగ్రామ్స్లో భాగస్వావ్యుం. చిన్న చిన్న కవితలు, పాటలు రాసి ఫ్రెండ్స్కు వినిపించేవాడిని. కాలేజీ ఫంక్షన్లలో పాడేవాడిని. 2011లో వూటల రచరుుత వెన్నెలకంటి వద్ద వూటలు, రచనలో మెళకువలు నేర్చుకున్నా. అప్పుడే జెమినీ టీవీలో ‘దవుు్మంటే చెప్పేసెయ్’ కార్యక్రవుం యూంకర్గా అవకాశం వచ్చింది. లఘు చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. అదే సవుయుంలో సన్నిహితులు నిర్మిస్తున్న ‘టచ్ చేశాడు’లో నటించే అవకాశం వచ్చింది. దీనికి అనూహ్యంగా 11 లక్షల హిట్స్ వచ్చారుు. ఇక అక్కడి నుంచి కెరీర్ కొత్త వులుపు తిరిగింది. ఓ పక్క రచనా సహకారం అందిస్తూనే... బిల్లా రంగా, హమ్ తుమ్ వంటి సినివూల్లో నటించా. ప్రస్తుతం ఎంఎస్ నారాయుణ కువూర్తె దర్శకత్వంలో వస్తున్న ‘సాహెబ్ సుబ్రహ్మణ్యం’లో ప్రధాన పాత్ర చేస్తున్నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో... ఒకసారి మంచి జరిగిందని ప్రతిసారీ మంచే జరగదు. అలాగని ఒకసారి చెడు జరిగితే ప్రతిసారీ చెడే జరగదు. కాల మహిమ, పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటాయో చెప్పేందుకు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’ షార్ట్ మూవీని దర్శకుడు, రచయిత వసంత్ మజ్జి తెరకెక్కించారు. దోస్త్ మేరా దోస్త్ చిన్ననాటి మోజు ఈ చిన్నోడిని సినివూ రంగం వైపు నడిపించింది. ‘పొట్టి సినివూ’తో మొదలైన ప్రయూణం ఇప్పుడు ‘బిగ్ స్క్రీన్’కు చేరింది. ‘దోస్త్ మేరా దోస్త్’... ఇదీ ఇతగాడు తీయుబోయే చిత్రం. సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకొంటున్న ఈ కుర్రాడు నిఖిలేష్ గోతాని... తన ప్రయూణంలోని వుుఖ్యమైన వుజిలీలను ‘సిటీ ప్లస్’ వుుందుంచాడు... సినివూ తీయుడవుంటే వూవుూలు విషయువూ! అంత వ్యయుం వునం భరించలేం. అందుకే విరాళాలు సేకరించాలనుకున్నా. ‘దోస్త్ మేరా దోస్త్’ సినివూ కోసం ‘థౌజండ్ ప్రొడ్యూసర్స్.కామ్’ ప్రారంభించా. ప్రతి జిల్లాలో వెయ్యిమంది నుంచి డొనేషన్స్ సేకరించేలా ప్లాన్ చేశాం. స్నేహితుల సహకారంతో డోర్ టు డోర్ తిరిగాం. కొందరు కాదన్నారు.. వురికొందరు చేయుూతనందించారు. మిగిలింది ఫ్రెండ్సందరం షేర్ చేసుకొంటున్నాం. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డెరైక్షన్, డైలాగ్స్, లిరిక్స్ నావే. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఇతివృత్తంతో కథ రాశా. ఫ్రెండ్స్, ప్రేవు చుట్టూ కథ తిరుగుతుంది. పొట్టిశ్రీరావుులు తెలుగు యుూనివర్సిటీ నుంచి తెరకెక్కుతున్న తొలి చిత్రం వూదే. వూ సొంతూరు ఆదిలాబాద్.. వచ్చే నెల అక్కడే షూటింగ్ ప్రారంభిస్తాం. అలా మొదలైంది... వుూవీలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అప్పుడప్పుడూ పాటలు రాస్తూ, డ్రావూలు వేసేవాడిని. ఎంఎస్సీ చేశా. రెండేళ్లపాటు తోగాని టెక్నాలజీస్ నడిపించా. సినివూల మీదున్న ఆసక్తితో దాన్ని వదిలేసి తెలుగు వర్సిటీలో ఫిల్మ్ డెరైక్షన్ పీజీ డిప్లవూలో చేరా. ఇక్కడ నేను తీసిన ‘వురో వూసం’ షార్ట్ ఫిల్మ్కు వుంచి స్పందన వచ్చింది. ఆ తరువాత ‘నేషనల్ సెల్యూట్’ తీశా. ఆగస్టు 15న టైస్టు వేసుకున్న బాంబు బ్లాస్ట్ ప్లాన్ను వికలాంగుడైన బిచ్చగాడు ఎలా ఛేదించాడన్నది కథ. దీనికి అవార్డు వచ్చింది. ఈ స్ఫూర్తితోనే బిగ్ స్క్రీన్కు షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యూ. అందుకు అవ్మూనాన్నల ప్రోత్సాహం కూడా ఉండటం వురింత బలాన్నిచ్చింది. - వాంకె శ్రీనివాస్ ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యుూత్లో యువు క్రేజ్. మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com. -
ఐడియాతో రండి.. షార్ట్ఫిల్మ్తో వెళ్లండి
ఐడియా ఉంటే చాలు షార్ట్ ఫిల్మ్ తీసేయొచ్చు. బుల్లి సినిమా తీసే క్రమంలో ఏ సహకారం, సమాచారం కావాలన్నా ఇట్టే అందిస్తోంది ఓ వెబ్సైట్ www.shortfilmsintelugu.in తెలుగులో షార్ట్ ఫిలింస్ తీస్తున్నవారు చాలా మందే ఉన్నారు. వారి కోసమే ఒక ఎక్స్క్లూజివ్ వెబ్సైట్ రూపొందించారు. విజయ్.కె.అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ వివరాలేంటో ఆయన మాటల్లో... ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైనా మా వెబ్సైట్కి ఐడియాతో వస్తే షార్ట్ఫిల్మ్తో బయటకు వెళ్తారు. బుల్లి సినిమాలకు వన్ డోర్ సొల్యూషన్ ఇవ్వాలని స్టార్ట్ చేశాను. మా వెబ్సైట్ ఓన్లీ తెలుగు షార్ట్ఫిల్మ్స్ గురించి మాత్రమే. మొదట్లో షార్ట్ఫిల్మ్స్కి చిన్న, చిన్న రివ్యూస్ రాసేవాడిని. నా కామెంట్స్కి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈ క్రమంలో నటన, దర్శకత్వం వంటి వాటిపై దరఖాస్తులను ఆహ్వానిస్తే వారంలోనే 100 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు రోజుకు 300, 400 మంది అప్రోచ్ అవుతున్నారు. అందరికీ రెస్పాన్స్ ఇస్తున్నాం. సినిమా ఎందుకు తియ్యాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుంటాను. సినిమాలను కెరీర్గా చేసుకోవాలంటే గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేసుకోవాలని గైడ్ చేస్తుంటాను. ఎవరైనా స్టోరీ, కాన్సెప్ట్తో వస్తే అతని ఆ కలని రియాలిటీలోకి తీసుకువస్తాం. షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో మూడు స్టెప్స్ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటాయి. వీటితోపాటు ప్లానింగ్లో కూడా హెల్ప్ చేస్తాం. ఏ స్టేజ్లో ఉన్నా చెక్ లిస్ట్ ద్వారా సహకరిస్తాం. ఇంకా ఇండివిడ్యువల్గా వెబ్సైట్లో షార్ట్ఫిల్మ్కి సంబంధించిన అన్ని కేటగిరీస్ ఉన్నాయి. వాటిల్లో ఫారం ఫిల్ చేసి మాకుడిటెయిల్స్ పంపిస్తారు. దానికి లింక్ తయారు చేస్తాం. ఆ డేటా ద్వారా ఫిలిం మేకర్స్ అడిగినప్పుడు వారిని సజెస్ట్ చేస్తాం. షార్ట్ ఫిలింస్లో హద్దులు మీరే సన్నివేషాలుండవనే అమ్మాయిలూ నటనపట్ల ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. స్క్రిప్ట్ను ఓకే చేసిన తర్వాత మేకర్స్కి వీళ్ల డిటెయిల్స్ పంపిస్తాం. కాలేజీ, లవ్వు, అమ్మాయి, బ్రేక్అప్ వీటి గురించి తీస్తున్నారు. నిజ జీవితకథలను తెరకెక్కించడమే ధ్యేయం. మా సర్వీసుకు ఎటువంటి చార్జెస్ లేపు. ఉచితంగా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వి మేక్ కనెక్షన్స్... షార్ట్ఫిల్మ్స్కి ఏం కావలసినా మా వెబ్సైట్ పేరు వినిపించాలనేది గోల్. షార్ట్ఫిల్మ్ డెరైక్టర్స్లో నుంచిఒక్కరైనా టాలీవుడ్ సినిమా తియ్యాలని నా ఆశ. - మధు -
రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్లు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై వాహనదారుల్లో షార్ట్ఫిల్మ్ల ద్వారా అవగాహన కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ షార్ట్ఫిల్మ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించారు. సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, త్రిబుల్ రైడింగ్ తదితర అంశాలపై డిజిక్విస్ట్ సంస్థ రూపొందించిన షార్ట్ఫిల్మ్లను శుక్రవారం నుంచి తెలంగాణ జిల్లాలోని ఉన్న థియేటర్లలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. ప్రతి థియేటర్ యాజమాన్యం ఈ షార్ట్ ఫిల్మ్లను నెలరోజుల వ్యవధిలో కనీసం ఏడు రోజులు ప్రదర్శించాల్సి ఉంటుంది. -
చిత్రమైన నిశ్శబ్ద లఘు చిత్రం!
ఆ మధ్య కమల్హాసన్తో కలసి తమిళంలో ‘ఉన్నై పోల్ ఒరువన్’, తెలుగులో ‘ఈనాడు’ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు చక్రి తోలేటి గుర్తున్నాడా? హిందీ హిట్ ‘ఎ వెడ్నెస్ డే’ను అలా రెండు భాషల్లో రీమేక్ చేసిన చక్రి చిన్నప్పుడు ‘సాగర సంగమం’ చిత్రంలో ఓ బుజ్జి కెమేరా పట్టుకొని, ‘‘భంగిమ’’ అంటూ తిరిగిన బాల నటుడు. పెద్దయ్యాక, దర్శకుడయ్యాడు. తాజాగా చక్రి ‘అన్రీడ్’ అనే మాటలు లేని ఓ సెలైంట్ లఘు చిత్రం రూపొందించాడు. దీన్ని బ్లాక్ అండ్ వైట్లో, కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండే కెమేరాతో చిత్రీకరించారు. వీధుల్లో తిరుగుతూ, తిండి కోసం కష్టపడే ఓ అబ్బాయికి ఓ రోజు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలే ఈ చిత్రం. పాతకాలం పద్ధతుల్లో లాగా కెమేరా కదలకుండా స్థిరంగా ఉంటే, నటీనటులే ఫ్రేములోకి వస్తూ వెళుతూ ఉండేలా చిత్రీకరణ జరపడం కొత్త అనుభవమని చక్రి అన్నారు. మనసుకు హత్తుకుపోయే కథతో లఘు చిత్రాలు తీయమంటూ సీగ్రామ్స్ సంస్థ ప్రసిద్ధ దర్శకులు అనురాగ్ కాశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వారితో పాటు చక్రిని కోరింది. అందులో భాగంగా చక్రి ఈ చిత్రం తీశారు. దీని చిత్రీకరణ కోసం మామూలు సినీ కళాకారులను కాకుండా, బస్తీలలోని వ్యక్తులను చక్రి ఎంచుకున్నారు. మూకీ చిత్రాల రోజుల్లో లాగా ఇందులోనూ సన్నివేశాల మధ్యలో సంభాషణల టైటిల్ కార్డులు వస్తూ, అప్పటి చిత్రాలను గుర్తుకు తెస్తుంటాయి. ‘బాక్సాఫీస్ లెక్కల ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా చిత్రీకరించే సౌకర్యం లఘు చిత్రాలకు ఉందని, ఇది మనసు పెట్టి చేసిన ప్రయత్నం అని’ చక్రి తోలేటి అన్నారు. ‘యు’ ట్యూబ్లో అందుబాటులో ఉన్న ఈ ‘అన్రీడ్’ లఘు చిత్రం వీక్షకుల మనసుల్ని కూడా ఆకట్టుకుంటే చక్రికి అంతకంటే ఏం కావాలి! -
చిత్ర విశాఖ
విస్తరిస్తున్న శిక్షణ తరగతులు నటన, దర్శకత్వ శాఖల్లో నిపుణత కోరుతున్న ఔత్సాహికులు ఏయూ క్యాంపస్, న్యూస్లైన్: లఘు చిత్రాల హవా.. టీవీ సీరియల్స్ జోరు.. సినీ నిర్మాణ కేంద్రంగా విశాఖ ఎదుగుతున్న తీరు.. ఇవీ ప్రస్తుతం ఔత్సాహిక కళాకారులను ఊరిస్తున్న అంశాలు. ఇటీవల కాలంలో నగరంలో శిక్షణ తరగతులు విరివిగా జరుగుతున్నాయి. తమలో దాగివున్న కళాకారుడిని బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యాలని, సృజనాత్మకతను ప్రదర్శించాలని, వెండి తెరపై వెలిగిపోవాలని ఎందరో తపన పడుతున్నారు. ఈ కలలు నెరవేరాలంటే ఒక్క చాన్స్ కావాలి. ఇందుకోసం ఎంతో నిపుణత, పరిణతి సాధించాలి. బంగారానికి మెరుగుపెట్టినట్టు వీరి ప్రతిభకు శిక్షణ కూడా తోడైతే మరింతగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సహజసిద్ధమైన ప్రకృతి సోయగాలు, ఎత్తయిన పచ్చని కొండలు, లోయలు, అందాలొలికే అనంత సాగరం.. విశాఖ జిల్లాకు దేవుడిచ్చిన వరాలు. చూడచక్కని లొకేషన్లతో అనేక ప్రాంతాలు చిత్ర నిర్మాణానికి అనువుగా ఉంటాయి. చిత్ర పరిశ్రమకు రాజధానిగా ఎదుగుతున్న ఈ సుందర నగరంపై వర్ధమాన నటీనటుల ఆశలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో దర్శకత్వం, నటన తదితర అంశాలలో శిక్షణ అందించే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. నగరం నుంచే కాకుండా గిరిజన ప్రాంతమైన పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలవాసులు సైతం ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. కాలానుగుణంగా కోర్సులు ప్రారంభిస్తాం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డిజిటల్ ఫిల్మ్ మేకింగ్పై సర్టిఫికేట్ కోర్సును అందిస్తున్నాము. త్వరలో దర్శకత్వం, నటన అంశాలపై కూడా కోర్సులను ప్రారంభించే ఆలోచన ఉంది. - ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఉప కులపతి ప్రొడక్షన్ రంగంలో అడుగుపెడతా.. భవిష్యత్తులో ప్రొడక్షన్ రంగంలో రాణిం చాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. అవగాహన కోసం శిక్షణ శిబిరానికి హాజరయ్యాను. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. - ఎం.చేతన్ వారధిగా నిలిచే సంస్థలు కావాలి విశాఖ కేంద్రంగా నిపుణులను తీర్చిదిద్దే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సినీ అవకాశాల గురించి ఆర్టిస్టులకు, స్థానిక కళాకారుల ప్రతిభ గురించి చిత్ర పరిశ్రమకు సమాచారం అందిస్తూ వారధిగా నిలిచే సంస్థలు ఏర్పాటు కావాలి. - మీగడ శివశ్రీ, దర్శకుడు అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం.. భాగ్యనగరంలో మూడు సంవత్సరాల శిక్షణలో చెప్పే విషయాలను ఇలాంటి శిబిరాల్లో కేవలం ఐదారు రోజులలో వివరించాల్సి వస్తోం ది. దీంతో వీరికి స్థూలంగా అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం. ఇది పునాదిగా ప్రతిభను మెరుగుపరచుకోవాలి. - నటరాజమూర్తి, ప్రిన్సిపాల్, మధు ఫిలిం ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ ఈ శిబిరాల్లో పాల్గొంటున్న ఔత్సాహికులు నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడానికి, లోతైన అధ్యయనానికి శిక్షణ సంస్థలు శాస్వత ప్రాతిపదికన ఏర్పాటైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రముఖ శిక్షకుడు సత్యానంద్ ఒక్కరే చాలాకాలంగా విశాఖలో నటులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పూర్తిస్థాయిలో శిక్షణ అందించే కేంద్రాలు నగరంలో ఏర్పడలేదు. మినీ థియేటర్ నిర్మించాలి ప్రభుత్వం తరపున లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. మినీ థియేటర్ నిర్మించి, నగరంలో చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్స్ను ప్రదర్శించాలి. తద్వారా మంచి చిత్రాలకు ఆదరణ లభిస్తుంది. - ఆచార్య పి.బాబీవర్ధన్, ఏయూ జర్నలిజం విభాగం -
షార్ట్ ఫిల్మ్తో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేశాడు!
ప్రతిభ ఉండాలే కానీ... అవకాశాలు అవే వెదుక్కొంటూ వచ్చే కాలం ఇది. అయితే ఆ అవకాశాల కోసం వల పన్నాలి. ప్రతిభావంతుల కోసం అన్వేషించే వారిని ఆకర్షించగలగాలి. అలాంటి ఒడుపు తెలిసిన వాళ్లు చాలా సులభంగా సక్సెస్ను సొంతం చేసుకొంటున్నారు. ఇలా సక్సెస్ అయిన యువకుడే ఆదిత్య. 23 యేళ్ల వయసుకే బాలీవుడ్ దర్శకులే పిలిచి అవకాశాలు ఇచ్చేంత స్థాయికి చేరుకొన్నాడు. అలా అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఆదిత్య చూపిన ఒడుపు , చొరవ ఏమిటంటే... ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక.. ఇంజనీరింగ్ చదవమని చెప్పారట ఆదిత్య జెల్లా తల్లిదండ్రులు. అయితే అతడికి మాత్రం సినిమా అంటే ఆసక్తి, తనలోని సృజనాత్మకతను చాటాలనే అభిలాష ఉన్నాయి. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి మూడేళ్ల డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఆ డిగ్రీ పూర్తవ్వగానే మళ్లీ సినిమా గుర్తుకొచ్చింది. అయితే గుడ్డెద్దు చేల్లో పడినట్టు కాకుండా ముందు మెళుకువలను నేర్చుకోవాలని అనుకొన్నాడు. అందుకోసం ప్రసిద్ధ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగు నెలల కోర్సును పూర్తి చేశాడు. థియరీ అక్కడ పూర్తయ్యింది. మరి ఆ థియరీని మాత్రమే చూసి ఎవరూ అవకాశం ఇవ్వరు కదా. అందుకే ప్రాక్టికల్గా తనను తాను నిరూపించుకొనే ప్రయత్నంలో షార్ట్ఫిల్మ్ మేకింగ్పై దృష్టి సారించాడు ఈ యువకుడు. కోర్సు విషయమై అమెరికాలో ఉన్న సమయంలోనే సరదాగా ఒక షార్ట్ఫిల్మ్ తీసి ఇంటర్నెట్లో పెట్టాడు ఆదిత్య. ఫ్లోరిడా నుంచి మియామీ మధ్య ప్రయాణం చేస్తూ ఆ జర్నీ గురించి ఒక సరదా షార్ట్ఫిల్మ్ తీశాడు. ఇక్కడ కట్ చేస్తే బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్ హీరోగా రూపొందుతున్న ‘గో గోవా గాన్’ సినిమా సెట్స్పై తేలాడు ఆదిత్య. ‘న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సుపూర్తి చేశాను’ అని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఆదిత్యకు అవకాశం కలిసివచ్చింది. ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయిన షార్ట ఫిల్మ్ ఇతనికి అవకాశాలను తెచ్చిపెట్టింది. ‘గో గోవా గాన్’ సినిమా దర్శక ద్వయం రాజ్, డీకేలు ఆదిత్యను తమ టీమ్లో చేర్చుకొన్నారు. సినిమా రూపకల్పనలో సృజనాత్మక సాయం చేయమని అడిగారు. ఆ విధంగా వ్యక్తిగత ఆసక్తి, అభిలాష, న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీ కోర్సు, షార్ట్ ఫిల్మ్.. ఇవన్నీ కలిసి ఆదిత్యను ఛాంపియన్ను చేశాయి. డిఫరెంట్ కాన్సెప్ట్తో తయారైన ‘గో గోవా గాన్’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రచారం కోసం ఆదిత్య రూపొందించిన ప్రోమోలకు బాగా పేరు వచ్చింది. దీంతో ఇతడికి అవకాశాలు కలిసి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడు మకాం మార్చాడు. బాలీవుడ్లో అవకాశాలు వస్తుండటంతో ముంబై చేరుకొన్నాడు. తను సినిమా అవకాశాలు పొందడం తన ఇంట్లో వాళ్లను అమితాశ్చర్యపరిచిందని అంటాడు ఆదిత్య. తనకు సైఫ్ వంటి స్టార్హీరో సినిమాలో అవకాశం వచ్చిందని అంటే మొదట ఎవరూ నమ్మలేదని, తీరా తాను రూపొందించిన వీడియో ప్రోమోలు టీవీల్లో ప్రసారం అయ్యే సరికి గర్వమనిపించిందని ఆదిత్య చెప్పాడు. చాలా చిన్న వయసులోనే, తొలి సినిమాతోనే సైఫ్ వంటి హీరోతో పనిచేయడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని ఆదిత్య వివరించాడు. ఎక్కువ సినిమాలకు పనిచేయాల్సిన అవసరం లేకుండానే.. ఆదిత్య తగిన గుర్తింపు సంపాదించుకొన్నాడు. తెలుగు ‘డీ ఫర్ దోపిడి’ అనే సినిమాకు కో డెరైక్టర్గా కూడా పనిచేశాడు. ఆదిత్య తన అభిలాషను నెరవేర్చుకోవడాన్ని గమనిస్తే డబ్బు, తెలివి తేటలు మాత్రమే కాదు.. అవకాశాలు సంపాదించుకోవడానికి వాటిని సద్వినియోగం చేసుకొనే నేర్పు కూడా తెలిసి ఉండాలని అనిపిస్తుంది. హైదరాబాద్కు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడు మకాం మార్చాడు. బాలీవుడ్లో అవకాశాలు వస్తుండటంతో ముంబై చేరుకొన్నాడు. తను సినిమా అవకాశాలు పొందడం తన ఇంట్లో వాళ్లను అమితాశ్చర్యపరిచిందని అంటున్నాడు ఆదిత్య.