singing
-
క్రేజీ.. కేజే..
నికితా నాయర్ (26) ఆరేళ్లుగా విదేశాల్లో ఉంటూ రెండు నెలల క్రితం సిటీకి తిరిగి వచ్చారు. ఈ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ పాడడంలో ప్రొఫెషనల్ కాదు. కానీ ఆమె ఒంటరిగా కరోకే ఈవెంట్లకు వెళ్లి ఇతర క్రూనర్లతో కలిసి పాడడం ప్రారంభించి ఇప్పుడు రెగ్యులర్గా మారారు. ‘నేను ఆల్కహాల్ తాగను. నచ్చిన ఫుడ్ తిని నా హృదయానికి దగ్గరగా అనిపించిన పాటలు పాడతాను’ అని నాయర్ చెప్పారు. ఇలాంటి బాత్రూమ్ సింగర్స్ని బాల్రూమ్ సింగర్స్గా మారుస్తున్న క్రెడిట్ కరోకే జాకీ (కేజే)లకే దక్కుతుంది. – సాక్షి, సిటీబ్యూరోపాట మొదలవుతుంది.. సంగీతం వినబడుతుంటుంది. స్క్రీన్ మీద ఆ పాట సాహిత్యం కనబడుతుంటుంది. ప్రేక్షకుల్లో నుంచి కొన్ని చేతులు గాల్లోకి లేస్తాయి. ఆడియోలో గాత్రం మొదలయ్యే సమయానికి ఆ గాల్లోకి లేచిన చేతుల్లోని ఒక చేతిలో మైక్ పెడతాడు కేజే లేదా కరోకే జాకీ. ఆ సమయంలో అసలు గాయకుని గాత్రం స్థానంలో సదరు చేతి తాలూకూ వ్యక్తి గొంతు భర్తీ అవుతుంది. ఇలా మ్యూజిక్ ట్రాక్లో వాయిస్ని కట్ చేసి ఆ స్థానంలో మన వాయిస్ని కలిపి పాడడమే కరోకే సింగింగ్ అంటారు. ఇప్పుడు సిటీలో జరిగే పార్టీ ఈవెంట్స్లో ట్రెండీగా మారాయి ఈ కరోకే నైట్స్. ‘తాను డీప్ పర్పుల్, ది బీటిల్స్లోని రెట్రోలను, హిందీ పాట లేదా రాక్ వినడానికి ఇష్టపడతా’ అని నికితా నాయర్ చెప్పారు. ఒకప్పుడు ఇలా ఇష్టపడడం అనేది కేవలం వినడం వరకూ మాత్రమే పరిమితమైతే.. ఇప్పుడు అది పాడడం వరకూ చేరింది. ఆహారం, పానీయాలతో పాటుగా ముందుగా రికార్డ్ చేసిన ట్రాక్ల ద్వారా మైక్రోఫోన్లో పాడటం కొత్త సోషల్ నెట్వర్కింగ్ మంత్రంగా మారింది. నో డ్రింకింగ్ ఓన్లీ సింగింగ్.. ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన కోలిన్ డిసౌజా (28) మాట్లాడుతూ ‘నాకీ సరదా బెంగళూర్లో అలవాటైంది. డ్రింక్ చేయడానికి కాకుండా పాడటానికి మాత్రమే రెస్టో–బార్లను సందర్శిస్తాను. పాటల్ని కలిసి పాడే సమయంలో కొత్త పార్ట్నర్స్ లభిస్తుంటారు’ అన్నారు. నగరానికి చెందిన కరోకే జాకీ రోగర్ వైట్ ప్రకారం.. ‘తెలుగు పాటలకు ఇంకా పబ్స్, క్లబ్స్లో జరిగే కరోకే నైట్స్లో ప్రాచుర్యం పెరగలేదు. పాశ్చాత్య సంగీతానికే డిమాండ్. బ్రయాన్ ఆడమ్స్ రాసిన ‘సమ్మర్ ఆఫ్ 69’ బాన్ జోవి రాసిన ‘ఇట్స్ మై లైఫ్’ వంటి పాటలు కరోకే నైట్స్లో ప్రసిద్ధి చెందాయి. రెట్రో, రెగె, ఓల్డ్ రాక్ పాప్ శైలులతో గొంతు కలపడానికి అతిథులు ఇష్టపడతారు.’ప్రైవేట్ ఈవెంట్స్లోనూ.. పెళ్లిళ్లు, బర్త్డేలు తదితర వేడుకల్లోనూ ఇప్పుడు కరోకే సందడి బాగా పెరిగింది ‘గతంలో పబ్స్, క్లబ్స్కే పరిమితం అయినప్పటికీ ఇప్పుడు వివాహ వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలతో పాటు కరోకే కూడా భాగం చేస్తున్నారు’ అని కేజే నోయల్ చెప్పారు. అయితే వీటిలో ఎక్కువగా తెలుగు, హిందీ పాటలకే పెద్ద పీట వేస్తున్నారని, అలాగే ఇలాంటి చోట అతిథులను పాడించడం అంత సులభం కాదని పలువురు కేజేలు అభిప్రాయపడుతున్నారు. కరోకే నైట్స్కి పేరొందిన ఓ క్లబ్కు సహ–యజమాని దీప్తి కే దాస్ మాట్లాడుతూ.. ‘కరోకే కాలం చెల్లిన డీజే నైట్ల కంటే ఎక్కువ ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఆదివారం బ్రంచ్ తర్వాత యువత దీని కోసం బాగా వస్తారు. ఈ ట్రెండ్లో మమేకమవుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి టేబుళ్లను రిజర్వ్ చేసుకుంటాయి. డైనింగ్తో పాటు సింగింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పారు. పుట్టి 20 ఏళ్లయినా..నైట్ పార్టీస్లో ఈ కరోకే ట్రెండ్ సిటీలో ఊపిరిపోసుకుని దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఆనంద్ అనే డీజే తాను కేజేగా మారి ఈ ట్రెండ్కు బోణీ కొట్టారు. అప్పటి నుంచీ ఆయన మాత్రమే సిటీలో కేజేగా సుపరిచితులుగా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కరోకే ట్రెండ్ బాగా పెరిగింది. దీంతో సిటీలో కేజేల సందడి కూడా పెరిగింది. ఎఫ్ అండ్ బీ నిపుణులు గఫNర్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు, వారానికి రెండు కరోకే నైట్స్ ఉండేవి. ఇప్పుడు, నాకు కనీసం 10 వరకూ ఉంటున్నాయి’ అని చెప్పారు. -
శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు ఏ పాటైనా వెన్నెలా రాగమే..!
బాలీవుడ్ సినిమా ‘స్త్రీ–2’లోని ‘ఆజ్ కీ రాత్; పాట ఇప్పటికీ హల్చల్ చేస్తూనే ఉంది. ‘బిల్బోర్డ్’ చాట్లో టాప్లో ఉంది. మధుబంటి బాగ్చీ ఆలపించిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ బెంగాలీ సింగర్, కంపోజర్ గురించి తెలుసుకుందాం. హిందుస్థానీ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ ఆగ్రా ఘరానాలతో పరిచయం ఆమె ఆస్తి. మన శాస్త్రీయ సంగీతం నుంచి పాశ్చాత్య పాప్ వరకు ఆమె గొంతులో అలవోకగా వినిపిస్తాయి. పశ్చిమ బెంగాల్లోని బలూర్ఘూట్ ఆమె స్వస్థలం. తండ్రి ప్రొఫెసర్. తల్లి వ్యాపారవేత్త. కోల్కత్తాలోని ‘హెరిటేజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో డిగ్రీ, కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీ నుంచి లేజర్ అండ్ ఆప్టికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసింది. బెంగాలీ మ్యూజిక్ బ్యాండ్ ‘మృతిక’తో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. బెంగాలీ చిత్రం ‘అమీ ఆర్ అమర్ గర్ల్ఫ్రెండ్స్’తో చిత్రరంగంలోకి అడుగుపెట్టింది. (చదవండి: ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్గా..!) -
కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్గా ఉంటారు. కేవలం ఆర్టిసీ సంస్థ,ఉద్యోగులు, సంక్షేమం, సమస్యలు ఇవి మాత్రమే కాకుండా, అనేక సామాజిక అంశాలపై కూడాపలు ఆసక్తికర విషయాలను ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది.ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా చేతితో, తాళం వేస్తూ లయబద్దంగా పాడటం ఆకట్టుకుంటోంది. అటు ఆ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులైపోయారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ ప్రశించారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024 -
మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..
'టిబెటన్ సింగింగ్ బౌల్స్'ని ధ్వనితో అందించే ఒక విధమైన హీలింగ్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గిన్నెలు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యంగా బౌద్ధ ఆచారాలలో ఉపయోగిస్తారు. మంచి ఆలోచనలకి, ధ్యానానికి సహాపడతాయని నమ్ముతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 'టిబెటన్ సింగింగ్ బౌల్' అనేది ధ్యానం, వైద్యం, విశ్రాంతి కోసం ఉపయోగించే ఒక సంప్రదాయ వాయిద్యం. దీన్ని లోహాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ గిన్నెలను మేలట్(ఒక రకమైన సాధనం)తో అంచు వెంబడి కొడితే ప్రతిధ్వనించే శబ్దాలు వస్తాయి. ఈ కంపనాలు ఓదార్పునిచ్చేలా ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఈ సౌండ్ థెరపీ అనేది ఒక రకమైన హీలింగ్ థెరపీలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మానసిక ఉల్లాసానికి, ధ్యానానికి సహాయపడుతుందనేది బౌద్ధుల నమ్మకం.ఈ టిబెటన్ సింగింగ్ బౌల్స్ మానసిక ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది..ఈ బౌల్స్ నుంచి వచ్చే కంపనాలు మనస్సుని, శరీరాన్ని రిలాక్స్గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ శబ్దాలు వినడం వల్ల ఒత్తడి హర్మోన్ స్థాయిలు తగ్గి తద్వారా ఆందోళనను దూరం చేస్తుంది. డీప్ రిలాక్సేషన్..ఈ గిన్నెల ద్వారా వచ్చే ప్రతి ధ్వని ధ్యాన స్థితిలోకి రావడానికి సహాయపడుతుంది. తద్వారా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సున్నితమైన శబ్దాలు మెదడు తరంగాలను నెమ్మదింప చేయడానికి సహాయపడతాయి. దృష్టి స్పష్టత మెరుగవుతుందిఈ శబ్దాలు దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. అంతేగాదు మానసిక స్పష్టత వచ్చేలా ఏకగ్రతతో ఉండేలా చేస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుతుందిఈ శబ్దాలను క్రమతప్పకుండా వినడం వల్ల భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ శబ్దాలు అంతర్గత శాంతి, భావోద్దేవగ స్థిరత్వాన్ని అందిస్తాయి. తద్వారా కోపం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గుతాయి,నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందిఈ కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. నిద్రలేమితో పోరాడుతున్న వ్యక్తులకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీని బ్యాలెన్స్గా.. ఈ కంపనాలు శరీరంలో చక్రాలుగా పిలిచే శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది. ఇలా సమస్థాయిలో ప్రసారమయ్యే శక్తి స్థాయిలు మంచి మానసిక శ్రేయస్సుని అందిస్తాయి.డిప్రెషన్ లక్షణాలు..ఈ సౌండ్ థెరపీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సుని ఉల్లాసంగా ఉండేలా చేసి నిరాశ నిస్ప్రుహలను దూరం చేస్తుంది. మైండ్-బాడీ కనెక్షన్..ఈ కంపనాలు మనస్సు, శరీర సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. రోజువారీ పనుల్లో ఎదురయ్యే భావోద్వేగ స్థితులకు తొందరగా ప్రతిస్పందించక బ్యాలెన్స్గా ఉంచడమే గాక మానసిక కల్లోలానికి తావివ్వదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.(చదవండి: మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..) -
వచ్చాడు గెలిచాడు!
తుమ్ ముజేనా యూ బచానా పావోవే’... రఫీ పాడిన ఈ పాటను ఏడేళ్ల అవిర్భవ్ వేదిక మీద పాడుతుంటే అందరికీ కన్నీరు వచ్చింది. ఇంత బాగా పాడిన ఈ బుడతడిని సోనిలో సూపర్స్టార్ సింగర్ సీజన్ 3 (మార్చి 2024 నుంచి ఆగస్టు 2024 వరకు) చూసిన వారెవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అందుకే మొత్తం 11 మంది ఫైనలిస్ట్లలో తమ ఓటింగ్ ద్వారా అవిర్భవ్నే విజేతగా నిలిపారు.పది లక్షల రూపాయల బహుమతి వచ్చేలా చూశారు. జడ్జిల చాయిస్గా అధర్వ బక్షి అనే మరో చిన్నోడు విజేతగా నిలిచినా ఈ సీజన్లో సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం అవిర్భవే. చిన్నగా కోమలమైన ఆకారంతో ఉన్నప్పటికీ అవిర్భవ్ రేంజ్ చాలా గొప్పది. కేరళకు చెందిన అవిర్భవ్ తన సోదరి అనిర్విన్య దగ్గర రెండేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాడు.తెలుగు షోస్లో కూడా పాల్గొన్నాడు. కాని ఇపుడు సూపర్స్టార్ సింగర్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతమయ్యాడు. అర్జిత్ సింగ్ ఇతడి ఫేవరెట్ సింగర్. పెద్దయ్యాక గాయకుణ్ణి అయ్యి సల్మాన్, షారుక్ఖాన్లకు పాడతానని అంటున్నాడు అవిర్భవ్.ఇవి చదవండి: ఆమె గొంతుక.. మన గుండెల్లో..! -
పబ్లో.. ఫస్ట్ టైమ్!
సాధారణంగా సిటీలో పబ్స్, క్లబ్స్లో కని/వినపడే డీజేలు, బ్యాండ్స్, సింగర్స్... ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు ప్రతీకగా ఉంటారు. వెస్ట్రన్ మ్యూజిక్ని ఇష్టపడే యువతను మెప్పించడం వీరి వల్లే సాధ్యమని ఈవెంట్ మేనేజర్లు భావిస్తుండడం వల్ల ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవలే వీరి స్థానంలో హిందీ, తెలుగు సంగీతాన్ని అందించే బ్యాండ్స్కు ప్రాధాన్యత పెరుగుతోంది.ఆ థోరణి మరింత బలపడి ఇప్పుడు ఏకంగా తెలుగు గాయనీ గాయకులకు కూడా పబ్స్ రెడ్ కార్పెట్ పరుస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో వియ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ గాయని గీతా మాధురి తన సొంతంగా సమకూర్చుకున్న బ్యాండ్తో కలిసి తొలిసారి నగరంలోని ప్రిజ్మ్ పబ్లో శుక్రవారం సాయంత్రం సోలో ప్రదర్శన ఇవ్వనున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రపంచాన్నే మన పాట పాలిస్తోంది.. ఇక పబ్స్లో తెలుగు పాట వినిపించడంలో ఆశ్చర్యమేముంది? అంటున్నారు ప్రముఖ నేపథ్యగాయని గీతా మాధురి. ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...సోలోగా...ఇదే తొలిసారి.. నగరంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది పెళ్లిళ్ల నుంచి పార్టీల వరకూ చాలా రకాల కార్యక్రమాల్లో నాకు అనుభవమే. అయితే మోడ్రన్ కల్చర్కు కేరాఫ్గా ఉండే యూత్ సమక్షంలో ఒక పబ్లో సోలోగా పాడడం ఇదే తొలిసారి. అదీ సొంతంగా ఒక బ్యాండ్ను సమకూర్చుకుని, వారితో కలిసి రిహార్సిల్స్ చేసి పబ్ షోలో పాడడం కొత్త అనుభవమే. అభిమానుల స్పందన తెలుస్తుంది... అలాగే కార్పొరేట్, కాలేజ్ షోస్ వంటివి కొందరికి మాత్రమే పరిమితమయ్యేవి, అలా కాకుండా ఈ తరహా పబ్లిక్ ఈవెంట్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. అభిమాన గాయనీ గాయకుల పాటలు వినాలనుకునే ఎవరైనా షోకి హాజరుకావ్వొచ్చు. అలా మాకు కూడా మా అభిమానుల స్పందనను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. బ్యాండ్ స్టైల్ అంటే ఇదే... సాధారణంగా లైవ్ పెర్ఫార్మెన్స్లో పూర్తి స్థాయి వాద్య బృందంతో కలిసి పాడతాం. అయితే పబ్లో మాత్రం ఇద్దరు గిటారిస్ట్, డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్.. ఇలా ఓ ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు. ఆర్కె్రస్టాతో పాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పాడతాం.. అయితే ఇందులో 3, 4 పాటలు కలిపి బ్యాకింగ్ కొంచెం మార్చి.. ఇలా ఎక్స్పిరిమెంటల్ టైప్లో ఉంటుంది. ఓ రకంగా పాపులర్ సాంగ్ని కొత్త ఫ్లేవర్లో వినిపించడమే బ్యాండ్ స్టైల్ అనొచ్చు. మన పాట ప్రపంచవ్యాప్తం... మన తెలుగు పాటలు ప్రపంచం అంతా ఒక ఊపు ఊపుతున్నాయి. కాబట్టి సిటీలో కూడా పబ్ క్లబ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో తెలుగు, హిందీ పాటలు పాడడానికి సిద్ధమవుతున్నా..అయితే అక్కడకు వచ్చే క్రౌడ్ని బట్టి వారి టేస్ట్ని బట్టి అప్పటికప్పుడు పాడాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్లో పూర్తి స్థాయిలో ఒక పాటల జాబితా ఇచ్చి, దాని ప్రకారం పాడాలనే ఆలోచన ఉంది. ఇక పర్సనల్ లైఫ్కి వస్తే..అడపాదడపా సినిమా పాటలు, రెగ్యులర్గా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్, ఇవి కాక... ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ కు వర్క్ చేస్తున్నాను.ఇవి చదవండి: ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు.. -
తెలుగులో అమ్మ పాట పాడి అదరగొట్టిన విజయ్ ఆంటోని
-
‘టీ’పాట
‘చాయ్ హోటల్కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్లోని విజయ్భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్వాలా అలియాస్ సింగింగ్ చాయ్వాలా హోటల్కు ‘పాట’ కోసం వెళతారు. డాలీ చాయ్వాలా కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది. -
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్లైన్తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్లో ఫ్యాన్స్ -
సీఎం భగవంత్ మాన్ వీడియో వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు
లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్, పాటల రచయిత బబ్బు మాన్తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. While Rome was burning Nero was playing flute ! Following in the foot steps of Nero, Bhagwant Mann ji is singing tappas while people in own constituency Sangrur are dying of illicit liquor. ਜਦੋਂ ਰੋਮ ਸੜ ਰਿਹਾ ਸੀ ਤਾਂ ਨੀਰੋ ਬੰਸਰੀ ਵਜਾ ਰਿਹਾ ਸੀ! ਨੀਰੋ ਦੇ ਨਕਸ਼ੇ-ਕਦਮਾਂ 'ਤੇ ਚੱਲ ਕੇ ਭਗਵੰਤ… pic.twitter.com/uAVvzz9Ybf — Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 21, 2024 ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్ వాయించినట్ల ఉంది భగవంత్ మాన్ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్ మాన్ పాటలు పాడుతున్నారు’అని పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ మాన్కు సంబంధించిన వీడియోను సునీల్ జాఖర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు. ‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్ ఎక్సైస్ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా. ఆప్ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్ సింగ్ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: Punjab CM: ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్! -
ప్రేమించటానికి సమయం లేదు!
‘ప్రేమించటానికి సమయం లేదు’ అంటూ పాట రూపంలో చెబుతున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు.. మంచి గాయని అనే సంగతి కూడా తెలిసిందే. తండ్రి కమల్హాసన్ నటించిన ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడే తొలి అవకాశం శ్రుతికి ఇచ్చారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆ తర్వాత ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. కమల్హాసన్ నటించిన ‘ఉన్నైపోల ఒరువన్’ సినిమాకి సంగీతం అందించారు శ్రుతీహాసన్. అలాగే ‘ఈనాడు’ సినిమాలో ‘నింగికి హద్దు..’, ‘ఓ మై ఫ్రెండ్’లో ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో..’, ‘ఆగడు’లో ‘అరె జంక్షన్లో..’, ‘రేసు గుర్రం’ మూవీలో ‘డౌన్ డౌన్...’ ఇలా పలు సినిమాల్లో చాలా పాటలు పాడారామె. తాజాగా మరోసారి గాయనిగా మారారు శ్రుతీహాసన్. ‘జయం’ రవి, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ‘కాదలిక్క నేరమిల్లై..’ (ప్రేమించటానికి సమయం లేదు) పాటని శ్రుతి పాడనున్నారు. -
Pudami Sakshiga : పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతాకాదు
వసంత రుతువు రాగానే చెట్లన్నీ పల్లవిస్తే, ఆ హరిత పల్లవాల లోంచి వినిపించే కోకిల గానం గురించి కవులు చెబుతారు. కాని, కాస్తంత ఆకుపచ్చదనం కనిపిస్తే చాలు, అనేక రకాల పక్షులు వచ్చి సంబరాలు చేసుకుంటాయి. జనావాసాల మధ్య పక్షులు ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్ పై సునీత పొత్తూరి ప్రత్యేక కథనం.. పచ్చని ప్రకృతికి బహుమతిగా మళ్లీ కొన్ని చెట్లనిద్దాం...చిన్ని పక్షిని పాడనిద్దాం -ఫైజ్ అహ్మద్ ఫైజ్ మేం టెర్రెస్ గార్డెన్ మొదలు పెట్టాక, మాకు ఈ చిన్ని అతిథుల సందడి పెరిగిందని చెప్పాలి. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్(Asian green bee eaters)అన్ని రకాల పిట్టల లోనూ ఇదొక ఆకుపచ్చని ఆకర్షణ! ఈ మధ్య వీటి హాడావుడి ఎక్కువే అయింది. సాధారణ పిచుకల పరిమాణంలో ఉండే ఈ పక్షులు ఆకుపచ్చ రంగులో, కంఠం దగ్గర నీలంగాను, తలపైన పింగళవర్ణం(మిశ్రమ రాగి వర్ణం)తోను, తోక సన్నగా పుల్లలా సాగి, ఉంటుంది. తోక తో కలిపి 9 అంగుళాలు (పూర్వపుభాషలో అయితే జానా బెత్తెడు) ఉంటుంది. ఎంత తేలిక అంటే వెదురు కొమ్మ మీద అర డజను పిట్డలు దర్జాగావాలిపోతాయి! ఇందుకు అనుగుణం గా వాటి కాలి గోళ్లు కలసి ఉండటం వల్ల కొమ్మలపైన పట్డు నిలుస్తుందిట. కొమ్మ కదలకుండా ఒకదానికొకటి ఒరుసుకుని కూర్చున్న తీరు నులి వెచ్చని ఎండ లో చలి కాగుతున్నట్డుఉంటుంది.వెదురు మొక్క కొమ్మలకి అటు ఇటూ.. వాలి, పచ్చని తోరణంలా కనువిందు చేస్తుంటాయి. ఫ్లై కాచర్ అన్న పేరుకు తగ్గట్టు చిన్న చిన్న పురుగులను, తేనెటీగలనూ పట్టి తింటాయి. అయితే వేటాడే విధానం..అదొక కళ లా, ప్రత్యేకం గా ఉంటుంది. గాలిలో ఉండగానే తమ ఆహారాన్ని నోటికి అంకించుకుంటాయి. అలా అనిచటుక్కున మింగవు. నింపాదిగా ఇలా ఓ చెట్టుకొమ్మ మీద వాలి, తన ఆహారాన్ని పొడిచి వేరుచేసి తింటాయి. వీటి గూళ్లను మానవ సమూహాలకు దూరంగా లోతట్డు గా ఉండే పొదలు, గడ్డి భూములలో ఏర్పాటుచేసుకుంటాయిట. ఇవి వలస పక్షులు కావు. అంతరించి పోతున్న జాతుల లెక్కలోనూ లేవు. కాని,మాకు వానాకాలం లో కంటే, ఇలా శీతా కాలం లో మా ప్రాంతంలో ఎక్కువగా చూస్తాను. ఉదయం, సాయంత్రంవేళల్లో కోలహాలంగా గుంపులుగా వచ్చే వాటి అరుపు అనునాసికంగా, తంత్రీ వాద్యంలా ట్రిం...ట్రిం.. అంటూ ఉంటుంది. కొమ్మల మీదనుండి ఒక్కసారిగా ఎగిరి పోయేటప్పుడు చేసే శబ్దం మాత్రం అధికంగా ఉంటుంది. ఇది కాక, క్రిమి కీటకాలను వేటాడే పక్షుల నిత్య సందడి సూర్యోదయానికి ముందే మొదలౌతుంది. తేనె పిట్డలు, జిట్టంగి పిట్టలు, బుల్ బుల్(పిగిలి పిట్ట), తేనిటీగల్ని, పురుగుల్ని పట్టితినే పాసరైన్స్, వేటి కవే నిత్యంతమ కలకూజితాలతో- మధురారవాలతో ఉదయస్తమయాలు రాగరంజితం చేస్తుంటాయి. చలికాలం లో మా ముంగిట్లో ఉన్న కోవిదార చెట్టు (Bauhinia) సుందరంగా పూస్తుంది. వీటి మీద ఎగురుతూ తేనెపిట్టలు, passerines చేసే సందడి అంతా ఇంతా కాదు. కనిపించవు గాని, కొమ్మకొమ్మ కో సన్నాయీ...! ఆపిలుపులన్నీ పూలవేనేమో అనిపిస్తాయిసన్ బర్డ్స్ మందార పూలమీద అలా వాలి, ఇలా చటుక్కున తేనె సంగ్రహించి పోతుంటాయి. కెమెరాకి ‘యాక్షన్’ చెప్పేఅవకాశమే ఇవ్వవు. ఈ బుల్లి పిట్టలు గొంతు విప్పితే చెవులు చిల్లుపడాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటారుకదా.. అలా! పిగిలి పిట్టలు(Bulbul)- గుబురు తలల తో తోక కింద ఎర్రగా ఉండే ఈ పక్షులు మా టెర్రస్ పైన చేసే సందడి తక్కువేంకాదు. మీకు అలారం క్లాక్ అవసరం లేదు. తెల్లవారు జామునే మొదలు .. కిసకిసలు!బ్లాక్ రాబిన్– ఓ సారి నా నడక దారిలో ఓచిత్రం చూసాను. బ్లాక్ రాబిన్ తన ప్లమేజ్ లో ఆకుపచ్చని గడ్డిపరకలుటక్ చేసుకుని లాన్ లో తిరుగుతూ కనబడింది. ఫోటో తీద్దామనే ప్రయత్నం ఫలించలేదు. కింగ్ ఫిషర్ ఒకటి ఒకే సమయానికి దర్శనం ఇస్తూంటుంది. రివ్వున వాలి, కావలసినదేదో దొరకపుచ్చుకుని దూరంగా లైట్ స్తంభం మీదకి గెంతి .. కాస్త తాళి, ఎగిరెళ్లిపోతుంది. కన్నుమూసి తెరచేంతలోనే ఈ విన్యాసాలన్నీ..! ఒక నీలి ఈకను మాత్రం ఓసారి బహుమతి చేసింది. జిట్టంగి పక్షులు.– ఇళ్ల కప్పులెక్కి, ఈల వేస్తూ హెచ్చరిస్తూ సందడి చేస్తూంటాయి ఉదయాస్తమయాల వేళల్లో. సిల్వర్ బిల్ మునియాలు. గుంపుగా వచ్చి, తమ చిన్ని ముక్కులను నీటి లో తడుపుకొని, జలకాలాడుతూ తెగ సందడి చేస్తాయి. వెదురు ఆకులను ఒడుపుగా చీల్చి గూటికోసం తీసుకుని పోతూంటాయి. అరగదీసినట్లు నునుపు దేలిన ముక్కు(bill), పొట్ట భాగం లో స్కేలింగ్ వుండి కాస్త బ్రౌన్గా ఉండే ఈ పిచుకల్లాటి మునియాలు గార్డెన్ లో చెట్ల కొమ్మల్లో జంటలుగా వచ్చి వాలుతాయి. మన ఇళ్ల దగ్గర ప్రమాదస్థాయిలో బ్రీడింగ్ అవుతున్న మరో పక్షి పావురం. పావురాళ్లు గూడు పెట్టని చోటు లేదు. వాటి సంతతి పెరిగిపోతూనే ఉండటంతో, కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పావురాలకు ధాన్యపు గింజలను వేయడం వల్ల సహజమైన ఆహారవేటను ఆపేసాయంటారు. ఏదేమైనా చిన్న చిన్నపావురాల కువకువలు మాత్రం బాగుంటాయి. ఇక పోతే కాకులూ, పిచికలూ ఒకప్పుడు మనకి సర్వసాధారణంగా కనిపించే పక్షులు. మన సంస్కృతి లో భాగం.పిచికలకు ముంగిట్లో ధాన్యపు కంకులను వేలాడదీసేవారు. కాకులు సరేసరి. మన పితృదేవతలు కాకిరూపం లోవచ్చి పిండం ముట్టి పోతాయని నమ్మకం.కాని ఇవీ ఇపుడు అరుదైపోయాయిఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా సెల్ టవర్స్ నిర్మింవడం వల్ల, ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ కి, దాదాపు ఊర పిచుకలు తుడిచి పెట్డుకుని పోయాయి. అలాగే కాకులు కూడా, పట్టణీకరణ పేరుతో వాటి ఆవాసాలనుంచి,వాటికి అనుకూలమైన చోట గూళ్లు ఏర్పరుచుకుని, సంతానోత్పత్తి చేయడానికి వీలు లేకుండా తరిమి వేయబడ్డాయి. పక్షులు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అన్నది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కరలేదు. క్రిమి కీటకాల బెడదనుంచి పంటలను కాపాడ్డం తో బాటు, పాలినేషన్కు విత్తనాల విస్తరణకు పక్షుల ఉనికిఅవసరమన్నది అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిమీద జరిపిన తిరుగుబాటు వల్ల కలిగిన దుష్పరిణామం ఏమిటో చైనా ఉదంతం ఒకటి చెబుతారు. ఆహారధాన్యాలను పిచుకలు తింటున్నాయని, పిచుకలను పట్డి చంపిస్తారు చైర్మన్ మావో సమయంలో. తర్వాత వాటి పొట్ట కోసి చూసి తెల్లబోయారట శాస్త్రజ్ణులు. ఆహారధాన్యాల కంటే ఎక్కువ క్రిమి కీటకాలను పట్టి తింటాయనితెలిసి. ఆ తరవాత క్రిమికీటకాల అదుపు లేక పంట నష్టం తీవ్రమై కరవు సంభవించిందిట. మిడతలను చంపడానికి క్రిమి కీటకాల నాశకాలను వాడగా, ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయిందిట. ఇదొక గుణపాఠం. అయినా...మనిషి మారలేదు; ఆతని కాంక్ష తీరలేదు–అని సినీకవి తీర్పు ఇచ్చినట్టు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.ప్రకృతిలో సమతౌల్యతకు పక్షుల ఉనికి ఎంత అవసరమన్నది మానవాళికి అర్థం అయేసరికి, ఆధునీకరణ పేరుతో చాలా నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. అందుచేత నేడు ఆవాసాల వద్ద ఎంతో కొంత గ్రీనరీ వుండేలా చూసుకోవడంసామాజిక బాధ్యత అయింది. రచయిత : సునీత పోతూరి ఫోటో : శ్యాం సుందర్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
‘ఓల్డ్ బట్ గోల్డ్’ యూట్యూబ్ చానల్తో.. షోమ్ మ్యూజికల్ జర్నీ..
'షహన షోమ్' మ్యూజికల్ జర్నీ తన అధికార యూట్యూబ్ చానల్ ‘వోల్డ్ బట్ గోల్డ్’తో మొదలైంది. దీని ద్వారా బాలీవుడ్ టైమ్లెస్ మెలోడిస్ను వినిపించి ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘మొహబ్బత్ కర్నే వాలే’ లాంటి క్లాసిక్తో పాటు ‘సేవ్ ది గర్ల్చైల్డ్’ ‘ఎడ్యుకేషన్ ఫర్ ది అండర్ప్రివిలేజ్డ్’ లాంటి సామాజిక స్పృహతో కూడిన ఇతివృత్తాలతో పాటలు పాడుతుంది. చిన్నప్పుడు సినిమా పాటలే కాదు క్లాసిక్ గజల్స్, కీర్తనలు పాడేది. ప్రముఖ సంగీతకారుల వర్థంతిని దృష్టిలో పెట్టుకొని వారికి నివాళిగా యూట్యూబ్లో చేసే పాటల కార్యక్రమాలు సూపర్హిట్ అయ్యాయి.పాత పాటలు పాడుతుంటే కాలమే తెలియదు. 'టైమ్మెషిన్లో గతంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటున్న షహనకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన పాటల ద్వారా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు నిధులను సేకరించడంలో కూడా ముందు ఉంటుంది. 'పాటల ద్వారా సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నా లక్ష్యాలలో ఒకటి’ అని చెబుతుంది షహన. ఇవి చదవండి: ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం -
నా పాట తీసేస్తే కోపంతో చెక్కు చించి ముఖం మీద వేసాను
-
నా పాట నచ్చి మా ఆయన పెళ్లి చేసుకుంటా అని..!
-
యాక్టింగ్ ఛాన్సులు వచ్చినా వదులుకుంది.. కేతకి ఇంట్రెస్ట్ అదేనట
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది...అన్నట్లు సంగీతకారుల కుటుంబంలో జన్మించిన కేతకి మతేంగోకర్కు చిన్నప్పటి నుంచే పాట అంటే ఇష్టం. తండ్రి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తల్లి సువర్ణ సింగర్. నటిగా కూడా మెప్పించింది కేతకి. ‘షాల’ ఆమె డెబ్యూ ఫిల్మ్. ఈ సినిమా కోసం అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుజిత్ ఒక టెలివిజన్ మ్యూజిక్ షోలో కేతకిని చూసి తన సినిమాలోని పాత్రకు ఎంపిక చేశాడు. నటనలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ‘నటన’ కంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది కేతకి. రోజుకు నాలుగు గంటల పాటు సంగీత సాధన చేస్తుంది. ‘మహేష్ మంజ్రేకర్ సినిమాలో నటించిన తరువాత ఎన్నో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మంచి సింగర్గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. క్లాసిక్ నుంచి కాంటెంపరరీ మ్యూజిక్ వరకు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను’. గత సంవత్సరం ‘మాయి’ ఆల్బమ్తో మ్యూజిక్ కంపోజర్గా కూడా తన ప్రతిభ చాటుకుంది కేతకి. ఈ ఆల్బమ్లోని తొమ్మిది పాటలను శంకర్ మహాదేవన్, మహాలక్ష్మీ అయ్యర్లాంటి ప్రసిద్ధ గాయకులు పాడారు. ‘మన దగ్గర ఉమెన్ మ్యూజిక్ కంపోజర్లు తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మంచి మ్యూజిక్ను ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలామందికి మ్యూజిక్ కంపోజిషన్లో అద్భుత ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నారు’ అంటుంది కేతకి. -
వైట్హౌస్లో పాటలతో హుషారు! ఎవరీ కుర్రాళ్లు?
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్.. వేలాది మంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తున్నారు. వైట్ హౌస్ మెట్ల వద్ద నలుపు రంగు కోట్లు ధరించిన కొందరు కుర్రాళ్లు "చయ్య చయ్య", "దిల్ సే", "జాష్న్-ఎ-బహారా" బాలీవుడ్ పాటలతో అక్కడున్నవారందరినీ ఉర్రూతలూగించారు. ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు అంటే.. స్వరాలే వాద్యాలుగా.. ‘పెన్ మసాలా’.. ప్రపంచంలో మొట్టమొదటి దక్షిణాసియా ఎ క్యాపెల్లా (A Capella) గ్రూప్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన 19 మంది విద్యార్థులతో ఇది ఏర్పాటైంది. ఎ క్యాపెల్లా అంటే వాద్య సహకారం లేకుండా పాటలు పాడే బ్యాండ్. స్వయంగా తమ స్వరంతోనే వాద్య శబ్ధాలను వీరు అనుకరిస్తారు. 1996 నుంచి ఈ బ్యాండ్ ఉనికిలో ఉంది. ఈ బృందం దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు పాడటం ద్వారా పేరు తెచ్చుకుంది. ఇటీవల వైట్ హౌస్లో అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీ కోసం ఇచ్చిన విందు సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి తమకు అవకాశం, గౌరవం దక్కిందని పెన్ మసాలా గ్రూప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వైట్ హౌస్లో వేలాది మంది భారతీయుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ బ్యాండ్ ఇంతకుముందు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా కోసం వైట్ హౌస్లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పర్ఫెక్ట్ 2 అనే హాలీవుడ్ చిత్రానికి సౌండ్ట్రాక్ అందించింది. దీనికి 2015లో ఉత్తమ సౌండ్ట్రాక్గా అమెరికన్ మ్యూజిక్ అవార్డు లభించడం విశేషం. -
అవ్వ, తాత మస్తు హుషారు
-
పాట పాడలేదని భర్తపై ఫిర్యాదు.. పోలీసుల ముందు పాడి భార్యను ఫిదా చేశాడు
-
ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్కి మంత్రి ఫిదా!
చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్మేట్స్ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు. అతను పాడే విధానం ఏదో ఒక పెద్ద స్టార్ సింగర్ మాదిరి ఓ రేంజ్లో మంచి కాన్ఫిడెన్స్తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్న్ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. Bas itna confidence chahiye life me. 😀 "ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं ! नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi — Temjen Imna Along (@AlongImna) January 18, 2023 (చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు) -
జైల్లో పాట.. దెబ్బకు ఫేమస్.. ఫేట్ మారింది
వైరల్: ఊచల వెనుక పాడిన పాటను పోలీసు వాళ్లే చిత్రీకరించారు. అతని మధుర గాత్రానికి ఫిదా అయ్యి వైరల్ చేశారు. కటకటాల వెనుక పాడిన పాటకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ వ్యక్తి మరింత ఫేమస్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక.. తన పాట ఫేమస్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడతను. దానికి కొనసాగింపుగానూ అతనికి ప్రభుత్వ సాయం ప్రకటనతో పాటు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్లోని కైమూర్ దహ్రక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్ను.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బక్సర్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ నుంచి తాగొచ్చాడని(బీహార్లో మద్యపాన నిషేధం అమలు ఉండడంతో) పోలీసులు అతని ఆ రాత్రి జైల్లో ఉంచారు. అయితే ఆ పూట జైలు శిక్ష అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్యను.. ఆ తర్వాత అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లలో చక్కర్లు కొడుతోందని స్నేహితులు చెప్పారు. దీంతో తన గొంతు విన్న కన్హయ్య తెగ ఖుష్ అయ్యాడు. అయితే.. మద్యం సేవించినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్(భోజ్పురి హీరో) పాట పాడినందుకు.. ఆ పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య చెప్తున్నాడు. కానీ, ఆ వీడియోను తాను అప్పుడే డిలీట్ చేశానని వివరణ ఇచ్చాడతను. ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తాను సరదాగా పాట పాడనని, అది ఎవరు వీడియో తీశారు, ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకు తెలియదని అంటున్నాడతను. ఆర్థిక కష్టాలతో చిన్నతనంలోనే చదువుకు తాను దూరం అయ్యానని, రిపబ్లిక్డే, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్తున్నాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాటు దేల్చాల్సిన అవసరం ఉందని, అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. తనలో దాగున్న ప్రతిభ నలుగురికి తెలియడం, దాని ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి, తనను వైరల్ చేసినవాళ్లకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడతను. नशा एक सामाजिक बुराई है और सिर्फ कला में शक्ति है इस बुराई को हराने की ।@shalabhmani जी मैं इस व्यक्ति को अपनी म्यूजिक कंपनी @MistMusic_ की तरफ से एक गाना गाने का मौका देता हूं । 🙏 https://t.co/qug7cto5Rp — Ankit Tiwari (@officiallyAnkit) January 9, 2023 -
అమ్మ మరిచిన పాట
పక్క ఫ్లాట్లో పాపాయి పుట్టింది. బుజ్జిగా ఉండుంటుంది. కళ్లు తెగ తెరిచి తల్లిని చూస్తూ ఉండుంటుంది. పాలు సరిపోతుండొచ్చు. గుండెలకు హత్తుకుని ఇచ్చే వెచ్చదనం సరిపోతుండొచ్చు. అయినా సరే కయ్మని ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నానహో అని చెప్పడానికి ఏడుస్తున్నట్టుంది. నాకేదో కావాలహో అని చెబుతున్నట్టు ఏడుస్తుంటుంది. అమ్మకు పాతికేళ్లుంటాయి. ఎత్తుకుని సముదాయిస్తుంది. అటూ ఇటూ తిప్పుతూ ఊరుకోబెడుతుంది. పాపాయి ఏడుపు ఆపదే! బహుశా అమ్మ పాడాలేమో! యుగాలుగా తల్లులందరూ పసికందుల కోసం మనోహరమైన గాయనులై ఎత్తే గొంతును ఆ తల్లి కూడా ఎత్తాలేమో! ‘ఆయి ఆయి ఆయి ఆపదలు కాయీ’. ఆహా. ఒకప్పుడు ఏ అమ్మయినా ఈ పాట అందుకుంటే పసినోరు ఠక్కున మూతపడేది. గొంతులో లయ ఊయల ఊపుతున్నట్టుండేది. ఏదమ్మా... మళ్లొకసారి పాడు అన్నట్టుగా పాపాయి మెడ కదిలించేది. ‘ఆయి ఆయి ఆయీ... ఆపదలు కాయీ’. చిట్టి బంగారు తల్లికి ఏ ఆపదలూ రాకూడదు. ఈ బంగరు బుజ్జాయి బొజ్జ నిండా పాలు తాగి, కంటి నిండా కనుకు తీయాలి. వివశుల్ని చేసే చిర్నవ్వు నిదురలో నవ్వాలి. గుప్పిళ్లు బిగించాలి. ఉత్తుత్తికే ఉలికి పడాలి. అందుకు తల్లి ఏం చేయాలి? పాడాలి. ‘ఏడవకు కుశలవుడ రామకుమార... ఏడిస్తె నిన్నెవ్వరెత్తుకుంటారు?’ సీతాదేవి పాడకుండా ఉందా? అడవిలో తావు కాని తావులో, లోకుల మధ్య ఇద్దరు కుమారులను కని, వారికి సర్వం తానై, వారు ఒడిలో ఉంటే అదే పెన్నిధిగా భావించి, ఆ కారడవిలో, రాత్రివేళ, ఏనాడైనా దడుపు వల్లో కలత చేతో ఏడిస్తే సీత పాడకుండా ఉందా? ‘ఉంగరమ్ములు కొనుచు ఉయ్యాల గొనుచు ఊర్మిళా పినతల్లి వచ్చె ఏడవకు. పట్టు అంగీ గొనుచు పులిగోరు గొనుచు భూదేవి అమ్మమ్మ వచ్చె ఏడవకు’. సీతాదేవి పాడుతున్నదా? పిల్లలకు తన సొద చెప్పుకుంటున్నదా? ఆశను వారిలో సజీవంగా ఉంచు తున్నదా? ఏమో! పాడటం మాత్రం మానలేదు. వాళ్ల నాన్న విన్న పాటను తిరిగి వల్లెవేయక ఉండ లేదు. ‘రామా లాలీ మేఘ శ్యామా లాలి... తామరస నయన దశరథ తనయా లాలీ’... తల్లి గొంతు ఎలా ఉంటే ఏమి? బిడ్డ కోసం పాడితే అందులోకి అమృతం వచ్చేస్తుంది. వాత్సల్యపు తేనె తొర్లి పడుతుంది. నా పంచప్రాణాలు నీవే కన్నా అనే భావం మాటలు రాని చిట్టిగుండెకు గట్టిగా చేరుతుంది. పాపాయికి అది కావాలి. పసివాడికి ఆ మాట చెవిన పడాలి. అందుకై చెవి రిక్కిస్తుంది ఒడిలో ఉండే కలువమొగ్గ. ‘జో అచ్యుతానంద జోజో ముకుంద.. రార పరమానంద రార గోవింద’... వింటుంటే నిద్రాదేవి బింకం చెదిరేలా లేదూ! అయ్యో తల్లి... నీ బిడ్డను చేరి హాయిగా నిద్ర పుచ్చుతాలే అని బెట్టు తీసి గట్టున పెట్టేట్టు లేదూ!! శ్రీమంతుల ఇంట్లో వారసుడు పుట్టాడట. సంగీతం వినిపించే ఖరీదైన ఆట వస్తువులు కొంటారు. యూట్యూబ్లో జింగిల్స్ వినిపిస్తారు. మధ్యతరగతి ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందట. కొత్త గౌన్లు కొంటారు. బంగరు దండ వేస్తారు. ఏడ్చిన ప్రతిసారీ పాలకే అని భ్రమసి ఎదను నోటికంది స్తారు. పేదవాడి గుడిసెలో ముత్యాలమూట ఒడిలోకొచ్చి పడిందట. ముద్దులు పుణుకుతారు. కంటి మీద రెప్పేయక కాచుకుంటారు. ఏడుస్తూ ఉంటే అగ్గిపెట్టె మీద దరువేసి వినిపిస్తారు. తెలుగు ఉంది మనకు. భాష ఉంది మనకు. రాగం ఉంది, పసికందుల నిదురకై భావం ఉంది మనకు. పాడమని చెప్పారు పెద్దలు పిల్లల కోసం. పాటలు అందించి వెళ్లారు పిల్లల కోసం. తల్లిపాలు పోయి పోత పాలు వచ్చె. లాలిపాట పోయి హోరుపాట వచ్చె. పిల్లలకు తెలుసు ఇది బాగలేదని. అందుకే ఏడుస్తారు. తల్లికి అమ్మమ్మ పాట ఇవ్వలేదు. తల్లి తనకు పుట్టిన బిడ్డకు పాట ఇవ్వబోదు. లాలిపాట అదృశ్యమయ్యే నేలా మనది? ‘నిద్ర నీ కన్నుల్లు మబ్బు మొగముల్లు నిద్రకూ నూరేళ్లు నీకు వెయ్యేళ్లు... నిన్ను గన్నయ్యకూ నిండు నూరేళ్లు... జో జో’.... తల్లి బిడ్డతో చేసే తొలి సంభాషణ లాలిపాట. బిడ్డ జీవితంలో సంగీ తాన్ని తొలిగా ప్రవేశపెట్టేదే లాలిపాట. శ్రుతి తప్పని జీవితాన్ని కాంక్షించేదే లాలిపాట. ఒంటరితనం మిగిలినప్పుడు పాటను తోడు చేసుకొమ్మని ఉపదేశం చేసేదే లాలిపాట. సర్వం సంగీతమయమైన ఈ జగత్తులో బిడ్డకు స్వాగతం పలికేదే లాలిపాట. కాని తల్లి గొంతు ఫోన్లో బిజీ. తల్లి గొంతు ఏదో పని పురమాయింపులో బిజీ. తల్లి గొంతు ఇరుగు పొరుగు పలకరింపుల్లో బిజీ. బిడ్డ పుడితే చేయవలసిన సాంగేలు అనేకం పోయాయి. బిడ్డ పుడితే హాజరు కావాల్సిన బంధుమిత్రులు ముఖం చూపించలేనంత బిజీగా ఉన్నారు. చీటికి మాటికి వచ్చి ఆ చిట్కా, ఈ విరుగుడు చెప్పే ముసలమ్మలు సొంతింట, పరాయింట కాన రావడం లేదు. దిష్టి చుక్కలు, సాంబ్రాణి ధూపాలు లేవు. గోరువెచ్చని నీళ్లతో కాళ్లన బోర్లించి స్నానం చేయించి ఇచ్చే అమ్మలక్కలు లేరు. సంస్కృతి అంటే ఏమిటి? అది ఏదో మహా విగ్రహాల్లో, అపూర్వ ఉత్సవాల్లో ఉండదు. కుటుంబంలో నిబిడీకృతం అయ్యే చిన్నచిన్న ఆనందాల్లో, ముచ్చట్లలో ఉంటుంది. ముగ్గు, మామిడి తోరణం లేనిది కూడా ఇల్లే. కాని అవి రెండూ ఉన్న ఇల్లు తెలుగుదనపు ఇల్లు. ఏడుపు ఆపి, పిల్లలు బుల్లి పెదాలు విప్పి, భలే నవ్వాలి. ఇంటింటా బిడ్డ కోసం పాడి తల్లి ఆవులించాలి. ‘ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న... ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు... నీలాలు కారితే నే చూడలేను... పాలైన కారవే బంగారు కళ్లు...’. -
ప్రపోజల్స్పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు
జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్ షో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుని విజేతగా నిలిచింది శ్రుతిక సముద్రాల. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు జీ సరిగమప షో విజేతగా నిలిచిన శ్రుతిక ఇటీవల సాక్షితో ముచ్చటిందచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తను చిన్నప్పటి నుంచి దివంగత లెజెండరి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగర్స్ చిత్ర, సుశీల గారిని ఫాలో అయ్యానని, అయితే తన ఫేవరేట్ సింగర్స్ మాత్రం చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ అని చెప్పంది. ఇక చిత్రగారు పాడిన పాటల్లో ముంబైలోని ‘కన్నాను లే కళయికలు ఏడాడు ఆగవులే..’ అంటూ అచ్చం చిత్రగారిలా పాడి వినిపించింది. అనంతరం ఇక తనకు వచ్చిన మెసేజ్లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా.. అలా మీకు ఏమైన వచ్చాయా? అని యాంకర్ అడగ్గా.. శ్రుతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ది ఘోస్ట్లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా? ‘‘ఏంటో కానీ నాకు ఎక్కువగా అక్క అక్క అక్క అనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. నేను చూసిన మెసేజ్లో అన్ని అక్క అనే ఉన్నాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ అని మెసేజ్ పెడుతున్నారు. అవి చూసి నాకు షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే అందరు నన్న అంత పెద్దదాన్ని అనుకుంటున్నారా? ఏంటి.. అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? అని అనిపిస్తోంది’ అంటూ శ్రుతిక చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన గురించి పంచుకున్న మరిన్ని విశేషాలను ఇక్కడ చూడండి. -
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్బండ్పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
వైరల్ ప్రధాని మెచ్చారు!
జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్ప్రదేశ్కు చెందిన అక్కాచెల్లెళ్లు... అశప్మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్ ఎంగళ్ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రశంసావాక్యాలు రాశారు. 24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్ స్టార్స్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్ సిస్టర్స్ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని. ఇక సోషల్ మీడియా ‘కామెంట్ సెక్షన్’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘అచ్చం తమిళ సిస్టర్స్ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్ ప్రదేశ్ సిస్టర్స్ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్ప్రదేశ్లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్ కామెంట్ పెట్టాడు. ‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు. మంచిదే కదా! -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్స్టాప్లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
జగమంతా శివపదం
ఋషీపీఠం ఆధ్వర్యంలో రెండో శివపదాల అంతర్జాతీయ పోటీలు జరిగాయి. మే 13 నుంచి 15 వరకు యూట్యూబ్ మాధ్యమంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు ఖండాలలోని పద్నాలుగు దేశాలకు చెందిన 300 మంది ఔత్సాహిక గాయకులు ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ రచించిన వెయ్యికి పైగా శివపద గీతాల్లో కొన్నింటిని ఈ పోటీలో ఆలపించారు. షణ్ముఖుని శివుని ఆరు విభాగాలతో తలపిస్తు ఆరు పూటల జరిగిన ఈ కార్యక్రమం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పరిచయవ్యాఖ్యలతో మొదలయ్యింది. ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా అద్భుతముగా ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ శివపద కల్యాణం తదితర గీతాలు ఆలపించారు. శివపదం కోసం తన జీవితపరమావధిగా, సార్ధకతగా రాసుకున్న పాటలను, ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని షణ్ముఖ శర్మ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాణి, రవి గుండ్లపల్లిలను అభినందించారు. ఈ కార్యక్రమానికి భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికాలకు చెందిన పదహారు మంది సంగీత దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చదవండి: సింగపూర్లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు -
మార్ఫింగ్ వీడియోతో కమెడియన్కు బిగుస్తున్న ఉచ్చు
ఢిల్లీ: ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదంలో నిలిచాడు. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. తొలుత జర్మనీలో పర్యటించిన విషయం తెలిసిందే. బెర్లిన్లో ప్రవాస భారతీయులతో ముఖాముఖి జరిపిన వేళ.. ఓ చిన్నారి దేశ భక్తి గేయం అలరించగా.. మోదీ కూడా హుషారుగా ఆ చిన్నారితో గొంతు కలిపారు. హే జన్మభూమి భారత్ అంటూ ఆ చిన్నారి వీడియో వైరల్ కాగా.. దానిని ‘మెహెన్గయి దాయన్ ఖాయే జాట్ హై’ అంటూ మరో ఆడియో క్లిప్తో మార్ఫింగ్ చేశారు ఎవరో. ఈ వీడియో కమెడియన్ కునాల్ కమ్రా తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ చూసిన.. ఆ చిన్నారి తండ్రి తీవ్రంగా స్పందించాడు. #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 చెత్త అంటూ కునాల్ను తిట్టిపోశాడు ఆ చిన్నారి తండ్రి గణేష్ పోల్. ఏడేళ్ల తన కొడుకు మాతృదేశం కోసం పాట పాడానని, అంత చిన్న వయసులో ఉన్నా చెత్త వెధవ అయిన నీ కంటే తన దేశాన్ని ప్రేమిస్తున్నాడంటూ ఆయనొక ట్వీట్ చేశాడు. అంతేకాదు చిన్నపిల్లలతో కామెడీ ఏంటంటూ మండిపడ్డాడు. He is my 7 year old son, who wanted to sing this song for his beloved Motherland . Though he is still very young but certainly he loves his country more than you Mr. Kamra or Kachra watever u are Keep the poor boy out of your filthy politics & try to work on your poor jokes https://t.co/ECnBFSIWkI — GANESH POL (@polganesh) May 4, 2022 అయితే ఈ జోక్ అతని కొడుకు మీద వేసింది కాదంటూ కునాల్ కమ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఈ విషయమై కునాల్ మీద చర్యలకు సిద్ధమైంది. ట్వీట్ డిలీట్ చేయించడంతో పాటు కునాల్ మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను గురువారం ఆదేశించింది. అయితే విమర్శలు తారాస్థాయికి చేరడంతో ఆ వీడియోను డిలీట్ చేశాడు కునాల్ కమ్రా. చదవండి: ‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం -
పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!
ఇటీవలకాలంలో పాములకు సంబంధించి వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ హల్చల్ చేశాయి. పాములను ముద్దు పెట్టుకోవడం, రబ్బర్ బ్యాండ్లా చ్టుటుకున్న వైరల్ వీడియోలు చూశాం. అయితే ఆ పాములు ఏం చేయనంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గాయని పాముల ఒంటి మీద వేసుకుంటు మ్యూజిక్ షూటింగ్ చేస్తే ఏమయ్యేందో చూడండి. (చదవండి: అప్పడు అత్యంత పిన్న వయసు బాడీబిల్డర్... ఐతే ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే!!) అసలు విషయంలోకెళ్లితే....జే-జెడ్ లేబుల్ రోక్ నేషన్ సంస్థ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్ వీడియోని షూట్ చేసింది. అయితే షూటింగ్లో గాయని నేల మీద పడుకుని పాములు మీద వేసుకుంటూ పాట పాడుతుంది. అయితే ఇంతలో ఏమైదో ఏమో గానీ ఒక నల్లపాము అమాంతం ఆమె ముఖం మీదే కాటే వేసింది. దీంతో ఆమె ఒక్కసారిగి బిత్తరపోయి వాటిని పక్కకు నెట్టి అక్కడ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆ గాయని ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు "మీ అందరి కోసం మ్యూజిక్ వీడియోలు షూటింగ్ చూస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా! " అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) View this post on Instagram A post shared by Maeta (@maetasworld) -
భార్య కోసం పాట పాడిన దిల్రాజు.. వీడియో వైరల్
Producer Dil Raju Sings a Song Her Wife Video Viral: ప్రముఖ నిర్మాత దిల్రాజు గాయకుడిగా మారారు. కరీంనగర్లోని ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా గ్రూపుతో కలిసి స్టేజ్ మీద పాట పాడి సందడి చేశారు. నాగార్జున నటించిన నిర్ణయం సినిమాలోని ని 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్...' అనే పాటను ఎంతో ఉల్లాసంగా ఆలపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ పాటను దిల్రాజు తన శ్రీమతికి డెడికేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి దిల్రాజుతో పాటు మంత్రి గంగుల కమలాకర్ కూడా హాజరయ్యారు. #DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening ;) pic.twitter.com/pgpTFZpFij — Milagro Movies (@MilagroMovies) December 12, 2021 -
సిరివెన్నెల పాడిన చివరి పాట.. వీడియో వైరల్
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సిరివెన్నెల మృతిపూ సినీ సాహిత్య అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ అయితే సిరివెన్నెల చివరిసారిగా పాడిన ఓ స్ఫూర్తి గీతం ప్రస్తుతం వైరల్గా మారింది. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాటను ఆయన స్వయంగా ఆలపించారు. సుమన్ హీరోగా నటించిన ‘పట్టుదల’ అనే సినిమాలోని ఈ గీతానికి ‘సిరివెన్నెల’ సాహిత్యం అదించారు. ఆద్యంతం ఈ పాట మనిషి పట్టుదల వీడకూడదు.. సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదనే స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. -
The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే..
చెట్లు పలికే స్వరమాధుర్యాన్ని ఎప్పుడైనా విన్నారా? చెట్లు పాటలు పాడటమేంటి? ఇదేం పిచ్చి ప్రశ్న అని కోప్పడిపోకండి. చెట్టు పలికే వాయుగీతాన్ని వినాలంటే మీరు ఇంగ్లాండ్ వెళ్లాల్సిందే. అక్కడ లాంకషైర్ కౌంటీలోని బర్న్లీ పట్టణానికి చేరువలో కనిపించే చెట్టు రోజంతా వాయుగీతాలను వినిపిస్తుంది. నెమ్మదిగా పిల్లగాలులు వీచేటప్పుడు మంద్రంగా, గాలులు ఒకమోస్తరుగా వీచేటప్పుడు కాస్త మధ్యమంగా, శరవేగంగా పెనుగాలులు వీచేటప్పుడు తారస్థాయిలోను స్వరాలాపన చేసే ఈ వృక్షం అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇది సహజమైన వృక్షం కాదు, ఉక్కుతో రూపొందించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది. దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు మాదిరి లోహపు గొట్టాలను ఏర్పాటు చేయడంతో, ఈ గొట్టాల గుండా గాలి వెళ్లేటప్పుడల్లా చిత్రవిచిత్రమైన స్వరధ్వనులు వినిపిస్తాయి. మైక్ టాంకిన్, అన్నాలియు అనే లోహశిల్పులు ఈ లోహవృక్షాన్ని స్వరాలు పలికేలా తీర్చిదిద్దారు. బెర్న్లీ పట్టణానికి చేరువలోని ఖాళీ మైదానంలో దీనిని 2006లో ఏర్పాటు చేశారు. బీబీసీలో ప్రసారమైన 1960ల నాటి ఫాంటసీ సీరియల్ స్ఫూర్తితో దీనికి ‘ద సింగింగ్ రింగింగ్ ట్రీ’ అనే పేరు పెట్టారు. ఈ లోహవృక్ష రూపకల్పనలో కనపరచిన అమోఘ శిల్పనైపుణ్యానికి గుర్తింపుగా 2007లో దీనిని రూపొందించిన శిల్పులకు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఏటా ఇచ్చే జాతీయ అవార్డు కూడా లభించింది. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
ఆస్పత్రిలో బెడ్పై బుడతడు..ఫేవరెట్ సాంగ్ వచ్చేసరికి ఊగిపోయాడు!
బ్రెజిల్: ఆస్పత్రిలో జాయిన్ అవ్వడం అంటేనే చాలా మంది భయపడతారు. ఎంతో బాగోకపోతేనో లేక పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటేనో తప్ప ఎవరు ఆస్పత్రిలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడం. అలాంటిది ఇంకా అడుగులు కూడా వేయడం సరిగా రాని ఒక చిన్నారి ఒక వ్యాధితో బాధపడుతూ కూడా తనకు అదేం లేదన్నట్టుగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. (చదవండి: "సైక్లోథాన్తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") వివరాల్లోకెళ్లితే...బ్రెజిల్కి చెందిన మిగ్యుల్ అనే చిన్నపిల్లాడు గ్యాస్ట్రోఎంటెరిటిస్(అన్నాశయ సమస్య)తో ఆస్సత్రిలో జాయిన్ అయ్యాడు. పైగా అతని ఎడమ చేతికి బ్యాండేజ్ కూడా ఉంది. అయినప్పటికీ అవేమీ తనకు పట్టనట్లుగా ఆస్సత్రిలోని టీవీలో తనకు ఇష్టమైన సాంగ్ రాగానే ఆనందంగా పాడుతూ డ్యాన్స్ చేశాడు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బుడతడు..తన ఫేవరెట్ సాంగ్ వచ్చేసరికి ఊగిపోయాడు. రాక్స్టార్ను తలపించేలా డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.పైగా టీవిలో నటుడు ఎలా మైక్ పట్టుకుని పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడో అలా తాను కూడా ఒక ప్లాస్టిక్ స్పూన్ని మైక్లా పట్టుకుని పాడుతూ డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు 'వావ్' అంటూ మిగ్యుల్ని ప్రశంసిస్తున్నారు. (చదవండి: "కదిలే టాటుల అద్భుతమైన వీడియో") -
హైదరాబాద్: ఇండియన్ ఐడల్ గాయకులతో సంగీత కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడిల్లో విజేతగా నిలిచిన పవన్దీప్ రాజన్, అదే విధంగా తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు సిద్ధమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులను ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘ఇందులో భాగంగానే కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్, మసాలా కాఫీ, ఇండియన్ ఐడిల్ షోలో ఫైనలిస్టులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ కళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న, ఇండియన్ ఐడల్ విజేత పవన్దీప్ రాజన్తో సెప్టెంబరు 3న హార్ట్కప్లో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ సిరీస్లో దేశంలోని అత్యుత్తమమైన సంగీతకారులతోపాటు గాయకులు పాలుపంచుకొని అబిమానులను ఉర్రూతలుగించనున్నారు. సెప్టెంబర్ 2 - తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద సెప్టెంబర్ 3 - ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ (హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి) సెప్టెంబర్ 23 - మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద అక్టోబర్ 1 - ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ (గ్రీజ్ మంకీ క్లబ్, జూబ్లీహిల్స్) అక్టోబర్ 2 - చిన్మయి + కాప్రిసియో అక్టోబర్ 9 - స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్ అక్టోబర్ 15 - శోభన (రవీంద్ర భారతి) వద్ద అక్టోబర్ 23 - ఇండియన్ ఐడల్ టాప్ 5 (హార్ట్ కప్ కాఫీ) వద్ద -
షాకింగ్ ఘటన: స్టేజ్పై ఉన్నట్టుండి పాడటం ఆపేసిన సింగర్
కొత్త గొంతుకలను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్ ఐడల్. ఈ ప్రఖ్యాత పాటల పోటీల్లో పాల్గొన్న వారు భావి గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్నారు. మన తెలుగు సినీ గాయకుడు రేవంత్ కూడా ఆ కోవకు చెందిన వాడే. తాజాగా హిందీ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ కొనసాగుతోంది. ఈ పోటీల్లో తన పాటలతో మెస్మరైజ్ చేస్తున్న పవన్దీప్ రాజన్ అనూహ్యంగా ప్రేక్షకులతో పాటు జడ్జిలను షాక్కు గురి చేశాడు. తన్మయత్వంతో పాట పాడుతుండగా అందరూ మరో లోకంలో తేలుతున్న సమయంలో హఠాత్తుగా పవన్దీప్ అర్ధాంతరంగా పాట ఆపేసి.. ఇక చాలు అని వెళ్లిపోయాడు. ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోను సోనీ టీవీ విడుదల చేసింది. పవన్దీప్ ‘హోతన్ సే చులో తుమ్’ పాట పాడుతూ అకస్మాత్తుగా ఆపేశాడు. అంతసేపు ఆసక్తిగా వింటున్న జడ్జిలు ఒకప్పటి నటీనటులు ధర్మేంద, అనితా రాజ్ పాట ఆగిపోవడంతో జడ్జిలు, తోటి పోటీదారులు షాకయ్యారు. మైక్ ఆపేసి వెళ్తున్న పవన్దీప్ను మరో పార్టిస్పెంట్ నిలువరించి పాటను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రేమ్గీత్ సినిమాలో ఆ పాటను గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ పాడారు. ఆయనను మరిపించేలా పాడుతున్న పవన్దీప్ ఇలా చేయడంతో ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ఉత్తరాఖండ్కు చెందిన పవన్ దీప్ సీజన్ మొదటి నుంచి ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేస్తున్నారు. అతడి మధురమైన గాత్రానికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఇండియన్ ఐడల్ 12వ విజేతగా పవన్దీప్ రాజన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజన్ అకస్మాత్తుగా ఇలా చేయడంతో షోలో అతడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న పవన్దీప్ గతంలో కరోనా బారినపడ్డాడు. దీంతో పవన్దీప్ వర్చువల్గా ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. #IdolPawandeep ki iss performance se kya rang layega iss shaam ka mausam? Dekhiye #DharmendraAndAnitaRajSpecial #IndianIdol2020 aaj raat 9:30 baje, sirf Sony par! pic.twitter.com/YxptSJS1QO — sonytv (@SonyTV) July 18, 2021 -
హీరోయిన్ నివేథా థామస్లో ఈ టాలెంట్ కూడా ఉందా?
హీరోయిన్ నివేదా థామస్. ఈ ఏడాది వకీల్సాబ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలోని పల్లవి పాత్రలో నివేథా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా, తాజాగా గిటార్ వాయిస్తూ తన సింగింగ్ టాలెంట్ను కూడా బయటపెట్టేసింది. 2008లో విడుదలైన “జానే తు యా జానేనా” అనే సూపర్ హిట్ మూవీలోని కభీ కభీ అధితీ జిందగీ అనే పాటను పాడుతూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో నెటిన్లను ఆకట్టుకుంది. పాటలో ఆమె లీనమైన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం నివేదా పాడిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ వర్మ డైరెక్షన్లో ‘శాకిని ఢాకిని’ అనే మూవీలో నటిస్తుంది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర మరొక హీరోయిన్గా నటిస్తుంది. lekin raat ke baadh he tho savera hota hai 🌸 pic.twitter.com/r0e7cUPqqe — Nivetha Thomas (@i_nivethathomas) June 29, 2021 చదవండి : హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్గా అడిగేసిన నెటిజన్ మోనాల్ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? -
ఈ మగ పిట్ట పాడటం మర్చిపోయిందట..అందుకే
సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడైనా మీరు పాడుకునే పాటలు మర్చిపోయారా? ఆ అవును.. మర్చిపోతాం.. అయినా అందులో పెద్ద సమస్య ఏముంటది అనే కదా మీ ప్రశ్న. అవును మనకు ఏ సమస్యా ఉండదు. ఒకటి కాకపోతే ఇంకో పాట పాడుకుంటాం. అయితే ఇలాంటి ఓ సమస్యే ఈ పక్షికి వచ్చిపడింది. అదేంటంటే తాను పాడుకునే పాట మర్చిపోయిందట. ఇలా పాట పాడటం మర్చిపోవడం వల్ల ఈ పక్షి జాతికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఏకంగా ఆ జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎందుకంటే ఆడ పక్షిని ఆకర్షించేందుకు మగ పక్షులు మధురంగా ఓ పాట అందుకుంటాయట. అయితే మగ పక్షులు సరైన శ్రుతిలో పాడటం మర్చిపోయాయట. దీంతో ఆడపక్షులు మగ పక్షుల దగ్గరకు రావట్లేదట. దీంతో వాటి సంతతి అభివృద్ధి చెందక.. చివరికి అంతరించిపోయే దాకా పరిస్థితి వచ్చింది. ఇంతకీ వీటి పేరేంటో చెప్పలేదు కదా.. ‘రీజెంట్ హనీఈటర్’ అని పిలిచే ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఒకప్పుడు చాలా ఉండేవట. ఇప్పు డు ప్రపంచం మొత్తం కూడా 300 పక్షులు మాత్రమే ఉన్నాయట. దీంతో పక్షి శాస్త్రవేత్తలు ఇందుకు కారణాలు వెతకగా.. మగ పక్షులు పాట పాడటం మర్చి పోయిన విషయం గుర్తించారు. గత ఐదేళ్లుగా పర్యావరణ శాస్త్రవేత్త రాస్ క్రేట్స్ దీనిపై పరిశోధన నిర్వహించగా రీజెంట్ హనీయేటర్స్ పాటల సామర్థ్యం సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఈ విలక్షణమైన నలుపు ,పసుపు రంగులమిశ్రమంతో ఆకర్షణీయంగా కనిపించే పక్షులు ఒకప్పుడు ఆస్ట్రేలియా అంతటా సాధారణం, కానీ 1950 ల నుండి వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పక్షులకు మా త్రమే సొంతమైన పాటను పాడకుండా.. అనుకోకుండా వేరే పక్షుల శబ్దాలను, పాటలను అనుకరించడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కొంతకాలానికి అవి చేయాల్సిన శబ్దాలను గుర్తు చేసుకోలేకపోయాయని పేర్కొన్నారు. పుట్టిన పిల్ల పక్షులు కూడా వేరే శబ్దాలను నేర్చుకుంటున్నాయని, దీంతో ఆడ పక్షులు ఈ పాటలకు ఆకర్షితం కావడం లేదని విశ్లేషించారు. -
కూతురి పాట: పై నుంచి ఊడిపడ్డ తల్లి!
-
కూతురి పాట: పై నుంచి ఊడిపడ్డ తల్లి!
ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిందో ఏమో కానీ.. ఓ యువతి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఎందుకంటారా? లిజ్ సాన్ మిలాన్ అనే యువతి మ్యూజిక్ ఆడిషన్లో పాల్గొనాలనుకుంది. అందుకోసం ఇంట్లోనే పాట పాడి వీడియో పంపించాలనుకుంది. అనుకున్నట్లుగానే కెమెరా ఆన్ చేసి గొంతు సవరించుకుని అద్భుతంగా పాడటం మొదలు పెట్టింది. ఇంతలో ఆ గదిలో సీలింగ్ విరిగిపోయి అందులో నుంచి ఆమె తల్లి కాళ్లు బయటకు కనిపించాయి. ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్న కూతురు ఓ మై గాడ్ అంటూ వెనక్కు తిరిగి చూసి కెమెరా ఆఫ్ చేసింది. (చదవండి: జాగ్రత్త! నీ చెయ్యి చికెన్ పీస్ అయిపోద్ది) "నేను ముఖ్యమైన పని మీద ఉన్నానని తెలిసి కూడా అమ్మ దేని కోసమో అటక ఎక్కింది. ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందోనన్న భయంతో వీడియోలో నా మొహం కాస్త చిరాకుగా ఉంది . కానీ అమ్మ పడే ముందు వరకు ఎలాంటి శబ్దం చేయలేదు. ప్రస్తుతం ఆమె బాగానే ఉంది. శరీరానికి చిన్న గాయం కూడా కాలేదు" అని లిజ్ పేర్కొంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "నీ పాటకు ఇంటి పునాదులే కదులుతున్నాయి. కాబట్టి పాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో" అని ఓ యూజర్ ఉచిత సలహా ఇచ్చాడు. "అరెరే... అసలైన సమయానికి రాలేదు. వన్ మోర్", "పాడే వాళ్లకన్నా అలా వెనకాల డ్యాన్స్ చేసేవాళ్లే ఇష్టం" "కూతురి కష్టాన్ని నవ్వులపాలు చేసిన తల్లి " అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్గేట్స్) -
విజయవంతంగా ఆటా పాటల పోటీలు
అమెరికాలోని తెలుగుసంఘం(ఆటా) ఆధ్వర్యంలో ‘ఝుమ్మందినాదం’ సీనియర్ క్లాసికల్ పాటల పోటీలు జూలై 12 నుంచి 19 తేదీల్లో ఆన్లైన్ జూమ్ ద్వారా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 65మంది గాయని గాయకులు అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందినవారు ఆసక్తితో పాల్గొన్నారు. ‘ఝుమ్మంది నాదం’ కార్యక్రమాన్ని ఆల రామ కృష్ణారెడ్డి బోర్డు ఆఫ్ ట్రస్టీ, శారదా సింగిరెడ్డి నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అమెరికా, భారత్ నుంచి సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీనిహాల్ కొండూరి, ప్లేబ్యాక్ సింగర్ కుమారి, నూతన మోహన్, ప్లేబ్యాక్ సింగర్ వేణు శ్రీరంగం, సింగర్, ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ పీవీఎస్ఎన్ రోహిత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆటా సంస్థ సీనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులుగా అపరాజిత పమిడిముక్కల, చైత్ర ఆర్ని, జ్యోత్స్నా ఆకుంది, కార్తిక్ స్వామి, మైన ఏదుల, ప్రణవ్ అర్కటాల, ప్రణవ్ బార్ల, ప్రియాంక కొలనుపాక, శృతి శేఖర్, శ్రీప్రజ్ఞ వెల్లంకి, సుదార్చిత్ సొంటి, తేజశ్రీ మేక, వాదిరాజ్ గర్లపాడ్ ఫైనలిస్ట్స్గా ఎంపిక చేశారు. వీరు వాషింగ్టన్, న్యూజెర్సీ, టెక్సాస్, నార్త్ క్యారలిన్, జార్జీయా, ఆరిజోనా,క్యాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా, మిన్నిసోటా రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్రెడ్డి భుజాల.. బోర్డు ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్మన్లు, రీజనల్ డైరెక్టర్లు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వన్షన్ బృందం, ‘ఝుమ్మంది నాదం’ బృందం, సోషల్ మీడియా టీం, ఫైనలిస్ట్స్కు అభినందనలు తెలియజేశారు. పోటీలో పాల్గొన్న గాయని, గాయకులు, వారి తల్లిదండ్రులు.. ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణమని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీరెడ్డి అన్నారు. ఆటా ‘ఝమ్మంది నాదం’ సెమీ ఫైనల్స్ పాటల పోటీలు ఆగస్ట్2, 2020న, ఫైనల్స్ను ఆగస్ట్ 8, 2020 నుంచి 9 వరకు కొనసాగనున్నాయి. ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవీ, మన టీవీ ఇంటర్నేషనల్, టీవీ5, జీఎన్ఎన్, ఏబీఆర్ ప్రొడక్షన్స్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, టోరీ రేడియో ఇతర మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఝుమ్మంది నాదం పాటల పోటీ విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి అభినందనలు తెలిపారు. -
ఆటా ‘జుమ్మంది నాదం’ పాటల పోటీ
న్యూయార్క్ : డిసెంబర్, 2020లో జరగనున్న కన్వెన్షన్ను పురష్కరించుకుని ‘అమెరికన్ తెలుగు అసోషియేషన్’ ( ఆటా) ‘జుమ్మంది నాదం’ పేరిట ఆన్లైన్ సోలో పాటల పోటీ నిర్వహించనుంది. అమెరికాలో ఉంటున్న వారు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు. మొదటి రౌండ్ను యూట్యూబ్ ద్వారా నిర్వహించనున్నారు. పోటీలో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ ఫాంలో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా ఆడిషన్స్ పంపాల్సి ఉంటుంది. ఫైనల్, సెమీ ఫైనళ్లు జూమ్ ద్వారా నిర్వహించబడతాయి. విజేతలను ప్రముఖుల చేతుల మీదుగా ఆటా టైటిల్తో సత్కరించనున్నారు. పోటీలోని ఆరు విభాగాలు : వయసు పరిమితి 1) క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు) 2) క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు) 3) క్లాసికల్ : సీనియర్స్ ( 15 పైబడిన వారు) 4) నాన్ క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు) 5) నాన్ క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు) 6) నాన్ క్లాసికల్ : సీనియర్స్ ( 15 సంవత్సరాల పైబడిన వారు) రిజిస్ట్రేషన్ చివరి తేదీ : జూన్ 7, 2020 రిజిస్ట్రేషన్ కోసం : https://tinyurl.com/ATA-JN2020 క్లిక్ చేయడి. మరిన్ని వివరాల కోసం : https://tinyurl.com/ATA-JN-Details ను సందర్శించండి. -
‘అయ్య బాబోయ్ నువ్వు పాట పాడకు’
కరోనా లాక్డౌన్ సయమంలో ఫిలిమ్ మేకర్ కరణ్ జోహార్ అభిమానులకు వినోదాన్ని అందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. తన పిల్లలు యశ్, రూహిలతో కలిసి పలు వీడియోలు, ఫోటోలు రూపొందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తన ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో ఎంతో ఫన్నీగా ఉండటం, నెటిజన్లను ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రూహీ, యశ్లు పాత హిందీ పాటలను వింటూ ఆస్వాదిస్తుండగా కరణ్ వచ్చి పాట పాడటం ప్రారంభించాడు. దీంతో రూహీ వెంటనే ‘నువ్వు పాట పాడితే నాకు తలనొస్తుంది’అని అంటున్న మరో పాట అందుకున్నాడు కరణ్. అయితే ఈసారి యశ్ కూడా ‘నాన్న నువ్వు పాట పాడితే మాకు తలనొప్పిగా ఉంది’ అని అనడంతో కరణ్ పాట పాడటం ఆపేశాడు. ఎంతో క్యూట్, ఫన్నీగా ఉన్న ఈ వీడియో కేవలం గంట వ్యవధిలోనే మూడు లక్షలకుపైగా మంది వీక్షించగా వేల మంది లైక్ చేశారు. చదవండి: ‘అది వాషింగ్ మెషీన్ కాదు యశ్’ ‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా? -
ఆమె.. లేటెస్ట్ ఫేస్బుక్ సెన్సేషన్!
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిభకు కొదవ లేదు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఎంతో ప్రతిభ గల వ్యక్తులు తారసపడతారు. సాదాసీదా జీవితం గడుపుతూనే తమ అద్భుతమైన టాలెంట్తో అబ్బురపరుస్తుంటారు. తాజాగా అలాంటి ప్రతిభావంతురాలైన మహిళ వెలుగులోకి వచ్చారు. ఓ రైల్వే స్టేషన్లో పనిచేసుకుంటూ.. పొట్టపోసుకుంటున్న ఆమె తన గానంతో ఎందరో హృదయాలను హత్తుకుంటున్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పాడిన అలనాటి క్లాసిక్ పాటలను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాలను పరశింపజేస్తున్నారు. ‘బర్పెటా టౌన్ ద ప్లేస్ ఆఫ్ పీస్’ అనే ఫేస్బుక్ పేజీ ఆమె గానాన్ని నెటిజన్లకు పరిచయం చేసింది. పశ్చిమ బెంగాల్లోని రణఘాట్ రైల్వే స్టేషన్లో ఉన్న ఆమె.. ‘ఏక్ ప్యార్కి నగ్మా’ అనే పాటను ఆలాపిస్తున్న వీడియోను ఆ పేజీ పోస్టు చేసింది. రెండు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె గానాన్ని, ఆమె గొంతులోని మాధుర్యాన్ని చూసి నెటిజన్లు తన్మయులు అవుతున్నారు. గాంధర్వ గానమంటే ఇదే అయి ఉంటుందని, అచ్చం లత మంగేష్కర్ సుతిమెత్తగా పాట పాడుతుందా? అన్నంత మాధుర్యం ఆమె గొంతులో ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె గానంలో ఓలలాడుతూ ఆనందపారవశ్యులవుతున్నట్టు పేర్కొంటున్నారు. జూలై 28న పోస్ట్ చేసిన ఆమె సింగింగ్ వీడియోను ఇప్పటికే 16లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 35వేల మంది ఆమె వీడియోను షేర్ చేసుకున్నారు. ఆమె పాట సూపర్ హిట్ కావడంతో మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో లతా మంగేష్కర్ క్లాసికల్ పాటను ఆమె మధురంగా ఆలపించారు. -
అలెక్సా బూతులు తిడుతోంది!
29 ఏళ్ల మైఖేల్ స్లడే ఎప్పటిలాగే ఇంటికొచ్చి అలెక్సాని ఆన్ చేసి ఏదైనా మంచి సంగీతం వినిపించమని అడిగాడు. అయితే అది సంగీతం వినిపించడానికి బదులు బూతులు తిట్టడం మొదలెట్టింది. ఎప్పుడడిగినా పాటలు వినిపించే ఈ వర్చువల్ అసిస్టెంట్... ఉన్నట్టుండి బూతులందుకోవడంతో మైఖేల్ షాక్ తిన్నాడు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డాడు. అంతకు ముందురోజే మైఖేల్ తన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రద్దు చేసుకున్నాడు. దాని విషయమై కస్టమర్ కేర్కు చెందిన వ్యక్తితో మాట్లాడాడు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పటి నుంచి అలెక్సా ఇలా వింతగా ప్రవర్తించడంతో దానికీ దీనికీ ఏదైనా సంబంధం ఉందేమోనని అనుమానించాడు. అమెజాన్ను సంప్రదిస్తే అలాంటిదేమీ లేదన్నారు. అలెక్సా ఎందుకలా అనుచిత పదాలు వాడుతోందో తమకూ అర్థం కావడం లేదన్నారు. అలెక్సా ఖాతా వివరాలు ఇస్తే ఏం జరిగిందో పరిశీలించి చెబుతామని చెప్పారు. జరిగిన పొరపాటుకు పరిహారంగా అమెజాన్ మైఖేల్కు 5 పౌండ్ల నగదు, ఏడాది అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా ఇచ్చింది.‘ఇంటికొచ్చాకా రోజూలాగే అలెక్సాను ఏదైనా సంగీతం వినిపించమని అడిగాను. ‘తప్పకుండా. మీ పాటల జాబితా ఇది......(అని ఓ బూతు పదం వాడింది). తర్వాత క్షమించండి ఏదో పొరపాటు జరిగింది’ అని అలెక్సా చెప్పే సరికి షాక్ తిన్నా. అలెక్సా అలా మాట్లాడటం నమ్మలేకపోయా’ అన్నాడు సౌత్వేల్స్కు చెందిన మైఖేల్. అమెజాన్ సాంకేతిక నిపుణులు కూడా ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేకపోయారన్నాడు. -
కేరళ కోసం జడ్జీల గానం
న్యూఢిల్లీ: సంక్షోభ సమయాల్లో మానవీయంగా స్పందించగలమని, అందుకు అవసరమైతే మైక్ పట్టుకుని పాటలు కూడా పాడగలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరూపించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం సోమవారం సుప్రీంకోర్టు జర్నలిస్ట్లు చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ గాత్ర ప్రావీణ్యాన్ని చూపారు. ఈ ఇద్దరు జడ్జీలు కేరళకే చెందినవారు కావడం గమనార్హం. మలయాళ క్లాసిక్ సినిమా ‘అమరం’లోని మత్స్యకారుల జీవనాన్ని వర్ణించే ఓ పాటను కేఎం జోసెఫ్ పాడారు. ‘కేరళలో వరద బాధితుల సహాయానికి ముందు స్పందించింది మత్స్యకారులే. అందుకే వారి కోసం ఈ పాట’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గాయకుడు మోహిత్ చౌహాన్తో కలిసి ‘వి షల్ ఓవర్కమ్ సమ్డే’ అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆలపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, పలువురు ఇతర జడ్జీలు, జర్నలిస్ట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 లక్షలకు పైగా విరాళాలు వసూలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరూ రూ. 25 వేల చొప్పున, కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. -
సభలో పాటపాడి అలరించిన నగ్మా
టీ.నగర్: నటి నగ్మా పుదుచ్చేరిలో జరిగిన కాంగ్రెస్ సభలో పాట పాడి అక్కడి మహిళలను అలరించారు. పుదుచ్చేరి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుక్కనూర్ కోరపట్టిలో ఆదివారం మహిళల చైతన్య శిబిరం, సంక్షేమ సహాయకాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా పేద మహిళలకు సంక్షేమ సహాయకాలు అందజేసి ప్రసంగించారు. ఆ సమయంలో మహిళలను ఉత్సాహపరిచేందుకు పాట పాడాలని నిర్వాహకులను కోరగా పాట పాడారు. తర్వాత నగ్మాను పాడాల్సిందిగా నిర్వాహకులు అడిగారు. అంగీకరించిన నగ్మా మైక్ అందుకుని ‘నీ నడందాల్ నడై అళగు’ (నువ్వు నడిస్తే నడక అందం), స్టైల్ స్టైలు దాన్.. తంగమగన్.. అనే పాటలు పాడారు. అక్కడున్న మహిళలు కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పాటలో తాను అందం అంటూ పేర్కొన్నది రాహుల్గాంధీనని, రజనీకాంత్ గురించి కాదన్నారు. రాహుల్ గాంధీ తమ బాషా.. ఆయనే ప్రధానిగా రావాలంటూ వివరణ ఇచ్చారు. -
జయజయ.. జనగణమన
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రయాణికులు కొత్తపల్లి మండలకేంద్రంలోని బస్టాండ్లో కరీంనగర్–జగిత్యాల రహదారిపై సోమవారం నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గీతాలాపన చేపడతారు. మై విలేజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గీతాలాపన కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.ఉషారాణి, కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ నిత్య గీతాలాపనతో సోదరభావం, ఐక్యత పెంపొందుతుందని చెప్పారు. ఎంపీపీ మాట్లాడుతూ జాతీయతను పెంపొందించేందుకు గీతాలాపన దోహదపడుతుందన్నారు. సర్పంచ్ వాసాల అ ంబికాదేవి, హైస్కూల్ హెచ్ఎం మంజుల, ఎస్సై పి.నాగరాజు, గ్రామస్తులు బండ గోపాల్రెడ్డి, గున్నాల రమేశ్, రుద్ర రాజు, స్వర్గం నర్సయ్య, ఫ క్రొద్దీన్, సాయిలు, మై విలేజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పెంటి నవీ న్, సభ్యులు శివగణేశ్, రామకృష్ణ, వెంకటేష్, శ్రీనాథ్, కొత్తపల్లి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ధోని గారాలపట్టి పాడిన పాట విన్నారా !
-
‘అజ్ఞాతవాసి’ లో పాట పాడిన పవన్ కల్యాణ్
-
మెట్రోలో మరదలు మైసమ్మ..!
మారేడుపల్లి: మెట్రోరైలు ఎండీ గొంతు సవరించారు. తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. శుక్రవారం కస్తూర్భా గాంధీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మెట్రోరైలులో మరదలు మైసమ్మ.. ఏసీలో వచ్చే మరదలు మైసమ్మ.. చెమటలు పట్టేదిలేదు మరదలు మైసమ్మ’.. అంటూ పాటలు పాడి విద్యార్థినులను ఉర్రూతలూగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెట్రోరైలు రాకతో నగరం గ్లోబల్ సిటీగా మారుతుందన్నారు. 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్ ప్రారంభమైందని, 50 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని వివరించారు. ఇంటర్ దశ ఎంతో కీలకమని, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రద్ధగా చదివి అనుకున్న గమ్యాన్ని చేరాలని సూచించారు. ఈ సందర్భంగా కాలేజీ టాపర్స్కు బహుమతులను ప్రదానం చేశారు. కాగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కస్తూర్భాగాంధీ మహిళా కళాశాల చైర్మన్ ఎన్.వి.ఎన్.చార్యులు, సెక్రటరీ హైదర్, ట్రెజరర్ అజయ్కుమార్, ప్రిన్సిపాల్ ప్రతిమారెడ్డి, పలువురు పాల్గొన్నారు. వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న ఎన్వీఎస్ రెడ్డి -
ఇష్టదైవంపై గానామృతం
- శివ ప్రకాశం పేరుతో గానం - ఈ నెల 24న హైదరాబాద్లో విడుదల - సినీ నటుడు జయప్రకాశ్రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ఇష్టదైవమైన శివునిపై శివప్రకాశం పేరుతో పాటలు గానం చేసినట్లు సినీ నటుడు జయప్రకాశ్రెడ్డి తెలిపారు. దీంతో తన చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. తన గానామృత సీడీలను ఈ నెల 24న హైద్రాబాద్లోని ఫిలిమ్ చాంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం వ్యవసాయశాఖ కర్నూలు సబ్ డివిజన్ కార్యాలయానికి వచ్చి బంధువు, స్నేహితుడైన ఏడీఏ రమణారెడ్డి, ఇతర వ్యవసాయ సిబ్బందితో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇప్పటి వరకు యాక్టింగ్, డైలాగ్స్ మాత్రమే చూశారని, ఇపుడు మొదటి సారిగా శివునిపై పాడిన భక్తి పాటలు వింటారని తెలిపారు. విద్యార్థి దశనుంచే పాటలు పాడటం హాబీగా ఉందని, అయితే శివునిపై భక్తి పాటలు పాడాలనే చిరకాల వాంచ ఇప్పటికి నెరవేరిందన్నారు. జొన్నవిత్తల రచించిన ఆరు పాటలను, వీణపాణి సంగీత దర్శకత్వంలో గానం చేసినట్లు తెలిపారు. లక్ష్మిదేవికి ఒక లెక్కుంది అనే మూవీలో ఒక పాట పాడినప్పటికి అది పాపులర్ కాలేదన్నారు. ఇప్పటి వరకు 300కు పైగా సినిమాల్లో నటించినట్లు తెలిపారు. నాటక రంగం కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పిన జయప్రకాశ్రెడ్డి ఇటీవల గుంటూరులో ప్రత్యేక నాటక సమాజాన్ని స్థాపించామని వివరించారు. కర్నూలు జిల్లా శిరువెల్ల మండలం వీరారెడ్డిపల్లికి చెందిన తాను గ్రామంలో కష్టాల్లో ఉన్న వారికి చేయూత ఇస్తుంటానని తెలిపారు. ఆయన వెంట సినీ, టీవీ ఆర్టిస్ట్ ఆశా కూడా ఉన్నారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ అశోక్కుమార్రెడ్డి, రిటైర్డ్ ఏఓ శివశంకర్ తదితరులతో ఆయన కలిశారు. -
శ్రవణపేయంగా త్యాగరాజ కీర్తనలు
తెనాలి: శ్రీసీతారామ గానసభ 70వ వార్షిక సంగీత ఉత్సవాలు 10వ రోజయిన బుధవారం రాత్రితో ముగిశాయి. ఇక్కడి మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఉత్సవాల్లో చివరిరోజు రాత్రి త్యాగరాజ వైభవం, ప్రఖ్యాత త్యాగరాజ కీర్తనలు, వ్యాఖ్యాన సహితంగా నిర్వహించటం విశేషం. సంగీత త్రిమూర్తులైన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ భూమికములుగా ఆయా విద్వాంసుల ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆధారంగా కార్యక్రమం జరిపారు. ప్రధాన భూమికగా త్యాగరాజస్వామి జీవితంలో ఆయన రచించిన విశేష సంగీత కృతులను విజయవాడకు చెందిన చావలి రామకృష్ణ ఆలపించారు. ముఖ్య కీర్తనలకు బ్రహ్మర్షి ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకుంది. చావలి శ్రీనివాస్ వయొలిన్పై కృష్ణమోహన్ మృదంగంపై సహకరించారు. గానసభ అధ్యక్షుడు ఆచార్య పిరాట్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అనుక్షణం.. రాగ మిళితం..
తెనాలి : శ్రీసీతారామ గానసభ 70వ వార్షిక సంగీతోత్సవాల్లో ఏడోరోజయిన ఆదివారం రాత్రి చెన్నైకు చెందిన సునీల్ ఆర్.గార్గ్యన్ తన గానంతో సభికులకు వీనులవిందు చేశారు. స్థానిక మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కళ్యాణమండపంలో జరిగిన ఈ కచేరీ ఆద్యంతమూ హృద్యంగా సాగింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే గార్గ్యన్, అనుభవజ్ఞులైన సంగీత విద్వాంసుల తరహాలో సంస్కృతి సంప్రదాయాలు, రాగాలాపన, స్వరం మనోధర్మం వంటి అన్ని విషయాలు కలిసి ఆది నుంచి అంత్యం వరకు విశిష్టమైన రీతిలో కచేరీని రక్తికట్టించటం విశేషం. తొలుత వర్ణంను తోడిరాగం, ఆదితాళంలో ఆలపించాక, శ్రీమహాగణపతే...ను బేగడ రాగం రూపక తాళంలో పాడి కరతాళధ్వనులను అందుకొన్నారు. దర్బార్రాగంలో మిశ్రచాపు తాళంలో పాడిన ‘రామాభిరామ’ కీర్తనతో మంత్రముగ్ధులను చేశారు. రెండున్నర గంటల సేపు వివిధ కీర్తనలను గానం చేసి, అందరి ప్రశంసలను అందుకొన్నారు. వీరికి వయొలిన్పై వెటరన్ పుదక్కొటై రామనాథన్, మృదంగంపై ఐ.పినాకపాణిలు గొప్ప కూర్పుతో చక్కని సహకారం అందించారు. గానసభ అధ్యక్షుడు డాక్టర్ పిరాట్ల నారాయణమూర్తి తొలుత గార్గ్యన్ను పరిచయం చేశారు. సంగీత కళాచార్య పీఎస్ నారాయణస్వామి, పీబీ రంగాచార్యుల వద్ద సంగీత అభ్యాసం చేసిన గార్గ్యన్, మదంగంలోనూ పండితులే. పిన్నవయసునుంచి సంగీత సాధనతోనే ఇంతటి ప్రావీణ్యం అలవడింది. ప్రస్తుతం బీ గ్రేడ్ ఆర్టిస్టుగా వున్నారు. కార్యదర్శి డాక్టర్ వ్యాకరణం వెంకట్రావు, ఇతర సభ్యులు పర్యవేక్షించారు. ఘనంగా సాగిన మేఘనామూర్తి గానం... సంగీతోత్సవంలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరుకు చెందిన మేఘనామూర్తి తన గానంతో శోత్రల అభినందనలు అందుకున్నారు. రెండున్నర గంటలసేపు సాగిన కచేరీ అనంతరం, పిన్నవయసులోనే అపార పాండిత్యం సాధించిందని ప్రశంసలు పొందారు. -
ఆద్యంతం.. రాగరంజితం..
తెనాలి: శ్రీసీతారామ గానసభ సంగీతోత్సవాల్లో భాగంగా శుక్రవారం విశాఖకు చెందిన సంగీత విద్వాంసురాలు సోమయాజుల సుబ్బలక్ష్మి గాత్రకచేరీ ఆద్యంతం శ్రోతలను ఆకట్టుకుంది. స్థానిక మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కల్యాణ మండపంలో రెండున్నర గంటలకుపైగా సాగిన కచేరీలో ప్రేక్షకులు సుబ్బలక్ష్మి కీర్తనలతో మంత్రముగ్ధులయ్యారు. వయొలిన్, మృదంగ విద్యాంసులు రామచరణ్, రామకృష్ణ తమ ప్రావీణ్యంతో కచేరీని రక్తి కట్టించారు. వీరి కుమార్తె విష్ణుప్రియ ఇందిర సోమయాజులు ముత్తుస్వామి దీక్షితులు రచించిన ఆనందామృతకర్పిణి కృతిని అమృతవర్షిణి రాగం, ఆదితాళంలో గానం చేసింది. మరొక కృతి కైలాసనాథేనను కాంభోజిరాగంలో మిశ్రచాపు తాళంలో పాడి అభినందనలు అందుకుంది. సంగీత నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి పద్మభూషణ్ నూకల చినసత్యనారాయణ, కొక్కొండ సుబ్రహ్మణ్యశర్మ, ప్రస్తుతం మందా సుధారాణి వద్ద సంగీతంలో అభివృద్ధి చెందుతున్నారు. విశాఖలోని హంస అకాడమీలో ముఖ్యభూమికను పోషిస్తున్నారు. ఇంగ్లిష్, సంగీతంలోనూ పీజీ చేశారు. ఆలిండియా రేడియోలో బీహై గ్రేడెడ్ ఆర్టిస్టుగా దక్షిణ భారతదేశంలోని అనేక ప్రదేశాల్లో కచేరీలు చేశారు. మరో వైపు తాను స్వయంగా సంగీత శిక్షకురాలిగా పలువురికి శిక్షణనిస్తున్నారు. -
నన్ను అనవసరంగా అలా మార్చారు
-
3 వేల గొంతుల జనగణమన
మార్మోగిన చంద్రంపాలెం స్కూలు ఘనంగా ఆంధ్ర కేసరి జయంతి మధురవాడ: విద్యార్థులు జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని ఆర్జేడీ వి.భార్గవ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ‘ఆజాద్–70’ పేరిట మంగళవారం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 వేల మంది విద్యార్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ జాతీయ యోథులు ఎంతో మంది తమ ప్రాణాలు తణప్రాయంగా భావించి స్వాతంత్య్ర పోరాటం చేశారని, వారి త్యాగ నిరతి మరువ లేనిదని చెప్పారు. డీఈవో ఎంవీ కష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దేశ భక్తిని, సేవా తత్వాన్ని పెంపొందించు కోవాలని చెప్పారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయాలని చెప్పారు. మహనీయుడు ప్రకాశం రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతిని పురస్కరించుకుని చంద్రంపాలెం పాఠశాలలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసిన నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన యోథుడు ప్రకాశమని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రాజబాబు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అల అన్నమాచార్యుడు భువికేగెనా..
సీతానగరం (తాడేపల్లి రూరల్): ‘కలగంటి.. కలగంటి.. ఇప్పుడిటు కలగంటి..’, ‘వినరో భాగ్యము విష్ణు కథ..’ అంటూ.. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని సీతానగరం ఘాట్ వద్ద ఉన్న శ్రీసోమేశ్వర స్వామి ఆలయంలో శనివారం పెదనందిపాడుకు చెందిన శ్రీసీతారామాంజనేయ భక్త సమాజం సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. తొలుత ఘాట్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. -
సెహ్వాగ్ కాన్స్ట్రేషన్ సీక్రెట్ ఏమిటో తెలుసా?
మైదానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కోలా ఫోకస్ చేస్తుంటాడు. బంతికి, బ్యాటుకు మధ్య లింకు తెగిపోకుండా కాన్స్ట్రేషన్ కొనసాగించేందుకు తమదైన టెక్నిక్స్ ను బ్యాట్స్మన్ ఉపయోగిస్తుంటారు. 'పిచ్' మీద ఉన్నప్పుడు రెచ్చిపోయి ఆడే ఆటగాళ్లు సైతం తమ ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తుంటారు. బౌలర్లను కకావికలం చేయడమే టార్గెట్గా క్రీజులోకి ఎంటరయ్యే భారత మాజీ డాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఏకాగ్రత కోసం ఇలాంటి చిట్కానే ఒకదానిని ఉపయోగించేవాడట. ఫీల్డ్లోకి ఎంటరవ్వగానే బ్యాటింగ్ మీద ఫోకస్ చెదిరిపోకుండా ఉండేందుకు బాలీవుడ్ లెజండరీ గాయకుల పాటల్నిఆయన హామ్ చేసేవాడట. ముఖ్యంగా కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాటలను పాడుతూ బ్యాటింగ్ మీద ఫోకస్ చేసేవాడినని తాజాగా సెహ్వాగ్ తన కాన్స్ట్రేషన్ సీక్రెట్ వెల్లడించాడు. 'ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండేందుకు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా పాటలను పాడేవాణ్ని. కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ఆ పాత మాధుర గీతాలను ఎక్కువగా పాడుతూ ఉండేవాడిని' అని 37 ఏళ్ల సెహ్వాగ్ చెప్పాడు. తన డాషింగ్ బ్యాటింగ్తో భారత్కు ఎన్నో విజయాలు అందించిన సెహ్వాగ్ గత ఏడాది అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైరైన సంగతి తెలిసిందే. పెద్దగా ఫుట్వర్క్ లేకపోయినా కంటిచూపునకు, చేతికి మధ్య గొప్ప సమన్వయంతో అద్భుతమైన షాట్లు కొట్టిన సెహ్వాగ్.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం తన ఏకాగ్రత కాపాడుకునేందుకు పాటలు ఎక్కువగా పాడేవాడినని, అయితే వికెట్ పడకుండా ఏకాగ్రత కొనసాగినంతసేపు ఎవరి పాట, ఏ పాట అన్నది పెద్దగా ప్రాధాన్య విషయం కాకపోయేదని చెప్పాడు. మీతో కలిసి సహచర బ్యాట్స్మెన్లు కూడా గొంతు కలిపేవారా అని అడిగితే.. 'నా పార్ట్నర్స్కు నేను పాడుతున్న సంగతి అస్సలు తెలిసేది కాదు. మేం పిచ్ మధ్యలో కలిసినప్పుడు గేమ్ గురించే మాట్లాడేవాళ్లం. పిచ్ ఎండ్కు వెళ్లాక నా సహజ ధోరణిలో నేను పాటలు పాడుకునే వాణ్ణి. నాన్ స్టైకర్స్ ఎండ్లో ఉన్నప్పుడు మాత్రం ఎంపైర్లతో మాట్లాడేవాణ్ని' అని సెహ్వాగ్ వివరించాడు. -
మా అమ్మాయి 'ఆ' పాట పాడటం ఇబ్బందిగా ఉంది
లాస్ ఏంజిల్స్: తాను పాడిన పాటను తన కూతురు కూడా పాడితే.. ఏ తండ్రికైనా ఆనందం కలుగుతుంది. కానీ అమెరికన్ సింగర్ ఏజే మెక్ లియాన్ మాత్రం తన మూడేళ్ల కూతురు అవా తన పాటను పాడుతుంటే ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. 'బ్యాక్ స్ట్రీట్ బాయ్స్'తో ఫేమస్ అయిన ఈ గాయకుడు.. తన ఆల్బంలోని 'సెక్స్' అనే పాటను తన కూతురు అవా పాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉందని తెలిపాడు. 'తనకు సంగీతమంటే చాలా ఇష్టం. తను పాడుతుంది. డ్యాన్స్ చేస్తుంది. కానీ తనకు ఇష్టమైన పాట 'సెక్స్'. ఆ పాటలోని ప్రతి పదం తనకు తెలుసు. అందులోని అర్థం తెలియకపోయినా తను తరచూ పాడుతుంది. తను ఆ పాట పాడుతుంటే.. 'దేవుడా.. వద్దు' అనాలన్న భావన కలుగుతుంది. తన నోటి నుంచి ఆ పాట వింటుంటే కొంచెం ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంటుంది' అని మెక్లియాన్ చెప్పాడు. -
నే పాడితే...!
ఈ మధ్య కాజల్ అగర్వాల్ ‘చక్వ్య్రూహ’ అనే కన్నడ చిత్రం కోసం ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో కాజల్ నటించలేదు. ఇప్పుడు ప్రియమణి కూడా ‘దేవరావనే బుదు గురు’ అనే కన్నడ చిత్రం కోసం పాడారు. ఈ చిత్రంలో ఆమె నటించలేదు. ప్రియమణితో పాట పాడించాలని చిత్రదర్శకుడు ప్రథమ్ అనుకున్నారు. అడగ్గానే ఈ బ్యూటీ ‘సై’ అన్నారట. విశేషమేమిటంటే ప్రియమణి ఈ పాటను మూడు రకాల వేరియేషన్స్లో పాడారు. ఆమె అద్భుతంగా పాడిందని దర్శకుడు పేర్కొన్నారు. ప్రియమణితో పాట పాడించిన విషయం చిత్రబృందానికి తెలియదట. అందుకని, చిత్రకథానాయకుడు అకుల్ బాలాజీకి ఈ పాట వినిపించి, ‘ఇది నీకు బాగా తెలిసినవాళ్లు పాడారు? ఎవరో కనుక్కో’ అని దర్శకుడు అడగాలనుకున్నారట. ప్రియమణి, అకుల్ మంచి స్నేహితులు. దర్శకుడు అతనికి విషయం చెప్పేలోపే ప్రియమణి తాను పాడిన విషయం అకుల్కి చెప్పడం జరిగింది. పాట విన్న అకుల్... ప్రియమణి ఇంత బాగా పాడగలదా? అని ఆశ్చర్యపోయారట. -
బాత్రూమ్ సింగర్స్కు భలే చాన్స్!
మీరు బాత్రూమ్కు వెళ్లినప్పుడు.. ఏదో నాలుగు కూనిరాగాలు తీస్తారా? బాత్రూమ్లో పాడటం మీకు సరదానా? అయితే మీరు కూడా గాయకులు అయిపోవచ్చు! ఏదో చాటుమాటుగా నాలుగు కూనిరాగాలు తీసినంతమాత్రాన గాయకులైపోతారా? అనుకోకండి. మీలాంటి వాళ్ల ప్రతిభను బయటకుతీసి.. ప్రపంచానికి పరిచయం చేసేందుకే బెంగళూరు టెక్కీ సునీల్ కోశె ముందుకొచ్చారు. బాత్రూమ్ సింగర్కు భవిత ఉండదన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేసి.. ఆయన చాలామందిని ప్రొఫెషనల్ గాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం ఆయన 'ఫ్రమ్ మగ్ టు మైక్' పేరిట ఓ గ్రూప్ను ఏర్పాటుచేశారు. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో 200 వర్క్షాప్లు నిర్వహించి.. దాదాపు మూడువేలమంది గాయకులకు అవకాశం కల్పించారు. దీంతో వాళ్లంతా వేదికలు ఎక్కి ధైర్యంగా పాటలు పాడటమే కాదు.. చెన్నై, బెంగళూరు, కొచ్చి, త్రివేండ్రం మొదలైన నగరాల్లోని స్టూడియోల్లో తమ పాటను రికార్డు చేసుకొని మురిసిపోతున్నారు. 'సంప్రదాయ గానాన్ని, ప్రొఫెషనల్ సింగింగ్కు అనుసంధానం చేసి.. ఓ వేదిక కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలామంది 20-25 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్నా.. వారికి స్టూడియోలో పాడే అవకాశం రావడం లేదు. స్టూడియోలో పాట రికార్డు చేస్తే తప్ప.. మీ సొంత గొంతును మీరు అర్థం చేసుకోలేరు. వేదిక మీద పాడటం వేరు. స్టూడియోలో మైక్రోఫోన్ ఎదుట పాడటం వేరు. గొంతులో చిన్న మార్పు వచ్చినా స్టూడియోలో అర్థమైపోతుంది' అని సునీల్ కోశే చెప్తారు. ఆయన తాజాగా తన విద్యార్థులతో కలిసి ఓ వీడియోను రూపొందించారు. బాత్రూమ్ గాయకులారా సిగ్గుపడకండి.. బయటకొచ్చి మీ ప్రతిభ చాటండి అని ఈ వీడియో ద్వారా ప్రోత్సహిస్తున్నారు. -
రైనా కొత్త కెరీర్
యువ క్రికెటర్ సురేశ్ రైనా.. కొత్త కెరీర్ స్టార్ట్ చేయనున్నాడు. సినిమాల వైపు దృష్టి పెట్టిన రైనా.. త్వరలోనే సినిమా అరంగేట్రం చేయనున్నాడు. అయితే అందరిలా యాక్టింగ్ కాకుండా.. రైనా పాటను ఎంచుకున్నాడు. బాలీవుడ్ నటుడు జీషన్ ఖాద్రీ డైరెక్ట్ చేస్తున్న మీరుతియాన్ గ్యాంగ్ స్టర్ సినిమాలో రైనా పాట పాడబోతున్నాడు. తనకు పాత హిందీ పాటలంటే ఇష్టమని.. గ్యాంగ్ స్టర్ సినిమాలో ఓ మెలోడీ పాడనున్నానని రైనా తెలిపాడు. -
మళ్లీ అంటే అలా పాడలేనేమో!
న్యూఢిల్లీ: అప్పుడప్పుడు పాటలు పాడటం తనకు సరదా అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నారు. ఆయన ఇప్పటి వరకు పాడిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మీరు పాడిన పాటలు ఇంతగా హిట్ అవుతున్నాయి పాడటాన్ని సీరియస్గానే తీసుకుంటున్నట్లున్నారా అని ఆయనను ప్రశ్నించగా అదేం లేదని చెప్పారు. తాను పాటలు పాడటాన్ని అస్సలు సీరియస్ తీసుకోనని, సరదాకే పాడుతుంటానని చెప్పారు. ఒక వేళగతంలో నేను పాడిన పాటల్ని ఇప్పుడు మీరు పాడమంటే అలాంటి గొంతుతోటి మళ్లీ పాడలేనని చెప్పారు. స్టూడియోలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందేమోనని అనిపిస్తుందని చెప్పారు. కిక్ సినిమాకోసం హ్యాంగోవర్, హల్లో బ్రదర్ కోసం చాంది కి దాల్ పార్, ఆయన నిర్మిస్తున్న చిత్రం హీరోకోసం ఓ పాటను సల్మాన్ పాడిన విషయం తెలిసిందే. -
ఆ ఛాన్స్ వస్తే వదులుకోను: అనసూయ
మా మహాలక్ష్మి, తడాఖా, కిర్రాక్ వంటి టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అనసూయ మరో కొత్త అవతారం ఎత్తబోతోంది. సింగర్ గా ప్రేక్షకులను అలరించాలని ఆమె ఉవ్విళ్లూరుతోంది. ఓ ఫిచర్ సినిమాలో నటించేందుకు సిద్దమైన అనసూయ పాట పాడాలన్న తన కోరికను బయటపెట్టింది. అంతేకాదు తన కోరిక త్వరలోనే తీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. తనకున్న ఇష్టాల్లో పాట పాడడం ఒకటని వెల్లడించింది. పాట పాడే అవకాశం ఇవ్వాలని పలువురు సంగీత దర్శకులను కూడా ఆమె సంప్రదించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బృందంతో కలిసి ఇటీవల ఆమె అమెరికాలో పర్యటించింది. ఈ బృందం అమెరికాలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది. తనకు పాట పాడే అవకాశం వస్తే వదులుకోబోనని అనసూయ చెప్పింది. ఎవరో ఒకరు తనకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. -
పాడేరు సబ్ కలెక్టర్గా ప్రసన్న వెంకటేష్
పాడేరురూరల్: పాడేరు సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్ను నియమి స్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాడేరు ఆర్డీఓగా పనిచేస్తున్న జి.రాజకుమారికి బదిలీ అయ్యింది. రాజకుమారి పాడేరు ఆర్డీఓగా 2014, ఫిబ్రవరి 14న విధులలో చేరారు. పాడేరు సబ్ కలెక్టర్గా తొలి పోస్టింగ్పై వస్తున్న తమిళనాడు కేడర్కు చెందిన ప్రసన్న వెంకటేష్ కడపలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఆయన అయిదు నెలల్లోనే బదిలీ అయ్యారు. తరువాత గణపతిరావు ఏడాదిపా టు పాడేరు ఆర్డీఓగా సేవలందించారు. గణపతిరావు బదిలీ అయిన తరువాత జి.రాజకుమారి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తరువాత పాడేరు సబ్ కలెక్టర్గా ఐఏఎస్ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. రాజమండ్రి సబ్ కలెక్టర్గా విజయరామరాజు రాజమండ్రి : రాజమండ్రి డివిజన్ సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి వి.విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈయనది విశాఖపట్నంలోని సీతమ్మధార. -
వర్షాతిరేకం
ఏజెన్సీలో భారీ వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు, గెడ్డలు ఖరీఫ్కు అనుకూలం పాడేరు: ఏజెన్సీలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల 8 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసి రెండు రోజులపాటు తెరిపినిచ్చిన ప్పటికి మరల వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాడేరు, చింతపల్లి, రొంపుల, సీలేరు, అనంతగిరి ఘాట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈదురుగాలుల ఉధృతికి గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఆనుకుని భారీ వృక్షాలు ఉండడంతో భయంభయంగానే వాహనాలను నడుపుతున్నారు. కాగా విస్తారంగా కురుస్తున్న వర్షంతో ఖరీఫ్ వ్యవసాయ పనులకు మరింత మేలు చేస్తుంది. పంట పొలాల్లో నీరు చేరింది. ఇప్పటికే ఏజెన్సీవ్యాప్తంగా 50 శాతం వరినాట్లు పూర్తవగా ఈ వర్షాలకు మిగతా వ్యవసాయ భూముల్లో కూడా పనులకు మేలు జరగనుంది. మరోవైపు ఏజెన్సీలో చిన్న చిన్న కొండవాగులు కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, సీలేరు, కోనాం, తారకరామ, పెద్దేరు, రైవాడ జలాశయాలకు కూడా వరదనీరు చేరుతోంది. మత్స్యగెడ్డ, రాళ్ళగెడ్డ, బొయితిలి గెడ్డ, కించూరు గెడ్డ, లోతుగెడ్డ సమీపంలోని పెద్ద గెడ్డలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదస్థాయికి డుడుమా ముంచంగిపుట్టు: అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ(డైవర్షన్) డ్యాంలో 2 వేలు క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుతోంది. ఈ డ్యాం పూర్తి సామర్ధ్యం 2690 అడుగులకుగాను మంగళవారం నాటికి 2589.1 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 7,8 నంబర్ల గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని దిగువనున్న బలిమెల రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. జోలాపుట్టు గేట్లు మూసివేత : డుడుమ డ్యాంలో వరద నీరు అధికంగా చేరుతుండడంతో సోమవారం రాత్రి నుంచి జోలాపుట్టు ప్రధాన రిజర్యాయర్లోని గేట్లను మూసేసి నీటి విడుదల నిలుపుదల చేశారు. ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పతికి డుడుమ డ్యాంకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండేవారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులకుగాను ప్రస్తుతం 2721.10 అడుగులు నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం మాచ్ఖండ్లో 92 మెగావాట్ల విద్యుదుత్పతి జరుగుతుంది. -
అదృష్టవంతురాలిని
సల్మాన్ఖాన్తో కలిసి ఓ పాట పాడే అవకాశం లభించడం తన అదృష్టమంటూ గాయని పాలక్ ముచ్చల్ పొంగిపోయింది. ‘కిక్’ సినిమాలో ‘జుమ్మే కీ రాత్’ అనే పాటను సల్మాన్తో కలిసి పాడడం తనకు మంచి కిక్కు ఇచ్చిందంది. తన కెరీర్లో హిమేశ్ రేషమ్మియా, సల్మాన్లు కీలకపాత్ర పోషించారంది. ‘సల్మాన్ఖాన్తో కలసి ఓ పాట పాడాలనేది నా కల. ఓ రోజు సరదాగా ఈ విషయాన్ని సల్మాన్ సార్కు చెప్పా. ఆయనయన కూడా ఓ మంచి గాయకుడే కావడంతో నా మనసులో మాట చెప్పా. హిమేశ్ అందరితోనూ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాడు. ఎటువంటి పరిమితులు ఉండవు. హిమేశ్ కోసం నేను ఓ పాట కూడా పాడాను. అది నాకు ఎంతో ఉత్సాహం కలిగించింది. ఈ పాట పాడే సమయంలో నా దృష్టిని, హృదయాన్ని పూర్తిస్థాయిలో కేంద్రీకరించాను’ అని అంది. ఈ పాటలో సల్మాన్ భాగస్వామ్యంపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ఎంతో సంతోషం కలిగిందంది. 14 ఏళ్ల వయసులోనే తాను సల్మాన్ను తొలిసారిగా కలిశానని చెప్పింది. ‘వీర్’ సినిమాలో ‘మెహర్బానియా’ అనే పాట తానే పాడానని తెలిపింది. ‘దస్ కా దం’ షోలో పాల్గొనాల్సిందిగా తనను కోరాడంది. అతడికి తాను ఎంతో రుణపడి ఉన్నానంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు తరచూ తాను కూడా ఆర్థిక సహాయం అందిస్తుంటానంది. ఇందుకు సల్మాన్ కూడా తనవంతు సహకారం అందజేస్తున్నాడంది. ‘లా పతా’ సినిమాతో బాలీవుడ్ రంగంలోకి అడుగిడినట్టు చెప్పింది. ఆ తర్వాత ‘ఆషికి 2’లో పాడానని, ఇప్పటికి మొత్తం 142 పాటలు పాడానని తెలిపింది. -
పాడితే తప్పేంటి?
న్యూఢిల్లీ: కథానాయకులు సినిమాల్లో పాటలుపాడడాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ స్వాగతించాడు. ఇటీవలికాలంలో పెరుగుతున్న ఈ సంస్కృతికి తాను మద్దతు పలుకుతానని కూడా చెబుతున్నాడు. పాటలు కూడా పాడడం ద్వారా నటీనటుల సత్తా, వారి సామర్థ్యం అభిమానులకు తెలుస్తుందన్నాడు. ‘నటీనటులు సినిమాల్లో పాటలు పాడితే తప్పేంటి? హాలీవుడ్లో ఏకకాలంలో నటిస్తూనే పాటలు కూడా పాడుతున్నారు. అదే సంస్కృతి బాలీవుడ్లో కొనసాగినా నేను స్వాగతిస్తాను. ఒకప్పుడు కమెడీయన్లు మాత్రమే కామెడీ చేసేవారు. ఇప్పుడు కథానాయకుడు కూడా కామెడీ చేస్తున్నాడు. అటువంటి చిత్రాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు కూడా. మరికొందరు కథానాయకులు నెగెటివ్ పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నారు. అలాంటప్పుడు కథానాయకుడు పాటలు పాడితే మాత్రం తప్పేంటి?’ అని అక్షయ్ ప్రశ్నించాడు. భారత్లో వినోదాన్ని రెండుగా విభజిస్తే ఒకటి క్రికెట్ అవుతుందని, రెండోది సినిమా అవుతుందన్నాడు. క్రికెట్లో ఆటగాళ్ల ఫీట్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచినట్లుగానే సినిమాల్లో కూడా కథానాయకుడు రొటీన్కు భిన్నంగా చేసే ప్రతి పని కూడా ప్రేక్షకులకు, అభిమానులకు వినోదాన్ని పంచుతుందని అక్షయ్ అభిప్రాయపడ్డాడు. త్వరలో విడుదల కానున్న తన చిత్రం ‘ఎంటర్టైన్మెంట్’ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అక్షయ్ పాల్గొంటున్నాడు. చిత్ర ప్రచారం కోసం అక్షయ్కుమార్ ఓ పాట కూడా పాడాడు. దానిని రికార్డు చేసిన వీడియో దృశ్యాల ద్వారా చిత్ర ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే ఇది సినిమాలో ఉన్న పాట కాదని, కేవలం ప్రచారం కోసం మాత్రమే రూపొందించామని చిత్ర నిర్మాతలు చెప్పారు. సినిమా ప్రచారాన్ని విభిన్నంగా చేయాలని నిర్ణయించామని, అప్పుడు వచ్చిన ఓ ఆలోచనే అక్షయ్తో పాట పాడించిందని, దానిని కేవలం ప్రచార కార్యక్రమాల్లో మాత్రమే వినియోగిస్తామని యూనిట్ సభ్యులు చెప్పారు. -
పాతిక లక్షలకు ఆటా పాట
నటి ఆండ్రియా ఆటా పాట కావాలంటే పాతిక లక్షలు చెల్లించాల్సిందే. సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరు. ఆ మధ్య యువ సంగీత దర్శకుడితో రొమాన్స్ చేసిన దృశ్యాలు ఇంటర్నెట్లో కలకలం సృష్టిం చాయి. అయితే ఈ వ్యవహారంలో నా జీవితం నా ఇష్టం అంటూ ఖరాఖండిగా ప్రకటించి తన ప్రవర్తనను సమర్థించుకున్న ఈ బ్యూటీ విశ్వరూపం చిత్రంలో కమలహాసన్తో జత కట్టింది. ఆ చిత్రం విజయంతో మరిన్ని అవకాశాలు వస్తాయని పారితోషికం కూడా పెంచేయవచ్చునని ఆండ్రియా ఆశించింది. అయితే ఈ అమ్మడి ఆశలు అడి ఆశలయ్యాయి. ఒక్క అవకాశం కూడా రాలేదు. మళ్లీ కమలహాసన్ విశ్వరూపం-2లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విశ్వరూపం-2లో తన పాత్రకే అధిక ప్రాధాన్యత వుంటుందని, కమలహాసన్తో డ్యూయెట్ కూడా పాడినట్లు చెప్పింది. విశ్వరూపం-2 విడుదలానంతరం అయినా పారితోషికం పెంచడానికి తహతహలాడుతున్న ఆండ్రియాకు శశికుమార్ హీరోగా నటిస్తున్న బ్రహ్మన్ చిత్రంలో ఒక పాటకు ఆడే అవకాశం వచ్చింది. అయితే అందుకామె డిమాండ్ చేసిన పారితోషికం రూ.25లక్షలు. అంత పారితోషికం నిర్మాత ససేమిరా అంటే దర్శకుడు మాత్రం ఆ పాటకు ఆండ్రియా నటిస్తేనే బాగుంటుందని పట్టుపట్టారట. దీంతో చేసేదేమిలేక బ్రహ్మన్ చిత్ర నిర్మాత రూ.25 లక్షలు ఇచ్చి ఆండ్రియాతోనే పాట పాడించి ఆడించారట. దీంతో సింగిల్ సాంగ్ అయినా ఓకే అంటుందట ఈ భామ.