State cabinet
-
ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు మంగళవారం అర్ధరాత్రి దాటాక కొలిక్కి వచ్చింది. కేబినెట్లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అవకాశం దక్కగా.. ఈ జాబితాలో చంద్రబాబు తనయుడు లోకేశ్కు కూడా చాన్స్ ఇచ్చారు. జనసేనకు మొత్తం మూడు, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. మంత్రుల జాబితాను గవర్నర్కు పంపారు. ఈ మంత్రులు కూడా నేడు చంద్రబాబుతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఏపీ కేబినెట్ ఇదే.. 1. నారా చంద్రబాబు నాయుడు (కమ్మ) 2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన–కాపు) 3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ) 4. కొల్లు రవీంద్ర (బీసీ) 5. నాదెండ్ల మనోహర్ (జనసేన–కమ్మ) 6. పి.నారాయణ (కాపు) 7. వంగలపూడి అనిత (ఎస్సీ) 8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ–బీసీ) 9. నిమ్మల రామానాయుడు (కాపు) 10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (మైనారీ్ట) 11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 12. పయ్యావుల కేశవ్ (కమ్మ) 13. అనగాని సత్యప్రసాద్ (బీసీ) 14. కొలుసు పార్థసారధి (బీసీ 15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ) 16. గొట్టిపాటి రవి (కమ్మ) 17. కందుల దుర్గేష్ (జనసేన–కాపు) 18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 19. బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి) 20. టీజీ భరత్ (వైశ్య) 21. ఎస్.సవిత (బీసీ) 22. వాసంశెట్టి సుభాష్ (బీసీ) 23. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ) 24. మండిపల్లి రామ్ ప్రసాద్రెడ్డి (రెడ్డి) 25. నారా లోకేశ్ (కమ్మ) -
జూన్ 2న సోనియాతో సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుండటం, రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీతోపాటు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న పెద్దలందరినీ పిలిచి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా ఆ సభకు పిలుస్తామని.. ఈ విషయంలో భేషజాలు లేవని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాదే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిందని, ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయింది అప్పుడా? ఇప్పుడు అవుతోందా అన్న విషయం అందరికీ తెలుసు..’’ అని మంత్రి పొంగులేటి బదులిచ్చారు. తడిసిన ధాన్యమంతా కొనుగోలు.. ఇటీవలి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మద్దతు ధరకు ఒక్క రూపాయి తగ్గించకుండా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. యాసంగిలో పండించిన 36లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ సేకరించిందని.. దేశంలో, రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు 3 రోజుల్లోపే చెల్లింపులు చేసిందని చెప్పారు. కాగా.. ఒక్క గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, ఎక్కడైనా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సమరి్పంచిందని.. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించామని వివరించారు. రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. విధివిధానాలను తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం.. జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. కమిటీల ఆధ్వర్యంలో నెల రోజుల్లోగా వాటిని ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం రూ.600 కోట్లను కేటాయించామని.. అడ్వాన్స్గా రూ.120 కోట్లను విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల్లో ప్రధానోపాధ్యాయులు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారన్నారు. ఈ అంశంపై మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మూసివేసిన పాఠశాలలు తెరుస్తాం హేతుబదీ్ధకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన 5,600 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి.. విద్యార్థులు వచ్చేవాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యతోపాటు ఉపాధి కలి్పంచే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని.. మంచి మార్పు చూపించాలని కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యూనిఫారాలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని.. ప్రతి విద్యార్థికి రెండు జతలు సరఫరా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తుందని పొంగులేటి తెలిపారు. టెస్టుల తర్వాతే బ్యారేజీలకు మరమ్మతులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ మూడు కీలక సిఫార్సులు చేసిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు తెలిపారు. ‘‘బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలని నిపుణుల కమిటీ చెప్పింది. డబ్బులు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా అది ఉంటుందో లేదో నమ్మకం ఇవ్వలేమని పేర్కొంది. బ్యారేజీలకు జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. బ్యారేజీలకు పరీక్షలు పూర్తయ్యే వరకు తదుపరిగా ఏ రకమైన పనుల చేపట్టవద్దని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించాలని.. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో పరీక్షలు నిర్వహించి, రెండింటి అభిప్రాయాల ఆధారంగా మరమ్మతులు చేయాలని నిర్ణయించాం..’’ అని వెల్లడించారు. ఈ పరీక్షలు త్వరగా నిర్వహించేలా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. బ్యారేజీల్లో రాళ్ల కట్టతో పంపింగ్కు ప్రయతి్నస్తాం.. కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో తక్కువ ఖర్చుతో రాళ్ల కట్టను నిర్మించి.. నీళ్లను పంపింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా కాకుండా.. నిపుణుల సూచనలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వ తప్పును సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ధర్నాల పేరుతో డ్రామాలు.. ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం కలెక్టర్లను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ధర్నాల పేరుతో డ్రామాలు చేశారని, వారు రైతులకు ఏం చేశారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. సన్న ధాన్యం పండిస్తే రూ.500 బోనస్ వచ్చే వానాకాలంలో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సన్నవడ్ల రకాలను వ్యవసాయ శాఖ ప్రకటించనుంది. బడుల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్లకు విద్యార్ధి, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలకు ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం కాగా.. వాటన్నింటికీ సన్న బియ్యం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని మంత్రి పొంగులేటి చెప్పారు. బయటి రాష్ట్రాల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని, అందుకే రాష్ట్రంలో సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ చెల్లిస్తామని వివరించారు. విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు ఇబ్బంది రావద్దని.. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులు, నకిలీ రశీదులు జారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనవద్దని, కంపెనీల వద్దే కొనాలని, సాగు ముగిసేవరకు రసీదులు దాచిపెట్టుకోవాలని సూచించారు. -
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్కు ఉన్నాయి’’ అని వివరించారు. -
9న రాష్ట్ర కేబినెట్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడం, కొత్త పథకాలపై నిర్ణయం తీసుకోవడం కోసం రాష్ట్ర కేబినెట్ ఈ నెల 9న సమావేశం కానుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ భేటీ మొదలుకానుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఇంకా అమలుకాని వాటిని సమీక్షించనున్నట్టు తెలిసింది. నిరుద్యోగ భృతి, సొంత స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం వంటి పథకాల అమలుకు అవకాశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక పేదలకు ఇళ్ల పట్టాలు, గిరిజన రైతులకు పోడు పట్టాల పంపిణీ, దళితబంధు అమలు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరిన్ని నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చివరిగా గత నెల 5న ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైనా.. కేవలం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదానికి పరిమితమైంది. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై చర్చ రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా రాష్ట్రం కొత్త రుణాలను సమీకరించలేకపోతోంది. రాష్ట్రంలో కీలక సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయ సమీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. గతంలో బాలానగర్ కో–ఆపరేటివ్ సొసైటీ, హఫీజ్పేట మినీ ఇండ్రస్టియల్ ఎస్టేట్, ఆజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియాల నుంచి పలు పరిశ్రమలను నగర శివార్లలోకి తరలించారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన స్థలాలను క్రమబద్దీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం రానుంది. వాలంతరి భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించాలనే ప్రతిపాదన కూడా సిద్ధమైంది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా కేబినెట్ భేటీలో కీలక ప్రకటనలు వెలువడవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే
సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. పేదలపై రుణభారం మోపిన టీడీపీ సర్కారు.. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది. ఒక్క రూపాయికే ఇచ్చేద్దాం.. 300 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని సీఎం జగన్ గుర్తించారు. నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్ఎఫ్టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. -
సంక్షేమమే శ్వాసగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రతిబింబించిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు. శాశ్వత విజయానికి ప్రజల విశ్వాసం పొందడమే నేటితరం రాజకీయమని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ వివరాలివీ.. ప్రజలే మనకు శ్రీరామరక్ష.. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం విజయంతో వైఎస్సార్సీపీకి జనం మద్దతివ్వడానికి సుపరిపాలనే కారణమని పలువురు మంత్రులు ప్రస్తావించారు. ఏడాదిన్నరగా అమలవుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విశ్వసనీయతే కొలమానంగా సరికొత్త రాజకీయాలు తెచ్చామని, ప్రజలను ఓటుబ్యాంకుగా భావించే వారెవరూ ప్రజా మద్దతు కూడగట్టలేరన్న భావనను సీఎం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వాన్ని ఎంతకైనా తెగించి కాపాడుకునేందుకు సిద్ధమవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని అన్ని వేళలా గుర్తించాలని సూచించారు. విష ప్రచారాన్నే నమ్ముకున్న విపక్షం ఏ ఎన్నికల్లోనైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీ బ్రహ్మాస్త్రాలుగా మంత్రివర్గం భావించింది. పథకాల అమలులో లోపాలను గుర్తించే సత్తాలేని టీడీపీ విష ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని సీఎం గుర్తు చేశారు. ఈ దిశగా అన్ని వ్యవస్థలను వాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోదని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవడం లాంటి కుట్రలు జరిగాయన్నారు. సున్నితమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటూ టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. విపక్షం విమర్శలను తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో ప్రజలకు సంక్షేమ ఫలాలను నిబద్ధతతో అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే తప్పుడు ప్రచారం చేసే విపక్షం వైఖరిని ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చిందని, టీడీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని చెప్పారు. పథకాలే ఊపిరి.. పేదలు, బడుగు వర్గాల స్థితిగతులను మార్చే దిశగా తెస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పథకాల రూపకల్పనతోనే సరిపోదని క్షేత్రస్థాయిలో అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇంటి వద్దకే చేరవేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వాలకు భిన్నంగా సాగుతున్న పారదర్శక పాలనను స్వాగతిస్తున్నారని తెలిపారు. దీన్ని దెబ్బతీసేందుకు విపక్షం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు మరింత కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సమస్యలొస్తే తక్షణం పరిష్కరించాలన్నారు. సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. హామీలు నిలబెట్టుకోవడంలో వైఎస్సార్సీïపీ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలే ప్రశంసిస్తున్న కారణంగా విపక్షం వేలెత్తి చూపలేక పోతోందన్నారు. -
కాకినాడ సెజ్ భూముల్లో 2,180 ఎకరాలు తిరిగి రైతులకే
సాక్షి, అమరావతి: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కే – సెజ్)కి సంబంధించి రైతుల భూముల విషయంలో గత 15 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కాకినాడ సెజ్ కోసం గత సర్కారు హయాంలో రైతుల నుంచి బలవంతంగా 2,180 ఎకరాలు తీసుకోవడం తెలిసిందే. దీంతో రైతులు పరిహారం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సెజ్ కోసం రైతుల నుంచి తీసుకున్న 2,180 ఎకరాలను తిరిగి వారికే ఇవ్వాలని దీనిపై ఏర్పాటైన కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇతర సిఫారసులు ఇవీ: స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించడంలో భాగంగా ఆరు గ్రామాలను తరలించరాదని కమిటీ చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవాపురం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని, రామరాఘవాపురంను తరలించాల్సి వస్తే రావివారిపోడు గ్రామానికి తరలించాలని కమిటీ సిఫార్సు చేసింది. ► పునరావాసం లేని నివాసాలకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలను ఆ గ్రామాలకే వదిలివేయాలని, వాటిని తరలించరాదని కమిటీ పేర్కొంది. అలాంటి శ్మశాసవాటిక స్థలం పరిశ్రమ కోసం అవసరమైతే ప్రత్యామ్నాయ భూమిని కేఎస్ఈజెడ్ గ్రామస్థులకు కల్పించాలని కమిటీ పేర్కొంది. ► నిషేధిత ఆస్తుల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం కేసులను పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. కేఎస్ఈజెడ్ కోసం తీసుకున్న 657 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి కోన గ్రామానికి చెందిన రైతులు పరిహారం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అదనంగా ఎకరానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.పది లక్షలు పరిహారం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దివీస్ ల్యాబ్కు చెందిన అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని సిఫార్సు చేసింది. ► సెజ్ కోసం భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై పెట్టిన క్రిమినల్ కేసులను సమీక్షించడంతో పాటు అవకాశమున్న వరకు కేసులను ఉపసంహరించాలని కమిటీ సిఫార్సు చేసింది. సెజ్లో స్థానిక నిరుద్యోగ యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలని సిఫార్సు చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కే–సెజ్తో పాటు దివీస్ భూముల పరిసరాల్లో సరైన ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, హేచరీస్ ప్రభావం పడకుండా సముద్ర ప్రవాహానికి దూరంగా తరలిం చాలని సూచించింది. పాదయాత్ర హామీ మేరకు కమిటీ పాదయాత్ర హామీ మేరకు కాకినాడ సెజ్లో రైతుల సమస్య పరిష్కారానికి మంత్రి కన్నబాబు నేతృత్వంలో కమిటీని సీఎం జగన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ రైతులతో పాటు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట సమితితో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన, అన్నదాతలకు మేలు జరిగేలా సిఫార్సులను చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సిఫార్సులతో కూడిన కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నందున కే – సెజ్ కోసం జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కమిటీ చేసిన సిఫార్సును కేబినెట్ ఆమోదించింది. సెజ్ బాధితుల హర్షం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం పిఠాపురం: కేబినెట్ నిర్ణయంపై ఇక్కడి సెజ్ బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కొన్నేళ్ల క్రితం కాకినాడ సెజ్ పేరుతో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంతో పాటు తుని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్థానిక రైతులు ఆందోళనలు చేస్తూ వచ్చారు. 2012లో చంద్రబాబు ఇక్కడకు వచ్చి అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తమను కేసులతో ఇబ్బందులకు గురిచేసినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం వచ్చిన జగన్ దృష్టికి రైతులు తమ సమస్య తీసుకువచ్చారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సెజ్ గ్రామాల నాయకులు -
బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించకుండా బకాయిపెట్టిన రెండు డీఏలను చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు డీఏ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ.2,400 కోట్లకుపైనే భరించనుంది. ఈ రెండు డీఏల 30 నెలల తాలూకు బకాయిలు చెల్లించేందుకు రూ.6,034.80 కోట్ల మేర వ్యయం కానుంది. 2018 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించకుండా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. 2019 జనవరి నుంచి మరో డీఏను కూడా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. ఈ రెండు బకాయిలను చెల్లించడంతో పాటు 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,011 కోట్లను భరించనుంది. 30 నెలల బకాయిలకు రూ.5,028.90 కోట్లు వ్యయం కానుంది. పెన్షనర్లకు.... ► పెన్షనర్లకు 3.144 శాతం పెంపు జూలై 2018 నుంచి వర్తింపు, జనవరి 2021 నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జూలై నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లింపు ఉద్యోగులకు... ► ఉద్యోగులకు జూలై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి 3.144 శాతం పెంచిన డీఏ జూలై 2021 నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి పెంచిన 5.24 శాతం డీఏ జనవరి 2022 నుంచి చెల్లింపు -
ఇక కోరినంత ఇసుక!
సాక్షి, అమరావతి: ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని గురువారం రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రుల కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ సభ్యులు ఇసుక విధానంపై లోతుగా అధ్యయనం చేసింది. ప్రజల సౌలభ్యం కోసం ఇసుకను రీచ్ల నుంచే ఇవ్వాలని మంత్రుల కమిటీ సూచించింది. పట్టాభూముల్లో నాణ్యత లేని ఇసుక వస్తున్నందున అక్కడ తవ్వకాలకు స్వస్తిచెప్పి నదుల్లో డ్రెడ్జింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది. వీటితో పాటు మంత్రుల కమిటీ చేసిన పలు సూచనలను పరిశీలించిన సీఎం జగన్ లోపరహితమైన ఇసుక విధాన రూపకల్పన కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని భావించారు. సీఎం సూచన మేరకు ఈ అంశాలపై ప్రజల నుంచి సలహాలు కోరుతూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఇసుక పాలసీని ప్రభుత్వం సవరించింది. నూతన పాలసీలోని ముఖ్యమైన అంశాలు ► ప్రభుత్వమే ఇసుక ధర నిర్ణయిస్తుంది. ప్రజలు నేరుగా రీచ్ల వద్ద డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డులు ఉండవు. ► రీచ్ల నుంచి తమకు నచ్చిన వాహనాల్లో ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. ► అవసరాలకు అనుగుణంగా నదుల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు ప్రాధాన్యం ఇస్తారు. ► రీచ్ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలన్నది పాలసీలో మరో అంశం. అవి ముందుకురాని పక్షంలో వేలం ద్వారా పెద్ద సంస్థలకు ఈ బాధ్యత ఇస్తారు. -
సముద్ర వాణిజ్యంలో ఏపీ నంబర్ 1
సాక్షి, అమరావతి: దేశ సముద్ర ఆధారిత (మారిటైమ్) వాణిజ్యంలో మొదటి స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పోర్టులు నిర్మించడం ద్వారా ప్రస్తుతం సుమారు 100 మిలియన్ టన్నులుగా ఉన్న కార్గో హ్యాండలింగ్ సామర్థ్యాన్ని 2024 నాటికి 400 మిలియన్ టన్నులకు చేర్చాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలిదశలో రామాయపట్నం, భావనపాడు పోర్టులు, ఉప్పాడ, జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి తొలిదశ నిర్మాణాలకు 15 రోజుల్లో టెండర్లు జారీ చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో శంకుస్థాపన చేయడం ద్వారా రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రామాయపట్నం, భావనపాడు పోర్టుల డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పోర్టుల నిర్మాణ పనులు, నిధుల సేకరణ పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీల(పీఎంసీ)నూ నియమించింది. భావనపాడు పీఎంసీగా టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్– ఇన్రోస్ లాక్కనర్ ఎస్ఈ కన్సార్టియం, రామాయపట్నానికి ఏఈకామ్ సంస్థ వ్యవహరించనుంది. వైఎస్సార్ తర్వాత వైఎస్ జగనే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మూడు మైనర్ పోర్టులు నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా ఒక్క ఓడరేవు నిర్మాణం జరగలేదు. వైఎస్సార్ హయాంలో గంగవరం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం, కాకినాడ సెజ్ల్లో ఓడ రేవుల నిర్మాణంతో పాటు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లను నిర్మించనున్నారు. మారిటైమ్లో అపార అవకాశాలు రాష్ట్రంలో సముద్ర ఆధారిత వాణిజ్యంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారిస్తున్నాం. ఇప్పటికే రామాయపట్నంలో 1,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడానికి జపాన్ ఆసక్తి చూపిస్తోంది. కొత్త రేవుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గుజరాత్తో పోటీపడుతున్నాం రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం ద్వారా 2024 నాటికి కార్గో హ్యాండలింగ్ సామర్థ్యాన్ని 400 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం. ప్రస్తుతం దేశంలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్తో పోటీ పడుతున్నాం. – రాష్ట్ర మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్పీ రామకృష్ణారెడ్డి -
'నిమ్మగడ్డ'ను నియంత్రించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగకుండా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను నియంత్రించాలంటూ హైకోర్టులో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం విషయంలో గవర్నర్దే విచక్షణాధికారమని.. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలికి ఎటువంటి అధికారం లేదంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కొనసాగడానికి వీల్లేదంటూ రిటైర్డ్ ఐజీ డాక్టర్ ఎ.సుందర్కుమార్ దాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. అందువల్ల ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించకుండా నిమ్మగడ్డ రమేశ్ను నియంత్రిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డను సంజాయిషీ అడగండి 2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నియమితులైన నిమ్మగడ్డ.. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఏ అధికారంలో ఆ పదవిలో కొనసాగుతున్నారో సంజాయిషీ అడగాలని దాస్ తన కో–వారెంటో పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే, నిమ్మగడ్డను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అంతేకాక.. 2016లో నిమ్మగడ్డ రమేశ్ను ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీఓ 11ను కొట్టేయాలని కోరారు. ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కాని అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ నియమించాలంటున్న ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దీనిని రద్దుచేయాలని అభ్యర్థించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే(1) ప్రకారం.. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో విచక్షణాధికారం గవర్నర్దేనని, రాష్ట్రం చేసే చట్టానికి లోబడి కమిషనర్గా నియామకం ఉండాల్సిన అవసరంలేదని వివరించారు. కానీ, ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 (2) మాత్రం.. మంత్రి మండలి సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ నియామకం జరగాలని చెబుతోందని, దీని ప్రకారమే 2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల కమిషనర్ అయ్యారన్నారు. కానీ, ఎస్ఈసీ నియామకం పూర్తిగా గవర్నర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందే తప్ప, మంత్రి మండలి సిఫారసు మేరకు కాదని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కొనసాగడానికి వీల్లేదని దాస్ అన్నారు. -
ఏపీ: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్పీఆర్లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, ఖరీఫ్లో రైతులకు విత్తనాలు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటిని కట్టుకోవడానికి, బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వం న్యాయపరమైన హక్కులు కల్పిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో స్టాంప్ పేపర్పై రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎమ్మార్వోలకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల హోదా కల్పించాలని, ఎమ్మార్వో కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుర్తించాలని నిర్ణయించింది. ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని తీర్మానం చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇంటి పట్టాను చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ అభయన్స్లో ఎన్పీఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మైనార్టీ వర్గాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల్లో అదే రీతిలో అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల మంత్రివర్గం చర్చించింది. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్పీఆర్ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అలా మార్పు చేసే వరకు ఎన్పీఆర్ ప్రక్రియను అభయన్స్లో ఉంచాలని నిర్ణయించింది. పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియలో హెచ్–1గా నిలిచిన జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్కు 2,703 ఎకరాల భూమిని అప్పగించాలని టెండర్లలో పెట్టిన నిబంధనను సడలించింది. ఆ సంస్థకు 2,200 ఎకరాల భూమిని మాత్రమే అప్పగించాలని నిర్ణయించింది. మిగిలిన 503 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం అధీనంలోకి తీసుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూమిలో మరో 362.55 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు అవసరమైన రూ.280 కోట్లను రుణం రూపంలో తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్)కు అనుమతి ఇచ్చింది. కాకినాడ గేట్ వే పోర్టు నిర్మాణానికి కాల వ్యవధి పొడిగింపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగిస్తూ.. ఆ మేరకు కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్కు అనుమతి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాకినాడ ఎస్ఈజెడ్ లిమిటెడ్లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదించింది. ‘సిట్’కు విస్తృత అధికారాలకు ఆమోదం రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికలోని అంశాలపై దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. సిట్ కార్యాలయాన్ని పోలీసుస్టేషన్గా గుర్తించడానికి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఆర్ఐలు నమోదు చేసి.. కోర్టుల్లో చార్జ్షీట్ ఫైల్ చేసే విస్తృత అధికారాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాల్లో మరికొన్ని.. – రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించడానికి సంబంధించిన ఉత్తర్వులకు ఆమోదం. – ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు విత్తనాలను పంపిణీ చేయడానికి.. అవసరమైన విత్తనాలను సేకరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు రూ.500 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు సమ్మతి. – ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. రూ.2 వేల కోట్ల రుణంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, వీటీపీఎస్లో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేసి.. 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం. – ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. ఆ భూమిని జలవనరుల శాఖకు అప్పగించాలని, ఎన్ఎస్పీ కాలనీ విస్తరణకు ఆ భూమిని వినియోగించాలని నిర్ణయం. – కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. అందులో 44 పోస్టుల భర్తీకి అనుమతి. నీతిమాలిన రాజకీయాల్లో చంద్రబాబు నంబర్ వన్ నీతిమాలిన రాజకీయాలు చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నంబర్ వన్ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎవరూ కనిపించరని, అధికారం కోల్పోగానే నెత్తి మీద ఉన్న కళ్లు నేల చూపులు చూస్తాయన్నారు. గత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక మైనార్టీకి.. ఒక ఎస్టీకి స్థానం కల్పించని చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాల ప్రజలపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది బీసీలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను అవసరాలకు వాడుకోవడం.. అవసరం తీరగానే కసుక్కున కత్తితో పొడవడంలో చంద్రబాబు నేర్పరి అన్నారు. హైకోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలతోపాటు మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహిస్తామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ నిర్ణయం ముందే తీసుకున్నామని, వాటికి స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి సంబంధం ఉండదని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
చర్చంతా మూడు చుట్టే..
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనంతా మూడు రాజధానుల మధ్యే తిరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చేసి తీరాల్సిందేనన్న చర్చ పట్టణాల నుంచి గ్రామసీమల వరకూ పాకింది. కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల దగ్గరా ఇదే అంశంపై జనం మాట్లాడుకుంటున్నారు. అటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం నుంచి ఇటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ ఎక్కడికి వెళ్లినా ఎవరి నోట విన్నా ఇదే మాట నానుతోంది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, లేకపోతే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిపోయి మరోసారి విభజన వాదం పుట్టుకురాక తప్పదనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది. - రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అభివృద్ధిపై సూచనల కోసం ఏర్పాటైన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) సైతం మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తమ నివేదికల్లో నొక్కి చెప్పాయి. - ఆ రెండు నివేదికలపై అధ్యయనం కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైవపర్ కమిటీ కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న విషయాన్ని గుర్తించింది. - రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు తమ జిల్లాలను అభివృద్ధి చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారని హైపవర్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. - అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. - పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇదే డిమాండ్ను ముక్తకంఠంతో వినిపిస్తున్నారు. - బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతోంది. - నాలుగుసార్లు సమావేశమైన హైపవర్ కమిటీ ఎక్కడెక్కడ ఏయే వనరులు ఉన్నాయో గుర్తించి, వాటిని వినియోగించుకోవడం ద్వారా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించే కసరత్తు జరుగుతోందని ప్రకటించింది. - విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నానాటికీ తీవ్రతరమవుతోంది. - అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ ఎజెండాగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. -
టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టెండర్ల ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే వేదికపై ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తెచ్చేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ(కేబినెట్) సమావేశంలో ముందడుగు పడింది. టెండర్ల విధానంలో పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలు, పక్షపాతం, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా కొత్తగా ‘ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఆమోదించారు. అవినీతిపై జరుగుతున్న పోరాటంలో ఈ చట్టం ఒక గొప్ప అడుగు అని మంత్రివర్గం అభివర్ణించింది. ముసాయిదా బిల్లులోని ప్రధాన అంశాలు.. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సంబంధిత టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలన చేయించనున్నారు. జడ్జి పరిశీలన అనంతరమే మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ ఆ తరువాతే బిడ్డింగ్కు వెళ్లేందుకు వీలుగా ముసాయిదా బిల్లులో ప్రొవిజన్స్ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యాలుగా ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేశారు. రూ.100 కోట్లకు పైగా విలువైన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పరిధిలోకి తీసుకొస్తున్నారు. పనిని ప్రతిపాదిస్తున్న ప్రతి శాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. టెండర్లను పిలవడానికి ముందే అన్ని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), జాయింట్ వెంచర్లు(జేవీ), స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా న్యాయమూర్తి పరిశీలన చేయనున్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే జడ్జి పరిధిలోకి రావాల్సిందే. జడ్జికి సహాయంగా నిపుణులను ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, తనకు అవసరమైన నిపుణులను జడ్జి కోరవచ్చు. పనుల ప్రతిపాదనలను వారం రోజుల పాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అనంతరం 8 రోజుల పాటు జడ్జి పరిశీలన చేస్తారు. జడ్జికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుంది. న్యాయమూర్తి సిఫార్సులను సంబంధిత శాఖలు కచ్చితంగా పాటించాలి. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనలను ఖరారు చేయాలి. ఆ తరువాతే బిడ్డింగ్కు వెళ్లాలి. ఎవరికీ అనుచిత లబ్ధి చేకూర్చకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని టెండర్ల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం జడ్జికి కల్పించారు. న్యాయమూర్తి, న్యాయమూర్తి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్ సర్వెంట్లుగా భావిస్తారు. దీనివల్ల వారికి రక్షణ ఉంటుందని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీఈడీబీ చట్టం రద్దు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) చట్టాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ‘ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనలే లక్ష్యాలుగా కొత్త చట్టం ఉండనుంది. కొత్త చట్టంలో భాగంగా సలహా మండలి చైర్మన్గా ముఖ్యమంత్రి, మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్ సెక్రటరీ తదితరులుంటారు. అలాగే ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహా మండలి ఉండనుంది. ఇందులో ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు ఉంటారు. ప్రధాన కార్యాలయం విజయవాడలో, మరో కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వనున్నారు. -
మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో వారికి 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంతేకాకుండా ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వారికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ కూడా ముఖ్యమంత్రి మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. టెండర్లలో అవినీతి, అక్రమాలను అరికట్టడంతోపాటు పారదర్శతకు పెద్దపీట వేస్తూ న్యాయపరిశీలనపై మరో కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. న్యాయపరిశీలన–పారదర్శకత చట్టం–2019 ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి... ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి గొప్ప నిర్ణయం.. ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, ట్రస్టులు, మార్కెట్ యార్డుల పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సగం కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. అలాగే దేవాలయాల కమిటీల్లో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించాలని నిర్ణయించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించడమే కాకుండా ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదింప చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేషన్ పనుల్లో 50 శాతం ప్రభుత్వ నామినేషన్ కాంట్రాక్టులు, సర్వీసుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించే 50 శాతం పనుల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు సగం కేటాయించాలనే నిబంధన విధించారు. నిరుద్యోగాన్ని రూపుమాపే దిశగా కీలక అడుగు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ ప్రాజెక్టుల కింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. పరిశ్రమల కోసం భూములు కోల్పోయినవారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు దోహదపడనుంది. నిర్వాసితుల జీవనోపాధికి గ్యారంటీ కల్పించడం కూడా ఈ ముసాయిదా బిల్లులో ముఖ్యాంశం. పరిశ్రమల కోసం ‘వైఎస్సార్ నవోదయం’... సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘‘వైఎస్సార్ నవోదయం’’ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. జిల్లాలవారీగా 86,000 ఎంఎస్ఎంఈల ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాలకు చెందిన రూ.4 వేల కోట్ల రుణాలను వన్టైమ్ రీ స్ట్రక్చర్ చేయాలని నిర్ణయించారు. నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా అవకాశం కల్పించడంతోపాటు ఎంఎస్ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పిస్తారు. దీన్ని వినియోగించుకునేందుకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభం కానుంది. విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణ బిల్లుకు ఆమోదం రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించనున్నారు. తద్వారా విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్లు ఏర్పాటు అవుతాయి. నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై ఇవి దృష్టి సారిస్తాయి. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియామకం 1993 నాటి బీసీ కమిషన్ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానుంది. తద్వారా బీసీ వర్గాల స్థితిగతులపై నిరంతరం అధ్యయానికి వీలు కలుగుతుంది. పలు వర్గాలను బీసీల్లో చేర్చాలంటూ వస్తున్న డిమాండ్లు, కేటగిరీల్లో మార్పులపై వస్తున్న వినతులను కమిషన్ పరిశీలిస్తుంది. బీసీలకు మరో బొనాంజా.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా పాదయాత్రలో ఈ వర్గాలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నట్లైంది. 200 యూనిట్ల వరకు ఎస్సీలకు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 15,62,684 మంది ఎస్సీలకు రూ.411 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. లోకాయుక్త చట్ట సవరణ 1993 నాటి లోకాయుక్త చట్టాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లేదా మాజీ జడ్జీల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్తగా ఇప్పటివరకు హైకోర్టు జడ్జి లేదా మాజీ చీఫ్ జస్టిస్లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ అర్హత ఉన్నవారు అందుబాటులో లేకపోవడంతో చాలా సందర్భాల్లో లోకాయుక్త ఖాళీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అర్హతలను సడలిస్తూ హైకోర్టు మాజీ జడ్జిని కూడా నియమించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మార్కెట్ గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు వ్యవసాయ మార్కెట్ల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేలను నియమించేందుకు వీలుగా 1966 ఏపీ మార్కెట్ చట్టానికి సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. టీటీడీ ఎక్స్అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్ను నియమించేందుకు వీలుగా దేవదాయ చట్టంలో సవరణలు తేవడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. -
‘పుర’ బిల్లుకు కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రూపొందించిన కొత్త మునిసిపల్ చట్టాల ముసాయిదా బిల్లుకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదించింది. కొత్త మునిసిపాలిటీల చట్టం, కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చట్టం, టౌన్ప్లానింగ్ చట్టంతో కూడిన ముసాయిదా బిల్లును సీఎం కేసీఆర్ గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టను న్నారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో చర్చించి కొత్త మునిసిపల్ చట్టాల బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. కొత్త మునిసిపల్ చట్టాల బిల్లుకు ఆమోదంతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సుదీర్ఘ భేటీలో కొత్త మునిసిపల్ చట్టాల ముసాయిదా బిల్లుపై చర్చ నిర్వహించారు. కొత్త మునిసిపల్ చట్టాలను తీసుకురావడం ద్వారా పురపాలనలో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిర్మూలనతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించేందుకు ఈ కొత్త చట్టాలను రూపొందించినట్లు సీఎం కేసీఆర్ మంత్రివర్గానికి వివరించినట్లు తెలిసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో కనీసం 85% వాటిని సంరక్షించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులు చేయాలని కొత్త చట్టాల్లో పొందుపరిచినట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లను పదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నగర శివార్లలోని కొన్ని మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లేదా వాటిని కొత్త మునిసిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే అంశాన్నీ కేబినేట్లో చర్చించినట్లు తెలిసింది. కేబినెట్ కీలక నిర్ణయాలు.. - వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ రూ.1,000 నుంచి రూ.2,016కు పెంపు. - దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్ రూ.1,500 నుంచి 3,016కు పెంపు. ఈ పింఛన్ జూన్ నుంచి అమలు. జూలై నుంచి లబ్ధిదారులకు అందజేత. - వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామనే టీఆర్ఎస్ ఎన్నికల హామీని అమలుకు నిర్ణయం. మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు - రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఇతరులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్ల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. - వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పింఛన్ను 2019 జూన్ నుంచి అమలు చేస్తారు. జూలై నెలలో లబ్ధిదారులకు అందిస్తారు. జూలై 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా ప్రొసీడింగ్స్ అందచేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్ధిదారుల పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. - వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పింఛను అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. - బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్ను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. బుధవారం (17–07–2019) నాటి వరకు కూడా పీఎఫ్ ఖాతా ఉన్న కార్మికులకు పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించింది. - రుణ ఉపశమన కమిషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లుతో పాటు పాత మునిసిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ బిల్లును సైతం మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిసింది. -
ఈ నెల 8న రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంతేవేగంతో పాలనాపరమైన అంశాలతో పాటు ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలు నెరవేర్చడంపై దృష్టిసారించారు. ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. ఆ రోజు ఉదయం 11.39 గంటలకు సచివాలయం దగ్గరే మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వర్షం వచ్చినా సమస్య లేకుండా ఉండేలా వేదికను ఏర్పాటు చేయాలని అధికారవర్గాలకు సంకేతాలందాయి. అసెంబ్లీ సభ్యుల ఆధారంగా నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో పాటు 26 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే పూర్తి స్థాయిలో అంతమందితో మంత్రివర్గం ఏర్పాటుచేస్తారా.. లేదా తొలుత కొంతమందితో ఏర్పాటుచేసి, ఆ తర్వాత విస్తరణ చేపడతారా.. అనేది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంగా ఉంటుంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిసారించారని.. ఏ జిల్లాలో ఎవరికి స్థానం కల్పించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. 8.39 గంటలకు సచివాలయంలోకి అడుగుపెట్టనున్న సీఎం జగన్ ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ 8వ తేదీ ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోకి వెళ్లనున్నారు. ముహూర్తం మేరకు సచివాలయంలోని ఒకటో బ్లాకు తొలి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న విదేశాలకు చెందిన, సింగపూర్కు చెందిన గ్రాఫిక్స్ బొమ్మలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. -
కిడారి శ్రావణ్ రాజీనామా... ఆమోదం
సాక్షి, అమరావతి: గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మం త్రి కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమో దించారు. ఈ మేరకు గవర్న ర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆ పత్రాన్ని సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు అందజేశారు. సీఎం చంద్రబాబు అనుమతితో దాన్ని సీఎంవో గవర్నర్ నరసింహన్కు పంపించింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. దీంతో సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్ను గత ఏడాది నవంబర్ 11న చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కిడారి శ్రావణ్కుమార్ ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. దీంతో శుక్రవారం నాటికి కిడారి మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా సీఎంవో కార్యాలయానికి బుధవారం గవర్నర్ కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. -
మద్యం కంపెనీలకు మేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు ప్రయోజనం కలిగిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మద్యం తయారీ కంపెనీల దగ్గరే ఎక్సెజ్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. ఆ తరువాత సేల్ పాయింట్, రిటైలర్ సరుకు తీసుకున్నప్పుడు ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేసి తిరిగి మద్యం తయారీ కంపెనీలకు చెల్లించేవారు. అయితే ఇప్పుడు మద్యం తయారీ కంపెనీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ఎక్సైజ్ చట్టంలో నిబంధనలను మార్చాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. - గత కేబినెట్ సమావేశంలో రాజధానిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కేటాయించిన 30 ఎకరాలను రద్దు చేశారు. దాని స్థానే 15 ఎకరాలను కేటాయిస్తూ అందులో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. అలాగే తిరుపతి, విజయవాడ జర్నలిస్టులకు పట్టణ పేదల పథకం కింద టిడ్కో ద్వారా అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్. - ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమానికి రూ.10 కోట్ల కార్పస్ నిధితో కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు - స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఏపీ మినరల్ ఎక్స్ఫ్లొరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు. - అనంతపురం జిల్లా ముతువకుంటగ్రామంలో పది మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో కూడిన 160 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రీడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు 75.25 ఎకరాల భూమి మార్కెట్ ధరకు కేటాయింపు. - అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఉరిచింతలలో 50.95 ఎకరాలు, వెలమకూరులో 2.99 ఎకరాలు పవన విద్యుత్ కేంద్రాలకు కేటాయింపు. - గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో 5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వడానికి నిర్ణయం. - అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పథకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులను గ్రూప్–2 పోస్టుల్లో నియమించాలని నిర్ణయం. ఇందులో రాగల వెంకట రాహుల్ (వెయిట్ లిఫ్టర్), బుడ్డారెడ్డి అరుణ (జిమ్నాస్టిక్), ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీమ్ కెప్టెన్ జఫ్రీన్ ఉన్నారు. - గత ఏడాది సౌతాఫ్రికాలో జరిగిన వరల్డ్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన డి.అనూషకు పది లక్షలు, గోల్డెన్ డిస్క్ అవార్డ్ విన్నర్, యంగ్ ఆర్చర్ డాలీ శివానీకి రూ.25 లక్షలు, అంతర్జాతీయ యోగా ఛాంపియన్ ఏకాంబరం జోష్ణవికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయం. - విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, సీఆర్డీఏ పరిధిలో ఉద్యోగులకు బస్పాస్ రాయితీ కొనసాగించాలని నిర్ణయం. - ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు రూ.42,80,477లతో పాటు, విశాఖ దీక్షకు రూ.5,08,498, అనంతపురం దీక్షకు రూ.8,32,000లు వ్యయానికి ఆమోదం. ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులకు ఐదు రోజులు ఆన్ డ్యూటీగా పరిగణింపు. - రాష్ట్రంలో సింగిల్, డబుల్, ట్రిబుల్ యూనిట్ అగ్నిమాపక కేంద్రాల్లోని 204 ఫైర్మెన్ పోస్టులు ఉన్నతీకరణ. -రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తిరిగి రీ ఎంప్లాయిమెంట్ పొందిన ఎల్ ప్రేమచంద్రారెడ్డి, ఎస్. బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ లక్ష్మీనారాయణ, డి.చక్రపాణి, అశుతోష్ మిశ్రాకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు. - విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, నెల్లూరులో డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్ర నిర్మాణాలకు మున్సిపల్ టాక్స్ నుంచి 75 శాతం మినహాయింపు - విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు జీతభత్యాలతో పాటు పెన్షన్లు కూడా ట్రెజరీ ద్వారా చెల్లింపు. - విశాఖపట్నం జిల్లా మధురవాడ గ్రామంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఫిలింనగర్ కల్చరల్ సొసైటీ కేంద్రానికి ఎకరానికి రెండు లక్షలు చొప్పున అద్దెకు ఇవ్వాలని నిర్ణయం. - చండ్ర రాజ్వేరరావు ఫౌండేషన్కు సీఆర్డీఏ పరిధిలో మూడు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం. - బైరైటీస్ గనుల ముడి పదార్ధాల ప్రాసెసింగ్, రసాయనిక యూనిట్ల ఒప్పందం మేరకు మొత్తం పరిమాణంలో 50 శాతం లక్ష్యాన్ని సాధించకపోతే ఐదు శాతం అపరాధ రుసుము విధించేందుకు ఆమోదం. - తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని కేబినేట్ సమావేశంలో నిర్ణయం. -
‘నాలుగున్నరేళ్లు అవమానించి ఇప్పుడు ఓట్ల కోసం ఎర’
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు, ఎస్టీలకు నాలుగన్నరేళ్లు మంత్రివర్గంలో స్థానం కల్పించని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముంగిట ఓటు రాజకీయాల్లో భాగంగానే మంత్రి పదవులు ఇచ్చారని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఈ వర్గాల అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదని ఆయన దుయ్యబట్టారు. ముస్లింలను చంద్రబాబు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వచ్చారన్నారు. ఓట్ల కోసం స్వార్థంతోనే ఎన్నికల ముంగిట తమకు మంత్రి పదవులు ఇచ్చారని తాజాగా మంత్రులైన వారు సైతం వారి అనుయాయుల వద్ద వాపోతున్నారని ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్సీపీ మతతత్వపార్టీతో పొత్తుపెట్టుకోదని ఇక్బాల్ స్పష్టం చేశారు. -
మంత్రులుగా ఫరూక్, శ్రావణ్ ప్రమాణం
సాక్షి, అమరావతి: మరో కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం, గిరిజన వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్కుమార్ ఆదివారం ప్రమాణం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ఉదయం 11.45 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఫరూక్ తెలుగులో, ఆ తర్వాత శ్రావణ్కుమార్ ఇంగ్లిష్లో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రులు ఇద్దరినీ గవర్నర్ అభినందించారు. కిడారి శ్రావణ్తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రావణ్కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండుసార్లు పాదాభివందనం చేశారు. ప్రమాణం సందర్భంగా తెలుగు పదాలను ఉచ్చరించడానికి ఫరూక్ కొద్దిగా తడబడ్డారు. ఏడు నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం మంత్రివర్గ సభ్యులతో గవర్నర్, ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటో దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. -
పాఠశాల విద్య పాక్షికంగా ప్రైవేటు పరం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలన్నింటిలో వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలను బోధించే ప్రాజెక్టును ట్రిజిన్ టెక్నాలజీస్కు కట్టబెట్టనుంది. రూ.160 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో క్లౌడ్ ఆధారిత రిసోర్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుక.. బడుగు, బలహీన వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు అందిస్తున్న ఆర్థిక సహాయాలన్నిం టినీ ‘చంద్రన్న పెళ్లి కానుక’ కిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వారికి ఏడాదికి లక్ష మందికి ఎక్కువ కాకుండా అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మైనార్టీలకు ఇస్తున్న రూ.50,000, దళితులకు రూ.40,000 అదే విధంగా కొనసాగుతాయని, బలహీన వర్గాలకు రూ.30,000 లేదా రూ.35,000 ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 18 ఏళ్లు దాటిన వారికే పథకం వర్తిస్తుందని చెప్పారు. మంత్రి మండలి మరిన్ని నిర్ణయాలు.. - విదేశాల్లో పని చేస్తున్న ప్రవాసీ తెలుగు వారి కోసం ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పాలసీకి ఆమోదం. - ఉపాధి కోసం విదేశాలకు వేళ్లే వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి, పని చేస్తున్న చోట ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. లేక అక్కడ మరణించిన వారిని తరలించడానికి అయ్యే వాటి కోసం రూ.40 కోట్లతో నిధిని ఏర్పాటు. బీసీలకు పెళ్లి కానుక సరిపోదు: కేఈ పెళ్లి కానుక పథకం కింద బీసీలకు రూ.30 వేలు ఇస్తే సరిపోదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో పెళ్లి కానుక పథకం కింద ఏ వర్గానికి ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై చర్చ జరుగుతున్నప్పుడు బీసీలకు రూ.30 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ సమయంలో కేఈ కృష్ణమూర్తి జోక్యం చేసుకుని బీసీలకు రూ.30 వేలు సరిపోదని, ఇంకా పెంచాలని సూచించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల స్పందిస్తూ కేఈ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారేమో అని జోకు పేల్చడంతో పెళ్లి కోసం ఆయన కంటే మీకే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్లుందన్నారు. కొద్దిసేపు సరదా సంభాషణ జరిగినా బీసీలకు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేఈ చెప్పడంతో అన్ని వర్గాలకు కలిపి ఏడాదికి లక్ష మందికి ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేల అపార్ట్మెంట్లకు డిజైన్లు రాజధాని పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలకు నిర్మించే అపార్ట్మెంట్ల డిజైన్లను మంత్రివర్గం పరిశీలించింది. ఆర్కాప్ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్లను రూపొందించి తీసుకు రాగా వాటిని ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. బుధవారం జరిగే సమావేశంలో ఒక డిజైన్ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. -
ఇసుకపై మళ్లీ వార్నింగ్
- ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై పీడీ చట్టం కింద కేసులు - రాష్ట్ర కేబినెట్ సమావేశం హెచ్చరిక సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంతోపాటు పలు అంశాలపై చర్చ జరగడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఉచిత ఇసుక పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివీ.. ►రాష్ట్రంలోని బోగస్ వ్యవసాయ కళాశాలలపై చర్యలు. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేసి అదిచ్చే సిఫారసులకనుగుణంగా అక్రమ కళాశాలల్ని రద్దు చేయాలని వ్యవసాయశాఖ మంత్రికి ఆదేశం. ► ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీలకు కెరీర్ అడ్వాన్స్మెంట్ పథకం అమలుకు ఆమోదం. ► తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలోని క్యాప్టివ్ పోర్టును స్విస్ చాలెంజ్ విధానంలో వాణిజ్య పోర్టుగా మార్పు చేసేందుకు అనుమతి. ► ఐపీసీలోని 376, 354 సెక్షన్లకు సంబంధించి న్యాయవిచారణలో ఉన్న మహిళా కేసుల్ని సత్వరం పరిష్కరించేందుకు 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిర్ధారిస్తూ నిర్ణయం. 13 జిల్లాల్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టుల సిబ్బందిని ఈ కోర్టుల్లో సర్దుబాటు చేసేందుకు అనుమతి. ► ఏపీడబ్ల్యూఆర్డీసీ ద్వారా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం ప్రభుత్వ గ్యారంటీతో తక్కువ వడ్డీకి బహిరంగ మార్కెట్ నుంచి రూ.3వేల కోట్ల రుణ సమీకరణకు జల వనరులశాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం. ► నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్, ఫ్రిల్స్ ఎయిర్పోర్టు పనులు ఎస్సీఎల్ టర్బో కన్సార్టియంకు అప్పగిస్తూ నిర్ణయం. రూ.368.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఎయిర్పోర్టుకోసం 1,352 ఎకరాల భూమి గుర్తింపు. ► సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి 2017–18 సంవత్సరానికిగాను 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ప్రాథమిక ఆమోదం. దీనికి సంబంధించిన ధరలను నిర్ణయించే బాధ్యత ఏపీఈఆర్సీకి అప్పగింత. ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకోసం సేకరించిన 448.88 ఎకరాల భూమికి ఎకరం రూ.12.5 లక్షల చొప్పున భూయజమానులకు పరిహారం చెల్లించేందుకు అనుమతి. భారీగా భూకేటాయింపులు.. ► నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొద్దువారిపాలెంలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు 110 ఎకరాల్ని ఎకరం రూ.4 లక్షల నామమాత్రపు ధరకు కేటాయింపు. ► వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం కొప్పర్తిలో వంద ఎకరాల్ని మెగ్నీషియం ఇన్ గార్డ్స్ అండ్ అల్లాయీస్, ఫెర్రో సిలికాన్ పరిశ్రమ ఏర్పాటుకోసం ట్రెమాగ్ ఎల్లాయీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయింపు. ► విశాఖపట్నం మధురవాడలోని మూడోనంబర్ కొండలోని రెండెకరాల భూమిని ఇన్నోమైండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చేందుకు ఆమోదం. ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాప్తాడులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 14.79 ఎకరాలు ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో 91.22 ఎకరాలు, రాప్తాడు మండలం రాప్తాడులో 32.42 ఎకరాలు ఉచితంగా కేటాయింపు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం విట్టయ్యపాలెంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 32.32 ఎకరాలు ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడలో 30 ఎకరాల్ని ఏపీఐఐసీకి ముందస్తు స్వాధీనం చేసేందుకు అనుమతి. ► తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు టీటీడీకి చెందిన 25 ఎకరాల్ని టాటా ట్రస్టుకు నామమాత్రపు ధరకు 33 ఏళ్లకు లీజుకిచ్చేందుకు అనుమతి. -
నీటి సంఘాలపై ‘పచ్చ’ముద్ర
- సాధారణ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ రద్దు - రాష్ట్ర కేబినెట్ నిర్ణయం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రభుత్వం చట్టాన్నే మార్చే యాలని నిర్ణయించింది. నీటి సంఘాల పాలకవర్గాల కు సాధారణ పద్ధతిలో నిర్వహించే ఎన్ని కలను రద్దు చేసింది. ఇకపై తమ పార్టీకి చెందినవారే అధ్యక్షులు, సభ్యులుగా ఉండేం దుకు వీలుగా చేతులెత్తే విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ చట్టం–1997 (ఏపీఎఫ్ఎంఐఎస్)లో మార్పులు చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మార్పులకు ఆమోదం తెలిపింది. ఆ వివరాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. ► ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మెడికల్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయసును 60 నుంచి 63 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా 13 లక్షల 21 వేల మంది రైతులకు రూ.1680.2 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు అనుమతి. ఈ నెల 4వ తేదీన రైతులందరికీ ఈ సొమ్ము వారి అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయం. కనీసం రూ.15 వేలు రైతులకు ఇవ్వాలని, అందులో బీమా కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు ఆదేశం. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్ట సవరణతో పాటు, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల బిల్లు, సెంట్రల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్)ను రాష్ట్రానికి అన్వయించుకునే బిల్లు, రాష్ట్ర మార్కెటింగ్ చట్టానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. -
గవర్నర్ ప్రసంగంపై కేబినెట్ భేటీ లేనట్లే!
ఇప్పటికే సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రివర్గం ఆమోదం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, మండలి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసే ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించేందుకు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందు మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈనెల 10 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో 8, 9 తేదీల్లో కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈలోపే సర్క్యులేషన్ పద్ధతిలో సంతకాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో అందుబాటులో లేని కారణంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తప్ప మిగతా మంత్రులందరూ సంతకాలు చేసినట్లు తెలిసింది. ఈనెల 13న రాష్ట్ర ప్రభుత్వం 2017–18 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ముందు రోజు సాయంత్రం, లేదా 13న ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోనే కేబినెట్ భేటీ అయి బడ్జెట్ను ఆమోదించే అవకాశాలున్నాయి. -
సీఎస్కు మంత్రివర్గం అభినందన
- రేపు వీడ్కోలు కార్యక్రమం - సీఎం సలహాదారుగా నియామకానికి ఆమోదం - కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర! - ఎవరవుతారో తనకే తెలియదన్న సీఎం!! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది. బుధవారం ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో, సోమవారం జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులంతా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. బుధవారం సచివాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎస్గా రిటైరవుతున్న రాజీవ్ శర్మను సీఎం ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు కేబినేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. పాలనా సంస్కరణల బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారని తెలిసింది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఆయనకు ప్రత్యేక ఛాంబర్ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కొత్త సీఎస్గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్రను నియమించే అవకాశాలున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించారుు. అరుుతే, తదుపరి ఎవరు సీఎస్ అవుతారో తనకే తెలియదని మీడియా సమావేశం అనంతరం ఒక ప్రశ్నకు బదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు! -
మంగళగిరిలో ఎయిర్పోర్టు.. విశాఖలో గోల్ఫ్ కోర్సు
- రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం - ఉడీ కాల్పుల్లో మృతిచెందిన జవాన్లకు శ్రద్ధాంజలి సాక్షి, అమరావతి: రాష్ట్ర కొత్త రాజధాని అమరావతికి అతిసమీపంలో మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన మంత్రి మండలి వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు, విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామంలో పీపీపీ పద్ధతిన ప్రైవేట్ విద్యా సంస్థలకు భూములను కేటాయింపునకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ. రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. శుక్రవారంలోగా పరిహారం అందేలా ఆదేశించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. జమ్ముకాశ్మీర్లోని ఉడీ సెక్టార్ పరిధిలో సైనిక్ శిబిరంపై తీవ్రవాదుల నరమేధాన్ని కేబినెట్ తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ ఘటనలో శత్రుమూకలను తరిమికొట్టిన సైనికులను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించింది. మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలు.. ► విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మెరైన్ అవుట్ ఫాల్ పైప్లైన్ నిర్మాణంలో నష్టబోయిన నిర్వాసితులకు జీవో ఎంఎస్ నెంబర్ 68 ప్రకారం రూ. 61 కోట్ల ప్రత్యేక బడ్జెట్ మొత్తాన్ని పరిహారంగా మంజూరుకు అనుమతి. ఏపీఐఐసీ చెల్లించే ఈ ప్యాకేజీ ఐదు వేల కుటుంబాలకు వర్తిస్తుంది. ► పశుసంవర్థక శాఖలో స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం. ► విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి, ఉలిభద్ర గ్రామాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలకు 90 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల మంజూరుకు ఆమోదం. ► మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయం. విశాఖ విమానాశ్రయం నుంచి 60 శాతం ఎయిర్ ట్రాఫిక్ పెంచాలని, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలని నిర్ణయం. ► విశాఖ జిల్లా అడవివరంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్థతిలో ఇంటర్నేషనల్ స్కూల్ను అభివృదికి తగిన అభివృద్ధిదారుగా ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ, నోవా ఎడ్యుకేషనల్ సొసైటీలతో కూడిన కన్సార్షియం ఎంపిక చేయడానికి అనుమతి. ► జిల్లా స్థాయి టూరిజం కౌన్సిళ్లు. గోల్ఫ్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం విశాఖ జిల్లా ముదసరిలోవలో 12.71 ఎకరాల పురపాలకశాఖ భూమిని మెస్సర్స్ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్కు కేటాయింపు. పట్టణ ఇళ్ల పథకంలో సబ్సిడీ: నారాయణ పట్టణ ప్రాంతాల ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతోపాటు లబ్ధిదారుల పేరిట బ్యాంకులోన్లు ఇప్పించి పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటి నిర్మాణానికి సొంత భూమి ఉన్న లబ్ధిదారులకు కేం ద్రం లక్షన్నర, రాష్ట్రం మరో లక్షన్నర రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. -
త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి గుత్తా!
- సీఎం కేసీఆర్తో మరోసారి భేటీ - కారెక్కనున్న కాకా తనయులు - అదే బాటలో సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్! -15న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: టీఆర్ఎస్లో చేరనున్న నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డికి త్వరలోనే రాష్ట్ర కేబినెట్లో అవకాశం దక్కనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనప్రాయంగా అంగీకరించినట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జోరందుకుంది. వివాద రహితునిగా పేరుండటంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వివిధ సందర్భాల్లో తనకు మద్దతుగా నిలిచిన నాయకుడిగా గుత్తాపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందునుంచీ సదభిప్రాయముంది. దీంతో ఆయన పార్టీలో చేరికకు ముందునుంచీ సీఎం సానుకూలతను ప్రదర్శించారు. అదే సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు గుత్తా మొగ్గు చూపడంతోపాటు, ఒక్కసారైనా రాష్ట్రంలో మంత్రి పదవిని చేపట్టాలనే తన ఆకాంక్షను ఫామ్హౌస్లో జరిగిన మంతనాల సందర్భంగా గుత్తా, సీఎం ఎదుట వెలిబుచ్చినట్లు తెలిసింది. అయితే ఎంపీ పదవికి ఇప్పుడు రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి వారించటంతో పాటు.. అవసరమైనప్పుడు తానే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని గుత్తాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్రెడ్డి, మహేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి ఉన్నప్పటికీ.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నాయకుడి అవసరం ఉందని సీఎం ఆలోచనలో ఉన్నారు. కేబినెట్లో గుత్తాకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ లోటు తీరిపోతుందనే భావన ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో అదే ఎమ్మెల్సీ సీటును గుత్తాకు ఇచ్చి.. మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం లేకపోలేదని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. రెండు చోట్ల చర్చలు గుత్తా, భాస్కరరావులు టీఆర్ఎస్లో చేరే అంశంపై ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చర్చలు జరిగాయి. ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావు, తిప్పర్తి జెడ్పీటీసీ, నల్లగొండ డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు ముందుగా సాయంత్రం మెదక్ జిల్లాలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ గుత్తా, భాస్కరరావులతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి తన కారులోనే వారిద్దరినీ బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్రెడ్డితో కలసి మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం వారు టీఆర్ఎస్లో చేరే ముహూర్తాన్ని నిర్ణయించారు. రవీంద్రకుమార్ను టీఆర్ఎస్లో చేర్చుకునే విషయంలో మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. కాగా, రవీంద్రకుమార్ మాత్రం గుత్తా, భాస్కరరావులతో ఫాంహౌస్కు వెళ్లకుండా క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఖరారైన ముహూర్తం.. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, దివంగత వెంకటస్వామి తనయులు.. జి.వినోద్, వివేక్లు టీఆర్ఎస్లో చేరే ముహూర్తం ఖరారైంది. ఆదివారం గుత్తాతో పాటు మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్రావు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కలుసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జి.వివేక్, వినోద్ల నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని వీడొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ వివేక్, వినోద్లు టీఆర్ఎస్లో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలిసింది. వీరందరూ ఈనెల 15న కారెక్కేందుకు ముహూర్తం కుదిరినట్లు తెలిసింది. ముందుగా సోమవారమే వీరందరూ టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు మంచి రోజు కాదని.. రెండ్రోజులు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరో పక్క దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ (సీపీఐ) కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. -
‘రీ ఇంజనీరింగ్’కు ఆమోదం
- ఐదు ప్రాజెక్టుల్లో రూ.27,819 కోట్ల - అదనపు అంచ నా వ్యయానికి కేబినెట్ ఓకే సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల్లో హక్కుగా కలి గిన నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో చేపట్టిన రీఇంజనీరింగ్కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం, ప్రాణహిత, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల్లో రీఇంజనీరింగ్ కారణంగా పెరుగుతున్న రూ. 27,819 కోట్ల అంచనా వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పెరిగిన అంచనా వ్యయాలు, వాటికి టెండర్లు పిలిచే అంశంపై భారీ నీటి పారుదల మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని సబ్ కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయం వల్ల మార్పులు చేసిన ప్యాకేజీల వరకు ఈ ఐదు ప్రాజెక్టుల వ్యయ అంచనా రూ. 59,412.56 కోట్లకు చేరుతుంది. సబ్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగానే... సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కాళేశ్వరం, ప్రాణహిత, దేవాదుల, ఇందిరమ్మ వరదకాల్వ, తుపాకులగూడెంలలో రీ ఇంజనీరింగ్ను నీటి పారుదల శాఖ పూర్తి చేయడం తెలిసిందే. అయితే రీ ఇంజనీరింగ్తో పెరుగుతున్న అంచనాలు, వాటికి టెండర్లు పిలిచే అంశాలపై సబ్ కమిటీ ప్రతిపాదనలను కేబినెట్కు సమర్పించింది. ఈ విధానం ద్వారా ఐదు ప్రాజెక్టుల పరిధిలో సిద్ధం చేసిన అంచనాల మేరకు రూ. 27,819.78 కోట్ల వ్యయ భారం ప్రభుత్వంపై పడుతుందని లెక్కించింది. ఇందులో విడదీయ వీలులేని పనుల విలువ రూ. 5,966.58 కోట్లు ఉండగా, వీడదీసేందుకు అనుకూలమైన పనుల విలువ రూ. 21,853.20 కోట్లుగా ఉంటుందని తేల్చింది. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోనే మొత్తంగా 20 ప్యాకేజీల్లో వాస్తవ ఒప్పంద విలువ రూ. 27,390 కోట్లు ఉండగా అదనంగా మరో రూ. 26,444 కోట్ల అదనపు పనులు వచ్చి చేరాయి. ఇందులో రూ. 6,992 కోట్ల పనులను విడదీయరాని పనులుగా గుర్తించి వాటిని పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. మరో రూ. 19,452 కోట్ల పనులను విడదీయగలిగే పనులుగా గుర్తించి వాటికి కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. మిగతా వ్యయాలకూ ఓకే.. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును గోదావరి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) పరిధిలోకి తెచ్చే తుది ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరద కాల్వలోకి మార్చనున్నారు. ఈ కారణంగా వరద కాల్వ పరిధిలోని 5 పాత ప్యాకేజీల్లో మార్పులకు తోడు కొత్తగా మరో ప్యాకేజీని చేర్చారు. దీంతో ఇక్కడ వాస్తవ అంచనా రూ. 617.09 కోట్ల నుంచి రూ. 1,666.87 కోట్లకు చేరింది. దీంతోపాటు దేవాదుల మూడో దశలోని ప్యాకేజీ-2, ప్యాకేజీ-3 మార్పుల్లో భాగంగా భీమ్ఘణపూర్ నుంచి రామప్ప చెరువును కలుపుతూ టన్నెల్ ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న దేవాదుల ఫేజ్-2 పంప్హౌస్, పైప్లైన్ వ్యవస్థకి సమాంతరంగా పైప్లైన్ వేసేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక వేసింది. ఈ విధానం ద్వారా రామప్ప దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. కొత్తగా చేసిన నిర్ణయం మేరకు పైప్లైన్ వ్యవస్థ ద్వారా పనులు చేపడితే మొదట వేసిన వ్యయ అంచనా రూ. 531 కోట్లను దాటి కొత్తగా రూ. 1,149.73 కోట్లకు చేరుతుందని నీటిపారుదల శాఖ తేల్చింది. ప్యాకేజీ-2లోనూ అదనంగా రూ. 283.46 కోట్లు ఖర్చవుతాయని లెక్కించారు. మొత్తంగా ఇక్కడ అంచనా రూ. 1,941.70 కోట్ల నుంచి రూ. 2,848.89 కోట్లకు చేరింది. -
3న రాష్ట్ర కేబినేట్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం (3న) భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. వేడుకల మరుసటి రోజునే కేబినేట్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రావిర్భావ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించే నిర్ణయాలతోపాటు వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను కేబినేట్ ఎజెండాలో చేర్చనున్నట్లు తెలిసింది. -
మూకుమ్మడిగా 350 చట్టాల అన్వయింపు
సర్క్యులేషన్ విధానంలో ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 350 చట్టాలను ఒకేసారి అన్వయిం చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫైళ్లు సిద్ధం చేసింది. పునర్విభజన చట్టం ప్రకా రం రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోగా ఉమ్మడి రాష్ట్ర చట్టాలను దత్తత తీసుకోవాల్సి ఉం ది. లేని పక్షంలో వాటన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి.. కొత్తగా చట్టాలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తవనున్నందున ప్రభుత్వం ఆగమేఘాలపై రాష్ట్రానికి అవసరమైన చట్టాలన్నీ ఒకేసారి దత్తత తీసుకునే ప్రక్రియ చేపట్టింది. మొత్తం 350 చట్టాలను దత్తత తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందాల్సి ఉండటంతో.. వారం రోజుల కిందటే ప్రభుత్వం మెమ రాండం సిద్ధం చేసింది. సర్క్యులేషన్ విధానంలో ప్రతిపాదన పంపి ఈ నెల 25న మంత్రిమండలి ఆమోదం కూడా తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులివ్వను న్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సమైక్య రాష్ట్రంలోని ఏయే చట్టాలు, సవరింపులు, నిబంధనలు, రెగ్యులేషన్లు తెలంగాణకు అవసరమనే అంశంపై ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని యాక్ట్ నంబరింగ్ రిజిస్టర్లో మొత్తం 1,600 చట్టాలున్నాయి. వీటిలో అక్కర్లేనివి పక్కన పెట్టాలని, ఒకే తీరుగా ఉన్న వాటి ని క్రోడీకరించాలని, కాలం చెల్లిన వాటిని పరిహరించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. అవసరం మేరకు అడపా దడపా ఓ 62 చట్టాలను దత్తత తీసుకుంది. మిగిలినవి 288 వరకు ఉంటాయని అంచనా వేసింది. నివేదికను సమర్పించిన నల్సార్ నల్సార్ వర్సిటీ వారం రోజుల కిందట తమ నివేదికను సీసీఎల్ఏకు సమర్పించిం ది. నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 15 మంది నిపుణుల బృందం వీటిని కూలంకషంగా అధ్యయనం చేసి, నివేదికిచ్చింది. తెలంగాణలో ఒకేవిధమైన ల్యాండ్ రెవెన్యూ కోడ్ ఆవశ్యకత ఉందని అందులో స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజల భూ పరిరక్షణ, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు ల్యాం డ్ రెవెన్యూ కోడ్ దోహదపడుతుందంది. భూ వివాదాల సత్వర పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. వర్సిటీ విశ్లేషించిన 112 చట్టాల్లో 52 పూర్తిస్థాయి చట్టాలు, 60 సవరణలు ఉన్నాయి. వీటిని మూడుగా వర్గీకరించారు. 10 పూర్తి స్థాయి చట్టాలు, 32 సవరణలు రాష్ట్రానికి కీలకమని సూచించిన నిపుణులు మరో 27 చట్టాలు, 14 సవరణలు ప్రస్తుతం అనవసరమని తేల్చారు. మూడో విభాగంలో 15 చట్టాలు, 11 సవరణలను ప్రస్తావించింది. వీటిలో జిల్లా కలెక్టర్ల అధికారాలు, కొత్త జిల్లాల ఏర్పాటు, వాటర్ ట్యాక్స్, డ్రైనేజీ సెస్ తదితర అంశాలకు సంబంధించిన చట్టాలున్నాయి. -
జూన్ 1న ‘డీఎస్సీ’ నియామక ఉత్తర్వులు
రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్ 1న నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లోని అవసరమైన పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుఅధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లో 1,104 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, 14 వర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.383.4 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. ప్రతి వర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివే.. ► అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలంవేసి బాధితులకు న్యాయం చేయాలి. ఇకపై ప్రతి కేబినెట్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై సమీక్షించాలి. ► జూలై 31లోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఫైబర్ ఆప్టిక్గ్రిడ్ కింద సెకనుకు 15 నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సౌకర్యం. 1.30 కోట్ల ఇళ్లకు రూ.330 కోట్లతో ఈ సౌకర్యం కల్పించాలి. ప్రభు త్వ శాఖలన్నీ ఈ-ఫైలింగ్ నిర్వహించాలి. ► పదో షెడ్యూల్లో ఉన్న ఆస్తులపై అధ్యయనం చేసి మంత్రులతోపాటు ఆయా శాఖల విభాగాధిపతులు నివేదికలు రూపొందించాలి. 250 గజాలు, 500 గజాల వరకు ఆక్రమణలో ఉన్న స్థలాలు క్రమబద్ధీకరణ ► మౌలానా ఉర్దూ వర్సిటీ బిల్లుకు ఆమోదం ► కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో ట్రిపుల్ ఐటీకి 151.51 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానం. విశాఖపట్నంలో మెడికల్ టెక్నాలజీ మాన్యుఫాక్చరింగ్ పార్కుకు 224 ఎకరాలు కేటాయింపు. ► లేపాక్షి, వాన్పిక్ భూముల్ని స్వాధీనం ప్రక్రియ వేగవంతం చేసి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయం. -
ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా!
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ * బడ్జెట్ సమావేశాలే ప్రధాన ఎజెండా * కొత్త మైనింగ్ విధానం సహా 25 అంశాలపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. వీసీల నియామకం, ప్రైవేటు వర్సిటీలకు అనుమతి, ఒక మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వీలుగా ఏపీ ఉన్నత విద్యా చట్టం లో మార్పు లు చేస్తూ తెలంగాణకు అన్వయిం చుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్కు అనుగుణంగా అంచనాల్లో, పరిపాలనా అనుమతుల్లో మా ర్పులను వేగవంతం చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని, 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లో ఆదివారం కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగ పాఠానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టే ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్కు సంబంధించి కేబినెట్లో పలు సవరణలతో ఆమోదం పొందాల్సి ఉంది. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ప్రాజెక్టులకు రూ.5,813 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ నిర్ణయానికి ఆమోదం పొందాల్సి ఉంది. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల రీడిజైనింగ్పైనా, మిడ్మానేరు నిర్వాసితులకు మరింత లబ్ధి చేకూరేలా పరిహారం ప్యాకేజీ చెల్లింపుల్లో మార్పులు చేర్పులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నీటిపారుదల విభాగంలో సూపర్ న్యూమరీ పోస్టుల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)లను మరో ఏడాది పాటు కొనసాగించాలనే ప్రతిపాదనను ఎజెండాలో పొందుపరిచారు. కొత్త మైనింగ్ విధానం కొత్త మైనింగ్ విధానానికి కేబినెట్లో ఆమోద ముద్ర వేస్తారు. హమాలీ కుటుంబాల్లో పట్టభద్రులుగా ఉన్న మహిళలకు ప్రోత్సాహకం ఇచ్చే అంశం ఎజెండాలో ఉంది. ఆర్టీసీకి రూ.500 కోట్ల గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథకు నాబార్డు నుంచి రూ.1,900 కోట్ల రుణం, హడ్కో నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్సప్లై బోర్డుకు తీసుకునే రుణానికి ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాలను చర్చిస్తారు. ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్లు తెచ్చింది. వాటిని చట్టంగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, మహబూబ్నగర్ జిల్లాలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపన, బేగంపేట క్యాంపు ఆఫీసు సమీపంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కు మూడెకరాల స్థలం కేటాయింపు, మెదక్ జిల్లాలోని ముచ్చర్ల సమీపంలో 50 ఎకరాలను టీఎస్ఐఐసీకి కేటాయింపు అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల మైనారిటీ విభాగంలో 20 రెగ్యులర్ పోస్టులు, 19 ఔట్ సోర్సింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య విభాగంలో 23 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి కేబినెట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
పట్టణ ధనికులకు ఉచితంగా స్థలం!
♦ ఆక్రమణల క్రమబద్ధీకరణపై మంత్రుల కమిటీ నిర్ణయం ♦ 100 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరణకు యోచన సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో అనధికారికంగా ఆక్రమించిన స్థలాలను క్రమబద్ధీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. పట్టణాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీతో పాటు సీసీఎల్ఎ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. మిగతా వారందరికీ నిర్ధారించిన ధరకు క్రమబద్ధీకరించాలని సూచించాయి. అయితే ఈ సిఫార్సు ప్రభుత్వ పెద్దకు ఏ మాత్రం నచ్చలేదు. ధనికులకు కూడా 100 చదరపు గజాల వరకు ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం అధికారుల కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి మంత్రులతో ఉప కమిటీ వేశారు. ఈ మంత్రుల కమిటీ పేద, ధనిక తేడా లేకుండా పట్టణాల్లో 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలంటూ సిఫార్సులు చేసింది. గత ప్రభుత్వాలు బీపీఎల్ కుంటుంబాలకు మాత్రమే గ్రామాల్లో 100 చదరపు గజాలు, పట్టణాల్లో 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాయి. దారిద్య్ర రేఖకు ఎగువన (ఏపీఎల్) ఉండే కుటుంబాలకూ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామనడం చూస్తుంటే అసలు క్రమబద్ధీకరణ ధనికుల కోసమే అన్నట్లుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రుల కమిటీ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి. -
కాపులకు రిజర్వేషన్పై కమిషన్
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో : కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చే విషయం పరిశీలించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని తీర్మానించింది. కమిషన్ తొమ్మిది నెలల్లో నివేదిక ఇచ్చేలా మార్గనిర్దేశం చేయాలని, నివేదిక అందిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. అనంతరం మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, పి.నారాయణ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో మిగిలిన వర్గాలకు ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని, దీనివల్ల వారికి ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ప్రస్తుతం బీసీలకున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. మిగిలిన వారికి రిజర్వేషన్లు తగ్గించి కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఉండదని మంత్రులు పేర్కొన్నారు. బీసీల సబ్ప్లాన్ అమలుకు 2015-16 బడ్జెట్లో రూ.6,640 కోట్లు కేటాయించామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే రూ.50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మంత్రివర్గం ఇతర నిర్ణయాలు.. ► రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు. పనితీరును బట్టి ఈ కార్పొరేషన్కు అదనపు నిధులు. ► రాష్ట్రంలో ఓడరేవుల కార్యకలాపాలు పెంచి వాటిని అభివృద్ధి చేసేందుకు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో మారిటైమ్ బోర్డు ఏర్పాటు. ఈ బోర్డుకు చైర్మన్, ఐదు నుంచి పది మంది డెరైక్టర్లను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండేలా చర్యలు. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలి. ► రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం భూముల లీజు కాలపరిమితిని 99 ఏళ్లకు పెంచేందుకు లేదా ఫ్రీ హోల్డింగ్ కు అనుమతించాలి. దీనిపై త్వరలో ఆర్డినెన్స్. ► నాయీ బ్రాహ్మణ, రజక తదితర ఫెడరేషన్లకు సంబంధించిన డిమాండ్ల పరిశీలన, పునఃసమీక్ష. మత్స్యకారులు, వాల్మీకులను బీసీల్లోంచి తప్పించి ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్పైనా పరిశీలన. ► అర్బన్ డెవలప్మెంట్ కారిడార్ ఏర్పాటుకున్న అవకాశాల పరిశీలన. విశాఖ-చెన్నయ్, బెంగళూరు-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్లను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు, రాజమండ్రి-కాకినాడ, కర్నూలు, అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుపై వచ్చే కేబినెట్లో నిర్ణయం. ► గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిసెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు జనచైతన్య యాత్రలు. భూ కేటాయింపులు ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమలలో ఏపీ ట్రాన్స్కో ఏర్పాటుచేసే 4/200 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఎకరం రూ.4.26 లక్షల చొప్పున 13.5 ఎకరాల కేటాయింపు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కానుపురంలో రవీంద్రభారతి ఎస్కేఎస్ స్కూల్కు అప్రోచ్ రోడ్డు వేసేందుకు ఎకరం రూ.55 లక్షల చొప్పున 95 సెంట్లు కేటాయింపు. వెఎస్సార్ జిల్లా కడప మండలం చిమ్ముమియాపేటలో ఈసీహెచ్ పాలీక్లినిక్ భవన నిర్మాణానికి సెంటు రూ.96,800 వంతున 14 సెంట్ల భూమి కేటాయింపు. క్రిభ్కో ఫెర్టిలైజర్స్ యూనిట్ ఏర్పాటుకు నెల్లూరు జిల్లా వెంకటపల్లి మండలం సర్వేపల్లిలో ఎకరం రూ.7లక్షల చొప్పున 5.8 ఎకరాల కేటాయింపు. -
మంత్రుల్లో గుబులు
ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధం మంత్రులతో సీఎం జయలలిత సమాలోచన కొడునాడు పయనానికి కసరత్తు సాక్షి, చెన్నై : రాష్ట్ర మంత్రి వర్గంలో మళ్లీ మార్పులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నా యి. ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రుల్లో గుబులు పట్టుకుంది. సీఎం జయలలిత కొడనాడుకు పయనమయ్యేందుకు రెడీ అవుతున్నారు. పోయేస్గార్డెన్లో మంగళవారం ముఖ్యమైన మం త్రులు, అధికారులతో సమాలోచిం చారు. రాష్ట్ర మంత్రి వర్గంలో తరచూ మార్పులు జరగడం పరిపాటే. ఏ మంత్రి పదవి ఏ రోజు ఉంటుం దో ఊడుతుందో వారికే తెలియదు. అన్నాడీఎంకేలో హేమాహేమీలుగా, అధినేత్రి జయలలితకు సన్నిహితంగా ఉన్న వాళ్లు సైతం పదవులు కోల్పోక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం మీద సీఎం జయలలిత దృష్టిపెట్టి ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇం దులో భాగంగా గత వారం పార్టీ జిల్లాల కార్యదర్శుల నియామక ప్రక్రియను ముగిం చారు. వీరందర్నీ చెన్నైకు పిలిపించి ప్రత్యేకంగా ఉపదేశాలు ఇచ్చి పంపించారు. ఈ నియామకాల్లో కొందరు మంత్రులకు జయలలితకు షాక్ఇచ్చారని చెప్పవచ్చు. వారి చేతుల్లో ఇది వరకు ఉన్న పార్టీ పదవుల్ని లాగేసుకుని కేవలం మంత్రి పదవులకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో మంత్రి మోహన్ కూడా ఒకరు. ఈయనపై ఆరోపణలు రావడంతోనే పార్టీ పదవికి దూరంగా పెట్టినట్టు సమాచారం. గుబులు మరి కొందరు మంత్రులుగా ఉన్న జిల్లాల్లో పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్న వాళ్లకు జిల్లాల కార్యదర్శుల పదవులు కట్టబెట్టారు. ఈ దృష్ట్యా, ఆ మంత్రుల్లో ఆందోళన బయలు దేరింది. ఎక్కడ తమ పదవులు ఊడుతాయోనన్న బెంగ బయలు దేరింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి వర్గంలో మార్పు ఉండదన్న ధీమా కొందరిలో ఉన్నా, తాజాగా ఉద్వాసన పలికిన పక్షంలో, మళ్లీ సీటు దక్కుతుందో లేదోనన్న గుబులు ఆ మంత్రులను వేధిస్తోంది. అదే సమయంలో కొందరు మంత్రుల సేవల్ని పూర్తి స్థాయిలో పార్టీకి ఉపయోగించుకునేందుకు జయలలిత నిర్ణయించి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వారిని మంత్రి పదవుల నుంచి తొలగించి, వారి స్థానంలో తాత్కాళికంగా కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ప్రధానంగా ముగ్గురు మంత్రుల మీద మాత్రం వేటు వేయడానికి జయలలిత నిర్ణయించి ఉన్నట్టు, ఇందుకు తగ్గ రంగం సిద్ధమవతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. జయలలిత కొడనాడు పయనం అవుతున్నట్టు, అక్కడికి వెళ్లగానే ఈ మార్పులు ఉండొచ్చనన్న సంకేతాలు విన్పిస్తున్నాయి. కొడనాడు పయనం సీఎం జయలలిత కొడనాడు పయనానికి కసరత్తులు జరుగుతోంది. బుధవారం ఆమె పయనమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న జయలలిత అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే సిరుదావూర్కు వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆదివారం చెన్నైకు వచ్చారు. సోమవారం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆమె, కొడనాడు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. నెల రోజులు పాటు నీలగిరి జిల్లా కొడనాడులోనే ఆమె ఉంటారని సమాచారం. ఇక ప్రభుత్వ వ్యవహారాలు అక్కడి నుంచే సాగబోతున్నట్టు, అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు చేస్తున్నట్టు తెలిసింది. కొడనాడు పయనానికి సిద్ధమవుతున్న సమాచారం ఓ వైపు ఉంటే, మరో వైపు మంగళవారం ముఖ్య అధికారులు, ముఖ్యమైన మంత్రుల్ని పోయేస్ గార్డెన్కు జయలలిత పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు. తాను కొడనాడు వెళ్తున్న దృష్ట్యా, ప్రభుత్వ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం, మంత్రి వర్గంలో చేపట్టనున్న మార్పు గురించి ఆ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. -
ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీకి గ్రీన్సిగ్నల్
రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీలను ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ మూడు సొసైటీలలో ఒకదాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గన్నవరంలో ఎల్అండ్ టీ కంపెనీ మేధా టవర్స్ను నిర్మించింది. మంగళగిరి ఆటోనగర్ వద్ద ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన భూములను ఏపీఐఐసీ కేటాయిస్తోంది. - విశాఖ, తిరుపతిలోనూ ఏర్పాటు - ఎలక్ట్రానిక్, ఐటీ రంగాలు అభివృద్ధికి సొసైటీ కృషి - ఇప్పటికే గన్నవరంలో మేధా టవర్స్ ఏర్పాటు సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఎలక్ట్రానిక్, ఐటీ రంగాలు, పరిశ్రమలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీలను ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినేట్ సమావేశం నిర్ణయించింది. ఈ మూడు సొసైటీలలో ఒకదాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సొసైటీ ద్వారా ఈ ప్రాం తంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కేంద్రంగా.. రాజధాని కేంద్రంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గన్నవరంలో ఎల్అండ్ టీ కంపెనీ మేధా టవర్స్ను నిర్మించింది. మంగళగిరి ఆటోనగర్ వద్ద ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన భూములను ఏపీఐఐసీ కేటాయిస్తోంది. ఐటీ సంస్థ ‘పై’ ఇప్పటికే పది ఎకరాలు కేటాయించగా, మరో రెండు పరిశ్రమలు ఇక్కడ తమ కార్యాలయాలను పెట్టేందుకు ముందుకు రావడంతో వాటికి కావాల్సిన స్థలాలను కేటాయించేందుకు ఏపీఐఐసీ సిద్ధంగా వుంది. కాగా సైబరాబాద్లో ఉన్న కొన్ని సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఇక్కడ రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సొసైటీ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా వుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పెరగనున్న ఉద్యోగ అవకాశాలు.. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాల కోసం బెంగుళూరు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం ఇంజినీరింగ్విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలతోనూ ఇప్పటికే ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. ఈ కంపెనీలు వస్తే వందల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వచ్చి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలు, ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో...మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన 25 వేల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ పరీక్షల విధానం, అభ్యర్థుల వయో పరిమితి సడలింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలను చర్చించే అవకాశముంది. ఇక అనాథ బాలల సంరక్షణ, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో పిల్లలకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం పెట్టే ప్రతిపాదనలపై ఇటీవల నియమించిన మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులపై చర్చించి ప్రభుత్వ విధానాన్ని ఖరారు చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు చెల్లింపులపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సబ్కమిటీ ఇచ్చిన నివేదికపైనా చర్చిస్తారు. పుష్కరాలు, ఇఫ్తార్ నిర్వహణ, ముస్లింలకు రంజాన్ కానుకగా వస్త్రాల పంపిణీ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు రద్దు చేసినందున తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. -
ప్రాజెక్టులకు మహర్దశ
జూరాల : జిల్లాలోని ప్రాజెక్టులకు అదనంగా నిధులు మంజూరు చేయాలని రాష్ర్ట కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టనున్నాయి. కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లు రేట్లను పెంచాలని చేస్తున్న డిమాండ్కు గత ప్రభుత్వం జారీచేసిన జీఓ నెంబర్ 13కు మధ్య ఉపయోగకరంగా కేబినెట్ సబ్ కమిటీ అదనంగా రూ.483కోట్ల చెల్లింపులకు బుధవారం రాత్రి ఆమోదముద్ర వేసింది. జీఓ నెంబర్ 13 ప్రకారం కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లకు అనుగుణంగా ప్రాజెక్టుల అంచనాను సవరిస్తే ప్రభుత్వానికి రూ.565 కోట్ల అదనపు భారం అవుతుంది. కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లను కాకుండా అదనంగా చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఒప్పించడంతో రూ.488 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులకు కావాల్సిన అదనపు నిధులు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇప్పటివరకు ఎదురైన అడ్డంకులన్నీ తొలిగిపోనున్నాయి. ఇప్పటివరకు పనులను నత్తనడకన కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లు ఇక అన్ని దశల్లోనూ వేగవంతం చేసేందుకు వీలు కలిగింది. ఈ ఖరీఫ్లో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 3.71లక్షల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా జూలై చివరి నాటికి పనులను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ కీలక సమయంలో ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు కాకుండా అదనంగా భారాన్ని భరించేందుకు కాంట్రాక్టర్లను ఒప్పిం చి ఆమోదం తెలిపారు. దీంతో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీళ్లివ్వాల్సిన డిస్ట్రిబ్యూటరీలు, అక్విడక్టులు, ఫీల్డ్ ఛానల్స్ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఈ ఖరీఫ్లో నెట్టెంపాడు పరిధిలో 68వేల ఎకరాలు, కల్వకుర్తి పరిధిలో 1.60లక్షల ఎకరాలు, భీమా పరిధిలో 96వేల ఎకరాలు, కోయిల్సాగర్ పరిధిలో 47వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్ణరయించారు. ఈ లక్ష్యం మేరకు కాంట్రాక్టర్లతో అధికారులు పనులు చేయించగలిగితే జిల్లాలో కొత్తగా ఆయకట్టు ప్రాజెక్టుల పరిధిలో ప్రారంభం కానుంది. -
రుద్రూరులో ‘ఆహార’ కళాశాల
ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక నాయకులు వర్ని: వర్ని మండలం రుద్రూర్ వ్యవసాయ పరిశోధ నా కేంద్రంలో ‘కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ (ఆహార శాస్త్ర, సాంకేతిక కళాశాల) ఏర్పాటుకు బుధవా రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలి పింది. ఏడాదికి 40 మంది చొప్పున విద్యార్థులకు ఈ కోర్సును అందించనున్నారు. పరిశోధనా కేంద్రంలోనే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇప్పటికే సీడ్ టెక్నాలజీ కోర్సును నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఇపుడు మంత్రివర్గం ఆమోదంతో కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కృషితో ఈ కళాశాల మంజూరైందని వర్ని జడ్పీటీసీ సభ్యుడు గు త్ప విజయభాస్కర్రెడ్డి అన్నారు. జిల్లాలోనే ఇది ప్రథమ కళాశాల అని పే ర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈ కళాశాలను ఏర్పాటు చే యడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పరిశోధానా కేంద్రానికి పూర్వ వైభవం వస్తుందని, మంత్రికి, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలి పారు. కళాశాల ఆమోదం తెలపడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చే స్తున్నారన్నారు. -
టూరిజానికి 10 వేల ఎకరాలు
ల్యాండ్ పూలింగ్ రెండో దశ ► కృష్ణానదికి ఉత్తరాన భూసమీకరణ ► జిల్లాలోని నందిగామ,కంచికచర్ల ప్రాంతాల ఎంపిక ► క్యాపిటల్ పరిధి పెంపు ► మంగళగిరి, విజయవాడల్లో ప్రత్యేక అభివృద్ధికి సీసీడీఎంసీ ► రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాజధాని ల్యాండ్ పూలింగ్ పిడుగు జిల్లాపైనా పడనుంది. ఇప్పటివరకు కృష్ణానదికి దక్షిణం వైపున గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేసింది. త్వరలో రెండో దశ కింద టూరిజం అభి వృద్ధి చేయడానికి కృష్ణాజిల్లాలో కూడా భూములు సమీకరించనుంది. ఇందుకోసం కృష్ణానదికి ఉత్తరం వైపున ఐదు నుంచి పది వేల ఎకరాలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణ బుధవారం చెప్పారు. ఇదికాక నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో కొంత భూమిని సమీకరించేందుకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో రాజధాని ఉద్యోగులకు క్వార్టర్లు కట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని నుంచి కృష్ణానది మీదుగా వారధులు నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవడంతో అక్కడి నుంచి కంచికచర్ల, నందిగామ ప్రాంతాలకు వెళ్లిరావడం తేలిగ్గా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్కు వెళ్లే రహదారి కావడంతో ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉంది. రాజధాని తుళ్లూరు కావడం వల్ల కూడా ఇక్కడి భూములకు మంచి ధర వచ్చింది. రైతులు తమ భూములకు మంచి ధర వచ్చిందనే ఆనందంలో ఉన్న సమయంలో ఇక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుంటారని చూచాయగా తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్యాపిటల్ పరిధి 375 చ.కి.మీటర్లకు పెంపు... క్యాపిటల్గా ఇప్పటికే 225 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నిర్ణయించారు. దీనిని 375 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు క్యాపిటల్ పరిధిలో ఉండే విజయవాడ, మంగళగిరి పట్టణాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ (సీసీడీఎంసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. దీనివల్ల కూడా నగరంలో కొన్ని భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్కు చెందిన ఖాళీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు సేకరించే పనిలో సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. భవానీ ద్వీపం చాలదా? టూరిజం అభివృద్ధి కోసం భవానీద్వీపం చాలదా.. అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో ల్యాండ్ పూలింగ్ జరిపేందుకు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలో ఏ స్థాయిలో భూములు తీసుకోవాలో ఆ స్థాయిలో తీసుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు చెబుతున్న ప్రకారం నదికి ఉత్తరం వైపున భూములు తీసుకుంటే వాస్తు శాస్త్రం అంగీకరించదు కదా అంటూ ఛలోక్తి విసిరారు. - వడ్డే శోభనాద్రీశ్వరరావు,మాజీ మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే. రాజధాని పరిధిలోని రైతులను, కూలీలను, కౌలుదారులను, వ్రుత్తిదారులను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోంది. నిర్దిష్టమైన ప్రాజెక్టు కోసం ముందుగా ప్రభుత్వ భూములను, తరువాత చౌడు, తక్కువ పంట పండే భూములను సేకరించాలి. వీటన్నింటినీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పాలకవర్గ ప్రతినిధులు, అనుచరుల ప్రమేయం కోసం భూ సేకరణ చేస్తోంది. హనుమాన్ సుగర్స్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీకి చెందిన 118 ఎకరాల భూమిని కేవలం రూ.10 కోట్లకు గోకరాజు గంగరాజుకు కట్టబెట్టారు. కార్మికుల పొట్టగొట్టి ప్రస్తుతం ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ ధరకు భూములను కట్టబెట్టి తదుపరి ఎన్నికలకు నిధుల సేకరణ, ఓట్ల కొనుగోళ్లు కోసం భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పారిశ్రామిక అభివ ృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అయితే నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఇతర అంశాలపై పాలకులకు ద ృష్టి లేదు. - ఎం.హరిబాబు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రబాబుది భూ దాహం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పేరుతో లక్షల ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. అవసరానికి మించి భూమిని సేకరించి యోగా గురువులు, బాబాలు, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు లక్ష ఎకరాలు సేకరించి భూ బ్యాంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనది భూ దాహం. రైతుల చేతుల్లో సెంటు భూమి లేకుండా లాక్కునేందుకు సిద్ధమయ్యారు. దీనిని రైతు సంఘం తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అడ్డగోలుగా భూములు తీసుకోవడం సరికాదు. - రావుల వెంకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -
రాజధాని విస్తరణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని మరింత విస్తరించనుంది. ఇప్పటివరకూ గుంటూరు జిల్లా పరిధిలోనే ల్యాండ్పూలింగ్ అమలు చేస్తుండగా తాజాగా కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లోని భూముల్నీ సమీకరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదికి ఉత్తరం వైపున టూరిజం అభివృద్ధి పేరుతో ఐదు నుంచి పదివేల ఎకరాలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణ బుధవారం చెప్పారు. ఇదికాక నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో కొంత భూమిని సమీకరించేందుకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో రాజధాని ఉద్యోగులకు క్వార్టర్లు కట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని నుంచి కృష్ణానది మీదుగా వారధులు నిర్మిస్తే అక్కడి నుంచి కంచికచర్ల, నందిగామ ప్రాం తాలకు వెళ్లిరావడం తేలిగ్గా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.రాజధాని తుళ్లూరు కావడం వల్ల కూడా ఇక్కడి భూములకు మంచి ధర వచ్చింది. రైతులు తమ భూములకు మంచి ధర వచ్చిందనే ఆనందంలో ఉన్న సమయంలో ఇక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుంటారని చూచాయగా తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీడ్ క్యాపిటల్ పరిధి 375 చ.కి.మీటర్లకు పెంపు... సీడ్ క్యాపిటల్గా ఇప్పటికే 225 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నిర్ణయించారు. దీనిని 375 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు సీడ్ క్యాపిటల్ పరిధిలో ఉండే విజయవాడ, మంగళగిరి పట్టణాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్(సీసీడీఎంసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. దీనివల్ల కూడా నగరంలో కొన్ని భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్కు చెందిన ఖాళీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు సేకరించే పనిలో సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. -
చంద్రాపూర్ జిల్లాలో మద్య నిషేధం
రాష్ట్రమంత్రివర్గ నిర్ణయం ఫలించిన జిల్లావాసుల ఐదేళ్ల పోరాటం సాక్షి, ముంబై: చంద్రాపూర్ జిల్లా వాసుల ఐదేళ్ల పోరాటం ఫలించింది. ప్రజల కోరికను మన్నించిన ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాలో మద్యం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. విదర్భ ప్రాంతంలోని గనుల జిల్లాగా పేరొందిన చంద్రాపూర్లో మద్యం అమ్మకం, కొనుగోలు, ఉత్పత్తి, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మహారాష్ట్రలో మద్యం నిషేధాన్ని అమలు చేయనున్న మూడో జిల్లా చంద్రాపూర్ కానుంది. తూర్పు మహారాష్ట్రలో చంద్రాపూర్కు పొరుగునున్న వార్ధా, గడ్చిరోలీ జిల్లాల్లో కూడా మద్య నిషేధం అమలులో ఉంది. ప్రభుత్వ ప్రకటనతో జిల్లా వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు అభినందించుకున్నారు. ముఖ్యంగా మహిళలు నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దులో ఈ మూడు జిల్లాలు ఉన్నందున అక్రమ మద్యం వ్యాపారం కొనసాగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక అధికారి అభిప్రాయపడ్డారు. మద్యం వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక న్యాయ విభాగం ఒక కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన చెప్పారు. ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలకు సరిపోను సిబ్బందిని సమకూరుస్తామని అన్నారు. ప్రస్తుతం చంద్రాపూర్ జిల్లాలో జారీ చేసిన మద్యం పర్మిట్లన్నింటినీ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామని చెప్పారు. ఐదేళ్ల పోరాటం చంద్రాపూర్లో మద్యం నిషేధం అమలు చేయాలని 2010 నుంచి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్పై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సు మేరకు నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటు వార్ధా జిల్లాలో కూడా సంపూర్ణ మద్యం నిషేధం అమలవుతోంది. అటు గడ్చిరోలీ జిల్లాలో 1992 నుంచే మద్య నిషేధం అమలులో ఉంది. చంద్రాపూర్లో మద్య నిషేధం విధించడాన్ని జిల్లా ఇన్చార్జి, ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ స్వాగతించారు. తన రాజకీయ జీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయమని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే తన జిల్లా ప్రజల వాణిని వినిపించానని చెప్పారు. 2010లో అసెంబ్లీలో ప్రైవేటు సభ్యుని తీర్మానాన్ని ప్రవేశపెట్టానని తెలిపారు. జిల్లాలో ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున రూ.10వేలు మద్యంపై ఖర్చు చేస్తోందని చెప్పారు. జిల్లాలో సుమారు వెయ్యి నుంచి 1,200 కోట్ల రూపాయలు మద్యంపై వృథా అవుతున్నట్లు ఒక అంచనా అని అన్నారు. జిల్లాలో 847 గ్రామ పంచాయతీలుండగా, మద్య నిషేధం విధించాలని 588 పంచాయతీలు తీర్మానం చేశాయి. 2010లో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా జిల్లాకు చెందిన ఉద్యోగినులు చీమూరు నుంచి నాగపూర్ వరకు 130 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి మద్యం నిషేధం విధించాలని డిమాండ్ చేశా రు. 22 లక్షల మంది ఉన్న జిల్లాలో రూ.600 కోట్ల మద్యం వినియోగమవుతోంది. రాష్ట్రమంతటా అమలు చేయాలి: భంగ్ మద్య నిషేధాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని సామాజిక కార్యకర్త అభయ్ భంగ్ డిమాండ్ చేశారు. గుజరాత్లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉందని, అయినా అక్కడ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగడం లేదని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో మద్యంపై ఏటా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తోంది. -
అధికారమస్తు
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర కేబినెట్లో ఆరునెలల తర్వాత జిల్లాకు ఓ మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కనుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు జిల్లాలో ఒక్క స్థానమే రావడంతో తొలి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. నామినేటెడ్ రేసులో ఇప్పటికే జిల్లాకు చెందిన పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కిన నేపథ్యంలో ఇక అభివృద్ధికి అడుగులు పడతాయని జిల్లా ప్రజలు గంపెడాశతో ఉన్నారు. తొలి కేబినెట్లో జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ప్రధాన అభివృద్ధి పనులన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా మారాయి. జిల్లాలో అభివృద్ధి, ప్రతిపాదిత పనుల ప్రస్తావనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగింది. జిల్లా ప్రజల ఆశలసౌధం రాజవ్సాగర్ ( దుమ్ముగూడెం ) ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఈ ప్రాజెక్టుకు అత్తెసరు నిధులే కేటాయించారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా..? అని జిల్లా వాసులు నిరీక్షిస్తున్నారు. జిల్లా వాసులకు ఉపాధి కల్పతరువు కాబోతుందని ఊరిస్తున్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్ ) ప్రతినిధుల బృందం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై సర్వే చేసుకొని వెళ్లి నెలలు గడిచినా ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఇప్పటికే పారిశ్రామిక కారిడార్గా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ప్రాంతాలు విద్యుత్ హబ్గా మారబోతున్నాయి. రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం మణుగూరులో నిర్మించ తలపెట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు వెళ్తున్నా ఇక్కడ నిర్వాసితుల గోడు వినిపించుకోవడం లేదు. నిర్వాసితులు మెరుగైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వారి సమస్యపై దృష్టి పెట్టలేకపోతోంది. పవర్ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే స్థానికంగా ఉండే తమకు ఉపాధి దొరుకుతుందని ఈ ప్రాంత యువత వేయికళ్లతో ఎదురుచూస్తోంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రోడ్ల అభివృద్ధి పనులన్నీ జిల్లాకు కేబినెట్లో స్థానం లేకపోవడంతోనే ఇన్నాళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నా సర్కారు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పవచ్చు. బొగ్గు గనుల దృష్ట్యా మణుగూరులో పవర్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. జిల్లాకు మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కుతుండడంతో ఇకనైనా ప్రధానపనులన్నీ వేగవంతం చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాకు ప్రధాన పదవులు.. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లయిన తర్వాత జిల్లాకు ప్రధాన పదవులు దక్కుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవికి ఇటీవల ముఖ్యమంత్రి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాకే ఈ పదవి దక్కింది. కేబినెట్ విస్తరణలో మాజీ మంత్రి, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంట్ కార్యదర్శి పదవులు దక్కబోతున్నాయి. తుమ్మలకు రోడ్లు, భవనాలు లేదా హోం శాఖ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మరికొన్ని పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు ఈ పదవులు కోసం ఇప్పటికే పోటీపడుతున్నారు. జిల్లాకు పదవుల యోగం పడుతుండటంతో జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు సంవత్సరాంతాన్ని ఘనంగా ముగించేందుకు సన్నద్ధమవుతున్నారు. మిగిలింది నాలుగున్నరేళ్లు.. ఈ ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంత్రి పదవి యోగం పట్టేసరికి ఆరునెలలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా మిగిలిన నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధిని పట్టాలెక్కించాలి. ప్రధానంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని టీఆర్ఎస్ తన ఎన్నికల అజెండాలో పెట్టింది. విద్యుత్ అవసరాల దృష్ట్యా పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడం ప్రభుత్వానికి సునాయాసం అయితే, కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ మంజూరై నిర్మాణం కొంతైనా జరిగితేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో టీఆర్ఎస్కు పట్టు ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. జిల్లా నుంచి మంత్రి, పార్లమెంట్ కార్యదర్శి పదవులు పొందుతున్న వారిపైనే ఈ గురుతర బాధ్యత ఉందని జిల్లా ప్రజానీకం చర్చించుకుంటోంది. -
అదిరిందయ్యా...‘చంద్రం’
►కొత్త రాష్ట్రం.. కొత్త పథకాలు ►పంద్రాగస్టు వేళ పండుగ కల ►తీరిన నాలుగేళ్ల ‘కరువు’ ►దళితులకు భూ పంపిణీ, పెట్టుబడులు ►రుణమాఫీతో రైతు మోములో ఆనందం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కొత్త రాష్ట్రం... కొత్త ముఖ్యమంత్రి...కొత్త పథకాలతో మెతుకుసీమ మురిసిపోతోంది. స్వరాష్ట్రంలో ‘తొలి స్వాతంత్య్ర’ వేడుకలకు జరుగుతున్న వేళ దళిత, గిరిజన, రైతు శ్రామిక వర్గాలు మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు సెల్యూట్ చేస్తున్నాయి. అండగా నిలబడి ఆపదలో ఆదుకున్న మంత్రి హరీష్రావుకు మనసులోనే నమస్కారం పెడుతున్నాయి. పంద్రాగస్టు కానుకగా కేసీఆర్ ప్రకటించిన వరాలు రైతాంగంలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సార్థకతకు అర్థం చెప్పాయి. రూ. లక్షలోపు రుణ మాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి, నాలుగేళ్ల పంట నష్టం పరిహారం విడుదలతో అప్పుల బాధతో ఉన్న రైతాంగం మోములో చిరు నవ్వులు నింపాయి. ముఖ్యమంత్రి ఇలాగే సహకారం అందిస్తే వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపిస్తామంటున్నారు కర్షకులు. రైతు మోములో చిరునవ్వు రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తూ గత నెలలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం, ఈ నెల 13న రుణమాఫీ విధి విధానాలు, మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో జిల్లా రైతాంగం సంబురాలు చేసుకుంటోంది. బంగారం తనఖాపెట్టి తెచ్చుకున్న రుణాలతో పాటు, స్వల్పకాలిక, రుణాలను కూడా మాఫీ చేస్తామన్న సర్కార్ ప్రకటనతో జిల్లాలో 3.65 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. సుమారు రూ.884 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని లీడ్ బ్యాం కు అధికారులు అంచనా వేస్తున్నారు. లీడ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జిల్లాలో 4,58,637 మంది రైతులకు సం బంధించిన మొత్తం రూ.3,321.95 కోట్ల రుణాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,559.92 కోట్లు బంగారం కుద వబెట్టిన రుణాలు, మరికొన్ని టర్మ్ రుణాలున్నా యి. రూ.లక్ష, అంతకు లోపు రుణాలను తీసుకున్న రైతులు 2,76,678 మంది ఉన్నారు. ఈ రైతులు తీసుకున్న రుణాల విలువ రూ.620 కోట్లు వీటితో పాటు 29,347 మంది రైతులు రూ.184.58 కోట్లను బంగారంపై పంట రుణాలు తీసుకున్నారు. వీటితోపాటు మరో 5,670 మంది రైతులు 89.29 కోట్లు ఇతర వ్యవసాయ అనుబంధ రుణాలు తీసుకున్నారు. ఆయా రుణాలు మాఫీ కానుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దళితుల్లో కొత్త ఆశలు... తరతరాలుగా ఎదురుచూసిన గడియ వచ్చేసింది. బతుకు పోరాటం చేసినా సెంటు భూమి కూడా కొనలేక పోయిన దళితులు మూడు ఎకరాలకు ఆసాములయ్యే క్షణమొచ్చింది. దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్, దాని అమలుకు సిద్ధమ య్యారు. పంద్రాగస్టు వేడుకల్లో ఎంపిక చేసిన దళితులకు పట్టాల రూపంలో 135 ఎకరాల భూమిని పంచబోతున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా గోల్కొండ వేడుకల్లో జిల్లాకు చెందిన ఆరుగురు దళి తులు పట్టా భూములు అందుకోనున్నారు. ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఐదేళ్లపాటు కొనసాగించే ఈ మహాక్రతువులో జిల్లావ్యాప్తంగా దాదాపు 11,366 దళితకుటుంబాలు దశలవారీగా లబ్ధి పొందనున్నాయి. అధికారులు తొలివిడతగా తొమ్మిది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 45 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో సీఎం చేతుల మీదుగా ఆరుగురు, మిగి లిన వారికి జిల్లాకేంద్రంలో నిర్వహించే వేడుకల్లో మంత్రి హరీష్ చేతుల మీదు గా పట్టాలు అందుకోనున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూమి విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.3.50 లక్షల నుంచి ఆపైన పలుకుతోంది. దళితులకు భూమితోపాటుగా పంటలు సాగు చేసేందుకు అవసరమైన పెట్టుబడులు కూడా ఇస్తామని మంత్రి ప్రకటించటం దళితుల్లో కొత్త ఆశలు రేపుతోంది. నాలుగేళ్ల కరువు తీరింది ఒక్క నిర్ణయంతో మెతుకుసీమ రైతాం గం నాలుగేళ్ల కరువు తీరింది. 2011 నుంచి 2014 వరకు వర్షాభావం,అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. పంటలు దెబ్బతిన్న జిల్లా రైతులు గత నాలుగేళ్లుగా పరిహారం సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు... ఇప్పుడంటూ గత ప్రభుత్వాలు చేసిన వాగ్దా నాలతో రైతులు బేజారయ్యారు. ఇక పరిహారం చేతికందని రైతులు ఆశలు వదులుకున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా రైతాంగానికి శుభవార్త వినిపించారు. నాలుగేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న పంటనష్టం పరిహారం సొమ్ము విడుదల చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ఉత్తర్వులు వెలువరించారు. జిల్లాలో 1.46 లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేకూరుస్తూ రూ. 46.36 కోట్ల పంటనష్టం పరిహారం విడుదల చేయటం రైతాంగానికి ఊరట నిచ్చింది. ఇకరావనుకున్న నష్టపరిహా రం నాలుగేళ్ల తర్వాత ఇంటిగుమ్మం తొక్కటంతో మెతుకుసీమ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. పండుటాకులకు పండుగే.... దసరా నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 పింఛన్లు అందించేందుకు ముఖ్యమం త్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. జిల్లాలో జూన్ 14 నాటికి 1.67 లక్షల మంది వృద్ధు లు, 9,741 మంది వితంతువులు, 31,358 మంది వికలాంగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరూ దసరా నుంచి అందే పింఛన్తో ఆత్మగౌరవంతో బతకనున్నారు. -
ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి భేటీ
విశాఖ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తొలి భేటీ గురువారం విశాఖలో ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్ ఈ మొదటి మంత్రివర్గ సమావేశానికి వేదిక అయ్యింది. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకారోత్సవంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాలతో పాటు రాజధాని నిర్మాణంపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశాలున్నాయి. కేబినెట్ తొలి భేటీ సందర్భంగా భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా గురువారం ఉదయం విశాఖకు చేరుకున్న చంద్రబాబు నాయుడు ముందుగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాత్రి 7.30 గంటలకు విశాఖ నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని సమాచారం. -
ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ భేటీ నేడు
నేడు చంద్రబాబు రాక.. సింహాచలం సందర్శన తర్వాత భేటీకి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి తొలి సమావేశం నేడు విశాఖపట్నంలో జరగబోతోంది. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్ర మంత్రిమండలి భేటీకి అనేక తర్జనభర్జనల అనంతరం వేదికను ఖరారుచేశారు. చివరాఖరుకు ఆంధ్రా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్కు వేదికను మార్చడంతో అక్కడ రాత్రికిరాత్రే అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు. రాష్ట్ర కేబినెట్ తొలి భేటీకి మంత్రులంతా హాజరవుతుండటంతో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటుచేశారు. గురువారం నాటి మంత్రిమండలి సమావేశం కోసం పలువురు మంత్రులు బుధవారం సాయంత్రానికే విశాఖకు చేరుకున్నారు. అన్ని కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం హైదరాబాద్ నుంచి ఫైళ్లు తీసుకుని నగరానికి వచ్చారు. గురువారం ఉదయం విశాఖకు విమానంలో రానున్న సీఎం చంద్రబాబునాయుడు ముందుగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఆ తర్వాత కేబినెట్ భేటీకి హాజరవుతారు. ఆయన రాత్రి 7.30 గంటలకు విశాఖ నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని సమాచారం. -
రాష్ట్ర మంత్రిగా శిద్దా రాఘవరావు
ఒంగోలు, న్యూస్లైన్: రాష్ట్ర మంత్రివర్గంలో శిద్దా రాఘవరావుకు స్థానం దక్కింది. ఆదివారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శిద్దా రాఘవరావు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు(వైద్య,ఆరోగ్యశాఖామంత్రి),గొట్టిపాటి హనుమంతరావు(పౌరసరఫరాలు), డాక్టర్ పాలేటి రామారావు(పశుసంవర్థకశాఖ), ముక్కు కాశిరెడ్డి(పట్టు పరిశ్రమ శాఖ), జాగర్లమూడి లక్ష్మీపద్మావతి(వాణిజ్య పన్నుల శాఖ), దామచర్ల ఆంజనేయులు (దేవాదాయ, ధర్మాదాయ శాఖ - మార్కెటింగ్ శాఖ) మంత్రి పదవులు నిర్వహించారు. ఇప్పటి వరకు నలుగురు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు, ఒకరు రెడ్డి సామాజిక వర్గం, ఒకరు యాదవ సామాజికవర్గానికి చెందిన వారు మంత్రి పదవులు నిర్వహించారు. తాజాగా ఈ జాబితాలో వైశ్య సామాజికవర్గానికి చెందిన శిద్దా రాఘవరావు పేరు చోటు చేసుకుంది. -
రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు ప్రాధాన్యం
ముగ్గురు ఎమ్మెల్యేలకు చాన్స్ టీడీపీ నుంచి దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ ముగ్గురికీ తొలిసారి మంత్రి పదవులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజునే జిల్లాలో మంత్రి పదవులు కూడా ఖరారు కావడంతో దీనిపై చర్చకు తెరపడింది. ఇప్పటివరకు జిల్లా నుంచి సీనియర్లకు అవకాశం లభిస్తుందని అందరూ భావించగా, అనూహ్యంగా కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ పదవులు దక్కించుకున్నారు. దీంతో సీనియర్లకు ఈ వ్యవహారం మింగుడుపడని అంశంగా మారింది. సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పురిటిగడ్డ కృష్ణాజిల్లాకు చంద్రబాబు తన మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు దక్కిన జిల్లా ఇదే కావడం విశేషం. ఇందులో ఇద్దరు టీడీపీ వారు కాగా, ఒకరు బీజేపీ ఎమ్మెల్యే. మైలవరం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర టీడీపీ నుంచి, కైకలూరు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ బీజేపీ కోటాలో మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఉమామహేశ్వరరావు నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్లు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరికి వెంటనే మంత్రి పదవి వరించటం విశేషం. వీరు ముగ్గురూ తొలిసారి మంత్రి పదవులకు ఎంపికవడం మరో ఆసక్తికర అంశం. కొత్త రాజధాని ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత... రాబోయే రోజుల్లో కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యలోనే కొత్త రాజధాని ఏర్పడే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు విజయవాడలోని స్టేట్ గెస్ట్హౌస్ను తన క్యాంపు కార్యాలయంగా చేసుకుని పారిపాలన సాగించాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ రాజధాని వస్తే విజయవాడకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన చంద్రబాబు ఈ జిల్లాకు మూడు మంత్రి పదవులు కట్టబెట్టారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ జిల్లాలో పార్టీని పటిష్టం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో రాజధానిలో పార్టీ పట్టుపెంచడానికే మూడు మంత్రి పదవులు ఇచ్చారని సమాచారం. వైఎస్ హయాంలోనూ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలోనూ జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. తొలి మంత్రివర్గంలో కోనేరు రంగారావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు పదవులు దక్కించుకోగా, రెండున్నరేళ్ల తర్వాత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మండలి బుద్ధప్రసాద్ మంత్రిగా ఎంపికయ్యారు. మామ తరహాలోనే... బందరు నుంచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న కొల్లు రవీంద్రకు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా లభించటం విశేషం. తొలిసారే ఆయన గెలిచినప్పటికీ కులసమీకరణాల్లో భాగంగా పదవి దక్కి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగిత వెంకట్రావ్ను పక్కనపెట్టి బీసీ-మత్స్యకార సామాజిక వర్గానికి చె ందిన రవీంద్రకు ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన మామగారు నడకుదిటి నరసింహారావు ఇదే తరహాలో గెలిచిన తొలిసారే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారని, రవీంద్రకూ అదే తరహాలో లభించిందని ఒక సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. వెంకయ్యకు సన్నిహితుడుగా కామినేనికి గుర్తింపు... జిల్లాలో ఇద్దరు బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ మాత్రమే గెలుపొందారు. ఆయన కేంద్రమంత్రి కె.వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు. రాబోయే రోజుల్లో బీజేపీతో తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో అవసరం ఉంటుందని భావించిన చంద్రబాబు కామినేని శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
విధేయతకే పెద్దపీట
కేసీఆర్ మంత్రివర్గంపై టీఆర్ఎస్లో తర్జనభర్జన! పార్టీ ముఖ్యుల మధ్య వాదోపవాదాలు హైదరాబాద్: తెలంగాణ సీఎంగా కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంపై సోమవారం ఉదయం వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ గోప్యతను పాటించింది. మంత్రివర్గ కూర్పుపై పార్టీలోని ముఖ్య నేతలకు కూడా సమాచారం అందలేదు. అయితే ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు జరిగాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీ ముఖ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం. దీని వల్లే కేబినెట్లో ఉండే సభ్యుల సంఖ్య, ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్న విషయాలపై సోమవారం ఉదయం వరకూ స్పష్టత రాలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ అదృష్ట సంఖ్యగా భావించే ఆరుగురితోనే సీఎం సహా మంత్రివర్గం ఉండాలని తొలుత భావించారు. అయితే ఆదివారం ఉదయానికి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. తీవ్ర తర్జనభర్జనలతో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చర్చలతో చివరకు మంత్రుల సంఖ్య 12కు చేరింది. అయితే విధేయతకే కేసీఆర్ పెద్దపీట వేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అండగా ఉన్న వారికే మంత్రివర్గంలో స్థానం దక్కింది. మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, ఈటెల రాజేందర్, టి.పద్మారావు తదితరులు పార్టీకి కష్ట కాలాల్లోనూ కేసీఆర్కు విధేయంగా, అండగా ఉన్నారు. జగదీశ్ రెడ్డి ఆది నుంచీ కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కాంగ్రెస్కు పట్టుండే నల్లగొండ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించగలిగారు. నాయిని నర్సింహారెడ్డి కూడా అత్యంత విధేయుడు. ఈటెల రాజేందర్ కూడా పార్టీకి అన్ని కాలాల్లో విధేయంగా పనిచేశారు. మహమూద్ అలీకి సమర్థత కన్నా విధేయత, మైనారిటీల్లో సీనియర్ లేకపోవడం వంటి కారణాలతో అవకాశం వచ్చింది. ఇక ఉప ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీకి ప్రతికూల సమయాల్లోనూ కేసీఆర్కు అండగా ఉన్న పద్మారావుకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. మిగిలిన వారిలో సామాజికవర్గ సమతూకం, సీనియారిటీ, జిల్లాలకు అవకాశం వంటి అంశాల ఆధారంగా మంత్రి పదవి వరించింది. ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న కన్నా సీనియర్లు లేరు. బీసీ సామాజికవర్గం కూడా కావడంతో అనివార్యంగానే అవకాశం వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికీ గతంలో చాలా శాఖలు నిర్వహించిన సీనియారిటీ, సామాజికవర్గం కలిసి వచ్చింది. -
మంత్రులుగా ఇద్దరే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర మంత్రివర్గంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు స్థానం దక్కనుంది. ఈ మేరకు వారిద్దరికీ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక శాసనసభ స్థానాలను చేజిక్కించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈలోగా మంత్రివర్గాన్ని ఇప్పటికే చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం ఖాయమైనట్లు తెలుస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మంత్రివర్గంలో బెర్తును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. 2005, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరిటాల సునీత గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరే సమయంలో పరిటాల సునీత తీవ్రంగా ప్రతిఘటించిన విషయం విదితమే. జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇచ్చే సమయంలో మంత్రి పదవి ఇస్తానని పరిటాల సునీతకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో ఇచ్చిన మాట మేరకు పరిటాల సునీతకు మంత్రివర్గంలో చంద్రబాబు స్థానం కల్పించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమెకు దక్కే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇక చంద్రబాబు పిలుపు మేరకు 1999 ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు రాజకీయ అరంగేట్రం చేశారు. 1999 ఎన్నికల్లో అనంతపురం లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన కాలవ.. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ.. సార్వత్రిక ఎన్నికల్లో రాాయదుర్గం అసెంబ్లీ స్థానం పోటీ చేసి గెలుపొంది తొలి సారిగా శాసనభలోకి అడుగుపెట్టనున్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా పనిచేస్తోన్న కాలవ చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్రపడ్డారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాలవకు మంత్రివర్గంలో చంద్రబాబు స్థానం కల్పించినట్లు సమాచారం. మంత్రివర్గంలో కాలవకు కీలకమైన శాఖ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులుకు రెండు రోజుల క్రితమే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. హిందూపురం లోక్సభ స్థానం పరిధిలో పరిటాల సునీతకు.. అనంతపురం లోక్సభ స్థానం పరిధిలో కాలవ శ్రీనివాసులుకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన నేపథ్యంలో జిల్లా నుంచి ఇంకెవరికీ అమాత్యయోగం పట్టే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇది మంత్రి పదవి కోసం రాజీ లేని పోరాటం చేసిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు అశనిపాతంగా మారింది. -
ఆంధ్ర కేబినెట్లో బీజేపీ?
-
ఆంధ్ర కేబినెట్లో బీజేపీ?
చంద్రబాబు యోచన మంత్రివర్గం కూర్పుపై కసరత్తు {పొటెం స్పీకర్ రేసులో పతివాడ, కోడెల, కేఈ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేంద్ర కేబినెట్లో చేరతామని బీజేపీ నాయకత్వానికి సంకేతాలు త్వరలో ఢిల్లీకి టీడీపీ అధినేత..మోడీతోభేటీ హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరిని చేర్చుకోవాలన్న అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంతర్గత కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీని చేర్చుకోవాలా? వద్దా? అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. టీడీపీ, బీజేపీ కూటమిగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగా.. త్వరలో ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంపై చంద్రబాబు తనదైన మార్గంలో కసరత్తు ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా పూర్తిస్థాయి బలం సమకూర్చుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కేంద్ర మంత్రిమండలి నిర్మాణంపై ఎలాంటి నిర్ణయానికి వస్తారన్న విషయంలో టీడీపీ నేతల్లో స్పష్టత లేదు. అయితే ఎన్డీఏ కూటమిలో చేరినందున కేంద్ర ప్రభుత్వంలో ఒకట్రెండు మంత్రి పదవులు తీసుకోవాలన్న ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉంది. కానీ మోడీ కేంద్ర మంత్రివర్గంలో తమకు చోటు కల్పిస్తారా లేదా అన్న అనుమానం టీడీపీని పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి చోటు కల్పించడం ద్వారా కేంద్రంలో చోటుకు బాటపరచుకోవచ్చన్న ఆలోచనకు వచ్చింది. ఈ మేరకు బీజేపీ నాయకత్వానికి పరోక్షంగా సంకేతాలు పంపినట్టు టీడీపీ వర్గాలు చెప్పాయి. ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీని చేర్చుకోవాలన్న కోరికను తెలియజేయటంతో పాటు.. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీని చేర్చుకునే అంశాన్ని ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి వివరించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. సీమాంధ్రలో పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసిన వారిలో పెనుమత్స విష్ణుకుమార్రాజు, ఆకుల సత్యనారాయణ, పి.మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ గెలుపొందారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయని టీడీపీలో బలంగా వినిపిస్తోంది. పదవులపై బాబు కసరత్తు: ఇదిలావుంటే.. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహణ, మంత్రివర్గం కూర్పు, శాసన సభాపతి, ఉప సభాపతి, చీఫ్ విప్, విప్ల నియామకం వంటి అంశాలపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే అపాయింటెడ్ డేకు ఒకటి, రెండు రోజుల ముందు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి టీడీఎల్పీ నేతను ఎన్నుకునే ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్లుగా ఎవరిని నియమించాలి, ఉపముఖ్యమంత్రులు, మంత్రులుగా ఎవ రెవరిని నియమించాలనే అంశంపై చంద్రబాబు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వెంటనే శాసనసభ తొలి సమావేశాలు నిర్వహించి ఆ తరువాత మిగిలిన పనులు చేపట్టాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని టీడీపీ వర్గాల సమాచారం. ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణం చేయించేందుకు తొలుత ప్రోటెం స్పీకర్ను నియమించాలి. ప్రోటెం స్పీకర్గా పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఇ.కృష్ణమూర్తి, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలలో ఒకరికి అవకాశం రావచ్చు. ఇదిలావుంటే.. ఆదివారం పలువురు నేతలు చంద్రబాబును కలిశారు. తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. చంద్రబాబుకు సన్నిహితులుగా ఉండే వారిని కలిసి తమ పేరును మంత్రి పదవి కోసం సిఫారసు చేయాల్సిందిగా వీరు కోరుతున్నట్లు సమాచారం. -
ఏ అధికారంతో ఈ కేటాయింపులు?
పార్టీలకు నామమాత్రపు రేట్లతో భూములపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సామాన్యుడికి మార్కెట్ రేటు.. పార్టీలకు మాత్రం నామమాత్రపు ధరా? మీది ధనిక పార్టీయే కదా.. మార్కెట్ ధర చెల్లించమనండి కాంగ్రెస్ పార్టీ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి ఏ అధికారంతో రాజకీయ పార్టీలకు నామమాత్రపు ధరకు భూములను కట్టబెట్టిందో చెప్పాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ నిబంధనలకు అనుగుణంగా, ఏ విధి విధానాలకు లోబడి పార్టీలకు నామమాత్రపు ధరలకు భూములు కట్టబెట్టారో అఫిడవిట్ రూపంలో వివరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం భూమిని కోరే పౌరుల నుంచి మార్కెట్ ధర వసూలు చేసే ప్రభుత్వం, అదే భూమికి రాజకీయ పార్టీల నుంచి మాత్రం నామమాత్రపు ధరను వసూలు చేయటంలో ఔచి త్యాన్ని ప్రశ్నించింది. భూముల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వ తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానిం చింది. నెల్లూరు జిల్లా గూడూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)కి దాదాపు ఎకరా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం 2009లో జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ వి.గోపీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. పార్టీలకు భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం గత వారం సమర్పించిన మంత్రి మండలి తీర్మానాలను ధర్మాసనం పరిశీలించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సి.దామోదర్రెడ్డి లేచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపిస్తానని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీ పార్టీ ధనిక పార్టీ కదా? మరి మీరు పొందిన భూమికి మార్కెట్ ధర చెల్లించవచ్చు. అందులో ఇబ్బందేముంది..? మీ నాయకులను చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడూ విమానాల్లో తిరుగుతూ ఉంటారు. వారు ధనికులే కదా. మార్కెట్ ధర చెల్లించమని వారికి చెప్పండి’ అని దామోదర్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం
-
రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్రమంత్రి వర్గం సోమవారం సమావేశం అయ్యింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న సమావేశంలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు వ్యయానికి సంబంధించి బడ్జెట్ను అసెంబ్లీకి సమర్పిస్తారు. బడ్జెట్ సమర్పణ ముగియగానే బుధవారం నాటికి అసెంబ్లీని వాయిదా వేస్తారు. బడ్జెట్పై అధ్యయనం చేయడానికి మంగళవారం నాడు సభకు సెలవు ప్రక్రించారు. తిరిగి అసెంబ్లీ బుధవారం సమావేశమవుతుంది. 13వ తేదీతో సమావేశాలు ముగుస్తున్నాయి. ఆతర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. -
రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకూ శాసన సభా వ్యవహారాల శాఖ బాధ్యతలు చూస్తున్న శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తప్పించారు. ఈ స్థానంను మంత్రి శైలజా నాథ్ కు అప్పగించారు. తాజాగా ఇద్దరు మంత్రుల శాఖలను మార్చుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్బాబును తప్పించిన కిరణ్ ఆ శాఖను శైలజానాథ్కు కేటాయించారు. శ్రీధర్ బాబుకు వాణిజ్య పన్నుల శాఖను అప్పగించుతూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కేబినెట్ లోని అకస్మిక మార్పులపై విమర్శలకు తావిస్తోంది. సమైక్య నినాదం వినిపిస్తున్న శైలజా నాథ్ కు శాసన సభా వ్యవహారాల శాఖను అప్పగించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం హస్తం ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో సమైక్య అంశాన్ని పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి .. రాజకీయ గేమ్ లోని భాగంగానే కేబినెట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతోనే సీఎం సరికొత్త ఎత్తుగడను తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. -
ఈ నెల12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
ఈ నెల12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభకానున్నాయి. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారా?లేదా అనే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించారు. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రాన్ని అతాలకుతలం చేసిన తుపాన్లతో భారీగా నష్టపోయిన బాధితుల నష్ట పరిహారం అంశాన్ని సి.రామచంద్రయ్య రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకువచ్చారు. వివాదస్పద చిత్తూరు జిల్లా తాగునీటి పథకంపై రాష్ట్ర కేబినెట్లో చర్చ జరిగింది. తాగునీటి పథకంపై టెండర్ల ఖరారు అంశాన్ని కేబినెట్లో ప్రతిపాదించారు. తాగునీటి పథకానికి సంబంధించి టెండర్లు ప్రతిపాదనను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20 శాతం నుంచి 39 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నవారికి రూ.200 మేర పింఛన్ ను అందించేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మావోయిస్టులతోపాటు ఏడు తీవ్రవాద సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగింపుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు దాడుల్లో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంపుకు, జీహెచ్ఎంసీలో మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
నిరుద్యోగులకు శుభవార్త, 13,388 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కిరణ్ సర్కార్ శుభవార్త వినిపించింది. రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 13,388 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ మంగళవారం పచ్చజెండా ఊపింది. ఐసీడీఎస్లో 8,900, అటవీశాఖలో 3,820 ఉద్యోగ నియామకానికి ఆమోద ముద్ర వేసింది. కొత్త నియామకాలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 2,400 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక 13 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. -
విస్తరణకు మోక్షం
విజయవాడ సిటీ, న్యూస్లైన్ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు మోక్షం లభించింది. భూసేకరణకు అవసరమైన నిధుల కోసం రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫైలును రాష్ట్ర కేబినెట్ శుక్రవారం పరిశీలించింది. ఎట్టకేలకు రూ.280 కోట్ల నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. వీటిలో రూ.120 కోట్లు భూసేకరణకు కేటాయించాలని, మిగిలిన రూ.160 కోట్లతో విమానాశ్రయంలో వసతులు కల్పించాలని రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 400 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. దీనిపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి రెండేళ్ల క్రితం పంపారు. భూసేకరణకు నిధులు లేకపోవటంతో ఈ ఫైలు కదలలేదు. నిధులు విడుదలైతే భూసేకరణకు జిల్లా యంత్రాంగం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు నిర్వాసితులతో పలుమార్లు చర్చలు జరిపారు. తమ భూములు ఇవ్వటానికి వారు ససేమిరా అంటున్నారు. అప్పట్లో బయట మార్కెట్ విలువకు, ప్రభుత్వ మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులు సహకరించలేదు. కొద్దిరోజుల క్రితం పార్లమెంటులో భూసేకరణకు కొత్త చట్టం ఆమోదం లభించటంతో నిర్వాసితులు తమ భూములు ఇవ్వటానికి ముందుకు వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆధునిక వసతుల కల్పనకు మార్గం సుగమం.. విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించేందుకు చేసిన ప్రతిపాదనలు ప్రస్తుతం అమలులోకి రానున్నాయి. రూ.50 కోట్లతో కొత్తగా టెర్మినల్ భవనం నిర్మించటానికి ఎయిర్పోర్టు అథారిటీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా టె ర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం 50 మంది కూర్చోవడానికి వినియోగిస్తున్న టెర్మినల్ భవనాన్ని 300 మంది కూర్చునేలా విశాలమైన హాలు నిర్మాణంతో విస్తరించనున్నారు. ప్రయాణికులు సేదతీరేందుకు అవసరమైన రిఫ్రెష్మెంట్ సెంటర్లు, రెస్టారెంట్లు, పుస్తక విక్రయ కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. టిక్కెట్ విక్ర య కౌంటర్ల సంఖ్య పెంచటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. టెక్నికల్ బ్లాక్ను కూడా విస్తరిస్తారు. పెరగనున్న సర్వీసులు గన్నవరం విమానాశ్రయంలో సర్వీసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయానికి న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్కు రెగ్యులర్గా ఆరు సర్వీసులు నడుస్తున్నాయి. వీటితోపాటు వచ్చే నెల నుంచి ఎయిర్కోస్తా మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది. ఎయిర్కోస్తా గన్నవరం కేంద్రంగానే బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు తమ సర్వీసులు నడపాలని యోచనలో ఉంది. విస్తరణ జరిగి టెర్మినల్ భవనం పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.