Traffic problems
-
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కారు కంటే నడుస్తూ వెళ్లడమే బెటర్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ సమస్యలు గుర్తుకువస్తాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరులో ఐటీ ఉద్యోగులు భారీగా నివసిస్తుండటంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు భరించలేనంత ఉంటుంది.కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే వాహనాల మధ్య గంటల తరబడి ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. రోడ్లపైకి వస్తే తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితులు బెంగళూరు నగరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక వానకాలం కావడంతో బెంగళూరులో రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి.తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిగా మారింది. నెట్టింట్లో వైరల్గా మారింది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. వి విషయాన్ని ఆయుష్ సింగ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్ స్క్రీన్షాట్ను ట్విటర్లో షేర్ చేశాడు.ఇందులో బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఇది కేవలం బెంగుళూరులోనే సాద్యమంటూ షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది.This happens only in Bangalore pic.twitter.com/MQlCP7DsU7— Ayush Singh (@imabhinashS) July 25, 2024 ఒక్కరోజులోనే మూడు లక్షలకు పైగా లైకులు సంపాదించింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరు భారత్కు ట్రాఫిక్ రాజధాని అని, ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుందని చెబుతున్నారు. -
ATTENTION PLEASE: కూడళ్లూ.. 'కష్టాలు'..
సాక్షి, హైదరాబాద్: బండి తీసి రోడ్డెక్కాం.. ఆ రోడ్డు ఎంత బాగున్నా.. ఫ్లైఓవర్ ఎక్కి ఎంచక్కా దూసుకెళ్లినా.. ఏదైనా జంక్షన్ రాగానే ఉత్సాహం కాస్తా తుస్సుమంటుంది. అడుగులో అడుగేస్తున్నట్టుగా కదులుతున్న వాహనాలతో చిరాకు మొదలవుతుంది. ఎడమ వైపు ‘ఫ్రీలెఫ్ట్’ ఉంటుందేమో అనుకుంటే.. ఇరుకైన జంక్షన్తో అదీ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎలాగోలా జంక్షన్ దాటేసి, కాస్త దూరంలోని మరో ఫ్లైఓవర్ ఎక్కుదామనుకుంటే.. దానికి ముందే మళ్లీ వాహనాల నత్తనడక మొదలవుతుంది. చిరాకు మరింత పెరిగిపోతుంది. ఎవరైనా వీఐపీ కోసం ట్రాఫిక్ గానీ ఆపి ఉంటే.. ఈ ‘మంట’ నషాళానికి అంటుతుంది.హైదరాబాద్ మహా నగరంలో కూడళ్ల నిర్వహణ సరిగా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సిగ్నల్ ఫ్రీ సిటీ కోసం చర్యలు చేపట్టినా..హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు గత పదేళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వాహనాలు జంక్షన్ల వద్ద చాలాసేపు ఆగిపోవాల్సి వస్తోంది. దాంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతోపాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్పాత్లు సరిగా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికి తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.భారీగా విస్తరణకు నిర్ణయించినా.. త్రీవేలు, చౌరస్తాలు, పెద్ద జంక్షన్లున్న చోట ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనితో జంక్షన్లను విస్తరించి, అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జోన్కు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 12 జంక్షన్లను అభివృద్ధి చేయాలనుకున్నారు. తర్వాత వీటిని 60కి పెంచారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి.. మొత్తం 127 జంక్షన్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 13 చోట్ల మాత్రమే పనులు చేపట్టారు. మిగతావీ మొదలై, పనులన్నీ పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటివి ఈ పనులకు ఆటంకంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన వాటిల్లో పూర్తికానివే కాక ఇంకా పనులే ప్రారంభం కానివీ ఉన్నాయి. జీహెచ్ఎంసీలో పనులకు కొంతకాలంగా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. సగానికిపైగా జంక్షన్లకు ఇంకా డీపీఆర్లే పూర్తి కాలేదు.ఫ్లైఓవర్ దాటితే అంతే.. కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణం వేగంగా సాగుతున్నప్పటికీ.. ఫ్లైఓవర్ దాటగానే ట్రాఫిక్ చిక్కులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు ఐటీ కారిడార్లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్లో రోడ్ నంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. అక్కడి ఇరుకైన జంక్షన్ దీనికి కారణం. ఫ్లై ఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో చూపకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.⇒ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్కు ముందు, పంజగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. నగరంలో చాలా ఫ్లైఓవర్లకుముందు, చివరల్లోఇదే పరిస్థితి ఉంది.జంక్షన్లను అభివృద్ధి చేస్తారిలా.. ముఖ్యమైన జంక్షన్ల వద్ద వాహనాలు సులువుగా మలుపుతిరగడంతోపాటు పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. అందులో భాగంగా చేపట్టే పనులేంటో వెల్లడించారు.⇒ వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్లను విశాలం చేస్తారు. ⇒ జంక్షన్లో అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ బస్టాపులున్న జంక్షన్ల వద్ద ఎటువైపు వెళ్లే బస్సు ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్ వేస్తారు. ⇒ రాత్రివేళ జంక్షన్ అందంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఉంటుంది. కూర్చునేందుకు బెంచీలు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద రోడ్డు డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్ అందేలా మొక్కలు పెంచుతారు. ⇒ పాదచారుల కోసం ఫుట్పాత్లు,వరద నీరు నిలవకుండా కాలువలు నిర్మిస్తారు.విశాలంగా ఉన్నా తప్పని తిప్పలు..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ పాదచారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అండర్పాస్ ఉన్నా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ జంక్షన్ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాక నేటికీ పనులు మొదలు కాలేదు.శాస్త్రీయంగా పరిశీలించి పనులు చేయాలి కేవలం ఫ్లైఓవర్లు, యూటర్న్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరవు. యూటర్న్లు ఏర్పాటు చేసేందుకు శాస్త్రీయంగా సిమ్యులేషన్ స్టడీ చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యేలా వాటి ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇది సరిగా జరుగుతున్నట్టు లేదు. ఏ పనులైనా సైంటిఫిక్ స్టడీతో చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
-
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోకి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ♦ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. ♦లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. ♦ డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యా హ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. ♦ ప్రైవేట్ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్యనే నగరంలో ప్రయాణించాలి. ♦ అత్యంత నెమ్మదిగా నడిచే కేటగిరీకి చెందిన చేతితో తోసే బళ్లు, వివిధ రకాలైన జంతువులు లాగే బళ్లు, సైకిల్ రిక్షాలు, ట్రాక్టర్లు తదితరాల సంచారాన్ని నగరంలోని కీలకమైన 61 టూర్లలో నిషేధించారు. ♦ భవన నిర్మాణ, కూలి్చవేత వ్యర్థాలను తరలించే వాహనాల్లో 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు కలిగినవి ఉ. 11.30 నుంచి సాయంత్రం 5, రా త్రి 10 నుంచి ఉదయం 9 మధ్య సంచరించాలి. ♦ వీటిలో 10 టన్నులు అంతకంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. -
HYD: ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్లాన్.. కార్ పూలింగ్ విధానం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఐటీ ఉద్యోగులు వరుసుగా ఆఫీసులకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. కాగా, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసిఐసిఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్లో కార్ పూలింగ్ విధానంపై వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు మరో ప్రతిపాదన చేశారు. ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పనివేళల్లో మార్పులపై సూచనలు తెలియజేశారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు. కార్ పూలింగ్ విధానం.. ఒకరి కంటే ఎక్కువ మంది కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా ఆదుపులో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు. కేవలం ఒకరి కోసం కూడా కారును బయటకు తీస్తున్నారు. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీంతో కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చన్నది ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది. హైటెక్సిటీలో కారు పూలింగ్ చేపడితే సగానికి సగం సమస్య తీరినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
మియాపూర్ టు సంగారెడ్డి ట్రాఫిక్ రద్దీకి చెక్.. ఆరు వరుసలుగా రోడ్డు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా.. ఈ మార్గంలోనే ఉన్న కూకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. -
‘మినీ’తో విశాఖ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. 67 కి.మీ.పరిధిలో 12 ఫ్లై ఓవర్లు
సాక్షి, అమరావతి: విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. విశాఖ నగరాన్ని దశాబ్దాలుగా వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్యలకు త్వరలో ముగింపు పలకనుంది. అనకాపల్లి నుంచి విశాఖ నగరం గుండా ఆనందపురం వరకు జాతీయ రహదారిపై 12 మినీ ఫ్లై ఓవర్లు నిర్మించడానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సంసిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ‘వన్టైం ఇన్వెస్ట్మెంట్స్కీం’ కింద ఈ మినీ ఫ్లై ఓవర్లను మంజూరు చేసింది. కేవలం 67 కి.మీ.పరిధిలోనే 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలపడం విశేషం. విశాఖ, గంగవరం పోర్టులు, విశాఖ విమానాశ్రయంతోపాటు త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే రహదారుల జంక్షన్లలో ఈ మినీ ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు. అందుకోసం రూ.350 కోట్ల అంచనాతో ఎన్హెచ్ఏఐ ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసింది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను రూపొందించేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కన్సల్టెన్సీలను ఖరారు చేసింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆ 12 జంక్షన్ల భౌగోళిక స్వరూపాన్ని అనుసరించి 3 డిజైన్లలో ఫ్లై ఓవర్లు నిర్మించనుంది. నాలుగు రోడ్ల జంక్షన్ అయితే ప్లస్ (+), మూడు రోడ్ల కూడలి అయితే వై (Y), రెండు రోడ్ల కూడలి అయితే టీ (T) ఆకృతిలో వాటిని ని ర్మించాలని నిర్ణయించారు. అవసరమైన ప్రదేశాల్లో అండర్ పాస్లు నిర్మిస్తారు. భవిష్యత్లో విశాఖ మెట్రో రైల్ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐను కోరింది. 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి డీపీఆర్లను 2023 జనవరి చివరినాటికి ఖరారు చేసి ఆమోదించాలని భావిస్తున్నట్లుగా ఎన్హెచ్ఏఐ పేర్కొంది. మార్చి–ఏప్రిల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో పూర్తి చేయాలని భావిస్తోంది. మినీ ఫ్లై ఓవర్లు నిర్మించే జంక్షన్లు ఇవే.. లంకెలపాలెం, దువ్వాడ, స్టీల్ప్లాంట్ మెయిన్ గేట్, గాజువాక, డెయిరీ ఫాం,తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వార, సీతమ్మధార, మద్దిలపాలెం, ఎండాడ, మధురవాడ. -
Hyderabad: కోర్ సిటీలోకార్ రేసా?.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నగరవాసులకు చుక్కలు చూపింది. తొలిసారిగా ఐఆర్ఎల్కు హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమే కానీ రేసింగ్ నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతమే “సిటీ’జనులను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేసింది. నగరం నడిబొడ్డున నిర్వహించిన రేసింగ్.. రెండు రోజులుగా వాహనదారులకు చమటలు పట్టిస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో ఫార్ములా రేసులు జరిగిన నగరాలను, అక్కడి ఏర్పాట్లను అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్ల నిండా వాహనాలే.. ఐఆర్ఎల్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్, సెక్రటేరియట్ చుట్టూ రహదారులను పూర్తిగా మూసివేశారు. సమాంతర రోడ్లు లేకపోవటంతో ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ రహదారులైన ఖైరతాబాద్, బుద్ధభవన్, రసూల్పురా, మినిస్టర్ రోడ్, బీఆర్కే భవన్ వైపు మళ్లించారు. దీంతో ఆయా మార్గాలలోని నివాస, వాణిజ్య సముదాయాలవాసులు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్బండ్, ట్యాంక్బండ్లలో ట్రాఫిక్ స్తంభించింది. అఫ్జల్గంజ్ మీదుగా సికింద్రాబాద్కు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్బండ్ మార్గం కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్, కవాడిగూడ మీదుగా ప్రయాణించడంతో రోడ్లన్నీ బ్లాకయ్యాయి. దీంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కి.మీ. ప్రయాణానికే గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చేయాలంటే.. రేసింగ్ అనేవి కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనవి. పైగా ఐఆర్ఎల్ పోటీలకు ఉచిత ప్రవేశం కాదు అలాంటప్పుడు ప్రధాన నగరంలో కాకుండా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లేదా లింకు రోడ్లలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయ పడ్డారు. కొన్ని దేశాలలో విమానాశ్రయాలలోనూ రేసింగ్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట విమానాశ్రయంలలో నిర్వహిస్తే బాగుండేదనే పలువురు తెలిపారు. పైగా రేసింగ్ కోసం కొత్తగా రోడ్లను నిర్మించే అవసరం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి, ఉప్పల్ స్టేడియంలలో ట్రాక్స్ను నిర్మించి రేసింగ్లను నిర్వహిస్తే వీక్షకులకు సైతం ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. చైనా, చెన్నైలలో ఎలాగంటే.. చైనా, మన దేశంలోని చెన్నైలో ఫార్ములా రేసింగ్లను సాధారణ ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా శివారులలో నిర్వహిస్తుంటారు. మన దగ్గర మాత్రం సిటీ సెంటర్లో నిర్వహించడంపై నగరవాసులు విమర్శిస్తున్నారు. పోటీ లేకుండానే రేసింగ్ ముగిసింది ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం మరోసారి నిరాశపర్చింది. ఎలాంటి పోటీలు లేకుండా ట్రయల్స్కే పరిమితమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ట్రయల్స్ గంట ఆలస్యంగా మొదలయ్యాయి. రేసర్లు రెండు, మూడు రౌండ్లు తిరిగిన తర్వాత ఆఖరికి పోటీ ఉంటుందని మొదట ప్రచారం చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేదనే కారణంగా లీగ్ను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో నవంబర్ నెలలో జరిగినట్లుగా ఉదయం 11 గంటల నుంచే పోటీ ఉండవచ్చని భావించి వీక్షించేందుకు వచ్చిన మోటారుస్పోర్ట్స్ ప్రియులు సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాశారు. గంట పాటు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలోనూ కొన్ని వాహనాలు బ్రేక్డౌన్కు గురయ్యాయి. ట్రాక్ పై నిలిచిపోయిన వాటిని అక్కడి నుంచి తరలించారు. ఎంతో ఉత్కంఠ రేపుతుందనుకొన్న లీగ్ ఎలాంటి హడావుడి లేకుండానే మొదటి రోజు ముగిసింది. ఈసారి పోటీలపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీ సీట్లతో కనిపించాయి. నరకప్రాయంగా మారుతోంది.. సిటీలో వాహనాల రద్దీ ఎక్కువ. దీనికి తోడు ఇలా ట్రాఫిక్ మళ్లింపు, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మూనేసి వేరు దారుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం ఇళ్లకు వెళ్లడానికి నరకప్రాయంగా మారుతోంది. – రామ్, ప్రైవేటు ఉద్యోగి వైఫల్యానికి నిదర్శనం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురయ్యే ఇబ్బందులను భరించగలం. కానీ ఇలాంటి పరిణామాలు తరచుగా జరగడమే సంబంధిత శాఖల వైఫల్యానికి నిదర్శనం. నగరం కేంద్రంగా జరిగే కొన్ని కార్యక్రమాలు సిటీ ప్రతిష్టను పెంచేవే అయినప్పటికి వాటిని నిర్వహించే ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. – ప్రవీణ్ రెడ్డి, సాఫ్ట్వేర్ రెట్టింపు సమయం.. సాధారణ రోజుల్లో బంజారాహిల్స్ నుంచి రామ్నగర్ రావడానికి గంట సమయం పడితే గత రెండు రోజులుగా రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. నగరం మధ్యలో రోడ్లు మూసేసి, ట్రాఫిక్ మళ్లింపులతో ఈవెంట్లు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మణికంఠ, నగరవాసి జనాల్ని బాధపెట్టే పోటీలు.. ఇండియన్ రేసింగ్ లీగ్తో రోడ్లపై నరకాన్ని చూడాల్సి వస్తోంది. చివరకు అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనాల్ని బాధపెట్టి కార్లను పరుగులు పెట్టించడమేంటి? – వంగీపురం రాఘవ, నాగారం -
లైసెన్స్ లేకపోయినా.. నో ఫైన్ !
సాక్షి, భీమవరం: మన రోడ్లపై నిత్యం అనేకమంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా బైక్లు నడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ సమస్యకు భీమవరం పోలీసులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్ఎల్ఆర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అమలుచేసేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తనిఖీ చేస్తే ప్రతి 10 మందిలో 8 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఎప్పీ రవిప్రకాష్ వినూత్నంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో లైసెన్స్లేని వారు అక్కడికక్కడే ఎల్ఎల్ఆర్ పొందేలా రూపకల్పన చేశారు. లైసెన్స్ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్ఎల్ఆర్ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్నట్లు రవిప్రకాష్ చెప్పారు. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి లైసెన్స్లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7 వేల మందికి తాత్కాలిక లైసెన్స్లు జారీ చేసినట్లు చెప్పారు. హెల్మెట్ తప్పనిసరి వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వాహనాదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీనిలో భాగంగా తనిఖీలు చేసే ప్రాంతాల్లో హెల్మెట్ల అమ్మకాలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నాణ్యమైన హెల్మెట్లు విక్రయించేలా చేయడం వల్ల జరిమానా కట్టే కంటే హెల్మెట్ కొనుగోలు చేయడం, ధరించడం మేలనే భావన వాహనదారుల్లో కలిగేలా చైతన్యం కలిగించడానికి ప్రణాళిక రూపొందించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు భీమవరం జిల్లాకేంద్రంగా అవతరించిన తరువాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు రూపొందించవచ్చనే అంశంపై పట్టణంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం.సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక.. జిల్లాలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్న తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కూడా ఇదే తరహా సర్వే చేయించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేíÙస్తాం. – రవిప్రకాష్ ఎస్పీ, భీమవరం జిల్లా -
‘ఉప్పల్ కష్టాల్’ ఇలా తీరున్.. ప్రత్యామ్నాయ మార్గాలెన్నో..
ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ చక్రబంధనం తప్పేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక్కడ వాహనాల రద్దీని నిలువరించి సమస్యను పరిష్కరించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కోవడం తప్పనిసరి. ఇక్కడ చేపట్టిన స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లయితే ట్రాఫిక్ పద్మవ్యూహం సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. చదవండి: ఇన్స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి.. ఆ స్థలాన్ని సేకరిస్తే.. ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ స్టేడియం పక్కనే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఉన్నతాధికారులు, పాలకులు మాట్లాడి శాశ్వత లేక తాత్కా లిక పద్ధతిలోనైనా స్థలాన్ని సేకరిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. జిల్లా బస్టాప్ను మారిస్తే.. ఉప్పల్ వరంగల్ బస్ స్టాప్ నుంచి మొదలు నలువైపులా కిలోమీటరు మేర బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చౌరస్తా వరకు బస్సుల వరుస నిత్యకృత్యం. దీంతో పాటు ఉప్పల్ చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు రోడ్డుకు అడ్డుగా బస్సులను నిలిపివేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా బస్ స్టాప్ను మెట్రో స్టేషన్ వద్దకు మార్చవచ్చు. సమాంతర రహదారుల్ని అభివృద్ధి చేస్తే.. వరంగల్ జాతీయ రహదారికి సమాంతరంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ సమాంతర రోడ్ల మీదుగా ట్రాఫిక్ను డ్రైవర్షన్ చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలను నిలువరిస్తే.. ఉప్పల్ వరంగల్ రహదారి.. ఇటువైపు ఎల్బీనగర్ వెళ్లే మార్గం దాదాపు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తున్నాయి. వాటికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆ స్థానంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఫుట్పాత్ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో ఆర్టీఏ కార్యాలయం వరకు ప్రైవేట్ వాహనాల షోరూంల యజమానులు దాదాపుగా సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు వీరిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. సర్వీస్ రోడ్డును క్లియర్ చేస్తే ఎల్బీనగర్ రోడ్డు దాదాపుగా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. పనుల నత్తనడకకు స్వస్తి పలికితే.. ఉప్పల్ చౌరస్తా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇవి నత్త నడకన జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020లోనే పూర్తవ్వాలి. అధికారుల అలసత్వంతో ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యకు ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. బస్టాప్తో బోలెడు కష్టాలు.. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఆర్టీసీ, మున్సిపల్, అర్అండ్బీ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరం. యాదాద్రి టెంపుల్ తెరిచినప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఉప్పల్ వరంగల్ బస్స్టాప్ను నుంచే యాదాద్రి వెళ్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపైకి మినీ బస్సులను సైతం ఉప్పల్ నుంచే ప్రారంభించారు. ఈ కారణంగానూ రద్దీ మరింత పెరిగింది. అదనంగా ఇమ్లీబన్, జూబ్లీ బస్స్టేషన్ వరంగల్, హన్మకొండ, పరకాల, చెంగిచర్ల, ఉప్పల్ డిపోల బస్సులు సైతం ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒకే బస్స్టాప్ ఉంది. అది వరంగల్ బస్స్టాప్ మాత్రమే. సరైన బస్ బే లేక పోవడంతో రోడ్లపైనే బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. వీటిని పక్కపక్కనే పెట్టడంతో ట్రాఫిక్జాం సమస్య తలెత్తుతోంది. -
సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: అల్వాల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న స్థలంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలగిరి చౌరస్తా–బొల్లారం చెక్పోస్టు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనచోదకులు ఈ మార్గాన్ని అనుసరించవద్దని సూచిస్తున్నారు. కరీంనగర్ హైవేకు రాకపోకలు సాగించే వారు ఔటర్ రింగ్ రోడ్ను ఆశ్రయించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సోమవారం సూచించారు. నిర్ణీత సమయంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో జరుగుతుందన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ హైవే మధ్య ఉన్న టివోలీ ఎక్స్రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తెలంగాణ తల్లి విగ్రహాల కేంద్రంగా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. కరీంనగర్ హైవే నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే మార్గంలో షామీర్పేట ఓఆర్ఆర్, బిట్స్ జంక్షన్, తూముకుంట ఎన్డీఆర్ విగ్రహం, బొల్లారం చెక్పోస్టు కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. (చదవండి: కూకట్పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేస్తున్న చినజీయర్ స్వామి ) -
ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు!
సాక్షి ముంబై: నిత్యం వాహనాల రద్దీతో సతమతమయ్యే పాదచారులకు కొంత ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇకపై ప్రతి ఆదివారం ముంబైలోని 13 రోడ్లపై వాహనాల రాకపోకలను మూసివేసి ఆ రోడ్లకు సెల వు ప్రకటించనున్నారు. మార్చి27 ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో నేడు ముంబైలోని 13 రోడ్లను వాహనాలు తిరగకుండా మూసివేయనున్నారు. ప్రతి రోజూ వాహనాల రద్దీ తో సతమతమయ్యే పాదచారులకు కాస్త వెసులుబాటు కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 13 రోడ్లపై ఉదయం 8 గంటల నుంచి 11 గం టల వరకు వాహనాలను అనుమతించరు. ఈ విషయంపై ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా మాట్లాడుతూ, రోడ్లను వాహనాల రాకపోకలకు మూసివేసి, కేవలం పాదచారుల కోసం మాత్ర మే తెరిచి ఉంచుతామన్నారు. అదేవిధంగా వాహనాల కోసం ప్రత్యామ్నాయ దారుల్ని కేటాయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోడ్లపై ఆదివారం పిల్లలు ఆటలాడుకోవచ్చని, సీనియర్ సిటిజన్లు వ్యాహ్యాళికి వెళ్ళ వచ్చనీ, సైక్లింగ్, యోగా, వ్యాయామం లాంటివి రోడ్ల మీదనే చేసుకోవచ్చన్నారు. ఇక ఈ నిర్ణయంపై ముంబైకర్ల స్పందనను బట్టి మరిన్ని రోడ్లను ఆదివారం మూసివేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చదవండి: కనువిందు చేసే ట్రెక్కింగ్.. వణుకుపుట్టించే చరిత్ర కొత్త ప్రతిపాదనేం కాదు... నిర్ధారిత సమయాల్లో ప్రధాన రహదారులని మూసివేసే ప్రక్రియ బొగోటా, కొలంబియా లాంటి దేశాల్లో 1974 నుంచే అమలులో ఉంది. ఇందుకోసం ఆ దేశాల్లో ఉద్యమమే జరిగింది. ప్రజల సౌకర్యంకోసం కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్లను వాహనాల కోసం మూసి ఉంచుతారు. ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా పలు ప్రాంతాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. నగర ప్రాముఖ్యత కలిగిన రోడ్లను వాహన కాలుష్యం లేకుండా, ప్రజల కోసం తెరిచి ఉంచడం వల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాహనాల కోసం మూసివేసిన ఈ రోడ్లపై నడవడం, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుందో.. నిజంగానే రాబోతుందండోయ్
మనం కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు భారీగా ట్రాఫిక్జామ్ అయితే... కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే ఏమనిపిస్తుంది? గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీని తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. కొత్తగా ఆవిష్కరించిన ఎగిరే కారును ఎవరు, ఎక్కడ రూపొందించారు, అది ఎలా ఉంటుందనే విశేషాలు చూద్దాం..! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 2027 నాటికల్లా వినియోగంలోకి.. యూరప్ దేశమైన స్లొవేకియాలో ఏరోమొబిల్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి ఫోర్సీటర్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఆవిష్కరించింది. దీని పేరు ఏఎం నెక్ట్స్. మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది. 2027నాటికల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్ కారు ఇది. సూపర్కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్’ను (అంటే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగరడం.. గాల్లో నుంచి రోడ్డు మీదికి దిగడం) మార్చుకోగలదు. హాయిగా వెళ్లొచ్చు... ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల విలువైన సమయం చాలా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యమైన నగరాల మధ్య 100 నుంచి 500 మైళ్ల దూరం వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటోంది. ఇందులో వెళ్తే ప్రయాణ బడలిక అస్సలుండదని, ఆడుతూపాడుతూ వెళ్లొచ్చని, అదీగాక భూమ్మీద ఉండే అందాలను వీక్షిస్తూ వెళ్లొచ్చని చెబుతోంది. అయితే ఫ్లయింగ్ ట్యాక్సీ ధర ఎంత అనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అలాగే ప్రయాణికులకు టికెట్ ఎంత ఉంటుందన్నది కూడా వెల్లడించలేదు. తొలుత ఏఎం 4.0 ఈ కంపెనీ మొదట రూపొందించిన టూసీటర్ ఫ్లయింగ్ కారు ఏఎం 4.0 మోడల్ను 2017 జూన్లో ప్యారిస్లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. గాలిలో గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డుపై దీని గరిష్టవేగం గంటకు 160 కి.మీ. దీని ఖరీదు రూ.9.8 కోట్లు – 12 కోట్ల వరకు ఉంది. ఈ ఫ్లయింగ్ కారును గాలిలో నడపాలంటే మాత్రం పైలట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కారును వచ్చే ఏడాదికి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు 2024కు గానీ అందుబాటులోకి రాదని చెబుతోంది. అసలు సిసలు ఫ్లయింగ్ కారు ‘ఇది ఏరోమొబిల్ అసలు సిసలు ఫ్లయింగ్ కారు. ఇది రెండో విప్లవాత్మకమైన మోడల్’ అని కంపెనీ సీఈఓ పాట్రిక్ హెస్సెల్ చెప్పారు. ఒక్క ఉత్తర అమెరికా మార్కెట్లోనే ఏడాదికి 4 లక్షల కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగిరే కార్ల వల్ల వ్యక్తిగత రవాణాను మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. రోడ్డుపైగానీ, గాలిలో గానీ చాలా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి దోహదం చేస్తుందని అంటోంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్లకు దీంతో చెక్ పెట్టవచ్చంటోంది. ఈ ఎగిరే కారు కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న 10 వేల ల్యాండింగ్ స్ట్రిప్లను వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. -
ఇక వారికి ట్రాఫిక్ చిక్కులు లేనట్లే.. ఫిబ్రవరిలోనే అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన మరో అండర్పాస్ వచ్చే ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద కుడివైపు అండర్పాస్ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులుదిద్ది, ఫిబ్రవరిలో వినియోగంలోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్పాస్ వినియోగంలో ఉండటం తెలిసిందే. ఈ అండర్పాస్ కూడా అందుబాటులోకి వస్తే ఇటు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వారికి, విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిథానీల మీదుగా ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్ ప్రాంతాల వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. అండర్పాస్ వివరాలు.. ► పొడవు: 490 మీటర్లు ► వెడల్పు: 12. 87 మీటర్లు ► మూడు లేన్లు.. ఒకవైపు ప్రయాణం ► అంచనా వ్యయం : రూ.14.87 కోట్లు ఫిబ్రవరిలో అందుబాటులోకి.. తుకారాంగేట్ ఆర్యూబీ సైతం.. ఎల్బీనగర్ అండర్పాస్తో పాటు తుకారాం గేట్ రైల్వే అండర్పాస్ పనులు కూడా పూర్తి కావచ్చాయని, అది కూడా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య -
ముంబైలో ‘రెంట్ ఏ ట్యాక్సీ’ పథకం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజురోజుకూ జఠిలమవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు ‘రెంట్ ఏ బైక్’ అనే నూతన విధానాన్ని ఓ ప్రైవేటు కంపెనీ తెరమీదకు తెచ్చింది. అందుకు సంబంధించిన ప్రతిపాదన రవాణ శాఖకు పంపించింది. దీనిపై త్వరలో స్టేట్ ట్రాన్స్పోర్టు అథారిటీ (ఎస్టీఏ) సమావేశం ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్ అవినాశ్ ఢాకణే తెలిపారు. ముంబైలో జరుగుతున్న మెట్రో పనులు వల్ల గత కొన్ని నెలలుగా రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. ఫలితంగా వాహనాల వేగం మందగించి తరచూ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీని ప్రభావం ముంబైకర్ల విలువైన సమయం, వ్యయంపై పడుతోంది. రోడ్లపై ప్రైవేటు కార్లు, ట్యాక్సీలు, ఆటోల సంఖ్య తగ్గించాలంటే రెంట్ ఏ బైక్ పథకం ఎంతో దోహదపడుతుందని ప్రైవేటు కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ కంపెనీ అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం రెంట్ ఏ బైక్ పథకం యాప్ బేస్డ్ సేవా తరహాలో ఉంటుంది. ఈ బైక్ల సేవలు రైల్వే స్టేషన్ నుంచి కార్యాలయాలకు చేరుకునే విధంగా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరు రోజుల కోసం ఈ బైక్లు హెల్మెట్తోపాటు అందజేస్తాయి. బైక్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చు. చదవండి: (ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే..) లోకల్ రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ బయట అందుబాటులో ఉన్న రెంట్ ఏ బైక్ సేవలను వినియోగించుకోవచ్చు. సాధారణంగా లోకల్ రైలు దిగిన ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు షేర్ ట్యాక్సీలు, ఆటోలలో తమ కార్యాలయాలకు చేరుకుంటారు. ఆలస్యమైతే లేదా అత్యవసరమైతే సొంతంగా ట్యాక్సీలో లేదా ఆటోలో వెళతారు. దీంతో రోడ్డుపైకి ఎక్కువ వాహనాలు రావడంవల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంవల్ల చార్జీలు కూడా ఎక్కువే అవుతాయి. ఇది మధ్యతరగతి వారికి ఆర్థికంగా భారం కూడా. అదే బైక్ను రెంట్కు తీసుకుంటే విలువైన సమయం ఆదా కావడంతోపాటు తక్కువ చార్జీలకే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రైవేటు కంపెనీ అంటోంది. అంతేగాకుండా ట్యాక్సీ, యాప్ ఆధారిత ప్రైవేటు ఓలా, ఉబెర్టాంటి ఫోర్ వీలర్స్తో పోలిస్తే టూ వీలర్ ప్రయాణం వేగంగా, చార్జీలు గిట్టుబాటు అయ్యే విధంగా ఉంటుందని పేర్కొంది. ‘ర్యాపిడో’ వ్యవహారం ఇంకా తేలలేదు... ఇదిలాఉండగా 2020 ఆగస్టులోనే ర్యాపిడో అనే కంపెనీ ముంబైలో ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఆ సేవలకు సంబం ధించిన బ్యాడ్జీ, లైసెన్స్ లేకపోవడంతో ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) స్పందించలేదు. అనుమతులు లేకుండా ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తే ర్యాపిడో కంపెనీపై, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆర్టీఓ హెచ్చరించింది. దీంతో ఈ పథ కం అటకెక్కింది. అయితే బైక్ టాక్సీ సేవలు కొనసాగుతుండగా, రెంటెడ్ బైక్ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. అప్పటికే కరోనా కారణంగా ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోయారు. తరుచూ పెరుగుతున్న సీఎన్జీ ధరలతో చార్జీలు పెంచివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రెంట్ ఏ బైక్ సేవలు ప్రారంభిస్తే ట్యాక్సీ, ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఎస్టీఏ దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి సంబంధిత ఆర్టీఓ అధికారులతో సమగ్ర విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆదరాబాదరగా నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత వచ్చే విమర్శలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వచ్చే వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. -
ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ట్రాఫిక్ తిప్పలు త్వరలోనే తీరనున్నాయి. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, మెట్రో–2, 3, 4 దశలు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టులు 2023 వరకు వినియోగంలోకి వస్తాయని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలో జీవనాడి అయిన లోకల్ రైళ్లు సహా బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం నగరంలో ప్రతీరోజు కొన్ని వందల కొద్దీ కొత్త వాహనాలు రోడ్డుపైకి రావడమే. వీటివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడటంతో పాటు వాహనాలలో నుంచి వెలువడుతున్న పొగ, ఇతర విష వాయువులు, ధ్వని కాలుష్యం వల్ల వాతావరణం కలుషితం అవుతోంది. దీంతో ముంబైకర్లకు స్వచ్చమైన గాలి, ప్రశాంత వాతావరణం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ముంబైకర్లకు ట్రాఫిక్ జామ్ సమస్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు స్వచ్చమైన గాలితో కూడిన ప్రశాంత వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రణాళికలు రచించింది. చదవండి: ('పోల్వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం) ఈ క్రమంలోనే బీఎంసీ పరిపాలనా విభాగం కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) మెట్రో–2, 3, 4 దశల ప్రాజెక్టులు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ముంబైలో ట్రాఫిక్ జామ్ సమస్య చాలా శాతం వరకు తీరనుంది. ప్రయాణం వేగవంతం అవుతుంది. ప్రస్తుతం రెండు గంటల్లో పూర్తి అవుతున్న ప్రయాణం అప్పుడు అర గంటలోనే ముగుస్తుంది. అలాగే, బీఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోస్టల్ రోడ్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు దాదాపు 45 శాతం పూర్తి కావచ్చాయని మంత్రి ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ఇక, ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి వర్లీ సీ–లింకు వరకు 10.58 కిలోమీటర్ల పొడవైన మార్గం ఉంది. ఇందులో నాలుగు లేన్లు (2+2) ఉంటాయి. ఈ మార్గం కొన్ని చోట్ల నేలపై నుంచి, మరికొన్ని చోట్ల భూగర్భం లోపలి నుంచి ఉంటుంది. దీనికి సంబంధించిన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు 2,300 టన్నుల భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మలబార్ హిల్ వద్ద భూగర్భం లోపల తవ్వకం పనులు ఈ ఏడాది జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి కూడా 2023 వరకు పూర్తికానున్నాయి. ఈ పనుల కోసం బీఎంసీ ఏకంగా రూ. 12,700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదే తరహాలో మెట్రో వివిధ ప్రాజెక్టు పనులు, శివ్డీ–నవశేవా సీ–లింకు పనులు కూడా పూర్తవుతాయని ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివ్డీ–నవశేవా సీ–లింకును వర్లీ–బాంద్రా సీ–లింకుతో అనుసంధానం చేయనున్నారు. దీంతో వర్లీలో సీ–లింకు వంతెన పైకెక్కిన వాహనాలు శివ్డీ–నవశేవా మీదుగా నేరుగా నవీ ముంబైలో బయటకు వస్తాయి. ప్రస్తుతం ట్రాఫిక్ ఉన్న సమయంలో వర్లీ నుంచి నవీ ముంబై చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. కానీ, సీ–లింకు మీదుగా వెళితే సుమారు 30–45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీంతో వాహనదారుల విలువైన సమయంతో పాటు వాహనాల ఇంధనం కూడా దాదాపు 50–70 శాతం వరకు ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం కూడా సగానికి పైగా తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో ముంబైకి ఎంతగానో దోహదపడుతాయని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. -
హెచ్పీసీఎల్కు చేరుకున్న భారీ రియాక్టర్
మల్కాపురం (విశాఖ పశ్చిమ): విశాఖ షిప్యార్డ్ నుంచి భారీ రియాక్టర్ను మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హెచ్పీసీఎల్కు తరలించారు. గత రెండేళ్ల నుంచి హెచ్పీసీఎల్ సంస్థ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన భారీ రియాక్టర్లను గుజరాత్లోని ఎల్అండ్టీ సంస్థ తయారుచేస్తోంది. గుజరాత్ నుంచి రియాక్టర్లు సముద్రమార్గం ద్వారా షిప్యార్డ్కు వస్తున్నాయి. అక్కడ నుంచి భారీ వాహనం సాయంతో హెచ్పీసీఎల్కు తరలిస్తున్నారు. ఇదేవిధంగా మంగళవారం షిప్యార్డ్కు వచ్చిన భారీ రియాక్టర్ను అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన భారీ హైడ్రాలిక్ వాహనం సాయంతో హెచ్పీసీఎల్కు చేరవేశారు. ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెల్లవారుజామునే అధికారులు రియాక్టర్ను తరలించారు. -
అమరావతి సభను ప్రశాంతంగా జరపండి
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సభ నిర్వహణకు అనుమతులు ఇచ్చామని గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమ వర్మ చెప్పారు. సభను అల్లర్లకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన పూర్తి బాధ్యతను నిర్వాహకులే వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. శాంతియుతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యంగం భారత పౌరులకు ఇచ్చిందని.. ఇతరులకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభకు పోలీస్ శాఖ నుంచి అన్ని సహకారాలు ఉంటాయన్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా కొందరు అల్లర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తమకు ముందస్తు సమాచారం అందిందన్నారు. ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విధిగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సభ, ర్యాలీ కార్యక్రమాలను అనుమతిస్తామన్నారు. ఎస్పీ విశాల్గున్నీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. కరకట్టపై ముఖ్య అధికారులు, జడ్జిలు, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలకు అనుమతి ఉంటుదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మందిని సమీకరించకుండా జాగ్రత్తలు పాటించేలా నిర్వహకులకు అనుమతులు ఇచ్చామన్నారు. -
ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి లింక్రోడ్లు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి, కాలుష్యనియంత్రణకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా 137 లింక్, స్లిప్రోడ్లు నిర్మిస్తున్నామని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మొదటిదశలో చేపట్టిన 37 లింక్రోడ్ల(126 కి.మీ.)లో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. లింక్రోడ్లకు ఇప్పటికే రూ.313.65 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ఆకర్షణీయ నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు. తగిన జీవన ప్రమాణాలతో నివాసయోగ్యమైన నగరంగా జేఎల్ఎల్, మెర్సర్ వంటి సంస్థల సర్వేల్లో వెల్లడైందని చెప్పారు. ఓల్డ్ బాంబే హైవే నుండి రోడ్ నంబర్ 45 మార్గంలో రూ. 23.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్పాస్ పనులకు శంకుస్థాపనతోపాటు ఓల్డ్ బాంబే హైవే నుండి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు రూ.19.51 కోట్ల వ్యయంతో 2.30 కిలోమీటర్ల మేర లింక్రోడ్డు, ఓల్డ్ బాంబే హైవే లెదర్ పార్కు నుండి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు రూ.15.54 కోట్ల వ్యయంతో 1.20 కిలోమీటర్ల లింక్ రోడ్డు, మియాపూర్ రహదారి నుండి హెచ్టీ లైన్ వరకు రూ. 9.61 కోట్ల వ్యయంతో కిలోమీటరు దూరంతో నిర్మించిన మరో లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాజాగూడలో విలేకరులతో మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని, నగరంలో గత ఆరేళ్లలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ప్రజల సూచనలు, సలహాలు స్వీకరిస్తాం.. నగర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లింకురోడ్ల గురించి సోషల్ మీడియా, పబ్లిక్డొమైన్లో పెడతామని, వీటిపై ప్రజల సూచనలు, సలహాలు, స్వీకరించి అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని లింక్రోడ్లు నిర్మిస్తామన్నారు. ఖాజాగూడ కొత్తరోడ్డు పక్కనే ద్వీపంలా పెద్ద చెరువు ఉన్నందున దీన్ని నెక్లెస్రోడ్డు తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సంజీవయ్యపార్కు, దుర్గంచెరువు, ఇతర చెరవులను అభివృద్ధి చేసినట్లుగానే ఈ చెరువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రజలంతా వీకెండ్స్లో సేదతీరేలా మార్చాలన్నారు. కార్యక్రమాల్లో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తల సాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రావు, ఎమ్మెల్యే గాంధీ, మేయ ర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. -
ముంబైలో సరికొత్త ప్రయోగం.. కేటీఆర్ ఆసక్తి
-
రోడ్ల విస్తరణ చేపట్టట్లేదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను విస్తరించట్లేదని, రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను పిల్ కమిటీ సిఫారసుల మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ట్రాఫిక్ డీసీపీలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య వల్ల సగం రోజు రోడ్లపైనే గడిచిపోతోందని భాస్కర్ తన లేఖలో పేర్కొన్నారు. తగిన స్థాయిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించలేదని, దీంతో పాదచారులు రోడ్డు దాటడం కష్టమవుతోందన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటం వల్ల వాహనాలను కూడా రోడ్లపై నిలుపుతున్నారని, ఇది కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారిందని వివరించారు. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకుని వాహనదారులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లకు, మ్యాన్హోళ్లకు మరమ్మతులు నిర్వహించే విషయంలో ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండట్లేదన్నారు. ఆర్టీసీ బస్సులను కూడా రోడ్ల మధ్యలో అకస్మాత్తుగా ఆపుతున్నారని, వీటి వల్ల వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పారు. పార్కింగ్ ప్రదేశంలో షాపులు.. పిల్ కమిటీలోని న్యాయమూర్తులందరూ కూడా ఈ లేఖను పిల్గా పరిగణించాలని ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సమయంలో స్టిల్ట్ ఏరియాను పార్కింగ్ కోసం చూపుతున్నా, ఆ తర్వాత దాన్ని వాణిజ్య అవసరాల కోసం దుకాణాలుగా మారుస్తున్నారని కమిటీ లోని న్యాయమూర్తి జస్టిస్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. దీంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను నిలపాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఈ అభిప్రాయంతో న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ ఏకీభవించారు. -
స్పీడ్ ప్రాజెక్ట్
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన మొదటి ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే మొదటిసారి కేవలం ఫౌండేషన్స్ తప్ప.. మిగతా పనులన్నీ రెడీమేడ్ (ప్రీ ఫ్యాబ్రికేటేడ్)గా కామినేని వద్ద (ఎడమవైపు) ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టి కేవలం 16 నెలల్లోనే పూర్తి చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రెండు నుంచి రెండున్నరేళ్లు పడుతోంది. టెండరు మేరకు.. ఈ వంతెనను సంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాల్సి ఉండగా, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పనులను దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు సంస్థ బీఎస్సీపీఎల్ ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’ వైపు మొగ్గు చూపింది. ఖర్చు 20 శాతం అధికమైనా తామే భరిస్తామనడంతో ప్రభుత్వం అంగీకరించింది. వివిధ ప్రాజెక్టుల్లో స్తంభాలపైన ఉండే పియర్ క్యాపింగ్ సెగ్మెంట్లు, గర్డర్లకు మాత్రం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ను వినియోగిస్తున్నారు. స్తంభాలకు కూడా ప్రీకాస్టింగ్ వాడడం ఇదే ప్రథమం. ‘ప్రీకాస్ట్ అండ్ పోస్ట్ టెన్షన్డ్ టెక్నాలజీ’గా వ్యవహరించే ఈవిధానంతో ఫ్లై ఓవర్ను విజయవంతంగా పూర్తిచేశారు. కాగా దీనిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఇదే పద్ధతిలో మరో 14 నిర్మాణం చైనా, జర్మనీ వంటి దేశాల్లో ఎంతోకాలంగా అనుసరిస్తున్న ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానాన్ని నగరంలో అమలు చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఎండీ బొల్లినేని శీనయ్య ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వం ప్రోత్సహించడంతో తాము చేపట్టనున్న మరో 14 ఫ్లై ఓవర్లను సైతం ఇదే పద్ధతిలో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కామినేని జంక్షన్ పరిసరాల్లోని మిగతా ఎస్సార్డీపీ పనులు కూడా పూర్తయ్యాక ట్రాఫిక్ సమస్యలు 89 శాతం తగ్గుతాయని జీహెచ్ంసీ చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టŠస్) ఆర్.శ్రీధర్ తెలిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్.. పర్యావరణ పరంగానూ మేలైనదన్నారు. ట్రాఫిక్ సమస్యలతో పాటు ధ్వని కాలుష్యం, జంక్షన్ వద్ద విరామ సమయం తగ్గుతుందన్నారు. ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయని ప్రాజెక్ట్ మేనేజర్ బి.మల్లికార్జునయ్య వివరించారు. కొత్త టెక్నాలజీతో ప్రయోగం సాహసమే అయినా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రూ.448 కోట్లతో ప్యాకేజీ–2 పనులు ఎస్సార్డీపీ మొదటి దశ ప్యాకేజీ–2లో భాగంగా ఎల్బీనగర్ చుట్టుపక్కల నాలుగు జంక్షన్ల (ఎల్బీనగర్, కామినేని, చింతల్కుంట, బైరామల్గూడ) వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నారు. వీటికి మొత్తం వ్యయం రూ. 448 కోట్లుగా అంచనా వేశారు. తగ్గనున్న ట్రాఫిక్ చిక్కులు ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్తో పాటు ప్యాకేజీ–2 పనులు పూర్తయితే కామినేని జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు దాదాపు తొలగిపోతాయి. శ్రీశైలం, శంషాబాద్, ఒవైసీ ఆస్పత్రి, విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుంది. కుడివైపు ఫ్లై ఓవర్ పనులు జరగాల్సి ఉన్నందున అది పూర్తయ్యేంత వరకు ఈ ఫ్లైఓవర్ను ప్రస్తుతానికి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు నుంచి ఒవైసీ, శంషాబాద్ వైపు వెళ్లే వారి కోసం వినియోగించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణారావు తెలిపారు. -
టైమింగ్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఈ సమయాల్లో రహదారులపై దూసుకుపోయే వాహనాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఆటోలు, వ్యానులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా... కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల తొందరపాటుతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని తప్పించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు విద్యాసంస్థల పని వేళల్లో మార్పు (స్టాగరింగ్) చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన ఏడేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. 2010 లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, ఆ తర్వాతి ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆశించినప్పటికీ అది అటకెక్కింది. నగర ట్రాఫిక్ చీఫ్గా పనిచేసిన సీవీ ఆనంద్ బదిలీతో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్కుమార్ నేతృత్వంలో బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తొలి దశలో పాఠశాలలు, రెండో దశలో కళాశాలల సమయాల్లో మార్పులు చేయాలని తాజాగా ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. విద్యాశాఖ ముందుకొస్తేనే... విద్యాసంస్థల సమయాల్లో మార్పునకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తిస్థాయి అధికారం ట్రాఫిక్ విభాగానికి లేదు. దీని కోసం తొలుత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా కొత్తగా ఏర్పడిన, ఏళ్లుగా ఉన్న స్కూల్ జోన్లను గుర్తించాలి. వీటి ఆధారంగా డీఈఓ సహకారంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ట్రాఫిక్ ఏసీపీ, స్థానిక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీరంతా ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, తలెత్తుతున్న సమస్యలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆపై ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూసేందుకు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి స్టాగరింగ్కు సంబంధించిన ప్రతిపాదిత విధానాన్ని రూపొందిస్తారు. వీటిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ వింగ్ ప్రయత్నాలు 2012లోనే చేసినా విద్యాశాఖ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు వేళల్లో మార్పులు రాలేదు. దాదాపు అన్నీ ఒకే సమయానికి ప్రారంభమవడం, ముగియడం జరుగుతోంది. దీంతో విద్యార్థులను తరలించే, వ్యక్తిగత వాహనాల కారణంగా తీవ్రమైన రద్దీ ఉంటోంది. మరోవైపు సమయం మించిపోకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో విద్యాకుసుమాలు ప్రమాదాలబారిన పడుతున్నాయి. కేటగిరీల విభజన కీలకం... స్టాగరింగ్ అమలు చేయడానికి ముందుగా స్కూల్ జోన్స్ను గుర్తించడంతో పాటు వాటిని కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. 2010లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు, ఆ తర్వాత ఏడాది నగరవ్యాప్తంగా అధ్యయనం చేశారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసిన ట్రాఫిక్ వింగ్ ఉన్నతాధికారులు విద్యాసంస్థలున్న ప్రాంతాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. ఏదేని ప్రాంతంలో 500–750 మీటర్ల విస్తీర్ణంలో 8కంటే ఎక్కువ స్కూల్స్ ఉంటే ‘ఎ’ కేటగిరీగా, ఇంతే విస్తీర్ణంలో 5–7 వరకు స్కూళ్లుంటే ‘బి’, 3–4 ఉంటే ‘సి’ అని గ్రేడింగ్ ఇస్తూ కేటగిరీలుగా విభజించారు. ఈ సంఖ్య ఆధారంగా ఆయా సంస్థల పనివేళల్లో కనీసం 15 నిమిషాల వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని విద్యాసంస్థలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తున్నాయి. స్టాగరింగ్ అమలు చేస్తే ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల మధ్యలో వివిధ సమయాల్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నది ట్రాఫిక్ పోలీసుల అభిప్రాయం. ఇవీ పరిగణించాలి... విద్యాసంస్థలకు సంబంధించి ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల పని వేళలు మార్పు చేసే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో అనేక చిన్న కుటుంబాలున్నాయి. అందులోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారే అధికం. ప్రస్తుతమున్న వేళలకు అనుగుణంగా వీరు తమ విధులకు సంబంధించి సర్దుబాట్లు చేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో స్టాగరింగ్తో చిన్నారుల తల్లిదండ్రుల విధులపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాల్సిందే. స్టాగరింగ్ విధానాన్ని సినిమా హాళ్లు, ప్రైవేట్ కార్యాలయాలకు సైతం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పీక్ అవర్స్ వేళల్లో మార్పులొచ్చి ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 3,522.. శివార్లలో 2,623 సూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 15లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరి రవాణా కోసం సిటీలోనే 9వేల బస్సులు, మరో 30వేల ఆటోలు తిరుగతున్నాయి. వ్యక్తిగత వాహనాలపై పిల్లల్ని తరలించే వారు దీనికి అదనం. -
తొమ్మిదింటికే ‘ప్రైవేట్ హారన్’!
సిటీని ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటకముందే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిత్యం ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ వాహనాల వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనదారులు నరకం చవిచూడాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులపై ప్రైవేట్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిబంధనలకు పాతరేసి సిటీ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. రాత్రి 9 దాటకుండానే రోడ్ల మీదకు వస్తున్న బస్సులు, లారీలు రవాణా చట్టాలను, రహదారి భద్రతను యధేచ్ఛగా తుంగలో తొక్కేస్తూ స్వైరవిహారం చేస్తున్నాయి. రాత్రి 8గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాలు కబంధహస్తాల్లో చిక్కుకొంటుంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే అతి పెద్ద కారిడార్లో ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ రద్దీకి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాత్రి వేళల్లో ఈ వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితమం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్, పెద్ద అంబర్పేట్ల వద్ద బస్సులు, ట్రక్కులు, లారీలు, తదితర రవాణా వాహనాల కోసం టర్మినల్స్ ఏర్పాటు చేసి అక్క డి నుంచే నడాపాలని ఇటీవల రవాణాశాఖ సమీ క్షా సమావేశంలనూ ఆ శాఖ మంత్రి స్పష్టం చేశా రు. ఇందుకోసం ట్రాక్ ఆపరేటర్స్ అసోసియేషన్ కు గతంలో కేటాయించిన భూములను వినియోగించాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. దీంతో రాత్రి వేళ ల్లో, తెల్లవారు జామున రహదారులన్నీ ప్రైవేట్ బస్సులు, లారీలకు అడ్డాగా మారుతున్నాయి. చీమ కూడా కదలడం కష్టమే.... కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ రోడ్లు సాయంత్రం 5 గంటల నుంచే రద్దీగా ఉంటాయి. ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం రాకపోకలు సాగించే వాళ్లతో æరోడ్లు జనసముద్రాన్ని తలపిస్తాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులతో ప్రధాన రహదారులు నిండిపోతాయి. అలాంటి రోడ్లపై ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. కాలనీల నుంచి ఒకటెనుక ఒకటిగా ప్రైవేట్ బస్సులు బయలుదేరుతాయి. క్రమంగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ బస్సులే కనిపిస్తాయి. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగిపోయిన వాహనాలకు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతాయి. దీంతో లక్షలాది మంది రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఒక్క కూకట్పల్లి ప్రజలే కాదు. అటు మియాపూర్ నుంచి కూకట్పల్లి, ఎస్సార్నగర్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, లకిడాకాఫూల్, హిమాయత్నగర్, కాచిగూడ, ఆబిడ్స్, కోఠీ, చాదర్ఘాట్, మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ వరకు అడుగడుగునా ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రధానమైన బస్టాపులు, బస్బేలలో ప్రయివేట్ బస్సులను నిలిపివేస్తున్నారు.లకిడికాఫూల్లోని టెలిఫోన్ భవన్, కాచిగూడ, అమీర్పేట్ బస్టాపులు రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సుల అడ్డాలుగా మారుతున్నాయి. ఈ బస్సులను నియంత్రించడంలో పోలీసులు,ఆర్టీఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిబంధనలు బేఖాతర్... మోటారు వాహన నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ వాహనాలు సిటీలోకి ప్రవేశించాలి. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోదు. ట్రాఫిక్ సిగ్నల్స్ను దాటి మరీ దూసుకొస్తాయి. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఖైరతాబాద్ వంటి అతి పెద్ద కూడళ్లలో రెడ్సిగ్నల్ వెలుగుతున్నప్పటికీ దూసుకొనిపోయే ప్రైవేట్ బస్సులు ప్రతి రోజు కనిపిస్తాయి. ఒకవైపు లకిడికాఫూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజ్భవన్ వైపు వెళ్తూనే ఉంటాయి. కానీ అదేమీ పంజగుట్ట నుంచి లకిడికాఫూల్ వైపు వెళ్లే బస్సులు మాత్రం రెడ్ సిగ్నల్ను లెక్కచేయకుండా పరుగులు తీస్తూనే ఉంటాయి. రాత్రయిందంటే చాలు అపరిమితమైన వేగంతో ఏ వైపు నుంచి దూసుకొస్తాయో తెలియదు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు రాత్రి సుమారు 550 బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. అలాగే మరో 500 బస్సులు ఉదయం పూట నగరానికి చేరుకుంటాయి. శని,ఆది వారాలు వంటి వీకెండ్స్లో వీటి రాకపోకలు మరింత అధికంగా ఉంటాయి. నగరంలోకి వచ్చే వాహనాలు కానీ తిరిగి వెళ్లేవి కానీ ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. ప్రైవేట్ బస్సులకు తోడు హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు మరో 50 వేల లారీలు కూడా ఇదే తరహా ఉల్లంఘనలతో ట్రాఫిక్ టెర్రర్ను సృష్టిస్తున్నాయి. పర్మిట్ల ఉల్లంఘన ... ప్రయాణికులను ఎక్కించుకోవలసిన అనేక బస్సులు సరుకు రవాణా అవతారమెత్తాయి. కేవలం ప్రయాణికుల రవాణా కోసమే ఇచ్చిన పర్మిట్లను ఉల్లంఘించి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వాణిజ్య,వ్యాపార వస్తువులను రవాణా చేస్తున్నాయి. అక్రమంగా తిరుగుతున్న ఇలాంటి బస్సులు వల్ల రహదారి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఒక్కొక్క బస్సుపైన 4 నుంచి 5 టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్బోర్డు, బహదూర్పురా, లకిడికాఫూల్, తదితర ప్రాంతాల్లో రవాణా అధికారులు నిర్వహించే తనిఖీల్లో ఇలాంటి ఓవర్లోడ్పై కేసులు నమోదువుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు,నెల్లూరు,కడప,అనంతపురం,తదితర ప్రాంతాలకు ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను వ్యాపారులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. లారీల్లో మాత్రమే తీసుకెళ్లాల్సిన అనేక వస్తువులు టూరిస్టు బస్సుల్లో రవాణా అవుతున్నాయి.ఒక్క ప్రైవేట్ బస్సులకే కాకుండా అన్ని రకాల రవాణా వాహనాలకు నగర శివార్లలోనే హాల్టింగ్ కల్పించి అక్కడికి ప్రయాణికులను తరలించేందుకు సిటీ బస్సులను నడిపితే తప్ప పరిష్కారం లభించదు. -
ట్రాఫిక్ కమాండ్ & కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ సాంకేతికమయం అవుతోంది. టెక్నాలజీ సహాయంతో నేరాలను నిరోధించడానికి, కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప పోలీసింగ్ అమలు చేయాలని నిర్ణయించామని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాలు, పోలీసు కమిషనరేట్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లను ఆయన బుధవారం ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ ‘బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 12లో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్గా ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్లను అనుసంధానించి సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని చెప్పారు. ‘హైదరాబాద్ కమిషనరేట్లో ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఏర్పాటు చేశాం. తొలుత ఇక్కడ అమలులోకి తీసుకువచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తాం. లోపాలు బయటపడితే వాటిని సరిచేసి ఐసీసీసీ అందుబాటులోకి వచ్చేనాటికి పక్కాగా రూపొందిస్తాం’అని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేయడానికి టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లోని పోలీసులకు శిక్షణ ఇచ్చే బాధ్యతల్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్కు అప్పగిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని శాంతిభద్రతలకు నిలయంగా మార్చి పెట్టుబడులకు కేంద్రాన్ని చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఈ అంశంలో 1.66 లక్షల కెమెరాలను ఏర్పాటు చేయించిన హైదరాబాద్ కమిషనరేటే మిగిలిన వాటికి ఆదర్శం’అని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్చార్జి పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావుతోపాటు మూడు కమిషనరేట్ల అధికారులు పాల్గొన్నారు. -
మెట్రో రాకతో సగం తీరిన ట్రాఫిక్ కష్టాలు
-
మెట్రో స్టేషన్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు
-
ఎగరాలని ఉంది!
‘‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది...’’ అంటూ ‘వేదం’ సినిమాలో అనుష్క హుషారుగా ఆడిపాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా ఎగిరిపోవాలని ఉందంటున్నారు. అయితే, ఆ సినిమాలో సీన్కీ శ్రుతీహాసన్ ఎగిరిపోవాలనుకోడానికి సంబంధం లేదు. సీన్ కంప్లీట్ డిఫరెంట్. రీసెంట్గా శ్రుతీహాసన్ ట్రాఫిక్ సమస్యల వల్ల బాగా ఇబ్బందిపడుతున్నట్లున్నారు. ఆదివారం కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయారట. దాంతో సహనం కోల్పోయారు. ‘‘ఈ ట్రాఫిక్ వల్ల బోలెడంత టైమ్ వేస్ట్ అవుతోంది. రెక్కలు ఉంటే బాగుండేది. ఎంచక్కా ఎగరొచ్చు’’ అంటూ ట్విట్టర్లో తన అసహనం వ్యక్తం చేశారు. ఆ సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతం శ్రుతి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తండ్రి కమల్హాసన్ దర్శకత్వం వహిస్తూ, టైటిల్ రోల్ చేస్తోన్న ‘శభాష్ నాయుడు’లో ఆయనకు కూతురిగా నటిస్తున్నారు. కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నారట. త్వరలో ఓ మంచి కథ సెలక్ట్ చేసుకుని, ఆ చిత్రవివరాలను ప్రకటించాలనుకుంటున్నారట. -
పట్నం చెరువైంది!
► భారీ వర్షంతో చిగురుటాకులా వణికిన నగరం ► ఉపరితల ద్రోణి, క్యుములోనింబస్తో కుండపోత ► బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు బీభత్సం ► ఉప్పొంగిన నాలాలు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ► ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు ► చెరువులను తలపించిన ప్రధాన రహదారులు.. ► నాలుగైదు గంటలపాటు స్తంభించిన వాహన రాకపోకలు ► పలుచోట్ల విరిగిపడిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు ► వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ► రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ భారీ వర్షం ► మరో రెండు మూడు రోజులు విస్తారంగా వానలు ► మూడు రోజుల్లో పలకరించనున్న రుతుపవనాలు సాక్షి, హైదరాబాద్ భారీ వర్షంతో రాజధాని హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన కుండపోతతో పట్నం చెరువైంది. నగరంలో చాలా చోట్ల నాలాలు ఉప్పొంగి పొర్లాయి.. భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధాన రహదారులపై వరద నీరు చేరి చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాదాపు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షం, రహదారులపై నీరు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు వంద జంక్షన్ల పరిధిలో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ రద్దీ కనిపించింది. పలు చోట్ల కుండపోత హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబర్పేటలో 9.5 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. మొత్తంగా గ్రేటర్వ్యాప్తంగా సగటున 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని.. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసినట్లు తెలిపింది. వచ్చే 24 గంటల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని... లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో.. భారీ వర్షంతో లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, ఉస్మాన్గంజ్, కిషన్గంజ్ ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్కు ఇబ్బంది ఎదురైంది. కిషన్గంజ్ నాలా నిండిపోయి నీరు రోడ్లపై ప్రవహించింది. అఫ్జల్సాగర్ బస్తీలో ఇళ్లలోకి నీరు చేరింది. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అంజయ్యనగర్, హస్మత్పేట, మల్లికార్జుననగర్, హరిజనబస్తీ, కోయబస్తీ తదితర ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. పాతబస్తీలోని ఆమన్నగర్–బి, మురాద్ మహల్, నషేమాన్నగర్, సిద్ధిఖీనగర్ ప్రాంతాలతోపాటు మెహదీపట్నం నదీమ్ కాలనీ, టోలిచౌకి, నానల్నగర్, గోల్కొండ డివిజన్ ప్రాంతాల్లో, సీతాఫల్మండి డివిజన్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పంజాగుట్ట మోడల్ హౌజ్ ప్రాంతమంతా నీటమునిగింది. నడుములోతు వరద నీరు నిలిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, చింతల్ బస్తీ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. తార్నాక ప్రాంతంలో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, లింగంపల్లి, హఫీజ్పేట్, మియాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాలలో ప్రధాన రోడ్లపైకి వర్షపునీరు వచ్చి చేరడంతో మధ్యాహ్నం వరకు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వరద నీటి ప్రవాహానికి నాచారం ప్రధాన రోడ్డు మార్గంలో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వనస్థలిపురం సుష్మ సాయినగర్లో ఓ ఇంటి ప్రహరీగోడ కూలి పడడంతో భవాని (37) అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. మరోవైపు నీట మునిగిన బస్తీలు, కాలనీల్లో వరద నీటిని తొలగించే విషయంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమైందంటూ ఆయా బస్తీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులు తమను పరామర్శించలేదని వాపోయారు. పలు జిల్లాల్లోనూ వాన బీభత్సం.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ గురువారం వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్లలో 10 సెంటీమీటర్ల మేర వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామన్నపేట, మిర్యాలగూడ, ఖమ్మం జిల్లా వెంకటాపురం, బూర్గంపాడు, టేకులపల్లి, మణుగూరు, కూసుమంచి, భద్రాచలం, కొత్తగూడెం, బయ్యారం, పినపాక, నర్మెట్ట, హుజూరాబాద్, మేడ్చల్, డోర్నకల్, తాండూరు, వికారాబాద్, బెజ్జెంకి, అచ్చంపేట, గంగాధర, నాగార్జునసాగర్, దేవరకొండ, ధర్మసాగర్, నారాయణ్ఖేడ్, జగిత్యాల, నిర్మల్, నర్సంపేట, చెన్నరావుపేట, శాయంపేట, రామగుండం, హసన్పర్తి తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో యాదాద్రి జిల్లాలోని భూదాన్పోచంపల్లి మండలంలో మూసీ ఉప్పొంగింది. జూలూరు–రుద్రల్లి, పెద్దరావులపల్లి–భట్టుగూడెం గ్రామాల మధ్య గల వంతెనలపై నుంచి వరద పొంగిపొర్లడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పలు వీధులు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లపైకప్పులు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పెర్కిట్లో ఓ ఇల్లు కూలిపోయింది. ఇక రంగారెడ్డి జిల్లాలో గురువారం 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మూడు రోజుల్లో రుతుపవనాలు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఐదు, ఆరు తేదీలకల్లా రుతుపవనాలు రావాల్సి ఉన్నప్పటికీ... వాతావరణంలో మార్పుల వల్ల కాస్త ఆలస్యమైందని తెలిపింది. బుధవారమే రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించటంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. గురువారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షపాతం (సెంటీమీటర్లలో) ప్రాంతం వర్షపాతం (సెంటీమీటర్లలో) సైదాబాద్ 9.8 మారేడ్పల్లి 9.6 అంబర్పేట్ 9.5 ఖైరతాబాద్ 9.5 బండ్లగూడ 9.2 శ్రీనగర్కాలనీ 9.1 బేగంపేట 8.8 సికింద్రాబాద్ 8.8 తిరుమలగిరి 8.6 నాంపల్లి 8.4 నారాయణగూడ 7.6 ఆసిఫ్నగర్ 7.2 గోల్కొండ 6.8 ––––––––––––––––– సగటున 7.6 తదితర ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. పాతబస్తీలోని ఆమన్నగర్–బి, మురాద్ మహల్, నషేమాన్నగర్, సిద్ధిఖీనగర్ ప్రాంతాలతోపాటు మెహదీపట్నం నదీమ్ కాలనీ, టోలిచౌకి, నానల్నగర్, గోల్కొండ డివిజన్ ప్రాంతాల్లో, సీతాఫల్మండి డివిజన్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పంజగుట్ట మోడల్ హౌజ్ ప్రాంతమంతా నీటమునిగింది. నడుములోతు వరద నీరు నిలిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, చింతల్ బస్తీ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. తార్నాక ప్రాంతంలో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, లింగంపల్లి, హఫీజ్పేట్, మియాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాలలో ప్రధాన రోడ్లపైకి వర్షపునీరు వచ్చి చేరడంతో మధ్యాహ్నం వరకు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వరద నీటి ప్రవా హానికి నాచారం ప్రధాన రోడ్డు మార్గంలో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వనస్థలిపురం సుష్మ సాయినగర్లో ఓ ఇంటి ప్రహరీగోడ కూలి పడటంతో భవాని (37) అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. మరోవైపు నీట మునిగిన బస్తీలు, కాలనీల్లో వరద నీటిని తొలగించే విషయంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమైందంటూ ఆయా బస్తీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులు తమను పరామర్శించలేదని వాపోయారు. మరో మూడు రోజులు వానలు రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. -
మొయినాబాద్లో ‘ట్రాఫిక్ జాం’జాటం
మొయినాబాద్(చేవెళ్ల): అసలే సోమవారం... దానికి తోడు అర్ధంతరంగా నిలిచిన రోడ్డు పనులు.. వెరసి మొయినాబాద్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మండల కేంద్రంలో సుమారు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొయినాబాద్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం సంత ఉంటుంది. దీనికి తోడు మండల కేంద్రంలో రోడ్డు మరమ్మతు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో డివైడర్కు ఒకవైపు ఉన్న రోడ్డుపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సోమవారం సంత సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు రావడంతోపాటు సాయంత్రం ఐదు గంటల సమయంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద హైదరాబాద్–బీజాపూర్ రోడ్డుకు పెద్ద మంగళారం, సురంగల్ రోడ్లు కలుస్తాయి. నాలుగు వైపుల నుంచి వచ్చిన వాహనాలు ఒకేసారి చౌరస్తాలో నిలవడంతో అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడ వాహనాలు అక్కేడే ఆగిపోయి పూర్తిగా ట్రాఫిక్ జాం అయ్యింది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై రెండు వైపులా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జాం కావడంతో వాహనాదరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయో.. ఎప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అమరావతికి అనువైన ప్రాజెక్టులు ఇవే..
సీఆర్డీఏ అధికారులకు జపాన్ బృందం సలహాలు సాక్షి, విజయవాడ : రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు ఉపయోగపడే పలు ప్రాజెక్టుల గురించి సీఆర్డీఏ అధికారులకు జపాన్ బృందం వివరించారు. జపాన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2015 అక్టోబర్ 22న జరిగిన ఒప్పందంలో భాగంగా రాజధాని ప్రాంతంలో ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశంపై పరిశీలించింది. దీనికి సంబంధించిన నివేదికను జపాన్ బృందం తయారు చేసి శనివారం సీఆర్డీఏ అధికారులకు అందజేశారు. సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జపాన్ బృందం ఆయా ప్రాజెక్టులపై సీఆర్డీఏ, అమరావతి డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), పోలీసుశాఖ అధికారులకు వివరించారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ రామమోహనరావు, డీసీపీ రాణా, ఇతర సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వుండే ప్రాజెక్టుల గురించి జాపాన్ బృందం చెప్పిన వివరాలు.. డేటా సెంటర్. క్రౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ రాష్ట్రమంతంటికీ తక్కువ ఇంధన ఖర్చుతో అత్యుత్తమంగా ఇంటర్ నెట్ సేవలు అందించే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాడ్యూలర్ డేటా సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేయాలని సూచిం చారు. క్రౌడ్ కంప్యూటింగ్తో పాటు తక్కువ వ్యవధిలో పౌరులకు ఉపయోగపడే దరఖాస్తులకు పరిశీలించేందుకు ఈ మాడ్యులర్ డేటా సెంటర్ను ఉపయోగించవచ్చన్నారు. వాతావరణ రాడార్ సిస్టమ్స్ ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే తెలుసుకుని, కాపాడేందుకు ఉపయోగపడే వాతావరణ రాడార్ సిస్టమ్ను అమరావతిలో ఏర్పాటు చేయాలని జపాన్ బృందం సూచించింది. ఈ రాడార్ సిస్టమ్ రాజ« దాని ప్రాంతంలోని కాల్వలు, నది, మురికి కాల్వలు, రవా ణా రంగాలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుంది. తద్వారా ప్రాణ, భారీగా ఆస్తినష్టం జరగకుండా చూసుకోవచ్చు. మంచినీటి సదుపాయం అతి తక్కువ ఖర్చుతో అతి పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికి ఇచ్చేం దుకు వీలుగా ఒక ప్రాజెక్టును జపాన్ బృందం సీ ఆర్డీఏ అధికారు లకు వివరించింది. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన నగరాల్లో తాగునీటి కోసం ఏ విధానాలను అవలంబిస్తున్నారో వివరించి రాజధాని లో మంచినీటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. పర్యావరణ ఇబ్బందులు రాకుండా ఇంధనం కూడా ఉత్పత్తి చేసే సీవియేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వివరాలను బృందం వివరించింది. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ జామ్లు లేకుండా సిగ్నల్స్ ఏర్పాటు గురించి వివరించారు. ఇదే సమయంలో డీసీపీ రాణా విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు గురించి వారికి వివరించారు. నగరంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరణకు ఒక ప్రణాళిక ఇస్తామని జపాన్ బృందం హామీ ఇచ్చింది. భూకంపాలు తట్టుకునేలా నిర్మాణాలు ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు రామవరప్పాడు : భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమవుతున్నాయని ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు తెలిపారు. ఎనికేపాడులోని ఎస్సార్కే ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ‘నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు– మారుతున్న సాంకేతికత’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు శనివారం ముగిసింది. రాజు మాట్లాడారు. -
‘నిషేధం’ నినాదమే!
భద్రత, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించినా, వాటిని నిషేధిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంగా ప్రకటించినా.. ఆ ఆదేశాలు ఎవరికీ పట్టట్లేదు. స్వయంగా ప్రభుత్వ శాఖల అధికారులే వాటిని అమలు చేయట్లేదు. నిజామాబాద్ నగరంలో ఎక్కడ పడితే ఫ్లెక్సీలు కనిపిస్తుండడమే అందుకు నిదర్శనం. తాము ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని, మళ్లీ కొత్తవి పెడుతున్నారని మున్సిపల్ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నప్పుడు అవి మళ్లీ ఎలా వెలుస్తున్నాయో వారికే తెలియాలి! మొత్తానికి ఫ్లెక్సీల నిషేధం.. నినాదంగా మారడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
'2018 ఆగస్ట్ నాటికి మెట్రో పూర్తి చేయాలి'
హైదరాబాద్ : 2018 ఆగస్ట్ నాటికి మొత్తం మెట్రో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 2017 నవంబర్ నాటికి మియాపూర్ - ఎల్బీనగర్ పనులు పూర్తి చేయాలన్నారు. మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ సమీక్షాసమావేశానికి మెట్రో, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. -
లోవ.. భక్తజన తోవ
అడుగడుగునా స్తంభించిన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు తుని రూరల్ : తలుపులమ్మ అమ్మవారిని దర్శించు కునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో రద్దీ నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు తగినంతగా లేకపోవడంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం కష్టంగా మారడంతో, భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసతి గదుల లభించని భక్తులు మండుటెండ కారణంగా ఆలయ ప్రాంగణంలోని చెట్ల కింద, కొండ దిగువన ప్రైవేట్ పాకలు, తోటల్లో భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మకర్తలతో కలసి దేవస్థానం చైర్మ¯ŒS కరపా అప్పారావు వివిధ విభాగాలను పరిశీలించారు. లోవ దేవస్థానానికి భక్తుల ద్వారా రూ.2.99 లక్షల ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఇలాఉండగా బెల్టు షాపులను ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కొండ దిగువన బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. దీంతో మందుబాబులు రోడ్లపై చిందులు వేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
జిల్లాకు 689 మంది పోలీసులు
పోలీస్స్టేషన్లు, ట్రాఫిక్ సమస్యలు, సిరిసిల్ల త్వరలోనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు నేరాలను నియంత్రిస్తాం ట్రాఫిక్ సమస్యలు అధిగమిస్తాం ఐజీ వై.నాగిరెడ్డి వెల్లడి సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్, క్రైం, ఎస్బీ, డీసీఆర్బీ, సీసీఎస్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐజీ వై.నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్, ఎస్పీ కార్యాలయం, పోలీస్ పరేడ్ గ్రౌండ్ను పరిశీలించారు. జిల్లాకు 689 మంది పోలీసులను కేటాయించామని, గతంలో 256 మంది ఉండేవారన్నారు. మిగతా వాటి మాదిరిగానే ఇక్కడ కూడా ఆర్మీ రిజర్వుడు పోలీసు ఫోర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్మిక క్షేత్రంలో నేరాల సంఖ్య అధికమని, దీనిని నియంత్రిస్తామని ఐజీ చెప్పారు. సిరిసిల్లతోపాటు వేములవాడల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నా త్వరలోనే నియంత్రణలోకి తెస్తామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు సామాజిక కార్యక్రమాల్లోనూ పోలీసులు భాగస్వాములు అవుతారని ఆయన చెప్పారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానం, తాడూరులోని బీఈడీ కళాశాలను ఐజీ సందర్శించారు. ఆయ న వెంట ఎస్పీ విశ్వజిత్ కంపాటి, డీఎస్పీ పి.సుధాకర్, సీఐలు జి.విజయ్కుమార్, సీహెచ్ శ్రీధర్, పోలీసులు సిబ్బంది ఉన్నారు. -
‘రాజన్న’పైనే ఆశలన్నీ..!
మూలవాగుపై ఫోర్లేన్ వంతెన బ్రిడ్జి నిర్మాణానికి రూ.28కోట్లు భక్తులకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు జిల్లా ఏర్పాటుతో పనులు వేగవంతంపై ఆశలు వేములవాడ : నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఎములాడ రాజన్న క్షేత్రానికి చేరుకునేందుకు మూలవాగుపై ఇప్పటి వరకు ఒకే ఒక్క వంతెన ఉంది. అదికూడా ఇరుకవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తెతున్నా రుు. భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం రూ.28 కోట్ల వ్యయంతో ఫోర్లేన్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ గత డిసెంబర్ 19న వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు వేగవంతంగా జరిగేందుకు కొత్త డిజైన్ రూపొందించినట్లు ఎమ్మెల్యే రమేశ్బాబుతోపాటు మంత్రి తెలిపారు. ఫోర్లేన్తోపాటు నందికమాన్- తిప్పాపూర్, వేములవాడ పట్టణ మొదటి, రెండో బైపాస్రోడ్లు సైతం ఫోర్లైన్లుగా మార్చతున్నట్లు ప్రకటించా రు. బైపాస్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నా, వంతెన పనులు ముందుకు సాగడం లేదు. తరచూ ట్రాఫిక్ సమస్యలు.. శంకుస్థాపన చేసి దాదాపు పదినెలలైనా పనులు ముం దుకు సాగడం లేదు. ఫలితంగా ప్రత్యేక పర్వదినాలు, సెలవుల్లో వచ్చే వేలాది మంది భక్తులు వంతెనపై ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నారు. తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆందోళనకారులు ధర్నా, రాస్తారోకోలు చేసిన సమయయూల్లో వాహనాలు స్తంభించి భక్తులకు చుక్కలు కనిపిస్తున్నారుు. అయితే రెండో బైపాస్రోడ్డు పనులు కొనసాగుతుండగా, బ్రిడ్జి పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాతోనైనా అధికారులు స్పందించి పనులు త్వరితగతిన చేపట్టాలని పలువురు కోరుతున్నారు. రద్దీని ఇలా తగ్గించవచ్చు.. మూలవాగులోని బతుకమ్మతెప్ప వద్ద తాత్కాలిక వంతెన నిర్మించాలి. ట్రాఫిక్ను అటు మళ్లిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వంతెన ప్రాంతం, అమరవీరుల స్తూపం వద్ద ధర్నాలు, రాస్తారోకోలను నిషేధించాలి. వంతెనపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసు సిబ్బంది సంఖ్య పెంచాలి. వాహనాల రద్దీ సమయూల్లో నందికమాన్ నుంచి ట్రాఫిక్ను మళ్లించి వన్వే ఏర్పాటు చేయూలి. టెండరు ప్రక్రియ పూర్తి మూలవాగుపై ఫోర్లేన్ వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తరుుంది. బ్రిడ్జి డిజైన్లో మార్పు కోసం ఢిల్లీకి పంపించాం. అక్కడి నుంచి రాగానే పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.14 కోట్లు వెచ్చించి వంతెన నిర్మిస్తాం. మిగతా సొమ్ము భూసేకరణకు వెచ్చిస్తాం. ప్రత్యేక జిల్లా ఏర్పడినందున పనులు ఈనెలలోనే ప్రారంభించే అవకాశం ఉంది. -రాజమౌళి, ఏఈ, ఆర్అండ్బీ -
నిఘా నీడలో నగరం
యాకుత్పురా: బక్రీద్, నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అదనపు కమిషనర్ శ్రీనివాస్ రావు, జాయింట్ కమిషనర్లు ప్రమోద్ కుమార్, శివ ప్రసాద్, డీసీపీ, అదనపు డీసీపీలతో కలిసి పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చార్మినార్లో విలేకరులతో మాట్లాడుతూ..బక్రీద్, గణేష్ నిమజ్జనోత్సవాలను దృష్టిలో ఉంచుకుని 9 జిల్లాలకు చెందిన పోలీసు బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నామన్నారు. కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. బక్రీద్ సందర్భంగా నగరంలోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సోషల్ మీడియాల్లో వచ్చే తప్పుడు సమాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బక్రీద్ సందర్భంగా వ్యర్ధాలను పొగు చేసేందుకు మైనార్టీ, జీహెచ్ఎంసీ శాఖల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లను పంపిణీ చేశామన్నారు. ప్రార్థనలు నిర్వహించే ఈద్గాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 15వ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 వేల విగ్రహాలు నిమజ్జనానికి రానున్నట్లు తెలిపారు. 15న అర్ధరాత్రి 12 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. తాము సూచించిన విధంగా ఉదయం 6 గంటలకు నిమజ్జనాన్ని ప్రారంభించి 12 గంటల్లోపు పూర్తి చేయాలన్నారు. 12 గంటల తర్వాత వచ్చే విగ్రహాలను ట్యాంక్బండ్పైకి కాకుండా నెక్లెస్ రోడ్డు వైపు పంపిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మహబూబ్నగర్ క్రైం: పట్టణ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి లారీ కిందపడి దుర్మరణం చెందాడు. జిల్లాకేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో మహారాష్ట్రకు చెందిన ఓ లారీ ముందు టైర్ల కిందపడి వ్యక్తి అత్యంత దారుణంగా మృత్యువాతపడ్డాడు. సంఘటన స్థలాన్ని టూటౌన్ సీఐ డీవీపీ రాజు, ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ మురళి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లాసుపత్రికి తరలించారు. ఎస్ఐ మురళి కథనం ప్రకారం.. గండీడ్ మండలం కొండపూర్కి చెందిన భీసన్న అలియాస్ వెంకటయ్య(50)సోమవారం ఉదయం 11గంటల సమయంలో అల్లీపూర్ నుంచి వస్తువులు కొనుగోలు చేయడానికి పట్టణంలో క్లాక్టవర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేవరకద్ర నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఎంహెచ్ 46ఏఎఫ్ 7996నంబర్ కలిగిన లారీ ముందు టైర్ల కింద ప్రమాదవశాత్తు పడటంతో అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. మృతుడు భీసన్న ఇటీవల మండలపరిధిలో అల్లీపూర్లో ప్లాట్ తీసుకుని అక్కడ కొత్త ఇల్లు నిర్మాణం చేయిస్తున్నాడు. దీనికోసం మూడు రోజుల కిందట అల్లీపూర్కి వచ్చాడు. కొత్త ఇంటికి సమాన్లు అవసరం ఉండటం వల్ల పట్టణానికి వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భారీ ట్రాఫిక్ జాం.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. లారీ కిందపడి మృతి చెందిన వ్యక్తిని చూడడానికి చాలామంది రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దాదాపు గంటపాటు శ్రమించి ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఎస్ఐలు, ఇతర సిబ్బంది ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
ట్రాఫిక్తో తంటాలు
రాందాస్ చౌరస్తా ట్రాఫిక్ కిరికిరి నిత్యకృత్యంగా మారిన సమస్య ఇబ్బందుల్లో వాహనదారులు అలంకారప్రాయంగా సిగ్నల్స్ వ్యవస్థ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఎమి పట్టని అధికారులు మెదక్ మున్సిపాలిటి: నాలుగు జిల్లాలకు సుభాగా వెలుగొందిన మెదక్ పాలకుల నిర్లక్ష్యంతో నేడు సమస్యలతో సతమతమవుతోంది. పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుండటంతోపాటు జనాభా పెరుగిపోతుంది. దీంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు ఇరుకుగా మారి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు సమస్యలను గాలికొదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కరిస్తామంటూ గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన అధికారులు వాటి నిర్వహణను మర్చిపోయారు. దీంతో పట్టణంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. పట్టణ నడిబొడ్డు గల రాందాస్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య ప్రజలను వేధిస్తోంది. మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారిలో నిత్యం వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణాన్ని ఆనుకొని ఉన్న పరిసర గ్రామాల నుంచి, పక్క మండలాల నుంచి విద్యార్థులు చదువుల కోసం, వ్యాపార నిమిత్తం ప్రజలు అధిక సంఖ్యలో మెదక్ పట్టణానికి వస్తుంటారు. దీంతో రాందాస్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలో సమస్య మరి ఎక్కువగా ఉంటుంది.గంటలతరబడి వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్నారు. ఇక్కడి చౌరస్తాలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసినప్పటికీ అది అలంకార ప్రాయంగానే ఉంది. ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడమే ప్రదాన కారణం చౌరస్తాలో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో సమస్య పెరిగిపోతోంది. సిబ్బంది ఉఏంటే కొంతవరకైనా సమస్యలను పరిష్కరించవచ్చు కాని ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అంతేగాక సిగ్నల్స్ లేకపోవడంతో కూడా సమస్య ఎక్కువవుతుంది.చౌరస్తా గుండా వాహనదారులు అడ్డదిడ్డంగా వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా చౌరస్తా విస్తీర్ణం చిన్నగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకల సమస్యలు తరచూ ప్రమాదాలు జరగాడానికి కారణంగా తయారవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో రాందాస్ చౌరస్తాలో నిర్మించిన దిమ్మెకు భారీ వాహనాలు ఢీకొట్టిన సంఘటనలు కోకొల్లలు. నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న సిగ్నల్స్ను ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.ట్రాఫిక్ సమస్య ఇంతగా వేధిస్తోన్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు.ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జమజ్య జటిలమవుతుందే కాని పరిష్కరం లభించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు , ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను వినియోగంలోకి తేవాలి లక్షకుపైగా జనాభా గల మెదక్ పట్టణ నడిబొడ్డున గల రాందాస్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. చౌరస్తా విస్తీర్ణం కూడా తక్కువగా ఉంది. దీనికి తోడు పరిసరాల్లో తోపుడు బండ్లను పెట్టడం వల్ల సమస్యగా ఉంటోంది. అదేకాకుండా భారీ వాహనాలతో కూడా సమస్య ఎక్కువవుతుంది.దీంతో ప్రమాదాలు .రగాడానికి కారణమవుతున్నాయి. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగంలోకి తీసుకురావాలి. ఫలితంగా కొంతమేర సమస్య తీరే అవకాశం ఉంది. - సయ్యద్ ఆరీఫ్ అలీ, పాన్షాప్ వ్యాపారి, మెదక్ రాందాస్ చౌరస్తాను వెడల్పు చేయాలి పట్టణంలో ప్రధాన కూడలి అయిన రాందాస్ చౌరస్తా విస్తీర్ణం మరీ చిన్నగా ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. జిల్లాకేంద్రం ఏర్పాటుతున్న తరుణంలో చౌరస్తా విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఎంతైన ఉంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగంలోకి తీసుకొచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఏర్పాటు చేయాలి. - శ్యామ్, స్థానికుడు -
ఫుట్పాత్లు ఆక్రమిస్తే అరెస్టే
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడానికి ఆక్రమణలు కూడా ప్రధాన కారణం. వ్యాపారులు ఫుట్పాత్ల్ని ఆక్రమించడంతో పాదచారులకు రహదారులే ఆధారమవుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటమే కాదు... కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిణామలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఫుట్పాత్లను ఆక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలా అలా ముందుకొస్తూ... ఈ ఆక్రమణదారుల వ్యవహారం నానాటికీ తలనొప్పిగా మారుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. ఓ దుకాణదారుడు తొలుత తన దుకాణం ముందు ఉన్న ఫుట్పాత్పై కన్నేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు దుకాణం తెరిచినప్పుడు అక్కడ సామాను పెట్టి, మూసేప్పుడు తిరిగి తీసేయడంతో ఆక్రమణ మొదలవుతోంది. కొన్నాళ్లకు ఆయా ఫుట్పాత్లపై నిర్మాణాలు చేపట్టి రహదారిని కూడా ఆక్రమిస్తున్నారు. ఇలా నానాటికీ కుంచించుకుపోతున్న ఫుట్పాత్లు, రహదారులు సామాన్యులకు అనేక ఇబ్బందులు కలిగించడంతో పాటు నరకం చూపిస్తున్నాయి. ఒకప్పుడు జరిమానా మాత్రమే... ఫుట్పాత్, రోడ్డు ఆక్రమణలపై ఒకప్పుడు కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉండేదికాదు. వీరిపై కేవలం సిటీ పోలీసు (సీపీ) యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాతో సరిపెట్టేవారు. దీంతో ఈ ఆక్రమణదారులపై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. ట్రాఫిక్ పోలీసులు వచ్చినప్పుడల్లా జరిమానాలు కట్టేస్తూ తమ పంథా కొనసాగించేవారు. ఫలితంగా సమస్య తీరకపోవడంతో పాటు ఆక్రమణదారుల సంఖ్య నానాటికీ పెరిగేది. ఏళ్లుగా కొనసాగుతున్న జరిమానా విధానంలోని లోపాలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. క్రిమినల్ కేసులతో కోర్టుకు... నగరంలో ఈ తరహా ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం ‘మొబైల్ ఈ–టికెట్’ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించి ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న ట్యాబ్్సలో పొందుపరిచారు. దీని ఆధారంగా ఆక్రమణదారులపై సాంకేతికంగా కేసులు నమోదు చేసే ఆస్కారం ఏర్పడింది. ఈ యాప్లో టిన్ నెంబర్, దుకాణం, యజమాని వివరాలతో పాటు ఆక్రమణ ఫొటో సైతం తీసుకునే ఆస్కారం ఉంది. ఇది జీపీఎస్ ఆధారితంగా పని చేయడంతో న్యాయస్థానంలో బలమైన సాక్ష్యంగా పనికి వస్తోంది. వీటి ఆధారంగా ఆక్రమణదారులను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. రెండుసార్లు అవకాశం ఇచ్చాకే: ‘సిటీలో ఫుట్పాత్లు, రహదారుల్ని ఆక్రమిస్తున్న దుకాణదారులకు రెండు అవకాశాలు ఇస్తున్నాం. తొలుత రెండుసార్లు కేవలం జరిమానా, కౌన్సెలింగ్తో సరిపెడుతున్నాం. మూడోసారి కూడా పునరావృతమైతే క్రిమినల్ కేసు నమోదు చేసి అభియోగపత్రాలతో సహా కోర్టుకు తరలిస్తున్నాం. ఇప్పటికే కొందరికి జైలు శిక్ష కూడా పడింది. ఈ వివరాల ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులకూ లేఖ రాసి వారి ట్రేడ్ లైసెన్సు రద్దుకు సిఫార్సు చేస్తున్నాం.’ – జితేందర్, నగర ట్రాఫిక్ చీఫ్ -
హైవేపై బారులు తీరిన వాహనాలు
విజయవాడ: విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హైవేపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోవడంతో కొత్తగా వస్తున్న వాహనాలకు స్థలం లేక రోడ్డుపైనే ఆపేయడంతో.. ట్రాఫీక్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. జగ్గయ్యపేట, నందిగామ టోల్గేట్ల వద్ద తెల్లవారుజాము నుంచే వాహానాల రద్దీ విపరీతంగా ఉంది. -
ట్రాఫిక్ ఇక్కట్లపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి ట్రాఫిక్ ఇక్కట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులు తొలగేలా రోడ్ల పరిస్థితిని తక్షణం మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్గా 100 కిలోమీటర్ల మేర మెరుగైన రోడ్లు, సిమెంట్ పరిశ్రమలతో కలిసి వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం, వెడల్పయిన రోడ్లు, మళ్లీ మళ్లీ తవ్వకుండా డక్ట్ల నిర్మాణం చేపడతామని కేసీఆర్ వెల్లడించారు. -
వాన.. హైరానా
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మల్కాజ్గిరిలో అత్యధికంగా 6.6 సెం.మీ. వర్షపాతం హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మల్కాజ్గిరిలో 6.6 సెం.మీ. రికార్డు వర్షపాతం నమోదైంది. సరూర్నగర్లో 6 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వరదనీరు పోటెత్తి ట్రాఫిక్ స్తంభించింది. పలు చోట్ల 2 నుంచి 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నాలాలు పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నరకంలో చిక్కుకొని వాహనదారులు,ప్రయాణీకులు విలవిల్లాడారు. రాత్రిపొద్దుపోయాక ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో జనజీవనం స్తంభించింది. ఆయా ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం ఇలా ఉంది. ప్రాంతం వర్షపాతం సెం.మీ.ల్లో మల్కాజ్గిరి 6.6 సరూర్నగర్ 6.0 కుత్బుల్లాపూర్ 5.1 జీడిమెట్ల 4.8 తిరుమలగిరి 4.8 కాప్రా 3.7 వెస్ట్మారేడ్పల్లి 3.1 శివరాంపల్లి 3.0 మల్కాపూర్ 2.5 బండ్లగూడ 2.3 సర్దార్ మహల్ 1.8 -
క్షణికావేశంలో..
(వెబ్ ప్రత్యేకం) టైమ్ కావొస్తుంది. ఇప్పటికే లేట్ అయింది. తొందరగా గమ్యం చేరుకోవాలనుకుంటే విపరీతమైన ట్రాఫిక్. అడ్డదిడ్డంగా వెళుతున్న వాహన శ్రేణుల సందుల్లోంచి తొందరగా వెళ్లాలన్న తాపత్రయం. హైదరాబాద్ నగరంలో పెరిగిన వాహనాలతో ట్రాఫిక్ సమస్య నానాటికి తీవ్రమవుతోంది. తొందరగా వెళ్లాలనుకునే వాళ్లకు నరకం చూపిస్తున్న రోడ్లు వాహన దారుడిని మరింత తొందరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంట్లో నుంచో ఆఫీసు నుంచో అర్జెంట్ పనిమీద రోడ్డెక్కిన ప్రతి వాహన దారుడిదీ ఇదే సమస్య. ఆఫీసుకు వెళ్లాలన్నా... ఆస్పత్రికి వెళ్లాలన్నా... కాలేజీకి వెళ్లాలన్నా... కిరాణా కొట్టుకెళ్లాలన్నా... అన్ని సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి. చెప్పలేని నరకం. ఆ పరిస్థితి చూసి తనలో తనకే చెప్పలేనంత కోపం. దానికి తోడు అడ్డదిడ్డంగా వెళుతున్న వాహన శ్రేణి వల్ల మరింత ఆవేశం. ఇరుకైన రోడ్లు. చెవులు చిల్లులు పడేంతగా హారన్ల జోరు. అడుగడుగునా సిగ్నల్. సిగ్నల్ పడిందంటే... అడ్డదిడ్డంగా తోసుకొచ్చే వాహనాలు. ఒక వాహనం ఇంకో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లడం. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నట్టు లేదా ఒకరిపై ఇంకొకరు తోసుకుంటున్నట్టు... ఎంతో బలవంతంగా కదులుతున్న ట్రాఫిక్. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అర్జెంట్ పనుంటే ఇంతే సంగతులు. నగరంలో ప్రతి వాహన దారుడిదీ ఇదే పరిస్థితి. దాంతో ఎక్కడాలేని చికాకు. ఆవేశం. అత్యవసర పనులమీద వెళ్లాలనుకునే వారిలో ఉండే కోపం ఇక చెప్పక్కరలేదు. హైదరాబాద్ ఒక్కటే కాదు. దేశంలోని మహానగరాల్లో ఎక్కడ చూసినా ఈ పరిస్థితే. ముందస్తు ప్లాన్ లేకుండా రోడ్డెక్కితే రోడ్లపై దుమ్ము దూళితో పాటు మిగతా వాహనాల అంతరాయాలతో చికూచింత మరింత పెరుగుతుంది. ఒక్కోసారి ఒకరినొకరు దూషించుకుంటూ వాహనదారు ఆవేశంతో ఊగిపోతున్న దృశ్యాలు ప్రతి రోడ్డులోనూ కనిపిస్తాయి. పరస్పరం బీపీలు పెంచుకుని కొట్టుకుని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన అనేక సందర్భాలు చూస్తుంటాం. ఆటో, కారు, టు వీలర్, బస్సు, లారీ... ఎవరైనా సరే. ఇలాంటి సందర్భాల్లోనే వాహన దారులకు ఓపిక, సహనం ఎంతో అవసరం. క్షణికావేశానికి వెళ్లడం వల్ల అనవసరమైన అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్న సందర్భాలు ఇటీవలి కాలంలో తరచూ సంభవిస్తున్నాయి. తాను వెళ్లాల్సిన రోడ్డు మూల మలుపులో మరో కారు అడ్డంగా నిలిపాడన్న కారణంగా ఇరు వాహనదారుల మధ్య గొడవ ఏ స్థాయికి వెళ్లిందో ఒక్కసారి ఈ కింద ఇచ్చిన వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్న సంఘటనలు కూడా ఒక్కోసారి వాహనాలు నడిపే వారి మధ్య కోపతాపాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయడానికి ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 లో జరిగిన ఒక సంఘటన ఇది. ప్రధాన మార్గం నుంచి ఒక వాహనదారుడు సందులాంటి మరో రోడ్డులోకి వెళుతున్న దశలో మూల మలుపు వద్ద అడ్డంగా ఆగిఉన్న వాహనం తీవ్ర ఆవేశాన్ని తెప్పించింది. అంతే... హారన్ కొట్టడం.. అప్పటికి అవతలి నుంచి స్పందన రాకపోయేసరికి ఇంకేం... నోటికి పనిచెప్పాడు. ఇతనేదో అన్నాడని, కారులో ఉన్న వ్యక్తి కిందకు దిగి ఒకరినొకరు దూషించుకోవడం మొదలైంది. అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. వారు వెళ్లాల్సిన గమ్యం గురించి మరిచిపోయారు. ఒకరినొకరు తిట్టుకోవడం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆవేశకావేశాలతో పరస్పరం ఊగిపోయారు. అంతే ఆవేశంతో ఒక వ్యక్తి పక్కనే ఉన్న పెద్ద బండరాయి ఎత్తి అవతలివాడిపై వేసేందుకు సిద్ధపడ్డాడు. అవతలివాడు తానేం తక్కువ తినలేదన్నట్టు వెంటనే తన కారులోంచి పెద్ద ఇనుప రాడ్ ను బయటకు తీశాడు. నీ అంతు చూస్తా... అంటూ పైపైకి వచ్చాడు. జనం మాత్రం ఎవరి పనిలో వారున్నట్టు ఏదో వింత సినిమా చూస్తున్నట్టు... సస్పెన్స్ కు ఎలా తెరపడుతుందా అని ఆతృతగా చూస్తున్నారు. ఒకరి చేతిలో ఐదారు కిలోల బరువున్న పెద్ద బండరాయి... మరొకరి చేతిలో ఇనుప రాడ్డు. ఆవేశంగా ఊగిపోయారు. రాడ్డు కింద పడేయ్... అంటుండగా, ఆ వ్యక్తి రాయిని కింద పడేసినప్పటికీ తన వద్ద కత్తి ఉందంటూ ఒరలోంచి కత్తిని బయటకు తీశాడు. ఇంతలో పక్కనే ధైర్యం చేసిన ఒక వ్యక్తి కాస్తా ముందుకొచ్చి జో హోగయా... హోగయా.. భయ్... చలో చలో... అంటూ చల్లార్చే ప్రయత్నం. అంతే.. దాంతో వాళ్లిద్దరు తీవ్రస్థాయి ఆవేశం నుంచి కొంచెం తగ్గి ఆయుధాలను కింద పడేసి కొద్దిసేపు మాటల యుద్దం కొనసాగించి ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. ఆ సందర్భంలో క్షణికావేశానికి లోనై ఉంటే... పరస్పరం దాడులకు దిగి ఉంటే ఏం జరిగేది. అర్జెంటుగా వెళ్లాల్సిన వ్యక్తులు అసలు పని మరిచిపోయి తమ ఆవేశం నెగ్గడానికి చేసిన ప్రయత్నంలో పెనుగులాటలో జరగరానిది ఏదైనా జరిగితే. నిజానికి ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వాహనదారులు.. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే... ఆ ఒక్క క్షణంలో కనుక ఏదైనా జరగరానిది జరిగి ఉంటే. ఆవేశంలో వాళ్లిద్దరి మధ్య ఉన్న ఆయుధాలు మామూలు ప్రమాదానికి కాదు... ఏకంగా ప్రాణాలమీదకు రావొచ్చు. అందుకే... ఈ మహానగరంలో ప్రయాణం విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాస్త మీకోసం ఇంట్లో ఎదురుచూసే వాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు కదలండి. -
పుష్కరాలపై త్రినేత్రం
సీసీ కెమెరాలతో నిఘా ► గుర్తించిన ఘాట్ల వద్ద ఏర్పాటుచేయనున్న పోలీసు అధికారులు ► అడుగడుగునా భారీ బందోబస్తు ► జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా భద్రత, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు ► ప్రణాళిక రూపొందించిన పోలీస్శాఖ కృష్ణానదీ అగ్రహారంవద్ద ఉన్న పుష్కర ఘాట్ మహబూబ్నగర్ క్రైం కృష్ణా పుష్కరాలపై మూడోనేత్రంతో నిఘా వేయనున్నారు. పూర్తిగా సీసీ కెమెరాలతో పహారా కాయాలని భావిస్తున్న పోలీస్ అధికారులు.. అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో కృష్ణానదీ తీర ప్రాంతాలు అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈసారి జిల్లాలో పుష్కర ఘాట్లకు దాదాపు మూడు కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 40నుంచి 45వేల మందికి ఒక సీసీ కెమెరాతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 32 ఘాట్లను గుర్తించిన అధికారులు బందోబస్తు పరంగా ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 32ఘాట్లలో 400సీసీ కెమెరాలు.. జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు మాసంలో జరగనున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు తగినంత పోలీస్ బలగాలతోపాటు గుర్తించిన 32 ఘాట్లలో రూ.2కోట్లతో 400సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీస్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇందుకు కావాల్సిన కెమెరాలు, పోలీస్ బలగాలు, భారీ గ్రేడ్స్ ఇతర వాటికి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పోలీస్శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లింది. 360 డిగ్రీల కోణంలో తిరిగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.70నుంచి 80వేలను ఒక్కో కెమెరాకు ఖర్చు చేసి అత్యంత టెక్నాలజీతో కూడిన నిఘా పెట్టాలని భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగినా.. సకాలంలో స్పందించడానికి ఈ కెమెరాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తం 400 కెమెరాలకు కలిపి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి.. అక్కడనుంచి ఏ ప్రదేశంలో ఎలాంటి సంఘటన చోటుచేసుకున్నా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం చేరవేయనున్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో దాదాపు 185 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారిపై అక్కడక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో భారీ గ్రేడ్స్ ఉంచి ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై కూడా పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా బీచుపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందీ రాకుండా పోలీసులు ముందే నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు నెల రోజులముందే నుంచి పరిసర ప్రాంతాలను వారి అధీనంలోకి తీసుకోనున్నారు. ఘాట్ల సమీపంలో క్యూలైన్ల సరికొత్త భారీ గ్రేడ్స్ను వాడనున్నట్లు తెలుస్తోంది. 11వేల మందితో బందోబస్తు.. పుష్కరాల సమయంలో జిల్లాలో బందోబస్తు నిర్వహించడానికి పోలీస్శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానికంగా ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఘాట్లు ఏర్పాటు చేయడంతో బందోబస్తు భారీ స్థాయిలో ఉండాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల పోలీస్ సిబ్బంది ఉండడంతో అదనంగా మరో 8వేల మందిని ఇతర జిల్లాలనుంచి రప్పిస్తున్నారు. దీంట్లో సివిల్ పోలీసులతో పాటు పారా మిలిటరీ, ట్రాఫిక్ ఇతర విభాగాలు వారు ఉండనున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
‘మెట్రో’ టై!
ప్రమాదాలకు తావిస్తున్న మెట్రో రైలు పనులు గాయాలపాలవుతున్న ప్రజలు పలుచోట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు సిటీబ్యూరో: నగరంలో ప్రధాన రహదారుల మధ్యన జరుగుతున్న మెట్రో పనులు పలు చోట్ల ప్రమాదకరంగా మారాయి. ఆదివారం రవీంద్రభారతి చౌరస్తాలో జరిగిన ప్రమాదం పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన విషయం విదితమే. ప్రధానంగా నాంపల్లి హజ్హౌజ్, ఆలిండియా రేడియో, రవీంద్రభారతి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్ వంటి రద్దీప్రాంతాల్లో మెట్రో పనులు ఆయా మార్గాల్లో వెళుతున్న వారికి చుక్కలు చూపిస్తున్నాయి. మెట్రో పనుల్లో భాగంగా ప్రీకాస్ట్ యార్డుల్లో తయారు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్లను రాత్రివేళల్లో భారీ ట్రక్కుల సాయంతో పనులు జరుగుతున్న చోటకు తరలిస్తున్నారు. వాటిని భారీ క్రేన్లు, లాంఛింగ్ గర్డర్ల సహాయంతో పైకి ఎత్తి మెట్రో పిల్లర్ల మధ్యన అమరుస్తున్నారు. నాగోలు-రహేజా ఐటీపార్క్, జేబీఎస్-ఫలక్నుమా, ఎల్బీనగర్, మియాపూర్ మొత్తం మూడు మార్గాల్లో 72 కి.మీ మార్గంలో మెట్రో పనులు గత నాలుగేళ్లుగా జరుగుతున్నప్పటికీ ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో దుర్ఘటనలు జరగలేదు. కానీ ఇటీవల ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తవడంతో అత్యంత రద్దీగా ఉండే ప్రధానప్రాంతాల్లో మెట్రో పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, వాహనాలను దారిమళ్లించేందుకు సరైన సైన్బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, ట్రాఫిక్ను దారిమళ్లించడానికి అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతోనే ఆయా మార్గాల్లో వెళుతున్న వాహనాలు, ప్రయాణికులు, చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్నిసార్లు పనులు ముగిసిన అనంతరం భారీ క్రేన్లను, ఇతర వాహనాలను, నిర్మాణ సామాగ్రి, వ్యర్థాలను నిర్మాణ సంస్థ రహదారులపైనే వదిలిపెడుతుండడంతో ఆయా రూట్లలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. పిల్లర్ల నిర్మాణం కోసం కొన్ని చోట్ల భారీ గోతులు తవ్వినప్పటికీ వాటికి సరైన బారికేడింగ్ చేయడంలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈవిషయంలో నిర్మాణ సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. కాగా రవీంద్రభారతి చౌరస్తా వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ను ‘సాక్షి’ వివరణ కోరగా..సంఘటనకు బాధ్యులెవరో గుర్తిస్తున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా ఆయా విభాగాల అనుమతులు, పలు జాగ్రత్తలు తీసుకున్న మీదటే నగరంలోని ముఖ్య కూడళ్లలో పనులు చేపడుతున్నామని చెప్పారు. -
రద్దీకి సరి-బేసి పరిష్కారం!
ప్రజా రవాణా కుదించుకు పోవడం అనేది రోడ్లమీద కూడా రద్దీకి దారితీసింది. దానిని సమర్థవంతంగా విస్తరించకుండా సరి, బేసి సంఖ్యలతో వ్యక్తిగత వాహనాలను పరిమితం చేయడం అనేది ఫలితాలనివ్వదు. ఢిల్లీలో కార్లకు సరి-బేసి సంఖ్యల పథకం అమలు చేయడం అనుకుంటున్నంత సులభం కాదు. దేశ రాజధానిలో పెరిగిపోయిన వాయు కాలుష్య నివారణ కోసం సరి సంఖ్య గల కార్లను ఒకరోజు, బేసి సంఖ్య గల కార్లను మరొక రోజు రోడ్లపైకి అనుమతించే ఈ పథకం అమలుకు ముందు జరుగుతున్న చర్చ కూడా అయోమయాన్నే కాకుండా అసంబద్ధతల్ని కూడా ప్రదర్శించింది. ఈ పథకం ‘ఒక నమూనాగా మాత్రమే ఉంటుంద’ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం వెనక్కు తిరిగి చూడలేనంత తారస్థాయికి చేరుకుందని భావిస్తున్న ఔత్సాహికులు కొందరు మాత్రం ఈ పథకం విజయవంతం కావాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇది అమలు కాకపోతే మరెన్నటికీ కాదని వీరు చెబుతున్నారు. ఇప్పటికే ఈ పథకంలోని మినహాయింపుల గురించి చర్చించుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలను కూడా ఈ కొత్త శాసనం పరిధిలోకి తీసుకురావాలా అనేది కూడా చర్చనీయాంశమైంది. ఇక వీఐపీల విషయానికి వస్తే, కారు సంఖ్యలతో పనిలేకుండా రహదార్లపై హక్కు కలిగి ఉంటారు. వీఐపీలకు మినహాయింపును ఇస్తే అది ఆమ్ ఆద్మీ భావనకే ఎదురు తన్నవచ్చు. అయితే శరవేగంతో సాగుతున్న నగరీకరణను, రవాణారంగంలో పేలవమైన పెట్టుబడులను చూసి నట్లయితే.. దేశంలోని ప్రతి నగరం, పట్టణం కూడా త్వరలో నూ, కాస్త ఆలస్యంగానో ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే తగినన్ని రైల్వే కోచ్లను నిర్మించడం మనకు కష్టమవుతోంది కానీ కారు తయారీ రంగం మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థకే కీలకమైన అంశంగా ఉంటోంది. దేశ ప్రాధాన్యతలను ఇది చూపుతుంది. ఇక అసందర్భాలను ఇక్కడ చూద్దాం... ఒకటి. కారు యజమానులు ఇప్పుడు రెండో కారు కొం టారు. అప్పుడు ఒక్కోరోజు ఒక్కో కారును వీరు ఉప యోగించగలుగుతారు. ఇది పలు అంశాలను విస్మరిస్తోంది. ప్రతి కొనుగోలుదారూ తన అవసరానికి తగిన నంబర్ను పొందుతాడనేందుకు లేదు. అంటే బేసి సంఖ్య గల కారు యజమాని సరి సంఖ్య గల కారును కొంటారని చెప్పడానికి వీల్లేదు. ఈ సంఖ్యలు లాటరీ లాంటివే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వాహనాల సంఖ్యలను వేలం వేస్తున్నారు. దీంతో వాహనదారుడు కొనే రెండో కారు చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. చాలా కార్లను తాకట్టు ప్రాతి పదికన కొంటుంటారు. పైగా చాలామంది కారు యజ మానులు పైకి చెప్పుకుంటున్నంత సంపన్నులేం కారు. మధ్యతరగతి ప్రజలు అధిక వ్యయంతో కూడిన ఫ్లాట్లతో పాటు, నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఈఎంఐల కింద చెల్లిస్తుంటారు. దీనివల్ల కారును కొనడం, దానికి సరి లేదా బేసి సంఖ్యను కొనడం కష్టసాధ్యమౌతుంది. ఇక పార్కింగ్ కష్టాలు వాణిజ్య జిల్లాల్లోనే కాదు.. ఏ పరిమాణంలో ఉన్న ఏ నగరానికైనా తప్పటం లేదు. పైగా, కార్లు కలిగినవారు చోటు లేక వీధుల్లోనే పార్క్ చేస్తుంటారు కనుక నివాస ప్రాంతాల్లో కూడా సంక్షోభం ఉంటోంది. వీధుల్లో మెర్సిడెజ్ లేదా స్కోడా ఉండటం చాలా తరచుగా చూస్తుంటాం. ముంబైలోని కొలాబా, కప్పే పెరేడ్, మలబార్ హిల్స్ వంటి విలాసవంతమైన ప్రాంతాల్లో కూడా వాటిని మీరు చూస్తుంటారు. ఢిల్లీ కూడా దీనికి భిన్నంగా ఉండదు. కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే ముంబైలో కొత్త భవనాలకు తప్పనిసరిగా పార్కింగ్ ప్లేస్ ఉండాలని ఆంక్షలు విధించారు కానీ రియల్టర్లు మాత్రం పార్కింగ్ స్థలాలకు తడిపి మోపెడంత వసూలు చేస్తున్నారు. ఇక కనెక్టివిటీకి సంబంధించిన సమస్యకూడా ఉంది. చాలామంది ఇప్పటికీ రిక్షాలో ప్రయాణించి భారీ ఎత్తున సాగే రవాణా వ్యవస్థ వద్దకు చేరుకుంటున్నారు. ఢిల్లీలో అయితే మనుషులు తొక్కుతున్న రిక్షాల్లో కూడా ప్రయాణి స్తున్నారు. తర్వాత వారు చేరవలసిన గమ్య స్థానానికి రద్దీగా ఉన్న బస్సుల్లో లేదా ఆటో రిక్షాలో ప్రయాణిస్తున్నారు. నగరంలోపలి ప్రయాణంలో ఉన్న తీవ్ర ఇక్కట్ల కారణంగా కారు కొనుగోలుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఢిల్లీలో రోడ్డు, ట్రాఫిక్ సిగ్నల్స్కి వెచ్చిస్తున్న మదుపులు కేవలం పది శాతం ప్రయాణికులకే ఉపయోగ పడుతున్నాయి. ఇక బస్సుల నిర్వహణ ఘోరంగా ఉం టుంది. ముంబైలో బెస్ట్ పేరిట సాగుతున్న ప్రజా రవా ణా వ్యవస్థ ఇప్పటికే మందగించిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ కార్లు రోడ్ స్థలాన్ని మొత్తంగా ఆక్రమించి ప్రజా రవాణాను పక్కకు నెట్టేస్తున్నాయి. దీంతో ముంబై రోడ్లమీద బస్సుల కదలిక నెమ్మదిం చిపోయింది. దీంతో మరిన్ని కార్లు రోడ్లమీదికి వస్తున్నాయి. ప్రజా రవాణా ఇరుగ్గా, రద్దీగా అయిపోవడం అనేది రోడ్లమీద కూడా రద్దీకి దారి తీసింది. ప్రజలు కారు ప్రయాణానికి తొలి ప్రాధాన్యమివ్వడానికి కారణ మవుతున్న పేలవమైన రవాణా యంత్రాంగం, తగినంత స్థాయిలో లేని మాస్ రవాణా కలిసి సంక్షోభాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఈ పరిస్థితి యుద్ధం లాంటి పరిస్థితిగా అభివ ర్ణిస్తున్నారు. కానీ వాయు కాలుష్యానికి పరిష్కారాన్ని మాత్రం ఈ వర్ణన చూపడం లేదు. వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు, వాటి ఉపయోగానికి ప్రోత్సాహకాలను అందిస్తున్న నగరాలను ఏలుతున్న రాష్ట్ర లేదా పారా ప్రభుత్వ సంస్థలే ప్రజా రవాణా దిగజారుడుతనానికి కారణాలని దేశంలోని ఏ విధాన నిర్ణేతా అంగీకరించడం లేదు. చండీగఢ్, థానే వంటి కొన్ని నగరాల్లో రాజకీయ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను ఖూనీ చేస్తున్నారు. ప్రజా రవాణాను సమర్థవంతంగా విస్తరించకుండా సరి, బేసి సంఖ్యలతో వ్యక్తిగత వాహనాలను పరిమితం చేయడం అనేది ఫలితాలనివ్వదు. ఈ పద్ధతిని అమల్లోకి తీసుకురావడానికి చెబుతున్న కారణమే దాన్ని ముందుకు తీసుకుపోకుండా అడ్డగిస్తుంది. మహేష్ విజాపుర్కార్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ఉత్తుంగ తరంగమై..
♦ గోదారి తీరాన్ని ముంచెత్తుతున్న భక్తజనం ♦ రోజు రోజుకీ అదే జోరు ♦ జిల్లాలో 45 లక్షలకు పైగా భక్తుల పుణ్యస్నానాలు ♦ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తగ్గని రద్దీ ♦ కొంతమేర గట్టెక్కిన ట్రాఫిక్ ఇక్కట్లు పశ్చిమ కనుమల్లో చిరుపాయగా జన్మమెత్తి.. ఉప నదులను అక్కున చేర్చుకుని.. క్రమక్రమంగా విస్తరించి.. కొండకోనలు దాటి..ప్రకృతి సౌందర్య వేదిక.. పాపికొండలను అధిగమించి.. మైదాన ప్రాంతంలో అడుగు పెట్టి.. చారిత్రక రాణ్మహేంద్రిని చేరి.. మహాజలధిగా మారి.. ఆపై పాయలుగా విడివడి.. సాగరంతో సంగమిస్తున్న నదీమతల్లి గోదావరికి.. పుష్కర పర్వవేళ.. అశేష జనవాహిని ప్రణమిల్లుతోంది. ఆ పుణ్యవాహినిలో స్నానమాడి పాప ప్రక్షాళన చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లాలోని వివిధ స్నానఘట్టాల్లో భక్తులు ఉత్తుంగతరంగమై ఎగసిపడ్డారు. రాజమండ్రి : భక్తజన ప్రభంజనం గోదారి తీరాన్ని చుట్టేస్తోంది. అవాంతరాలెన్ని ఎదురైనా అధిగమించి మరీ వస్తున్న యాత్రికులతో గోదారి స్నానఘట్టాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచే కాకుండా స్థానికంగా కూడా భక్తులు ఘాట్ల వద్దకు తరలివచ్చారు. వరుసగా వచ్చిన సెలవులతో గడచిన రెండు రోజులుగా గోదావరి తీరాలు పుష్కర స్నానాలకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వారి సంఖ్య మరింత పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు, వ్యాపార సంస్థలకు కూడా సెలవులు కావడంతో ఆదివారం పుష్కర ఘాట్లవద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. హైదరాబాద్ నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉంది. అంచనాలకు మించి యాత్రికులు రావడంతో ఘాట్లు కిటకిటలాడాయి. రాత్రి ఏడు గంటల సమయానికి 41.07 లక్షల మంది రాజమండ్రి, జిల్లాలోని గ్రామీణ ఘాట్లలో పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు తెలిపారు. రాత్రి తొమ్మిది గంటల సమాయానికి ఈ సంఖ్య సుమారు 43 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. యాత్రికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా 24 గంటలపాటు స్నానాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అర్ధరాత్రి 12 గంటల సమయానికి 45 లక్షలకు పైబడి స్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వెల్లువెత్తారు శుక్రవారం మొదలైన భక్తుల రాక.. శనివారం ఉదయం నుంచి పోటెత్తింది. ఆదివారం మధ్యాహ్నం వరకూ యాత్రికుల రాక కొనసాగుతూనే ఉంది. అయితే సాయంత్రం నుంచి భక్తుల రాక కాస్త తగ్గింది. జిల్లాలోని మొత్తం ఘాట్లను పరిశీలిస్తే తెల్లవారుజామున 3 నుంచి 9 గంటల వరకూ 14.84 లక్షల మంది స్నానాలు చేయగా, 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ 18.49 లక్షల మంది స్నానాలు చేశారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటల సమయానికి 7.74 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం నుంచి భక్తుల సందడి తగ్గడంతో స్నానాల సంఖ్య తగ్గినట్టు అధికారులు తెలిపారు. ‘సి’ ఘాట్లలోను పోటెత్తారు గ్రామీణ ఘాట్లలో సైతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. కోటిపల్లి ఘాట్లో 2.05 లక్షలమంది, కుండలేశ్వరంలో 60 వేలు, సోపంల్లిలో 1.60 లక్షలు, అంతర్వేదిలో 70 వేలమంది స్నానాలు చేయగా, అప్పనపల్లిలో రికార్డు స్థాయిలో 2.01 లక్షల మంది స్నానాలు చేశారు. ఇవే కాదు ‘సి’ గ్రేడ్ ఘాట్లలో సైతం భక్తుల ఎక్కువగా పుణ్యస్నానాలు చేశారు. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, కపిలేశ్వరపురం ఘాట్లలో 40 వేల చొప్పున, తాతపూడిలో 25 వేలు; ఆలమూరు మండలం జొన్నాడలో 50 వేలు; అల్లవరం మండలం బోడసకుర్రు, బెండమూర్లంక, గోపాయిలంకల్లో లక్ష మంది; ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో 46 వేలు; పల్లవారిపాలెంలో 38 వేల మంది చొప్పున స్నానాలు చేయడం గమనార్హం. అవే కష్టాలు శనివారంతో పోలిస్తే ఆదివారం కొంతవరకూ ట్రాఫిక్ మెరుగుపడింది. అయితే టోల్గేట్ల వద్ద మాత్రం గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. అంచనాలకు మించి భక్తులు రావడంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. సమయానుకూలంగా లేని బస్సులు, అందుబాటులో లేని రైళ్లతో జనం ఇక్కట్ల పాలయ్యారు. పుష్కర నగర్లకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడంతో కొన్నిచోట్ల భక్తుల తాకిడి ఎక్కువగాను, మరికొన్నిచోట్ల ఖాళీగాను దర్శనమిచ్చాయి. మరుగుదొడ్ల వద్ద మాత్రం పరిస్థితి మెరుగుపడలేదు. స్వచ్ఛంద సంస్థలు సహితం మంచినీరు, మజ్జిగవంటివి అందుబాటులోకి తేవడంతో భక్తుల దాహార్తి తీరింది. వాతావరణం చల్లబడడం కూడా కాస్త ఉపశమనాన్నిచ్చింది. -
పుష్కర భక్తులకు ట్రాఫిక్కష్టాలు
-
పుష్కర పాట్లు
♦ నాలుగు గంటల పాటు ప్రయాణికుల నరకయాతన ♦ జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు బారులు తీరిన వాహనాలు ♦ ఉప్పల్ నుంచి ఘట్కేసర్కు కూడా ఇదే పరిస్థితి ♦ ఎల్బీనగర్ రింగ్ రోడ్డులోనూ అవే తిప్పలు సాక్షి, సిటీబ్యూరో : గోదావరి పుష్కరాల కోసం నగరవాసులు భారీసంఖ్యలో క్యూకట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో కరీంనగర్లోని ధర్మపురి, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కాళేశ్వరం, ఖమ్మంలోని భద్రచలం ప్రాంతాల్లో గోదావరి పుష్కరాల కోసం రోడ్డెక్కారు. శనివారం ఉదయమే పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లెక్కడంతో నగరశివార్లలో నాలుగు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తార్నాక, సంగీత్ చౌరస్తా మీదుగా సికింద్రాబాద్లోని జేబీఎస్కు వచ్చేందుకు దాదాపు గంటన్నరకు పైగా పట్టింది. జేబీఎస్, తిరుమలగిరి, బొల్లారం, శామీర్పేట్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. జేబీఎస్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ మార్గాల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. మేడ్చల్ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎంపీ మల్లారెడ్డి కూడా ట్రాఫిక్లో ఇరుక్కొని మందుకెళ్లలేక మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. వరంగల్ వెళ్లేందుకు ఉప్పల్ చేరుకున్న నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బొడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్కేసర్ వరకు వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి కనిపించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజమండ్రి, భద్రాచలం వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్ రింగురోడ్డు వాహనాల రద్దీతో కనిపించింది. ఎల్బీనగర్ రింగురోడ్డులో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ట్రాఫిక్, సివిల్ పోలీసులు రంగంలోకి దిగినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. వరంగల్, బాసర, నిజామాబాద్, అదిలాబాద్ వెళ్లే ప్రయాణికుల వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అల్కాపురి, నాగోలు, ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏపీ టూరిజంకు యమ గిరాకీ - 21వ తేదీ వరకు రిజర్వేషన్లు క్లోజ్ సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ పర్యాటక శాఖ పుష్కరాల సందర్భంగా ప్రకటించిన ట్యూర్ ప్యాకేజీకు విశేషమైన స్పందన లభించినంది. దీంతో ఈ నెల 21 వరకు టికెట్లు రిజర్వయ్యాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. నగరం నుంచి టూరిజం శాఖ ఆధ్వర్యంలో రోజు 17 బస్సులు నడుపుతున్నాయి. ట్యాంక్బండ్ సమీపంలోని శాఖ కార్యాలయం వద్ద నగరవాసులు క్యూ కట్టారు. సంస్థ ఆధ్వర్యలో నడుస్తున్న అన్ని బస్సుల టికెట్లు అమ్ముడుపోయాయని, డిమాండ్ మేరకు మరో మూడు బస్సులు అదనంగా నడుపుతున్నామని, సోమవారం తర్వాత మరిన్ని బస్సులు నడి పేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ అధికారులు పేర్కొన్నారు. బస్సులన్నీ ఫుల్ అఫ్జల్గంజ్: వరుసగా సెలవులు రావడంతో మహానగరం నుంచి పుష్కరాలకు నగరవాసులు శనివారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఎంజీబీఎస్ (ఇమ్లిబన్), గౌలిగూడ బస్స్టేషన్ల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల్లో భక్తులు పుష్కరాలకు బయలుదేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాపుష్కరాలు ఉండటంతో నగరంలో ఉండే రెండు రాష్ట్రాల ప్రజలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లారు. వారాంతం కావడం, రెండు రోజలు సెలవులు రావడంతో శుక్రవారం రాత్రి నుంచే ఎంజీబీఎస్లో పుష్కర ప్రయాణికుల రద్దీ పెరిగింది. రాజమండ్రి, నర్సాపురం, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, శ్రీకాకుళం, ధర్మపురి మార్గాల్లో వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా... ఆర్టీసీ సిటీ రీజియన్ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీంతోగౌలిగూడ సిటీ బస్టాండ్కు బాసరకు వెళ్లే భక్తులు అధిక సంఖ్యతో తరలివచ్చారు. దీంతో పాటు నగరంలోని ఎల్బీనగర్, ఉప్పల్, సంతోష్నగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి బాసరకు ప్రత్యేక బస్సులు నడుపుతుండంతో అక్కడి నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు బాసరకు వెళ్లారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల
న్యూఢిల్లీ: ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తర భారతం కుదేలైంది. శుక్ర, శనివారాల్లో పలు రాష్ట్రాల్లో కుండపోత వానల వల్ల జనజీవనం స్తంభించింది. దేశ రాజధాని ఢి ల్లీ వీధుల్లో నీరు చేరడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నగరంలో 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. -
విస్తరణపై ఆచితూచి అడుగు
అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ నిర్ణయం సీఎం పరిశీలన తర్వాతే పనులు తాత్కాలికంగా వాయిదా సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి రహదారుల విస్తరణ చేపట్టాలని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ప్రెస్ కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్లు తదితర పనులు చేయాలని తలపెట్టారు. తొలుత మూడు మార్గాల్లోని 60 కి.మీ.ల పరిధిలో చేపట్టాలనుకున్న ఈ పనులు ప్రస్తుతానికి ఆగిపోయాయి. నాగార్జున సర్కిల్ నుంచి వివిధ మార్గాల్లో మియాపూర్ వరకు వీటిని ఏర్పాటు చేసేందుకు కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ టెండర్లు పిలవాలనుకున్నారు. ఆమేరకు నోటిఫికేషన్ కూడా సిద్ధం చేసినప్పటికీ చివరి క్షణంలో విరమించుకున్నారు. హడావుడిగా కాకుండా అన్నీ కూలంకషంగా పరిశీలించాకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వివిధ మార్గాల్లో ఆయా పనులకు సంబంధించిన సర్వే వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నివేదిక అందాక సీఎం సూచన మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని జంక్షన్లు, మార్గాల్లో అభివృద్ధి పనుల అవసరాన్ని సీఎం ఇప్పటికే ప్రస్తావించినప్పటికీ, సర్వే వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాకే పనులు చేయాలని భావిస్తున్నారు. పరిశీలనలోని మార్గాలు ఇవే.. ప్రస్తుతం అధికారుల పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల్లో మేజర్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం (బషీర్బాగ్) నుంచి అఫ్జల్గంజ్, ఆబిడ్స్ జీపీఓ నుంచి బ్యాంక్ స్ట్రీట్ మీదుగా చాదర్ఘాట్, ఉప్పల్ నుంచి సంగీత్ , హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఒవైసీ ఆస్పత్రి, చాదర్ఘాట్-పుత్లిబౌలి-ఎంజే మార్కెట్, ఏక్ మినార్ మసీదు, ముస్లింజంగ్ బ్రిడ్జి నుంచి బహదూర్పురా మీదుగా ఆరాంఘర్, హబ్సిగూడ నుంచి నాచారం, మల్లాపూర్ మీదుగా ఈసీఐఎల్ చౌరస్తా, బయో డైవర్సిటీ జంక్షన్ నుంచి హైటెక్సిటీ ఫ్లై ఓవర్ మార్గం గుండా కూకట్పల్లి జేఎన్టీయూ, ఆరాంఘర్ నుంచి ఒవైసీ హాస్పిటల్ మార్గాలున్నాయి. రెండు దశల్లో జంక్షన్ల అభివృద్ధి.. జంక్షన్ల అభివృద్ధి పనులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నారు. తొలిదశకు పరిశీలిస్తున్న జంక్షన్లలో ఉప్పల్, ఎల్బీనగర్, పుత్లిబౌలి, చాదర్ఘాట్, బహదూర్పురా, కోఠి, ఆర్టీసీ క్రాస్రోడ్స్, సికింద్రాబాద్, నారాయణగూడ, కాచిగూడ, వైఎంసీ జంక్షన్లు ఉన్నాయి. రెండో దశ కు పరిశీలిస్తున్న వాటిల్లో కర్బలా మైదాన్, కాటేదాన్ రోడ్డు, బేగంపేట పబ్లిక్స్కూల్, ఉషా ముళ్లపూడి ఆస్పత్రి, సంతోష్నగర్, ద్వారకా హోటల్ (లక్డీకాపూల్), నేరేడ్మెట్, బాచుపల్లి చౌరస్తాలు ఉన్నాయి. -
తప్పక చూడండి!
నగరంలో అభివృద్ధి పనులపై షార్ట్ఫిల్మ్ టీవీల ద్వారా ప్రచారం జీహెచ్ఎంసీ సన్నాహాలు సిటీబ్యూరో: నగరంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. తాము చేస్తున్న పనులకు తగిన ప్రచారం అవసరమని భావిస్తోంది. అందులో భాగంగా ప్రతిపాదిత రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక షార్ట్ఫిల్మ్ చిత్రీకరించి ప్రదర్శించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులు, వివిధ మార్గాల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కళ్లకు కట్టేలా షార్ట్ ఫిల్మ్ నిర్మించి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నగరంలోని వివిధ మార్గాల్లో ఎక్స్ప్రెస్వేలు, స్కైవేలు, గ్రేడ్సెపరేటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వివాదం లేని, ట్రాఫిక్కు ఇబ్బందులు కలగని మార్గాల్లో ఈ పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. తొలిదశలో దాదాపు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల మేర పనులకు అధికారులు ప్రతిపాదనలతో సన్నద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు ప్రాథమికంగా నమూనాలను కూడా తయారు చేయించనున్నారు. జంక్షన్లు.. 1. కోఠి జంక్షన్ 2.ఆర్టీసీ క్రాస్రోడ్స్ 3.సికింద్రాబాద్ జంక్షన్ 4. ఉప్పల్ జంక్షన్ 5. ఎల్బీనగర్ జంక్షన్ 6.చాదర్ఘాట్ జంక్షన్ 7.పుత్లిబౌలి జంక్షన్ 8.బహదూర్పురా జంక్షన్. ప్రస్తుతానికి ఎంపిక చేసిన రహదారుల వివరాలు.. ఉప్పల్ జంక్షన్ - సంగీత్ జంక్షన్ బయో డైవర్సిటీ పార్కు జంక్షన్(గచ్చిబౌలి)- జేఎన్టీయూ జంక్షన్, కూకట్పల్లి ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం - అఫ్జల్గంజ్ అబిడ్స్ జంక్షన్ - చాదర్ఘాట్ జంక్షన్(వయా కోఠి) హబ్సిగూడ -ఐడీఏ మల్లాపూర్ (వయా నాచారం) చాదర్ఘాట్-పుత్లిబౌలి-జాంబాగ్-మొజాంజాహీ మార్కెట్-ఏక్మినార్ జంక్షన్ (నాంపల్లి) పురానాపూల్ - ఆరాంఘర్(వయా జూపార్కు) -
క్రిస్మస్ నాడు 87 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
భివండీ, న్యూస్లైన్: క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని నగరంలో 87 డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు భద్రతలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక డ్రైవ్లో పోలీసులు బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం ఉదయం ఒంటి గంట వరకు నిర్వహించిన డ్రైవ్లో 1,345 మంది హెల్మెట్ ధరించని వారిపై, అదేవిధంగా అనధికారికంగా పార్క్ చేసిన 5,500 వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, సంవత్సరాది రోజు ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు నాకాబంది పాయింట్లను మరింతగా పెంచనున్నట్లు డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ప్రతాప్ దిగావ్కర్ తెలిపారు. మెరిన్డ్రైవ్, వర్లీ సీఫేస్, బాంద్రాలో ఉన్న కార్టర్ రోడ్డు వద్ద కూడా వాహనాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు. -
నవీముంబైలో ‘ట్రాఫికర్’..!
సాక్షి, ముంబై : నవీముంబైలో ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయి. నగరంలో వాహనాలు నడిపేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కేసులు కూడా అదేవిధంగా నమోదవుతున్నాయి. వాటిని అరికట్టడంతో ట్రాఫిక్ పోలీసులు చాలా ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం ద్విచక్రవాహనాలు నడపడం నగరంలో మామూలైపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈ పిల్లలు వాహనాలను తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడంతో అతివేగంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ట్రాఫిక్పోలీస్ విభాగం ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో దాదాపు 50 మంది పాఠశాల విద్యార్థులు ద్విచక్రవాహనాలను నడుపుతూ పట్టుబడ్డారు. ఖోపర్ఖైర్నే, వాషి, బేలాపూర్, రబాలే, సీవుడ్, తుర్బేలలో ఎక్కువగా విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని తేలింది. వీరిలో ఎక్కువ మంది 15 నుంచి 17 ఏళ్ల వయస్సు లోపు వారే. ఈ సందర్భంగా డీసీపీ (ట్రాఫిక్) అరవింద్ సాల్వే మాట్లాడుతూ.. నగర రోడ్లపై ట్రాఫిక్ స్థితిగతులు, ట్రాఫిక్ నిబంధనల విషయమై విద్యార్థులకు అంతగా అవగాహన లేకపోయినా వాహనాలను నడపడం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా లెసైన్సులు లేకుండా వాహనాన్ని నడపడం ఇతరుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే అన్నారు. కాగా, ఆయా ట్రాఫిక్ యూనిట్ల వద్దకు తమ తల్లిదండ్రులను తీసుకు రావాల్సిందిగా పట్టుబడిన విద్యార్థులను హెచ్చరించామన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటేనే తిరిగి వాహనాలను ఇస్తామని వారి తల్లిదండ్రులకు సూచించామన్నారు. తమ డ్రైవ్లను పాఠశాలల వద్ద కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉండగా, నవీ ముంబైలో రోజురోజుకు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనలకు సంబంధించి 2,06,299 కేసులు నమోదయినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో 2,00,333 కేసులు నమోదయ్యాయని చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఆధారంగానే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిని పట్టుకున్నట్లు తెలిపారు. -
స్వర్ణముఖి ఒడ్డున రూ.10కోట్లతో రోడ్డు
రూ.4కోట్లతో భరధ్వాజతీర్థం రోడ్డు చెన్నై తరహాలో టాయిలెట్స్ తిరుమలలోలాగా నిత్య అన్నదానం ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు శ్రీకాళహస్తి : స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సన్నిధివీధి, జయరామరావు పార్కు, దుర్గమ్మకొండ, నీటిపారుదలశాఖ కార్యాలయం మీదుగా నాయుడుపేట రోడ్డును కలుపుతూ రూ.10 కోట్లతో నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జ ల గోపాలకృష్ణారెడ్డి సూచనల మేరకు ఆలయ ఇన్చార్జి ఈవో శ్రీనివాసరావు గురువారం పలు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఆలయాధికారులతో తన చాంబర్లో సమావేశమయ్యూరు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమిం చడంతో పాటు భక్తుల సౌకర్యం కోసం స్వర్ణముఖినది అంచున రూ.10 కోట్లతో రోడ్డు ఏర్పాటు చేయడానికి నిర్ణరుుం చారు. భరధ్వాజ తీర్థం మీదుగా 60అడుగుల రోడ్డున రూ.4కోట్లతో కైలాసగిరికొండ అవతలివైపు ఉన్న ఆలయభూముల్లోకి రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతంలో సత్రాలు, వసతిగృహాలు నిర్మించడానికి ముందుగా రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రూ.30 లక్షలతో చెన్నై తరహాలో పన్నెండు టాయిలెట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తిరుమల తరహాలో నిత్యం అన్నదానం,ఉచిత ప్రసాదాలు అందజేయలనే ఆలోచనతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్వామివారి సన్నిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి రాగిరేకును అమర్చడానికి తీర్మానం చేశారు. ఆలయానికి చెందిన రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆలయ ఏఈవో శ్రీనివాసులురెడ్డి, ఈఈ రామిరెడ్డి, ఆలయ స్తపతి లక్ష్మీ నరసింహస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడు బాబు గురుకుల్ పాల్గొన్నారు. -
సమతుల్యత సాధిస్తాం
న్యూఢిల్లీ: ఈ-రిక్షాల వివాదంపై తన వాదనను సమర్థించుకుంటూ... పేదవాడి ఉపాధి, భద్రతా పరిమితులమధ్య ప్రభుత్వం సమతుల్యతను సాధించాల్సిన అవసరముందని కేంద్ర రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమానవీయంగా అనిపించే లాగుడు రిక్షాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ-రిక్షాలను నగర రహదారులపై తిరిగేందుకు అనుమతించామన్నారు. చట్టం గట్టిగా ఉండాల్సిందేనని, అయితే సామాన్య పౌరుడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అందువల్లనే ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధిస్తామన్నారు. నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31వ తేదీన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషేధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. నియంత్రణకు సంబంధించి ముసాయిదాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగర రహదారులపై ఈ-రిక్షాలను అనుమతించాలా లేక మోటారు వాహనాల చట్టం కింద కచ్చితంగా వాటిపై ఆంక్షలు విధించాలా అనే విషయమై ఈ నెల తొమ్మిదో తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అభిప్రాయాల్ని సేకరిస్తాం ఈ వివాదంపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ తెలిపారు. ఆ తరువాత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తాజా బిల్లును సభలో ప్రవేశపెడతామన్నారు. -
తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు
-
గజ్వేల్కు మహర్దశ!
నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం, ఇందిరాపార్క్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు గత కొంత కాలంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి సంత జరిగే బుధవారం నాడు ప్రధాన రహదారిపై అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొని ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ మార్గం గుండానే భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి, 18న మెతుకుసీమ గర్జన పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలోనూ ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ స్వయంగా అనుభవించారు. ఆయన వాహన శ్రేణిని బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకు సీమగర్జన సభలో ట్రాఫిక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్అండ్బీ అధికారులకు పనులను పురమాయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్, సిద్దిపేట ఈఈ బాల్నర్సయ్య, గజ్వేల్ శాఖ డిప్యూటీ ఈఈ బాల్నర్సయ్య తదితరులు సోమవారం పట్టణంలో సర్వే చేపట్టారు. అధికారుల కథనం ప్రకారం పట్టణంలోని 133/33కేవీ సబ్స్టేషన్నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్కళశాల, ముట్రాజ్పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా తిరిగి సబ్స్టేషన్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రింగ్రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు స్థల పరిశీలన జరిపారు. ఈ క్రమంలో నగరపంచాయతీ పరిధిలోని క్యాసారంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ముఖ్యనేతలు డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్ టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆకుల దేవేందర్ తదితరులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తానికి గజ్వేల్లో రింగ్రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ బైక్తో ఎంచక్కా గాల్లో ఎగరొచ్చు..!
-
నేటి నుంచి దారి బంద్
కంటోన్మెంట్,న్యూస్లైన్: ప్రజావసరాలు, ఆందోళనల్ని ఏమాత్రమూ ఖాతరు చేయని ఆర్మీ అధికారులు తమ పని కానిచ్చేస్తున్నారు. తమ పరిధిలోని రోడ్లపై ఆంక్షల అమలుకు రంగం సిద్ధంచేస్తున్నారు. కంటోన్మెంట్లోని ఏవోసీ సెంటర్ నుంచి వెళ్లే రోడ్లపై మంగళవారం (25వ తేదీ) రాత్రి నుంచి సాధారణవాహనాల రాకపోకల్ని నిషేధించనున్నారు. మార్చి 10 నుంచి ఆర్మీ మినహా ఇతర వాహనాల రాకపోకల్ని అనుమతించరు. దీంతో ఇంతకాలం కంటోన్మెంట్ నుంచి మారేడుపల్లి, సికింద్రాబాద్ క్లబ్ మార్గాల్లో నగరంలోకి ప్రవేశించే మల్కాజిగిరి, సఫిల్గూడ, ఈసీఐఎల్, ఆర్కేపురం, ఏఎస్రావునగర్, మౌలాలి, సైనిక్పురి, కుషాయిగూడ తదితరప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పవు. ఇకనుంచి వీరు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయడంతోపాటు అధిక సమయం వెచ్చించక తప్పదు. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న తిరుమలగిరి చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బందులు మూడింతలు పెరుగనున్నాయి. రోడ్ల మూసివేతను నిరసిస్తూ ప్రజలే స్వచ్ఛందంగా ఆందోళనలకు సిద్ధమవుతుండగా ప్రజాప్రతినిధులు మాత్రం కేవలం ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. సివిలియన్ కంటోన్మెంట్ నిధులతో వేసిన రోడ్లను తమ అనుమతి లేకుండా ఎలా మూస్తారంటూ బోర్డు సభ్యులు ప్రగల్భాలకు పోతున్నప్పటికీ, రోడ్లమూసివేతపై వారికి కనీస సమాచారం కూడా ఇవ్వకపోడం గమనార్హం. ఈ మేరకు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని బోర్డు సీఈవో సుజాతగుప్తా వెల్లడించారు. మూసివేసే మార్గాలివే... 1. సికింద్రాబాద్క్లబ్, పికెట్/వెస్ట్మారేడుపల్లి నుంచి వెల్లింగ్టన్రోడ్డులో ఏవోసీ సెంటర్ ఏవోసీ సెంటర్కు అనుమతి ఉండదు. 2. ఈస్ట్మారేడుపల్లి/ఎస్పీ రోడ్డు నుంచి ఏవోసీకి వెళ్లే మార్గం 3. సఫిల్గూడ రైల్వేస్టేషన్ నుంచి ఏఓసీ ద్వారా సికింద్రాబాద్క్లబ్/ఈస్ట్మారేడ్పల్లికి వచ్చేమార్గం (మల్కాజిగిరి నుంచి కంటోన్మెంట్లోకి ప్రాంతంలోకి దారితీసే ఏకైక మార్గమదే). ఆయా మార్గాల్లో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8.00 గంటల మధ్య సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. మార్చి 10 నుంచి పూర్తిగా అనుమతించరు. ఎవరెవరికి ఇబ్బందులు.. 1 సఫిల్గూడ రైల్వేస్టేషన్ నుంచి ఏవోసీ మార్గంలో మారేడుపల్లి/సికింద్రాబాద్ క్లబ్ మధ్య దూరం 2 కి.మీ., ప్రయాణ సమయం 5 నుంచి 10 నిమిషాలు (మధ్యలో ఎలాంటి సిగ్నళ్లు లేవు) ప్రత్యామ్నాయ మార్గం: సఫిల్గూడ-మల్కాజిగిరి-తుకారంగేట్-అడ్డగుట్ట-మారేడుపల్లి దూరం : 6 కి.మీ., ప్రయాణ సమయం: 40 నిమిషాలు 2. ఆర్కేపురం బ్రిడ్జి నుంచి సికింద్రాబాద్కు వచ్చే ప్రయాణికులు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి- ఏవోసీ మార్గంలో నేరుగా మారేడుపల్లికి చేరుకుంటున్నారు. ఈ మార్గం మూసివేస్తే తప్పనిసరిగా తిరుమలగిరి చౌరస్తా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఇరుకైన రోడ్లు కారణంగా ఈ చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్జామ్లవుతున్నాయి.ఆర్మీ కంటోన్మెంట్లో రోడ్లపై ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ మార్గంలో వెళ్లే వాహనాలు తిరుమలగిరి చౌరస్తా నుంచి వెళ్లాల్సి వస్తుంది. సిగ్నల్ దాటాలంటే కనీసం అరగంట వేచి ఉండక తప్పదు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు తిప్పలే.. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులు పెద్దసంఖ్యలో కంటోన్మెంట్ చుట్టుపక్కల కాలనీల్లో స్థిరపడ్డారు. వీరంతా నగరానికి వెళ్లాలంటే కంటోన్మెంట్ రోడ్ల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి సామాన్యులు కూడా ఈ రోడ్లను వినియోగిస్తున్నప్పటికీ, భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అఖిలపక్షం ద్వారా అభిప్రాయం సేకరించి రోడ్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలి. - జి.రమణారెడ్డి, ఏపీసీసీ ఎక్స్సర్వీస్మెన్ విభాగం కన్వీనర్ -
సకలం పూర్తి
కలెక్టరేట్, న్యూస్లైన్ : మేడారంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ పూర్తయ్యాయని, గత జాతరలో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కిషన్ తెలిపారు. భక్తుల రాక ఈసారి చాలా రోజుల ముందు నుంచే ప్రారంభమైనా జాతర ప్రారంభమైన తర్వాత ముఖ్యమైన ఆ మూడురోజుల్లో మరింత రద్దీ ఉంటుందన్నారు. జాతరలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై ఆయన ‘న్యూస్లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత ంలో అమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు క్యూలైన్ల వద్ద ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గుర్తించి నేను స్వయంగా సందర్శించి క్యూలైన్లు మార్చాలని సూచించా. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల వల్ల దర్శనం కాస్త ఆలస్యమైనా తొక్కిసలాట జరగకుండా ఉంటుం ది. బాగా ఆలోచించే ఇలా ఏర్పాటు చేశాం. ఫలితంగా దర్శనం సమయంలో చాలా సమస్యలు తగ్గుతాయి. గద్దెల వద్ద కూడా కొన్ని మార్పులు చేశాం. దీనివల్ల భక్తులు గద్దెలకు రెండువైపుల నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు రానివ్వం జాతర సందర్భంగా మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇప్పటి వరకైతే అవసరం ఉన్నంత మేర పనులు పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు ఏవైనా మిగిలితే జాతర తరువాత చేయాలని చెప్పాం. ఆదివారం సాయంత్రానికి పనులు పూర్తయినట్టే భావించవచ్చు. బ్రిడ్జి పను లు, వెంగళాపూర్, పగిడాపూర్ రోడ్లలో డైవర్షన్లు ఇరుగ్గా లేకుండా చర్యలు తీసుకున్నాం. స్నానఘట్టాల వద్ద భక్తులకు ఇబ్బందిలేకుండా అవసరం మేర పెంచాం. అధికారులు జాతర మూడు రోజులూ అందుబాటులో ఉంటారు. నాణ్యతపై రాజీలేదు పనులు వేగంగా చేసినంత మాత్రాన నాణ్యత లేకుంటే మాత్రం వదిలిపెట్టేది లేదు. తాత్కాలిక పనులను పక్కన పెడితే శాశ్వత పనుల విషయంలో నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ముందునుంచీ చెబుతూ వస్తున్నాం. ఆ ప్రకారం చర్యలు ఉంటాయి. ఇక జాతర విధులు కేటాయించిన అధికారుల్లో చాలామందికి బదిలీ అయింది. అయితే జాతర ముగిసిన తర్వాత ఒకేరోజు అందరినీ రిలీవ్ చేస్తాం. -
ఒక కుటుంబం.. ఒక వాహనం ప్రణాళిక అమలు చేయాలన్న బాంబే హైకోర్టు
సాక్షి, ముంబై: ముంబైలో జనాభాతోపాటు వాహనాల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలోని ప్రముఖ రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్రంకాగా, మరోవైపు వాహనాలను పార్కింగ్ చేయాలన్నా స్థలం లభించడంలేదు. ‘ఒక కుటుంబం.. ఒక వాహనం’ ట్రాఫిక్ సమస్యను తగ్గించాలంటే వాహనాల సంఖ్య తగ్గాలి. అందుకు ‘ఒక కుటుంబం ఒక వాహనం’ అనే ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన బాంబే హైకోర్టు ఇలాంటి ప్రణాళికను తొందరగా అమలు చేసే దిశగా ఆలోచించాలని ‘ఆర్టీఓ’కు సూచిం చింది. ఈ ప్రణాళికను అమలు చేస్తే పార్కింగ్ సమస్య కొంత తీరనుంది. మరోవైపు అనేక మంది ముంబైలో నివసిస్తున్నప్పటికీ ఠాణే, భివండీలో నివసిస్తున్నట్లు చిరునామాలో పేర్కొని వాహనాలు తీసుకుంటున్నారు. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు కూడా అక్ట్రాయి, ఇతర పన్నుల రూపంలో లభించే ఆదాయానికి గండిపడుతోంది. తప్పుడు చిరునామాతో వాహనాల కొనుగోలు ముఖ్యంగా కొందరు డీలర్లు కూడా పన్నులను ఎగ్గొట్టేందుకు ఇలాంటి తప్పుడు చిరునామాలతో వాహనాలు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇలా చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టులో ఠాణే మాజీ కార్పొరేటర్ సుధీర్ బర్గే ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్లో రెవెన్యూ కూడా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు ముంబైలోని ట్రాఫిక్ సమస్య తీరేందుకు పై విధంగా ఆర్టీఓకు సూచించింది. పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడండి వాహనాలు కొనుగోలు చేసే సమయంలో పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడాల్సిన అవసరం ఉందని ముంబై హైకోర్టు పేర్కొంది. అనేక కుటుంబాల వద్ద ఒకటి కంటే అధికంగా వాహనాలున్నాయి. అయితే వాటన్నింటికీ వారు నివసించే స్థలంలో పార్కింగ్ లేకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. దీంతో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మరోవైపు కొన్ని వాహనాలైతే ఒకే చోట అనేక రోజులుగా నిలిపి ఉంచుతున్నారు. దీంతో ఒక కుటుంబం ఒక వాహనం ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముంబై హైకోర్టు సూచించింది. తీవ్రమవుతున్న పార్కింగ్ సమస్య నగరంలో పార్కింగ్ సమస్య రోజు రోజుకి తీవ్రమవుతోంది. ముఖ్యంగా నగరంలో బీఎంసీకి చెందిన 89 ‘పే పార్కింగ్’ ప్రాంతాలున్నాయి. వీటిలో 10,314 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుంది. అయితే వాహనాల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో కొన్ని పార్కింగ్ ప్రాంతాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అపోలో మిల్లు వద్ద 650 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుండే బహుళ అంతస్తుల పే పార్క్ను నిర్మించింది. అదేవిధంగా మరో 33 బహుళ అంతస్తుల పే పార్కింగ్ భవనాలను నిర్మించేందుకు బీఎంసీ అనుమతులను ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా పార్కింగ్ సమస్య మాత్రం తీరే అవకాశాలు కన్పించడంలేదు. దీనికి ప్రధాన కారణంగా వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరగడం. ముఖ్యంగా ఒకే కుటుంబంలో నాలుగైదు వాహనాలు ఉండటం. ఇలాంటి వాటి ని తగ్గించి ట్రాఫిక్తోపాటు పార్కింగ్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. -
గ్రీన్ సిటికి ట్రాఫిక్ సమస్యలు
-
బండి కదలదుప్రయాణం సాగదు
కర్నూలు(అర్బన్),న్యూస్లైన్: పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు వెడల్పు కాకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు అధికమవుతున్నాయి. సి బ్బంది కొరతతో జిల్లాలో ప్రధాన పట్టణాల్లో రాకపోకలను క్రమబద్ధీకరించలేకపోతున్నారు. దీంతో రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రమాదాలకు గురై పలువురు మృత్యువాత పడుతుండగా, అనేక మంది క్షతగాత్రులై ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థగా కర్నూలు రూపాతంరం చెందినా, ట్రాఫిక్ను కట్టడి చేయలేక పోతున్నారు. ముఖ్యంగా ప్రధాన రోడ్లలోనే ట్రాఫిక్ అదుపు తప్పింది. కలెక్టరేట్ ఎదుట మెయిన్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి. పాతబస్తీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. కర్నూలులో..: నగరంలో రోడ్ల వెడల్పు కార్యక్రమం నెలల తరబడి కొనసాగుతోంది. మెయిన్ రోడ్డు వెడల్పు చేయడమే అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అనేక సంవత్సరాలుగా రోడ్డు పక్కనే నివాసాలు, వ్యాపారాలు చేసుకుంటున్న పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. అలాగే పాతబస్తీలోని రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను వెడల్పు చేయకుండానే డివైడర్లను ఏర్పాటు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నగరంలో అబ్దుల్లాఖాన్ ఎస్టేట్, జెడ్పీ, కలెక్టరేట్ వద్ద వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతోంది. అరకొర సిబ్బంది.. : కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు మున్సిపల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు అవసరమైనంత మంది సిబ్బంది లేరు. కర్నూలులో అదనపు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. నగరంలో మొత్తం 52 పాయింట్లు ఉండగా రెండుషిఫ్టుల్లో విధులు నిర్వహించాలంటే 150 మంది సిబ్బంది అవసరం. అయితే 60 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నంద్యాలలో మొత్తం 27పోలీసు బీట్లు ఉండగా పదింటిలో మాత్రమే ట్రాఫిక్ సిబ్బంది సేవలను అందిస్తున్నారు. ఆదోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో మొత్తం 45 మంది కానిస్టేబుళ్లుకుగాను 15 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు శిక్షణకు వెళ్లారు. డోన్, ఎమ్మిగనూరులో కూడా సిబ్బంది కొరతతో ట్రాఫిక్ అదుపు తప్పుతోంది. -
డబ్బు సంపాదనకే నక్సలైట్ల ముసుగు
=నకిలీల ఆటలు సాగనివ్వం =ఆయుధాలు ధరించి తిరిగితే ఊరుకునేది లేదు =కానిస్టేబుళ్ల పనితీరు భేష్ =నాటి అమరులు త్యాగాలతోనే ప్రశాంతమైన వాతావరణం =పరకాల ఠాణాను సందర్శించిన డీఐజీ కాంతారావు పరకాల, న్యూస్లైన్ : డబ్బు సంపాదన కోసమే కొందరు నక్సలైట్ల ముసుగు వేసుకుంటున్నారని, అలాంటి నకిలీల ఆటలు సాగనివ్వమని, ఎవరైనా ఆ యుధాలు ధరించి తిరిగితే ఊరుకునేది లేదని వరంగల్ రేంజ్ డీఐజీ ఎం. కాంతారావు హెచ్చరించారు. పరకాల పోలీస్స్టేషన్ను ఆయన శు క్రవారం సందర్శించారు. పోలీసుల గౌరవ వం దనం స్వీకరించి, వారి పనితీరుపై ఆరా తీశా రు. ఒక్కో కానిస్టేబుల్ పేరు, అతడు నిర్వర్తిస్తున్న విధుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. గ్రామాలవారీగా క్రైం రేటు ఎలా ఉంది.. రౌడీషీటర్లు ఎందరున్నారు.. మావోలు, మాజీ లు ఎంతమంది ఉన్నారంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆరేళ్ల తర్వాత పరకాల పోలీస్ స్టేషన్ను డీఐజీ కేడర్ అధికారి సందర్శించడం జరిగిందన్నారు. నక్సలైట్ల పేరుతో తిరిగిన నకిలీలను పట్టుకున్నట్లు తెలిపారు. నిజాం రజాకార్లతో పోరాడి ప్రాణాలు అర్పించిన వీరులు పుట్టిన గడ్డ పరకాల అని కొనియూడారు. వారి త్యాగాలతోనే నేడు మనం ప్రశాంతంగా జీవిం చగలుతున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారి గా పరకాల, వరంగల్తోపాటు ఖమ్మం జిల్లా లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. విద్రోహ శక్తులు, ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడం కోసం వీటిని రహస్య ప్రాంతాల్లో పెట్టి నిఘా ఉంచుతామని తెలిపారు. మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం పోలీసులు నిరంతరం పని చేస్తున్నారన్నారు. పోలీస్ క్వార్టర్ల సందర్శన ఈ సందర్భంగా డీఐజీ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్లను డీఐజీ సందర్శించారు. కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. క్వార్టర్లలో డ్రైనేజీ వ్యవస్థ లేద ని, వర్షానికి తడిసిన గోడలు షాక్ కొడుతున్నాయని చెప్పడంతో డీఐజీ క్వార్టర్లలోకి వెళ్లారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డీఎస్పీ, సీఐని ఆదేశించారు. అలాగే పరకాల, రేగొండ మండలాల్లో ఇటీవల ప్రమాదవశాత్తు ఇళ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలకు డీఐజీ దుస్తులు, బియ్యం, వంట పాత్రలను పంపిణీ చేశారు. పోలీసుల ఔదార్యంతోనే వీటిని అందిస్తున్నామని తెలిపారు. కుంకుమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు పట్టణంలోని కాకతీయులునాటి కుంకుమేశ్వర ఆలయంలో డీఐజీ కాంతారావు ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ అర్చకులు కోమాళ్లపల్లి సంపత్కుమార్శర్మ డీఐజీకి పూజలు చేయించి ఆలయ చరిత్రను వివరించారు. సంప్రదాయ పద్ధతిలో డీఐజీని సన్మానించారు. కానిస్టేబుల్కు డీజీఐ అభినందనలు విధులు సక్రమంగా నిర్వహించిన కానిస్టేబుల్ను డీఐజీ కాంతారావు వెరీ గుడ్ అని అభినందించారు. 1996 బ్యాచ్కు చెందిన ఎం. సురేష్ పర్సనల్ డైరీని చూసిన డీఐజీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 15 దొంగతనాల కేసులను చే ధించినట్లు చెప్పడంతో కరచాలం చేసి అభినందించారు. డీఐజీ వెంట పరకాల డీఎ స్పీ పి.సంజీవరావు, సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు, ఎస్సై వినయ్కుమార్, సిబ్బంది ఉన్నారు. -
గుడ్డి దర్బార్
=ఆస్తుల వివరాలు, రికార్డులు లేని జీహెచ్ఎంసీ = పరిహారం పేరిట రూ. 17 కోట్ల ఫలహారానికి రెడీ =తనిఖీలతో వెల్లడైన అక్రమం సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో ఎన్ని చెరువులున్నాయో తెలియదు.. వాటిలో ఎన్ని పరుల పాలయ్యాయో వివరాలు లేవు.. పార్కుల విస్తీర్ణమెంతో తెలిపే రికార్డులైనా ఉన్నాయంటే అవీ లేవు.. ఏ పార్కులు ఏ అక్రమార్కుల చెరలో మగ్గుతున్నాయో అంతకన్నా తేలీదు.. ఎస్టేట్ విభాగానికి సంబంధించి ఏ ఆస్తుల్లో ఎందరు థర్డ్పార్టీలున్నారో.. వాటిలో ఎన్నింటికి లీజు చెల్లించడం లేదో సమాచారం లేదు.. అంతేకాదు కనీసం ఎక్కడెక్కడ ఏయే రోడ్లున్నాయో తెలీని దుస్థితి. ఇంకా.. ఇంకా.. ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలియకపోవడమే కాక స్వయానా మునిసిపల్ రోడ్లను సైతం తమ ఆస్తులని లబ్ధిదారులు చెబితే, కళ్లు మూసుకొని లెక్కలు కట్టి, పరిహారం చెల్లించే స్థితిలో ఉంది మన ఘనత వహించిన జీహెచ్ఎంసీ. ఉప్పల్ చౌరస్తా-నల్లచెరువు రోడ్డు విస్తరణ కోసం తమ రోడ్డు ఉన్న స్థలానికే దాదాపు రూ.17 కోట్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధపడిన ఉదంతమే ఇందుకు అత్యుత్తమ నిదర్శనం. ఉప్పల్ చౌరస్తా నుంచి నల్లచెరువు వరకు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు రహదారి విస్తరణ అవసరమని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అందుకుగాను విస్తరణలో ఆస్తులో కోల్పోనున్న వారిని ఒప్పించేందుకు చాలాకాలం పాటు సంప్రదింపులు జరిపారు. భూసేకరణ ద్వారా అయితే ఆలస్యం అవుతుందని భావించి.. సాధ్యమైనన్ని ఆస్తుల్ని సంప్రదింపుల ద్వారానే సేకరించేందుకు సిద్ధమయ్యారు. స్థానిక కార్పొరేటర్తో సహా పలువురు అధికారులు తమ వంతు సహకారం అందించారు. మొత్తం 181 ఆస్తులకుగాను 70 మంది తమ ఆస్తులిచ్చేందుకు ముందుకొచ్చారు. అక్కడ మార్కెట్ ధర చదరపుగజానికి రూ. 25 వేలుండగా, అంతకంటే మరో రూ.5 వేలు ఎక్కువతో (20 శాతం అదనం) చదరపు గజానికి రూ. 30 వేల వంతున పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించారు. అందుకు జీహెచ్ంఎసీ స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దాంతో.. ఆస్తుల సేకరణ కోసం కొలతలు తీసిన అధికారులు వేటికి ఎంత చెల్లించాల్సి ఉంటుందో లెక్కలు వేశారు. చెల్లింపులకు ముందు.. టైటిల్ వెరిఫికేషన్స్ కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఉన్నతాధికారులు.. జీహెచ్ఎంసీ రోడ్డు భాగాన్ని సైతం లబ్ధిదారుల ఆస్తిలో కలిపి లెక్కించినట్లు గుర్తించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తెలియక జరిగిన పొరపాటన్నారు. దాంతో.. తిరిగి సర్వే నిర్వహించి, కచ్చితంగా లెక్కలు తీయాల్సిందిగా ఆదేశించడంతో తిరిగి ఆ పనిలో పడ్డారు. లేనిపక్షంలో రోడ్డున్న స్థలానికి కూడా నష్టపరిహార చెల్లింపులు జరిగేవి. అది తక్కువలో తక్కువ రూ. 17 కోట్లు. ఇదీ జీహెచ్ఎంసీ నిర్వాకం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లకపోతే.. రూ.17 కోట్లు హాంఫట్ అయ్యేవే. కొత్త చట్టం సాకు చూపుతూ.. జరిగిన పొరపాటు బయట పడనీయకుండా స్థానిక అధికారులు కొత్త భూసేకరణ చట్టాన్ని లబ్ధిదారుల ముందుంచారు. కొత్త చట్టం వల్ల ఎక్కువ నష్టపరిహారం అందనుండటంతో.. లబ్ధిదారులు సైతం ఇప్పుడు దాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. కొత్త చట్టం పుణ్యమా అంటూ జీహెచ్ఎంసీ చేసిన తప్పిదం మరుగున పడిపోనుంది. జీహెచ్ఎంసీ అడ్డగోలు పాలనకు ఇదో నిదర్శనం మాత్రమే. బయటకు పొక్కకుండా లోలోపలే జరుగుతున్న అవకతవకలు.. అక్రమాలు.. పొరపాట్లు.. ఇంకా ఎన్నెన్నో! రానున్న జనవరి 1 నుంచి అమల్లోకి రాగలదని భావిస్తున్న కొత్త భూసేకరణ చట్టం మేరకు భూ నిర్వాసితులయ్యే వారికి మార్కెట్ ధర కంటే 70 శాతం అదనంగా గిట్టుబాటవుతుంది. దాన్ని చూపుతూ లబ్ధిదారుల నుంచి ఒత్తిడి రాకుండా చేయడమే కాక.. ఆ చట్టమే వర్తింపచేయాలని వారి నుంచే డిమాండ్ వచ్చేలా చేశారు. -
నగర ప్రజా రవాణా వ్యవస్థకు నగిషీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజా రవాణా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ స్టడీ(సీటీఎస్) ప్లాన్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టం(ఐటీఎస్) మాస్టర్ప్లాన్లను అమలు చేయనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్కుమార్ ప్రసాద్ తెలిపారు. 2041 నాటికి మెట్రోపాలిటన్ ప్రాంతంలో జనాభా 1.90 కోట్లకు చేరే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని.. మెట్రో, బీఆర్టీఎస్, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ల వంటివి ఏమేరకు అభివృద్ధి చేయాలన్నది ఇందులో ఉన్నాయన్నారు. సమగ్ర రవాణా వ్యవస్థపై లీ అసోసియేట్స్ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ప్రణాళికను, ఐటీఎస్ మాస్టర్ప్లాన్లను తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలో బుధవారం ప్రదర్శనకు పెట్టారు. ఈ సందర్భంగా నీరభ్కుమార్ మాట్లాడుతూ జనవరి 10 వరకు ఈ ప్రదర్శన ఉం టుందన్నారు. www.hmdagov.in, www.ctshm2011.comవెబ్సైట్ లలోనూ దీన్ని చూడవచ్చన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే వ్యక్తిగతంగా లేదాcts2041@ hmda.gov.in ఇ-మెయిల్ ద్వారాకూడా పంపవచ్చన్నారు. రానున్న 30 ఏళ్లలో రవాణా ప్రణాళిక అమలుకు రూ.1.25 లక్షల కోట్ల నిధులు వెచ్చిస్తామన్నారు. -
ట్రాఫిక్ ఇక్కట్లకు ‘యాప్’తో చెక్
సాక్షి, ముంబై: ఠాణే, ముంబై, నవీముంబై పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గమ్యానికి ఎప్పుడు చేరతామో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి నగరవాసులను గట్టెక్కించేందుకు ఠాణే రవాణాశాఖ ఓ మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఫోన్ వినియోగదారులు ఈ అప్లికేషన్ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటే ముంబై, నవీముంబై, ఠాణేలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. ఠాణే పోలీస్ కమిషనర్ కె.పి. రఘువంశీ చేతుల మీదుగా ఈ సేవలను ప్రారంభించారు. ‘ట్రాఫ్లైన్’అనే ఈ మోబైల్ అప్లికేషన్ను బ్లాక్బెర్రీతోపాటు, ఆండ్రాయిడ్, ఐఫోన్ మోబైల్ ఫోన్లలో సులువుగా వినియోగించుకోవచ్చు. ఠాణే నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ముంబై, నవీముంబై పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని సార్లు ట్రాఫిక్ సమస్య కారణంగా మధ్యలోనే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి. అయితే ఈ అప్లికేషన్ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటే ట్రాఫిక్ పరిస్థితి ఏమిటనేది ముందుగానే తెలుస్తుంది. తద్వారా గంటల తరబడి అందులో చిక్కుకోవాల్సిన అవసరముండదు. సమయంతో పాటు ఇంధనం కూడా పొదుపవుతుంది. ఈ అప్లికేషన్లో మ్యాప్, ట్రాఫిక్ అలర్ట్ సూచన, గమ్యస్థానానికి చేరుకునేందుకు గెడైన్స్, అలాగే గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందనే సమాచారం కూడా పొందవచ్చు. అప్లికేషన్తోపాటు వెబ్సైట్ సౌకర్యం కూడా కల్పించినట్లు డీసీపీ శ్రీకాంత్ పరోపకారి తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా www.traffline.com వెబ్సైట్పై కూడా ట్రాఫిక్ సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చన్నారు. -
రింగ్రోడ్డుకు బాలారిష్టాలు
గద్వాల, న్యూస్లైన్: సరిగ్గా రెండేళ్ల క్రితం సీఎం కిరణ్కుమార్రెడ్డి శంకుస్థాపన చేసిన గద్వాల రింగ్రోడ్డు పనులు నేటికీ టెండర్ల దశ దాటడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన రింగ్రోడ్డు పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో, ఎన్నేళ్లకు పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా అవతరించిన గద్వాల ప్రాజెక్టులకు కేంద్రంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రింగ్రోడ్డును ప్రతిపాదించారు. రాజీవ్ యువకిరణాలు కార్యక్రమాన్ని మూడు ప్రాంతాల్లో ఒక్కొక్క చోట సీఎం ప్రారంభించారు. అందులో భాగంగా 2011 ఆగస్టు 27న సీఎం కిరణ్కుమార్రెడ్డి యువకిరణాలు కార్యక్రమాన్ని గద్వాలలో ప్రారంభించేందుకు వచ్చి రింగ్రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మంగళవారంతో శంకుస్థాపన జరిగిన రెండేళ్లు పూర్తయింది. రూ.40కోట్ల అంచనావ్యయంతో.. గద్వాల చుట్టూ రింగ్రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్ల అంచనా వ్యయం తో 2011లో ప్రభుత్వం మంజూరు ఇ చ్చింది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జమ్మిచేడు వద్ద నుంచి అయిజ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వరకు నిర్మాణం చేపట్టాలని మొదట ప్రతిపాదించారు. పట్టణం చుట్టూ రింగ్రోడ్డు నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ను తెరపైకి తెచ్చారు. దీంతో పనులను రెండు దశలుగా విభజించారు. మొద టి దశ జమ్మిచేడు నుంచి వయా అయి జ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వర కు, రెండో దశలో రాయిచూరు రోడ్డు నుంచి డ్యాం రోడ్డు, నదిఅగ్రహారం రోడ్డు, వెంకంపేట రోడ్డుల ద్వారా జమ్మిచేడు రోడ్డును కలిపేలా నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ పనులకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు అంచనాలు రూపొందించారు. రూ.23.12కోట్ల వ్యయంతో తయారుచేసిన నివేదికను సాంకేతిక అనుమతి కోసం ఈఎన్సీకి పంపారు. సాంకేతిక అనుమతి రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడం, కాంట్రాక్టర్లకు వర్క్ఆర్డర్ ఇవ్వడం వంటి దశలను పూర్తి చేసుకోవడం ఎప్పుడో, రోడ్డు నిర్మాణ పనులు ఇంకెన్నాళ్లకు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఈ విషయమై ఆర్అండ్బీ గద్వాల డీఈఈ నాగార్జున్రావును ‘న్యూస్లైన్’ వివరణ కోరగా, సాంకేతిక అనుమతి రాగానే రింగ్రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.