Tamim Iqbal
-
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ రెండోసారి అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఇక్బాల్ అందుబాటులో ఉంటాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ అంతలోనే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించి బంగ్లా క్రికెట్కు షాకిచ్చాడు. 34 ఏళ్ల తమీమ్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు."నేను గత కొంతకాలంగా ఇంటర్ననేషనల్ క్రికెట్కు దూరంగా ఉన్నాను. చాలా గ్యాప్ వచ్చింది. దీంతో నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం చాలా రోజుల కిందటే తీసుకున్నాను. నా నిర్ణయం ప్రకటించడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ ముందు నాపై చర్చలు ఉండకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడో బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాను. కానీ మీడియా మాత్రం నాపై అనవసర చర్చలు పెట్టింది.కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నన్ను జట్టులోకి తిరిగి రావాలని అభ్యర్థించాడు. నేను సెలక్షన్ ప్యానెల్తో కూడా మాట్లాడాను. నాలో ఇంకా సత్తువ తగ్గలేదని నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. కానీ నేను నా మనసు చెప్పిన మాటే వింటాను. అంతర్జాతీయ క్రికెట్లో నా అధ్యాయం ముగిసింది" అని తన రిటైర్మెంట్ నోట్లో తమీమ్ పేర్కొన్నాడు.రెండో సారి.. కాగా తమీమ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం రెండోసారి. గతంలో 2023 జూలైలో తొలిసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా సూచన మెరకు తన ఇక్భాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2023 దృష్ట్యా అతడు తన మనసును మార్చుకున్నాడు.కానీ అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులో తమీమ్కు జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి అతడు తిరిగి జట్టులోకి రాలేదు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.చదవండి: అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్ -
తమీమ్ ఇక్బాల్, అలెక్స్ హేల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం.. కొట్టుకున్నంత పని చేశారు..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో హైడ్రామా చోటు చేసుకుంది. రంగ్పూర్ రైడర్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య నిన్నటి రసవత్తర మ్యాచ్ అనంతరం తమీమ్ ఇక్బాల్ (ఫార్చూన్ బారిషల్ కెప్టెన్), అలెక్స్ హేల్స్ (రంగ్పూర్ రైడర్స్) కొట్టుకున్నంత పని చేశారు. మ్యాచ్ అనంతరం జరిగే హ్యాండ్ షేక్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా మీడియా కథనాల మేరకు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు ఎదురెదురుపడ్డాడు.ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్, హేల్స్ మధ్య మాటామాటా పెరిగింది. తొలుత హేల్స్ తమీమ్ను రెచ్చగొట్టాడు. తమీమ్కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హేల్స్ అగౌరవంగా ప్రవర్తించాడు. హేల్స్ ప్రవర్తనను అవమానంగా భావించిన తమీమ్ తొలుత నిదానంగా సమాధానం చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని తమీమ్ హేల్స్ను అడిగాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పు. ఇలా ప్రవర్తించడం సరికాదు. మగాడిలా ప్రవర్తించు అని తమీమ్ హేల్స్తో అన్నాడు.తమీమ్ తన అసంతృప్తిని వెలిబుచ్చుతుండగానే హేల్స్ ఏదో అన్నాడు. ఇందుకు చిర్రెతిపోయిన తమీమ్ సహనాన్ని కోల్పోయి హేల్స్ మీదకు వచ్చాడు. హేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరికి సర్ది చెప్పేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నించారు. గొడవ వద్దని వారు ఎంత వారిస్తున్నా తమీమ్, హేల్స్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.అయితే ఈ గొడవపై హేల్స్ మరోలా స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని అన్నాడు. గొడవను తొలుత తమీమే స్టార్ట్ చేశాడని చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంగా తమీమ్ తనను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. డ్రగ్స్ కారణంగా నిషేధించబడినందుకు (ఇంగ్లండ్) సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఇలా మాట్లాడుతూనే చాలా దరుసుగా ప్రవర్తించాడని హేల్స్ చెప్పుకొచ్చాడు.కాగా, ఫార్చూన్ బారిషల్తో నిన్న జరిగిన రసవత్తర సమరంలో రంగ్పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్పూర్ రైడర్స్కు సంచలన విజయాన్నందించాడు. మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు. -
‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్ను చూస్తారు’
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్ స్టైల్ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.ద్రవిడ్ తర్వాతటీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సేన చాంపియన్గా నిలిచిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను టీమిండియా హెడ్కోచ్గా నియమించింది బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్(రెండుసార్లు ప్లే ఆఫ్స్) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన మెంటార్గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.తన దూకుడు వైఖరికి విరుద్ధంగాశ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం రోహిత్ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయింది. రెండో ప్రయత్నంలోనే గంభీర్కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్కు.. రోహిత్ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్స్వీప్పై కన్నేసింది. గంభీర్ విశ్వరూపం చూస్తారుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. మీరు ఎప్పుడైతే ఓ సిరీస్ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్ స్టైల్పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. గంభీర్ మరీ అంత కూల్ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.గంభీర్ ముందున్న సవాళ్లువరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరడం సహా చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్కప్-2027 రూపంలో గంభీర్కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
‘రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఆరు శతకాలు.. 522 వికెట్లుఈ క్రమంలో టెస్టు క్రికెట్లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాదిరి ఇన్నింగ్స్ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమేఅయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం. అయితే, భారత క్రికెట్ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లి మాదిరే అతడూ టాప్ ప్లేయరేనని తమీమ్ ఇక్బాల్ ఈ సందర్భంగా అశ్విన్ను ప్రశంసించాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!📽️ WATCHThe dismissal that completed five-wicket haul number 37 in Test Cricket for @ashwinravi99 👏👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/tDKMeNn33O— BCCI (@BCCI) September 22, 2024 -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం
బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ 2005లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు 90 టెస్టులు, 271 వన్డేలు, 102 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టులో 5892, వన్డేల్లో 7792, టీ20లలో 1500 పరుగులు సాధించాడు. అయితే, టీమిండియాతో తాజా టెస్టు సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ముష్ఫికర్ పెద్దగా రాణించలేకపోయాడు.తమీమ్ ఇక్బాల్ను అధిగమించితొలి ఇన్నింగ్స్లో కేవలం 8 పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 13 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, మొత్తంగా 21 పరుగులు చేయగలిగిన ముష్ఫికర్.. తన అంతర్జాతీయ కెరీర్లో 15,196 రన్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్(15192)ను అధిగమించి.. బంగ్లాదేశ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డులకెక్కాడు.ఇంకో 357 పరుగులు అవసరంఇదిలా ఉంటే.. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలుపొందాలంటే ఇంకో 357 పరుగులు అవసరం. టీమిండియా బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకటి, రవిచంద్రన్ అశ్విన్కు మూడు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించడం గమనార్హం. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు15196- ముష్ఫికర్ రహీం *15192- తమీమ్ ఇక్బాల్14696- షకీబ్ అల్ హసన్10694- మహ్మదుల్లాచదవండి: భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం! -
పాక్ పరాభవంపై బంగ్లాదేశ్ ఓపెనర్ ట్వీట్.. షాకివ్వనున్న పీసీబీ
గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. టీ20 ప్రపంచకప్-2024లోనూ ఘోర పరాభవం చవిచూసింది.గ్రూప్-ఏలో టీమిండియా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలతో కలిసి ఉన్న పాక్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి టీమిండియాతో పాటు పసికూన, ఆతిథ్య అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కోచ్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో తరచూ మార్పుల కారణంగానే తీరూ తెన్నూ లేకుండా పోయిందని.. అందుకు నిదర్శనమే ఈ వరుస వైఫల్యాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఫ్గన్, బంగ్లాదేశ్ కూడా ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో పాక్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టగా.. ఆసియా నుంచి టీమిండియాతో పాటు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్-8కు చేరుకున్న విషయం తెలిసిందే. నాలుగింట మూడు విజయాలతో గ్రూప్-సి నుంచి అఫ్గన్.. గ్రూప్-డి నుంచి నాలుగింట మూడు గెలిచి బంగ్లా తదుపరి రౌండ్కు అర్హత సాధించాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదే వెటరన్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ వైఫల్యాలపై సానుభూతి వ్యక్తం చేసిన ఈ బంగ్లా బ్యాటర్.. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వంటి వాళ్లు ప్రస్తుత జట్టుకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందని హితవు పలికాడు.‘‘టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం విచారకరం. వచ్చేసారి వాళ్లు గొప్పగా రాణించాలని ఆశిస్తున్నా. షాహిద్ ఆఫ్రిది వంటి సీనియర్లే వారికి సరైన మార్గం చూపాలి’’ అని తమీమ్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక్బాల్ ట్వీట్కు మద్దతుగా, వ్యతిరేకంగా.. ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.కఠిన చర్యలకు సిద్ధంవన్డే వరల్డ్కప్లో అవమానం తర్వాత పాకిస్తాన్ వరుసగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లో పరాజయాలు చవిచూసింది.తాజాగా ప్రపంచకప్ రేసు నుంచి లీగ్ దశలోనే వైదొలిగింది. అంతేగాక సీనియర్లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.సెంట్రల్ కాంట్రాక్టులు, జీతాల విషయంలో సమీక్ష నిర్వహించి.. కోతలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల తీరుపై గుర్రుగా ఉన్న పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ విజేతగా తమీమ్ జట్టు..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)– 2024 సీజన్ ఛాంపియన్గా ఫార్ట్యూన్ బరిషల్ నిలిచింది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో కొమిలియా విక్టోరియన్స్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బరిషల్ జట్టు.. తొలిసారి బీపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బరిషల్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (30 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ (26 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మెహిది హసన్ మిరాజ్ (26 బంతుల్లో 29, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కొమిలియా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొమిలియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ బ్యాటర్ మహిదుల్ ఇస్లామ్ (38) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆండ్రూ రసెల్ (14 బంతుల్లో 27, 4 సిక్సర్లు) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరిషల్ బౌలర్లలో జేమ్స్ ఫుల్లర్ 2 వికెట్లు పడగొట్టగా.. మైర్స్,సైఫుద్దీన్, మెకాయ్ తలా వికెట్ సాధించారు. 2012 నుంచి జరుగుతున్న బీపీఎల్లో కొమిలియా విక్టోరియన్స్ నాలుగు సార్లు (2015, 2019, 2022, 2023)టైటిల్ విజేతగా నిలవగా.. ఢాకా గ్లాడియేటర్స్ మూడు సార్లు( 2012, 2013, 2016) ఛాంపియన్స్గా నిలిచింది. అదే విధంగా రంగాపూర్ రైడర్స్ (2017), రాజ్షాహి రాయల్స్ (2020)లు తలా ఒకసారి టైటిల్ను ముద్దాడాయి. ఇప్పుడు పదో సీజన్లో తమీమ్ ఇక్భాల్ సారథ్యంలోని ఫార్ట్యున్ బరిషల్ సరి కొత్త ఛాంపియన్స్గా అవతరిచింది. -
WC 2023: వరల్డ్కప్ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్ అప్పుడే!
WC 2023- I Won't Lead In ODIs After That: Shakib al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ సారథిగా వైదొలుగుతానని స్పష్టం చేశాడు. మేనేజ్మెంట్ కోరినందు వల్లే వన్డే జట్టు పగ్గాలు చేపట్టానని.. ఇది కేవలం టీమ్ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నాడు. తన స్వార్థం కోసం సారథిగా రాలేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ వన్డే కెప్టెన్సీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్-2023లో జట్టును ముందుండి నడిపిన షకీబ్ అల్ హసన్.. ప్రపంచకప్ టోర్నీలోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. వరల్డ్కప్ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్ అప్పుడే ఈ నేపథ్యంలో టీ- స్పోర్ట్స్తో మాట్లాడుతూ వన్డే కెప్టెన్సీ, రిటైర్మెంట్ గురించి తన ప్రణాళికలు వెల్లడించాడు. ‘‘అంతర్జాతీయస్థాయిలో నేను 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్ చాంపియన్స్ ట్రోఫీలో భాగమవ్వాలనుకుంటున్నాను. ఇక టీ20 ఫార్మాట్లో టీ20 ప్రపంచకప్-2024 వరకు జట్టుతో ఉండాలనుకుంటున్నా. టెస్టుల విషయంలోనూ వరల్డ్కప్ తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. బహుశా ఒకేసారి అన్ని ఫార్మాట్లకు ఒకేసారి వీడ్కోలు పలుకుతానేమో. భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కదా! ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ విషయంలో నా ఆలోచన ఇదీ’’ అని 36 ఏళ్ల షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్గా ఎదిగిన ఈ వెటరన్ ఆల్రౌండర్.. ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 11 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు 600 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'ఈ డర్టీ గేమ్లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు': తమీమ్ ఇక్బాల్ -
'ఈ డర్టీ గేమ్లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు'
వన్డే ప్రపంచకప్-2023కు తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్భాల్కు చోటు దక్కపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్కు, ఇక్భాల్కు మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరినట్లు తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న తమీమ్ను వరల్డ్కప్కు ఎంపిక చేస్తే టోర్నీ నుంచి తప్పుకుంటానని బీసీబీని షకీబ్ బెదిరించినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా వెన్ను గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్ సిరీస్తో తమీమ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతకంటే ముందు అన్నిఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకోవడంతో అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరల్డ్కప్లో ఆడాలని నిర్ణయించకున్నాడు. కానీ అనుహ్యంగా అతడికి ఏకంగా వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. అవన్నీ రూమర్సే ఇక తమీమ్- షకీబ్ విభేదాల వార్తలపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్ర్ మిన్షాజుల్ అబేదిన్ అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశాడు. "తమీమ్ ఇక్బాల్ చాలా కాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. అతను న్యూజిలాండ్తో సిరీస్లోనూ ఒకే మ్యాచ్ ఆడి, ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అతడి గాయాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్కప్ ఎంపిక చేయలేదని అబేదిన్ తెలిపాడు. అంతేకాకుండా తమీమ్ను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకన్నామని ఆయన అన్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై తమీమ్ ఇక్భాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెత్త ఆటలో తను బాగం కాకూడదనుకుంటానని తమీమ్ తెలిపాడు. కావాలనే నన్ను తప్పించారు.. "వరల్డ్కప్ జట్టు ఎంపిక ముందు బంగ్లా క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వరల్డ్కప్ కోసం జట్టుతో కలిసి నేను భారత్కు వెళ్తానని ఆయన చెప్పారు. నా ఫిట్నెస్ను మరోసారి ఆయన నిరూపించుకోమన్నారు. అదేవిధంగా ఆఫ్గానిస్తాన్తో జరిగే తొలి మ్యాచ్కు దూరంగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అందుకు బదులుగా వరల్డ్కప్కు ఇంకా 10 నుంచి 15 రోజుల సమయం ఉంది, అయినా నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ తొలి మ్యాచ్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాను. దీంతో ఒక వేళ మీరు జట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఒక్కసారిగా అతను ఏమి మాట్లాడాతున్నారో నాకు అర్ధం కాలేదు. వెంటనే నేను పూర్తిగా పాజిటివ్ మైండ్తో ఉన్నా. కొన్ని రోజుల తర్వాత న్యూజిలాండ్పై మంచి ఇన్నింగ్స్ ఆడాను. ఒక్కసారిగా నా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంటని ఆయనతో అన్నాను. నేను గత 17 ఏళ్లగా ఓపెనింగ్ స్ధానంలోనే ఆడుతున్నాను. ఎప్పుడూ మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేయలేదు. అటువంటి అప్పుడు నా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా మారుస్తారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకు లేదు. ఫిజియో రిపోర్ట్ ప్రకారం.. నా ఫిట్నెస్ లెవల్స్ నాకు తెలుసు. కివీస్ తొలి వన్డే, రెండో వన్డే తర్వాత నేను కాస్త నొప్పితో బాధపడ్డా. అది వాస్తవం. కానీ రెండు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆఖరి వన్డేకు జట్టు సెలక్షన్కు నేను అందుబాటులోకి వచ్చా. కానీ జట్టు వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని సూచించారు. వరల్డ్కప్లో ప్రతీ మ్యాచ్కు దాదాపు రెండు రోజుల విశ్రాంతి లభిస్తోంది. నాకు అది చాలు . ఇప్పటికే నేను దాదాపు 10 వారాల పాటు రిహాబిలేటేషన్లో ఉన్నా. ఉద్దేశ్వపూర్వకంగానే నన్ను జట్టు నుంచి తప్పించారు అని తమీమ్ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్చేశాడు. చదవండి: IND Vs AUS 3rd ODI: అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
వరల్డ్కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడికి దక్కని చోటు
అక్టోబర్ 5 నుంచి భారత్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 కోసం బంగ్లాదేశ్ సెలెక్టర్లు తమ జట్టును ఇవాళ ప్రకటించారు. షకీబ్ అల్ హసన్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో స్టార్ ఆటగాడు, బంగ్లాదేశ్ లెజెండరీ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్కు చోటు దక్కలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా తమీమ్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకోలేదని తెలుస్తుంది. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా గాయం కారణంగా అసౌకర్యంగా ఫీలైన తమీమ్ అప్పుడే సెలెక్టర్లతో వరల్డ్కప్లో కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపాడు. తమీమ్ వర్షన్ను పరిగణలోకి తీసుకున్న ఆ దేశ సెలెక్షన్ కమిటీ మొత్తానికే అతన్ని వరల్డ్కప్ జట్టు నుంచి తొలగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాగా, తమీమ్ ఇటీవల వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, ఆతర్వాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పిలుపు మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే తమీమ్కు వరల్డ్కప్ జట్టులో చోటివ్వకుండా సెలక్టర్లు అవమానించారు. తమీమ్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకోకపోవడానికి బంగ్లా ప్రస్తుత కెప్టెన్ షకీబ్తో ఉన్న విభేదాలే కారణమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, వరల్డ్కప్లో పాల్గొనే అన్ని దేశాలు తమమత జట్లను ప్రకటించిన అనంతరం బంగ్లాదేశ్ ఆఖర్లో తమ జట్టును ప్రకటించింది. వరల్డ్కప్లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్లో బంగ్లా టీమ్.. ఆఫ్ఘనిస్తాన్ను ఢీకొంటుంది. దీనికి ముందు ఆ జట్టు సెప్టెంబర్ 29న శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం అక్టోబర్ 2న ఇంగ్లండ్తో మరో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. మెగా టోర్నీలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబర్ 19న పూణేలో జరుగనుంది. బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిది హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్ భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమ్జీత్ సింగ్, సకీబ్ జుల్ఫికర్, సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్, కొలిన్ అకెర్మ్యాన్, బాస్ డీ లీడ్, తేజ నిడమనూరు, షరీజ్ అహ్మద్, మ్యాక్స్ ఔడౌడ్, రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్, వెస్లీ బర్రెసీ, లొగన్ వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్స్టోన్, జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, జానీ బెయిర్స్టో, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక -
బంగ్లాదేశ్కు గుడ్న్యూస్! కెప్టెన్గా లిటన్ దాస్..
Bangladesh vs New Zealand ODI Series: ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు బంగ్లాదేశ్.. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ ఈవెంట్కు ముందు పటిష్ట కివీస్ జట్టుతో మూడు మ్యాచ్లలో తలపడనుంది. సెప్టెంబరు 21 నుంచి ఈ వన్డే సిరీస్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా రియాద్ పునరాగమనం చేయడం ఖాయమైంది. గుడ్న్యూస్.. అతడు వచ్చేశాడు వెన్నునొప్పితో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన తమీమ్ రాక బంగ్లాకు శుభవార్తగా పరిణమించింది. ఇక అక్టోబరు 5 నుంచే వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానున్న తరుణంలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్కు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. కివీస్తో సిరీస్కు కెప్టెన్గా లిటన్ దాస్ దీంతో సొంతగడ్డపై లిటన్ దాస్ కివీస్తో సిరీస్కు సారథ్యం వహించనున్నాడు. ఇక ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడిన బ్యాటర్ నజ్ముల్ హొసేన్ షాంటో పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. మేజర్ టోర్నీ ముందున్న దృష్ట్యా అతడికి కూడా రెస్ట్ ఇచ్చారు. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్ల ఎంపిక ఇక మహ్మద్ నయీం, ఆఫిఫ్ హొపేస్, షమీమ్ హొసేన్లను తప్పించిన మేనేజ్మెంట్.. అన్క్యాప్డ్ ప్లేయర్లు జాకీర్ హసన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, రిషద్ హుస్సేన్కు న్యూజిలాండ్తో ఆడే జట్టులో చోటిచ్చింది. అందుకే షకీబ్ దూరం జట్టు ప్రకటన సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెలక్టర్ మిన్హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ.. ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో సిరీస్ తమకు సన్నాహకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇక మెగా ఈవెంట్కు ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్గా ఉండేందుకే కెప్టెన్ సహా ఇతర ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు పేర్కొన్నాడు. టీమిండియా గెలుపొందిన జోష్లో బంగ్లా ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023లో షకీబ్ అల్ హసన్ బృందం మెరుగ్గా ఆడకపోయినప్పటికీ.. సూపర్-4 చివరి మ్యాచ్లో ఏకంగా టీమిండియానే ఓడించింది. అనూహ్య రీతిలో అద్భుత ఆటతీరుతో రోహిత్ సేనకు షాకిచ్చి 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది జోష్లో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో 3-1తో న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు బంగ్లాదేశ్ జట్టు లిటన్ దాస్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, అనముల్ హక్ బిజోయ్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, నురుల్ హసన్ సోహన్, మెహీది హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్, తాంజిద్ హసన్ తమీమ్, జాకీర్ హసన్, రిషద్ హుస్సేన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్. చదవండి: ఆర్సీబీ పేసర్కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన Ind vs SL: అభిమానులకు చేదువార్త! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక! -
వన్డే ప్రపంచకప్.. బంగ్లాదేశ్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి ఆ జట్టు స్టార్ఆటగాడు తమీమ్ ఇక్భాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో జరిగే ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్లో బంగ్లా జట్టు సారధిగా స్టార్ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ధృవీకరించింది. అదే విధంగా ఈ రెండు మెగా ఈవెంట్లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు. "ఆసియా కప్, ప్రపంచకప్లో మా జట్టు కెప్టెన్గా షకీబ్ను నియమించాము. రేపు(ఆగస్టు 12)న ఈ రెండు ఈవెంట్లకు మా జట్టును ప్రకటిస్తాము. సెలక్టర్లు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు" అని విలేకురల సమావేశంలో నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. కాగా షకీబ్ ప్రస్తుతం టీ20ల్లో బంగ్లా జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు 2011లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో బంగ్లా కెప్టెన్గా షకీబ్ అల్ హసనే వ్యవహరించాడు. ఇక ఆసియాకప్-2023లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. అదే విధంగా ఆక్టోబర్ 7న ఆఫ్గానిస్తాన్తో తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని బంగ్లా ప్రారంభించనుంది. చదవండి: CPL 2023: అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు -
బంగ్లాదేశ్కు బిగ్ షాక్.. కెప్టెన్సీకి తమీమ్ ఇక్బాల్ గుడ్బై!
ఆసియాకప్కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లా జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తమీమ్ ఇక్భాల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్, క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్లతో చర్చలు జరిపిన తర్వాత తమీమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వర్క్లోడ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తమీమ్ తెలిపాడు. "నేను బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా. ఇకపై ఒక ఆటగాడిపై నా ఆటపై దృష్టిసారిస్తాను. అవకాశం వచ్చినప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను" అని విలేకురల సమావేశంలో తమీమ్ పేర్కొన్నాడు. కాగా వెన్ను గాయం, ఫామ్ లేమితో బాధపడుతున్న ఇక్బాల్.. ఆసియాకప్-2023కు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. అతడు తిరిగి స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న వన్డేలకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లా నూతన సారథిగా లిట్టన్ దాస్ను ఎంపిక చేయాలని బీసీబీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా గత నెలలో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యంతో తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. ఇక కేవలం ఆటగాడిగా మాత్రమే తమీమ్ కొనసాగనున్నాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: IPL 2024: ఆర్సీబీ హెడ్కోచ్గా జింబాబ్వే మాజీ కెప్టెన్ -
దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వివరించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్కప్ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: Tamim Iqbal Retirement: స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటన -
స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్! వరల్డ్కప్కు ముందు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్కప్కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరాడు. తమీమ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న (జులై 5) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆడిన తమీమ్.. తన సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. తమీమ్ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 34 ఏళ్ల తమీమ్ తన 16 ఏళ్ల కెరీర్ను అర్ధంతరంగా ముగించడంతో బంగ్లాదేశ్ అభిమానులు అవాక్కవుతున్నారు. బంగ్లా తరఫున 70 టెస్ట్లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడిన తమీమ్.. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. -
బంగ్లాదేశ్కు భారీ షాక్
స్వదేశంలో బంగ్లాదేశ్కు ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘన్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయల నడుమ 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 83/2 (21.4 ఓవర్లు) స్కోర్ వద్ద ఉండగా వర్షం మరోసారి పలకరించింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన ఎంపైర్లు ఆఫ్ఘనిస్తాన్ను విజేతగా ప్రకటించారు. సత్తా చాటిన ఆఫ్ఘన్ బౌలర్లు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హాక్ ఫారూఖీ (3/24), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/23), రషీద్ ఖాన్ (2/21), మహ్మద్ నబీ (1/25), అజ్మతుల్లా (1/39) బంగ్లాదేశ్ను దెబ్బకొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహిద్ హ్రిదోయ్ (51) అర్ధసెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (13), లిటన్ దాస్ (26), షాంటో (12), షకీబ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. అలసట లేకుండా గెలుపొందిన ఆఫ్ఘనిస్తాన్.. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. వరుణుడి పుణ్యమా అని అలసట లేకుండా గెలుపొందింది. 21.4 ఓవర్ల వద్ద (83/2) మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన ఆఫ్ఘనిస్తాన్ను విజేతగా ప్రకటించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఇబ్రహీం జద్రాన్ (41 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికగా జులై 8న జరుగనుంది. కాగా, ఈ సిరీస్లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్లో బంగ్లాదేశ్ 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. -
ఐర్లాండ్పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్.. 320 పరుగుల టార్గెట్ ఛేజ్
చెమ్స్ఫోర్డ్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్ (140) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. డాక్రెల్ 74 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్, షోర్పుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో(117) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తౌహిద్ హృదయ్(68), రహీం(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, డాక్రల్ తలా రెండు వికెట్లు, లిటిల్, అదైర్, హ్యుమ్ ఒక్కో వికెట్ పడగొట్టాడు. కాగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 అధిక్యంలో బంగ్లాదేశ్ నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
అరుదైన క్లబ్లో చేరిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశీగా రికార్డు
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా, ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్ ఈ మైలురాయిని అధిగమించాడు. Congratulation Tamim Iqbal on becoming the first Bangladeshi batsman to complete 15000 runs in International Cricket. 🔥🏏#BCB | #Cricket pic.twitter.com/J4mj5W8k9T — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ మ్యాచ్లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తమీమ్.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు. తమీమ్ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 383 మ్యాచ్లు ఆడిన తమీమ్ 15009 పరుగులు చేశాడు. తమీమ్.. 69 టెస్ట్ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో రెండో వన్డేలో ముష్ఫికర్ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్), లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ
బంగ్లాదేశ్, ఇంగ్లండ్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్కు గురి చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ తస్కిన్ అహ్మద్ వేశాడు. ఆ ఓవర్లో తస్కిన్ వేసిన యార్కర్ బంతిని ఆదిల్ రషీద్ సమర్థంగా అడ్డుకున్నాడు. బంతి రషీద్ ప్యాడ్కు దూరంగా బ్యాట్ అంచున తాకింది. అయితే బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. రిప్లేలో బంతి ఎక్కడా ప్యాడ్కు తగిలినట్లు కనిపించలేదు కదా బంతి ప్యాడ్లకు చాలా దూరంగా ఉన్నట్లు చూపించింది. దీంతో అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. వాస్తవానికి బంతి ప్యాడ్లను తాకలేదని క్లియర్గా కనిపిస్తుంది. మ్యాచ్ చూసే చిన్న పిల్లాడిని అడిగినా నాటౌట్ అని చెప్పేస్తాడు. బంతి ఎక్కడ పడిందన్న కనీస పరిజ్ఞానం లేకుండా తమీమ్ ఇక్బాల్ డీఆర్ఎస్ కోరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. ఒక రకంగా ఔట్ కాదని క్లియర్గా తెలుస్తున్నప్పటికి రివ్యూకు వెళ్లి బంగ్లా పరువు తీసుకుంది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. బంగ్లా క్రికెట్ జట్టుపై అభిమానులు ట్రోల్స్, మీమ్స్తో రెచ్చిపోయారు. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూకు కాల్ ఇచ్చిన బంగ్లా జట్టుకు ఏ ప్రైజ్ ఇవ్వాలో కాస్త చెప్పండి''.. ''ఏ కోశానా అది ఔట్ చెప్పండి.. బంగ్లా కెప్టెన్కు కళ్లు మూసుకుపోయినట్లున్నాయి''.. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. జేసన్ రాయ్ (132 పరుగులు) సెంచరీతో కదం తొక్కడంతో పాటు బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్ మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. What prize do Bangladesh get for making the worst LBW review call in the history of cricket? pic.twitter.com/SfJWRdCpXc — Jon Reeve (@jon_reeve) March 3, 2023 Worst DRS review for LBW ever by Bangladesh! #ecb #BANvsENG pic.twitter.com/kBdX5bvPBs — Ralph Rimmer (@razorr69) March 3, 2023 Bangladesh went for a review! 😭 pic.twitter.com/bF8sHDTQ8e — Faiz Fazel (@theFaizFazel) March 3, 2023 చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం; సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
మలాన్ వీరోచిత శతకం.. పసికూనపై అతికష్టం మీద గెలిచిన ఇంగ్లండ్
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ను.. డేవిడ్ మలాన్ (145 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడి గెలిపించాడు. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్.. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు అనుకున్న దశలో మలాన్ తన అనుభవాన్ని అంతా రంగరించి, టెయిలెండర్ల సాకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ (29 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్)ను సమన్వయం చేసుకుంటూ మలాన్ పోరాడిన తీరు అమోఘం. మలాన్- రషీద్ జోడీ ఎనిమిదో వికెట్కు అజేయమైన 51 పరుగులు జోడించి, మరో 8 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో మలాన్, రషీద్ మినహా జేసన్ రాయ్ (4), ఫిలిప్ సాల్ట్ (12), జేమ్స్ విన్స్ (6), జోస్ బట్లర్ (9), క్రిస్ వోక్స్ (7), మొయిన్ అలీ (14), విఫలం కాగా.. విల్ జాక్స్ (26) కాస్త పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహదీ హసన్ మిరాజ్ 2, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (23), షాంటో (58), మహ్మదుల్లా (31) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 3న ఇదే వేదికపై జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
బంగ్లా ప్రీమియర్ లీగ్లో మెరుపులు.. విధ్వంసం సృష్టించిన హోప్, తమీమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్లో భారత్ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్తో జరిగిన మ్యాచ్లో ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (29 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ స్కోర్ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్కు ఊహించని షాక్!
స్వదేశంలో టీమిండియాతో వన్డే సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా భారత్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఈ సిరీస్కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో తమీమ్కు గజ్జ గాయమైంది. అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యలు సూచించారు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్కు తమీమ్ దూరమయ్యాడు. అయితే డిసెంబర్ 14న జరిగే తొలి టెస్టుకు కూడా తమీమ్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. అయితే వన్డే సిరీస్కు తమీమ్ ఇక్బాల్ స్థానంలో ఆ జట్టు వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ ఆల్ హసన్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తొలి వన్డేకు ఆ జట్టు స్టార్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్ కూడా వెన్ను నొప్పితో దూరమయ్యాడు. కాగా తమీమ్,టాస్కిన్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడం కచ్చితంగా బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత్తో వన్డేలకు బంగ్లా జట్టు: లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: ENG Vs PAK: 'యార్..నెంబర్ వన్ బౌలింగ్'.. పాక్ జట్టును ఆడేసుకున్నారు -
భారత్తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్రౌండర్ వచ్చేశాడు
స్వదేశంలో భారత్తో వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ షోరిఫుల్ ఇస్లాంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మొసద్దెక్ హొస్సేన్పై సెలక్టర్లు వేటు వేశారు. గత మరోవైపు జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్కు దూరమైన షకీబ్ ఆల్ హసన్ తిరిగి భారత్ సిరీస్తో జట్టులోకి వచ్చాడు. ఇక హోం సిరీస్లో భాగంగా బంగ్లా జట్టు టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. భారత్తో వన్డేలకు బంగ్లా జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: IND vs NZ 1st ODI:తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్ -
బంగ్లాదేశ్కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం!
జింబాబ్వేతో టీ20 సిరీస్ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా కాపాడకోలేకపోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో జింబాబ్వే కైవసం చేసుకుంది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్రౌండర్ సికందర్ రజా, కెప్టెన్ చక్బావ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా (80), కెప్టెన్ తమీమ్(50), అఫీఫ్ హుస్సేన్(41) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు, మాధేవేరే రెండు, న్యాచి, చివంగా తలా వికెట్ సాధించారు. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రజా, చక్బావ అద్భుతమైన ఇన్నింగ్స్లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్ను జింబాబ్వే వైపు మలుపు తిప్పింది. అనంతరం జింబాబ్వే కెప్టెన్ చక్బావ 75 బంతుల్లో 102 పరుగులు చేసి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఔటైనప్పటికీ రజా(127 బంతుల్లో 117పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జింబాబ్వేకు మరుపురాని విజయాన్ని అందించాడు. రజా, చక్బావ అద్భుమైన ఇన్నింగ్స్ల ఫలితంగా జింబాబ్వే 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా రజాకు ఈ సిరీస్లో ఇదే వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. తొలి వన్డేలో కూడా జింబాబ్వే విజయంలో రజా తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం హరారే వేదికగా జరగనుంది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్కు భారత జట్టు.. అయ్యర్కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన అఖరి వన్డేలో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్ దాటికి 178 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్లలో తైజుల్ 5 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్,ముస్తఫిజుర్ రెహ్మన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ పూరన్ 75 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక 179 పరుగులతో లక్క్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్(50), తమీమ్(34) పరుగులతో రాణించారు. అదే విధంగా విండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక అంతకుముందు టెస్టు,టీ 20 సిరీస్లను విండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Tamim Iqbal: టీ20లకు గుడ్బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్.. -
టీ20లకు గుడ్బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్..
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం (జూలై 16) వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డే అనంతరం తమీమ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా తమీమ్ సారథ్యంలో విండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో విభేదాలు తలేత్తడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి టీ20లకు తమీమ్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20లకు తమీమ్ గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక 2007లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన తమీమ్ 78 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్కు ప్రాతినిథ్యం వహించాడు. 78 మ్యాచ్ల్లో తమీమ్ 24.08 సగటుతో 1758 పరుగులు సాధించాడు. అతడి టీ20 కెరీర్లో 7 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది. చదవండి: SL VS PAK 1st Test Day 1: చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక -
WI Vs Ban: విండీస్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఈ సిరీస్ వాళ్లదే!
WI Vs Ban 2nd ODI: వెస్టిండీస్తో రెండో వన్డేలో బంగ్లాదేశ్తో ఘన విజయం సాధించింది. ఆతిథ్య విండీస్పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 2-0తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్.. వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో టెస్టు, టీ20 సిరీస్లను విండీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రపంచకప్-2023 నేపథ్యంలో సూపర్ లీగ్లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ పర్యాటక బంగ్లా సొంతమైంది. కాగా గయానా వేదికగా బుధవారం(జూలై 13) వెస్టిండీస్- బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే జరిగింది. విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన విండీస్ 108 పరుగులకే కుప్పకూలింది. కీమో పాల్(25- నాటౌట్) మినహా ఎవరూ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. కెప్టెన్ నికోలస్ పూరన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో 35 ఓవర్లలోనే పూరన్ బృందం కథ ముగిసింది. TOSS🪙: Captain @nicholas_47 is second best at toss today. 🇧🇩 have sent West Indies in to 🏏 in this 2nd One-Day International at Providence stadium 🇬🇾. #WIvBAN pic.twitter.com/AyYdD0vxJR — Windies Cricket (@windiescricket) July 13, 2022 బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ 4 వికెట్లు తీయగా.. నాసుమ్ అహ్మద్ 10 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ శుభారంభం అందించాడు. అదరగొట్టిన బంగ్లా కెప్టెన్ అర్ధ శతకంతో రాణించి సత్తా చాటాడు. మరో ఓపెనర్ శాంటో 20 పరుగులు చేసి నిష్క్రమించగా.. లిటన్ దాస్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 20.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన బంగ్లాదేశ్ భారీ విజయం సాధించింది. నాసుమ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. Not the #MenInMaroon day at the office. Well played to 🇧🇩 @BCBtigers #WIvBAN pic.twitter.com/gj6rJ26tM0 — Windies Cricket (@windiescricket) July 13, 2022 చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్కు కోహ్లి దూరం! ఫ్యాన్స్కు గుడ్న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి!
దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణాయక మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా తస్కిన్ అహ్మద్ (5/35) దెబ్బకు 37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జన్నెమాన్ మలన్ 39 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 5 వికెట్లు పడగొట్టగా, షకీబ్ అల్ హసన్ రెండు, మెహాది హాసన్,షారిఫుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87 నాటౌట్; 14 ఫోర్లు) మెరిశాడు. తస్కిన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది -
ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022) ఏ ముహూర్తానా మొదలైందో కానీ.. చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం రసెల్ను విధి ఆడుకున్న తీరు అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయిన ఆండ్రీ రసెల్ మరోసారి బుక్కయ్యాడు. ఈసారి రనౌట్ మాత్రం కాదులెండి..హెలికాప్టర్ రూపంలో రసెల్ను భయపెట్టింది.బీపీఎల్లో భాగంగా చిట్టోగ్రామ్లోని ఎంఏ ఆజీజ్ స్టేడియంలో రసెల్ సహా తమీమ్ ఇక్బాల్, మోర్తజా, మహ్మద్ షెహజాద్లు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చదవండి: Andre Rusell: రసెల్తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం ఇదే సమయంలో స్డేడియంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో రసెల్ సహా మిగిలిన ఆటగాళ్లు ఏం జరిగిందోనని భయపడిపోయారు. విషయం ఏంటని ఆరా తీయగా.. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందు ఎయిర్వేస్ అధికారులు జిల్లా కమిషనర్తో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్తో మాట్లాడారు. వీరి చొరవతో..చట్టోగ్రామ్ స్టేడియం అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయం ఆటగాళ్లకు తెలియక కాస్త కంగారుపడ్డారు. అయితే ఈ విషయాన్ని బీపీఎల్ తన ట్విటర్లో షేర్ చేయగా..''పాపం రసెల్ను నిజంగా ఏదో వెంటాడుతుంది.. మళ్లీ బుక్కైన రసెల్.. బీపీఎల్లో ఈ ఏడాది ఏది కలిసిరావడం లేదు..'' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: BBL 2021-22: రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో ఊచకోత..! Helicopter lands suddenly in Chattogram when Andre Russell, Tamim Iqbal were practicing 😲#BPL2022 #AndreRussell #TamimIqbal #Cricket pic.twitter.com/9TpwavCTQ5 — SportsTiger (@sportstigerapp) February 1, 2022 -
Ban Vs Pak: ఇప్పటికే వైట్వాష్.. బంగ్లాదేశ్కు వరుస షాకులు.. ఈసారి
Ban Vs Pak: Shakib Al Hasan To Miss 1st Test Tamim Iqbal Ruled Out Of NZ Series: పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ సందర్భంగా గాయపడిన స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అతడు మొదటి టెస్టుకు దూరం కానుండగా.. రెండో మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్తో స్వదేశంలో 3-0 తేడాతో వైట్వాష్కు గురై టీ20 సిరీస్ను బంగ్లాదేశ్... పర్యాటక జట్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక నవంబరు 26 నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్లోనైనా సత్తా చాటాలని భావిస్తుండగా.. షకీబ్ వంటి స్టార్ ఆటగాడు దూరం కావడం లోటుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ మిన్హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ... ‘‘తొలి టెస్టులో షకీబ్ ఆడటం లేదు. గాయం(తొడ కండరాల నొప్పి) నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఫిజియోథెరపిస్ట్ రిపోర్టు ఇచ్చిన తర్వాతే... తను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయంపై స్పష్టత ఇవ్వగలము’’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. మరో సీనియర్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ సైతం బొటనవేలి గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఎవరెస్టు ప్రీమియర్ లీగ్(సెప్టెంబరు- అక్టోబరు) సందర్భంగా అతడు గాయపడ్డాడు. ఇక పాకిస్తాన్తో పాటు... న్యూజిలాండ్తో సిరీస్కు సైతం అతడు అందుబాటులో ఉండటం లేదు. ఇక ఇప్పుడు పాక్తో సిరీస్కు షకీబ్ దూరం కావడంతో వరుస షాకులు తగినట్లయింది. పాకిస్తాన్తో తొలి టెస్టుకు బంగ్లాదేశ్ ప్రకటించిన జట్టు ఇదే: మొమినుల్ హక్(కెప్టెన్). షాద్మన్ ఇస్లాం, సైఫ్ హసన, నజ్ముల్ హుసేన్ షాంటో, ముష్పికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, నురుల్ హసన్ సొహాన్, మెహది హసన్ మిరాజ్, నయీం హసన్, తైజుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్ చౌదరి, అబు జాయేద్ చౌదరి రహీ, యాసిర్ అలీ రబ్బీ, మహ్మదుల్ హసన్ జాయ్, రేజూర్ రహమాన రాజా. చదవండి: KL Rahul: కివీస్తో టెస్టుకు ముందు బిగ్షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్ Bangladesh all-rounder Shakib Al Hasan will not be available for the first Test against Pakistan, starting from November 26 at the Zahur Ahmed Chowdhury Stadium in Chattogram due to a hamstring strain #BANvPAK #Cricket — Saj Sadiq (@SajSadiqCricket) November 23, 2021 -
T20 World Cup 2021: స్టార్ ఓపెనర్కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే
ఢాకా: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్ను ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆసీస్, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో పాల్గొన్న ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షీకీబ్ ఆల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్కు మాత్రం మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న తమీమ్ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: BAN Vs NZ: ముస్తాఫిజుర్ స్టన్నింగ్ క్యాచ్.. మోచేతికి దెబ్బ తగిలినా ఇక స్టాండ్ బై ప్లేయర్స్గా రూబెల్ హుస్సెన్, అమినుల్ ఇస్లామ్ బిప్లాబ్లను ఎంపిక చేసింది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ .. తాజాగా కివీస్పై ట20 సిరీస్ను గెలుచుకునే పనిలో ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో ఆధిపత్యంలో ఉన్న బంగ్లా చివరి టీ20ని గెలిచి 4-1తో ముగించాలని భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ సూపర్ 12లో ఎంటర్ కావాలంటే ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. క్వాలిఫయింగ్ దశలో గ్రూఫ్ బిలో ఉన్న బంగ్లాదేశ్తో పాటు స్కాట్లాండ్, పపువా న్యూ జినియా, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూఫ్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. చదవండి: Ishan Kishan T20 World Cup 2021: ఎంపికయ్యానని తెలియగానే ఏడ్చేశాడు టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ టీ 20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్ ఉద్దీన్, షామిమ్ ఉద్దీన్ స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్ Bangladesh have announced their 15-member squad for the ICC Men’s #T20WorldCup 2021! 🚨 All you need to know 👇 — ICC (@ICC) September 9, 2021 -
టి20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ దూరం
ఢాకా: వచ్చే నెలలో ఒమన్, యూఏఈలలో జరిగే టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో తాను పాల్గొనడంలేదని బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా గత ఐదు నెలలుగా తమీమ్ ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా సీరిస్కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మార్గదర్శకాల ప్రకారం, సెప్టెంబర్ 10 లోపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలి. కొన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమీమ్ ఇక్బాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. టి20 ప్రపంచ కప్ జట్టులో నేను ఉండాలని అనుకోవడం లేదని..నా స్థానంలో ఎవరు వచ్చినా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్మన్గా తమీమ్ పేరిట రికార్డు ఉంది. ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్లు ఆడి 1,701 పరుగులు చేశాడు. కాగా బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్లో సూపర్12 కు అర్హత సాధించడానికి గ్రూప్ B లో స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ తో తలపడనుంది. చదవండి: పాల్ స్టిర్లింగ్ మెరుపు సెంచరీ.. ఐర్లాండ్ ఘనవిజయం -
BAN Vs SL: బంగ్లాదేశ్దే వన్డే సిరీస్; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని!
ఢాకా: ముష్ఫికర్ రహీమ్ (125; 10 ఫోర్లు) శతక్కొట్టడంతో వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2–0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 103 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో లంక లక్ష్యాన్ని 40 ఓవర్లలో 245 పరుగులుగా నిర్దేశించారు. అయితే శ్రీలంక 40 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేసి ఓడింది. మెహదీ హసన్, ముస్తఫిజుర్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ నెల 28న ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగుతుంది. ఇక విజయం గురించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ముష్ఫికర్ రహీం మాట్లాడుతూ.. ‘‘నా ఇన్నింగ్స్ తృప్తినిచ్చింది. అయితే, చివరి 11 బంతులు ఆడలేకపోవడం నిరాశ కలిగించింది. మహ్మదుల్లా కూడా గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు అద్భుతంగా రాణించారు. ఇలాంటి పిచ్పై ఆడటం అంత తేలికేమీ కాదు. కాబట్టి నేటి మ్యాచ్తో మా బ్యాట్స్మెన్ మరిన్ని పాఠాలు నేర్చుకున్నారనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. అప్పుడే మరింత సంతోషం: తమీమ్ ఇక్బాల్ అదే విధంగా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘రెండు మ్యాచ్లు గెలవడం అదృష్టంగా భావిస్తున్నాం. అయితే, సిరీస్లో ఇంతవరకు మేం పరిపూర్ణంగా ఆడలేదనే అనుకుంటున్నా. ముషి, మహ్మదుల్లా ఇన్నింగ్స్తో గౌరవప్రదమైన స్కోరు చేశాం. బౌలింగ్, ఫీల్డింగ్ బాగుంది. కానీ అది సరిపోదు. ఇంకా మెరుగుపడాలి. కొన్ని క్యాచ్లు మిస్సయ్యాయి. అవికూడా పట్టి ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని’’ అని పేర్కొన్నాడు. అనుభవలేమి కనబడింది: కుశాల్ పెరీరా ‘‘రెండు మ్యాచ్లలోనూ మాకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా మిడిలార్డర్ కుప్పకూలింది. అనుభవలేమి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. సమీక్ష చేసుకుంటాం. నిర్భయంగా ఆడాల్సిన అవసరం గురించి చర్చిస్తాం’’ అని శ్రీలంక కెప్టెన్ కుశాల్ పెరీరా ఓటమి గురించి స్పందించాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Skipper .@TamimOfficial28 speaks after the 2nd ODI against Sri Lanka.#BCB pic.twitter.com/VRw7V0LqPn — Bangladesh Cricket (@BCBtigers) May 26, 2021 చదవండి: BAN Vs SL:నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్ కాదు.. కానీ! -
BAN Vs SL:నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్ కాదు.. కానీ!
ఢాకా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (84; 4 ఫోర్లు, సిక్స్), మహ్ముదుల్లా (54; 2 ఫోర్లు, సిక్స్), తమీమ్ ఇక్బాల్ (52; 6 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 48.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మిరాజ్ (4/30), ముస్తఫిజుర్ (3/34) లంకను దెబ్బతీశారు. ఇక అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న ముష్ఫికర్ రహీమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ అంత ఈజీ వికెట్ కాదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయాం. అయితే, మేం నిలదొక్కుకున్నాం. తమీమ్, రియాద్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక నా విషయానికి వస్తే.. భారీ షాట్లు ఆడేందుకు నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్ను కాదు. నా బలాలు ఏంటో నాకు తెలుసు. ముఖ్యంగా వికెట్ కాపాడుకుంటూ, పరుగులు రాబట్టాలని ఆలోచించాను. అదే చేశాను. నిజంగా ఇదొక మంచి గేమ్. మిరాజ్, ముస్తఫిజుర్, సైఫుద్దీన్ కూడా రాణించారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అతని శతక దాహం ఇంగ్లండ్ పర్యటనలో తీరుతుంది.. -
ఒక ఫార్మాట్కు గుడ్ బై చెబుతా..కానీ
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఫార్మాట్కు గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా రెండో వన్డేలో 78 పరుగులతో ఆకట్టుకోవడం మినహాయించి మిగతా రెండు వన్డేల్లో విఫలమైన తమీమ్.. పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. రాబోవు టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకునే ఒక ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలని అనుకుంటున్నాడు. క్రిక్బజ్తో శుక్రవారం ముచ్చటించిన తమీమ్.. ప్రధానంగా రెండు ఫార్మాట్లను ఆడాలని విషయం వెల్లడించాడు. ‘ ఏ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాలి అనేది నాకు తెలుసు. నేను ఇంకా మూడు నుంచి నాలుగేళ్లు క్రికెట్ ఆడాలని అనుకున్నట్లయితే మూడు ఫార్మాట్లు ఆడటం సాధ్యం కాదు. అందుచేత ఒకదానికి గుడ్ బై చెప్పాలనే అనుకుంటున్నా. నేను 36, 37 ఏళ్ల వయసులో లేను. ట్వంటీ 20 క్రికెట్ అనేది నా తొలి ప్రాధాన్యత. నా క్రికెట్ కెరీర్కు సాన బెట్టుకోవాలంటే మూడు ఫార్మాట్లలో ఒకదానికి విశ్రాంతి ఇవ్వాల్సిందే. ఏ ఫార్మాట్ను ముందు వదిలేయాలి. దేన్ని తర్వాత వదిలేయాలి అనే విషయంపై నాకు అవగాహన ఉంది. ప్రస్తుతం దాన్ని రివీల్ చేయాలనుకోవడం లేదు’ అని తమీమ్ చెప్పుకొచ్చాడు. తమీమ్ మాటల్నిబట్టి టెస్టు ఫార్మాట్కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్డే, టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్న తమీమ్.. టెస్టు ఫార్మాట్లో ఆ దేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడిన తమీమ్.. టీ20లకు దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో టీ20 ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు. దాంతో మహ్మదుల్లా బంగ్లాదేశ్కు కెప్టెన్గా వ్యహరించాడు. కాగా, తన కెరీర్లో 62 టెస్టుల్లో 4,508 పరుగులు చేసిన తమీమ్.. వన్డేల్లో 213 మ్యాచ్లు ఆడి 7, 452 పరుగులు సాధించాడు. ఇక 78 టీ20లకు గాను 1,758 పరుగులు చేశాడు. ఓవరాల్గా తమీమ్ అంతర్జాతీయ కెరీర్లో 23 సెంచరీలు, 85 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
వైరల్: విచిత్రరీతిలో బ్యాట్స్మన్ రనౌట్
క్రైస్ట్చర్చి: న్యూజిల్యాండ్-బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ ఓ విచిత్రమైన రనౌట్కు బలయ్యాడు. అప్పటికే 78 పరుగులతో ఊపుమీదున్న తమిమ్ అనవసర రన్కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. 31వ ఓవర్ వేస్తున్న కివీస్ ఆల్రౌండర్ నీషమ్ బౌలింగ్లో స్టైకింగ్లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ డిఫెండ్ చేసి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న తమిమ్ కూడా క్రీజు వదిలి ముందుకు పరిగెత్తాడు. ఇంతలో నీషమ్ చాకచక్యంగా బంతిని వికెట్లవైపు తన్నాడు. అది నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్లో వికెట్లను గిరాటేసింది. క్రీజులోకి చేరుకోవడం దేవుడెరుగు.. కనీసం వెనక్కి తిరిగేందుకు కూడా తమిమ్కు అవకాశం లభించలేదు. దీంతో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. తమిమ్ తరువాత మిథున్(72) తప్ప మరో బ్యాట్స్మన్ ఎవరూ చెప్పుకొదగ్గ స్కోరు చేయలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు సాధించింది. అనంతరం న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసి గెలిచింది. చదవండి: Krunal Pandya: కృనాల్ ఖాతాలో పలు రికార్డులు దుమ్మురేపిన షఫాలీ వర్మ.. Neesham through on goal! It's out. @JimmyNeesh with some fine footwork to break the @BCBtigers partnership. 133/3 now in thee 31st over as the players have a drink. Tamim Iqbal out for 78. Follow play LIVE with @sparknzsport #NZvBAN pic.twitter.com/0mmjguWNYd — BLACKCAPS (@BLACKCAPS) March 23, 2021 -
ఆ రికార్డు బంగ్లా క్రికెటర్కే సాధ్యమైంది
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత సాధించాడు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో తమ దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. ఉదాహరణకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.. కానీ టీ20లో మాత్రం అది సాధించలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చూసుకుంటే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత అందుకున్నాడు.చదవండి: అతడితో కలిసి ఆడటం అదృష్టం: విలియమ్సన్ కానీ బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ మాత్రం ఒక దేశం తరపున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో తమీమ్ ఇక్బాల్ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత అందుకున్నాడు. 2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన 31 ఏండ్ల వయసున్న బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 60 టెస్టుల్లో 9 సెంచరీలతో 4,405 పరుగులు, 210 వన్డేల్లో 13 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలతో 7,360 పరుగులు చేశాడు. ఇక 78 టీ20 అంతర్జాతీయ మ్యాచులాడి ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో లో 1,758 పరుగులు చేశాడు. -
ధోని దమ్మున్న సారథి
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దమ్మున్న నాయకుడని దక్షిణాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్ అన్నాడు. అతనో అసాధారణ, ప్రత్యేకమైన నాయకుడని కొనియాడాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని సహచరుడైన డుప్లెసిస్ గురువారం ఫేస్బుక్ లైవ్ చాట్లో బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్తో మాట్లాడుతూ... మహీ నాయకత్వ లక్షణాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని చదవడంలో ధోని దిట్ట. మైదానంలో ఉన్నపళంగా తీసుకునే సరైన నిర్ణయాలే ధోనిని ప్రత్యేకంగా నిలిపాయి. ఆటలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా అతను వెనుకాడడు. ఆ సాహసాలే అతన్ని దమ్మున్న నాయకుడిగా నిలబెట్టాయి. కెప్టెన్ అంటే తరచుగా జట్టు సమావేశాలు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వాలేమో అనుకునేవాడిని. కానీ ధోనిని చూశాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అతని క్రికెట్ బుర్రకు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే’ అని డుప్లెసిస్ వివరించాడు. ఆసీస్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ నిర్వహణపై మాట్లాడుతూ టోర్నీకి ముందు, తర్వాత ఆటగాళ్లను రెండేసి వారాలు ఐసోలేషన్లో ఉంచితే ఈవెంట్కు ఏ ఇబ్బంది ఉండదని సూచించాడు. -
అథ్లెట్లకు అండగా బంగ్లా కెప్టెన్
ఢాకా : కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ అథ్లెట్లకు ఆ దేశ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ అండగా నిలిచాడు. మొత్తం 91 మందికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ తన చారిటీ ద్వారా ఫుట్ బాల్ ఆటగాళ్లు, క్రికెటర్లు, కబడ్డీ, వుషు, హాకీ ఆటగాళ్లు, సైక్లిస్టులు, స్విమ్మర్లు, జిమ్నాస్టులతోపాటూ కోచ్లకు సహాయం అందించనున్నాడు. ‘ఆటలతో నాకు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. కానీ, ఓ ఆటగాడు మిగతా క్రీడాకారులకు కష్టకాలంలో అండగా ఉండటం ఇంత వరకు చూడలేదు. అందరికీ పరిచయం ఉన్న వాళ్లనే కాదు, కష్టాల్లో ఉన్న మామూలు స్థాయి ఆటగాడినైనా ఆదుకోవడానికి తమీమ్ ముందుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలిచాడు’ అని బంగ్లాదేశ్ స్మిమ్మర్ మహఫుజా ఖాతున్ తెలిపారు. -
బంగ్లాదేశ్ క్లీన్స్వీప్
సిల్హెట్: ఇప్పటికే వన్డే సిరీస్ను చేజిక్కించుకున్న బంగ్లాదేశ్ వర్షం అంతరాయం కలిగించిన మూడో వన్డేలోనూ సత్తా చాటింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (109 బంతుల్లో 128 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్లు), లిటన్ దాస్ (143 బంతుల్లో 176; 16 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీలతో చెలరేగడంతో... జింబాబ్వేతో శుక్రవారం జరిగిన చివరి వన్డేలో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 43 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. 33.2 ఓవర్లలో బంగ్లాదేశ్ 182/0తో ఉన్న సమయంలో వాన రావడంతో అంపైర్లు మ్యాచ్ను 43 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు లిటన్ దాస్, తమీమ్ తొలి వికెట్కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించారు. వన్డేల్లో బంగ్లాదేశ్కు ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగ స్వామ్యం. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే లక్ష్యాన్ని 43 ఓవర్లలో 342 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో జింబాబ్వే 37.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓడింది. సికిందర్ రాజా (50 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. మొహమ్మద్ సైఫుద్దీన్ 4 వికెట్లు తీశాడు. -
పరుగుల వరద.. 10 ఏళ్ల రికార్డు ఖతం!
సిల్హెట్ (బంగ్లాదేశ్): సొంతగడ్డపై జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు బెబ్బులిలా గర్జిస్తోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2–0తో గెల్చుకున్న బంగ్లా మూడో మ్యాచ్నూ నెగ్గి వైట్వాష్పై కన్నేసింది. ఈక్రమంలో శుక్రవారం జరుగుతున్న నామమత్రాపు ఆఖరి వన్డేలో బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్ (143 బంతుల్లో 176; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), తమీమ్ ఇక్బాల్ (109 బంతుల్లో 128; 7 ఫోర్లు, 6 సిక్సర్లు, నాటౌట్), సరికొత్త రికార్డును నెలకొల్పారు. టాస్ గెలిచిన జింబాబ్వే ఆతిథ్య జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించగా.. ఈ ఇద్దరూ చెలరేగి ఆడారు. ఈక్రమంలో పదేళ్ల రికార్డును తిరగరాశారు. మూడు వన్డేల సిరీస్లో ఇద్దరు ఆటగాళ్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డును బద్దలు కొట్టారు. తొలి వన్డేలో సెంచరీ చేసిన లిటన్ దాస్, రెండో వన్డేలో సెంచరీ చేసిన తమీమ్ మూడో వన్డేలోనూ అదే పునరావృతం చేశారు. (చదవండి: లిటన్ దాస్ శతకం: బంగ్లాదేశ్ భారీ గెలుపు) 2010లో ఇదే జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా, డివిలియర్స్ తలో రెండు సెంచరీలు చేయగా.. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ ఆ ఫీట్ సాధించారు. ఇక వన్డేల్లో బంగ్లా ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ క్రమంలోనే బంగ్లా ఓపెనర్ల అత్యధిక పార్ట్నర్షిప్ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ ఇన్నింగ్స్లో బంగ్లా జట్టు 43వ ఓవర్ పూర్తయ్యే సరికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 323 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, మరోసారి వర్షం అడ్డుతగలడంతో బంగ్లా ఇన్నింగ్స్ను అక్కడితో నిలిపేసి..జింబాబ్వే లక్ష్యాన్ని 342 పరుగులకు సవరించారు. (చదవండి: నేను వెళ్లనంటే వెళ్లను: ముష్ఫికర్) -
తమీమ్ సెంచరీ: బంగ్లాదేశ్ విజయం
సిల్హెట్ (బంగ్లాదేశ్): చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ నాలుగు పరుగుల ఆధిక్యంతో జింబాబ్వేపై గెలుపొందింది. చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 20 పరుగులు అవసరం కాగా... 15 పరుగులు చేయగలిగింది. టిరిపానో (28 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) 50వ ఓవర్ మూడు, నాలుగు బంతులను సిక్స్లుగా మలచడంతో... జింబాబ్వే విజయం సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులకు మారింది. అయితే ఆ రెండు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించిన జింబాబ్వే సంచలన విజయాన్ని దూరం చేసుకుంది. తొలుత బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (136 బంతుల్లో 158; 20 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ చేశాడు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. సికిందర్ రాజా (66; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మదెవెరె (52; 5 ఫోర్లు), తినాశే (51; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. తాజా విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను బంగ్లాదేశ్ 2–0తో గెల్చుకుంది. -
గురి తప్పకుండా.. బ్యాట్స్మన్కు తగలకుండా
-
గురి తప్పకుండా.. బ్యాట్స్మన్కు తగలకుండా
టాంటాన్: ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత కొట్టిన భారీ షాట్ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ వరల్డ్కప్లో కాట్రెల్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ఇది. కాగా, సోమవారం బంగ్లాదేశ్ మ్యాచ్లో ఒక అద్భుతమైన రనౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ లక్ష్య ఛేదనలో భాగంగా 18 ఓవర్ను కాట్రెల్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి తమీమ్ పరుగు తీయగా, రెండో బంతికి షకీబుల్ హసన్ పరుగు సాధించాడు. ఇక మూడో బంతిని తమీమ్ నేరుగా బౌలర్ ఎండ్వైపు ఆడాడు. అదే సమయంలో కాస్త ముందుకొచ్చి వెనక్కు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతిని అందుకున్న బౌలర్ కాట్రెల్..స్ట్రైకింగ్ ఎండ్లోకి వేగంగా విసిరాడు. ఎంత వేగంగా అంటే, బంతిని అందుకోవడం అంతే కచ్చితత్వంతో వికెట్లను నేలకూల్చడం చేశాడు. బ్యాట్స్మన్ తమీమ్ తేరుకునే లోపే అద్భుతమైన త్రోను విసిరి రనౌట్ చేయడం అభిమానుల్ని ఫుల్ జోష్లో ముంచెత్తింది. ఇక్కడ బంతి గురి తప్పకుండా, బ్యాట్స్మన్కు తగలకుండా విసరడం వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఇది ఈ వరల్డ్కప్ బెస్ట్ మూమెంట్స్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది.(ఇక్కడ చదవండి: భళారే బంగ్లా!) -
కొత్త పేసర్కు స్థానం
ఢాకా: పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్న వేళ వన్డే ప్రపంచకప్లో పాల్గొనే బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును మంగళవారం ప్రకటించారు. గతేడాది ఆసియా కప్ ఆడిన మొసద్దిక్ హుస్సేన్ పునరాగమనం చేయగా... అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేయని యువ పేస్ బౌలర్ అబు జాయెద్ను తొలిసారి ఎంపిక చేశారు. 25 ఏళ్ల అబు ఇప్పటికే ఐదు టెస్టులు ఆడి 11 వికెట్లు... మూడు టి20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పేసర్లు ముస్తఫి జుర్ రెహమాన్, రూబెల్ హుస్సేన్ గాయాల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో అబు జాయె ద్ బ్యాకప్ బౌలర్గా పనికొచ్చే అవకాశముంది. 15 మంది సభ్యులుగల జట్టుకు మష్రఫె మొర్తజా నేతృత్వం వహిస్తాడు. ఈ జట్టులో నలుగురు ఆటగాళ్లు మొర్తజా, తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్లకు మూడు వరల్డ్ కప్లు ఆడిన అనుభవం ఉంది. బంగ్లాదేశ్ జట్టు: మొర్తజా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్లా, షకీబ్ అల్ హసన్, మొహమ్మద్ మిథున్, షబ్బీర్ రెహమాన్, మొసద్దిక్ హుస్సేన్, సైఫుద్దీన్, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహమాన్, అబు జాయెద్. -
న్యూజిలాండ్లో కాల్పులు.. బంగ్లా క్రికెటర్ల ఎస్కేప్!
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్, క్రిస్ట్చర్చ్ సెంట్రల్ సిటీలోని హగ్లీపార్క్ మజీదులో దుండగులు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. హగ్లీపార్క్లో సమీపంలోని రెండు మజీదులపై ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనతో రెండు మజీదులు రక్తసిక్తమయ్యాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు పరుగు పేట్టారని తెలిపింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్ట్చర్చ్ సిటీలోని ప్రజలెవరు బయటకు రావద్దని సూచించారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్కు సమయాత్తం అవుతున్న.. బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బంగ్లాదేశ్ కోచ్ మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్ రహీమ్ ట్వీట్ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని పేర్కొన్నాడు. -
తమీమ్ ఇక్బాల్ సెంచరీ
హామిల్టన్: న్యూజిలాండ్తో ప్రారంభమైన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 234 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (128 బంతుల్లో 126; 21 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు వేగంతో కెరీర్లో తొమ్మిదో శతకం సాధించగా...మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. నీల్ వాగ్నర్ (5/47) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. సౌతీకి 3 వికెట్లు దక్కాయి. ఒక దశలో 121/1 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచిన బంగ్లా ఆ తర్వాత కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్ గురువారం ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. జీత్ రావల్ (51 బ్యాటింగ్), టామ్ లాథమ్ (35 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ మరో 148 పరుగులు వెనుకబడి ఉంది. -
11 సిక్సర్లు, 10 ఫోర్లతో చెలరేగిపోయాడు!
ఢాకా: బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో కొమిల్లా విక్టోరియన్స్కు ప్రాతినిథ్యం వహించిన తమీమ్ ఇక్బాల్.. తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం ఢాకా డైనమేట్స్తో జరిగిన తుది పోరులో ఇక్బాల్ చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 11 సిక్సర్లు, 10 ఫోర్లు సాయంతో అజేయంగా 141 పరుగులు సాధించాడు. దాంతో కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన ఢాకా డైనమేట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన కొమిల్లా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్(6) తొలి వికెట్గా నిష్క్రమించాడు. ఆ తర్వాత అనముల్ హక్తో కలిసి ఇక్బాల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ జోడి రెండో వికెట్ 89 పరుగులు జోడించిన తర్వాత అనముల్(24) ఔటయ్యాడు. ఆపై వెంటనే షమ్సూర్ రెహ్మాన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే ఫుల్ జోష్లో ఉన్న ఇక్బాల్ తన దూకుడుగా మరింత పెంచాడు. క్రీజ్లో పాతుకుపోయి ఆకాశమేహద్దుగా విజృంభించాడు. ఈ క్రమంలోనే 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఆటను కడవరకూ కొనసాగించడంతో కొమిల్లా 200 లక్ష్యాన్ని ఢాకా డైనమేట్స్ ముందుంచింది. లక్ష్య ఛేదనలో ఢాకా పరుగుల ఖాతా తెరవకుండానే సునీల్ నరైన్ వికెట్ను కోల్పోయింది. ఆ దశలో ఉపుల్ తరంగా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు,, 3సిక్సర్లు)-రోనీ తలుక్దర్(66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో ఢాకా విజయం దిశగా పరుగులు తీసింది.కాగా, ఉపుల్ తరంగా రెండో వికెట్గా ఔటైన తర్వాత ఢాకా స్కోరులో వేగం తగ్గింది. రోనికి మిగతా బ్యాట్స్మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో ఢాకా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఫలితంగా కొమిల్లా 17 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను ఎగురేసుకుపోయింది. కొమిల్లా బౌలర్లలోవహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ సైఫుద్దీన్, తిషారా పెరీరాలు తలో రెండు వికెట్లు తీశారు. ఇది కొమిల్లా విక్టోరియన్స్కు రెండో టైటిల్. -
కోహ్లి అసలు మనిషే కాదు: బంగ్లా బ్యాట్స్మన్
ఢాకా: సెంచరీలతో చెలరేగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అసలు మనిషే కాదని బంగ్లాదేశ్ స్టార్ బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్ అభిప్రాయపడ్డాడు. కోహ్లిలో ఏదో శక్తి దాగి ఉందని ఖలీజ్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో కోహ్లి కెరీర్లో 36వ సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ శతకానికి ఫిదా అయిన తమీమ్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. (చదవండి: సెంచరీల సరదాట) ‘కోహ్లి ఆటను చూస్తుంటే నాకు అతను మనిషేనా అనిపిస్తోంది. ప్రతి మ్యాచ్లో సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు. ఆటపట్ల అతనికున్న నిబద్దతను చూస్తుంటే నమ్మబుద్ది కావడం లేదు. మూడు ఫార్మట్లలో అతనే ప్రపంచ నెం1 బ్యాట్స్మన్. కోహ్లి కూడా ఎవరినో ఒకరిని చూస్తూ.. ఆరాదిస్తూ అతని నుంచి ఎదో ఒకటి నేర్చుకొని ఉంటాడు. గత 12 ఏళ్లుగా నేను ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను చూశాను. వారందరిలో ఎవరి ప్రత్యేక వారిదే. కానీ నాకు వారిలో కోహ్లిని డామినేట్ చేసే ఆటగాడు ఒక్కరు కూడా కనిపించలేదు. నిజంగా కోహ్లి ఓ అద్భుతం’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవల జరిగిన ఆసియాకప్లో తమీమ్ తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. (చదవండి: మరో రికార్డుకు చేరువలో కోహ్లి) -
ఒంటిచేత్తో బ్యాటింగ్.. ప్రశంసల వర్షం
దుబాయ్ : ఆసియా కప్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ ముష్ఫికర్ రహీమ్ వీరోచిత సెంచరీతో పాటు మరో ఆటగాడి ఒంటిచేతి పోరాటంను అందరూ అభినందిస్తూన్నారు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లా ఓపెనింగ్ బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్ ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. లంక బౌలర్ లక్మల్ వేసిన రెండో ఓవర్లో ఇక్బాల్ ఎడమ చేతి మణికట్టుకి బంతి బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. దీంతో అతను రెండో ఓవర్లోనే రిటైర్ హర్ట్గా వెనుదిరిగాడు. ఓవైపు ముష్ఫికర్ రహీమ్ పోరాడుతున్నా మరోవైపు నుంచి సహాకారం లేక వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగ్లా తొమ్మిదో టికెట్ను కోల్పోయింది. రిటైర్ హర్ట్గా వెనుదిరిగిన ఇక్బాల్ ఇబ్బందుల్లో ఉన్న జట్టు కోసం గాయంతోనే పదో వికెట్గా క్రీజ్లోకి వచ్చి ఒంటిచేత్తో బ్యాటింగ్ చేశాడు. గాయం కారణంగా బాధపడుతునే ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం కోసం గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఒంటిచేత్తో బ్యాటింగ్ చేయడం గ్రేట్.. నీ ధైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో లంకపై బంగ్లాదేశ్ 137 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా తరువాత జరిగే మ్యాచ్కు తమీమ్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలవాల్సి ఉంది. tamim iqbal batting with one arm, is this even real? massive respect 🙌 #banvsl pic.twitter.com/znsBtpGEF9 — Ali (@AleyFarooqq) September 15, 2018 -
‘అందువల్లే వన్డే సిరీస్ గెలిచాం’
బాసెటెర్: వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ, వన్డే సిరీస్ గెలవడంపై బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఆనందం వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్ అనేది తమ ఆట తీరుకు సరిగ్గా సరిపోతుందని పేర్కొన్న తమీమ్.. విండీస్తో సిరీస్ సాధించడంలో ఓపిక అనేది కీలక పాత్ర పోషించిందన్నాడు. ‘టెస్టు సిరీస్లో మేము గొప్పగా ఆడలేదు.. కానీ మంచి ప్రాక్టీస్ లభించింది. అది వన్డే సిరీస్కు ఎంతగానో ఉపయోగపడిందనే అనుకుంటున్నా. సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడితే పరుగులు సాధించడం కష్టం కాదు. అదే ప్రయోగాన్ని వన్డే సిరీస్లో అవలంభించాం. మా జట్టు మేనేజ్మెంట్ నన్ను సుదీర్ఘమైన బ్యాటింగ్ చేయాలని ఆదేశించింది. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యా. వెస్టిండీస్లో వికెట్పై రాణించడం ఎప్పుడూ సులభం కాదు. ఇక్కడ కావాల్సింది ఓపిక. నేను భారీ పరుగులు చేశానంటే అందుకు కారణం ఓపిగ్గా ఉండటమే. విండీస్తో వన్డే సిరీస్లో ఓపిక అనేది కీలక పాత్ర పోషించదని కచ్చితంగా చెప్పగలను. దాంతోనే మేము చాలా కాలం తర్వాత విండీస్ గడ్డపై సిరీస్ గెలిచాం’ అని తమీమ్ పేర్కొన్నాడు. విండీస్తో సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో బంగ్లాదేశ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తమీమ్ ఇక్బాల్(103) శతకంతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
బంగ్లాదేశ్ క్రికెటర్ ఘనత
ఢాకా: బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్ మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన బంగ్లాదేశ్ తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు. 2007 వన్డే ప్రపంచకప్లో భారత్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఏడాది తర్వాత 2008లో తొలి సెంచరీ సాధించాడు. 11 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తమీమ్ ఇప్పటివరకు 177 మ్యాచ్లు ఆడి 35.65 సగటుతో 6010 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 154. ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 5235 పరుగులతో తమీమ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అక్కడ అతడే టాప్ వన్డేల్లో ఒక వేదికపై అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా తమీమ్ పేరిట ఉంది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో అత్యధిక పరుగులు సాధించాడు. సనత్ జయసూర్య(2514) పేరిట ఉన్న రికార్డును అతడు సవరించాడు. -
కుప్పకూలిన బంగ్లాదేశ్
l రాణించిన తమీమ్ ఇక్బాల్ l స్టార్క్కు నాలుగు వికెట్లు పేసర్ మిషెల్ స్టార్క్ (4/29) డెత్ ఓవర్లలో చేసిన మాయాజాలానికి బంగ్లాదేశ్ కుదేలైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకునే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో చాంపియ¯Œ్స ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలింది. షకీబ్ (48 బంతుల్లో 29; 2 ఫోర్లు), మిరాజ్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. జంపాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన అనంతరం వర్షం ఆటంకంతో మ్యాచ్ ఆగింది. క్రీజులో వార్నర్ (44 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), స్మిత్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) ఉన్నారు. తమీమ్ మినహా... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఒక్కడే ఎదురొడ్డి నిలవగలిగాడు. ప్రత్యర్థి బౌలింగ్ జోరుకు తొలి 22 ఓవర్లలో బంగ్లా ఇన్నింగ్స్లో కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. అటు 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దీనస్థితిలో తమీమ్, షకీబ్ జోడి జట్టుకు ఊపిరిలూదింది. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంతవరకే జట్టు ఆటలో కాస్త మెరుపులు కనిపించాయి. నిలకడగా ఆడుతున్న ఈ భాగస్వామ్యాన్ని 30వ ఓవర్లో ట్రావిస్ హెడ్ విడదీశాడు. ఆ ఓవర్ తొలి రెండు బంతులను తమీమ్ సిక్సర్లుగా మలిచినా ఐదో బంతికి షకీబ్ ఎల్బీగా అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బ్యాట్స్మె¯ŒS ఇలా వచ్చి అలా వెళ్లగా 43వ ఓవర్లో స్టార్క్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. సెంచరీకి అతి చేరువలో ఉన్న తమీమ్తో పాటు.. మోర్తజా (2), రూబెల్లను నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియకు పంపడంతో పాటు తన మరుసటి ఓవర్లో చివరి వికెట్ను కూడా తీయగా బంగ్లా స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్ను ముగించాల్సి వచ్చింది. 183 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు వార్నర్, ఫించ్ (27 బంతుల్లో 19; 3 ఫోర్లు) ధాటిగా ఆరంభించి తొలి వికెట్కు 45 పరుగులు జోడించారు. ఫించ్ అవుటయ్యాక ... వార్నర్, స్మిత్ నిలకడగా లక్ష్యం వైపు సాగుతున్న వేళ 16వ ఓవర్ అనంతరం వర్షం అంతరాయం కలిగించింది. -
తమీమ్ శతక్కొట్టుడు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్నఆరంభపు వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం నమోదు చేశాడు. ఆది నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచిన తమీమ్ శతకంతో మెరిశాడు. అతనికి ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీతో చక్కటి సహకారం అందివ్వడంతో బంగ్లాదేశ్ 39.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ లు ఆరంభించారు. అయితే బంగ్లాదేశ్ స్కోరు 56 పరుగుల వద్ద సౌమ్య సర్కార్(28) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై ఇమ్రూల్ కైస్(19) కూడా నిరాశపరిచాడు. ఆ తరుణంలో ఇక్బాల్ కు జత కలిసిన రహీమ్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించారు. ఆ క్రమంలోనే తమీమ్ ఇక్బాల్ సెంచరీ చేయగా, రహీమ్ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. -
బంగ్లాదేశ్ విజయం
దంబుల్లా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (127; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ (72; 4 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ రహమాన్ (54; 10 ఫోర్లు) రాణించారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 45.1 ఓవర్లలో 234 పరుగుల వద్ద ఆలౌటైంది. మూడు వన్డేల సిరీస్లో బంగ్లాదేశ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఈనెల 28న జరుగుతుంది. -
బంగ్లాకు ‘వంద’నం
తమ 100వ టెస్టులో లంకపై చిరస్మరణీయ విజయం కొలంబో: టెస్టు హోదా పొందినప్పటి నుంచి 99 మ్యాచ్లాడినా... కూనలుగానే ముద్రపడిన బంగ్లాదేశ్ వందో టెస్టులో మాత్రం సమష్టి ఆటతీరుతో చారిత్రక విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. లంక తమ ముందుంచిన 191 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 57.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (82; 7 ఫోర్లు, 1 సిక్స్) చక్కని పోరాటం చేశాడు. షబ్బీర్ (41; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. జట్టు స్కోరు 131 పరుగుల వద్ద లక్ష్యానికి ఇంకా 60 పరుగుల దూరంలో తమీమ్ మూడో వికెట్గా నిష్క్రమించడం, కాసేపటికే షబ్బీర్ కూడా ఔట్ కావడంతో బంగ్లా శిబిరంలో కలవరం మొదలైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్), షకీబుల్ హసన్ (15) కుదురుగా ఆడటంతో బంగ్లా గట్టెక్కింది. లంక బౌలర్లు పెరీరా, హెరాత్లు చెరో 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 268/8తో ఆదివారం చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 319 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి టెస్టులో లంక గెలవడంతో రెండు టెస్టుల ఈ సిరీస్ 1–1తో ముగిసింది. తమీమ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... షకీబుల్ కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. విదేశీ గడ్డపై బంగ్లాకిది నాలుగో విజయంకాగా... శ్రీలంకపై తొలి గెలుపు. ఆస్ట్రేలియా, పాక్, విండీస్ తర్వాత తమ వందో టెస్టులో విజయాన్ని అందుకున్న నాలుగో జట్టు బంగ్లాదేశ్ కావడం విశేషం. -
బంగ్లాదేశ్ 154/3
న్యూజిలాండ్తో తొలి టెస్టు వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో తమీమ్ ఇక్బాల్ (50 బంతుల్లో 56; 11 ఫోర్లు), మోమినుల్ హక్ (110 బంతుల్లో 64 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో పూర్తి ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. దీంతో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి బంగ్లా 40.2 ఓవర్లలో మూడు వికెట్లకు 154 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హక్తో పాటు షకీబ్ (5 బ్యాటింగ్) ఉన్నాడు. తొలి సెషన్ ఆరంభంలోనే వర్షం ఆటంకం కలిగించడంతో ముందుగానే లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ అనంతరం 48 బంతుల్లోనే తమీమ్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ముఖ్యంగా బౌల్ట్ బౌలింగ్లో బౌండరీల వరద పారించాడు. అయితే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో తనే ఎల్బీగా అవుట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. రెండో వికెట్కు తమీమ్, మోమినుల్తో కలిసి 44 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కూడా మరో గంటన్నరపాటు వర్షం కురవడంతో తొలి రెండు సెషన్లలో కేవలం 29 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చివరికి వెలుతురు లేమితో అంపైర్లు ఆటను ముందుగానే ముగించారు. -
న్యూజిలాండ్ క్లీన్స్వీప్
చివరి వన్డేలోనూ బంగ్లాదేశ్ ఓటమి నెల్సన్: బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. ఫామ్లో ఉన్న నీల్ బ్రూమ్ (97 బంతుల్లో 97; 12 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (116 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టడంతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో కివీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో 3–0తో సిరీస్ను దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (88 బంతుల్లో 59; 5 ఫోర్లు), ఇమ్రుల్ కయేస్ (62 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు నురుల్ హసన్ (39 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. హెన్రీ, సాన్ట్నర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కివీస్ 41.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి గెలిచింది. రెండో ఓవర్లోనే లాథమ్ (4) అవుట్ కాగా... మరుసటి ఓవర్లో గప్టిల్ (6) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అయితే విలియమ్సన్, బ్రూమ్ బంగ్లా బౌలర్ల భరతం పట్టారు. ఎనిమిది మంది బౌలర్లు రంగంలోకి దిగినా 32 ఓవర్ల పాటు వీరి సూపర్ షో సాగడంతో మూడో వికెట్కు 179 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే రెండో వన్డేలో శతకం బాదిన బ్రూమ్ ఈ మ్యాచ్లో మూడు పరుగుల తేడాలో సెంచరీని కోల్పోయాడు. ముస్తఫిజుర్కు రెండు వికెట్లు దక్కాయి. ఈ నెల 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. -
తమీమ్ సెంచరీ
బంగ్లాదేశ్ 220 ఆలౌట్ ఇంగ్లండ్ 50/3 ఢాకా: ఇంగ్లండ్, బంగ్లాదేశ్ల మధ్య మొదలైన రెండో టెస్టులో తొలిరోజు ఏకంగా 13 వికెట్లు నేలకూలారుు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 63.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటరుుంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (147 బంతుల్లో 104; 12 ఫోర్లు) అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. మోమినుల్ హక్ (66) రాణించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 170 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితిలో కనిపించింది. అరుుతే స్పిన్నర్ మొరుున్ అలీ (5/57) ధాటికి మిగిలిన బ్యాట్స్మెన్ అంతా క్యూ కట్టడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావలసి వచ్చింది. కేవలం 49 పరుగుల వ్యవధిలో బంగ్లాదేశ్ ఏకంగా 9 వికెట్లు కోల్పోరుుంది. వోక్స్ మూడు, స్టోక్స్ రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఇంగ్లండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 12.3 ఓవర్లలో మూడు వికెట్లకు 50 పరుగులు చేసింది. రూట్ 15, అలీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా సాగలేదు. -
తమీమ్ తడాఖా
ఒమన్పై విజయంతో ప్రధాన టోర్నీకి బంగ్లాదేశ్ ధర్మశాల: తమీమ్ ఇక్బాల్ (63 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో... బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్లో 54 పరుగులు తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతి) ఒమన్పై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించింది. సౌమ్య సర్కార్ (12) విఫలమైనా... తమీమ్ వీరవిహారం చేశాడు. షబ్బీర్ రెహమాన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్కు 9.1 ఓవర్లలో 97; షకీబ్ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్కు 4 ఓవర్లలో అజేయంగా 41 పరుగులు జత చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఇన్నింగ్స్కు ఏడు ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 152 పరుగులుగా సవరించారు. ఆ తర్వాత మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో లక్ష్యాన్ని 12 ఓవర్లలో 120 పరుగులుగా మార్చారు. చివరకు ఒమన్ 12 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు చేసింది. జితేందర్ సింగ్ (25) మినహా మిగతావారు నిరాశపర్చారు. షకీబ్ 4 వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్కు ఊరట మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ 12 పరుగుల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 6 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 6 ఓవర్లలో 5 వికెట్లకు 59 పరుగులు చేసింది. మైబర్గ్ (27), బోరెన్ (14)లు రాణించారు. డాక్రిల్ 3 వికెట్లు తీశారు. తర్వాత ఐర్లాండ్ 6 ఓవర్లలో 7 వికెట్లకు 47 పరుగులు మాత్రమే సాధించింది. స్టిర్లింగ్ (15) టాప్ స్కోరర్. మికెరెన్ 4 వికెట్లు తీశాడు. -
బంగ్లాదేశ్ బోణీ
► క్వాలిఫయింగ్లో నెదర్లాండ్స్పై గెలుపు ► తమీమ్ ఒంటరిపోరాటం ధర్మశాల: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ బోణీ చేసింది. తమీమ్ ఇక్బాల్ (58 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో... బుధవారం జరిగిన మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల స్వల్ప తేడాతో నెదర్లాండ్స్పై గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆరంభంలో డచ్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాకు శుభారంభం దక్కలేదు. ఓ ఎండ్లో తమీమ్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సౌమ్య సర్కార్ (15), షబ్బీర్ (15) కాసేపు పోరాడారు. గుగెటెన్ 3, వాన్ మీకెరెన్ 2 వికెట్లు తీశారు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులకే పరిమితమైంది. బోరెన్ (29), మైబర్గ్ (29), కూపర్ (20) ఓ మాదిరిగా ఆడారు. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో డచ్ ఆటగాళ్లు బుకారి (14), పీటర్ సీలర్ (7 నాటౌట్)లు ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టారు. అయితే తస్కిన్ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు మాత్రమే రావడంతో ఓటమి తప్పలేదు. అల్ అమిన్, షకీబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తమీమ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
తొలి రోజు సఫారీలదే...
తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 246/8 ఢాకా: బంగ్లాదేశ్తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగించింది. డేల్ స్టెయిన్ (3/30)కు తోడు డుమిని (3/27) స్పిన్ మ్యాజిక్తో ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 88.1 ఓవర్లలో 8 వికెట్లకు 246 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి నాసిర్ హుస్సేన్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఓపెనర్లలో తమీమ్ ఇక్బాల్ (6) విఫలమైనా... ఇమ్రూల్ కైస్ (30) మెరుగ్గా ఆడాడు. వన్డౌన్లో మోమినల్ హక్ (40)తో కలిసి రెండో వికెట్కు 69 పరుగులు జోడించాడు. అయితే సఫారీ బౌలర్ల ధాటికి 86 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి బంగ్లాను... ముష్ఫికర్ (65) ఆదుకున్నాడు. మహ్మదుల్లా (35), షకీబ్ (35) రాణించినా... చివరి సెషన్లో స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడటంతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. -
క్రికెటర్ మ్యాచ్ ఫీజులో భారీ కోత
చిట్టగాంగ్ : దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మ్యాచ్ ఫీజులో భారీ కోత పడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను తన భుజంతో గుద్దినందుకు డికాక్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విదించినట్లు ఐసీసీ ప్రకటించింది. చిట్టగాంగ్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో తమీమ్ ను ఢీకొట్టిన కారణంగా అతనికి జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. క్రికెట్ మైదానంలో ఇటువంటి వాటిని తావుండకూడదని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో తమీమ్ 57 పరుగులు చేసి బంగ్లా వికెట్లకు అడ్డుకట్ట వేయడంతో అతనితో డికాక్ గొడవకు దిగాడు. అయితే, ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్లో 2-1 తో బంగ్లా చేతిలో సఫారీలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో ఇదే ఆటగాడిని రోసౌ భుజంతో గుద్దడంతో 50 ఫైన్ జరిమానా విధించారు. తాజాగా అదే బంగ్లా ఆటగాడితో గొడవ పడినందుకు సఫారీల వికెట్ కీపర్కు మ్యాచ్ ఫీజులో భారీగా కోత పడటం గమనార్హం. -
తమీమ్ డబుల్ సెంచరీ
బంగ్లా, పాక్ తొలి టెస్టు డ్రా కుల్నా: రెండో ఇన్నింగ్స్లో అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిన బంగ్లాదేశ్... పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (206; 17 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత డబుల్ సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 136 ఓవర్లలో 6 వికెట్లకు 555 పరుగులు చేసింది. 273/0 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఐదో రోజు ఆట కొనసాగించిన బంగ్లా బ్యాట్స్మెన్ నిలకడగా ఆడారు. తమీమ్, కైస్ (150; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) రికార్డు స్థాయిలో తొలి వికెట్కు 312 పరుగులు జోడించారు. బంగ్లా తరఫున ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. తమీమ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పాక్తో ఆడిన గత ఎనిమిది మ్యాచ్ల్లో ఓడిన బంగ్లా తొలిసారి ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవడం విశేషం. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 6 నుంచి జరుగుతుంది. -
పరుగుల వరద
కుల్నా: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో పరుగుల వరద కొనసాగుతోంది. రెండు టీమ్ లు పరుగుల వేటలో పోటీ పడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో పాక్ భారీ స్కోరు చేయగా, బంగ్లా టీమ్ దీటుగా జవాబిచ్చింది. 537/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాక్ 628 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్(224) డబుల్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కేయస్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 267 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాదేశ్ తరపున ఏ వికెట్ కైనా ఇతే అత్యధిక భాగస్వామ్యం. ఇక్బాల్(183 బంతుల్లో 138; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇమ్రుల్(185 బంతుల్లో 132; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేవు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 332 పరుగులు చేసింది. పాక్ కంటే బంగ్లా ఇంకా 23 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 1233 పరుగులు చేశాయి. ఇందులో ఆరు అర్ధసెంచరీలు, 2 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. మొదటి 4 రోజుల ఆటలో 20 వికెట్లు మాత్రమే పడ్డాయి. -
రాణించిన తమీమ్
ఢాకా: న్యూజిలాండ్తో సోమవారం ప్రారంభమైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. తమీమ్ ఇక్బాల్ (95) అర్ధసెంచరీ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 54.4 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ముష్ఫీకర్ రహీమ్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో... బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో అనాముల్ హక్ (7) తొందరగా విఫలమైనా.. తమీమ్ కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్ను ఆదుకున్నాడు. మార్షల్ అయూబ్ (41)తో కలిసి రెండో వికెట్కు 67; మొమినల్ హక్ (47)తో మూడో వికెట్కు 76 పరుగులు జోడించాడు. 208/3 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న బంగ్లాను చివర్లో కివీస్ బౌలర్లు కట్టడి చేశారు. తమీమ్, షకీబ్ అల్ హసన్ (20)లను వెంటవెంటనే అవుట్ చేయడంతో 228 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది.