Taste
-
కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..
పొద్దుపొద్దునే ముక్కుపుటలను తాకి మేల్కొలిపే కాఫీ వాసనకు ఫిదా కానివాళ్లు ఉండరు. అలాంటి కాఫీల్లో మంచి నాణ్యతను డిసైడ్ చేసే వాళ్లు ఉంటారని, మరిన్ని విబిన్నమైన బ్రూలను తయారు చేస్తారని తెలుసా..?. జస్ట్ కాఫీ గింజలతోనే చేసే కాఫీ కాదు. వాటిని ఉడకించి లేదా రోస్ట్చేస్తే వచ్చే ఫ్లేవర్లలో ఏది ది బెస్ట్ టేస్ట్ అని డిసైడ్ చేసి వాటికి రేటింగ్ ఇచ్చి మార్కెటింగ్ చేస్తాయి కంపెనీలు. అందుకోసం ప్రత్యేక కాఫీ టేస్టర్లను పెడతారు. వాళ్లే మంచి నాణ్యతతో కూడిన కాఫీని రైతులతో తయారు చేయిస్తారు. అలా మనదేశలో తొలి మహిళా కాఫీ టేస్టర్గా పేరుగాంచిన ఆమె ఎవరో తెలుసా..!. ఆమె అక్షరాల అచ్చ తెలుగింటి ఆడపడుచు..!. మరీ ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది? ఎలా అంచెలంచెలుగా ఎదిగింది తదితరాల గురించి చూద్దామా..!.కాఫీ ప్రపంచంలో ది బెస్ట్ కాఫీలను మనకందించేది సునాలిని ఎన్. మీనన్. ఆమె భారతదేశంలోని తొలి మహిళా కాఫీ టేస్టర్. మీనన్ తన నిపుణుల బృందంతో కాఫీ బీన్స్ని అంచనా వేస్తారు. వాటిని ఉడికించడం లేదా రోస్ట్ చేయడం ద్వారా దాని రుచి, రంగుని డిసైడ్ చేసి ఏది బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే కాఫీలను తయారు చేయించేది సునాలినే. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..ఆమె ఫుడ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె డైటీషియన్ కావాలని అనుకుంది. ఆ నేపథ్యంలో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైటెటిక్స్లో డైటెటిక్స్లో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అలా స్కాలర్షిప్ కూడా పొందింది. ఇక యూఎస్ వీసా వచ్చేస్తే వెళ్లిపోవడమే తరువాయి. ఆ తరుణంలో స్థానిక వార్తాపత్రికలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాఫీ టేస్టర్ రిక్రూట్మెంట్ ప్రకటన చూసింది. ఇది కాఫీకి ప్రభుత్వ నోడల్ సంస్థ. ఈ ప్రకటన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే తన మేనమామ టీ ఫ్యాక్టరీలోని ఘటన గుర్తుకొచ్చింది. అక్కడ తన మావయ్య వాళ్ల బృందం టీలని సిప్ చేసి చర్చిస్తున్న విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పడుది టీ రుచి, సూక్ష్మ నైపుణ్యాలు అంచనా వేయడానికి అలా చేస్తున్నారనేది ఆమెకు తెలియదు. వెంటనే ఆ ఆసక్తితోనే ఆ ఉద్యోగ ప్రకటనకు అప్లై చేసింది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. కానీ సునాలిని ఎంపికవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదుగుతూ.. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా బెంగళూరులో ప్రత్యేకంగా కాఫీలాబ్ను స్థాపించే వరకు వెళ్లిపోయింది. ఇది కాఫీ నాణ్యతను నిర్థారించడంలో ఆమె చేసిన అచంచలమైన కృషికి సంకేతం అని చెప్పొచ్చు.సునాలిని తెలుగమ్మాయే..ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కడలూరుకి చెందింది. అది తన అమ్మమ్మగారి ఊరు. మద్రాస్లో పెరగడంతో కాఫీతో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం మద్రాసుని చెన్నైగా పిలుస్తున్నారు. ఇది దక్షిణ భారత ఫిల్టర్ కాఫీకి కేంద్రంగా ఉండేది. అలా సునాలినికి ఇంటి నుంచే కాఫీపై ఆసక్తి ఏర్పడటం జరిగింది. ఇక ఆమె తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ రంగంలో సముచిత స్థానం ఏర్పరుచుకునేలా చాలా కష్టపడింది. పురుషాధిక్య ప్రదేశంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఏ మహిళకైనా చాలా ధైర్యం ఉండాలని అన్నారామె. ఇలా కాఫీ రుచులను చూస్తూ విసుగొచ్చేసిందా అని సునాలిని ప్రశ్నిస్తే..మరింతగా వాటి గురించి తెలుసుకునేలా మక్కువ ఏర్పరచుకున్నానంటోందామె. ఏ రంగంలోనే బాగా రాణించాలంటే విసుగుకి చోటివ్వకూడదని నొక్కి చెబుతోంది. ఆ ఆసక్తి వల్లే తనకు ప్రతిరోజూ విభిన్న కాఫీ రుచలను ఆస్వాదించడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కుంటున్నాని చెబుతోంది. ఇక చివరిగా తనకు ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ అంటే మహా ఇష్టమని అన్నారు. ఏరంగంలోనైనా సవాళ్లు ఉంటాయనేది సహజం, ఐతే దాన్ని ఇష్టంగా మార్చుకుని ఆసక్తి ఏర్పరుచుకుంటే కచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకుంటానేందుకు సునాలిని విజయగాథే నిదర్శనం. (చదవండి: అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..) -
జన్యులోపాల వల్లే కాఫీ చేదు
కాఫీ చుక్క గొంతులోకి దిగనిదే రోజు గడవని వారెందరో! కొందరేమో కాఫీ అంటేనే ముఖం చిట్లిస్తారు. అలాంటి వారికి కాఫీ నచ్చకపోవడానికి ప్రత్యేక కారణమే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల్చిన అరబికా కాఫీ చేదును నిర్ణయించడంలో ఆయా వ్యక్తుల జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కనుగొన్నారు. కాఫీ గింజలను కాల్చడం వల్ల రుచి ప్రభావితం అవుతుందా, లేదా అన్న అంశంపై జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కాల్చి పొడి చేస్తారు. కెఫీన్ సాధారణంగానే చేదుగా ఉన్నప్పటికీ కెఫీన్ తీసేసిన కాఫీ కూడా చేదుగానే ఉంటుంది. అరబికా బీన్స్లో ఉండే ‘మొజాంబియోసైడ్’ అనే పదార్థమే దీనికి కారణం. ఇది కెఫీన్ కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ చేదుంటుంది! కాఫీ తాగినప్పుడు మనుషుల్లో ఉన్న 25 చేదు రుచి గ్రాహకాల్లో రెండింటిని అది యాక్టివేట్ చేస్తుంది. గింజలను కాల్చిన ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఒక్కో దశలో ఒక్కో రుచి కలిగి ఉంటాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ కూడా రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఇలా కాల్చిన కాఫీ పొడి పదకొండు మందిలో ఎనిమిది మందికి చేదుగా అనిపించింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్త లాంగ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ రేంజ్ ధర పలికే ఇడ్లీలా..?
ఇడ్లీ(Idli) అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్ఫాస్ట్గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్ని బట్టి ధరలు కూడా వేరేలెవల్లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా...?. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది. బెంగుళూరు వ్లాగర్(Bengaluru Vlogger) వీధుల్లో ఉండే హోటల్లో(roadside shop) దొరికే రూ. 5ల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్లో దొరికే రూ. 5 వేల రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టేస్ట్ చేశాడు. పైగా వాటికి టేస్ట్కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధులలో అమ్మే రూ. 5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుర్స్ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్(Rameshwaram cafe)లోని రూ. 50ల ఇడ్లీని టేస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఈ ఇడ్లీ టేస్ట్కి ఏడున్నర మార్కులు వేశాడు. తాజ్ హోటల్(Taj Hotel)లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దానిని చక్కగా ప్లేట్లో తీసుకురావడం తోపాటు నైఫ్, ఫోర్క్లు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్కి నాలుగున్నర మార్కులే వేశాడు. ఇక చివరగా ఓ లగ్జరీయస్ ప్యాలెస్లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ. 5వేల రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వెచ్చించినా..కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నావల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్గా రూ. 5 ఇడ్లీనే చాలా టేస్ట్గా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్ని బట్టికాదు..చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిగ్గా రుచి బాగుంటుందని కొందరూ, మరీ రూ. 5 కోట్ల రూపాయల ఇడ్లీని ఎప్పుడూ తింటావ్ అని కామెంట్లు చేస్తూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం..ఆ భారతీయ సంప్రదాయ మొక్క..! ) -
ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..!
ప్రసిద్ధి ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ అల్పాహారం, స్వీట్స్, నాన్వెజ్, వెజిటేరియన్ పరంగా ఏది ఉత్తమమమేనదో దేశాల వారిగా ర్యాంకులు ఇచ్చింది. ఇప్పుడు మంచి టేస్ట్తో కూడిన వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది. ఆయా దేశాల్లో ఉండే విభిన్న వంటకాలు, ఫేమస్ రెస్టారెంట్లు, పానీయాలు, ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. ప్రపంచంలోనే ఉత్తమ వంటకాలను అందించే.. వంద దేశాలో జాబితాలో గ్రీక్, ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ తదితర దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి.ఆ జాబితాలో భారతీయ వంటకాలు 12వ స్థానం దక్కించుకున్నాయి. ఈ ర్యాంకులను అట్లాస్ ఆయా దేశాల్లోని వివిధ వంటకాలు దక్కించుకున్న అత్యధిక స్కౌరు ఆధారంగా ఇచ్చింది. కాగా, టేస్టీ అట్లాస్ మన దేశంలోని బెస్ట్ టేస్టీ వంటకాలుగా..అమృతసరి కుల్చా, బట్టర్ గార్లిక్ నాన్, ముర్గ్ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ తదితరాలను తప్పకుండా తిని చూడాల్సిన వంటకాలుగా పేర్కొంది. దీంతోపాటు మంచి ఆహార వైవిధ్యాన్ని అందించే రెస్టారెంట్లుగా దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ), గ్లెనరీస్ (డార్జిలింగ్), రామ్ ఆశ్రయ (ముంబై), శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై)లుగా తెలిపింది. ఇక టేస్టీ అట్లాస్ ప్రకారం..భారత్లో కొన్ని రకాల వంటకాలు, పానీయాలు అత్యధిక స్కౌరుని దక్కించుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...) -
ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్గా చికెన్ 65..!
ప్రపంచంలోనే బెస్ట్ వంటకాలు, స్వీట్ల జాబితాను విడుదల చేసి వరల్డ్ టేస్ట్ అట్లాస్ తాజాగా బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఫ్రైడ్ చికెన్ని తయారుచేస్తారు. అయితే ఆ జాబితాలో మన భారతీయ వంటకం చికెన్65 టాప్ 10లో చోటు దక్కించుకుంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఈ వంటకం మూడో స్థానంలో నిలిచింది. దీన్ని అల్లం, నిమ్మకాయ, ఎర్రమిరపకాయల కారం, మసాలా దినుసులతో మెరినేట్ చేసి.. డీప్ ఫ్రై చేస్తారు. భారత్లో ఈ రెసిపీ బాగా ఫేమస్.ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన వంటకం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ చికెన్ 65 మూలం తమిళనాడుగా చెబుతుంటారు. అయితే చికెన్ 65 ఇలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం తొలిసారి కాదు. గతేడాది ఆగస్టు 2023లో ఇదే థీమ్పై టేస్ట్ అట్లాస్ జాబితాను విడుదల చేసినప్పుడు చికెన్65 పదో స్థానంలో నిలిచింది. కాగా, టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ప్రస్తుత జాబితాలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ (చికిన్) అగ్రస్థానంలో ఉండగా, జపాన్కు చెందిన కరేజ్ రెండో స్థానంలో ఉంది. గత ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన అయామ్ గోరెంగ్ ఇప్పుడు 5వ స్థానానికి పరిమితమయ్యింది. ఇవేగాక వీటితోపాటు ఈ జాబితాలో చైనీస్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ (జాజీజీ), తైవానీస్ పాప్కార్న్ చికెన్, ఇండోనేషియా అయామ్ పెనియెట్ తదితరాలు టాప్10లో చోటు దక్కించుకున్నాయి.(చదవండి: వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!) -
'ఉమామి దినోత్సవం': ఆరు రుచులు కాకుండా మరో టేస్ట్ గురించి విన్నారా?
దశాబ్దాలుగా మన నాలుకపై ఉండే రుచి మొగ్గలు ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం, తీపి వంటి షడ్రుచులను గుర్తిస్తుందని తెలుసు. అవి కాకుండా ఉన్న మరో ఏడో రుచి గురించి విన్నారా..?. అదే 'ఉమామి' టేస్ట్. దీని కోసం ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ ఈ ఏడో రుచి గురించి చెబుతున్నారు. ప్రతి ఏటా జూలై 25న ఈ ఉమామి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును ఈ టేస్ట్కి సంబంధించిన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఏంటీ ఉమామి..? ఎవరూ కనిపెట్టారు? ఎలా ఉంటుంది ఈ రుచి..? అంటే..'ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్ని ఎలివేట్ చేసేలా రిచ్నెస్, ఫుల్నెస్ కూడిన ఒక విధమైన రుచి. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. రుచి ఎలా ఉంటుందంటే...ఇది ఒక సంక్లిష్టమైన రుచి. ఒక డిష్ మొత్తం రుచిని, గొప్పతనాన్ని తెలియజేసేలా ఉంటుంది. మాంసాహారం, కూరగాయాలు గంటలు తరబడి ఉడకబెట్టిన పులుసులో ఈ రుచి తెలుస్తుంది. అంతేగాదు తల్లి పాలల్లో కూడా ఈ రుచి ఉంటుందట. ఏఏ వంటకాల్లో ఉంటుందంటే..చైనా: పులియబెట్టిన సోయాబీన్ పేస్ట్ (డౌబంజియాంగ్, ఓస్టెర్ సాస్ లెక్కలేనన్ని చైనీస్ వంటకాల్లో ఇది కనిపిస్తుంది. ఉమామి డెప్త్ను జోడిస్తాయి.భారతదేశం: నెయ్యి, స్పష్టమైన వెన్న, భారతీయ కూరలు, పప్పుతో కూడిన రెసిపీల్లో ఇది కనిపిస్తుంది. ఆగ్నేయాసియా: ఫిష్ సాస్, థాయ్ వంటకాలైనా స్టైర్-ఫ్రైస్, సూప్లలో ఈ ఉమామి టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదేనా..?'ఉమామి' మన రుచి మొగ్గలను మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉమామి సంతృప్తతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది కడుపునిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. ఉమామి అధికంగా ఉండే ఆహారాలు గ్లుటామేట్, అమైనో ఆమ్లాల మూలం. కాబట్టి ఇది మెదడు పనితీరు, న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి మంచిది. (చదవండి: పౌల్ట్రీ వ్యర్థాలతో బెడ్షీట్లు,జాకెట్లు,కాగితాలు! సరికొత్త వస్త్ర పరిశ్రమ..) -
స్పేస్లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!
తినడం అనేది దృష్టి, వాసన, రుచి, వినికిడి స్పర్శతో కూడిన బహుళ-ఇంద్రియ అనుభవం. భూమిపై అద్భుతమైన రుచి కలిగిన ఆహారం కక్ష్యలోకి వెళ్లగానే టేస్ట్ మారిపోతుంది. వ్యోమగాములు తినేందుకు చాలా కష్టపడతారు. అక్కడ భోజనం బోరింగ్గా, టేస్ట్ లేకుండా చప్పగా ఉంటుందట. అంతేగాదు తరుచుగా చాలామంది వ్యోమగాములు అంతరిక్షంలో తినే ఆనందం పోతుందని చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి వాసన,ఆహార అనుభవాన్ని అంతరిక్ష ప్రయాణం ఎలా ప్రభావితం చేస్తుందని అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన ఫలితాలు భవిష్యత్తులో స్పేస్ మెనూలను రూపొందించడంలో సహాయపడతాయట. ఇక్కడ శాస్త్రవేత్తలు అంతరిక్ష యాత్రికులు రుచిని భిన్నంగా ఎందుకు అనుభవిస్తారు అనేదానిపై అధ్యయనం చేయగా.. అందుకు కారణం గురత్వాకర్షణ లేకపోవడమని గుర్తించారు. ఇక్కడ గురుత్వాకర్షణ లేకపోవడంతో స్పేస్లో ఉండే వ్యోమగాములు శరీరంలోని ద్రవాలు పాదాల వైపుకి గాకుండా రివర్స్లో తల వైపుకి ఒత్తడిని చూపిస్తాయి. ఫలితంగా ముక్కు మూసుకపోయిన ఫీలింగ్ వస్తుంది. అచ్చం జలుబు చేసినప్పుడు మనం ఎలా అయితే వాసనను కోల్పోతామో అలా ఉంటుంది మన పరిస్థితి. అందులోనూ అంతరిక్షం మన భూమ్మీద ఉండే పర్యావరణం మాదిరిగా ఉండదు, ఆహారం పట్ల అవగాహనను ఇవ్వగలిగేది కూడా కాదు. పైగా స్పేస్క్రాఫ్ట్ పరిమిత పరికరాలతో చుట్టుముట్టబడిన గాలి చొరబడిన కంటైనర్లో తినడం తదితర కారణాల వల్ల రుచిగా ఉండదని అంటున్నారు పరిశోధకులు. చెప్పాలంటే మనం ఇంటి వద్ద ప్రశాంతంగా అమ్మ వడ్డిస్తే హాయిగా తింటున్న దానికి..ఆఫీస్లో డెస్క్ వద్ద హడావిడిగా తిన్న దానికి చాలా తేడా ఉంటుంది. అలానే ఇది కూడా అని వివరించారు పరిశోధకులు. అందుకోసం అని దాదాపు 54 మందికి భూమ్మీదే వీఆర్ సెటప్ ద్వారా అంతరిక్ష అనుభవాన్ని ఇచ్చారు. ఆ స్పేస్ వాతారణంలో వివిధ సువాసనలను ఎలా గుర్తిస్తున్నారనేది గమనించారు. అంతరిక్షం లాంటి వాతావరణంలో నిర్దిష్ట సుగంధ సమ్మేళనాలు మాత్రమే విభిన్నంగా గుర్తించబడతాయని అధ్యయనంలో తేలింది. ప్రతిఒక్కరి అభి రుచులు వేరుగా ఉంటాయి కాబట్టి వారందరి అనుభవాల ద్వారా రుచికరంగా భోజనాన్ని ఎలా అందించాలి, వారిని ఇష్టంగా ఎలా తినమని ప్రొత్సహించచ్చో తెలుస్తుందన్నారు. ఈ అధ్యయన ఫలితాలు భూమిపై నివశించే వ్యక్తులకు, నర్సింగ్ హోమ్లో ఉండేవాళ్లకు, ఆర్మీలో ఉండేవాళ్లకు, జలాంతర్గామి సిబ్బందికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమయ్యింది. (చదవండి: అనంత్ రాధికల పెళ్లిలో సందడి చేసిన లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..) -
మన దేశంలో అత్యంత చెత్త వంటకాలు ఇవే..! అందులో ఉప్మా..!
అంతర్జాతీయ సంస్థ టేస్ట్ అట్లాస్ మన దేశంలో చెత్త వంటకాల జాబితాను విడుదల చేసింది. అలాగే మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారాలు, ఇష్టంలేని ఆహారాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. వాటి గురించి వివరాలు సేకరించి... ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను, ఎక్కువ మంది తినడానికి ఇష్టపడని వంటకాల జాబితాను సిద్ధం చేస్తుంది ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ. టేస్ట్ అట్లాస్ అనేది ఆన్లైన్ ఫుడ్ పోర్టల్. ఇది ప్రపంచంలోని బెస్ట్ వంటకాలు, బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ప్రకటిస్తుంటుంది. అలానే తాజాగా మనదేశంలో ఎక్కువశాతం ప్రజలు ఇష్టపడే వంటకాలు, ఇష్టపడని వంటకాల గురించి టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ పదిలో ఉన్న చెత్త , ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల వివరాలను వెల్లడించింది. చెత్త వంటకాలు ఇవే…టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం చెత్త రేటెడ్ ఫుడ్స్ ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడే జల్జీరా… ఈసారి చెత్త వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర భారతదేశంలో ఈ పానీయాన్ని విపరీతంగా తాగుతారు. అలాంటిది మనదేశంలోని చెత్త వంటకాల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం షాక్కి గురిచేస్తుంది. చెత్త వంటకాల్లో రెండో స్థానంలో శీతాకాలంలో అతిగా తినే గజ్జక్ ఉంది. మూడో స్థానంలో దక్షిణ భారత వంటకం తెంగై సదం, నాలుగో స్థానంలో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ పంతా బాత్, ఐదో స్థానంలో ఆలూ వంకాయ కర్రీ, ఆరో స్థానంలో తండాయ్ ఉన్నాయి. దీని తరువాత, కేరళ వంటకం అచ్చప్పం ఏడవ స్థానంలో, ప్రసిద్ధ హైదరాబాదీ మిర్చి కా సలాన్ ఎనిమిదో స్థానంలో, తీపి వంటకం మల్పువా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో అల్పాహారంలో అధికంగా తినే ఉప్మా పదో స్థానంలో నిలిచింది. ఉప్మాను అధికంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తింటారు.బెస్ట్ ఫుడ్ ఇవే..మనదేశంలో బెస్ట్ ఫుడ్ జాబితాలో ఏ ఆహారాలు నిలిచాయో టేస్ట్ అట్లాస్ వివరించింది. ఆ ఫుడ్ లిస్ట్లో ఉన్న రుచికరమైన మామిడి లస్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మసాలా చాయ్ రెండో స్థానంలో, బటర్ గార్లిక్ నాన్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానంలో అమృత్ సర్ కుల్చా, ఐదో స్థానంలో బటర్ చికెన్, ఆరో స్థానంలో హైదరాబాదీ బిర్యానీ, ఏడో తేదీన షాహి పనీర్, ఎనిమిదో స్థానంలో అందరికీ ఇష్టమైన చోలే భటురే నిలిచాయి. ఆ తర్వాత తందూరీ చికెన్ తొమ్మిదో స్థానంలో, కోర్మా పదో స్థానంలో నిలిచాయి. సాధారణంగా హైదరాబాదీ బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఈసారి బిర్యానీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.టేస్టీ అట్లాస్ నిర్వాహకులు తమ పోర్టల్లో ఎవరికి ఏ ఆహారం అధికంగా నచ్చుతుందో, ఏ ఆహారం నచ్చదో చెప్పమని అడుగుతారు. మనదేశంలోని ఎవరైనా ఆ పోర్టల్ రెస్పాండ్ కావచ్చు. ఈ సర్వేలో పాల్గొన వచ్చు. ఆ విధంగా ఎక్కువ ఓట్లు పడిన వంటకాల జాబితాను సిద్ధం చేసి విడుదల చేస్తారు.(చదవండి: ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ది బెస్ట్ సీఫుడ్ డిష్గా ఈ భారతీయ కర్రీకి చోటు!..ఎన్నో స్థానం అంటే..?
భారతదేశంలోని తీర ప్రాంతాలు సీఫుడ్కి పేరుగాంచినవి. మన దేశంలో సముద్రపు ఆహారానికి సంబంధించిన అనేక ఐకానిక్ కూరలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ వెజ్ కర్రీ, బెస్ట్ స్వీట్స్,బెస్ట్ రెస్టారెంట్స్ వంటి జాబితాను అందించింది.అలానే తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ సీఫుడ్స్ డిష్ల జాబితాను విడుదల చేసింది.భారతదేశంలోని తీరప్రాంతాలు మంచి రుచికరమైన సీఫుడ్లను అందించడంలో అపారమైన పాక నైపుణ్యం కలిగి ఉంది. ఇవి ఎల్లప్పుడు ది బెస్ట్ సముద్రపు ఆహార వంటకాలుగా నిలుస్తాయి. పైగా ప్రజల మనసును కూడా దోచుకుంటాయి. అయితే టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ది బెస్ట్ సీ ఫుడ్ జాబితాలో మన భారతీయ సీఫుడ్ కర్రీకి స్థానం దక్కడం విశేషం. జూలై 2024న విడుదల చేసిన ర్యాంకింగ్లలో మన భారతదేశంలోని బెంగాలీ రుచికరమైన వంటకం చింగ్రి మలై కర్రీ 31వ స్థానంలో నిలిచింది. ఇది మంచి ఘుమఘమలాడే రొయ్యల కర్రీ. దీన్ని కొబ్బరిపాలు, రొయ్యలు, గరం మాసాలాలు, ఆవాల నూనెతో తయారు చేస్తారు. దీని తయారీలో వేడి మిరపకాయలు, వెల్లుల్లి వేయించాలి, అల్లం పేస్టు, దాల్చిన చెక్కె, చక్కెర, ఏలుకులు చేర్చి.. చిక్కటి గ్రేవితో సర్వ్ చేశారు. ఇది దశల వారీగా ఓపికతో తయారు చేయాల్సిన రుచికరమైన వంటకం. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?) -
కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?
చక్కగా కూర్చొని ఆహారం తింటుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడూ ఈ ఉరుకులు పరుగులు జీవన విధానంలో చాలామంది నిలబడి గబగబ తినేసి భోజనం కానిచ్చాం అన్నట్లుగా తింటున్నారు. అంతెందుకు పెళ్లిళ్లలో కూడా బఫే పేరుతో నిలబడి తినడమే. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే తీరు. ఇంతకీ ఇలా తినడం మంచిదేనా? అంటే..ముమ్మాటికి కాదనే చెబుతున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.నిలబడి తింటే..నిలబడి తినడం వల్ల వేగంగా జీర్ణమయ్యి, కొవ్వు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇది ఒక్కోసారి పొట్ట ఉబ్బరాన్ని కలిగించి ఆకలిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఇటీవల చాలామంది టైం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో నిలబడి ఏదో కానిచ్చాం అన్నట్లు భోజనం చేస్తుంటారు. ఇది జీర్ణక్రియకు హానికరం అని, అతిగా తినేందుకు దారితీస్తుందని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. గురత్వాకర్షణ కారణం కడుపులోని ఆహరం వేగంగా ప్రేగుల్లో కదులి, త్వరగా జీర్ణమయ్యిపోతుంది. ఫలితంగా అతి ఆకలికి దారితీస్తుందని తెలిపారు.చాలామంది నిలబడి తినడం వల్ల బరువు తగొచ్చని భావిస్తుంటారు. కానీ దీని వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరానికి అవసరమయ్యే కొవ్వుల, నష్టం, పోషకాల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా నిలబడి తింటే ఆహారం టేస్టీగా అనిపించదట. అదీగాక వాళ్లు కూడా ఆటోమేటిగ్గా రచి తక్కువ ఉన్న ఆహారపదార్థాలను ఇష్టపడతారని చెబుతున్నారు. ఎందుకంటే నిలబడి తింటున్నప్పుడూ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు 30 మంది వ్యక్తులను తీసుకుని అధ్యయనం చేయగా నిలబడి తిన్న వాళ్లలో బరువు కోల్పోడమే గాక టేస్టీగా ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్ని గుర్తించామని చెప్పారు. కూర్చొని తినడం..మీరు తినేటప్పుడు అనుసరించే భంగిమ మీ ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి కూర్చొన్నప్పుడు కడుపులోని ఆహారం నెమ్మదిగా ఖాళీ అవుతుందని అన్నారు. నిలబడి భోజనం చేసిన దానికంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని అన్నారు. అలాగే శరీరం ప్రోటీన్లు గ్రహించేలా మంచిగా జీర్ణం అవుతుంది. అంతేగాక రక్తానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాల లభ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక కూర్చొని తినడం వల్ల టేస్టీగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. పైగా నిలబడి తిన్నప్పటి కంటే కూర్చొని భోజనం చేసినప్పుడూ ఆహారం టేస్టీగా అనిపిస్తుందట కూడా. తక్కువ ఆకలి ఉంటుంది. నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు పరిశోధుకులు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందిలో.. కూర్చొన తిన్న వారిలో జీర్ణ సంబధ సమస్యలు లేకపోవడమే గాక బరువు అదుపులో ఉన్నట్లు తెలిపారు. పైగా నిలబడిన వారితో పోలిస్తే టేస్టీగా ఉండే భోజనాన్నే ఇష్టపడినట్లు గుర్తించామని అన్నారు. ఏదీ బెటర్ అంటే..కూర్చొని తినే భంగిమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కూర్చొవడం అంటే..డైనింగ్ టేబుల్స్ మీద కాదు. నేల మీద నిటారుగా కూర్చొని భోజనం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గూని లేకుండా నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపులోంచి ఆహరం ప్రేగుల్లోకి నెట్టడానికి అనుమతిస్తుంది. అలాగే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నిజానికి ఇది భారతీయ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న భోజన సాంప్రదాయం కూడా ఇదే.ఇక నిలబడినప్పుడు త్వరితగతిన ఆహారం విచ్ఛిన్న అయ్యి కాలక్రమేణ కొవ్వులు నష్టానికి దారితీస్తుందని పరిశోధనలో తేలిందన్నారు పరిశోధకులు. అలాగే టేస్టీగా తినాలనుకుంటే కూర్చొని హాయిగా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిదని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్లో ప్రచురితమయ్యింది.(చదవండి: నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే "నో రా డైట్" అంటే..!) -
మినిమం 30.. తగ్గేదేలే..! ఇది కదా పానీ పూరీ మజా....వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత ఇష్టమైన,అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పానీ పూరీ. ఖట్టా-మీఠా ఇలా వివిధ రకాల రుచులు, స్టఫ్ఫింగ్స్తో .. అసలు ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్ చాలామందికి. అలాంటి పానీ పూరీ తాజాగా, అమెరికావాసులను కూడా ఫిదా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Curry Corner (@currycornermn) మిన్నియాపాలిస్ వాసులు అక్కడి భారతీయ రెస్టారెంట్ , కర్రీ కార్నర్ వద్ద పానీ పూరీ తెగ లాగించేస్తూ మురిసిపోతున్నారు. ‘ఆహా తినరా మై మైరచి అంటున్నారు. మరికొందరైతే మాటల్లేవు.. అంటూ పానీ పూరీని ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. పానీపూరి ప్యూర్ లవ్ అని అని ఒక ఇన్స్టా యూజర్ కామెంట్ చేశాడు. మినిమం 30 పూరీలు ఏగబిగిన లాగించేయాల్సిందే.. 20కి పైగా పానీ పూరీలు తింటూ ఉంటే.. అలా కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోతే ఉంటే అప్పుడు గానీ పానీ పూరీ తినడంలోని మజా అర్థం కాదు.. ఇలా పలు కామెంట్లు సందడి చేస్తున్నాయి. పాపులర్ పానీ పూరీని మిన్నియాపాలిస్ వాసులకు పరిచయం చేశాము అంటూ సదరు రెస్టారెంట్ ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్ చేసిన ఈ రీల్ ఏకంగా 3.9 మిలియన్ల వీక్షణలు, 90వేలకు పైగా లైక్స్ సాధించింది. -
బెస్ట్ శాండ్విచ్గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్కి చోటు!
ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్విచ్గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్కి చోటు దక్కింది. టాప్ 20 బెస్ట్ శాండ్విచ్లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడ పావ్క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రకారం..ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్ రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన ఆశోక్ వైద్య అనే వీధి వ్యాపారీ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట. అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: మన దేశంలోని టాప్ మహిళా చెఫ్లు వీరే!) -
పెరిగే వయసుతో... నచ్చే రుచుల మార్పు
రుచి కేవలం నాలుక మీద మాత్రమే తెలుస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఒక రకం తిండి మనకు ఇష్టమా లేదా అని తెలియడానికి నాలుక ఒక్కటే ఆధారం కాదు. ఉదాహరణకు మనం ఏదో ఒక పండును కొరుకుతాము. ఒక్కసారిగా మెదడుకు రకరకాల నాడీ రసాయన స్పందనలు అందుతాయి. వాటి కారణంగా ఆ పండును మరొక సారి మనం కొరుకుతామా లేదా అన్నది నిర్ణయం అవుతుంది. నాలుక మీద ఉండే రుచిని గుర్తించే కణాలను ‘టేస్ట్ బడ్స్’ అంటారు. అంగిలి అంటే నోటిలో పైభాగం, గొంతు లోపలి పక్క, ఇంకొంచెం కిందకు ఉండే ఈసోఫేగస్ లాంటివన్నీ తిండి గురించిన సమాచారాన్ని మెదడుకు చకచకా పంపిస్తాయి. దానితో నోటిలోకి అందిన తిండి రుచి తెలుస్తుంది. మనకు కలకాలంగా ఆరు రుచులు అన్న సంగతి గురించి చెబుతున్నారు. శాస్త్రజ్ఞులు ఇంకొక పక్కన ఉన్నది ఐదు రుచులు మాత్రమే అంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదులతోపాటు ఉమామి అనే ఒక కొత్త రుచిని కూడా ఈ మధ్యన చెబుతున్నారు. మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రుచులు తెలుసుకొని ఇష్టపడే లక్షణాలు మారుతూ ఉంటాయట. ‘రుచులు తెలిసేది మెదడు కారణంగానే! ఈ మెదడు మొండిగా ఉండదు. మారుతూ ఉంటుంది. కనుకనే వయస్సుతో పాటు రుచి, వాసనలను గ్రహించే తీరు మారుతూ పోతుంది’ అంటున్నారు ఫిలడెల్ఫియా పరిశోధకురాలు జూలీ మెనెల్లా. ముఖ్యంగా బాల్యంలో అంటే మరీ చిన్న వయసులో రుచులను ఇష్టపడడంలో చాలా మార్పులు వస్తాయి అంటారావిడ. మరీ చిన్న వయసులో రుచి గురించిన తీరు చాలా వేరుగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది అని ఆమె వివరించారు. తీపి, ఉప్పు రుచిగల తిండి పదార్థాలను ఇష్టపడడం అన్నది బాల్యంలో మెదడులో గట్టిగా పాతుకుపోయి ఉంటుంది. మానవ పరిణామం దృష్ట్యా చూస్తే తీపి అన్నది ఎక్కువ శక్తి గల ఆహార పదార్థాలతో సంబంధం కలిగిన విషయం. ఇక శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజలవణాలు ఉప్పగా ఉండే తిండితో అందు తాయి. చిన్న వయసులో ఉన్న వారికి శరీరం పెరుగుదల కారణంగా చాలా శక్తి అవసరం ఉంటుంది అన్నది తెలుసు. ‘అందుకే ఆ వయసులో ఎక్కువ శక్తిని అందించగల తీయని పదార్థాల వైపు దృష్టి ఉంటుంది. ఈ లక్షణం శరీరంలోనే సహజంగా ఉంటుంది. శరీరానికి శక్తి ఆ రకంగా అందుతుంది’ అంటారు మెనెల్లా. ఇక చేదు రుచి గురించి చూస్తే, చేదు రుచి మనకు ఇష్టం లేని పదార్థాలతో గట్టిగా ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ వాటిని తిన్నందువల్ల నష్టం జరగదు, మంచి జరగవచ్చు అని అర్థమైతే అప్పుడు వాటిని అంగీకరించే మానసిక పరిస్థితి వస్తుంది. బిడ్డలు తల్లి కడుపులో ఉండగానే ఆహార పదార్థాల రుచి అలవాటు అవుతుంది అని గమనించారు. గర్భంతో ఉన్న స్త్రీలకు చేదు రుచి పట్ల ఏవగింపు ఉంటుంది. తల్లి తీసుకుంటున్న ఆహారం ప్రభావం కడుపులోని బిడ్డ మీద కూడా పడుతుంది. తల్లి ఏదో మందు మింగితే కడుపులోని పాప ముఖం ముడుచుకుంటున్నట్టు అల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపించింది. బాల్యం, యవ్వనం గడుస్తున్న కొద్దీ ఆ మేర రుచులకు స్పందించడం తగ్గుతుంది. చేదును అంగీకరించడం మొదలైన కొద్దీ, తీపి, ఉప్పుల మీద కొంత ఆసక్తి తగ్గినా తగ్గవచ్చు. కనుకనే యుక్త వయసు దాటిన తరువాత తిండి విషయంగా అంతగా పట్టింపు ఉండకపోవచ్చు. అప్పుడిక అంతకు ముందు ఏవగించు కున్న తిండి పదార్థాలను కూడా తినే పద్ధతి మొదలవుతుంది. 50వ పడిలో పడిన తరువాత నాలుక మీద అంతవరకు ఉన్న పదివేల రుచి కణాల సంఖ్య రాను రాను తగ్గుతుంది. అవి మళ్లీ తిరిగి పెరగవు. అంతకు ముందు మాత్రం అవి పది రోజులకు ఒకసారి సమసిపోయి తిరిగి పుడుతుంటాయి. పాడయిన కణాల స్థానంలో కొత్తవి రాకపోవడంతో రుచి తెలియడం తగ్గుతుంది. వాసన విషయంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మార్పులు అంతగా గుర్తించగలిగే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏదో ఒక్క రుచీ, ఒక్క వాసనకే పరిమితం కాకపోవచ్చు. అంటే అన్ని వాసనలూ తెలియకుండా పోయే పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రకాలు, ఉదాహరణకు మల్లెల వాసన తెలియకపోవచ్చు, ఉల్లివాసన మాత్రం బాగా తెలియ వచ్చు. రుచులు తెలియకుండా పోవడానికి వయసు ఒకటే కారణం కాదు. రక్తపు పోటును తగ్గించడానికి వాడే కొన్ని మందులు కూడా ఈ రకం ప్రభావాన్ని చూపిస్తాయి. శ్వాస మండలంలోని పైభాగంలో వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు ఇచ్చే మందులు కూడా రుచి, వాసనలు తెలియకుండా చేస్తాయి. ఈ విషయం కోవిడ్ వల్ల తెలిసింది. అసలు కోవిడ్ గురించి మొదటి సూచన లుగా ఈ లక్షణాలను ఎంచుకున్నారు. ప్రభావం తగ్గిన తర్వాత చాలామందికి రుచి, వాసనలు తెలియడం తిరిగి మొదలయింది. కొందరికి మాత్రం ఆ రకంగా జరగలేదు. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత ‘ 98490 62055 -
కచోరీ, జిలేబీ సూపర్: జపాన్ రాయబారి!
భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో దీనికి సంబంధించిన రెండు క్లిప్లను షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది. జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు. Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023 -
Coffee : షేక్పేటలో కాఫీ కొత్త రుచులు
బెంగెట్, బెర్గెండాల్, బెర్నార్డినా, బ్లూమౌంటెన్, బోర్బన్.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు కాఫీల్లో. కతుర్రా, ఛారియర్, హరార్, ఫ్రెంచ్ మిషన్ ఇలా ఒక్కో దేశంలో కాఫీది ఒక్కో రుచి. కోన, జావా అంటూ దీవుల్లో, మోచా, పాకాస్ అంటూ లాటిన్ అమెరికాల్లో, సగడ, శాంటోస్ పేరిట దక్షిణాది దేశాల్లో.. ఇలా కాఫీ అంటే ప్రాణం ఇచ్చేవారు లోకమంతా కనిపిస్తారు. కాఫీ రుచులు, ఐస్ క్రీం టేస్టులు అందించే లా రొసెట్టా, సౌత్ పోల్ షాపులను షేక్పేట, ఓయూ కాలనీలో ప్రారంభించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నాణ్యత, ప్రామాణికాలే వ్యాపారాభివృద్ధికి దోహదపడతాయన్నారు. నాణ్యత ప్రమాణాలు కలిగి రుచికరమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించగలిగితే వ్యాపారం అంచలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని సూచించారు. కల్తీలేని ఆహార పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్న చోటుకు వినియోగదారులు వెతుక్కుంటూ రావడానికి ఇష్టపడతారన్నారు. పిల్లలకు యువతకు ఇష్టకరమైన అన్ని ఐటమ్స్ ఉంచగలిగితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ఛైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. బి.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, నేపథ్య గాయకుడు, సంభాషణల రచయిత రాకేందు మౌళి వెన్నెలకంటి, శ్యామ, శ్రీనివాసరావు, ప్రశాంతి, శ్యామ్ సుందర్, శిరీష, రవికాంత్ , శ్రీకాంత్ మరియు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరిక్షం రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా?
భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ.. గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 2003లో పెర్సెయస్ గెలాక్సీ క్లస్టర్ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్ హోల్) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. గ్రహాల ‘పాటలు’ ఇవి నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్రోవర్ మార్స్పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వనిఅతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. విజిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్ వాక్ చేస్తుంటారు. అలా స్పేస్ వాక్ చేసి, తిరిగి ఐఎస్ఎస్లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్ఎస్లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. ‘టచ్’లో మార్పు లేదట! అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్ఫీల్డ్ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. రకరకాల రుచుల్లో నక్షత్రాలు సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు. కళ్లు ‘ఫ్లాట్’ అవుతాయట! అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ (సాన్స్)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్ డిస్క్లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును! -
క్యాండీస్ తినటమే పని.. జీతం రూ.61 లక్షలు!
ఒట్టావా: ఒళ్లు వంచి రోజంతా కష్టపడినా జీతం అంతంతమాత్రమేనని చాలా మంది బాధపడుతుంటారు. అయితే.. తినటమే పనిగా ఉంటే.. దానికి లక్షల్లో జీతం వస్తే.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదా? అవునండీ.. అలాంటి ఉద్యోగాలూ ఉన్నాయి. ఓ ఛాక్లెట్ల తయారీ సంస్థ ‘చీఫ్ క్యాండీ టేస్టర్’ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాండీలు(మిఠాయిలు, ఛాక్లెట్లు) తినటమే ఆ ఉద్యోగం. జీతం కూడా భారీగానే ఇస్తోంది. ఏడాదికి రూ.61 లక్షలు మరి. క్యాండీలు అంటే ఇష్టపడే వారు వెంటనే ఈ ఆఫర్ను ఒడిసిపట్టండి మరి. కెనడాకు చెందిన క్యాండీ ఫన్హౌస్ అనే ఆన్లైన్ రిటైలర్ సంస్థ ఛాక్లెట్స్ నుంచి వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తోంది. చీఫ్ క్యాండీ ఆఫీసర్ను నియమించుకోవాలని భావిస్తోంది. అందుకు 1,00,000 కెనెడియన్ డాలర్లు(సుమారు రూ.61.14 లక్షలు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను గత జులైలో లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది సంస్థ. తల్లిదండ్రుల అనుమతితో 5 సంవత్సరాల వయసు పైబడిన వారంతా ఈ ఉద్యోగానికి పోటీ పడొచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. భారీస్థాయిలో దరఖాస్తులు వస్తాయని తాము ఊహించలేదని సీఈఓ జమిల్ హెజాజి పేర్కొన్నారు. ఒక చీఫ్ క్యాండీ ఆఫీసర్గా నెలకి 3,500 పీసులు తినాలి. రోజుకు 117 అన్న మాట. అయితే.. అవి చాలా ఎక్కువని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ ఉద్యోగానికి పెద్ద వారితో పాటు చిన్న పిల్లలు సైతం దరఖాస్తులు పంపించారు. తమ పిల్లలు దరఖాస్తు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తల్లిదండ్రులు. Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists. Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6 — Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022 ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
వైరల్ వీడియో.. ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు..
కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు. అయితే, ఒకసారి ఒకదాన్నే రుచి చూసి చెప్పగలరు. అదేంటి ఎవరైనా ఒకసారి ఒకదాన్నే రుచి చూడగలరు అంటారా? కానీ బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు. ఆమె నాలుక అలాంటిది మరి! అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్.. అదేనండి శరీరంలో మార్పులు చేసుకోవడమంటే మహా సరదా. సర్జరీ ద్వారా ఆమె తన నాలుకను రెండుగా స్ప్లిట్ చేయించుకుంది. ఇటీవల ఆమె ఒక గ్లాస్లో స్ప్రైట్ కూల్డ్రింక్, మరోగ్లాస్లో మంచినీళ్లు పెట్టుకుని రెండింటిని ఒకేసారి తాగి తన స్ప్లిట్ నాలుకతో రెండింటి రుచులు చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా పిచ్చపిచ్చగా లైక్స్ వచ్చాయి. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 2,28,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఈ స్ప్లిట్ టంగ్ అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. చదవండి: చేనులో చేపలే పంట! View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) -
ష్యాషన్ కోసం నాలుకను రెండుగా విడగొట్టింది...ఆ తర్వాత
Woman With Split Tongue Tastes 2 Drinks At: చాలామంది యువత ఫ్యాషన్ మాయలో పడి విచిత్రమైన విధంగా తమ శరీరం సౌష్టవాన్ని మార్చుకుంటుంటారు. అంతేందుకు కొంతమంది మగవాళ్లు చెవులకు రింగులు పెట్టుకోవడాలు, టాటులు వేయించుకోవడం వంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు చెవులకు రింగులు కుట్టించుకుంటే వీళ్లు నాలుకకి, నోటికి రింగులు పెట్టుకుంటున్నారు. పైగా జుట్టుకు కూడా విచిత్రమైన రంగురంగుల డైలు వేసుకుని దెయ్యాన్ని తలపించేలా రెడీ అవుతున్నారు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక ఆమె ఫ్యాషన్ కోసమో లేక మరేందుకో గానీ నాలుకను రెండుగా విడగొట్టుకుంది. పైగా ఇప్పుడు తాను ఒకేసారి రెండు రకాల పదార్థాలను టేస్ట్ చేయగలనని మరీ చెబుతోంది. వివరాల్లోకెళ్తే.... కాలిఫోర్నియాలో నివసిస్తున్న బ్రియానా మేరీ షిహదేహ్ ఆమె తన శరీరాన్ని రకరకాలు మార్చుకోవడం ఆమెకు ఇష్టం. ఈ మక్కువతోనే తన నాలుకను శస్త్ర చికిత్స ద్వారా రెండుగా విడదీసింది. అంతేగాదు మీరెప్పుడైన రెండు రకాల ఆహార పదార్ధాలను ఒకేసారి టెస్ట్ చేయగలిగారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఆమె రెండు రకాల ఆహార పదర్థాలను ఎలా టేస్ట్ చేయగలదో కూడా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) (చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు...) -
ఎంతెంత మెంతి.. అంతంత రుచి
మెంతి ఆకులు, గింజలు వంటింటి నేస్తాలని మనకు తెలిసిందే! కుండీల్లో పెరిగే ఆకులు కూరకు రుచినిస్తాయి. జీలకర్రతో దోస్తీ చేసే మెంతులు. ఘుమఘుమలతో మదిని దోచేస్తాయి. ఆరోగ్యప్రదాయినిగా పేరొందిన మెంతి. వేపుడుకైనా, గ్రేవీకైనా రెడీ అంటూ ముందుంటుంది. వెజ్, నాన్వెజ్ వంటకాలకు ఇంత అనేది లేకుండా ఎంతెంత మెంతి వేస్తే అంతంత రుచిని జత చేరుస్తుంది. ఖీమా సోయా మెంతి కావలసినవి: నూనె – పావు కప్పు; ఉల్లిపాయ – 2 (మీడియం సైజువి); అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్లు; ఖీమా– పావు కేజీ; జీలకర్ర – టీ స్పూన్ (వేయించి, పొడి చేయాలి); ఎర్ర మిరపకాయలు – 2; పసుపు పొడి – పావు టీస్పూన్; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – 8–10; యాలకులు – 2; లవంగాలు – 4; సోంపు – అర టీ స్పూన్; టమోటా – 1 (సన్నగా తరగాలి); నీళ్లు – కప్పు; మెంతి ఆకులు – అర కప్పు; సోయా – పావు కప్పు; జావత్రి, జాజికాయ పొడులు – చిటికెడు; పచ్చిమిర్చి – 3; కొత్తిమీర – తగినంత. తయారీ: ∙బాణలిలో నూనె, ఉల్లిపాయ తరుగు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ∙అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ∙పచ్చిమిర్చి వేగాక, ఖీమా వేసి, రంగు మారే వరకు బాగా వేయించాలి. 8–10 నిమిషాలు లేదా నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ∙నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు, సోంపు వేసి కలపాలి. ∙టొమాటోలు వేసి 2–3 నిమిషాలు ఉడికించాలి. ∙టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలపాలి. దీంట్లో సోయా వేసి, మూత పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. ∙మెంతి ఆకులు, మెంతులు వేసి బాగా కలపాలి. ∙నూనె విడిపోయే వరకు మూతపెట్టి, తక్కువ మంటపై ఉడికించాలి. ∙జాపత్రి, జాజికాయ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ∙కొత్తిమీర తరుగు వేసి, మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచి, తర్వాత సర్వ్ చేయాలి. మెంతి ఫిష్ కర్రీ కావలసినవి: చేప ముక్కలు – 4; తాజా మెంతి ఆకులు – 4 కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు – అర కప్పు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పెద్ద టమోటా – 1 (సన్నగా తరగాలి); కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – అర టీ స్పూన్. తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పురాసి, రుద్ది, పక్కన పెట్టి, ఓ ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, మెంతులు వేసి ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అప్పుడు నూనె నుండి గింజలను బయటకు తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసి, వేయించాలి. ∙అల్లం– వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి, తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి, మిశ్రమం సాస్ లాగా మారే వరకు ఉడికించాలి. తర్వాత మెంతి ఆకులను వేసి, కలపాలి. ∙ చేప ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీరు (కావాలనుకుంటే) వేసి నెమ్మదిగా మంట మీద ఉడికించాలి. ∙వడ్డించే ముందు కొంచెం నిమ్మరసం పిండాలి. మెంతి కార్న్ మలాయ్ కావలసినవి: మెంతి ఆకులు – 2 కప్పులు; మొక్కజొన్న గింజలు – అర కప్పు; టొమాటోలు – 4; జీడిపప్పు – 15; పాలు – కప్పు; క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; పంచదార – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వంట నూనె – 2 టేబుల్ స్పూన్లు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక గిన్నెలో మెంతి ఆకులు, టీ స్పూన్ స్పూన్ ఉప్పు వేసి, మూతపెట్టి, 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ∙తర్వాత మెంతి ఆకులను మంచినీటితో బాగా కడగాలి.∙మొక్కజొన్న గింజలను ప్రెషర్ కుకర్లో వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, పక్కన పెట్టుకోవాలి. ∙జీడిపప్పును తరిగి 3 టేబుల్స్పూన్ల పాలలో 15 నిమిషాలు నానబెట్టాలి.∙నానబెట్టిన జీడిపప్పును గ్రైండ్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ∙తరిగిన టొమాటోను ప్రెజర్ కుకర్లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నీళ్లు కలపద్దు. ∙బాణలిలో నూనె, వెన్న వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, యాలకుల పొడిని కలపాలి. ∙ ఇప్పుడు తరిగిన మెంతి ఆకులు వేసి, నిమిషం సేపు వేయించాలి. ∙ఇప్పుడు టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ∙టొమాటో, మసాలా నుండి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేసి నిమిషం సేపు ఉడికించాలి. ∙దీంట్లో క్రీమ్ కలిపి, మూతపెట్టి సన్నని మంట మీద నిమిషం సేపు ఉడికించాలి. ∙ఈ మలాయ్ కర్రీని నాన్ లేదా రోటీ లేదా పరాఠాతో వేడి వేడిగా వడ్డించాలి. ఓట్స్ మెంతి కావలసినవి: ఓట్స్ – ముప్పావు కప్పు (గ్రైండ్ చేసి, పక్కనుంచాలి); మెంతి ఆకులు – 2 కప్పులు; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; కారం – ఒకటిన్నర టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; నువ్వులు – అర టీ స్పూన్. తయారీ: ∙ఒక పాత్రలో ఓట్స్, మెంతి ఆకులు, రవ్వ, పెరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి, బాగా కలపాలి. ∙కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, ఒత్తి పక్కనుంచాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న ముట్టీలను నూనె వేసి లేదా వేయకుండానే వేయించుకోవాలి. ∙విడిగా ఒక మూకుడును స్టౌ మీద పెట్టి వేడయ్యాక రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. దీంట్లో ఆవాలు, నువ్వులు వేసి చిటపటలాడాక వేయించిన ముట్టీలను వేసి, మరోసారి వేయించాలి. వీటిని వేడి వేడిగా ఏదైనా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
గమ్మత్తైన టీవి.. చూస్తే నోరూరుతుంది.. నాకితే రుచి తెలుస్తుంది.. ఎక్కడో తెలుసా!
కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలను తలచుకోగానే నోరు ఊరుతుంది. కళ్లముందు కనపడితే.. అసలు ఆగలేరు. ఇలాంటి వారినే ఊరిస్తూ ఉంటాయి.. టీవీలో కనిపించే కొన్ని ఆహారపదార్థాలకు సంబంధించిన ప్రకటనలు, ఫుడ్ షోలు. ఆ ఆహార పదార్థాలను ఎంచక్కా రుచి చూడొచ్చు కాణి ఖర్చు లేకుండా. నిజం.. జపాన్లో టీటీటీవీ అంటే ‘టేస్ట్ ద టీవీ’ పేరుతో ఒక డివైజ్ను రూపొందించారు. ఇందులోని ప్రొటోటైప్ తెరకు ప్రత్యేకమైన సెటప్ ద్వారా కొన్ని టేస్టీ ట్యూబ్లను అమర్చారు. దీంతో తెరపై కనిపించే ఆహార పదార్థాలను నాకి, రుచి చూడొచ్చు. అంతేకాదు మీకు నచ్చిన ఫ్లేవర్స్నూ కోరి మరీ టేస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెబితే.. వెంటనే, తెర మీద ఉన్న ఫ్లాస్టిక్ షీట్పై ఆ ఫ్లేవర్ బొమ్మ వచ్చి పడుతుంది. చక్కగా ఆ చాక్లెట్ను చప్పరించొచ్చు. ప్రస్తుతం జపాన్కు చెందిన ప్రసిద్ధమైన పది వంటకాల రుచులను మాత్రమే తెలియజేస్తుందీ టీవీ. త్వరలోనే మరింత అ‹ప్డేట్ అయ్యి అన్ని రుచులనూ ఆస్వాదించేలా ఆ టీవీని రూపొందిస్తామని చెప్తోంది సదరు టీవీ కంపెనీ యాజమాన్యం. -
వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు
Japan Licking TV Screen With Food Flavours: ‘జపానోడు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే’.. అంటూ ఓ అరవ డబ్బింగ్ సినిమాలో ఫన్నీ డైలాగ్ ఉంటుంది. అయితే అడ్వాన్స్ టెక్నాలజీని పుణికిపుచ్చుకున్న దేశంగా జపాన్.. క్వాలిటీ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ఈ తరుణంలో జపాన్ నుంచి వచ్చిన ఓ తాజా ఆవిష్కరణపై సరదా చర్చ మొదలైంది. ‘టేస్ట్ ద టీవీ’ TTTV పేరుతో ఒక డివైజ్ను రూపొందించాడు ఓ జపాన్ ప్రొఫెసర్. ప్రొటోటైప్ టీవీ తెరను డెవలప్ చేసి దీనిని తయారు చేశాడు. ఇందులో తెర మీద రకరకాల రుచులను చూసే వీలు ఉంటుంది. ప్రత్యేకమైన సెటప్ ద్వారా టేస్టీ ట్యూబ్లను అమర్చి ఉంటుంది. చూడడానికి ఇది పది ఫ్లేవర్ల రంగులరాట్నం మాదిరి ఉంటుంది. మల్టీపుల్ సెన్సార్తో పని చేసేలా రూపొందించాడు ఆ ప్రొఫెసర్. వాయిస్ కమాండ్ తీసుకోగానే(ఏ ఫ్లేవర్ కావాలో.. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పాలి).. అప్పుడు తెర మీద ఉన్న ప్లాస్టిక్ షీట్పై ఆ ఫ్లేవర్ వచ్చి పడుతుంది. అప్పుడు ఎంచక్కా నాకి రుచిచూసేయొచ్చు. ప్రొఫెసర్ హోమెయి మియాషిటా.. మెయిజి యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇది తయారు చేయడానికి మియాషిటా ఆధ్వర్యంలోని 30 మంది విద్యార్థుల బృందం కష్టపడింది. ‘‘కరోనా టైంలో జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి కదా. అందుకే రెస్టారెంట్, వాళ్లకు నచ్చిన రుచి అనుభవం ఇంట్లోనే అందించేందుకు ఇలా ఫుడ్ ఫ్లేవర్లను అందించే డివైజ్ను రూపొందించాం’’ అని ప్రొఫెసర్ హోమెయి మియాషిటా చెప్తున్నారు. Taste the TV కమర్షియల్ వెర్షన్ను 875 డాలర్లకు అందించబోతున్నారు. వీటితో పాటు టేస్టింగ్ గేమ్స్, క్విజ్లను కూడా రూపొందించబోతున్నారు. పిజ్జా, చాక్లెట్ రుచిని అందించే స్ప్రేను సైతం తయారు చేయనుంది ఈ టీం. ఎక్స్క్యూజ్మీ.. కొంచెం మీ ముఖాన్ని అద్దెకిస్తారా? -
ప్రపంచంలోనే ఖరీదైన ద్రాక్ష, ఒక్కోటి రూ.35వేలు
సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ఖరీదైన మామిడి పళ్లు గురించి విన్నాం.ఇపుడిక ప్రపంచంలోనే అతి ఖరీదైన, అరుదైన ద్రాక్ష పండ్లు గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అనేక రకాల ద్రాక్షలు కనిపిస్తాయి. కానీ చక్కటి రంగు,రుచితో పింగ్పాంగ్ బంతి సైజులో ఉండే ‘రూబీ రోమన్ ద్రాక్ష’ ప్రత్యేకతే వేరు. ఈ రకానికి చెందిన ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాముల కంటే ఎక్కువే. రుచిలో కూడా రాయల్గా ఉంటాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు తప్పదు. ఐఫోన్, తులం బంగారం కంటే కంటే ఎక్కువ పెట్టాల్సిందే. ఇంతకీ ఏంటబ్బా అంత స్పెషాలీటీ! రూబీ రోమన్ ద్రాక్ష అని పిలిచే ఈ ద్రాక్ష తక్కువ పుల్లగా, ఎక్కువ తీపిగా, జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది. అందుకే అంత పాపులర్. ఈ ద్రాక్ష కిలో ధర 11 వేల డాలర్లు. అంటే అక్షరాలా రూ.7.5 లక్షలు. షాకవ్వకండి..ఇది నిజం. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఖ్యాతి దక్కించుకుంది. రూబీ రోమన్ ద్రాక్ష జపాన్లో 2019లో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఫైల్ ఫోటో జపాన్లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో రుబీ రోమన్ ద్రాక్ష పండ్లను పండిస్తారు. 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. జపనీస్ లగ్జరీ ఫ్రూట్ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్. ఈ ద్రాక్షనుమొదట మార్కెట్లో విక్రయించరు. వేలంలో అధిక ధర చెల్లించిన వారికి మాత్రమే సొంతం. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు క్యూ కడతారు. ప్రతీ ఏడాది రికార్డు ధరను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2019లో ఈ ద్రాక్షను కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్కు చెందిన హయాకురాకుసో అనే సంస్థ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. మొత్తం 24 ద్రాక్ష పండ్ల గుత్తిని 12 లక్షల యెన్లకు సొంతం చేసుకుంది. అంటే ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలన్న మాట. మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందని స్థానిక రైతులు చెప్పారు. అలాగే వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారనీ, వీఐపీ గెస్టులకు గిఫ్ట్గా ఇచ్చేందుకు కొన్ని విలాసవంతమైన హోటల్స్ కొనుగోలు చేస్తుంటాయని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్లోని ఒక జంట జపనీస్ మియాజాకి మామిడి పండ్లను పండించి ఇటీవల వార్తల్లోకె క్కిన సంగతి తెలిసిందే.కిలోకు రూ.2.70 లక్షలతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డు కొట్టేసిన వీటి రక్షణకు నలుగురు భద్రతా సిబ్బందిని, ఆరుకుక్కలను ఏర్పాటు చేసుకోవడం విశేషంగా నిలిచింది. -
బంపర్ ఆఫర్: ఏడాదికి 38 లక్షల జీతం
లండన్: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్ టెంప్టింగ్గా ఉంది.. పని ఎంత కష్టమో అనుకుంటున్నారా. అది మరీ సులభం. కేవలం బిస్కెట్లు టేస్ట్ చేసి.. ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ఇందుకు గాను ఏడాదికి అక్షరాల 38 లక్షల రూపాయల జీతం చెల్లించేందుకు సిద్ధం అంటూ ఓ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది కుప్పల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయట. కంపెనీ అడ్రెస్ ఇవ్వండి మేం కూడా అప్లై చేస్తాం అంటారా వెయిట్. ఇది మన దగ్గర కాదు. యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్ ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. అదే బిస్కెట్ రుచి చూసే పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు బిస్కెట్ రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లించనున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు 40 లక్షలుగా ఉండనుంది. అంటే నెలవారీగా 3 లక్షల రూపాయలకు పైగా జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగం కోసం, మీకు ప్రత్యేక ప్రతిభ ఉండాలి. (చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు) ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తారు, బిస్కెట్లపై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఇది మాత్రమే కాక, నాయకత్వ నైపుణ్యాలు, సమాచార మార్పిడిలో మంచి అవగాహన ఉండాలి. దాంతో పాటు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచడానికి కావాల్సిన సూచనలు ఇచ్చే వారికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. బేకరీ ఉత్పత్తులు, ప్రక్రియలతో శాస్త్రీయ, ఆచరణాత్మక అనుభవం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వంటి ఐటి నైపుణ్యాలు ఉండాలని తెలిపారు. వీటితో పాటు యూకే చట్టాలు, సాంకేతికత, పరిశ్రమ సంకేతాల గురించి తగిన అవగాహన ఉన్న వ్యక్తి అవసరం అని కంపెనీ తెలిపింది. సెలక్టయిన వ్యక్తికి సంవత్సరానికి 35 రోజుల సెలవు, బోనస్ పథకం, 1000 కి పైగా రిటైలర్లలో డిస్కౌంట్, ఉచిత ఆన్లైన్ వ్యాయామ కార్యక్రమాలు, ఉచిత బిస్కెట్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. -
ప్రగతి భవన్కు రండి
కెరమెరి (ఆసిఫాబాద్): ఏళ్ల తరబడి పడిన శ్రమకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఆపిల్ రుచిని చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో ఆపిల్ సాగు చేస్తున్న కేంద్రె బాలాజీకి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందింది. ప్రగతి భవన్కు వచ్చి తనను కలవాలని కోరారు. ఈ నెల 5న ‘ఇదిగో తెలంగాణ ఆపిల్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్లో ఉద్యానశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆపిల్ సాగు విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆపిల్ సాగు చేస్తున్న రైతును ఆహ్వానించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి నుంచి బాలాజీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆపిల్ పంట సాగు గురించి సీఎంకు వివరించాం.. మిమ్మల్ని హైదరాబాద్లోని ప్రగతి భవన్కు వచ్చి కలవమన్నారు’అని చెప్పారు. కాగా, ఈ నెలాఖరులో సీఎంను కలసి ఆపిల్ రుచి చూపిస్తానని బాలాజీ అంటున్నారు. ఆపిల్ పండ్లను చూపుతున్న రైతు బాలాజీ -
పచ్చడి పచ్చడి చేయండి
ఒక్కదాన్ని చితకబాది పచ్చడి చేస్తే... రుచిగా ఉంటుంది.రెండిటిని కలిపి బాది బాది పచ్చడి చేస్తే... రుచిరుచిగా ఉంటుంది...ఈ రకం కాంబినేషన్ పచ్చళ్లు ఆల్రెడీ కలిపి కొడుతున్నాం కాబట్టిదేనితో కలిపినా రుచిగానే ఉంటుంది.కాని వేడి వేడి అన్నంలోకి నేతితో కలిపి తింటే రుచి రెట్టింపవుతుంది.ఇంకెందుకు ఆలస్యం... మీకు నచ్చిన కాంబినేషన్లను పచ్చడి పచ్చడి చేయండి.వేడివేడిగా ముద్దలు ముద్దలు లాగించేయండి. గోంగూర–పండుమిర్చి కావలసినవి: గోంగూర – అర కేజీ; పండు మిర్చి – పావు కేజీ; చింత పండు – 50 గ్రా.; నువ్వుల నూనె – పావు కేజీ; ఉప్పు – తగినంత; మెంతులు – ఒక టేబుల్ స్పూను (వేయించి పొడి చేయాలి); ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 50 గ్రా.; ఇంగువ – రెండు టీ స్పూన్లు తయారీ: ►గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి ►పండు మిర్చిని శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి పొడి వస్త్రం మీద ఆరబెట్టాక, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర, చింత పండు వేసి కలపాలి ►బాగా వేగిన తరవాత దింపేసి, చల్లారనివ్వాలి ►మిక్సీలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, బయటకు తీసేయాలి ►చల్లారిన గోంగూర వేసి మెత్తగా చేయాలి ►మిక్సీ పట్టిన గోంగూర, పండు మిర్చి మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని బాగా కలపాలి ►మూడు రోజుల తరవాత, ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ►చల్లారాక పచ్చడిలో వేసి కలిపి, జాడీలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. పండుమిర్చి దొరక్కపోతే, పండుమిర్చి పచ్చడిలో కలుపుకోవచ్చు. కొబ్బరి–కొత్తిమీర కావలసినవి: కొబ్బరి ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; చింత పండు – కొద్దిగా; పోపు కోసం:ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; నూనె – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ►కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి ►కొత్తిమీర, చింత పండు, ఉప్పు జత చేసి, అన్ని పదార్థాలు బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి దింపేయాలి ►పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, వేయించి ఉంచుకున్న పోపును జత చేయాలి ►ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసెలలోకి రుచిగా ఉంటుంది. టొమాటో– బీరకాయ కావలసినవి: బీరకాయలు – అర కిలో; టొమాటోలు – 4 (పెద్దవి); నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 8; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; పోపు కోసం: ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఆవాలు + జీలకర్ర – ఒక టీ స్పూను; మినప్పప్పు + పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►బీరకాయలను శుభ్రంగా కడిగి, (చెక్కు తీయకుండా) ముక్కలు చేయాలి ►టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బీరకాయ ముక్కలు వేసి కలపాలి ►కొద్దిగా మగ్గి నీరు బయటకు వచ్చిన తరవాత టొమాటో ముక్కలు జత చేయాలి ►బాగా మగ్గిన తరవాత దింపి పక్కన పెట్టాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►మిక్సీలో ముందుగా ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేయాలి ►పోపు వేసి మరోమారు మిక్సీ పట్టి మెత్తగా అయ్యాక, బీరకాయ, టొమాటో ముక్కల మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►కొద్దిగా వేగిన తరవాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►చివరగా కరివేపాకు వేసి కలపాలి ►తయారైన పచ్చడి జత చేసి రెండు నిమిషాల పాటు బాగా కలియబెట్టి స్టౌ మీద నుంచి దింపేయాలి ►కొత్తిమీరతో అలంకరించి, వేడివేడి అన్నంలోకి వడ్డించాలి. వంకాయ–ఉల్లిపాయ కావలసినవి: వంకాయలు – పావు కేజీ; ఉల్లిపాయ – 1 (పెద్దది); చింతపండు – కొద్దిగా; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేసుకోవాలి ►ఉల్లిపాయలను కూడా ముక్కలు చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వంకాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి, మంట బాగా తగ్గించాలి ►ముక్కలు మెత్తబడ్డాక మంట ఆర్పేసి, ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►వేయించి ఉంచుకున్న పోపును కొద్దిగా పక్కన ఉంచుకుని, మిగతా పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►చల్లారిన వంకాయ, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►పక్కన ఉంచుకున్న పోపు, పసుపు జత చేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొబ్బరి – కందిపప్పు కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింతపండు – కొద్దిగా; ఎండు మిర్చి – 12; ఆవాలు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక కంది పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపేయాలి ►చల్లారిన కందిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►కొబ్బరి ముక్కలను జత చేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ పచ్చడి మెత్తగా వచ్చేవరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాక, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పచ్చడి పైన వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యి, అప్పడాలు, వడియాలు నంచుకుంటూ తింటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దోసకాయ – చింత కాయ కావలసినవి: దోసకాయలు – పావు కేజీ; చింత కాయలు – 50 గ్రా.; తరిగిన పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 10; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; తయారీ: ►దోసకాయ తొక్కు తీసి, సన్నగా ముక్కలు తరగాలి ►చింతకాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►జీల కర్ర, కరివేపాకు జత చేసి వేయించాలి ►మిక్సీలో వెల్లుల్లి రేకలు, చింతకాయలు, వేయించి ఉంచుకున్న పచ్చి మిర్చి మిశ్రమం వేసి, మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి ►కొన్ని దోసకాయ ముక్కలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని మిగిలిన దోసకాయ ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి తయారుచేసి ఉంచుకున్న పచ్చడి మీద వేసి కలపాలి ►వేడి వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. చింత కాయల బదులు చింతకాయ పచ్చడి కలుపుకో వచ్చు. క్యాబేజీ – ఉల్లిపాయ కావలసినవి: క్యాబేజీ – పావు కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; ఎండు మిర్చి – 2; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; చింత పండు – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►క్యాబేజీని సన్నగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక క్యాబేజీ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు, చింత పండు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మూత పెట్టి, కొద్దిసేపు మగ్గిన తరవాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, వరుసగా వేసి వేయించాలి ►మిక్సీలో క్యాబేజీ, ఉల్లి తరుగు మిశ్రమం వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►వేయించి ఉంచుకున్న పోపు జత చేయాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నేతితో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. నిమ్మకాయ – కాకరకాయ కావలసినవి: కాకరకాయలు – 4 (చక్రాలుగా తరగాలి); నిమ్మ కాయలు – 6 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – 10; నిమ్మ రసం – ఒక కప్పు; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 10; ఉప్పు – తగినంత; నూనె – 200 మి.లీ.; వేయించిన మెంతుల పొడి – అర టేబుల్ స్పూను. తయారీ: ►ఒక పాత్రలో కాకర కాయ చక్రాలు, నిమ్మ కాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి ►మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ►వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక వేడి నూనెను పచ్చడిలో వేసి కలిపి మూడు రోజుల పాటు ఉంచాలి ►మెంతి పొడి వేసి మరోమారు కలిపి మరో మూడు రోజుల తరవాత వాడుకోవాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. టొమాటో – పుదీనా కావలసినవి: టొమాటోలు – అర కిలో; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి వేడిచేయాలి ►జీలకర్ర వేసి వేయించాలి ►పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►పుదీనా తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, నూనె జత చేసి మరోమారు తిప్పాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసి, పచ్చడి మీద వేసి కలపాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. ముల్లంగి – పుదీనా కావలసినవి: ముల్లంగి తరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 5; చింతపండు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►చింతపండును పది నిమిషాల పాటు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►ముల్లంగి తురుము, పుదీనా అకులు జత చేసి ఐదారు నిమిషాల పాటు వాసన పోయేవరకు వేయించి, ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ►నానబెట్టిన చింతపండు, ముల్లంగి తురుము మిశ్రమం మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►ఇంగువ జత చేసి బాగా కలిపి దింపేయాలి ►ముల్లంగి పచ్చడి మీద వేసి కలియబెట్టాలి ►ఇడ్లీ, దోసె, పొంగల్, ఊతప్పం వంటి టిఫిన్లతో తింటే రుచిగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి కావలసినవి: తాజా కొత్తిమీర – 2 కప్పులు (శుభ్రపరిచి తరగాలి)పచ్చిమిర్చి – 4 (రెండుగా కట్ చేసుకోవాలి)చింతపండు పేస్ట్ – 1 టేబుల్స్పూన్ఉప్పు – రుచికి తగినంత తయారీ: కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అయితే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఈ పచ్చడి పెసరట్టుకు, ఇడ్లీ, దోశ, వడ... ఏ టిఫిన్లోకైనా మంచి కాంబినేషన్ అవుతుంది. మిరపకాయబజ్జీలను ఈ చట్నీలో అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్ రోల్స్ని కూడా ఈ చట్నీలో ముంచుకొని తినచ్చు. నోట్: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికీ, శ్వాసనాళాల్లో కఫం తొలగించడానికీ సహకరిస్తుంది. కొత్తిమీరను ఏదో ఒక రూపంలో తరచు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో భాగమే ఈ పచ్చడి. నువ్వులు–మామిడికాయ కావలసినవి: నువ్వులు– అర కప్పు; మామిడికాయ – 1 (మీడియం సైజుది); ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను, నూనె – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి ►మామిడికాయ తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►మిక్సీలో నువ్వులు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి, పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►వేయించుకున్న పోపు జత చేయాలి ►వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పల్లీ– దొండకాయ కావలసినవి: దొండకాయలు – పావు కేజీ; వేయించిన పల్లీలు – 50 గ్రా.; చింత పండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; పోపు కోసం... నూనె – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; బాదం పప్పులు – 5 (నీళ్లలో సుమారు రెండు గంటలు నానబెట్టాలి). తయారీ: ►దొండకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గిన తరవాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీల కర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పల్లీలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►దొండకాయ ముక్కలు, బాదం పప్పులు జత చేసి మెత్తగా అయ్యేవరకు తిప్పి, పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►పసుపు, కొత్తిమీర జత చేయాలి. -
పెరుగు మంగమ్మ
చాలా ఏళ్ళుగా మాకు వాడుకగా పెరుగు పోస్తోంది మంగమ్మ. మాములుగా మా పేట వేపు వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, ‘‘పెరుగు తీసుకుంటారా అమ్మా, మంచి పెరుగు తెచ్చాను’’ అనడం మేం అవసరమైతే తీసుకుని, ఆరోజు ధర ఎలా ఉందో తెలుసుకుని అప్పుడే డబ్బులు ఇచ్చేయడం, లేదా మర్నాడివ్వడం, ఇదీ మా వాడుక.వాళ్ళ ఊరు అవలూరు పక్కన ఏదో పల్లెటూరు. వస్తూ మా ఇంటి ముందు నుంచే రావాలి. వెళ్లేటప్పుడు మా ఇంటి మీదుగానే వెళ్ళాలి. వచ్చేటప్పుడొకసారి, వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి రావడం అలవాటు. మా లోగిట్లో కాసేపు కూర్చొని, మమ్మల్ని పలకరించి, తమలపాకులు, వక్క నోట్లో వేసుకుని, లేకపోతే మా దగ్గర పుచ్చుకొని తరువాత ఊరికి వెళ్ళేది. నేను కొంచెం తీరిగ్గా ఉంటే తన కష్టసుఖాల్ని చెప్పుకుని, నన్ను కూడా ఏమైనా చెప్పమంటుంటుంది.నాకేమున్నాయి కష్టాలు? దేవుడి దయవల్ల అంతా బాగానే ఉంది.సుమారు నెలాళ్ళ క్రితం మంగమ్మ పొద్దున్నే ‘‘పెరుగు తీసుకుంటారామ్మ?’’ అంటూ వచ్చినప్పుడు మా కుర్రాడు ‘‘ఇయ్యి పెరుగు’’ అంటూచెయ్యి జాపాడు.‘‘బంగారంలాంటి బిడ్డని కన్నావు. కానీ ఇయ్యన్నీ ఎన్నాళ్ళు? కుర్రోడు పెద్దోడయ్యే వరకే. అప్పుడెవతో వస్తుంది. ఇప్పుడు ‘అమ్మ! అమ్మ!’ అని కొంగట్టుకు తిరిగిన కొడుకు అప్పుడు అమ్మ ఉందో సచ్చిందో కూడా అడగడు’’ అంది మంగమ్మ.నేను ‘‘ఏమైంది మంగమ్మా? కొడుకు నువ్వు చెప్పిన మాట విన్లేదా?’’ అన్నాను.‘‘సర్లే తల్లీ, కట్టుకున్న మొగుడిన్లేదు, ఇక కొడుకేటి వినేది? అయ్యో, నాయమ్మ! నేనేనాడూ మంచి కోక్కట్టుకుని ఎరగను. మరెవతో కట్టుకుంది. కోక అందం చూసి అటెల్లాడు. నా ఇల్లు, నా ఆడది అనుంటే చాలు మగాడికి అనూరుకున్నాను. అమురుతం అన్నాను. మొగుణ్ణి పోగొట్టుకున్నాను. ఏదో నాకంతే రాసుంది. నువ్వు మటుకు మొగుడొచ్చే ఏలకు మంచికోక కట్టుకునుండు. మగాళ్ళ మనసు శానా చంచలం. ఇదుగో, ఇప్పుడు కట్టుకున్నావే, ఇలాంటి కోకలు పనీపాటు చేసేటప్పుడు కట్టుకోవాలి తల్లీ’’ నాక్కొద్దిగా నవ్వొచ్చింది. కాని ఆమె అనుభవంలోంచి వచ్చిన మాటల్లోని తెలివి గొప్పగా తోచింది. ఆ మాటల వెనకాల ఆమె స్వానుభవంలో కలిగిన నొప్పి తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. అది గ్రహించగానే నాకెంతో బాధ కలిగింది. ‘‘చూడు తల్లీ భర్తని సరిగ్గా వుంచుకోవాలంటే నాలుగు చిటకాలు. అప్పుడప్పుడు తింటానికి రుచిగా ఏమన్నా చేసి పెట్టడం, సక్కగా కళ్ళకింపుగా తయారై, కష్టనిష్ఠూరమో ఏదెలా ఉన్నా నవ్వుతూ పలకరించాలి.ఇంటిక్కావల్సినవన్నీ ఒక్కసారే తెప్పించుకొని, మళ్ళీ మళ్ళీ అడక్కుండా ఉండాలి. మూడు పైసలో, ఆరు పైసలో పోగేసి దాచి, అవసరమన్నప్పుడొక రూపాయి చేతిలో పెట్టాలి. ఆడదిట్టా సేస్తే మొగుడన్నోడు ఇంటికుక్కలా పడుంటాడు. లేదనుకో ఈదులెంట తిరుగుతాడు. నాకు మంగమ్మ మాటల చమత్కారం చూసి ఆశ్చర్యమేసింది. మరోరెండు మాటలాడి ఆ వేళటికి ఇంటికి పంపించేశాను.పదిహేను రోజుల క్రితం మంగమ్మ వచ్చినపుడదోలాగ ఉన్నట్టనిపించి ‘‘ఏ మంగమ్మా! అదోలా వున్నావేమిటి? కొడుకేమన్నా అన్నాడా?’’ అనడిగాను.‘‘అన్నాడమ్మా. వాడి పెళ్ళాం ఏ మెరగని పసివాణ్ణి, వాడేదో చేశాడని పట్టుక్కొట్టింది. ఏమే గయ్యాళీ, ఎందుకు రాక్షసిలా ఆ పసివాడిని బాదుతావు?’’ అని అడిగాను. నాకే ఎదురు తిరిగిందది. నోటికొచ్చినట్టంది. ‘‘ఇదేటే నీ మొగుణ్ణి కన్నదాన్ని నేను.నన్నే ఇంతలేసి మాటలంటావా? కానీయ్, ఆణ్ణే రానీ అడుగుతాను’’ అన్నాను. ఆ దొర ఇంటికొచ్చాడు. ‘‘చూడయ్యా, సంటోణ్ణూరికే బాత్తుంటే ‘ ఒద్దే’ అన్నానని నన్ను నానా తిట్లూ తిట్లింది. నీ పెళ్ళానికి కాస్త బుద్ధి చెప్పుకోరాదా’’ అన్నాను. కోడలొచ్చి ‘‘ఏటి నాకు బుద్ధి చెప్పేది? కుర్రోడల్లరి చేస్తే ఒద్దంటానికి నాకధికారం లేదా? నువ్వు నా మొగుణ్ణి కన్నట్టే, నేనూ ఈణ్ణి కనలేదా? నాకేటి బుద్ధి సెప్పేది?’’ అంది. ఎంతైనా అది ఆడి పెళ్ళాం కదా! ఆడన్నాడూ ‘ఔనే అమ్మా! కన్నబిడ్డనది కొట్టుకుంటుంది. నువ్వెందుకు దాని జోలికి పోతావు? నేను నీ కొడుకుని కదా, నన్నేమన్నా అను, చెల్లు’’ అన్నాడు. ‘‘నాకెవరయ్యా దిక్కు?’’ అన్నాను. ‘‘నీకేమిటమ్మా పాడి, డబ్బు ఉన్నాయి. నిన్ను నేను సాకక్కర్లేదుగా’’ అన్నాడు. ‘‘అంటే నన్ను వేరు పొమ్మంటావేటిరా?’’ అన్నాను. ‘‘నీ ఇష్టం. పోతానంటే వద్దనను. మీ ఇద్దరి గోల పడలేకుండా ఉన్నాను’’ అన్నాడు. ‘‘సరేనయ్యా, మద్దేనం నుంచి నేను వేరే పోతాలే. నువ్వు, నీ పెళ్ళాం సుకంగా ఉండండి అనేసి పెరుగు తీసుకుని సక్కా వచ్చాను తల్లీ’’ అంటూ మంగమ్మ ఏడ్చింది. నేను ఓదార్చాను. ‘‘సర్లే మంగమ్మా ఇవన్నీ ఉట్టి మాటలే. అంత సర్దుకుంటుంది’’ అని ధైర్యం చెప్పి పంపాను.మర్నాడు మంగమ్మొచ్చినప్పుడు నిన్నటంత దిగాలుగా లేదు. కాని ఎప్పటిలా చురుగ్గానూ లేదు. ‘‘గొడవలన్నీ సర్దుకున్నాయా మంగమ్మా?’’ అనడిగాను. ‘‘సర్దుకోడానికిడుస్తుందా అది. నిన్న నేను పెరుగమ్మి ఇంటికివెళ్లేసరికి, నా కుండలవీ వారగా ఉంచింది. ఓ దాంట్లో బియ్యం, మరోదాంట్లో రాగులు, ఉప్పు, మిరకాయలు అన్నీను.తను, తన మొగుడూ అన్నం తిన్నామన్నట్లుగా కాళ్ళు జాపుక్కూర్చుంది. ఇంకేముంది తల్లీ సర్దుకునేది. నేనూ ఒకింత ముద్ద (సంగటి) కెలుక్కుని తిన్నాను. నేనేదో అన్నాననుకో. అదే చాలన్నట్టు ఊరుకున్నారు వాళ్ళు. రోజూ ఆ పిల్లాడికింత పెరుగు పెట్టిగాని అమ్మకానికొచ్చేదాన్ని కాదు. పోద్దున్నే ఆ వేళకి ఆడ్నెక్కడికో తీసికెళ్ళిపోయింది. ఆ పిల్లాణ్ణి నాకు దూరం చెయ్యాలనే అలా చేసింది’’ అంది. ఒక చిన్నమాట ఎంత దూరం పోయింది అని ఆశ్చర్యమేసింది నాకు. తరువాత ఒకట్రెండు రోజులు ఆ మాట ఎత్తలేదు. మంగమ్మ వేరుగా ఉంటున్నట్లుగా అనిపించింది. తరువాతొకరోజు మంగమ్మ, ‘‘నువ్వేసుకుంటావే, ఆ మకమల్ జాకెట్టు బట్ట గజమెంత?’’ అనడిగింది.‘‘ఎందుకు మంగమ్మా’’ అన్నాను. ‘‘ఇన్ని రోజులు కొడుక్కి, మనవడికి అనుకుంటూ పైసా పైసా కూడ బెట్టాను. ఇంకెందుకు? నేను మకమల్ జాకెట్టు కుట్టించుకుని తొడుక్కు తిరుగుతాను’’ అంది.‘‘జాకెట్టుకు ఏడెనిమిది రూపాయలవుతుంది మంగమ్మా’’ అన్నాను. ఆ వేళే దర్జీ కొట్లో మంగమ్మ మకమల్ బట్ట బేరం చెయ్యనూ చేసింది, కుట్టడానికియ్యనూ ఇచ్చింది. మర్నాడు ఊరికెళుతూ దాన్ని తొడుక్కుని వచ్చింది. ‘‘చూశావా అమ్మయ్యా...నా సింగారం. మావోడొచ్చినప్పుడు కూడా మంచి కోక కట్టలేదు నేను. వాడెవతెనో వెంట పోయాడు. కన్న కొడుకు కోసం పైసా పైసా కూడబెట్టి దాస్తే దాని కథ ఇట్టాగయింది. చూడు నా సింగారం’’ అంది. కొడుకుని దూరం చేసుకున్న దుఃఖంలో మంగమ్మకు కొంచెం మతిచలించిందేమో అనిపించింది నాకు. కాని ఆ జాకెట్ వల్ల ఆమెకి మిగతా వాళ్ళతో గొడవొచ్చింది. వాళ్ళ ఊళ్ళో కుర్రాడొకడు బెంగుళూర్లో చదువుకుంటున్నాడట. అతను టై, కాలర్ వేసుకునే నాజుకు మనిషి. అతను మంగమ్మనిచూసి ‘‘ఏంటవ్వోయ్ ఏకంగా మఖమల్ జాకెట్టు తొడిగేసావ్?’’ అన్నాట్ట. ‘‘నువ్వు గొంతుక్కి ఊరిపోసుకోగా లేంది నేను జాకెట్టు తొడుక్కుంటేనేం?’’ అందంట. మాటా మాటా పెరిగింది. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు.బయటవాళ్ళ సంగతలా ఉంచి, మంగమ్మ కోడలే, ‘‘కోడలికో రవిక కుట్టించలేక అత్త వేరు పోయి, మఖమల్ జాకెట్టు తొడిగింది చూడండి’’ అందట పొరుగు వాళ్ళతో మంగమ్మకి వినబడేలా.మంగమ్మ కోడలికి పెళ్ళిలో కమ్మలు, కడియాలు, నాగర, కంటి, ఒడ్డాణం అన్నీ పెట్టింది.తరువాత ఏడాదికొకటి చొప్పున ఏదో ఒక నగ కొంటూనే ఉంది. అవన్నీ గుర్తులేవా కోడలికి? మంగమ్మ రెండుమూడుసార్లు ఊరుకొని ఆఖరికి ఓ రాత్రివేళ కొడుకుతో ‘‘నీ పెళ్ళాం నన్నేదేదో అంటోంది. నేను దానికేమీకొనివ్వలేదా?’’ అందట. కోడలు మొగుణ్ణి మాట్లాడనియ్యకుండా ‘‘మొగుడు లేని ముసల్దానివి నువ్వు. ఇప్పుడు కమ్మలు, ఒడ్డాణం కావల్సొచ్చాయా? తీసుకుపో, ఏస్కో’’ అంది. ఆ మొగుడు, ‘‘ఎందుకే అన్ని మాటలు!’’ అని పెళ్ళాంతో అని, తల్లితో ‘‘అమ్మా! మీ ఇద్దరి తగూల సంగతి నాకెందుకుగానీ, నీ నగలు నీక్కావాలంటే పట్టుకుపో’’ అన్నాడట. మంగమ్మ ‘‘ఇరుగు పొరుగుతో అలాంటి మాటలెందుకే’’ అని పెళ్ళానికి చెప్పుకోలేడుగానీ, కావాలంటే నగలు తీసుకుపో అని నా మీదే తప్పు మోపాడు’’ అని వాపోయింది. అదంతా విని చాలా బాధపడ్డాను. ఈమె చూస్తే ముసల్ది. అతనా ఒక్కడే కొడుకు. ఆ మనిషి మొగుణ్ణి, మొగుడి తల్లిని కాస్త బాగా చూసుకోకూడదూ. ఇంతకీ ముసల్ది మనవణ్ణి కొట్టొద్దన్నందుకు ఇంత గొడవా? ఎందుకిలా చేస్తారో కదా అనిపించింది. అవును, ఎక్కడచూసినా దెబ్బలాటలకి కారణాలిలాగే ఉంటాయి. ఒకరికి ఒకరంటే పడకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలవుతాయి’’ అనిపించింది.ఇది జరిగిన కొన్నాళ్ళకి మంగమ్మ నాతో, ‘‘అమ్మా మీరు సత్యవంతులు. నాది కొంచెం డబ్బుంది. దాన్ని ఎక్కడైనా బ్యాంకి అంటారు కదా అలాంటి చోట దాచిపెట్టగలరా? దానికి మీ సాయం కావాలి. ఆ డబ్బు మీద వాళ్ళు, వీళ్ళు కన్నేస్తున్నారు...’’ అంది. ఏం జరిగిందని అడిగాను. నిన్నేం జరిగిందంటే. మా ఊళ్ళో రంగప్పని ఒకడున్నాడు. జూదగాడు, సోకులెక్కువ. నేను పెరుగు తీసుకొస్తుంటే తోవలో ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడు. ‘‘ఏటి మంగమ్మా బాగుండావా?’’ అన్నాడు. ‘‘ఏం బాగులే రంగప్పా, నీకు తెలీందేముంది?’’ అన్నాను. ఆడన్నాడు, ‘‘ఇప్పుడు బాగు సంగతెవడిక్కావాల? ఈ కాలం కుర్రోళ్ళు నీ లెక్కేట్టన్నట్టు మాట్టాడతారు. మాలాంటి వయసు మళ్ళినోళ్ళు ‘అయ్యో ఇలా జరిగిందేటి?’’ అనుకుంటామంతే. ఇంకేటి సేస్తాంలే’’ అన్నాడు. అట్టాగే నడుసుకుంటూ వచ్చాం. దార్లో తోపు, నుయ్యి ఉన్నాయి. అక్కడికొచ్చేసరికి ఆడేటి చేస్తాడోనని భయమేసింది. ఈ సంచిలో డబ్బుందిలే. అందుకే ఆడు కొంచెం సున్నవుంటే ఇస్తావా?’’ అన్నాడు. ఇచ్చాను. తీసుకుపోయాడు. ఈరోజు వస్తుంటే ఆ తావులోనే మళ్ళీ కలిశాడు. ఆమాట, ఈమాట చెప్ని, ‘‘మంగమ్మా! కాస్త డబ్బుతో పనిబడింది. అప్పిస్తావా? ఈసారి రాగులమ్మగానే తీర్చేస్తాను’’ అన్నాడు. ‘‘నా దగ్గర యాడుంది?’’ అన్నాను. ‘‘సర్లే మంగమ్మా, నాకు తెల్దా డబ్బు ఆడా, ఈడా పూడ్చి పెడితే ఏటొస్తాది? నాకు అప్పిస్తావా, నన్ను సమయానికి ఆదుకున్నదానివవుతావు. నీకు వడ్డీ వస్తది’’ అన్నాడు. కాసేపాగి, ‘‘నువ్వు కొడుకు కలిసున్నట్టయితే నేనడిగేవాణ్ణే కాదు. ఏదో కోడలికి నగా–నట్రా చేయించుకునేదానివి. ఇప్పుడు అట్టాటిదేవీ లేదు కదా! అందుకే అడిగా’’ అన్నాడు. చూడమ్మయ్యా, ఆడదొంటిగా ఉంటే జనం కళ్ళెట్టా పడతాయ్యో’’ అంది. మా వాళ్లను అడిగి చెబుతాను’’ అన్నాను. నేనింకా వారికి ఈ సంగతింకా చెప్పనేలేదు’’ అంది. మర్నాడు మంగమ్మ పెరుగుపోసి, రొంటిన ఉన్న సంచీ తీసింది. ‘‘లోపలికి పదండి లెక్కెట్టుకుందురుగాని’’ అంది. ‘‘నేనింకా ఆయనకి చెప్పలేదు, ఇంకో రోజు ఇద్దువుగానిలే’’ అన్నాను. మంగమ్మ, ‘‘నాకు శానా బయంగా ఉందమ్మయ్యా. రంగప్ప ఇయాల కూడా వచ్చాడు. తోపు దగ్గర, ‘‘కూచో మంగమ్మ, తొందరేటి? ఎల్దువుగాన్లే’’ అన్నాడు. మంచి ఒయసులో ఉన్నప్పుడే కట్టుకున్నోడే పట్టుకున్న సెయ్యొదిలేశాడు. మరోడు ముట్టలేదు దాన్ని. ఇయాల ఈడట్టుకున్నాడు. ఇడిపింసుకుని, ‘ఏటి రంగప్పా, సరసం ముదిరిందే. నా అందసందం ఊసెత్తడానికి నువ్వేమన్నా, నా కట్టుకున్న మొగుడివా? ఇడిసిసెట్టు’’ అని ఇదిలించుకుని వచ్చేసినా.ఇదేమిటి, ఈమె కథ ఏదో ప్రమాదానికి దారి తీసెటట్టుందే అనిపించింది.‘‘ఇదంతా ఎందుకొచ్చిన గొడవగాని మంగమ్మా అయిందేదో అయిందిగాని, వెళ్ళి కొడుకుదగ్గర ఉండరాదా?’’ అన్నాను. ‘‘నేనుంటానంటే ఏంలాబంలే అమ్మాయ్యా, ఆడుండ నియ్యొద్దూ’’ ‘‘కొడుకుతో చెప్పు ఇదంతా’’ ‘‘అయ్యో నా తల్లి, రచ్చకీడ్చి వెలివేయిస్తుంది నా కోడలు. నాకు పొద్దుపోతుంది. నేనెన్ళొస్తా. అయ్యగార్నడిగి రేపు చెప్పు’’ అంటూ వెళ్ళిపోయింది మంగమ్మ.మళ్ళీ ఒంటిగంటకొచ్చింది ‘‘అమ్మయ్యా, ఇవాళొక పనయింది. పిల్లాడికుంటుందిలే అని కాస్త మిఠాయి కొని తట్టలో పెట్టుకున్నా’’ అంది. ‘‘ఏ పిల్లాడు?’’ అని అడిగాను. ‘‘మా పిల్లాడికే...నా దగ్గరికి వెళ్ళొద్దని ఆళ్ళమ్మ సెబుతుందిగాని, ఆడుండ గలడా. ఆళ్లు సూడకుండా ఎప్పుడో వచ్చి కాసిన్ని పాలు తాగుతాడు. కూసింత పెరుగు బిళ్ళ పెట్టమంటాడు. ఏదైనా ఇస్తే గంతులేస్తాడు. ఆడి కోసమని మిఠాయి తట్టలో ఎట్టుకుంటే ఈ సంకరపురంలో వచ్చేటప్పుడు కాకి తన్నుకు పోయింది. ఇట్టా జరిగిందెందుకు?’’ అంది. ‘‘ఏమైందిలే, ఓ పొట్లం కాకెత్తుకుపోతే మరోటి కొనుక్కెళ్తే పోలా?’’ అన్నా. ‘‘కాకి మనుషుల్ని ముట్టకూడదంటారు కదా!’’ అంది. ‘‘ముట్టుకుంటే ఏమంటా?’’ అన్నాను. ‘‘పానానికి ముప్పు అంటారు. నాకు కొనకాలం వచ్చిందేమోనని బయం వేసింది ముందు. మళ్ళీ అనుకున్నా, ఇదీ మంచిదే ఎవురికీ పనికిరాని జల్మమెందుకని’’ అంది. ‘‘ఏంమాటలవి? ఏంఫరవాలేదుగాని, ఇంటికెళ్ళిరా’’ అన్నాను. ‘‘అయితే బయం లేదంటావా అమ్మాయ్యా?’’ ‘‘భయం లేదు, గియం లేదు. ఆపదలొచ్చిన కొద్దీ ఆయుస్సు ఎక్కువంటారు. ఆలోచించకుండా హాయిగా ఇంటికెళ్ళు’’మంగమ్మ వెళ్ళిపోయింది. కొడుకు కావాలి, కోడలు కావాలి, మనవడు కావాలి. కాని తన పెద్దరికాన్ని అంతా గౌరవించాలి. మనిషన్నవాడికి ఈ చాపల్యం తప్పనిది. అది లేకపోతే బ్రతుకులో ఏదో బాధ. అయినా చావడానికి ఇష్టం లేదు. మంగమ్మ ఈసారి మరొక సంగతి చెప్పింది. ఆ మనవడు అమ్మని, నాన్నని వదిలి ఈవిడ దగ్గరికే వచ్చేశాడట. ‘‘నిన్న మద్దేన్నం నా కాడికి వచ్చినోడు మళ్లీ అమ్మ దగ్గర కెళ్ళనని మొరాయించాడు. ఇన్నాళ్ళు దొంగచాటుగా వచ్చేవోడు, ఎప్పుడైతే ఇట్టా చేశాడో ఆళ్ళమ్మొచ్చి నానా గోలా చేసింది. ఉహు...ఎల్లనే లేదు. నాకాడే ఉండిపోయాడు తెలుసా తల్లి. పసిపిల్లాడైనా ఈడుతోడుగా ఉంటే ఎంత దయిర్యంగా ఉందో నాకు. ఎంతైనా మగనలుసు కదా!ఒకే ఇంట్లో ఉంటుంటే నా కోడలు ఎంత అందగత్తో నాకు తెలవనే లేదు. ఇప్పుడు దూరం నించి సూత్తానా...మొకం ముడుసుకుంటే ఏదో లాగుంటుందిగానీ, లేకపోతే మంచి అందగత్తెల్లోకే లెక్క. ఆడినీ అంతే, పొలానికెప్పుడొస్తాడో సూసేదాన్ని కాదు. ఇప్పుడు గుమ్మం కాడ కూసుని ఇంకా రాలేదేటి అనో, ఇంత తొరగా ఎల్తున్నాడేటనో సూస్తాను కదా. దానికి అంతే కదా. ఇప్పుడు కొడితే, ఆడు రేపు నాతో బాటు ఇటొచ్చేస్తే ఏటి సేస్తాది? కొడుకునిడిసి పెట్టుకుంటాదా?’’ ‘‘ఈమె ఊహలు ఎంత దూరం పోతున్నాయి కదా’’ అని ఆశ్చర్యం వేసింది నాకు. ఈలోపలే వీళ్ళ మధ్య పొరపొచ్చాలు తొలగిపోయే సూచనలు కనబడుతున్నట్టుగా తోచింది నాకు. అలాగే జరిగింది కూడా. రెండు రోజులాగి తల్లి దగ్గర కెళ్ళిన కుర్రాడు మర్నాడు నాన్నమ్మతో బెంగుళూరొస్తానని పేచీ పెట్టాడు. మంగమ్మకి ఏం చెయ్యాలో తోచలేదు.కొడుకు–కోడలు వచ్చి ‘‘ఏదో మా వల్ల తప్పయిందనుకో, నువ్వు కోపం చేసుకుంటే ఎట్టాగమ్మా?’’ అన్నారు. తన బింకం సడలకుండా మంగమ్మ ఇష్టంగానే కోడలితో కలిసిపోయింది. కాని ఈ మనవడు నానమ్మతో ఉండాలని పట్టుబట్టాడు. దాని వల్ల కొత్త ఏర్పాటే చేసుకున్నారు. ‘‘ఏటి ఎండలో పోడం, రాడం! పెద్దతనం వచ్చాక ఎన్నాళ్ళీ చాకిరీ. ఇంత ముద్ద కెలికి చారుపెట్టి ఇంట్లో ఉండు. నేనెళ్ళి పెరుగమ్ముతాను’’ అంది కోడలు. మంగమ్మ ఒప్పుకుంది. ఓరోజు అత్తాకోడళ్ళిద్దరూ వచ్చారు. ఒకరి చంకలో పిల్లాడు, మరొకరి నెత్తి మీద పెరుగుతట్ట.‘‘ఇదిగో నమ్మయ్యా నా కోడలు. పాపం ముసల్ది, తనే ఉడుకేసుకొని అవస్థ పడుతుందని, మళ్ళీ నన్నింట్లో చేర్చుకుంది. ఉట్టినే ఎండలో పడి తిరగద్దని అంది. ఇక నుంచదే తెస్తుంది పెరుగు. పోయించు కోండమ్మయ్యా’’ అని చెప్పి కోడలికి మా ఇల్లు అప్పజెప్పింది. ఈమధ్య ఆ కోడలే పెరుగుపోస్తోంది.అత్త వేపు నుంచి మాటలు జరిగాయి కదా, ఇక కోడలేమంటుందో విందామనిపించి ఓ రోజు.‘‘సంజమ్మా...అత్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టచ్చా?’’ అని అడిగాను. దానికి సంజమ్మ అందికదా– ‘‘అత్తనెల్లగొట్టడానికి నేనేటి రాచ్చసినా అమ్మగారూ, అత్త అన్న మనిషి అన్నింటికీ నేనే పెద్దనంటూ తయారైతే, ఇక ఆడు మొగుడేటీ, నేను పెళ్ళానేటి, మేం సంసారం చేసేదేటి? నా మొగుణ్ణి కావాలంటే తనకి సొంతం అని అట్టే పెట్టుకోనీ. కాని నా కొడుకుని నేనుకొట్టకూడదని రూలు పెడితే ఇదెక్కడి కోడంట్రికం అమ్మగారు?’’ అంది.‘కొడితేనే కొడుకు నీ సొంతమని లెక్కా?’’ అని అడిగాను.‘‘నా కొడుకంటే, నా కొడుకే. నా మొగుడంటే నా మొగుడే. కోడలంటూ వచ్చాక, అత్త ఒక మాటంటే అనచ్చు. ఇది లేకుండా ఎవరి సంసారం మాత్రముంటుంది?’’ నాకు మంగమ్మ చెప్పినప్పుడు తను చెప్పింది ‘సరి’ అనిపించినట్టుగానే, కోడలు చెబుతుంటే కోడలిదీ సరిగ్గాఉన్నట్టుగానే అనిపించింది. ‘‘అయితే ఇప్పుడు నీకు ఇంట్లో కొంత స్వతంత్రం వచ్చినట్టేనా?’’ అనడిగాను. ‘‘ఇప్పుడు మొదటి కన్నా నయం తల్లీ. ఎట్టాగో సద్దుకుపోవాలి. గొడవ పడితే మాకే నష్టం. మాఅత్త డబ్బు మీద కన్నేసి ఉన్నారెంతోమంది. కాజేసినా చెయ్యొచ్చు. రంగప్ప అని ఒకడున్నాడు. ఆడు మా అత్త వేరు కాపురం పెట్టినప్పుడు అప్పడిగాడట. ఈమె ఇస్తానందట. ఆడొచ్చి ఆ మాట చెప్నాడు. మా కుర్రాణ్ణి పిలిచి, ‘‘ఒరేయ్ నానమ్మ దగ్గరకెళ్ళి అడుగు, మిఠాయి పెడుతుంది. మళ్లీ పిల్చేదాకా రామాకు’’ అని కట్టడి చేశా. గొడవలెలాగైనా సర్దుకుంటే చాలని అట్టా చేశానమ్మా. కాని అమ్మగారూ, ఇయ్యన్నీ పైకి చెప్పుకోగలమా? మగవాళ్ల కివన్నీ ఏం తెలుస్తాయి?’’ అంది. మంగమ్మ కంటే సంజమ్మ తెలివితేటల్లో తక్కువదేం కాదు. అతడిని తన పట్టు నుంచి వదులుకోకూడదని తల్లి మనోవాంఛ, అతడిని గుప్పిట బంధించాలని ఈ కోడలి పట్టుదల. ఇదీ ప్రతిచోట జరిగే భాగోతమే. ఇందులో గెలుపు–ఓటమి, ఈవిధంగా ఉంటాయని చెప్పడానికి లేదు. పల్లెలో అయితే పెరుగు మంగమ్మ ఇంట్లో, పట్నంలో అయితే పెరుగుకొనే తంగమ్మ ఇంట్లో ఈ నాటకం జరుగుతూనే ఉంటుంది. ఆఖరి అంకం ఊహించలేని నాటకం. కన్నడ మూలం : డా.మాస్తి వెంకటేశ అయ్యంగార్ - అనువాదం: శర్వాణి -
సాంబారు రుచిగా రావాలంటే ...
సాంబారు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తమిళనాడు సాంబారు. వాళ్లకి సాంబారు లేనిదే వంట లేదు. అసలు సాంబారును ఇష్టపడని వారే ఉండరు. సాంబారును చాలా రకాలుగా చేస్తారు. సాంబారులో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కావలసినవి: కంది పప్పు – ఒక కప్పు; చింత పండు – 10 గ్రా. (నీళ్లలో నానబెట్టి రసం తీయాలి); టొమాటో తరుగు – అర కప్పు; బెండ కాయ ముక్కలు – అర కప్పు; వంకాయ ముక్కలు – పావు కప్పు; సొరకాయ ముక్కలు పెద్ద సైజువి – ఆరు; మునగ కాడ ముక్కలు – 4 ; ఉల్లి తరుగు – అర కప్పు; మిరప కారం – కొద్దిగా; పసుపు – చిటికెడు; బెల్లం పొడి – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – నాలుగు (నిలువుగా కట్ చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత సాంబారు పొడికి కావలసిన పదార్థాలు: ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెగన పప్పు, మినప్పప్పు – 6 టీ స్పూన్లు చొప్పున; ఆవాలు, జీలకర్ర – ఒక టీ స్పూను చొప్పున; ఎండు మిర్చి – 6; ఇంగువ – చిటికెడు తయారీ: కందిపప్పుని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి కుకర్లో ఉడికించాలి. మరొక గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టాలి.ముక్కలు మెత్తగా ఉడికిన తరవాత, ఉడకబెట్టిన కందిపప్పును మెత్తగా మెదిపి ముక్కలలో వేయాలి. చిక్కగా తీసిన చింతపండు రసం, మిరప కారం, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క వేసి, మరిగించాలి. వేరొక పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె లేకుండా ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని సాంబారులో వేసి బాగా కలిపి మరిగించాలి. వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక, చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. పోపు దినుసులు వేసి వేయించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించాక, రెండు గరిటెల మరుగుతున్న సాంబారును పోపులో పోసి, బాగా కలిపి మూత పెట్టి మరిగించాలి. ఆ తరవాత సాంబారు గిన్నెలో పోసి కలపాలి. కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. – ఎన్. కల్యాణ్ సిద్ధార్థ్ -
ఫార్... ఇన్ కిచెన్
వియత్నాం వంటలోసారిప్రయత్నించి చూస్తారా? థాయ్ వంటకాలకు హాయ్ చెప్పాలని ఉందా? ఇవన్నీ మనవి. అంటే మన ఆసియా ఖండానివి. మరి పొరుగింటి పుల్లకూర రుచి కదా! అందుకే...యూరప్ ఖండపు పొరుగు ఖాద్యాలనూ చూద్దాం. టేస్టీ టేస్టీ ఫ్రెంచు... బోల్డంత నోరూరించు అంటూ... ఇటాలియన్ డిషెస్తో నాల్కను మిటకరిస్తూ... లాలాజల వర్షంతో నోరు చిరపుంజీ కాగా దేశదేశాల వంటల్ని మన ఇంట తయారు చేసుకుని... ఆవురావురుమంటూ తిందాం... బ్రేవు బ్రేవుమందాం. సెసేమ్కోటెడ్ స్వీట్ స్టఫ్డ్ పాన్ కేక్స్ (ఫ్రెంచ్) ఫ్రెంచ్ క్విజైన్ డెజర్ట్స్కి బాగా ప్రసిద్ధి. మనం కూడా ఈ రోజు ఇంటి దగ్గరే ఒక డెజర్ట్ తయారుచేసి ఫ్రెంచ్ రుచిని ఇంటి దగ్గరే ఆస్వాదించుదాం. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – కొద్దిగా; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్ – కొద్దిగా; పాలు – అర కప్పు; బటర్ – తగినంత; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; తేనె – కొద్దిగా; ఎల్లో బటర్ – కొద్దిగా; వేయించిన నువ్వులు – 25 గ్రా. స్టఫింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – తగినన్ని (కిస్మిస్, జీడి పప్పు); ఎండు ఖర్జూరాలు – ఆరు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఎల్లో బటర్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒక టే బుల్ స్పూను తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపాక, పిండి మధ్యలో గుంటలాగ చేసి పాలు, గిలకొట్టిన కోడి గుడ్డు, కరిగించిన బటర్ వేసి బాగా కలిపి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక బటర్ వేసి కరిగించాలి ∙కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి, ఎండు ఖర్జూరాలు, పంచదార వేసి బాగా కలపాలి ∙మిశ్రమాన్ని తడిపోయేవరకు కలుపుతూ ఉడికించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి కరిగించాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి కొద్దిగా తీసుకుని, పాన్ మీద దోసె మాదిరిగా వేసి రెండు వైపులా కాల్చాలి ∙బాగా కాలిన తరవాత స్టఫింగ్ మిశ్రమాన్ని దోసె మధ్యలో ఉంచి కర్రతో జాగ్రత్తగా ఒత్తి, మరోమారు కాల్చాలి ∙తయారయిన పాన్ కేక్లను కట్ చేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, పంచదార పొడి, తేనెలతో అలంకరించి, చివరగా నువ్వులతో గార్నిష్ చేసి అందించాలి. పాడ్ థాయి నూడుల్స్ ఎట్ హోమ్ థాయి క్విజీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటగా పాడ్ థాయి నూడుల్స్ను తలచుకుంటారు. ఈ వంటకాన్ని సులువుగా తయారు చేసుకుందామా. కావలసినవి: నూడుల్స్ – అర కేజీ; ఉల్లి కాడలు – ఒక కట్ట; పుట్ట గొడుగులు / బేబీ కార్న్ – 100 గ్రా. ; వేయించిన పల్లీలు – 100 గ్రా.; పల్లీ నూనె – 100 మి.లీ.; చిక్కుడు గింజలు – కొద్దిగా; వెల్లుల్లి తరుగు – కొద్దిగా; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పంచదార – టీ స్పూను; సోయా సాస్ – టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; మిరప కారం – అర టీ స్పూను; అజినమోటో – చిటికెడు తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙నీళ్లు మరుగుతుండగా నూడుల్స్ వేసి ఉడికించి దింపేయాలి ∙నీరు ఒంపేసి, నూడుల్స్ను ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ∙ఇవి చల్లారేలోగా పచ్చి మిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, బేబీ కార్న్, పుట్ట గొడుగులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాక, పచ్చికొబ్బరి తురుము మిశ్రమం ముద్దను వేసి మరోమారు బాగా వేయించి, ఉడికించాలి ∙ఉడికించిన నూడుల్స్ను జత చేసి మిశ్రమం అంతా నూడుల్స్కు పట్టేవరకు కలపాలి ∙ఉప్పు, ఎండు మిర్చి, మిరియాల పొడి, పంచదార, అజినమోటో, సోయా సాస్, ఉల్లి కాడల తరుగు, చిక్కుడు గింజలు, నిమ్మ రసం జత చేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. ఇండియన్ హోమ్ మేడ్ పిజ్జా (ఇటాలియన్ ఫ్యూజన్) పిల్లలు ఈ రోజుల్లో సాయంత్రం స్నాక్స్లా తినడానికి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు. ముందుగా మనం ఇటాలియన్ పిజ్జా తయారీ చూద్దాం. ఇంటి దగ్గరే ఈ పిజ్జాలను తయారుచేసుకోవచ్చు. కావలసినవి... బేస్ కోసం: మైదా పిండి – రెండున్నర కప్పులు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; డ్రై ఈస్ట్ – అర టీ స్పూను; రిఫైన్డ్ ఆయిల్ లేదా ఎల్లో బటర్ – ఒక టీ స్పూను; గోరువెచ్చని నీళ్లు – ఒక కప్పు; మైదా పిండి∙– 3 టే బుల్ స్పూన్లు (అద్దడానికి) టాపింగ్ కోసం: మోజరిల్లా చీజ్ – 150 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు (సన్నగా తరగాలి); కొత్తిమీర – అర కప్పు వెజ్ టాపింగ్స్: సన్నగా తరిగిన పుట్ట గొడుగులు – ఒక కప్పు; బేబీ కార్న్ / ఉడికించిన కూరలు / వేయించిన పనీర్ (వీటిలో ఏదో ఒకటి); నాన్ వెజ్ టాపింగ్స్; బోన్ లెస్ చికెన్ (బ్రాయిల్డ్ లేదా గ్రిల్డ్, ఏదైనా నాన్ వెజ్) సాస్ కోసం: టొమాటో తరుగు – 2 కప్పులు (తొక్క తీసేయాలి); ఆలివ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; పంచదార – కొద్దిగా; నల్ల మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); టొమాటో కెచప్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు –50 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; కార్న్ ఫ్లోర్ – కొద్దిగా (పావు కప్పు నీళ్లలో కలిపితే కార్న్ స్టార్చ్ తయారవుతుంది) సాస్ తయారీ: స్టౌ వెలిగించి, మంటను మీడియంలో ఉంచి, బాణలి పెట్టాలి. ఉల్లి తరుగు జత చేసి వేయించాలి. వెల్లుల్లి తరుగు, నల్ల మిరియాల పొడి, ఎండు మిర్చి ముక్కలు వేసి బాగా వేయించాక టొమాటో తరుగు, ఉప్పు, పం^è దార వేసి కలపాలి. టొమాటోలు మెత్తగా ఉడికి, నీరంతా పోయేవరకు కలుపుతుండాలి. టొమాటో కెచప్, కార్న్ స్టార్చ్ జత చేసి బాగా కలపాలి. మంట బాగా తగ్గించి, మిశ్రమం మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. (టొమాటలో మరీ పుల్లగా అనిపిస్తే మరి కాస్త పంచదార జత చేస్తే సరి). బేస్ తయారీ: ∙ఒక చిన్న పాత్రలో గోరువెచ్చని నీటికి ఈస్ట్ జత చేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙వేరొక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙‘పిజ్జా మృదువుగా రావాలంటే పిండిని చాలాసేపు చే తితో బాగా అదమాలి) ∙ఈ మిశ్రమానికి ఈస్ట్ నీటిని జత చేసి మరోమారు కలపాలి ∙పిండిని కలుపుతూ మధ్యమధ్యలో ఆగుతూ సుమారు ఐదు నిమిషాల పాటు పిండిని కలపాలి ∙పిండి∙మెత్తగా ఉండాలే కాని, చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ∙చేతికి అంటుతుంటే కొద్దిగా మైదా పిండి జత చేయాలి ∙పిండి బాగా కలిపిన తరవాత ఒక టేబుల్ స్పూను నూనె జత చేసి, పిండి సాగేలా అయ్యేవరకు కలపాలి ∙పెద్ద పాత్రకు నూనె పూయాలి ∙మైదా పిండికి కూడా మరి కాస్త నూనె పూసి, పాత్రలో ఉంచి వస్త్రంతో మూసేసి, సుమారు రెండు గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండి రెట్టింపు పరిమాణంలోకి అయ్యాక, పిండిని బయటకు తీసి కొద్దిగా పొడి పిండి జత చేసి మళ్లీ చేతితో బాగా కలిపి, పిండిని రెండు సమాన భాగాలుగా చేసి, సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచేయాలి. నాన్ స్టిక్ పాన్ మీద బేస్ తయారుచేసుకోవాలి: ∙పిండిని చపాతీ కర్రతో ఒత్తి, గుండ్రంగా కట్ చేసుకోవాలి ∙గుండ్రంగా అక్కర్లేని వారు వారికి కావలసిన ఆకారంలో కట్ చేసుకుని, కొద్దిగా పొడి పిండి అద్ది, నూనె పూసిన పిజ్జా పాన్ మీద ఉంచాలి (అంచులు గుండ్రంగా వచ్చేలా కట్ చేసుకోవాలి) ∙గోధుమరంగులోకి వచ్చేవరకు సన్నని మంట మీద ఉంచాలి ∙చివరగా పిజ్జా బేస్ను వేరొక ప్లేట్లోకి తీసి, తయారుచేసి ఉంచుకున్న సాస్ను పిజ్జా మీద వేసి సమానంగా పరచాలి ∙ముందుగా కట్ చేసి ఉంచుకున్న టాపింగ్స్తో అందంగా అలంకరించాలి ∙కొత్తిమీర, చీజ్ తురుము కూడా చల్లాలి ∙ఇప్పుడు పిజ్జాను పాన్ మీద ఉంచి చీజ్ కరిగేవరకు ఉంచి దింపేయాలి ∙ఇలా ఇంటి దగ్గరే పిజ్జా తయారుచేసుకుని అందరూ కలిసి సరదాగా ఆరగించవచ్చు. సతాయ్ హోమ్ స్టైల్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఈ వంటకాన్ని మనం ఇంటి దగ్గరే తయారుచేసుకుందాం. కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; చీజ్ – 100 గ్రా.; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; ఆవాల ముద్ద – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో సాస్ – ఒక టీ స్పూను; బటర్ – ఒక టీ స్పూను; (వెజిటేరియన్లు పుట్ట గొడుగులు, పనీర్, బేబీ కార్న్తో తయారుచేసుకోవచ్చు) తయారీ: ∙ఒక పాత్రలో శుభ్రం చేసిన రొయ్యలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి కలపాలి ∙వీటికి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం, ఆవాల ముద్ద, చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఇదే విధంగా వెజిటేరియన్లు కూరముక్కలను ఊరబెట్టుకోవాలి. టూత్ పిక్లు తీసుకుని ఊరబెట్టిన ఉల్లి పాయ, క్యాప్సికమ్, టొమాటో, రొయ్యలను వరుసగా గుచ్చాలి ∙సమాంతరంగా ఉండే పాన్ తీసుకుని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక బటర్ వేసి కరిగాక, గుచ్చి ఉంచుకున్న పుల్లలను పాన్ మీద ఉంచి బాగా కాల్చాలి ∙చివరగా చీజ్ తురుము వేసి బాగా కలపాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని వేడివేడిగా తయారుచేసి పెడితే బాగుంటుంది. – డా. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ -
మధురం మధురమే
శుభమైనా, సుఖమైనా; మంచికైనా మాటకైనా; వార్తకైనా, వలపుకైనా; అనుబంధమైనదీ అన్యోన్యమైనదీ ‘మధుర’ రసమే గాని మరొకటి కాదు. మిఠాయిని అందిస్తే మైత్రి కుదిరినట్లే. ఇది మన సాంప్రదాయం. జీవశాస్త్రం కూడా దీనికి దాసోహమే. రుచిని గ్రహించేది నాలుక. షడ్రసాలకు సంబంధించి నాలుకపై ఒక్కొక్క చోట ఒక్కొక్క రసానికి సంబంధించిన ‘రసగ్రంధులు’ ఉంటాయి. ఏ పదార్థానికైనా ముందుగా తగిలేది నాలుక చివరి భాగమే. ఈ జిహ్వాగ్ర స్థానంలోనే మధుర రసాన్ని ఆస్వాదించే ‘రస గ్రంధులు’ ఉంటాయని వైద్యశాస్త్రం నిరూపించింది. ఉప్పు, పులుపులకు పార్శ్వ భాగం, ఇతర స్థానాలలో తిక్త కటు కషాయాలు (చేదు, కారం, వగరు) ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఈ షడ్రసాలకు సంబంధించి నిర్దిష్టమైన ఆరోగ్య మరియు పోషక ప్రయోజనాలు, అతి సేవన వలన కలిగే అనర్థాలు సుస్పష్టంగా వివరించింది ఆయుర్వేదం. మధుర రసం: (అష్టాంగ హృదయ సంహితా) ఇది అన్నిటి కంటె శ్రేష్ఠమైనది. జన్మతః అందరికీ హితకరం. ఓజస్సు, ఆయుష్షు, శరీరకాంతి వర్ధకం, ధాతు పుష్టికరం, కేశ వర్థకం. కంఠస్వరాన్ని మెరుగు పరుస్తుంది. బాలింతలలో చనుబాలు (స్తన్యం) కలగడానికి దోహదకారి. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వ్యక్తులకు కూడా హితకరం. (అంటే వ్రణాలు మానడానికి సహాయకారి అని అర్థం). విషహరం కూడా. వాతపిత్త హరం. మధుర రసం ‘గురువు’. అంటే జీర్ణమవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అనంతరం శరీరం బరువుగా ఉంటుంది. అందువలన స్థూలకాయానికి దారి తీస్తుంది. ఆజన్మ సాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం‘ బాలవృద్ధ క్షతక్షీణ, వర్ణ కేశేంద్రియ ఓజసాం.... స్తన్యం సంధానకృత్... ఆయుష్యో.. జీవనః... అతిగా సేవిస్తే... స్థౌల్యం, మధుమేహం, అగ్ని మాంద్యం, ఆంత్రకృతములు, ఇతర కఫ జన్య రోగాలు, కంతులు కలుగుతాయి. సన్యాసం (కోమా) కూడా సంభవించే అవకాశం ఉంది.కురుతే అత్యుపయోగేన సమేదః కఫజాన్, గదాన్‘స్థౌల్య అగ్నిసాద, సన్యాస, మేహ, గండ, అర్బుదాదికాన్‘తీపి ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది? ప్రకృతిసిద్ధ ద్రవ్యాలు: పండ్లు (ఫలాలు): అరటి, సీతాఫలం, సపోటా, పనస, మామిడి, ఖర్జూరం వంటి ఫలాలు అత్యంత మధురంగా ఉంటాయి. అలాగే దానిమ్మ, బొప్పాయి, జామ, ఆపిల్ మొదలైనవి. ద్రవరూప రసంతో ఉండేవాటిలో బత్తాయి, కమలా, ద్రాక్ష, పుచ్చకాయ ప్రధానమైన వి. స్ట్రాబెర్రీ, చెర్రీ, రామాఫలం మొదలైనవి కూడా ఎక్కువ తీపిగా ఉంటాయి. ద్రవాలు: చెరకు రసం, కొబ్బరి నీళ్లు, పాలు, తేనె (కొంచెం వగరు కూడా కలిపి ఉంటుంది) ఔషధ ప్రధానమైనవి: అతి మధురం, శతావరీ (పిల్లి పీచర) మొదలైనవి. ఆహార శాకాలు: తియ్య గుమ్మడి, చిలగడ దుంప, సొరకాయ, బీరకాయ, టొమాటో మొదలైనవి. పప్పులు: నువ్వులు, పెసలు, సెనగలు మొదలైనవి. 2. పిండి వంటలు: వీటి తయారీలో వరి పిండి, గోధుమ పిండి, మైదా పిండి ప్రధాన భూమికలు. పప్పులలో నువ్వులు, మినుములు, పెసలు, సెనగలు, కందుల వంటివి విరివిగా వాడతారు. శర్కర, బెల్లం ప్రధాన పాత్రధారులు. కొన్ని పాయసాలలో పాలు, తేనె, భాగస్వాములు. మరిగించిన నూనెలతో చేసిన డీప్ ఫ్రైలను మిఠాయిలుగా మలుస్తారు. ఉదా: కాజా, లడ్డు, కజ్జికాయ, జిలేబి, అరిసెలు మొదలైనవి. అలాగే పాలు, మీగడలు ప్రధానంగా ఉండే బర్ఫీ, రసగుల్లా, రసమలైల వంటివి కోకొల్లలు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మిఠాయిలు ప్రాచుర్యం పొందుతున్నాయి. చాక్లేట్లు, ఐస్క్రీమ్ల వంటివి అదోరకం. తెలుగు వారి పిండివంటల్లో... మినపసున్ని, బూరెలు, కొబ్బరి లస్కోరా, అరిసెలు, హల్వాలు అత్యంత ప్రధానమైనవి. చాలా వాటిల్లో నెయ్యి కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది.తీపి ఏదైనా ఒకటే విలువా? ఒకటే ప్రయోజనమా? కాదు, కానే కాదు. ప్రకృతి సిద్ధమైనవి ఆరోగ్యపరంగా ప్రథమ స్థానంలో ఉంటాయి. వీటిలో ఉండే సహజమైన పీచు మరియు ఇతర పదార్థాల వల్ల దేహానికి హాని కలుగదు. పిండివంటల్లో వాడే ఇతర పదార్థాలు (వరి, గోధుమ), నూనె, నెయ్యి... వీటి వల్ల ఆయా మిఠాయిల గుణధర్మాలు మారి, కేలరీలు పెరిగి, శరీరం మీద వివిధ ప్రభావాలు చూపిస్తాయి. మరో విషయం ఏమిటంటే, ‘రిఫైన్డ్ ఆయిల్స్, స్వీట్ కోసం ఎసెన్స్, నిల్వ కోసం రసాయనాలు.. ఇలా ఎన్నెన్నో రసాయనిక పదార్థాలు అతిథులుగా చేరి అపార నష్టం కలిగిస్తాయి. బజారులో, స్వీట్ షాపుల్లో లభించే వాటిలో అత్యధిక శాతం ఇలాంటివే. ఆధునిక జీవ రసాయన శాస్త్రం మిఠాయిలన్నీ కార్బోహైడ్రేట్సు ప్రధానమైనవే. ఇవి ధాతు పరిణామంలో గ్లూకోజ్గా మారాల్సిందే. అందుకు ఇన్సులిన్ అవసరం కాబట్టి మధుమేహ రోగులు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రకృతిసిద్ధ మధుర ద్రవ్యాలలో నేరుగా ‘సుక్రోజ్’ ఉంటుంది. (సుక్రోజ్ = ఫ్రక్టోజ్+ గ్లూకోజ్). కాబట్టి వీటి అరుగుదల ధాతుపరిణామాలలో ఇన్సులిన్ అతి తక్కువ పాత్ర పోషిస్తుంది. ఇది గమనించాల్సి ఉంది. గుర్తుంచుకోవలసిన సారాంశం: రసములారింట ‘మధురమ్ము’ రమ్య రసము ప్రకృతి దత్తపు మధురిమల్ వరము మనకు తీపి యెంతేని సర్వదా తృప్తికరము ఆయురారోగ్యసిద్ధికై అగ్రగామి లె గువ వహియించి మితిమీరి తినగవలదు గృహ మిఠాయిలు తినవయ్య ఇంపు మీర అంగడివి యేల దేహ బాధార్తి యేల సప్త ధాతుసారమునకు సహకరించు మినపసున్నిని సేవించు తనివి తీర! అమిత తక్షణ శక్తికై అరటి పండు. డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు -
రుచిగా లేదనుకుంటే నష్టపోతాం
పాపం... దొండకాయను కాకి ముక్కుతో జత చేసేప్పుడు మనమిచ్చే ప్రాధాన్యం.. దాన్ని కూరగా పరిగణించినప్పుడు అంతగా ఇవ్వం. కానీ కాకి విషయంలో దాని అందం ఎంతో... తిండి విషయంలో దాంతో వచ్చే ఆరోగ్యమూ అంతే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అంతగా రుచించదంటూ దొండను ముట్టకపోతే మనమే అజ్ఞానకాకులం అవుతామంటున్నారు కాకలు దీరిన ఆహారనిపుణులు. దొండకాయతో మనకు సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. దొండకాయ ఒంట్లో విడుదలయ్యే చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే ఇది డయాబెటిస్ రోగులకు మంచిది. క్రమం తప్పకుండా దొండకాయ తినేవారిలో చక్కెర పాళ్లు నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. కొవ్వుగా మారే ప్రీ–అడిపోసైట్స్ అనే కణాలను దొండకాయ సమర్థంగా నివారిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దొండలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత (అనీమియా) తగ్గుతుంది. ఐరన్ లేమి వల్ల వచ్చే నిస్సత్తువ కూడా మాయమవుతుంది.దొండ వల్ల కేంద్ర నాడీమండలం బలం పుంజుకుంటుంది. మెదడుకూ మంచిది. ఇది మూర్ఛ (ఎపిలెప్సీ), అలై్జమర్స్ వంటి వాటిని చాలావరకు నివారిస్తుంది. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే మణికట్టు నొప్పి కలిగించే జబ్బుకు దొండకాయ స్వాభావికమైన చికిత్సగా చాలామంది వైద్యులు పరిగణిస్తుంటారు. దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది. దొండకాయ మూత్రపిండాల్లో రాళ్లను సమర్థంగా నివారిస్తుంది. దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండకాయలో సాపోనిన్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల అది ఎన్నో రకాల అలర్జీలను నివారిస్తుంది. దొండలో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది. దొండలోని యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది. దొండలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ చాలా మంచిది. హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా అది గుండెజబ్బులనూ అరికడుతుంది. చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది. -
ఎండాహారం
ఎండ మధ్యాహ్నాలు సేద తీరమంటాయిచిన్న కునుకు తీయమంటాయినిద్ర నుంచి లేచాక ఆకలిరుచిగా ఏం తినాలిరుచి మాత్రమే కాదు చలువ చేసేలా ఏం తినొచ్చు? ఇవిగో ఈ ఎండాహారాన్ని తీసుకోండి. ఓట్స్ భేల్ కావలసినవి: ఓట్స్ – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; దోసకాయ తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒకటిన్నర టీ స్పూన్లు; వేయించిన పల్లీలు – అర కప్పు; టొమాటో సాస్ – తగినంత తయారి: ∙బాణలిలో నెయ్యి వేడయ్యాక ఓట్స్ వేసి కొద్దిగా వేగాక... ఉల్లి తరుగు, టొమాటో తరుగు, దోస తరుగు, పచ్చి మిర్చి తరుగు, క్యాప్సికమ్ తరుగు, క్యారట్ తరుగు వేసి బాగా కలపాలి ∙కొత్తిమీర, వేయించిన పల్లీలను జత చేసి బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి ∙టొమాటో సాస్తో అందించాలి. సగ్గుబియ్యం పొంగలి కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పెసర పప్పు – పావు కప్పు; ఆవాలు – అర టీ స్పూను; మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1; కరివేపాకు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నెయ్యి – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – తగినంత; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీడి పప్పులు – 6; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత తయారి: ∙సగ్గు బియ్యంలో నీళ్లు పోసి బాగా కడిగి ఆ నీళ్లు ఒంపేసి, సగ్గు బియ్యం మునిగే వరకు మంచి నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ∙పెసరపప్పును విడిగా నానబెట్టాలి ∙స్టౌ మీద కుకర్ ఉంచి, నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి , జీడి పప్పు, కరివేపాకు, మిరియాల పొడి వేసి వేయించాక, రెండున్నర కప్పుల నీళ్లు పోసి, నానబెట్టిన సగ్గుబియ్యం, పెసర పప్పు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి, బాగా కలిపి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి పల్లీ చట్నీతో వేడి వేడి సగ్గు బియ్యం పొంగలి అందించాలి. క్యారట్ ఉల్లిపాయ కూర కావలసినవి: క్యారట్ తురుము – రెండు కప్పులు; పెరుగు – ఒక కప్పు; సన్నగా తరిగిన ఉల్లిపాయలు – పావు కప్పు; నిమ్మ చెక్క – ఒకటి; ఉప్పు – తగినంత; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; ఎండు మిర్చి – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, ఉల్లితరుగు జత చేసి మరోమారు కలిపి, దోరగా వేగిన తరువాత స్టౌ మీద నుంచి దించి, గిన్నెలోకి తీసుకోవాలి ∙చల్లారిన తరవాత క్యారట్ తురుము, ఉప్పు, నిమ్మరసం, పెరుగు జత వేసి బాగా కలపాలి ∙ఈ కూర చపాతీలోకి, పూరీలోకి చాలా రుచిగా ఉంటుంది. మిక్స్డ్ గ్రెయిన్ దోసె కావలసినవి: రాగి పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – ఒక కప్పు; గోధుమ పిండి – ఒక కప్పు; జొన్న పిండి – ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక కప్పు; సగ్గు బియ్యం – పావు కప్పు; ఉప్పు – తగినంత; పచ్చి మిర్చి పేస్ట్ – తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూను; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; జీలకర్ర – ఒక టీ స్పూను తయారి: ∙సగ్గుబియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి ఏడెనిమిది విజిల్స్ వచ్చాక దింపి, చల్లారనివ్వాలి ∙ఒక బౌల్లో రాగి పిండి, బియ్యప్పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, పోసి కలపాలి ∙చల్లారిన సగ్గు బియ్యం జావను జత చేసి, తగినన్నినీళ్లు పోసి దోసెల పిండిలా కలపాలి ∙సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చి మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ∙బాణలి మీద పెనం వేడయ్యాక పిండిని దోసెలుగా వేసి, రెండువైపులా దోరగా కాలాక ప్లేట్లోకి తీసుకుని, టొమాటో సాస్ / పల్లీ పచ్చడితో అందించాలి. పెసర మొలకలు – రాగిపిండి మాల్ట్ కావలసినవి: పెసర మొలకలు – అర కప్పు; ఉప్పు – తగినంత; రాగి పిండి – అర కప్పు; మజ్జిగ – తగినంత తయారి: ∙రాగి పిండికి తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి దోసెలపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, బాగా మరిగిన తరవాత, మంట బాగా తగ్గించి, కలిపి ఉంచుకున్న రాగి పిండిని పోస్తూ గరిటెతో కలుపుతుండాలి ∙తెల్లని పొంగులా రాగానే పెసర మొలకలు వేసి కలిపి రెండు మూడు నిమిషాల తరవాత దింపేయాలి ∙బాగా చల్లారాక మజ్జిగ కలిపి గ్లాసులలో అందించాలి ∙ఒక గ్లాసు మాల్ట్ తాగితే చాలు కడుపులో చల్లగా ఉంటుంది. పెరుగు సలాడ్ కావలసినవి: పెరుగు – 3 కప్పులు; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; తోటకూర తరుగు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూను; బెల్లం – 4 టీ స్పూన్లు; కరివేపాకు తరుగు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; క్యారట్ తురుము – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; దానిమ్మ గింజలు – పావు కప్పు; తురిమిన అల్లం – అర టీ స్పూను; సొరకాయ తురుము – పావు కప్పు; క్యాబేజీ తరుగు – పావు కప్పు. తయారి: ∙ఒక పాత్రలో తోటకూర తరుగు, క్యారట్ తురుము, సొరకాయ తురుము, క్యాబేజీ తరుగు, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉడికించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో పెరుగు వేసి, ఉడికించుకున్న కూరలను జత చేయాలి ∙పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, అల్లం తురుము, బెల్లం, జీలకర్ర పొడి, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, వేసి బాగా కలిపి, ఫ్రిజ్లో పెట్టి, చల్లారాక బయటకు తీసి అందించాలి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. కూల్ డ్రింక్ నొంగు పాల తయారీ కావలసినవి: ముంజలు – 6 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి)పాలు – 2 కప్పులుపంచదార – ఒక టేబుల్ స్పూను ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారి: ∙ఒక పాత్రలో పాలు పోసి, స్టవ్ మీద ఉంచి పాలు మరిగి మూడు వంతులు అయ్యేవరకు మరిగించాలి. ∙పంచదార, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉంచి దింపేసి చల్లారనివ్వాలి. ∙ముంజల ముక్కలు జత చేసి ఫ్రిజ్లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, గ్లాసులలో పోసి అందించాలి. ∙వేసవి తాపాన్ని చల్లార్చే సహజ పానీయం ఇది. ఇంటి చిట్కాలు సాంబారు మరింత రుచిగా రావాలంటే.. ∙పోపును నేతిలో వేయించాలి ∙చిటికెడు దాల్చినచెక్క పొడి వేయాలి. ∙ముల్లంగి ముక్కలు వేయాలి. ∙ఉల్లికాడలు, చిన్న ఉల్లిపాయలు (సాంబారు ఉల్లిపాయలు) ఉపయోగించాలి. ∙ఉడికించిన పప్పును మెత్తగా మెదపాలి ∙జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం జత చేస్తే, అదనపు రుచి వచ్చి సాంబారు ఘుమఘుమలాడుతుంది. ∙ముక్కలను మరీ గుజ్జులా ఉడకపెట్టకూడదు (వేసవిలో కందిపప్పు బదులు పెసర పప్పు ఉపయోగిస్తే చలవ చేస్తుంది) ఫుడ్ ఫ్యాక్ట్స్ మజ్జిగ ఉపయోగాలు... సోఫార్శోగ్రహణీదోషమైత్రగ్రహోదరారుచౌస్నేహవయాపది పాండుత్వే తక్రం దద్యాద్గరేషు చ(చరక సంహిత 27వ సూత్రం)ఆరోగ్యానికి మజ్జిగ మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. మానవులలో ఉండే త్రిదోషాలనూ మజ్జిగ అదుపులో ఉంచుతుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాత దోషం, పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పిత్త దోషం, శొంఠి, పిప్పళ్లు, మిరియాల పొడితో కలిపి తీసుకుంటే కఫ దోషం తగ్గుతాయి. గేదె పాల నుంచి తయారయిన మజ్జిగ కంటె, ఆవు పాల మజ్జిగ మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు (ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల వారికి మజ్జిగ మంచిది కాదు). ∙పథ్యంగా పనిచేస్తుంది ∙ఆకలిని పెంచుతుంది. ∙రుచి కారకంగా, బుద్ధిని పెంచేందుకు తోడ్పడుతుంది. ∙ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణం కలిపిన మజ్జిగతో కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది. ∙పైల్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ∙తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది. రోజులో ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన దాహార్తిని తీరుతుంది. ∙శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియమ్లను అందిస్తుంది. ∙గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయడపడుతుంది. ∙బిపి, కొలñ స్ట్రాల్లను నివారిస్తుంది. ∙శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ∙శరీరంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది ∙ఎముకలను బలంగా చేస్తుంది. ∙ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. ∙శరీరంలోని మెటబాలిజమ్ రేటును పెంచి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ∙అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిట్కాలు... ∙మజ్జిగలో ఒక టీ స్పూను తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకోవాలి ∙వెన్ను నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ∙గ్లాసుడు మజ్జిగలో అర టీ స్పూను శొంఠి పొడి వేసి తీసుకుంటే, పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. క్రమం తప్పకుండా కనీసం నెల రోజులు పాటించడం వలన ఫలితం లభిస్తుంది. – పి. సాయిజ్యోతి అచ్చంపేట నాగర్కర్నూల్ జిల్లా -
జీవితపు రుచి
ప్రాణాలు పోయేంతటి విపత్కర పరిస్థితిలో కూడా జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలిగే వెసులుబాటు ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే, మనకు ప్రాణాలు పోయేంత సందర్భాలు ఉంటాయా? ఒకాయన ఒక మూలిక కోసం దట్టమైన అరణ్యానికి వెళ్లాడు. వెతుకుతూ నడుస్తుండగా– ఉన్నట్టుండి, వెనక నుంచి పులి గాండ్రింపు వినబడింది. ప్రాణాలు కాపాడుకోవడానికి తోచినదిక్కు పరుగెత్తాడు. అలా ఒక కొండ మీదికి చేరుకున్నాడు. ఆ భయంలో అక్కడ పట్టుజారడంతో కొండ కొమ్ముకు వేలాడసాగాడు. తిరిగి పైకి ఎక్కడానికి వీలు లేదు. అక్కడ పులి ఉంటే! చూస్తే కొండలో మొలిచిన ఒక తీగేదో కనబడింది. దాన్ని పట్టుకుని కిందకు దిగాలన్న ఆలోచన వచ్చింది. నెమ్మదిగా తీగను అందుకున్నాడు. అలా గాల్లో వేలాడుతుండగా, హఠాత్తుగా కొండలో ఉన్న బొరియలోంచి వచ్చిన రెండు ఎలుకలు ఆ తీగను కొరకడం మొదలుపెట్టాయి. ఇప్పుడేం చేయాలి? అప్పుడు ఆయన ఆ తీగకు ఒక చిన్న పండు ఉందని గమనించాడు. అది ఎర్రగా గుండ్రంగా ఉండి, నోరూరిస్తోంది. దాన్ని తెంపి నోట్లో వేసుకున్నాడు. అంతటి గొప్ప రుచి అతడు అంతకుముందెన్నడూ చూడలేదు. ఇంతే కథ! ఆ బాటసారి ఆ తర్వాత ఏమయ్యాడు అన్నది మనకు చెప్పదు. కానీ ఈ చెప్పిన మేరలోనే ఎంత వెలుగు ప్రసరిస్తోంది! ప్రాణాలు పోయేంతటి విపత్కర పరిస్థితిలో కూడా జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలిగే వెసులుబాటు ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే, మనకు ప్రాణాలు పోయేంత సందర్భాలు ఉంటాయా? మరి ఎంతమేరకు జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలుగుతున్నాం! -
గుడ్డు అదే ఆమ్లెట్ ఇది
గుడ్డు చూసినప్పటి నుంచి ఆమ్లెట్ను చూస్తూనే ఉన్నాం. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఆమ్లెట్టే ముందు అని చెప్పాం. అంత సుపరిచితమైన ఆమ్లెట్లలో సూపర్ రుచివంతమైన ఆమ్లెట్లు ఇవి. మష్రూమ్ ఆమ్లెట్ కావలసినవి: అన్సాల్టెడ్ బటర్ – 2 టీ స్పూన్లు, బటన్ మష్రూమ్స్ (చిన్న పుట్ట గొడుగులు) – అర కప్పు (నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి), కోడి గుడ్లు – 2 (లేదా నాలుగు తెల్ల సొనలు), నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి / కారం– కొద్దిగా, చీజ్ తురుము – టేబుల్ స్పూను తయారి: ∙పెనం స్టౌ మీద పెట్టి, టీ స్పూను అన్సాల్టెడ్ బటర్ వేసి కరిగించాలి ∙సన్నగా తరిగిన మష్రూమ్స్ని వేసి వేయించాలి ∙ఉప్పు, మిరియాల పొడి/కారం జత చేసి దోరగా వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకుని మూత పెట్టి, పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు, నీళ్లు వేసి బాగా గిలకొట్టాక, ఉప్పు, మిరియాల పొడి జత చేసి బాగా కలపాలి ∙పెనం మీద బటర్ వేసి పెనమంతా పరుచుకునేలా చేయాలి ∙బాగా కాగాక... గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమం వేసి పెనం మీద సమానంగా పరవాలి ∙బాగా ఉడికిన తరవాత, వేయించి ఉంచుకున్న మష్రూమ్ ముక్కల మిశ్రమాన్ని ఆమ్లెట్ మీద సమానంగా వేయాలి ∙మధ్యకు మడతపెట్టి ప్లేట్లోకి తీసుకోవాలి ∙సన్నగా తురిమిన చీజ్ను పైన చల్లి అందించాలి. పీనట్ చికెన్ ఆమ్లెట్ రోల్స్ కావలసినవి: కోడి గుడ్డు – 1, నీళ్లు – టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, స్వీట్ చిల్లీ సాస్ – టేబుల్ స్పూను, జ్యూస్ అండ్ ఫిష్ సాస్ – టీ స్పూను, చికెన్ ముక్కలు – అర కప్పు, ఉడికించిన బఠాణీ + క్యారట్ ముక్కలు – కప్పు, కీరా తురుము – పావు కప్పు, మిరియాల పొడి – టీ స్పూను, పుదీనా ఆకులు – గుప్పెడు, ఉల్లి కాడల తరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, పీనట్స్ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కాడలు – తగినన్ని తయారి: ∙ఒక పాత్రలో కోడిగుడ్డు, టేబుల్ స్పూను నీళ్లు, ఉప్పు చేసి బాగా గిలకొట్టాలి ∙సన్నటి మంట మీద పాన్ వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమం వేసి, ఆమ్లెట్ కొద్దిగా మందంగా వచ్చేలా జాగ్రత్తపడాలి ∙బాగా కాలిన తరవాత ఆమ్లెట్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙ఒక పాత్రలో స్వీట్ చిల్లీ సాస్, జ్యూస్ అండ్ ఫిష్ సాస్ వేసి కలపాలి ∙బాణలిలో నూనె కాగాక చికెన్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్ చిల్లీ సాస్ మిశ్రమం జత చేయాలి ∙ఆమ్లెట్ మీద ఉడికించిన కూరల తరుగు, చికెన్ మిశ్రమం సమానంగా పరిచి, పుదీనా ఆకులు ఉంచి, రోల్ చేయాలి కొత్తిమీర కాడలతో ముడి వేసి, పీనట్స్ సాస్తో అందించాలి. స్వీట్ ఫ్రూట్ ఆమ్లెట్ కావలసినవి: కోడి గుడ్లు – 2 (తెల్ల సొన మాత్రమే), పంచదార పొడి – టేబుల్ స్పూను, నీళ్లు – టేబుల్ స్పూను, అన్సాల్టెడ్ బటర్ – టేబుల్ స్పూను, అరటి పండు ముక్కలు – అర కప్పు, ఆపిల్ ముక్కలు – పావు కప్పు, స్ట్రా బెర్రీలు – 4 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి), తేనె – కొద్దిగా తయారి: ∙ఒక పాత్రలో తెల్ల సొనలు, పంచదార పొడి, నీళ్లు వేసి బాగా గిలకొట్టి పక్కన ఉంచాలి ∙మరో పాత్రలో పండ్ల ముక్కలు, తేనె వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక బటర్ వేసి పెనం మీద అంతా పరచాలి ∙గిలకొట్టిన కోడి గుడ్డు మిశ్రమం వేసి బాగా కాలనివ్వాలి ∙రెండవ వైపు కూడా కాలాక, ఆమ్లెట్ను ప్లేట్లోకి తీసి, పండ్ల ముక్కల మిశ్రమం వేసి, ఆమ్లెట్ను మధ్యకు మడిచి, వెంటనే అందించాలి. ప్రాన్స్ ఆమ్లెట్ కావలసినవి: ఉల్లి తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రేకలు – 1 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి), క్యాప్సికమ్ తరుగు – టేబుల్ స్పూను, రొయ్యలు – 12 (శు్ర¿¶ ం చేయాలి), కోడి గుడ్లు – 5, నీళ్లు – టేబుల్ స్పూను, పాలు – కప్పు, కరివేపాకు పొడి – టీ స్పూను, ఉప్పు – తగినంత, మిరప పొడి – టీ స్పూను, మిరియాల పొడి – తగినంత, ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూను, చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, టొమాటో తరుగు – అర కప్పు తయారి: ∙బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేగాక, రొయ్యలు, తగినంత ఉప్పు, మిరప పొడి జత చేసి మరోమారు వేయించాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి దగ్గర పడే వరకు ఉడికించి, తీసేయాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు వేసి గిలకొట్టాక, పాలు, కరివేపాకు పొడి, ఉప్పు, మిరియాల పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, కలిపి ఉంచుకున్న కోడి గుడ్ల మిశ్రమం వేయాలి ∙బాగా కాలిన తరవాత చీజ్ తురుము, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ తరుగు, తయారుచేసి ఉంచుకున్న రొయ్యల మిశ్రమం వేసి ఆమ్లెట్ను మధ్యకు మడిచి అందించాలి. స్టఫ్డ్ ఆమ్లెట్ కావలసినవి: ఆలివ్ ఆయిల్ – టీ స్పూను, రెడ్ క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా పొడవుగా తరగాలి), ఉల్లి తరుగు – టేబుల్ స్పూను, చిన్న మెంతి కూర ఆకులు – కప్పు, జీడిపప్పు ముక్కలు – టేబుల్ స్పూను, కోడి గుడ్లు – 2, నీళ్లు – టేబుల్ స్పూను, ఉప్పు – తగినంత, మిరియాల పొడి / కారం – తగినంత, చీజ్ – టేబుల్ స్పూను. తయారి: ∙స్టౌ మీద పెనం ఉంచి ఆలివ్ ఆయిల్ వేసి, సన్న మంట మీద కాగనివ్వాలి ∙రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, జీడి పప్పు ముక్కలు వేసి ఆపకుండా కలుపుతూ, దోరగా వేయించాలి ∙రెండు నిమిషాల తరవాత మెంతి కూర జత చేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు, టేబుల్ స్పూను నీళ్లు వేసి బాగా గిలకొట్టాలి ∙ఉప్పు, మిరియాల పొడి / కారం పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడి చేసి, చీజ్ వేసి, కరిగించాలి ∙గిలకొట్టిన కోడిగుడ్డు మి్రÔ¶ మాన్ని వేసి, సమానంగా పరవాలి ∙బాగా కాలిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న స్టఫ్ను వేసి, ఆమ్లెట్ మీద సగ భాగం వరకు సర్ది మధ్యకు మడత వేయాలి ∙పైన చీజ్ తురుము వేసి, వెంటనే అందించాలి. -
ఇంట్లో పోట్లాట
పొట్లకాయ... సన్నగా లేతగా నాజూగ్గా ఉంటుంది దాంతో వంట గదిలో ఏ మ్యాజిక్ అయినా చేయచ్చు రుచి కూడా అంతే! రుచిలో పొట్లకాయతో పోట్లాడే కూరగాయ లేదేమో దీనిని వండితే ఇంట్లో పోట్లాటలు తప్పవేమో వండండి... పోటీ పడి తినండి పొట్లకాయ దోశె కావలసినవి: చిన్న సైజు పొట్లకాయ – 1, బియ్యప్పిండి – 1/4 కప్పు, బొంబాయి రవ్వ – 1 స్పూన్ (ఆప్షనల్), జీలకర్ర – 1/4 టీ స్పూన్, పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయ – 1 (ఆప్షనల్), కొత్తిమీర – కొంచెం, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – సరిపడ. తయారీ: ∙పొట్లకాయను కడిగి, గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙ఒక జార్లో పొట్లకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి సరిపడ నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ∙ఒక గిన్నెలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, జీలకర్ర, సరిపడ ఉప్పు, తరిగిన కొత్తిమీర, పొట్లకాయ పేస్ట్ అన్నీ కలిపి సరిపడ నీరు పోసి దోశె పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ పైన పెనం పెట్టి అర స్పూన్ నూనె వేసి వేడయ్యాక గుండ్రంగా దోశె వేసి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ∙దోశెకు చిల్లులు పడి కాలిన తర్వాత కొంచెం నూనె వేసి రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలి కొత్తిమీర చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పొట్లకాయ పెరుగు పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు – 1 కప్పు, పెరుగు – 1/2 లీటరు, ఎండుమిర్చి – 2, పోపు దినుసులు – అర టీ స్పూన్, తరిగిన మిర్చి – 3, ఉప్పు – రుచికి సరిపడ, కారం – 1/2 టీ స్పూన్, పసుపు – చిటికెడు, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1; కరివేపాకు – 2 రెబ్బలు, ఇంగువ – చిటికెడు, మెంతిపొడి– 1/2 టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ఒక గిన్నెలో పెరుగు తీసుకుని గిలకొట్టి, సరిపడ ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి ∙వేగిన పోపులో ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, మెంతిపొడి వేసి నిమిషం వేగనిచ్చి, పొట్లకాయ ముక్కలు వేసి మరో పది నిమిషాలు వేయించుకోవాలి ∙పొట్లకాయ ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు గిన్నెలోకి ఈ పొట్లకాయ ముక్కలను, జీలకర్ర పొడిన వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ! పొట్లకాయ బజ్జీ కావలసినవి: పొట్లకాయ – 1, శనగపిండి – 2 కప్పులు, బియ్యప్పిండి – 1/4 కప్పు, వాము – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు; కారం – 1/2 టీ స్పూన్, వంట సోడా – 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – వేయించడానికి సరిపడ, చాట్ మసాలా – 1 టీ స్పూన్ (ఆప్షనల్). తయారీ: ∙పొట్లకాయను స్పూన్తో పై పొట్టును తీసుకోవాలి ∙పొట్లకాయను మనకు కావలసిన షేప్లో అంటే రింగ్స్లా కానీ, పొడవుగా కానీ కట్ చేసుకుని పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పొట్లకాయ ముక్కలు, నూనె తప్ప మిగిలినవన్నీ కలిపి కొంచెం కొంచెం నీరు పోస్తూ మరీ జారుగా కాకుండా పిండి కలుపుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి బాగా వేడయ్యాక మీడియమ్ మంటమీద పొట్లకాయ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ∙పొట్లకాయ బజ్జీలను నూనె లేకుండా ప్లేట్లోకి తీసుకుని లైట్గా చాట్ మసాలా చల్లి వేడి వేడిగా సర్వ్ చేయండి. గుత్తి పొట్లకాయ కావలసినవి: పొట్లకాయ – 1 (అంగుళంన్నర ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు, ఉల్లిపాయ – 1, అల్లం – 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి – 10 రెబ్బలు, జీలకర్ర – 1 టీ స్పూన్, ధనియాలు – 1 టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, చీజ్ – 4 టీ స్పూన్స్, పసుపు – కొంచెం, మిర్చి – 1/4 టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు – 1/2 టీ స్పూన్ (లేదా ఆమ్చూర్ పౌడర్ – 1 టీ స్పూన్), ఉప్పు – రుచికి సరిపడ, నూనె 4 టీ స్పూన్. తయారీ: ∙పొట్లకాయ పైపొట్టును స్పూన్తో తీసి కడగాలి. స్టవ్ చేసుకోవడానికి వీలుగా మధ్యలో ఉన్న గింజలు కూడా తీసేయాలి ∙మిక్సీ జార్లో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి 2 స్ఫూన్లు నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి ∙తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద, పొట్లకాయను గింజలు, చింతపండు గుజ్జు, గరం మసాలా, ఛీజ్ కూడా వేసి మరి కాసేపు వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన స్టఫింగ్ను పొట్లకాయ ముక్కలలో కూరుకోవాలి మరొక బాణలిని వేడి చేసి 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక స్టఫింగ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేగనివ్వాలి ∙చిన్న మంట మీద 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. తర్వాత నెమ్మదిగా అన్ని వైపులా కాలేలా స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙పూర్తిగా వేగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గుత్తి పొట్లకాయ రెడీ! – సేకరణ: జ్యోతి గొడవర్తి -
ఉహ్.. ఒహ్.. సిరి
కొరికితే ఉహ్ వండితే అహ్ తింటే ఒహ్ ఉసిరండీ.. దానికి సరిలేదండీ! ఉహ్.. ఒహ్.. ఉసిరి. ఉసిరికాయ జ్యూస్ కావలసినవి: ఉసిరికాయలు – 2; మిరియాలు – 2; జీలకర్రపొడి – అర టీ స్పూన్, కరివేపాకు – 1 రెబ్బ, ఉప్పు – 1/4 టీ స్పూన్, నీళ్లు – 1/2 లీటరు; తేనె – 1 టీ స్పూన్. తయారి: ∙ఉసిరికాయలను కడిగి గింజలు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, మిరియాలు, జీలకర్రపొడి, కరివేపాకు, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా బ్లెండ్ చేయాలి ∙ఈ మిశ్రమాన్ని వడకట్టి, తేనె కలిపితే ఉసిరికాయ జ్యూస్ రెడీ. ఉసిరి, కీరా పెరుగు పచ్చడి కావలసినవి: చిలికిన పెరుగు – 2 కప్పులు; ఉసిరికాయలు – 4 (తురుముకోవాలి); తురిమిన కొబ్బరి – 1/4 కప్పు; కీర దోస – 1 (తురుముకోవాలి); ఆవాల నూనె – 2 స్పూన్స్, ఆవాలు – 1 టీ స్పూన్; కరివేపాకు – 1 రెబ్బ, ఉప్పు, రుచికి సరిపడ. తయారి: ∙ఒక గిన్నెలోకి ఉసిరి తురుము, కొబ్బరి తురుము, కీరా తురుము, చిలికిన పెరగు, ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి ∙చిన్న పాన్ను వేడి చేసి నూనె పోసి, ఆవాలు చిటపడలాడాక కరివేపాకు వేసి వేగిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి ∙పలావ్తో ఈ రైతా బాగుంటుంది. ఉసిరికాయ తొక్కు పచ్చడి కావలసినవి :ఉసిరికాయలు – 250 గ్రా; ఉప్పు – 40 గ్రా; పసుపు – 1/2 టీ స్పూన్, మెంతులు – 2 1/2 టీ స్పూన్స్, ఆవాలు – 2 1/2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 12; ఎండుమర్చి – 12; ఇంగువ – 1/2 టీ స్పూన్, ఇంగువ – 1/2 టీ స్పూన్; నూనె – 1/4 కప్పు. కావలసినవి ∙ముందుగా ఉసిరికాయలు కడిగి, తడి లేకుండా బాగా తుడుచుకొని, గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి ∙మిక్సీ జార్లో ముక్కలు చేసిన ఉసిరికాయ ముక్కలు, పసుపు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ∙గ్రైండ్ చేసిన ఉసిరికాయ తొక్కుకు తగినంత ఉప్పు కలిపి గాజు సీసాలో కానీ, జాడీలో కాని 3 రోజుల పాలు ఉంచితే చక్కగా ఊరుతుంది ∙పచ్చిమిర్చి కడిగి, తడిలేకుండా చూసుకుని ముక్కలుగా చేసుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు వేసి చిటపటలాడుతుండగా మెంతులు కూడా వేసి వేయించుకోవాలి ∙తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. నూనె లేకుండా వాడ్చి, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. దీనికి ఉసిరికాయ తొక్కును వేసి మరోసారి గ్రౌండ్ చేసుకోవాలి ∙ఒక గిన్నెలోకి ఈ పచ్చడిని తీసుకుని చేతితో బాగా కలుపుకోవాలి ∙పోపులో మిగిలిన నూనె చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఉసిరి లడ్డు కావలసినవి: ఉసిరికాయలు – 250 గ్రా; పంచదార – 250 గ్రా; బాదం పొడి – 50 గ్రా; జీడిపప్పు పొడి – 25 గ్రా; నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్; యాలకుల పొడి – 1 టీ స్పూన్, జాజికాయ పొడి – 1/2 టీ స్పూన్. తయారి: ∙ముందుగా ఉసిరికాయలను కడిగి కుక్కర్లో నీళ్లు పోయకుండా, విజిల్, గ్యాస్కట్ పెట్టకుండా 7 నిమిషాలు ఉంచి తీసేయాలి (మైక్రోవేవ్లో అయితే మాక్సిమమ్ టెంపరేచర్లో 5 నిమిషాలు సరిపోతుంది) ∙వేడిచేసిన ఉసిరికాయలను పూర్తిగా చల్లారిన తర్వాత తురుముకోవాలి ∙స్టౌ పైన నాన్స్టిక్ పాన్ పెట్టి ఉసిరి తురుము, పంచదార వేసి కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగి చిక్కటి పాకం వచ్చాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని, బాదం పొడి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలిసేవరకు కలుపుకోవాలి ∙అరచేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా మనకు కావలసిన సైజులో చేసుకోవాలి ∙ఈ లడ్డు ఎయిట్టైట్ కంటెయినర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచుకుంటే 4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఉసిరికాయ గోరుచిక్కుడుకాయ కూర కావలసినవి: గోరుచిక్కుడు – 1/2 కేజి; ఉసిరికాయలు –2; పచ్చిమిర్చి – 2; ఆవాలు–1 టీ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్; ధనియాల పొడి – 1 టీ స్పూన్, కరివేపాకు – 1 రెబ్బ; పసుపు – 1/2 టీ స్పూన్, ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 3 టేబుల్ స్పూన్స్. తయారి: ∙గోరుచిక్కుడుకాయలు కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి ∙ఉసిరికాయలను తురిమి పెట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, తురిమిన ఉసిరికాయ వేసి వేయించుకోవాలి ∙ఇప్పుడు తరిగిన గోరుచిక్కుడు కాయలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కొంచెం నీళ్లు చల్లి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. పుల్లపుల్లటి ఉసిరి–గోరుచిక్కుడుకాయ కూర రెడీ. ఉసిరికాయ పులిహోర కావలసినవి: బియ్యం – 1/2 కేజీ (ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి); ఉసిరికాయలు – 3; పచ్చిమిర్చి – 4, కరివేపాయకు – 2 రెబ్బలు; – కొత్తిమీర – గుప్పెడు; వేరుశెనగగుళ్లు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – 1 టీ స్పూన్, జీలకర్ర – 2 టీ స్పూన్, పచ్చిశెనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 1 టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – 4 టేబుల్ స్పూన్స్. తయారి: ∙ఉసిరికాయలు కడిగి గింజలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ∙మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ∙స్టౌ పై బాణలి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపప్పు, వేరుశెనగగుళ్లు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి ∙తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ కొత్తిమీర మిశ్రమాన్ని, పసుపు వేసి మరికాసేపు వేగనివ్వాలి ∙ఉసిరికాయ మిశ్రమం కలిపిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకూడదు. ∙వెంటనే అన్నం కూడా వేసి బాగా కలిపితే వేడి వేడి ఉసిరికాయ పులిహోర రెడీ. ఆరోగ్యఉసిరి ఒక టీ స్పూన్ ఉసిరిక పొడిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది.రోజుకు ఒక ఉసిరి కాయ తింటే (పచ్చడి, పొడి, రసం ఏ రూపంలోనైనా) దేహం శక్తిమంతంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియల వ్యవస్థ సక్రమమవుతుంది. రోజూ భోజనానికి ముందు ఒక గ్లాసు ఉసిరి రసం తాగితే దేహంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది మంచి చిట్కా.ఉసిరి జుట్టుకు టానిక్లాంటిది. క్రమం తప్పకుండా ఉసిరి తినే వాళ్లకు జుట్టు బాగా పెరుగుతుంది. చిన్న వయసులో జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉండవు. వారానికి ఒకసారి ఉసిరి రసాన్ని నేరుగా జుట్టుకు, కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు కూడా వదులుతుంది. -
అందుకే నైవేద్యానికి అంతటి రుచి!
అన్నం వండేవారు ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారి మీద ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వండేవారు దాని రుచి చూడరు. కనీసం వాసన కూడా పీల్చరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల... దాన్ని దేవుడు స్వీకరించడం వల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది. ఇతరులకు పెట్టడం కోసం సంపాదించేవాడు దాత అని, తాను తినడం కోసమే సంపాదించేవాడు పాపాత్ముడనీ శ్రుతి పేర్కొంటోంది. తినే అన్నాన్ని బట్టే రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని చెపుతుంది ఆయుర్వేదం. అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరానికి బలం వస్తుంది. బలం వల్లే తపస్సు చేస్తున్నాం. అందుకే అన్నదానం వల్ల సర్వవస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. -
మన బ్రేక్ఫాస్ట్
కేలండర్ను ముప్ఫయ్ ఏళ్ల వెనక్కు తిప్పితే... అప్పటి ఆహారపు అలవాట్లు ప్రకృతికి అనుకూలంగా ఉండేవి. సన్స్ట్రోక్ తగిలిన తర్వాత కొబ్బరిబొండాంతో సేద దీరడం అన్నది ఏ ఒక్కరికీ అనుభవంలోకి వచ్చి ఉండదు. ఎండాకాలం వచ్చిందంటే ఇడ్లీ పాత్రలు, దోశెపెనాలు అటకెక్కేవి. పొద్దున్నే ఉల్లిపాయతో చద్దన్నం, ఆవకాయతో పెరుగన్నం తింటే ఎంత ఎండలో ఆడుకున్నా పిల్లలకు వడదెబ్బ ఉండేది కాదు. కడుపులో చల్ల కదలకుండా అలిసిపోయే దాకా ఆడుకోవచ్చు, ఆవకాయ రుచిని గుర్తు చేసుకోవచ్చు. ఈ తరం మర్చిపోయిన మన బ్రేక్ఫాస్ట్... ఆవకాయ – పెరుగన్నం రాత్రి మిగిలిన అన్నంలో ఒక స్పూన్ పెరుగు కలిపి గోరువెచ్చని పాలు పోస్తే ఉదయానికి గట్టిగా పెరుగున్నం తయారవుతుంది. దీంట్లో ఉప్పు వేసి ఉల్లి పాయ, ఆవకాయ పెచ్చు నంజుకు తింటే... నోరూరడం మాట అలా ఉంచితే మైగ్రేన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. చద్ది బువ్వ అన్నం వండినప్పుడు వార్చిన గంజిని ఒక కుండలో పోయాలి. మిగిలిన అన్నాన్ని అందులో వేస్తే... అదే చద్ది అన్నం. ఆ అన్నంలో కాçస్తంత ఉప్పు, నిమ్మ రసం వేసి దానికి తోడుగా ఉల్లిపాయ కాని, మిరపకాయ కాని తింటే డీ హైడ్రేషన్ అనే పదానికి అడ్రస్సే ఉండదు. గడ్డపెరుగు – మామిడిపండు అన్నాన్ని చల్లార్చి అందులో మీగడ పెరుగు వేసి కలిపి, పక్కన మామిడిపండు ముక్కలు కోసి పెడితే పిల్లలకు చక్కటి లంచ్. నవకాయ పిండివంటలు ఉన్నా వాటి వంక కూడా చూడరు. అన్నం, పాలు, పండుతో పూర్తి స్థాయిలో భోజనం చేసినట్లే పోషకాలు అందుతాయి. ఎండ వేడి బాధించదు. -
తీగ లాగితే జ్యూస్ వచ్చింది
రుచిగా పాకుతుంది... ఆరోగ్యంగా అల్లుకుంటుంది... అందరి హృదయాలలో విస్తరిస్తుంది. నాలుకపై నాట్యమాడుతుంది... తీగలాగితే చాలు జ్యూస్ వస్తుంది... తీగకూరగాయలతో చేసిన జ్యూస్ స్పెషల్స్ ఇవి. సొరకాయ జ్యూస్ కావల్సినవి: సొరకాయ – 1 (250 గ్రాములు); పుదీనా ఆకులు– 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత, అల్లం– చిన్నముక్క తయారీ: సొరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన, కొత్తిమీర ఆకులు వేయాలి. నిమ్మరసం వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీంట్లో అర కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి, వడకట్టాలి. గ్లాసులో పోసి సేవించాలి. గుమ్మడికాయ జ్యూస్ కావల్సినవి: ఆప్రికాట్స్ – 10; నీళ్లు – ఒకటిన్నర కప్పు; యాపిల్ జ్యూస్ – 2 కప్పులు; దాల్చిన చెక్క – చిన్నముక్క; అల్లం – చిన్న ముక్క, నిమ్మరసం – టీ స్పూన్ తయారీ: గుమ్మడికాయ పై తొక్క నుంచి మెత్తటి ముక్కను వేరు చేయాలి. గింజలను తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేయాలి. దీనికి పంచదార/బెల్లం/తేనె/ యాపిల్ జ్యూస్ వాడచ్చు. దీంట్లో జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి, అల్లం తరుగు, నిమ్మరసం కలపాలి. కూలింగ్ కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి వేయాలి. బీరకాయ జ్యూస్ కావల్సినవి: బీరకాయ – 1; పుదీనా ఆకులు – 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; నల్లుప్పు – తగినంత ఉప్పుకు బదులుగా తియ్యగా కావాలనుకునేవారు తేనె కలుపుకోవచ్చు. తయారీ: బీరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన , కొత్తిమీర, నిమ్మరసం, నల్లుప్పు, మిరియాల పొడి వేసి మళ్లీ మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోయాలి. చల్లగా కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి కలుపుకోవచ్చు. దొండకాయ జ్యూస్ కావల్సినవి: దొండకాయలు – 4; ఉసిరి ముక్కలు – 3; అల్లం – చిన్నముక్క; పుదీనా ఆకులు – 15; కొత్తిమీర తరుగు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత; నల్లుప్పు – తగినంత జీలకర్రపొడి – టేబుల్ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్ స్పూన్లు; ఐస్క్యూబ్స్ – తగినన్ని తయారీ: దొండకాయలను శుభ్రం చేసి చిన్నముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్జార్లో దొండకాయ ముక్కలు, అల్లం తరుగు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బ్లెండ్ చేయాలి. దీనికి కప్పు నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో ఐస్క్యూబ్స్ వేసి అందించాలి. దోసకాయ/కీరా జ్యూస్ కావల్సినవి: దోసకాయ/ కీరా – ఒకటి; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పుదీనా – 10; ఉప్పు – తగినంత; నిమ్మరసం – పావు టీ స్పూన్ తయారీ: దోసకాయ కడిగి, పై తొక్క తీసి ముక్కలు చేయాలి. ఈ ముక్కలను మిక్సర్జార్లో వేసి పుదీనా, జీలకర్రపొడి, ఉప్పు, నీళ్లు కలిపి బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో పావు టీ స్పూన్ నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి. కూల్గా కావాలనుకునేవారు ఐస్క్యూబ్స్ వాడచ్చు. కాకరకాయ జ్యూస్ కావల్సినవి:కాకరకాయలు – 5, నీళ్లు – గ్లాసుపసుపు – చిటికెడుఉప్పు – తగినంతనిమ్మరసం – టీ స్పూన్ తయారీ:కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్ చేయాలి. గ్లాసు నీళ్లలో కట్ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేసి, రసం పిండాలి. ఈ రసానికి నీళ్లు కలిపి, దీంట్లో నిమ్మరసం కలిపి సేవించాలి. అధికబరువు, మధుమేహం, ఆస్త్మా వంటి సమస్యలకు కాకరలోని ఔషధాలు అమోఘంగా పనిచేస్తాయి. -
హెల్దీఫుడ్
టొమాటో కాక్టెయిల్ కప్స్ కావలసినవి: టొమాటోలు - మూడు (పెద్దవి) దోసకాయ - ఒకటి (పై తొక్క తీసి తురమాలి) గడ్డపెరుగు - అర కప్పు పచ్చిమిర్చి - కావలసినంత (సన్నగా తరగాలి ) పనీర్ - 1 టేబుల్ స్పూన్ (సన్నని ముక్కలుగా తరిగినది) ఉప్పు - రుచికి తగినంత కొత్తిమీర - తగినంత తయారి: 1. టొమాటోని రెండు సమ భాగాలుగా కట్ చేసిపెట్టుకోవాలి. 2. ఒక పాత్రలో దోసకాయ తురుము, పెరుగు, పచ్చిమిర్చీ, పనీర్ ముక్కలు వేసి కలపాలి. 3. కట్ చేసిపెట్టుకున్న టొమాటో మధ్యలో పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అమర్చాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. నోట్: టొమాటోలో ఉండే లైకోపెన్ క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. ఫలితంగా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. పెరుగు, పనీర్లో ప్రొటీన్లు సహజంగానే ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహకరిస్తాయి. ఐరన్ పచ్చిమిర్చి ద్వారా అందుతుంది. ఇన్ని పోషకాలున్న ఈ స్నాక్ని రోజూ సాయంకాలం తీసుకోవచ్చు. అన్ని వయసుల వారికీ మేలు జరిగే స్నాక్ ఇది. -
సామవేదం
భోజనాన్ని నెమ్మదిగా తినాలి... బాగా నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి! ఆ భోజనం నిదానంగా జీర్ణం కావాలి... ఎక్కువ సేపు శక్తిని విడుదల చేయాలి! నిజమే... ఇదే అసలైన ఆరోగ్యం... అందుకు చిరుధాన్యమే అనువైన ఆహారం. కొర్రలు... రాగులు... జొన్నలు... సజ్జల జాబితాలో మరో చిరుధాన్యం సామలు. సామ కేసరి కావలసినవి: సామబియ్యం- ఒక గ్లాసు, పటిక బెల్లం పొడి- ముప్పావు గ్లాసు, అనాసపండు ముక్కలు- పావు కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, జీడిపప్పు- గుప్పెడు, కిస్మిస్- గుప్పెడు, కుంకుమ పువ్వు- చిటికెడు, పాలు - అరకప్పు తయారీ: పాలు వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీసి పక్కన పెట్టాలి. అదే బాణలిలో మిగిలిన నేతిలో సామబియ్యం వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. బియ్యం వేగేలోపు మరొక స్టవ్ మీద రెండున్నర కప్పుల నీటిని మరిగించాలి. బియ్యం వేగిన తర్వాత మరుగుతున్న నీటిని పోసి కలపాలి. మెత్తగా ఉడికిన తర్వాత అనాపసండు ముక్కలు, పటికబెల్లం పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఒక నిమిషం తర్వాత మిశ్రమం అడుగుపట్టకుండా కలిపి దించాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేయాలి. సామ ఆపం కావలసినవి: సామబియ్యం- ఒక గ్లాసు, అటుకులు- పిడికెడు, కొబ్బరికోరు- అర కప్పు, ఈస్ట్- అర చెంచా, పటికబెల్లం పొడి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, నూనె- ఒక టేబుల్ స్పూన్ తయారీ: సామబియ్యాన్ని కడిగి ఐదు గంటల సేపు నానబెట్టాలి అరగ్లాసు వేడినీటిలో ఈస్ట్, పటికబెల్లం పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. అటుకులను ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత అందులో కొబ్బరికోరు, ఈస్ట్ మిశ్రమం, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి ఈ పిండిని ఒక పాత్రలోకి తీసుకుని ఆరుగంటల సేపు కదిలించకుండా ఉంచాలి ఆపం పెనం వేసి చేసి అందులో ఒక గరిటెడు పిండి వేసి అర చెంచా నూనె వేసి మూత పెట్టి సన్నమంట మీద కాల్చాలి. అర నిమిషానికి ఆపం కాలి అంచుల దగ్గర పైకి లేస్తుంది. అప్పుడు తీసేయాలి. ఆపాన్ని తిరగేసి కాల్చరాదు. ఒకవైపే కాల్చాలి. దీనికి కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్. గమనిక: ఆపం పిండిని ఆపం బాణలిలో పోయడం చాలా నైపుణ్యంతో కూడిన పని. బాణలిలో పోసిన తర్వాత బాణలి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పినప్పుడు పిండి బాణలిలో విస్తరిస్తుంది. అది ఒక దగ్గర మందంగా, మరొక దగ్గర పలుచగా రాకుండా అంతా సమంగా విస్తరించేటట్లు బాణలిని తిప్పడం సాధన మీద వస్తుంది. ఈస్ట్ లేకపోతే ఒక స్పూను పెరుగు కలుపుకోవచ్చు లేదా బియ్యంలో ఒక చెంచా మెంతులు వేసుకోవచ్చు వరిపిండితో గంజి కాచి ఆపం పిండిలో కలుపుకుంటే ఆపం మెత్తగా వస్తుంది. సమంగా విస్తరించి పలుచగానూ ఉంటుంది ఇష్టమైతే ఆపం మీద క్యారట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. సామ వెజ్ కిచిడి కావలసినవి: సామల బియ్యం- ఒక గ్లాసు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటో- ఒకటి, క్యారట్- ఒకటి, బీన్స్- ఐదు, పచ్చి బఠాణి- గుప్పెడు, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి- నాలుగు, జీలకర్ర- ఒక టీ స్పూన్, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- ఒక టేబుల్స్పూన్, ఉప్పు- తగినంత, నూనె- నాలుగు టీ స్పూన్లు, పసుపు- అర టీ స్పూన్ తయారీ: సామల బియ్యాన్ని కడిగి రెండున్నర గ్లాసుల నీరు పోసి పది నిమిషాల సేపు నానబెట్టాలి. ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, పచ్చిమిర్చి, టొమాటోలను చిన్న ముక్కలుగా తరగాలి ప్రెషర్ పాన్లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పది సెకన్లపాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి సన్నమంట మీద వేగనివ్వాలి. అవి మెత్తబడిన తర్వాత క్యారట్, బీన్స్, పచ్చిబఠాణి, పసుపు వేసి బాగా కలిసి మూత పెట్టి రెండు నిమిషాల సేపు ఉంచాలి పైవన్నీ నూనెలో సన్నమంట మీద మగ్గిన తర్వాత సామబియ్యం నీటితోపాటు వేసి ఉప్పు కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. దీనిని నేరుగా బాణలిలో కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీటి మోతాదు కొద్దిగా పెంచాలి. దించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ కిచిడీకి ఆవకాయవంటి పచ్చళ్లు, పుదీన, వేరుశనగపప్పు చట్నీలు బాగుంటాయి. గమనిక: బియ్యం ఉడికేటప్పుడు లవంగం, బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. -
గుత్తి వంకాయ కూరకు ఫిదా
కమ్మని అరకు కాఫీ..కాకినాడ కాజా రుచులను ఆస్వాదించిన వైనం అరకు కాఫీ, జీసీసీ ఉత్పత్తులు, గుత్తి వంకాయ కూర, పూత రేకులు, కాకినాడ కాజా.. ఇంకా మరెన్నో వంటకాలు నగరంలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన రహదారుల జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన దేశ విదేశీయులను నోరూరించాయి. వీటి రుచి చూసిన వారు కొసరి కొసరి వడ్డించుకొని తిన్నారు. మన సంస్కతి, సంప్రదాయాలతో పాటు తెలుగు వంటకాల రుచులను ఆస్వాదించారు. కమ్మని కాఫీని, గుత్తు వంకాయను మర్చిపోలేమని లొట్టలేసుకుని మరీ లాగించేశారు. ఇక్కడ చెక్కతో తయారీ చేసిన వస్తువులను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. –బీచ్రోడ్ బటర్ చికెన్ బాగుంది మా దేశంలో వంటకాల్లో బాబిక్యూ, కాఫీకి మంచి గుర్తింపు ఉంది. నేను ఈ రెండు రోజులు ఇక్కడి వంటకాలు రుచి చూశాను. చాలా బాగున్నాయి. అందులో ముఖ్యంగా బటర్ చికెన్ బాగా నచ్చింది. –చికా సాక్షితా, ఆస్ట్రేలియా మసాల వంటలు అలవాటు లేదు ఇక్కడ వంటకాల్లో మసాల ఎక్కువగా ఉంది. మా దేశంలో ఆహారంలో అసలు మషాలా ఉండదు. ఇక్కడ ఏర్పాటు చేసిన వంటకాల్లో చేపల ఫ్రై బాగా నచ్చింది. అన్ని వంటకాల రుచి చూశాను. –జార్జి స్టూవర్ట్, న్యూజిలాండ్ మా రాష్ట్రంలో 26 గిరిజన తెగలున్నాయి మా రాష్ట్రం రకరకాల సంప్రదాయాలకు నిలయం. 26 తెగల గిరిజనులు నివసిస్తుంటారు. వారు వివిధ ఆచారాలు పాటిస్తారు. ఎక్కువ మంది కాల్(లుంగి), స్త్రీలు పురాతన ఆభరణాలు ధరిస్తారు. మా ప్రజల్లో టిబెట్ దేశ సంస్కతి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వండిన వంకాయ కూర భలే రుచిగా ఉంది. –రిమార్ గాబ్, అరుణాచల ప్రదేశ్ వనదేవతను ఆరాధిస్తాం మా రాష్ట్రంలో ఆస్తి కుమారులు కాకుండా కుమార్తెలకు చెందుతుంది. పిల్లలు పేరు తరువాత తల్లి పేరు వస్తుంది. మాది పూర్తిగా గిరిజన ప్రాంతం. ప్రధానంగా కశసి, గోరా అనే రెండు తెగల వారు ఉన్నారు. వనదేవతను ఆరాధిస్తాం. –లిమిసొన్ సనగ్మా, మేఘాలయ మసాల దోసె అంటే చాలా ఇష్టం మషాల దోస అంటే చాలా ఇష్టం. ఈ రెండు రోజులు ఉదయం కేవలం ఇవే తిన్నాను. మాది ఎడారి ప్రాంతం కావడంతో ప్రజలు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తారు. దాల్పట్టి, జొన్న రొట్టే ఆహారంగా తీసుకుంటారు. – నిధి సింగ్, రాజస్థాన్ -
ఇంటిప్స్
గులాబ్జామ్ పిండిలో కొద్దిగా పన్నీరు తురుము కానీ జీడిపప్పు పొడి కానీ కలిపితే జామూన్లు ఎంతో మృదువుగా వస్తాయి! చీమలకు ఉప్పు అంటే పడదు. కాబట్టి చీమలు పడుతున్న చోట కాస్త ఉప్పు కలిపిన నీళ్లు చల్లితే సరి! సోఫా మీద నూనె మరకలు పడితే... ముందుగా వాటి మీద నిమ్మరసం చల్లాలి. తర్వాత దూదిని పెట్టి ఒత్తితే మరకలు పోతాయి. పులుసులు పెట్టినప్పుడు కొద్దిగా శెనగపిండి వేస్తే... పులుసు మరీ నీళ్లగా కాకుండా చిక్కగా వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. -
దుంప తెగ!
తప్పు చేస్తే తాతయ్యో నానమ్మో విపరీతమైన కోపం వచ్చి... సున్నితంగా తిట్టే తిట్టు... ‘వాడి దుంప తెగ అంతపని చేశాడా..’ అని. తిట్టులో కూడా ప్రేమను దట్టిస్తారు! అలా... రుచిని దట్టించి రోజూ తినే కూరల బోర్డమ్ని తెగ్గొట్టండి. దుంపలతో ప్రేమను వడ్డించండి. ‘దుంప తెగ... ఏం టేస్టు...’ అనే కాంప్లిమెంటు కొట్టేయండి. క్రీమ్ చీజ్ ఫిల్డ్ బీట్స్ కావల్సినవి: బీట్ రూట్స్ - 2 ఫిల్లింగ్ కోసం: చిలికిన పెరుగు - 2 టేబుల్ స్పూన్లు క్రీమ్ చీజ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగిన క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగి కొత్తిమీర - టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్ సాస్ కోసం: నూనె - టీ స్పూన్ రెడ్ క్యాప్సికమ్ - 2; గ్రీన్ క్యాప్సికమ్ - 2 వెల్లుల్లి -2 రెబ్బలు; జీలకర్ర - 2 టీ స్పూన్ ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూన్ కొత్తిమీర - టీ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్ తయారి: పీలర్తో బీట్రూట్ పై తొక్క తీసి, ఉడకబెట్టి, చాలా పలచని స్లైసులుగా కట్ చేయాలి. ఫిల్లింగ్కి ఇచ్చినవన్నీ గిన్నెలో వేసి కలపాలి. పలచని బీట్రూట్ స్లైసులను రోల్ చేసి, పై మిక్చర్(ఫిల్లింగ్)ని ఫిల్ చేయాలి. సాస్ కోసం ఇచ్చిన పదార్థాలలో రెడ్ క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా వేపి, చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి. అలాగే పచ్చ క్యాప్సికమ్, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర విడిగా వేయించి చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి. ఫిల్ చేసిన బీట్రూట్ రోల్స్ని ప్లేట్లో పెట్టి ఒకవైపు ఎరుపు రంగు క్యాప్సికమ్ మిశ్రమం, మరోవైపు పచ్చరంగు క్యాప్సికమ్ మిశ్రమం పోయాలి. {Mీమ్ చీజ్.. ఆ పైన కొత్తిమీర లేదా తులసి ఆకును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కుక్డ్ కెబాబ్ కావల్సినవి: బంగాళదుంపలు-3 లేదా చామదుంపలు - 6; ఉప్పు - తగినంత; నల్లుప్పు - అర టీ స్పూన్; కొత్తిమీర - టీ స్పూన్; చాట్ మసాలా - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2; బ్రెడ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు (శనగపిండి కూడా వాడుకోవచ్చు) ఫిల్లింగ్ కోసం: అల్లం తరుగు - టీ స్పూన్ బాదంపప్పు తరుగు - టీ స్పూన్ పచ్చి బఠాణీలు -2 టేబుల్ స్పూన్లు చీజ్ - టీ స్పూన్; కిస్మిస్ - టీ స్పూన నీళ్లన్నీ వడకట్టిన గడ్డ పెరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ: దుంపలను ఉడికించి, పై పొట్టు తీసి గుజ్జు చేయాలి. అందులో ఉప్పు, నల్లుప్పు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, చాట్మసాలా, బ్రెడ్ పొడి, తరిగిన పచ్చిమిర్చి, మిగిలిన ఇతర దినుసులు కూడా వేసి బాగా కలపాలి. ముద్దగా తయారైన ఈ మిశ్రమాన్ని సమభాగాలుగా తీసుకొని, ఉండలు చేసి, అరచేత్తో అదమాలి. కడాయిలో తగినంత నూనె పోసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి.. రెండువైపులా వేయించాలి. టూత్ పిక్లకు ఈ కెబాబ్స్ను గుచ్చి పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అలంకరణకు ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్ తరుగు, కొత్తిమీర వాడచ్చు. స్వీట్ పొటాటో చీజ్ కేక్ కావాల్సినవి: స్వీట్పొటాటో (చిలగడ దుంప) - 1 (100 గ్రా.), కుకీ క్రంబ్స్ - కప్పు; తాజా పాల మీగడ (చిలికినది) - పావు లీటర్, క్రీమ్ చీజ్ - 200 గ్రాములు; గుడ్లు - 3; పంచదార పొడి - 200 గ్రాములు, మొక్కజొన్న పిండి - 125 గ్రాములు తయారీ: చిలగడ దుంపలను ఉడికించి గుజ్జు చేయాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రంగా జామూన్లను తయారుచేయాలి. ఇందుకు కార్న్ఫ్లోర్ను వాడుకోవచ్చు. వీటిని నూనెలో అన్ని వైపులా వేయించి, పంచదార పాకంలో వేసి ఉంచాలి. వెడల్పాటి పుడింగ్ కేక్ గిన్నెకు అడుగున నెయ్యి రాయాలి. పైన కుకీ క్రంబ్స్ పొడి వేసి ఆ పైన చిలగడదుంప జామూన్లు వేయాలి. ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీగడ, పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పుడింగ్ గిన్నెలో పోయాలి. ఈ గిన్నెను ఇడ్లీ కుకర్లో పెట్టి సన్నని మంట మీద ఆవిరితో ఉడికించాలి. పూర్తిగా ఉడికాక దించుకోవాలి. చల్లారాక తీసి, చాకొలెట్ చాప్స్తో అలంకరించి సర్వ్ చేయాలి. అవెన్లో అయితే 160 నుంచి 180 డిగ్రీల ఉష్ణొగ్రతలో అరగంటపాటు బేక్ చేయాలి. స్టఫ్డ్ శాండ్విచ్ కావల్సినవి: బంగాళదుంప/క్యారెట్ - 3, ఉల్లిపాయలు - 2, టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 1 రెమ్మ, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్ తయారీ: బంగాళదుంప లేదా క్యారెట్ తొక్క తీసి, ఉడికించి, గుజ్జు చేయాలి. మూకుడులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగాక అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కలపాలి. దీంట్లో దుంప గుజ్జు వేసి కలపాలి. మిశ్రమం బాగా వేగాక కాల్చిన శాండ్విచ్ బ్రెడ్ మధ్యలో అమర్చాలి. ఫ్రెంచ్ ప్రైస్ లేదా చిప్స్తో సర్వ్ చేయాలి. ఖజానా ఆలూ కావాల్సినవి బంగాళదుంపలు/చిలగడ దుంపలు - 4 ఫిల్లింగ్ కోసం: బాదంపప్పు తరుగు - టీ స్పూన్ జీడిపప్పు తరుగు - టీ స్పూన్ పిస్తాపప్పు తరుగు - టీ స్పూన్ పచ్చిమిర్చి - 2; చీజ్ - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు సాస్ కోసం: టొమాటో గుజ్జు 200 గ్రాములు సాజీర - అర టీ స్పూన్; యాలకులు - 4 బిర్యానీ ఆకు - 1; కారం - టీ ఊ్పన్ మెంతిపొడి - అర టీ స్పూన్; కొతితమీర - కట్ట నూనె - టీ స్పూన్; ఉప్పు - తగినంత పాల మీగడ - టేబుల్ స్పూన్ నెయ్యి - టీ స్పూన్; వెన్న - టేబుల్ స్పూన్ తయారీ బంగాళదుంప తొక్క తీసి మధ్యభాగాన్ని కొంత తీసి, ఉడికించాలి. డ్రై ఫ్రూట్స్, ఛీజ్, పచ్చిమిర్చి, బంగాళుదంప గుజ్జు, ఉప్పు.. దుంప మధ్యన కూరాలి. కార్న్ఫ్లోరోలో అన్నివైపులా దొర్లించి కాగుతున్న నూనెలో వేసి, వేయించి తీయాలి. మందపాటి గుండ్రని ముక్కలుగా కట్ చేయాలి. మరొక కడాయిలో నూనె వేసి సాజీర, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, మెంతిపిండి, టొమాటో గుజ్జు, ఉప్పు, పంచదార వేసి ఉడికించాలి. మిశ్రమం నుంచి నూనె వేరయ్యాక కొద్దిగా నూనె కలిపి పాల మీగడ, నెయ్యి, వెన్న వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బంగాళదుంప ముక్కలున్న గిన్నెలో ముక్కలు తడిసేలా పోయాలి. సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కొత్తిమీరతో అలంకరించాలి. ముల్లంగి పచ్చడి కావల్సినవి: ముల్లంగి - 1 (తరుమాలి) ఎండుమిర్చి - 2; ధనియాలు - 2 టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; మెంతులు - పావు టీ స్పూన్ కరివేపాకు - 1 రెమ్మ; నూనె - టేబుల్ స్పూన్ మినప్పప్పు - శనగపప్పు - టీ స్పూన్ చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత తయారి: కడాయి పొయ్యి మీద పెట్టి టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు వేసి వేయించి, తీసి పక్కనుంచాలి. అదే కడాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి ముల్లంగి తరుగు వేసి 5 నిమిషాలు ఉడికించి, దించాలి. ముందుగా వేయించుకున్న దినుసులన్నీ చల్లారాక తగినంత ఉప్పుతో సహా కలిపి పొడి చేయాలి. దీంట్లో చింతపండు గుజ్జు, ఉడికిన ముల్లంగి వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. దీనిని గిన్నెలోకి తీసుకోవాలి. కడాయిలో మిగిలిన నూనె పోసి జీలకర్ర, పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి. దీనిని పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి. -
వంటిప్స్
కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంది.అప్పడాలు వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగదు.మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి. బంగాళదుంపల మధ్యలో కొన్ని వెల్లుల్లి రేకలు ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.బెండకాయలు తాజాగా, ముదిరిపోకుండా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిజ్లో ఉంచాలి.ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ ఉంటుంది. దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి. -
అయ్ బాబోయ్ బాబోయ్!
రండి రండి రండి.. దయచేయండి... గోదావరి భోజనాలు రుచి చూడండి. ఆప్యాయతలకు.. ఆతిథ్యానికి.. ఉభయ గోదావరులే అడ్రెస్సండీ! అయ్ బాబోయ్ బాబోయ్... అలా అనేశారేటండీ..! భోజనం పెట్టడం కూడా మర్యాదేటండీ?! కోడి రేకులు కావల్సినవి: చికెన్ (బెస్ట్ పీస్) - అర కేజీ (ఆలూ చిప్స్లా పలచని పొరలుగా కట్ చేయాలి; మొక్కజొన్న పిండి - 4 టీ స్పూన్లు ఉప్పు - తగినంత; కారం - అర టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్ తయారీ: వెడల్పాటి గిన్నెలో పై పదార్థాలన్ని వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి ఒక్కో చికెన్ పీస్ వేస్తూ బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. పైన కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, వేయించిన పచ్చిమిర్చి, క్యారట్ తరుగుతో అలంకరించి, టొమాటో సాస్ లేదా వెల్లుల్లి సాస్తో సర్వ్ చేయాలి. రోజ్ మిల్క్ కావల్సినవి: చిక్కటి పాలు (కాచి చల్లార్చినవి) - గ్లాస్; రోజ్ మిల్క్/సిరప్ - 50 ఎం.ఎల్; గులాబీ రేకలు - కాసిని; పంచదార - 2 టీ స్పూన్లు; యాలక్కాయ - 1 (పొడి చేయాలి) తయారీ: రాత్రి పూట పాలు కాచి, ఫ్రిజ్లో పెట్టాలి. ఉదయం రోజ్మిల్క్, పంచదార కలిపి, గులాబీ రేకలు కలిపి మిక్సీలో బ్లెండ్ చేయాలి. సర్వ్ చేసేముందు చితగ్గొట్టిన ఐస్ వే యాలి. రాజుగారి వెజ్ పలావ్ కావల్సినవి: బియ్యం - అర కేజీ; పాలు - పావు లీటరు; సాంబార్ ఉల్లిపాయలు - పావు కేజీ; క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ - అర కేజీ (సన్నని ముక్కలు); నెయ్యి - 100 గ్రాములు; బిర్యానీ మసాలా (దాల్చిన చెక్క, లవంగ, సాజీర) - టీ స్పూన్; బిర్యానీ ఆకులు-2; జీలకర్ర-ఆవాలు - టీ స్పూన్; పెరుగు - 3 టేబుల్ స్పూన్లు; అల్లం -వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; పచ్చిమిర్చి - 4 (సన్నగా చీరాలి); పసుపు - పావు టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; కొత్తిమీర - టీ స్పూన్ తయారీ: కడాయిలో నూనె పోసి ఉల్లిపాయలు వేయించి, చల్లారాక పెరుగు కలిపి మెత్తగా రుబ్బి పక్కనుంచాలి. కుకర్లో నెయ్యి వేసి కాగాక జీలకర్ర-ఆవాలు, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. దీంట్లో పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. లీటరు నీళ్లు పోసి మరుగుతుండగా కడిగిన బియ్యం వేసి కలపాలి. తగినంత ఉప్పు వేసి కలిపి కుకర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక దించి, మూత తీసి పాలు పోసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించి చివరగా కొత్తిమీర చల్లాలి. ఈ పలావ్ను పనసతొనలు, గోంగూర కట్టా లేదా రైతాతో వడ్డించాలి. పండుమిర్చి మటన్ పలావ్ కావల్సినవి: మటన్ - అర కేజీ; పండు మిర్చి ముద్ద - 150 గ్రాములు; చింతపండు - 2-3 రెబ్బలు (నానబెట్టాలి); నెయ్యి, నూనె - 100గ్రాములు; పచ్చిమిర్చి-2; ఉప్పు - తగినంత; బియ్యం - అర కేజీ; గరం మసాలా-(సాజీర, లవంగాలు, యాలకులు) 2 టీ స్పూన్లు; బిర్యానీ ఆకు - 2; ఉల్లిపాయలు-1 (పొడవుగా సన్నగా తరగాలి), జీడిపప్పు - 10 తయారీ: పండుమిర్చి- చింతపండు కలిపి కచ్చాపచ్చాగ దంచి పక్కనుంచాలి. బియ్యంలో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఉల్లిపాయలు విడిగా కడాయిలో నూనె వేసి వేయించి ఉంచాలి. కుకర్లో నెయ్యి-నూనె వేసి కాగాక సాజీర, బిర్యానీ ఆకు, లవంగా, యాలకులు వేసి వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కలపాలి. దీంట్లో మటన్ వేసి కలపాలి. మగ్గాక పండుమిర్చి పేస్ట్, జీడిపప్పు పొడి కలపాలి. కనీసం 15 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో ఒకటి బిర్యానీ రైస్కు రెండు నీళ్లు పోసి మరగించాలి. తగినంత ఉప్పు వేసి కలిపి, ఆ తర్వాత నానబెట్టిన బియ్యం మరుగుతున్న నీళ్లలో వేసి కలపాలి. కుకర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి తర్వాత దించాలి. రైస్ను గరిటతో కలపకుండా కుకర్ మూత తీసి వెడల్పాటి గిన్నెలో బోర్లించాలి. కింద ఉడికిన రైస్, పైన మటన్.. ఉంటుంది. దీనిపై వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీర, ఉడికించిన గుడ్డుతో అలంకరించాలి. బొంగు కోడి పలావ్ కావల్సినవి: చికెన్ - పావు కేజీ బాస్మతి రైస్ - పావు కేజీ; పెరుగు - కప్పు నిమ్మరసం - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూన్ ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి) పచ్చిమిర్చి - 2 (చీలికలు చేయాలి) ధనియాల పొడి - టీ స్పూన్; ఉప్పు - తగినంత జీలకర్ర - టీ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్ పసుపు - పావు టీ స్పూన్; నూనె-నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; వెదురు బొంగు - 1 (ఒక వైపు మూసి రెండోవైపు తెరిచి ఉండాలి) తయారీ: గిన్నెలో బియ్యం మినహా మిగతా అన్ని పదార్థాలు+సగం ఉప్పు వేసి కలిపి గంట సేపు పక్కనుంచాలి. బియ్యం కడిగి, తగినన్ని నీళ్లు, పోసి, మిగతా ఉప్పు కలిపి సగం (హాఫ్ బాయిల్డ్) ఉడికనివ్వాలి. వెదురు బొంగును శుభ్రం చేసుకొని, ఒక పొర ఉడికీ ఉడకని అన్నం .. ఆ తర్వాత చికెన్ ముక్కలు, ఆ తర్వాత అన్నం... ఇలా అన్ని 3-4 పొరలుగా వేసుకోవాలి. బొంగుపైనుంచి ఆవిరి రాకుండా చపాతీ పిండిలా కలిపిన గోధుమపిండి ముద్దను అదమాలి. వెడల్పాటి కుండ లేదా, కుంపట్లో బొగ్గులు వేసి మండించి సిద్ధం చేసుకున్న వెదురు బొంగును నిప్పుల మీద వేసి అటూ ఇటూ తిప్పుతూ కాలుస్తూ ఉండాలి. పైన మంటకు బొంగు లోపల చికెన్, అన్నం ఉడికిపోవాలి. పూర్తిగా ఉడికాక ప్లేట్లోకి తీసుకొని వేయించిన ఉల్లిపాయ ముక్కలు అలంకరించి రైతాతో వడ్డించాలి. జున్ను కావల్సినవి: జున్ను పాలు - పావు లీటర్; తెల్లటి బెల్లం తురుము - 100 గ్రాములు; యాలక్కాయ పొడి - చిటికెడు; మిరియాల పొడి - చిటికెడు; లవంగ మొగ్గ - 1 తయారీ: బెల్లంలో తగినన్ని నీళ్లు పోసి కరిగించి, వడకట్టి, జున్ను పాలలో కలపాలి. ఈ పాలను ఒక గిన్నెలో పోసి యాలక్కాయపొడి, మిరియాల పొడి, లవంగ మొగ్గ వేయాలి. ఇడ్లీపాత్ర అడుగున నీళ్లు పోసి ఆ పైన జున్ను పాల గిన్నెను ఉంచి, ఆ పైన మూత పెట్టాలి. సన్నని మంట మీద పాల మిశ్రమం ఉడికి కేక్లా తయారయ్యేంతవరకు ఉంచి, దించాలి. కదంబం కావల్సినవి: బియ్యం - 3 కప్పులు; గుమ్మడి కాయ, సొరకాయ, క్యారెట్ , బెండకాయ, వంకాయ, ఉల్లిపాయ, టొమాటో... (నచ్చిన కూరగాయ ముక్కలను చేర్చుకోవచ్చు) - కావల్సినన్ని. క్యాప్సికమ్ వేసుకుంటే లోపలి గింజలు తీసేయాలి; పచ్చిమిర్చి - 4; మునక్కాడలు - 1; కందిపప్పు - 50 గ్రాములు; పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు - టేబుల్ స్పూన్; శనగపప్పు - టేబుల్ స్పూన్; ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు రెమ్మలు - 2; ఎండుకొబ్బరి - టేబుల్ స్పూన్; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రెబ్బలు- 5; ఎండుమిర్చి - 2; ఆవాలు-జీలకర్ర - టీ స్పూన్; నువ్వుపప్పు నూనె - 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు గుజ్జు - అరకప్పు కొత్తిమీర - 60 గ్రాములు (కాడలు ఉడికించాలి) తయారీ: కూరగాయ ముక్కలన్నీ ఒక మందపాటి గిన్నెలో వేసి నీళ్లుపోసి, అరచెంచా కారం, పావు చెంచా పసుపు వేసి రెండు పొంగులు వచ్చేంతవరకు ఉడికించి, దించాలి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు కుకర్లోపెట్టి మెత్తగా ఉడికించాలి. ఇంకా మెత్తదనం కోసం మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. అన్నం మెత్తగా ఉడికించి పక్కనుంచాలి. కడాయిలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాక కూరగాయ ముక్కలు వేసి కలపాలి. చింతపండు గుజ్జు, ఉడికించిన పప్పు, కొత్తిమీర కాడలు వేసి కలపాలి. కూరగాయ ముక్కలు ఉడికాక దీంట్లో ఉప్పు, అన్నం వేసి కలపాలి. మెత్తగా ఉడకనివ్వాలి. పావు టీస్పూన్ మిరియాలపొడి, కొత్తిమీర చల్లి దించాలి. దీనికి కాంబినేషన్గా అప్పడాలు, అరటికాయ వేపుడు, బంగాళదుంప వేపుడు బాగుంటాయి. చేపల పులుసు కావల్సినవి: కొరమీను చేప - కేజీ (ముక్కలు చేయాలి); చింతపండు - పావుకేజీ (నానబెట్టి రసం తీయాలి); టొమాటోలు, ఉల్లిపాయలు - ఒక్కోటి పావుకేజీ (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); పచ్చిమిర్చి - 50 గ్రాములు (నిలువుగా చీరాలి); మెంతులు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూన్; కారం - తగినంత; ఉప్పు - తగినంత; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; ఎండుకొబ్బరి - 2 టీ స్పూన్లు; కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా; నూనె, ఉప్పు- తగినంత తయారీ: వెడల్పాటి పాన్లో నూనె వేసి కాగాక మెంతులు, ఆవాలు వేయించి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేగాక సరిపడా కారం, చింతపులుసు, ఉప్పు, కొబ్బరి, ధనియాలపొడి కలిపి ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక చేప ముక్కలు వేసి మూత పెట్టాలి. 5 నిమిషాలాగి మూత తీసి, కొత్తిమీర చల్లి దించాలి. గరిటెతో కలపకూడదు. ముక్కలు విరిగిపోతాయి. రొయ్యల ఇగురు కావల్సినవి: రొయ్యలు - 250 గ్రాములు; ఉల్లిపాయలు-2 (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి - 2 (పేస్ట్ చేయాలి); కరివేపాకు - రెమ్మ ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు; అల్లం -వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; కారం - పావు టీ స్పూన్; నిమ్మరసం - టేబుల్ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్; కొత్తిమీర - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారీ: శుభ్రపరుచుకున్న రొయ్యలలో కొద్దిగా అల్లం- వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం వేసి కలిపి పక్కన ఉంచాలి. కడాయిలో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించాక మంట తగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. దీంట్లో కలిపి ఉంచిన రొయ్యలు వేసి ఉడికించాలి. తర్వాత తగినం కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. అర కప్పు నీళ్లు పోసి ఉడికించి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. రోటీ, రైస్లోకి వడ్డించాలి. కర్టెసీ: కోడి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ చెఫ్, కిచెన్ ఆఫ్ కూచిపూడి, మాదాపూర్, హైదరాబాద్ -
పాండీ బాండీ
ఫుడ్లో పాండిచ్చేరికి ఓ స్టెయిల్ ఉంది! అక్కడి వంటగిన్నెల మూత తెరవగానే.. ఫ్రాన్స్ దేశపు ఘుమఘుమలు వలసవచ్చినట్లుగా ఉంటుంది! పాండీ బాండీ.. ప్రాచీనమైనది. అందులో వండేవన్నీ ఏ రుచికీ మ్యాచ్ కానివి. ఇన్టాంజిబుల్! అనిర్వచనీయం!! అతిథులు సర్టిఫికెట్ ఇవ్వడం మామూలే. ఐక్యరాజ్యసమితి కూడా ఇచ్చిందంటే మాటలా! టేస్ట్ చెయ్యండి. జీవితాన్ని వేస్ట్ చెయ్యకండి. పాండిచ్చేరి వెజ్ కర్రీ కావల్సినవి: పచ్చికొబ్బరి తురుము - కప్పు వెల్లుల్లి - 3-4 రెబ్బలు (సన్నగా తరగాలి) ఎండుమిర్చి - 5-6 ధనియాలు - 2 టీ స్పూన్లు జీలకర్ర - టీ స్పూన్ మిరియాలు - 8-10 చింతపండు గుజ్జు - టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు - పావు కప్పు పసుపు - అర టీ స్పూన్ నీళ్లు - ముప్పావు కప్పు (పైవన్నీ వేయించి, మెత్తగా గ్రైండ్ చేసి, పక్కనుంచాలి) కూరగాయల ముక్కలు (బేబీకార్న్ - 9, క్యారెట్ - 1, మష్రూమ్స్ - 10, బీన్స్ - 9-10, బంగాళాదుంప - 1; నచ్చిన కూరగాయల ముక్కలను వేసుకోవచ్చు) - ఇవన్నీ కలిపి 3 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు పచ్చిమిర్చి - 2 (నిలువుగా కట్ చేయాలి) నీళ్లు - 3 కప్పులు; కొబ్బరి నూనె లేదా వంటనూనె - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - తగినంత తయారీ: * కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలను వేయించాలి. * దీంట్లో కూరగాయల ముక్కలు వేసి 6 నుంచి7 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. * ముందు సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద వేసి, కలిపి, ఉడకనివ్వాలి. * తగినన్ని నీళ్లు కలిపి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. * 20- నుంచి 30 నిమిషాల సేపు సన్నని మంట పై మిశ్రమాన్ని ఉడికించాలి. నీళ్లు తక్కువైతే మరికాస్త కలుపుకోవచ్చు. * చివరగా కొత్తిమీర చల్లి, దించాలి. అన్నంతో పాటు వేడి వేడిగా ఈ కర్రీని వడ్డించాలి. పాండిచ్చేరి చికెన్ కర్రీ కావల్సినవి: ఉల్లిపాయలు - 3 (తరగాలి) టొమాటోలు (పెద్దవి) - 2 జీలకర్ర - టీ స్పూన్ దాల్చిన చెక్క - చిన్న ముక్క లవంగాలు - 2; సోంపు - టీ స్పూన్ అల్లం - చిన్న ముక్క; వెల్లుల్లి - 6 రెబ్బలు ఎండుమిర్చి - 6; యాలకులు - 2 నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్ (కడాయిలో నూనె వేసి పై దినుసులు, పదార్థాలు వేసి, వేయించి, చల్లారాక ముద్దగా నూరి పక్కన పెట్టుకోవాలి) చికెన్ లేదా మటన్ - అర కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్ ఉప్పు - రుచికి తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; (చికెన్ లేదా మటన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, కొద్దిగా నీళ్లు కలిపి ఉడికించాలి) నూనె - 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు - 1 సోంపు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: * కడాయిలో నూనె వేసి వేడయ్యాక కరివేపాకు, సోంపు, బిర్యానీ ఆకు వేయించాలి. * సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద వేసి కలపాలి. * దీంట్లో ఉడికించిన చికెన్ లేదా మటన్ వేసి కలపాలి. సన్నని మంట మీద ముక్క పూర్తిగా ఉడికాక, ధనియాల పొడి వేసి కలిపి, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని, కొత్తిమీర చల్లి దించాలి. బనానా బాంకర్స్ కావల్సినవి: అరటిపండ్లు - 3 ఐస్ (చితగ్గొట్టినది)- కప్పు నిమ్మరసం - టీ స్పూన్ తాజా ద్రాక్షరసం - 3 కప్పులు తయారీ: * అరటిపండును గుజ్జు చేయాలి. అరటిపండు గుజ్జు, ద్రాక్ష రసం, 2 కప్పుల నీళ్లలో కలిపిన నిమ్మరసం, క్రష్డ్ ఐస్.. ఒకదాని మీద ఒకటి వేసి చల్లగా అందించాలి. క్రీప్స్ కావల్సినవి: గుడ్డు - 1 ఉప్పు లేని బటర్ - 30 గ్రా., మైదా - 150 గ్రా.; పాలు - 2 కప్పులు, స్ట్రాబెర్రీలు- 4, అరటిపండు-1 తయారీ: * మందపాటి గిన్నెలో బటర్ కరిగించి, కొద్దిగా చల్లారనివ్వాలి. * మరో గిన్నెలో మైదా, పాలు, గుడ్డు సొన వేసి బాగా బ్లెండ్ చేయాలి. * క్రీప్స్ పాన్ లేదా అంచులున్న వెడల్పాటి పాన్ పైన మూత ఉండేది తీసుకోవాలి. పాన్ను వేడి చేసి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల పై మిశ్రమాన్ని వేసి, దోసెలా గరిటెతో వెడల్పు చేయాలి. పైన మూత పెట్టి, ఆ తర్వాత తిప్పి రెండు వైపులా కాల్చాలి. (పెసరట్టులా) నాన్స్టిక్ పాన్ అయితే నూనె అవసరం పడదు. * ఇలా తయారుచేసుకున్న క్రీప్స్ లోపల స్ట్రాబెర్రీ, అరటిపండు ముక్కలు సెట్ చేసి, పైన కరిగించిన బటర్ వేసి రోల్ చేయాలి. ఆ పైన చాక్లెట్ క్రీమ్తో అలంకరించి, చిటికెడు పంచదార పొడి చల్లి సర్వ్ చేయాలి. చనా డోస్కావల్సినవి: శనగపప్పు - అర కేజీ పంచదార - కేజీ; ఎండు కొబ్బరి తురుము- 4 కప్పులు; నెయ్యి - 200 గ్రా.లు తయారీ * శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. * తురిమిన కొబ్బరి, పంచదార ఉడికిన శనగపప్పులో వేసి కలపాలి. * శనగపిండిలో పంచదార, కొబ్బరి బాగా కలిసేంతవరకు గరిటెతో తిప్పాలి. * దీంట్లో 150 గ్రాముల నెయ్యి వేసి మళ్లీ కలపాలి. * వెడల్పాటి బేసిన్కు మిగతా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ప్లేట్లో పోసి చదునుగా చేయాలి. * 10 నిమిషాల తర్వాత స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సర్వ్ చేయాలి. -
రుచికే కాదు.. ఆరోగ్యానికీ...
తిక్క లెక్క మామూలు వంటకాలను సైతం తన ఘుమఘుమలతో మరింత రుచిగా మార్చే పుదీనాను రోమన్లు, గ్రీకులు మొదటిసారిగా గుర్తించి, దాని వాడకాన్ని వెలుగులోకి తెచ్చారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని వారి నమ్మకం. ఏథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించుకునేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట. పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే యాంటీబయాటిక్స్లా పని చేస్తాయని పలు పరిశోధనలు తేల్చాయి. దీని నుంచి తీసే మెంథాల్ను తల, గొంతు, నొప్పి నివారణకు వాడుతున్నారు. పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటిదుర్వాసన దూరమవుతుంది. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టిపడడమే కాకుండా, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ తగ్గుముఖం పడతాయట. ఎండాకాలంలో మజ్జిగతేటలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే ఎండదెబ్బ కొట్టకుండా ఉంటుందట. బిర్యానీలో పుదీనా ఆకులను వేసేది రుచికి, సువాసనకే కాదు... అజీర్తిని, విషాలను తొలగించడానికేనట! -
ఎంతో రుచిరా.. ఇదేమి రుచిరా?
కృష్ణా, గోదావరి నదుల నీటి రుచిలో తేడాలు ఉన్నాయంటున్న నగర వాసులు.. రెండింటి నీటిపై ప్రయోగశాలలో పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం దాహార్తిని తీర్చుతున్నది కృష్ణా, గోదావరి నదులే. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్ హైదరాబాద్కు తరలివస్తున్న ఆ నదుల నీరే ఇక్కడి ప్రజలకు ఆధారం. కానీ ఈ రెండు నదుల నీటి రుచిలో చాలా తేడా ఉంటోందని నగరవాసులు అంటున్నారు. కృష్ణా నీళ్లు సరఫరా అవుతున్న కొన్ని ప్రాంతాల వారికి కొంతకాలంగా గోదావరి నీళ్లు సరఫరా చేస్తుండడంతో ఈ తేడాను గుర్తించినట్లు చెబుతున్నారు. గోదావరి జలాలు రుచిలో కఠినంగా ఉంటున్నాయని, కృష్ణా నది జలాలు మృదువుగా అనిపిస్తున్నాయని అంటున్నారు. రోజూ కృష్ణా మూడు దశల పథకాల నుంచి 260 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నది నుంచి 86 మిలియన్ గ్యాలన్ల నీటిని జల మండలి సేకరించి హైదరాబాద్ నగరం నలుమూలలకు సరఫరా చేస్తోంది. ఈ నీటి రుచిలో తేడాలుంటున్నాయని నగరవాసులు పేర్కొంటున్న నేపథ్యంలో... కృష్ణా, గోదావరి జలాలను ‘సాక్షి’ బృందం సేకరించి ఐఎస్వో 9001:2008 గుర్తింపు పొందిన శ్రీమహీంద్ర ప్రయోగశాల(చైతన్యపురి)లో పరీక్షించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గోదావరి ‘గాఢత’ అధికమే..! కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి 186 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు తరలిస్తున్న గోదావరి జలాల గాఢత కాస్త అధికంగా ఉన్నట్లు తేలింది. సాధారణంగా ‘ఐఎస్ 10500-2012’ ప్రమాణాల ప్రకారం లీటరు నీటి గాఢత 6.5 పీహెచ్కు మించరాదు. కానీ గోదావరి జలాల గాఢత 7.28 పీహెచ్గా నమోదైంది. ఇక నీటి కాఠిన్యత లీటరు నీటిలో 200 మిల్లీగ్రాములకు మించరాదు. కానీ కొద్దిగా ఎక్కువగా 202 మిల్లీగ్రాములుగా నమోదైంది. నీటిలో కరిగిన మట్టి, ఇసుక రేణువులు 200 మిల్లీగ్రాములకు మించరాదు.. కానీ 256 మిల్లీగ్రాములున్నట్లు తేలింది. లీటర్ నీటిలో సోడియం 38.42 మిల్లీగ్రాములు ఉంది. దీంతో ఈ నీరు తాగినపుడు రుచి కొంత కఠినంగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. గోదావరి జలాలను శుద్ధిచేసేందుకు కొండపాక నీటిశుద్ధి కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో ఫిల్టర్బెడ్స్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ నీటి గాఢత కొంత అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నీటివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ ఉండవని... కాచి చల్లార్చి, వడబోసి తాగితే సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. కృష్ణా నీళ్లు మృదువుగా.. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగ్య నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ముందుగా నగర శివార్లలోని సాహెబ్నగర్ వరకు నీటిని చేర్చుతున్నారు. అక్కడి నుంచి మెయిన్ పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీటి గాఢత 6.25 పీహెచ్గా, కాఠిన్యత ప్రతి లీటరు నీటిలో 180 మిల్లీగ్రాములుగా నమోదైంది. దీంతో ఈ నీరు తాగడానికి మృదువుగా,తేలికగా, రుచిగా ఉన్నట్లు వాటిని వినియోగిస్తున్నవారు చెబుతున్నారు. ఇక ఈ నీటిలో కరిగిన మట్టి, ఇసుక రేణువులు కూడా ప్రమాణాల మేరకే ఉన్నాయి. ఫిల్టర్ చేసుకొని తాగాలి.. ‘‘నీటిలో కరిగే పలు పదార్థాలు, గాఢత, ఇతర లవణాలు అధికంగా ఉంటే రుచి మారుతుంది. తాగినపుడు నీళ్లు మందంగా అనిపిస్తాయి. అందువల్ల నల్లా నీటిని కాచి, చల్లార్చి, వడబోసుకోవడం లేదా ఫిల్టర్ చేసుకొని తాగితే జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా నశిస్తుంది. నేరుగా తాగితే డయేరియా, జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు..’’ - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కృష్ణా, గోదావరి నీటిని పరీక్షించగా వచ్చిన ఫలితాలు.. పరీక్ష పరిమితి కృష్ణా నీరు గోదావరి నీరు గాఢత 6.50 పీహెచ్ 6.25 పీహెచ్ 7.28 పీహెచ్ కాఠిన్యత 200 మిల్లీగ్రాములు 180 మిల్లీగ్రాములు 202 మిల్లీగ్రాములు సోడియం ఉండరాదు లేదు 38.42 మిల్లీగ్రాములు సిలికా ఉండరాదు లేదు 5.48 మిల్లీగ్రాములు -
రుచిలో ధ్వని... ధ్వనిలో వాసన...
మెడిక్షనరీ మనలో పంచేంద్రియాలు వేటి పనిని అవి చేస్తుంటాయి. ముక్కుతో వాసన చూస్తాం. నాలుకతో రుచి చూస్తాం. చర్మంతో స్పర్శను అనుభవిస్తాం. కంటితో దృశ్యాలను చూస్తాం. చెవులతో ధ్వనులను వింటాం. అయితే అరుదుగా కొందరిలో ఇంద్రియాలన్నీ గందరగోళంలో పడిపోతాయి. అలాంటి వాళ్లకు పరిమళం... దృశ్యం ఏకకాలంలో అనుభూతిలోకి వస్తాయి. రుచిలో ధ్వని వినిపిస్తుంది. నాడీ వ్యవస్థలో తలెత్తే అరుదైన లోపం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘సినెస్థేషియా’ అంటారు. ఈ లోపం ఉన్నవాళ్లు మిగిలిన విషయాల్లో మామూలుగానే ఉంటారు. అయితే, ఈ లోపం కారణంగా తమ అనుభవంలోకి వచ్చిన అనుభూతులను కళల ద్వారా వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తారు. -
తాండూరు కందిపప్పు టేస్టే వేరు..
ఇతర రాష్ట్రాల్లో పండించిన కందులతో తయారు చేసిన కందిపప్పు కన్నా తాండూరు పప్పు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నేల స్వభావంతో పప్పు రుచికరంగా ఉండడంతో దీనికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి పప్పు త్వరగా ఉడుకుతుంది. వండిన పప్పు రెండు రోజులైనా పాడవకుండా ఉండడం మరో ప్రత్యేకత. ప్రతి ఏడాది తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు వంద కోట్ల కందుల వ్యాపారం జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కందులు రవాణా అవుతాయి. తాండూరు కందిపప్పు పేరుతో విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో చాలామంది ముద్దపప్పు చేసిన తరువాత తెల్లని వస్త్రంలో ఆరబెడతారు. ఇలా వారం రోజులపాటు ఆరబెట్టిన ముద్దపప్పు పాచిపోదు. ఈ పప్పును జొన్న రొట్టెతోకలిపి ఆరగిస్తారు. - తాండూరు -
తిండి గోల ఇలాచీ! అమోఘమైన రుచి...
సువాసనతోబాటు భిన్నమైన రుచిని తేవడంలో ఘనాపాటి యాలక్కాయ. సుగంధ ద్రవ్యాలలో రారాణిగా పేరొందిన ఇలాచీ వంటింటి షెల్ఫ్లో లవంగంతో చేరి గాజు సీసాలో ఘాటుగా జోడీ కట్టినా నా రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. యాలకులను ప్రాచీనకాలంలోనే మనవారు సుగంధ ద్రవ్యంగా వాడినట్టు చరిత్ర చెబుతోంది. 2వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన చరకసంహితలోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలోనూ యాలకుల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది. ‘కార్డమమ్’ అని పిలిచే ఆంగ్లేయులూ యాలకుల పంటలో ఘనాపాటిగానే పేరుతెచ్చుకున్నారు. దీని శాస్త్రీయ నామం ఎలెట్టరియా. మన దేశంలో యాలకుల ఉత్పత్తిలో అగ్రస్థానం సిక్కిం కొట్టేసినప్పటికీ దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండలు యాలకుల జన్మస్థానంగా చెబుతారు. శ్రీలంక, బర్మా, చైనా, టాంజానియా... ప్రపంచంలో ఎన్ని చోట్ల యాలకులు పండినా, భారతదేశపు యాలకులు అత్యుత్తమమైనవిగా పేర్గాంచాయి. అంతేకాదు ప్రపంచంలో యాలకులను అత్యధికంగా పండించేది మన దేశమే. కుంకుమపువ్వు తర్వాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరున్న యాలకులను గ్రీకులు, రోమన్లు అత్తరు తయారీలో వాడేవారట. అరేబియన్ దేశాలలో యాలకులను కాఫీతోను, మిగిలిన దేశాలలో తేయాకుతోనూ కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయి, కేక్, పేస్ట్రీలలోనే కాదు మన దేశంలో ఘాటైన వంటల్లో మసాలా దినుసుగానూ యాలకులను వాడుతారు. యాలకులను సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడుతారు. అజీర్తి, మలబద్ధకం, అల్సర్లు, ఆస్తమా, జలుబు, సైనస్, కలరా, తలనొప్పి, చెడు శ్వాస.. వంటి ఎన్నో ఆరోగ్యసమస్యలకు యాలకులు దివ్యౌషధం. -
మేలిమి రుచి.. మిరియం
తిండి గోల ప్రపంచంలో మిరియాలకు పుట్టినిల్లుభారతదేశమే. మిరపకాయ పరిచయం లేని రోజుల్లో వంటకాల్లో మిరియాన్నే విరివిగా వాడేవారట మన పూర్వీకులు. మిరప ఎంత మిడిసిపడినా మిరియంలోని ఘాటు, టేస్ట్ ముందు దిగదుడుపే. అందుకేనేమో యురోపియన్ వంటకాల్లో మిరియం ‘పెప్పర్’ పేరుతో టేబులెక్కి మరీ కేక పుట్టిస్తోంది. పోపుల పెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దల మాట. జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, అజీర్తి, క్రిమి, జీర్ణశక్తిని పెంచుటకు, గొంతును శుభ్రపరచడానికి, కీళ్లనొప్పులు, ఉబ్బసం, మూలశంక, కలరా, మలేరియా... ఏ వ్యాధికైనా ఒకే మందు మిరియం. మిరియాలలో తెల్లనివి, ఆకుపచ్చనివి, ఎర్రనివి అరుదుగా గులాబీ రంగువి కూడా ఉంటాయి. పీచు, ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్లలో లభించే మిరియాన్ని కాలీమిర్చి అని కూడా అంటారు. కేరళలో విరివిగా పండే ఈ పంటను మన రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారు. -
కస్టర్డ్ కలపండి.... టేస్ట్ పెంచండి..!
పాలు, పంచదార, గుడ్డు కలిపి చేసే సాస్... కస్టర్డ్. దీనిని స్వీట్ డిష్ల మీద రంగరించి, ఆరగించి చూడండి. అది మీకెంతో ‘ఇష్ట'మైన టేస్ట్ అయిపోతుంది! మళ్లెప్పుడైనా స్వీట్ ఫుడ్ మీదకు మనసు మళ్లితే కచ్చితంగా మీకు కస్టర్డ్ గుర్తుకొచ్చి తీరుతుంది. ప్రతి ఒక్కరూ ఆస్వాదించవలసిన మస్ట్ ఈట్... కస్టర్డ్ డిష్లే ఇవన్నీ. కస్టర్డ్ ఫ్రూట్ టార్ట్స్ కావలసినవి: మైదా - 400 గ్రా, బటర్ - 150 గ్రా, చక్కెర - 150 గ్రా, కోడిగుడ్లు - 2, పాలు - అర లీటరు, కస్టర్డ్ పౌడర్ - 2 చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా, ఉప్పు - తగినంత, పచ్చద్రాక్షలు- నల్లద్రాక్షలు - స్ట్రాబెర్రీస్ - కావలసినన్ని తయారీ విధానం: మైదాపిండిలో బటర్, సగం చక్కెర, కోడిగుడ్ల సొన, చిటికెడు ఉప్పు వేసి కేక్ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కప్కేక్ మౌల్డ్స్లో వేసి బేక్ చేస్తే ఫొటోలో చూపిన ఆకారంలో వస్తాయి. అవన్ లేకపోతే చిన్న చిన్న కప్స్లో పిండి వేసి, కేక్ గిన్నెలో నీళ్లు పోసి, అందులో కప్స్ పెట్టి ఉడికించుకోవచ్చు. తర్వాత నాలుగు చెంచాల చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ కలపాలి. మిగతా పాలలో మిగిలిన చక్కెర వేసి స్టౌమీద పెట్టాలి. మరిగాక కస్టర్డ్ కలిపిన పాలను వేయాలి. చిక్కగా అయ్యాక దించేసి చల్లార్చాలి. ఆపైన ఈ మిశ్రమాన్ని బేక్ చేసుకున్న మైదా టార్ట్స్లో వేసి, పైన ఫ్రూట్స్ పెట్టి సర్వ్ చేయాలి. కస్టర్డ్ క్రీమ్ బిస్కట్స్ కావలసినవి: మైదా - 100 గ్రా, బటర్ - 100 గ్రా, చక్కెర - 50 గ్రా, కస్టర్డ్ పౌడర్ - 50 గ్రా, వెనిల్లా ఎసెన్స్ - 1 చెంచా ఫిల్లింగ్ కోసం: ఐసింగ్ షుగర్ - 150 గ్రా, బటర్ 75 గ్రా తయారీ: చక్కెరను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఓ బౌల్లో మైదా, చక్కెర పొడి, బటర్, కస్టర్డ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. బటర్ వల్ల వచ్చే కన్సిస్టెన్సీ సరిపోతుంది. లేదంటే కొద్దిగా పాలు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడీ మిశ్రమాన్ని బిస్కట్ మౌల్డ్స్లో వేసి అవన్లో బేక్ చేసుకోవాలి. అవన్ లేనివాళ్లు గుండ్రంగా కట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఐసింగ్ షుగర్లో బటర్ వేసి కలిపి, ఈ క్రీమ్ని రెండు బిస్కట్ల మధ్యలో పెట్టి ఒత్తాలి. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ కావలసినవి: పాలు - 1 లీటరు, కస్టర్డ్ పౌడర్ - 4 చెంచాలు, చక్కెర - ఒక కప్పు, యాపిల్ - 1, మామిడిపండు - 1, తెల్లద్రాక్షలు - 10, నల్లద్రాక్షలు - 10, దానిమ్మ గింజలు - పావుకప్పు, సపోటాలు - 3, అరటిపండు - 1, డ్రైఫ్రూట్స్ - కావలసినన్ని తయారీ: పావుకప్పు చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. మిగతా పాలలో చక్కెర వేసి స్టౌ మీద పెట్టాలి. చక్కెర కరిగి, పాలు కూడా బాగా మరిగాక కస్టర్డ్ కలిపిన పాలు వేసి, చిక్కగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించాలి. తర్వాత దించేసి చల్లార బెట్టాలి. ద్రాక్షపండ్లను తప్ప మిగతా అన్ని పండ్లనూ చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. చివరగా డ్రైఫ్రూట్స్తో పాటు మిగతా అన్ని పండ్లనూ పాలలో వేసి కలిపి ఫ్రిజ్లో పెట్టాలి. చల్లగా అయ్యాక సర్వ్ చేయాలి. బేక్డ్ చాక్లెట్ కస్టర్డ్ కావలసినవి: కస్టర్డ్ పౌడర్ - పావుకప్పు, పాలు - 1 కప్పు, చక్కెర - అరకప్పు, కోకోపౌడర్ - అరకప్పు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, కోడిగుడ్లు - 2 తయారీ: పాలు చల్లగా ఉన్నప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత స్టౌమీద పెట్టి చిక్కగా అయ్యాక దించేసుకోవాలి. కోడిగుడ్డు సొనలో చక్కెర, కోకో పౌడర్, ఉప్పు, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కస్టర్డ్ మిశ్రమంలో వేసి మిక్స్ చేయాలి. తర్వాత అవన్లో బేక్ చేసుకోవాలి. పంప్కిన్ కస్టర్డ్ పై కావలసినవి: గుమ్మడి గుజ్జు - ఒకటిన్నర కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, కోడిగుడ్లు - 2, క్రీమ్ - 1 కప్పు, పాలు - అరకప్పు, కస్టర్డ్ పౌడర్, పావుకప్పు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, శొంఠి అల్లం పొడి - అర చెంచా, ఉప్పు - అర చెంచా తయారీ: ఓ బౌల్లో కోడిగుడ్ల సొన, క్రీమ్, పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి బాగా బీట్ చేయాలి. గుమ్మడి గుజ్జులో చక్కెర కలిపి స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకం లాగా అవుతున్నప్పుడు దించేసుకుని ఉప్పు, దాల్చినచెక్క పొడి, శొంఠి పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కోడిగుడ్డు-పాల మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత ఈ మొత్తాన్నీ కేక్ గిన్నెలో వేసి బేక్ చేసుకోవాలి. లేదంటే కేక్ గిన్నెలో స్టౌమీద కూడా వండుకోవచ్చు. -
ఇంటి చిట్కాలు
పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి.పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. -
టేస్ట్ స్పెషలిస్ట్
ఎంతటి నలభీములు వండిన పాకమైనా.. ముందు ఆయన టేస్ట్ చేయాల్సిందే.. ఆ నాలుక మెచ్చి.. ఆహా ఏమి రుచి అంటేనే.. దానికి ఆమోదముద్ర పడుతుంది. స్టార్ హోటళ్లు సైతం ఆయన ఓకే అంటే గానీ కొత్త వంటలను మెనూలో చేర్చుకోవు. రుచి చూడటమే ఆయన అభి‘రుచి’. ఇప్పుడదే ఆయన వృత్తి. నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు ఆయున విశిష్ట అతిథి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఏం చేయకపోయినా.. ఈ టేస్ట్ స్పెషలిస్ట్ బడా చెఫ్లకే రుచుల పాఠాలు చెబుతున్నారు. రుచుల వేటలో ఐటీ ఉద్యోగాన్ని కూరలో కరివేపాకులా తీసిపారే సిన.. టేస్ట్ స్పెషలిస్ట్ సంకల్ప్ సిటీప్లస్తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చిన్నప్పటి నుంచి తినడం అలవాటుగా ఉండేది. స్కూల్లో చదివే రోజుల్లో ఈఎస్ఐ ఆస్పత్రి, వెంగళరావునగర్ ఏరియాలో నేను వెళ్లని హోటల్ లేదు. ఏ హోటల్కు వెళ్లినా.. ఏ రెసిపీని ఎలా తయారు చేస్తారో వంటగదిలోకి వెళ్లి చెఫ్లను అడిగి మరీ తెలుసుకునేవాడిని. నాకు నచ్చిన వంటకం గురించి ఇంటర్నెట్లో సమీక్షలు రాయడం ప్రారంభించాక గుర్తింపు మొదలైంది. మన నగరంలో వంటకాలపై పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వాలనేది నా అభిమతం. ‘జొమాటో’ తొలి వేదిక పరపంచవ్యాప్తంగా విభిన్నమైన వంటకాలు, అవి దొరికే రెస్టారెంట్లపై సమాచారం ఇచ్చే వెబ్సైట్ ‘జొమాటో’ నా తొలి వేదిక. బయట తిన్న ప్రతిసారీ ‘జొమాటో’లో విశ్లేషణలు రాసేవాడిని. కొద్దిరోజులకే ఫాలోవర్స పెరిగారు. నగరంలో దాదాపు 500 పైగా హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే వంటకాలపై సమీక్షలు రాశాను. దీంతో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు నన్ను టేస్టింగ్ సెషన్సకు పిలుస్తున్నాయి. నా సూచనల మేరకు రెసిపీని మారుస్తారు. హైదరాబాద్లోనే కాదు, బెంగళూరు, చెన్నై, పుణే, ముంబై, కోల్కతా వంటి నగరాల్లోనూ టేస్టీ సెషన్స్కు వెళ్లాను. పలు కుకరీ షోలకు న్యాయ నిర్ణేతగానూ వ్యవహరించాను. త్వరలోనే హోటల్ పెడతా వండటం తెలుసా అని ప్రశ్నించే వారూ ఉన్నారు. త్వరలోనే ఒక హోటల్ పెడుతున్నా. రకరకాల వంటకాలు రుచి చూస్తున్నా.. దేవుడి దయ వల్ల ఇంతవరకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. రోజూ ఉదయం 8 కిలోమీటర్లు పరిగెత్తుతాను. రాత్రి గ్లాసెడు మజ్జిగ తాగుతాను. ఎన్ని రుచులు చూసినా, ఇంట్లో అమ్మచేతి వంటకు సాటిరావు. అమ్మ వండిన టమాటా పప్పు, వంకాయ కూరకు మించిన రుచి మరొకటి ఉండదు. తినిపించడంలోనే ఆనందం తినిపించడంలోనే అసలైన ఆనందం ఉందని నమ్ముతా. హోటళ్లలో మిగిలిపోయిన వంటకాలను అనాథలకు పంచాలనే ఆలోచనను ఆర్గనైజ్డ్గా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటికే కొన్ని హోటళ్లు కూడా ఇందుకు ముందుకొచ్చాయి. -
మహారుచి
అభిరుచి ఉండాలే గానీ... రుచికి కొదవే లేదు భాగ్యనగరిలో. కాశ్మీర్ టు కన్యాకువూరి... ఏ టేస్టరుునా ఇక్కడ రెడీ. గజి‘బిజీ’ లైఫ్స్టైల్లో వారానికోరోజే దొరికే హాలిడే... ఎప్పుడూ అదే ‘పాత చింతకాయ పచ్చడేనా’! కాస్త రిలాక్స్గా కూర్చుని... ఇంకాస్త కొత్తగా ఏదైనా వంటకాన్ని ట్రై చేస్తే..! వాహ్... వీకెండ్లో భలే జా కదూ! రండి... మీ కోసమే ఈ రుచులన్నీ... హాట్.. హాట్ పరాటా విభిన్నమైన పరాటాలను పసందుగా అందించే ఫెస్ట్ ఇది. సికింద్రాబాద్ హోటల్ మెహిఫిల్లో ఏర్పాటు చేసిన ఈ ఆహారోత్సవంలో వులబారీ, లచేదార్, వార్ఖీ,కచ్చిమిర్చి, మేథీ, లెహసూని, స్టఫ్డ్ పరాటాలు నగరవాసులను రారవ్ముని ఆహ్వానిస్తున్నారుు. బటాటా వడ నెక్లెస్రోడ్డు నుంచి నయా రుచులు నగరవాసిని రారామ్మని పిలుస్తున్నాయి...బాల్ఠాకరేలోని ఆవేశమంత స్పైసీగా... ముంబై మోడల్ అంత స్వీట్గా.. సచిన్ స్ట్రెట్ డ్రైవ్ అంత క్లాసిక్గా ఉండే ఆ వంటలను రుచిచూస్తే ఎవరైనా సరే వహ్వా అనాల్సిందే.. అందుకే రుచుల పంట పండిస్తున్న ఆ మరాఠీ వంటకాలకు హైదరాబాదీ కూడా ఆదాబ్ అంటున్నాడు.. పావేబాజీకి నోరందిస్తున్నాడు... వడాపావ్కు చేయి అందిస్తున్నాడు.. టోటల్గా ‘మహా’రుచులను తింటూ మన న గరవాసి మైమరచిపోతున్నాడు. కాస్త కారంగా... కొంచెం ఘాటుగా... కనులకింపుగా... భిన్నరుచులతో అదరగొట్టే మహారాష్ట్ర సంప్రదాయ ఫుడ్ ఫెస్టివల్ నెక్లెస్రోడ్డులోని ‘ఓరిస్’లో ప్రారంభమైంది. ఈ నెల 20న మొదలైన ఈ రుచుల విందు మరో 10 రోజులుంటుంది. మామిడి పండ్లను రొయ్యలతో మిక్స్ చేసి తయారు చేసే మచ్చికల్వాన్, బటాటా, మచ్చి కల్వాణ్, కందపోహా, సుబుదానా వడ, రతలు కిస్సీ, గర్వంగ్ మటన్, మట్కీ ఉసాక్, టోండ్లీ భాజీ మటన్ వడ్వాల్, మటన్ కొల్హాపూరి, మటన్ అగ్రి, వడపావ్, పావ్బాజీల గురించి ప్రత్యేక ంగా చెప్పాల్సిన అవరసమే లేదు. మహిమ వంటలే కాదు.. క్రీమీస్టోన్లో వెరైటీ ఐస్క్రీములు లభిస్తాయి. మాన్సూన్ స్పెషల్గా ఇక్కడ తయారుచేసే కాలాజామూన్ అందరి నోళ్లలో నానుతోంది. నేరేడు పండ్లు, వెనీలా ఐస్క్రీమ్ను జామ్నా ఐస్తో కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ ఐస్క్రీమ్ తింటే రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుందని క్రీమీస్టోన్ అపరేషనల్ మేనేజర్ ఫ్రాంక్లిన్ అంటున్నారు. కుల్ఫీ రీమిక్స్, అల్ఫోన్సో మ్యాంగో, మస్క్ మెలన్ లాంటి వెరైటీ ఐస్క్రీమ్లు కూడా లభిస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా డ్రింక్ క్రీమ్ను కూడా తయారు చేశారు. వడపావ్ మహారాష్ట్ర వంటకాల్లో ఎక్కువగా వేరుశనగ, నువ్వులు, ఎండు మిరపకాయలు, మసాలా, ఇంగువ వాడతారు. అలాగే చేపల కర్రీలో వెల్లుల్లి ఎక్కువగా వాడతాం. దీనివల్ల ఎసిడిటీ రాకుండా నివారించవచ్చు. - ఎం.ఎస్.నీలేశ్కుమార్, ఓరిస్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ -
లక్నోలో నమో మామిడి పళ్ల సాగు
-
రుచికి చేవ... ఆవ!
ఆవ ఓ పెద్ద హైజాకరు... ఓ మహా దోపిడీదారు. ఏం... పచ్చట్లో నూనె పోయడం లేదా? కారం వేయడం లేదా? ఆ మాటకొస్తే అల్లం, వెల్లుల్లీ లాంటివి వాడటం లేదా? మిగతా వాటన్నింటినీ హైజాక్ చేసేస్తుంది ఆవ. అలా చేసేసి ‘మామిడికాయ’ పచ్చడికి ‘ఆవకాయ’ అంటూ తన పేరే పెట్టించేలా చేస్తుంది. ఆవకాయనాడే నామకరణోత్సవం చేయిస్తుంది. ఏమిటీ దౌర్జన్యం? ఎందుకీ పేరు దోపిడీ? ఎందుకంటే... ‘ఆవ’ రుచికి చేవనిస్తుంది. మా‘మిడిమిడి’ రుచి సంపూర్ణమయ్యేలా సేవ చేస్తుంది. పచ్చడిని రుచుల తోవ నడిపిస్తుంది. అందుకే కొత్త ఆవకాయను చూడగానే జనమంతా ఆకలిని అర్జెంటుగా అద్దెకు తెచ్చుకుంటారు. కమ్మటి వాసన రాగానే కంచం ముందేసుకుంటారు. ఆవకాయ కనిపించగానే ‘ఆవ’క్కటే వేయమంటారు. అల్లం, మసాలా, నువ్వు, కొబ్బరి ఆవకాయల్ని ఇక్కడ మీ ముందుంచుతున్నాం. కొత్త ఆవకాయ పెట్టుకున్నాం కదా... అందుకే ఇవ్వాళ్టికి... ‘ఆవ’క్కటే వేసుకు తిందాం. ‘ఆవ’క్కటే చాలునందాం. మసాలా ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కేజీ నువ్వుల నూనె - పావు కేజీ, కారం - పావు కేజీ అల్లం + వెల్లుల్లి ముద్ద - పావు కేజీ, పసుపు - టీ స్పూను, ఉప్పు - పావు కేజీ జీలకర్ర పొడి - 50 గ్రా., ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి - టేబుల్ స్పూను, మెంతి పొడి - టీ స్పూను, పసుపు - టేబుల్ స్పూను, జీలకర్ర + మెంతులు - టీ స్పూను ఇంగువ - టీ స్పూను, ఎండుమిర్చి - 10 తయారీ: మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు జత చేయాలి మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేగినతర్వాత దింపేయాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి చల్లారాక మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి బాగా కలపాలి శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి ఈ ఆవకాయ మామూలు ఆవకాయ కంటె కాస్త ఘాటుగా ఉంటుంది. చట్నీ ఆవకాయ కావలసినవి: మామిడికాయ గుజ్జు - కేజీ, ఉప్పు - పావు కేజీ పసుపు - టేబుల్ స్పూను, కారం - 125 గ్రా. అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కేజీ, నువ్వుల నూనె - పావు కేజీ జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు మెంతి పొడి - టేబుల్ స్పూను, ఇంగువ - టీ స్పూను ఆవాలు, జీలకర్ర, మెంతులు - ఒకటి న్నర టీ స్పూన్లు తయారీ: బాగా కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి తగినంత నీళ్లు జతచేసి కుకర్లో ఉడికించాలి చల్లారిన తర్వాత పై చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జుంతా తీసి పెట్టుకోవాలి ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మరో గిన్నెలో నువ్వులనూనె వేసి వేడి చేయాలి ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక దింపేయాలి నూనె చల్లారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం, మామిడిగుజ్జు వేసి బాగా కలియబెట్టాలి శుభ్రమైన జాడీలోకి తీసి పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్లీ కలపాలి ఈ ఆవకాయను అన్నంలోకే కాకుండా, చట్నీలా ఇడ్లీ, దోసె, ఉప్మాలకు కూడా వాడుకోవచ్చు. స్వీట్ పచ్చడి కావలసినవి: మామిడి తురుము - 3 కప్పులు (తీపిగా ఉండే తోతాపురి కాయలు ఎంచుకోవడం మంచిది); పంచదార - కప్పు; ఏలకుల పొడి - టీ స్పూను; జీడిపప్పు - 10 బాదంపప్పు - 10; నెయ్యి - టీ స్పూను; కిస్మిస్ - 20 తయారీ: జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు ముక్కలు, బాదంపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో మామిడికాయ తురుము, పంచదార వేసి స్టౌ మీద ఉంచి నెమ్మదిగా ఉడికించాలి పూర్తిగా ఉడికిన తర్వాత వేయించి ఉంచుకున్న పప్పుల పలుకులు, ఏలకుల పొడి వేసి కలిపి దించేయాలి దీన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి దీన్ని జామ్లా బ్రెడ్, పూరీ, చపాతీలతో తినవచ్చు. అల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కిలో ఉప్పు - 125 గ్రా., కారం - 125 గ్రా. నువ్వుల నూనె - పావు కిలో; అల్లం ముద్ద - 125 గ్రా. వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; పసుపు - టీ స్పూను జీలకర్ర పొడి - 50 గ్రా.; మెంతిపొడి - టీ స్పూను ఇంగువ - టీ స్పూను; ఆవాలు, జీలకర్ర, మెంతులు - టీ స్పూను తయారీ: మామిడికాయ ముక్కలను తుడిచి పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి వేరే గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ఆవాలు, జీలకర్ర, మెంతులు జత చేసి బాగా వేయించి దింపేయాలి నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి పూర్తిగా చల్లారాక, కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి మూడు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి. కొబ్బరి ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కిలో; ఉప్పు - పావు కిలో, పసుపు - టేబుల్ స్పూను; కారం - 125 గ్రా., ఎండుకొబ్బరి పొడి - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా., జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో నువ్వుల నూనె - పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; ఇంగువ - టీ స్పూను, జీలకర్ర , మెంతులు - టీ స్పూను తయారీ: మామిడికాయ ముక్కలను తగినంత పరిమాణంలో కట్ చేసి లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఎండుకొబ్బరి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి నూనె చల్లారాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి. నువ్వు ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కిలో; నువ్వులు - పావు కిలో, ఉప్పు - పావు కిలో; నువ్వుల పొడి - అర కిలో; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా., పసుపు - టీ స్పూను; జీలకర్ర పొడి - 25 గ్రా., మెంతి పొడి - టేబుల్ స్పూను; ఇంగువ - చిటికెడు; ఆవాలు, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్లు తయారీ: మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ఇంగువ కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దించేయాలి నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి (ఇలా చేయడం వల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది) పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి అన్నిముక్కలకూ మసాలా పట్టిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూత పెట్టాలి మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. కర్టెసీ:జ్యోతి వలబోజు హిమాయత్ నగర్ హైదరాబాద్ www.shadruchulu.com సేకరణ:డా. వైజయంతి ఫొటోలు: అనిల్కుమార్ మోర్ల