Transformers
-
ట్రాన్స్ఫార్మర్లు టపటపా!
సాక్షి, హైదరాబాద్: వంద, వెయ్యి, పది వేలు కాదు.. ఏకంగా లక్షకు పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అదీ ఒక్క ఏడాదిలోనే. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్ర వ్యాప్తంగా 1,06,260 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినట్లు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన వార్షిక (2024–25) ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లో వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,58,932 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, అందులో 19 శాతానికి పైగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఏడాదికి సగటున 50 వేల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. కానీ గతేడాది ఈ సంఖ్య రెట్టింపు కావడంపై విద్యుత్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఈ లక్ష ట్రాన్స్ఫార్మర్ల పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగడమే కాకుండా, వాటి మరమ్మతులకు డిస్కంలు రూ.వందల కోట్లలో ఖర్చు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాసిరకం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు, పాడైన ట్రాన్స్ఫార్మర్లకు కాంట్రాక్టర్లు సరిగ్గా మరమ్మతులు చేయకపోవడం, చిన్న చిన్న లోపాలను గుర్తించి సరి చేయడానికి వీలుగా పీరియాడిక్ మెయింటనెన్స్ నిర్వహించడంలో అధికారుల నిర్లక్ష్యం, లైన్లలో లోపాలు ఏర్పడడం వంటి సమస్యలకు ఓవర్ లోడింగ్ సమస్య జతకావడంతో ట్రాన్స్ఫార్మర్లు పటాకుల్లా కాలిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి పంటలకు అధిక వినియోగం టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్లో గత ఏడాది అత్యధికంగా 71,733 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో మరో 34,527 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 2023 తొలి అర్ధవార్షికం (ఏప్రిల్– సెపె్టంబర్)లో 27,596 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్యకాలంలో ఏకంగా 44,137 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వర్షాభావంతో యాసంగి పంటలకు విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో పాటు గృహాలు, ఇతర అవసరాలకు సైతం వినియోగం పెరిగి ఓవర్లోడ్ పడటంతో రెండో అర్ధ వార్షికంలో అధిక సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లపై కాలిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అత్యధికం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 10,682 ట్రాన్స్ఫార్మర్లు దగ్ధం కావడం గమనార్హం. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 7,162, నాగర్కర్నూల్ జిల్లాలో 6,234, సిద్దిపేట జిల్లాలో 5,522, సంగారెడ్డి జిల్లాలో 5,160, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,734 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. జంట నగరాల పరిధిలో అత్యధికంగా రాజేందర్నగర్ సర్కిల్లో 5,076 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22,578, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 17,992 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఈ రెండు జిల్లాల్లో ఓవర్ లోడ్కు, నిర్వహణా లోపాల సమస్యలకు అద్దం పడుతోంది. ఇక టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4,289 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మరమ్మతులకు భారీగా వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 25/63/100 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను, పట్టణ ప్రాంతాల్లో 100/160/315/500 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతుల కోసం సగటున కేవీఏకు రూ.200 చొప్పున మొత్తం ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యానికి బిల్లులు లెక్కించి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రూ.15–20 వేలు, 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రూ.లక్ష వరకు డిస్కంలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్లో కాలిపోయిన వైండింగ్ స్థానంలో కొత్త వైండింగ్ ఏర్పాటుతో పాటు ఆయిల్ను ఫిల్టర్ చేసి వేస్తారు. ఒక్కోసారి పూర్తి వైండింగ్ కాలిపోతే ఖర్చు అధికం అవుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్కు ఐదేళ్ల వారంటీ ఉంటుండగా, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేసిన తర్వాత ఆరు నెలల గ్యారెంటీ పీరియడ్ ఉంటుంది. గ్యారెంటీ పీరియడ్ లేని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పూర్తి వ్యయం డిస్కంలే భరించాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడానికి ప్రధాన కారణాలు... – అనధికార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరగడంతో లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. – ట్రాన్స్ఫార్మర్ల మెయింటినెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వర్షాల్లో లోపలికి నీళ్లు వెళ్లకుండా లీకేజీలను అరికట్టకపోవడం వల్ల కాలిపోతున్నాయి. – జీవిత కాలం ముగిసిన అధిక శాతం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. – సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా కాలిపోతున్నాయి. -
లెక్కల్లో మరీ ఇంత వీకా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలపై రామోజీరావు విషం చిమ్ముతున్నారు. తప్పుడు లెక్కలు వేసి.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోతోందంటూ ప్రజలను మభ్య పెట్టడానికి మరోసారి విశ్వప్రయత్నం చేశారు. ఆసియాలోనే ప్రముఖ ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీ ఇండోసోల్పై ‘రూ. 47,809 కోట్లు దోచి పెడుతున్నారు’ అంటూ సోమవారం మరోసారి ఈనాడులో తప్పుడు రాతలు రాశారు. పరిశ్రమలన్నిటికీ రాయితీలు ఒకేలా వర్తిస్తాయని, ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉండవని తెలిసి కూడా అవాస్తవ కథనాన్ని ప్రచురించారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు రూ. 59,958 కోట్ల పెట్టుబడులను ఇండోసోల్ పెడుతోంది. తద్వారా ప్రత్యక్షంగా 12వేల మందికి, పరోక్షంగా 20వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా రాసిన ఆ కథనంలో ఉన్నవన్నీ అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వితేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. సీఎండీలు వెల్లడించిన అసలు నిజాలు ఇలా ఉన్నాయి. రెట్టించిన అబద్ధాలు ఈనాడు తన కథనంలో చెప్పినట్టుగా పరిశ్రమల రంగంలో గరిష్ట డిమాండ్ చార్జీలు కలిపి సగటున యూనిట్కు రూ. 12గా విద్యుత్ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయనడం పూర్తిగా అబద్ధం. 11కేవీ స్థాయిలో ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలకు సరాసరి విద్యుత్ చార్జీ యూనిట్ రూ. 6.50 కాగా, ప్రస్తుతం విధిస్తున్న ఇంధన సర్దుబాటు చార్జీలు దీనికి అదనం. ఈ ఇంధన సర్దుబాటు చార్జీలు నిరంతరం ఉండవు. గడువు అయిపోగానే ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలు, ఫొటో ఓల్టాయిస్(పీవీ) ఇంగోట్–సెల్ తయారీ పరిశ్రమలు, పోలీ సిలికాన్ పరిశ్రమలు, అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి. లో టెన్షన్లో ఆ కేటగిరీయే లేదు ఇండోసోల్ పరిశ్రమ సమర్పించిన ప్రాజెక్టు వివరాల ప్రకారం అది అత్యధిక పరిమాణంలో విద్యుత్ వినియోగించే పరిశ్రమ. ఇప్పుడు అమలులో ఉన్న అత్యధిక వోల్టేజీ స్థాయి 220 కేవీ కన్నా ఎక్కువగా 400 కేవీ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగబోతోంది. అయినా గ్రిడ్పై ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా ఉండగలదు. దానితో ఇది దృఢమైన గ్రిడ్ నిర్వహణకు దోహద పడుతుంది. అయితే ఇప్పుడు 400 కేవీ విద్యుత్ వినియోగ స్థాయి అనేది రిటైల్ టారిఫ్ ధరలలో లేకపోవడం వల్ల దీని కోసం ప్రత్యేకంగా ఒక ఉప కేటగిరీని ప్రతిపాదించారు. లో టెన్షన్(ఎల్టీ) స్థాయిలో అసలు ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమ అనే ఉప కేటగిరీ లేనే లేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలు అంటేనే అవి అధిక పరిమాణంలో విద్యుత్ వాడే పరిశ్రమలని అర్థం. అవి కేవలం హెచ్టీ కేటగిరీలోనే ఉంటాయి. అర్హతను బట్టే ప్రోత్సాహకాలు ఆత్మనిర్భర్ భారత్ (మేక్ ఇన్ ఇండియా)లో భాగంగా, ఎండ్–టు–ఎండ్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సంస్థలను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ)పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ, నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) చేపట్టిన బిడ్డింగ్ ద్వారా ఈ పధకానికి ఇండోసోల్ అర్హత సాధించింది. దాని ద్వారా ఈ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) రూ. 1,875 కోట్ల ప్రోత్సాహకానికి అనుమతి ఇచ్చింది. వాస్తవంగా ఈ రాయితీలు ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఈ కేటగిరీలో ఎవరు వచ్చినా వాటికి ఇవే రాయితీలు వర్తిస్తాయి. పాలసీ అన్నది అన్ని పరిశ్రమలకు ఒకేలా వర్తిస్తాయిగానీ, ఒక్కో కంపెనీకి ఒక్కోలా వర్తించవు. ఈ విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాస్తోంది. చట్టం కాకుండానే ఏడుపా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ అధిక విద్యుత్ వాడే పరిశ్రమకు తొలి ఏడేళ్లు యూనిట్కు రూ.4.0గాను, ఎనిమిదో ఏట నుంచి రూ.4.50 గాను ప్రతిపాదించడం జరిగింది. ఈ పరిశ్రమకు 220 కేవీ స్థాయిలో ప్రస్తుత టారిఫ్ యూనిట్ రూ 4.90గా ఉంది. ఈ టారిఫ్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పరిశీలనలో ఉన్నాయి. వీటిపై వచ్చే ఏడాది జనవరి 29 నుంచి 31 వరకు ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహిస్తామని ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా ఏపీఈఆర్సీ వెల్లడించింది. అంటే ఈ ప్రత్యేక విద్యుత్ కేటగిరికి టారిఫ్ చట్ట పరంగా ఇంకా నిర్ధారణ కాలేదు. ఇంతలోనే ఎంతో నష్టం జరుగుతోందంటూ ఈనాడు ఏదేదో ఊహించేసుకుని ఏడుపుగొట్టు కథనాన్ని అచ్చేసింది. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
గ్రేటర్ ‘పవర్’ఫుల్..!
ఐటీ, అనుబంధ సంస్థల రాకతో నగరవాసుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద తేడా లేకుండా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, టీవీలు, వాటర్ హీటర్లు, ఐరన్ బాక్స్లు, మిక్సీలు, గీజర్లు సర్వ సాధారణమయ్యాయి. ఫలితంగా తలసరి కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2,261 యూనిట్లకు చేరడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జత చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. ఇక విద్యుత్ గృహోపకరణాల సంఖ్యా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవుతుండటంతో సిటీజనాలు ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్కు చేరుకుంది. రికార్డు స్థాయిలో డిమాండ్ రాష్ట్రం ఏర్పాటు సమయంలో గ్రేటర్ పీక్ సీజన్ డిమాండ్ 48 నుంచి 49 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా... ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 19న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 80 ఎంయూలు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 28న 71.09 ఎంయూల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఎనిమిది ఎంయూలకు పైగా వినియోగం నమోదు కావడం గమనార్హం. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం, ఆయిల్ లీకేజీల కారణంగా బస్తీల్లోని పలు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతుండటం, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు ఆయా సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. -
173 కేసుల్లో నిందితులు.. పోలీసులు పక్కా స్కెచ్.. చివరికి..
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడు మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 కిలోల కాపర్ కాయిల్స్, టాటా ఇండికా కారు, బజాజ్ పల్సర్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధి సీసీఎస్ క్రైం డీసీపీ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో నెల రోజుల పాటు శ్రమించి మూడు నాలుగు కమిషనరేట్లో పరిధిలో 173 కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడు మంది దొంగల గ్యాగ్ ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధానంగా ఈ ముఠా దొంగలించిన సొత్తు చిన్నది కావచ్చు కానీ ప్రభుత్వానికి, ప్రజలకు చాలా నష్టం చేకురుస్తుందని డీసీపీ తెలిపారు. ఏడుగురు నిందితులు చేసిన దొంగతనాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 60, సైబరాబాద్ పరిధిలో 7, వికారాబాద్లో 68,సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 22 మొత్తం ఈ ముఠా 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసినట్టు సీపీ వివరించారు. చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో.. ప్రధాన నిందితుడు సహదేవ్ హిజ్రా, అభిమన్యు రాజ్ బార్, నందులాల్ రాజ్ బార్, రాహుల్ రాజ్ బార్, రాంచందర్, కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్, తులుగు రమణ రెడ్డి, రాంజానీ జయశ్రీలను అరెస్ట్ చేయగా, రాహుల్ రాజ్ బార్, రాంచందర్ కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్ పరారీలో ఉనట్లు సీపీ తెలిపారు. నెల రోజులు కష్టపడి కేసును చేధించిన అధికారులను సీపీ అభినందించారు. -
ట్రాన్స్ఫార్మర్లపై పచ్చ మీడియా తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, నిల్వలపై ‘కేరాఫ్ కడప.. విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు’ శీర్షికతో అర్ధం లేని రాతలు, పొంతనలేని లెక్కలతో పచ్చి అబద్ధాలను ప్రచురించి పచ్చ పత్రిక అడ్డంగా దొరికిపోయింది. డిస్కమ్లపై బురద చల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది. తప్పుడు రాతల వెనుక వాస్తవాలను ‘ఏపీసీపీడీసీఎల్’ వెల్లడించింది. ఆరోపణ: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.145.86 కోట్ల విలువైన 88,88,203 ట్రాన్స్ఫార్మర్లు డిస్కమ్ పరిధిలోని వివిధ స్టోర్లలో ఉన్నాయి. వాస్తవం: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.10.77 కోట్లు విలువైన 633 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే ఉన్నాయి. ఆరోపణ: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.956.69 కోట్లతో 4,44,09,492 ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. వాస్తవం: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.358.97 కోట్లతో 32,728 ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఆరోపణ: 2022 డిసెంబర్ 31 నాటికి విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు స్టోర్స్లో రూ.385.38 కోట్ల విలువైన 1,22,61,706 ట్రాన్స్ ఫార్మర్లు నిల్వ ఉంచారు. వాస్తవం: గత డిసెంబర్ 31 నాటికి అన్ని స్టోర్స్లో కలిపి రూ.149.86 కోట్ల విలువైన 16,634 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఆరోపణ: ఏడాదిన్నరలోనే ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు చేయడం వెనుక భారీ వ్యూహం ఉంది. వాస్తవం: ప్రస్తుతం స్టోర్లలో నిల్వ ఉన్న 16,634 ట్రాన్స్ఫార్మర్ల నుంచి 13,361 ట్రాన్స్ఫార్మర్లను కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం, చోరీకి గురైన చోట్ల కొత్తవి ఏర్పాటు, రోలింగ్ స్టాక్ కోసం వినియోగించనున్నారు. వర్షాలతో పొలాల్లో నీరు చేరడం, కోతల సమయం కావడంతో ట్రాన్స్ఫార్మర్లు బిగించడానికి అవకాశం లేక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వేసవి చివరి కల్లా పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు నిల్వ చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వినియోగిస్తారు. ఆరోపణ: ఏబీవీ, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ లాంటి ప్రముఖ కంపెనీలు తక్కువకే ఇస్తుంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. వాస్తవం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కొనుగోళ్లు పూర్తిగా టెండర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. ఓ పత్రికలో పేర్కొన్న సంస్థలు టెండర్ల ప్రక్రియలో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.5 లక్షలకు, 33 కేవీ ట్రాన్స్ ఫార్మర్లను రూ.8.5 లక్షలకు కొనుగోలు చేయడం లేదు. -
డిస్క్ంకు ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధుల్లో లాగుతున్న వివిధ రకాల కేబుల్ వైర్లు (ఇంటర్నెట్, డిష్)విద్యుత్ స్తంభాలకు పెద్ద గుదిబండలా మారాయి. కోర్సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ స్తంభాలు వివిధ రకాల కేబుల్ వైర్లతో సాలెగూళ్లను తలపిస్తున్నాయి. ఒక విద్యుత్ స్తంభానికి మరో విద్యుత్ స్తంభానికి మధ్య మైనస్ (ఎర్త్), ప్లస్ (పవర్ సప్లయ్)తో పాటు త్రీ ఫేజ్ (ఎల్టీ) వైర్లు మాత్రమే ఉండాల్సిఉండగా 40 నుంచి 50 కేబుల్ వైర్లు వేలాడుతున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడుతున్నాయి. సాధారణంగా రెండు మూడు వైర్లు మాత్రమే ఉంటే చెట్ల బరువుకు తీగలు తెగి, నష్టం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించి కేబుళ్లు వేలాడుతున్నాయి. భారీ చెట్లు, కొమ్మలు విరిగి ఈ లైన్లపై పడ్డప్పుడు ఆ బరువుకు అటు ఇటుగా ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరుగుతున్నాయి. ఫలితంగా సంస్థకు భారీగా ఆరి్థక నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు పునరుద్ధరణకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 2,153 ఫీడర్లు ట్రిప్పవగా, 361 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో 31 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. జంక్షన్ బాక్సులు..గుట్టుగా కనెక్షన్లు విపత్తులను తట్టుకుని నిలబడాల్సిన విద్యుత్ స్తంభాలు కేబుళ్ల కారణంగా అడ్డంగా విరిగిపడుతున్నాయి. స్తంభాలు ఎవరైనా ఎక్కాలన్నా..వీధి చివరిలోని డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తాత్కాలికంగా బంద్ చేయాలన్నా డిస్కం అనుమతి తప్పని సరి. కానీ ఇంటర్నెట్, కేబుల్ సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఆయా స్తంభాలకు ఏర్పాటు చేసిన జంక్షన్ బాక్సులకు పోల్స్పై నుంచి గుట్టుగా సర్వీసు వైర్ను లాగి కరెంట్ను వాడుతున్నారు. యధేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాయి. గ్రేటర్లో ఈ తరహా కనెక్షన్లు 60 వేల వరకు ఉన్నట్లు అంచనా. విద్యుత్ చౌర్యం వల్ల సంస్థకు వస్తున్న ఈ నష్టాలను క్షేత్రస్థాయి సిబ్బంది లైన్లాస్ జాబితాలో వేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం. ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు విద్యుత్ స్తంభాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సిమెంట్, ఇసుక, ఐరన్ కూడా సరిగా వాడటం లేదు. పాతిన కొద్ది రోజులకే సగానికి విరిగిపోతున్నాయి. భూమిలో మీటరు లోతు వరకు పాతాల్సి ఉండగా, చాలా చోట్ల ఒకటి రెండు ఫీట్లకు మించి తవ్వడం లేదు. పట్టు కోసం చుట్టూ సిమెంట్ వాడక పోవడంతో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి నేలకూలుతున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పోల్పైకి ఎక్కే సమయంలో పట్టు దొరక్క కారి్మకులు కింద పడుతున్నారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో ఇద్దరు కారి్మకులు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్తంభాల చుట్టూ కేబుళ్లు భారీగా అల్లుకపోయి ఉండటంతో ఏ వైరు దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు. కార్మికులు పోల్పైకెక్కే సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ..కొంత మంది ఇళ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్లు పని చేస్తుండటం వల్ల ఆయా వైర్ల నుంచి పోల్పైకి కరెంట్ రివర్స్ సప్లయ్ జరిగి కార్మికులు విద్యుత్షాక్కు గురవుతున్నారు. (చదవండి: 19 డిపోలు లాభాలబాట) -
గ్రేటర్ వాసులను బెంబేలెత్తించిన వాన... ధ్వంసమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు
సాక్షి, హైదరాబాద్: భారీ ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలు గ్రేటర్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున గాలివానతో అనేక చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగ్లు విరిగి లైన్లపై పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 400పైగా 11 కేవీ ఫీడర్లు, 80కిపైగా 33 కేవీ ఫీడర్లు ట్రిప్పవగా, 60పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో నాలుగు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. మరికొన్ని చోట్ల రాత్రి అంధకారం తప్పలేదు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు కరెంట్ లేకపోవడంతో ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్ట్లు, మంచినీటి సరఫరా మోటార్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో 1912 కాల్ సెంటర్ మూగబోగా, కొంతమంది లైన్మెన్లు, ఇంజినీర్లు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. 850 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్ డిమాండ్ గ్రేటర్ జిల్లాల్లో చాలా వరకు ఓవర్హెడ్ లైన్లే. ఈ లైన్ల కిందే చెట్టు నాటుతుండటం, అవిపెరిగి పెద్దవై ఈదురుగా లులకు విరిగి పడుతుండటంతో తెగిపడుతున్నాయి. ప్రధాన వీధులు సహా శివారు ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు విద్యుత్ లైన్లను ఆనుకుంటున్నాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు చిరిగి గాలికి ఎగిరి లైన్ల మధ్య చిక్కుకుంటున్నాయి. ఒకదానికొకటి ఆనుకోవడంతో షార్ట్సర్క్యూట్ తలెత్తి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సివ చ్చింది. వర్షం వెలియగానే కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరించిన్పటికీ.. చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఆరేడు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఆ సర్కిళ్లలోనే ఎక్కువ నష్టం ఈదురు గాలితో కూడిన వర్షానికి సరూర్నగర్, మేడ్చల్, సికింద్రాబాద్, హబ్సీగూడ సర్కిళ్ల పరిధిలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు డిస్కం ఇంజినీర్లు గుర్తించారు. ఎల్బీనగర్, నాగోలు, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, బీఎన్రెడ్డి, పసుమాముల, తుర్కయాంజాల్ పరిసర ప్రాంతాల్లోనే 37 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు గుర్తించారు. చెట్ల కొమ్మలు, హోర్డింగ్లు ఎక్కువ ఉన్న కంటోన్మెంట్, బోయిన్పల్లి, ప్యారడైజ్, సైఫాబాద్, మెహిదీపట్నం, చార్మినార్, కాచిగూడ, ఆస్మాన్గడ్, ఓల్డ్మలక్పేట్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, మీర్పేట్, బాలానగర్, ఉప్పల్, బోడుప్పల్, చర్లపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఐదు 33 కేవీ, పదిహేను 11 కేవీ, 37 ఎల్టీ పోల్స్ నేలకూలాయి. అంతేకాదు సైబర్సిటీ సర్కిల్లో 11 ఫీడర్లు ట్రిప్పవగా, హబ్సీగూడలో 35 ఫీడర్లు, మేడ్చల్లో 35, రాజేంద్రనగర్లో 18, సరూర్నగర్లో 21, సికింద్రాబాద్లో 17, హైదరాబాద్ సౌత్లో 14, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో 12, బంజారాహిల్స్లో ఐదు ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. -
మీటర్లు పెట్టాలని ఆదేశించలేదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ఈఆర్సీ ఆదేశించిందని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను కచ్చితంగా తెలుసుకోవడానికి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశించామన్నారు. ఈఆర్సీ సభ్యులు ఎండీ మనోహర్రాజు, బండారు కృష్ణయ్యతో కలసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి రఘునందన్రావు ఆరోపణలను ఖండించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించాలని జారీ చేసిన ఆదేశాలను రఘునందన్రావుకు పంపానని, అయినా మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థ ఈఆర్సీకి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. మహారాష్ట్రలోని ఒక విద్యుత్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి కచ్చితమైన వినియోగంపై అధ్యయనం చేశారని, రూ.36 కోట్ల విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు అదనంగా పొందాయని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. తెలంగాణ సైతం ఇలాంటి ప్రయోగం చేయాలన్న ఆలోచన ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. త్వరలో జిల్లాలకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ వినియోగదారులకు హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకోవడానికి విద్యుత్ రెగ్యులేటరీ కమి షన్ అన్ని జిల్లాల్లో పర్యటించనుందని శ్రీరంగారావు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం కామారెడ్డి జిల్లాలో, మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనుందన్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా కన్జ్యూమర్ గ్రివెన్స్ రిడ్రస్సల్ ఫోరంకు పంపవచ్చని, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ఈఆర్సీని ఆశ్రయించవచ్చని సూచించారు. -
ఒక తొండ.. 4 గంటలు కరెంట్ కట్!
సాక్షి, డోర్నకల్: ఓ తొండ గురువారం అర్ధరాత్రి విద్యుత్ సిబ్బందికి చుక్కలు చూపించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8.15 గంటల నుంచి 12.05 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనికితోడు వర్షం పడటం, విపరీతంగా దోమలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు విద్యుత్ సరఫరా అంతరాయానికి కారణమేమిటని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు. సబ్స్టేషన్లో ఎలాంటి సమస్య లేకపోవడంతో ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, ఇతర ఇబ్బంది సబ్ స్టేషన్ నుంచి రైల్వే ట్రాక్ వరకు 11 కేవీ లైన్కు సంబంధించి సుమారు 30 స్తంభాలపైకి ఎక్కి పరిశీలించారు. చివరకు రైల్వే ట్రాక్ సమీప స్తంభంపైన ఉన్న కండక్టర్ ఇన్సులేటర్ మీద తొండ పడి చనిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు గుర్తించారు. వెంటనే తొండను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చదవండి: మహబూబ్నగర్ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం -
ట్రాన్స్ఫార్మర్లు ఇక చల్లగా..!
సాక్షి, అమరావతి: వేసవిలో నిరంతరాయంగా విద్యుత్ను అందించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని రెండేళ్లుగా గణనీయంగా పెంచింది. సాధారణంగా వేసవిలో ట్రాన్స్ఫార్మర్లపై అత్యధిక లోడ్ పడుతుంది. దీంతో అవి తేలికగా వేడెక్కి, కాలిపోవడమో లేదా ట్రిప్ అయి ఆగిపోవడమో జరుగుతుంటాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వాస్తవ లోడ్ను క్షేత్రస్థాయి సిబ్బంది ముందే అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే వేడిని తగ్గించేందుకు కొద్దిసేపు కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సాధారణంగా ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటినప్పుడు ట్రాన్స్ఫార్మర్లలో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్కో ట్రాన్స్ఫార్మర్లలో లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉండే ఫ్యాన్లు ఆన్ అయ్యి వాటిని కూల్ చేస్తాయి. వినియోగదారులకు అందించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మజనార్థన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం లోడ్ను కంట్రోల్ చేయడం ద్వారానే వేడిని అదుపు చేస్తున్నామని చెప్పారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఎక్కువ లోడ్ ఉండే ప్రాంతాలను గుర్తించి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ఆయిల్ మార్పిడి వేసవి ముందే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ల స్థితిని అంచనా వేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ముందే ఆయిల్ మార్పు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని చెప్పారు. తరచూ చెడిపోతున్న, కాలిపోయే వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
పంపుసెట్లకు మీటర్లపై కేంద్రం యూటర్న్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలన్న షరతుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ మీటర్లకు కాకుండా దశల వారీగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు (డీటీ) అన్నింటికీ మీటర్లు బిగించాలని తాజాగా స్పష్టం చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. దీంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని ట్రాన్స్కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అన్ని కేటగిరీలు కలుపుకొని మొత్తం 1.6 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 25 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో వీటికి సరఫరా చేస్తున్న విద్యుత్కు స్పష్టమైన లెక్కలు లేవు. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్లో 32–35 శాతం వరకు వ్యవసాయానికి సరఫరా అవుతోందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.5,940 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా కోసం రూ.4,060 కోట్లు కలిపి డిస్కంలకు రూ.10 వేల కోట్ల సబ్సిడీలను ప్రస్తుత ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేటీకరణ దిశగా.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేంద్రం.. సంబంధిత విద్యుత్ సవరణ బిల్లు–2021ను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే వ్యవసాయం సహా ప్రతి వినియోగదారుడు వాడే విద్యుత్కు కచ్చితమైన లెక్కలు తీసి సంబంధిత ప్రభుత్వ డిస్కంలు/ ప్రైవేటు కంపెనీలు బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రకటించిన ఆత్మ నిర్భర్ రుణాలకు అర్హత సాధించాలంటే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని అప్పట్లో కేంద్రం షరతులు విధించింది. తెలంగాణ డిస్కంలకు రూ.12,600 కోట్ల రుణాల్లో తొలి విడతగా రూ.6,300 కోట్లను గతేడాది జూలైలో విడుదల చేయగా, రెండో విడతగా చెల్లించాల్సిన రూ.6,300 కోట్ల రుణాలను ఈ షరతులకు అంగీకరించకపోవడంతో కేంద్రం నిలుపుదల చేసింది. తాజాగా కేంద్రం వెనక్కి తగ్గి వ్యవసాయ కనెక్షన్లకు బదులు రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించాలని స్పష్టతనిచ్చింది. దీంతో త్వరలో రాష్ట్ర డిస్కంలకు రావాల్సిన రెండో విడత రుణాలు విడుదల కావొచ్చని ట్రాన్స్కో అధికారవర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. సీఎం పరిశీలనలో ప్రతిపాదనలు.. రాష్ట్రంలో 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కేంద్రం సూచన మేరకు వీటికి మీటర్లు బిగించే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. త్వరలో వీటిపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దశల వారీగా ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు సానుకూలతతో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తే దారి పరిధిలోని వినియోగదారులు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్కు సంబంధించిన గణాంకాలు లభిస్తాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎంత విద్యుత్ సరఫరా అవుతోంది? అందులో ఎంత మేర విద్యుత్కు బిల్లింగ్ జరుగుతోంది? ఎంత మేరకు విద్యుత్ నష్టం/ చౌర్యం అవుతోంది? వంటి కీలక సమాచారం దొరుకుతుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవసాయ కనెక్షన్లకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటికి మీటర్లు బిగిస్తే వీటి పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్ గణాంకాలు తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వ్యవసాయానికి ఏ మేరకు విద్యుత్ సరఫరా అవుతుందో, ఆ మేరకు విద్యుత్ రాయితీలను రా>ష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించడానికి ఈ లెక్కలు ఉపయోగపడనున్నాయి. పూర్తి స్థాయిలో సబ్సిడీలు వస్తే డిస్కంలు నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోని 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడానికి రూ.1,600 కోట్ల వ్యయం కానుందని ట్రాన్స్కో అంచనా వేసింది. ఒక్కో మీటర్కు రూ.2 వేలు వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. మీటర్ల ఖర్చులో కొంత భాగాన్ని కేంద్రం భరించే అవకాశాలున్నాయి. -
ఒకే కాంట్రాక్టర్కు 4,769 పనులు!
►మెదక్ జిల్లా తూప్రాన్లోని 2 ట్రాన్స్ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్కు చెల్లించారు. ►మహబూబ్నగర్ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్కు రూ. 71,750 చెల్లించారు. ►సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్కు రూ. 82,360 చెల్లించారు. ►పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్కు రూ. 84,840 చెల్లించారు. ►నామినేషన్ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్బుక్ లైవ్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏడీఈ) కోటేశ్వర్రావు బహిర్గతం చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ ఏడీఈగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్ నిర్వహించి టీఎస్ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్ చేయడంతో ఇది ఫేస్బుక్లో వైరల్గా మారింది. యాజమాన్యం అండదండలతోనే... వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్ ఎలక్ట్రికల్స్ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్రావు బయటపెట్టారు. ఎస్ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు. రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్ ఒకే డివిజన్ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రబ్యూషన్ బడ్జెట్ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 700 శాతం వరకు రేట్ల పెంపు... కోటేశ్వర్రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో కేసు... టీఎస్ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, కొత్తపల్లి : ఏళ్లనాటి విద్యుత్ సమస్యలకు ఇప్పుడిప్పుడే మోక్షం లభిస్తోంది. ప్రత్యేక నిధుల్లేక ప్రస్తుతం ఉన్న పనులకే మరమ్మతులు చేస్తుండగా.. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యలకు చెక్ పడుతోంది. విద్యుత్ స్తంభాలు కావాలని, విద్యుత్ లైన్లు వేలాడుతున్నాయని, విద్యుత్ స్తంభాలు వంగాయని, లో ఓల్టేజీ వస్తోందని, మీటర్లు అమర్చాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తరచూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలకు ‘పవర్ వీక్’ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు సమస్యలపై నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మూడు నెలల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశాలిచ్చారు. ఇదిలా కొనసాగుతుండగానే గ్రామాల్లో ఈ నెల 6 నుంచి చేపట్టన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ సమస్యలనూ అధికారులు గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగుతున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేర విద్యుత్ ప్రమాదాలకు చెక్ పడనుంది. ప్రత్యేక నిధుల్లేక కొత్త పనులకు బ్రేక్.. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కొత్త స్తంభాలు, కొత్త లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ డిమాండ్ను బట్టి విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం కొత్త పనుల జోలికి అధికారులు వెళ్లడం లేదు. స్థానికంగా పరిష్కారమయ్యే పనులనే ప్రస్తుతం చేపడుతూ కొంతమేర విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుకానుంది. అనేక గ్రామాల్లో వంగిన స్తంభాలు, వేలాడుతున్న వైర్లు, మధ్య స్తంభాలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ లేని ట్రాన్స్ఫార్మర్లు, తుప్పు పట్టిన ఇనుప స్తంభాలు తదితర సమస్యలను అధికారులు గుర్తించారు. తుప్పు పట్టిన స్తంభాలను మాత్రమే తొలగించనున్నారు. ఇనుప స్తంభాలు బాగుంటే వాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మెటీరియల్ కొరత.. విద్యుత్ మెటీరియల్ లేక పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. విద్యుత్ స్తంభాల కొరత, కాసారాలు, కండక్టర్లు, హెడ్జ్ ఫ్యూజుల కేబుళ్లు అందుబాటులో లేక పనులు ఆలస్యం అవుతున్నాయి. విద్యుత్ సమస్యలకు అనుగుణంగా ప్రభుత్వం మెటీరియల్ను సరఫరా చేస్తే గ్రామాల్లో త్వరలోనే విద్యుత్ సమస్యలు తొలగిపోనున్నాయి. విద్యుత్ బకాయిలపై ప్రత్యేక దృష్టి పనిలో పనిగా విద్యుత్ బకాయిలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరమ్మతు పనులు చేపడుతూనే.. బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను ఇకపై తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలే విద్యుత్ బకాయిలు చెల్లిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన దరిమిలా విద్యుత్ అధికారులు బకాయిలపై దృష్టి సారించారు. స్థానికంగానే బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ఒత్తిడి తీసుకురానున్నారు. కరీంనగర్ జిల్లాలోని 324 గ్రామ పంచాయతీల్లో రూ.1.66 కోట్ల బకాయి డిమాండ్ను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లేనిపక్షంలో సంస్థ మనుగడకే ప్రమాదముందన్న ఆలోచనతో అధికారులు ముందుకు సాగనున్నారు. గ్రామ పంచాయతీలు : 324 విద్యుత్ పనులు పూర్తయిన గ్రామాలు : 30 పనులు ప్రారంభించిన గ్రామాలు : 124 గుర్తించిన లూజ్ వైర్లు : 2,466 కిలోమీటర్లు సరిచేసిన లూజ్ వైర్లు : 1430 కిలోమీటర్లు వంగిన స్తంభాలు : 1228 సరిచేసిన స్తంభాలు : 493 అవసరమైన మధ్య స్తంభాలు : 3899 వేసిన మధ్య స్తంభాలు : 1142 గుర్తించిన ఇనుప స్తంభాలు : 1548 వేసిన ఇనుప స్తంభాలు : 359 ఏబీ కేబుల్ వైర్లు : 307 కిలోమీటర్లు వేసిన కేబుల్ వైర్లు : 55 కిలోమీటర్లు గుర్తించిన థర్డ్ వైరు : 269 కిలోమీటర్లు వేసిన థర్డ్ వైరు : 113 కిలోమీటర్లు గుర్తించిన ఫిఫ్త్ వైరు : 35 కిలోమీటర్లు వేసిన ఫిఫ్త్ వైరు : 3.5 కిలోమీటర్లు -
దొంగే కాదు.. రేపిస్ట్ కూడా..!
పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం అందులోని రాగి వైరు చోరీ చేసే ఆరుగురు ముఠా.. ఇళ్లల్లో దొంగతనాలు చేయడమే కాదు; ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు దోచుకుంటున్న ఇద్దరు తమిళనాడు దొంగలను చిత్తూరు సబ్డివి జన్ పోలీసులు పట్టుకున్నారు. సోమల ఉదంతం నేపథ్యంలో 32 నాటు తుపాకులను సైతం స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు అర్బన్: ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం వెల్లడించిన వివరాలు..ఐరాల, తవణంపల్లె, కాణిపాకం, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో రెండేళ్ల కాలంలో పలు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగివైరును దొంగలు అపహరించారు. రైతులకు కంటికి కునుకు లేకుండా చేశారు. వీరి దెబ్బకు ఆయా ప్రాంతాల రైతులు చేతికందే పంటలు కూడా నష్టపోయారు. బాధితుల ఫిర్యాదుపై డీఎస్పీ సుబ్బారావు పర్యవేక్షణలో చిత్తూరు పశ్చిమ పోలీసులు ఎట్టకేలకు దొంగల భరతం పట్టారు. ఎస్ఐలు ప్రసాదరావు, కృష్ణమోహన్, ఉమామహేశ్వర్ సిబ్బందితో ఓ ప్రత్యేక బృందం సభ్యులు ఆరుగురు ముఠాతో కూడిన ట్రాన్స్ఫార్మర్ల దొంగలను అరెస్ట్ చేశారు. పూతలపట్టు మండలం ఆండ్రవారిపల్లెకు చెందిన రాజబాబు, నవీన్, పెనుమూరు మండలం రాజాఇండ్లుకు చెందిన చిన్నబ్బ, పెద్దబ్బ, బాబు, సురేష్ను అరెస్టు చేసి వీరినుంచి 250 కిలోల బరువున్న రాగి, అల్యూమినియం, మోటారు కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాటు తుపాకులు సీజ్ ఇటీవల సోమల మండలంలో పోలీసులు తమను చూపి పారిపోతున్న కారును వెంబడించి పట్టుకోవడం, అందులో రెండు నాటుతుపాకులు లభ్యం కావడంతో ఉలిక్కిపడ్డారు. దీంతో అక్రమ ఆయుధాలపై పోలీసులు దృష్టి సారించారు. చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐలు విక్రం, మనోహర్, ఉమామహేశ్వర్ సిబ్బందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం మంగళవారం గుడిపాల, చిత్తపార అడవుల్లో పది నాటు తుపాకులు, యాదమరి, భూమిరెడ్డిపల్లె, నంజర్ల ప్రాజెక్టు సమీపంలో 12 తుపాకులు, తవణంపల్లె, ఉప్పరపల్లె, ఎర్రకొండ అడవుల్లో పది నాటు తుపాకులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. కాగా ఈ కేసుల ఛేదనలో కృషి చేసిన ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ సుబ్బారావు, సీఐ ఆదినారాయణ, హరినాథ్ తదితరులను ఎస్పీ అభినందించారు. సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. దొంగే కాదు.. రేపిస్ట్ కూడా..! ♦ పోలీసుల కన్నుగప్పి తిరుగుతూ చోరీలు చేస్తున్న తమిళనాడు వాసులు ♦ గత నెల 19న పులిచెర్ల మండలంలోని కల్లూరులో మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు తొలగించి రూ.48 వేల నగదు చోరీ చేశారు. ♦ 20న గుడిపాల మండలంలోని పేయనపల్లెలో వెన్నెల అనే మహిళ ఊరికి వెళ్లగా, ఆమె ఇంట్లోకి దొంగలు పడ్డారు. రూ.36 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. అదే రోజు గుడిపాలలోని చీలాపల్లెలో వెంకటేష్ ఇంటి తలుపులు పగులగొట్టి రూ.20 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. ♦ గతనెల 21న వైఎస్ గేటు వద్ద చాముండేశ్వరమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు తాళిబొట్టు, హుండీ పగులగొట్టి అందులోని నగదును చోరీ చేశారు. ♦ 24న పాకాల మండలం మొగరాల పంచాయతీకి చెందిన రామ్మూర్తి ఇంటిని పగులగొట్టిన రూ.60 వేలు విలువ చేసే బంగారుచైన్ దొంగతనం చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పాకాల పోలీసులు తమిళనాడులోని వాలాజకు చెందిన బాలాజి అలియాస్ వెంకటేష్ (38), వేలూరు జిల్లా కందిపేటకు చెందిన శివం (29)ను అరెస్టు చేసి, రూ.1.75 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను పాకాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన వెంకటేష్ తమిళనాడులో ఇద్దరు మహిళల్ని రేప్ చేశాడని, అక్కడ ఇతనిపై పీడీ యాక్టు సైతం ప్రయోగించేందుకు ప్రతిపాదనలున్నాయి. ఓ కేసులో అక్కడి పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నట్లు పాకాల పోలీసులు దర్యాప్తులో తేలింది. -
ట్రాన్స్ఫార్మర్ల మాఫియా!
అయ్యా... చేను చేసుకుందామనుకుంటున్నా.. నీళ్లకు ఇబ్బంది అయ్యింది.. బోరులో బాగానే నీళ్లు పడ్డాయి కానీ ట్రాన్స్ఫార్మర్ లేదయ్యా... అదేదో డీడీలు కట్టాలంట కదా కడుదునా... ఆ ఏం డీడీలు రా... ఇప్పుడు కడితే ఎప్పుడు వస్తుందో ఏమో... అప్పట్లోగా నీ పంట ఎండిపోతది.. మరెట్ల అయ్యా... ఏమి లేదు ఎట్లోలాగా నేను తెప్పిస్తాను, కొంత ఖర్చు అయితది... తెచ్చిన తర్వాత ఎట్లయినా సరే కరెంటోళ్లకు చెప్పి అధికారికంగా చేయిద్దాం.. – ఇది ఐదేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ల మాఫియా ఆడుతున్న ఆట. ఒక్కోటి రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వెచ్చించి తెచ్చిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అనేది మాఫియాకు సంబంధం లేదు. దీంతో రైతుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా తయారైంది. సాక్షి, గద్వాల/ గద్వాల అర్బన్: రైతుల అవసరం.. ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం వెరసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాకు అదనుగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లు తెప్పించి రైతులకు కట్టబెడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు మాత్రం కనెక్షన్కు, చెడిపోతే మరమ్మతు చేయించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొం ది. అధికారులకు తెలియకుండా విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం అసాధ్యం. ఒకవేళ ఏదైనా రిపేరు వస్తే అంతే సంగతులు.. కాస్తా కూస్తో అవగాహన ఉన్న మరికొందరు రైతులు గత్యంతరం లేక కర్నూలులోని ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతు చేయించుకుంటున్నారు. జిల్లాలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులతోపాటు ఏడు రిజర్వాయర్లు చేపట్టారు. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో ఐదేళ్లుగా పంటల విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు మండలాల్లో వేలాది ఎకరాలు వరి, వేరుశనగ, పత్తి, మిరప, పండ్లతోటల సాగు చేస్తున్నారు. కాల్వలు, బోర్ల కింద పంటలు సాగు చేసుకునేందుకు విద్యుత్ అవసరం ఉంటుంది. ఇదే అదనుగా రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకుని మాఫియా తెరపైకి వచ్చింది. ఇతర జిల్లాల నుంచి తక్కువ ధర, నాణ్యత లేని ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి మూడు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నారు. అయితే డబ్బులు పోయినా పంట కాపాడుకుందామనే సంతోషం రైతుల్లో లేకుండాపోయింది. వేల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చేందుకు అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావడం, ఒకవేళ ఎలాగో ఇప్పించినా అవి పనిచేయకపోవడం, మరమ్మతుకు మళ్లీ వేల రూపాయలు ధారపోయడం రైతులకు పరిపాటిగా మారింది. అంతేకాదు తనతో కాకుండా ఇతరుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు అంశాలు వెలుగు చూశాయి. నలుగురు వ్యక్తులతో కూడిన ఈ మాఫియా ఇప్పటికే కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం. గట్టు మండలం రాయపురంలో రైతులకు ప్రైవేట్ వ్యక్తులు అంటగట్టిన పనిచేయని ట్రాన్స్ఫార్మర్..., మల్దకల్ మండలం దాసరిపల్లిలో అధికారులు గుర్తించిన అనధికారిక ట్రాన్స్ఫార్మర్ ఇదే.. 25కేవీ ట్రాన్స్ఫార్మర్ తప్పనిసరి వ్యవసాయ రంగంలో ప్రతి 20ఎకరాలకు ఒక 25కేవీట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటుంది. సాధారణంగా డీడీ రూ.ఐదు వేలు ఉండగా ముగ్గురు, నలుగురు రైతులు కలసి దీనికోసం ఆన్లైన్లో నమోదు చేసుకుని ట్రాన్స్కో అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ మంజూరవుతుంది. అనంతరం నాలుగు డీడీలు రూ.20వేల కలిపి 25కేవీ ట్రాన్స్ఫార్మర్తోపాటు విద్యుత్ వైర్లు ఏబీ స్విచ్, ఏజ్ ఫ్యూజ్ సెట్, ఎల్టీ ప్యూజ్ సెట్, హెచ్టీ లైన్, ఎల్టీ లైన్తోపాటు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె కోసం సుమారు రూ.30వేల వరకు వెచ్చించాల్సిందే. అయితే డీడీ తీసిన తర్వాతా ఏళ్లతరబడి దానికోసం రైతులు ఎదురుచూడాల్సిందే. తప్పని పరిస్థితుల్లో చేనును కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా మాఫియా 25కేవీ ట్రాన్స్ఫార్మర్ను రూ.50వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నారు. వైర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులు సరేసరి. నిబంధనల ప్రకారం దీనిని రూ.20వేలకే ఇవ్వాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి.. సుమారు ఐదేళ్ల క్రితం బిజ్వారానికి చెందిన ఒకరు, ఇద్దరు సీడ్ ఆర్గనైజర్లు, ధరూరు మండలంలోని మరో వ్యక్తి కలసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాగా ఏర్పడ్డారు. వీరి వద్ద మరికొందరు పని చేస్తుంటారు. వీరు ఇతర జిల్లాల్లో నాణ్యత లేనివి, తక్కువ ధరకు లభించేవి, సక్రమంగా పనిచేయని ట్రాన్స్ఫార్మర్లను జిల్లాలోకి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సమాచారం. మల్దకల్ మండలంలోని దాసరపల్లి, బిజ్వారం, మల్లెందొడ్డి, ధరూరు మండలంలోని మార్లబీడులో సుమారు 80అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇలాంటి 200 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఇక తమ వద్దే, చెప్పిన ధరకే కొనుగోలు చేయాలి, ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే అనుచరులతో అధికారులకు వారే సమాచారం ఇప్పిస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంతోపాటు తెలంగాణలోని సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్ల తెప్పిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మంజూరు చేస్తే ట్రాన్స్ఫార్మర్కు దాని సామర్థ్యం, కంపెనీ పేరు, ఉత్పత్తి చేసిన సంవత్సరం తదితర వివరాలు ఉంటాయి. కానీ మాఫియా సరఫరా చేసే దానిని అవేవి ఉండవు. బయట చెబితే అంతే సంగతులు అనధికారిక ట్రాన్స్ఫార్మర్లతో పడుతున్న ఇబ్బందులు రైతులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు భయపడుతున్నారు. ‘సార్... మా వద్దకు వచ్చినట్లు తెలిస్తే కూడా ఇబ్బందే.. మేమేమీ చెప్పలేం..’ అంటూ ముఖం చాటేసి వెళ్తున్నారు. దీనిని బట్టే చూస్తే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మల్దకల్ మండలం దాసరిపల్లిలో నలుగురు రైతులు కలసి ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేయగా ఇటీవల అధికారులు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని ఎవరి వద్ద కొనుగోలు చేశారో అతనికే మళ్లీ తిరిగి ఇవ్వాలని బాధిత రైతులు అతడిని ఆశ్రయిస్తే నెల రోజుల వ్యవధిలోనే రూ.పది వేలు తగ్గించి తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అసలు ఎలాంటి కనెక్షన్ ఇవ్వక ముందే తిరిగి తీసుకోవడానికి ఇలా డిమాండ్ చేస్తున్నారంటే వారు రైతులను ముంచి ఎంత సంపాదిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే గట్టు మండలంలోని రాయపురానికి చెందిన కొందరు రైతులు ఇటీవలే ఓ వ్యక్తి నుంచి రూ.45వేలకు ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేశారు. తీరా తెచ్చుకున్న తర్వాతా పనిచేయకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చేందుకు యత్నించగా తీసుకోవడానికి ఇష్టపడనట్టు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్ల సమస్య ఏదైనా ఉత్పన్నమైతే రైతులు, వినియోగదారులు సంబంధిత లైన్మన్, ఏఈలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురైతే జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్ మరమ్మతు కేంద్రాలకు తరలిస్తే ఉచితంగా చేస్తారు. అలాగే విద్యుత్ సమస్య ఏర్పడితే లైన్మన్, సంబంధిత అధికారులు వచ్చి సరిచేస్తారు. అయితే అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు కావడంతో రైతులు మరమ్మతుకు కర్నూలుకు తీసుకెళుతున్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడితే సొంతంగా చేసుకుంటున్నారు. దీంతో కొంత అవగాహన లేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో జరిగే ప్రమాదాల్లో సుమారు 50శాతం అనధికార ట్రాన్స్ఫార్మర్ల వద్దే చోటు చేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీçసుకుంటాం 24గంటల విద్యుత్ సరఫరా నిమిత్తం ఆటోస్టార్టర్ల తొలగింపునకు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పర్యటిస్తుంటే ఈ అనధికారిక ట్రాన్స్ఫార్మర్ల బాగోతం బయట పడింది. ఇవి మల్దకల్, ధరూరు, గద్వాల మండలాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. అయితే రైతులు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్య తీసుకుంటాం. రైతులు డీడీలు కడితే త్వరలోనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తాం. ట్రాన్స్ఫార్మర్లు ప్రైవేట్గా కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. – సీహెచ్ చక్రపాణి, ట్రాన్స్కో ఎస్ఈ, గద్వాల వరి చేను ఎండుతుందని.. నలుగురు రైతులం కలసి మూడు బోర్ల కింద వరినాటు వేశాం. ప్రస్తుతం కాల్వ నీళ్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని రూ.40వేలు వెచ్చించి మార్లబీడులోని ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ కొన్నాం. అయితే కొన్న తర్వాత తెలిసింది ఇది అనధికారిక ట్రాన్స్ఫార్మర్ అని. గ్రామంలో గిట్టని వారు కొందరు ట్రాన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి పరిశీలించారు. వారి సూచన మేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు తీసి ఇవ్వగా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. అది రాకపోతే పంట ఎండిపోతది. రెంటికీ చెడ్డ రేవడిలా మా పరిస్థితి తయారైంది. – నర్సింహులు, దాసరిపల్లి, మల్దకల్ మండలం తప్పని పరిస్థితుల్లోనే.. ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు కట్టి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. ఆలస్యమవుతుందని పం టను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రైవేటు వ్యక్తులతో చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను రూ.25వేలకు కొనుగోలు చేశాను. రిపేరు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులకు మరో రూ.50వేల దాకా వెచ్చించాను. మరమ్మతు చేయించుకోవాలంటే కర్నూలుకు తీసుకుపోవాల్సి వస్తుంది. దీనినే రెగ్యులరైజ్ చేస్తామనడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. – చింత కిష్టన్న, అమరవాయి, మల్దకల్ మండలం -
డేంజర్ పవర్ !
►ప్రాణసంకటంగా విద్యుత్ లైన్లు ►మనుషులకే కాదు పశువులకూ ప్రమాద భరితం ►ఏళ్ల తరబడి మార్చని కండక్టర్లు ►కొత్త కండక్టర్ మార్చినట్లు కాగితాలకే పరిమితం ►పెచ్చుమీరుతున్న సిబ్బంది, అధికారుల అవినీతి ►సిబ్బంది కొరతతో అవస్థలు ►ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకపోవటంతో భీతిల్లుతున్న ప్రజలు కాస్తంత గాలి వీచినా..చిన్నపాటి వర్షం కురిసినా నేలవాలే విద్యుత్ స్తంభాలు.. చేతికందే ఎత్తులో వేలాడే తీగలు.. పసిపిల్లలకు కూడా అందేంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు.. రక్షణ లేని ఫీజు కారియర్లు అడుగడుగునా మృత్యు పాశాలై ప్రజలకు ప్రాణసంకటాలుగా మారాయి. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లపై సాక్షి నెట్వర్క్ కథనం. ఒంగోలు సబర్బన్: విద్యుత్ కనపడదు...అయితేనేమి సరఫరా ఉన్న తీగ తగిలితే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిందే. విద్యుత్ వైర్లు రెండు తగిలినా...కొమ్మలు రాసుకున్నా...లేక వరిగడ్డిలాంటివి వైర్లకు తగిలినా అగ్గిరాజుకుంటుంది. విద్యుత్ సిబ్బంది, అధికారులకు విద్యుత్ ప్రభావం ఏంటో బాగా తెలుసు. కానీ అవినీతి రొచ్చులో పొర్లుతూ నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నా విద్యుత్ లైన్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మనుషులకే కాదు మే నెలలోనే తరగుతులు ప్రారంభించి సెప్టెంబర్లోగా సిలబస్ పూర్తి చేస్తున్నాయి. ఆ తర్వాత మూడు, నాలుగు సార్లు తిరిగి బోధిస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం జూలై నెల పూర్తి కావస్తున్నా అధ్యాపకులు నియామకంపై ఉత్తర్వులు ఇవ్వలేదు. జూనియర్ కళాశాలలు తెరచి రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఇటీవలే ఆ మూడు నెలల వేతనాన్ని విడుదల చేసింది. ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసిపోగా జూన్ వరకు ఎలాంటి వేతనాలు లేవు. ఆ సమయంలో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క వారి కుటుంబాల ఆకలితో అలమటించాయి. జిల్లాలో 30 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో శాశ్వత ప్రాతిపదికన కేవలం 107 మంది అధ్యాపకులుండగా 241 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి సుమారు 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మద్దిపాడు జూనియర్ కళాశాలలో అందరూ రెగ్యులర్ అధ్యాపకులే ఉండగా అక్కడ విద్యార్థుల సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంది. అదే విధంగా దొనకొండ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన అధ్యాపకులందరూ కాంట్రాక్ట్ వారే. గతేడాది పని చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు సాధారణంగానే ఈ ఏడాది కూడా కొనసాగేలా జూన్ మొదటి వారంలోనే బాండ్లు తీసుకుంటారు. కానీ జూలై ఆఖరికి కూడా రెన్యువల్ జీవో విడుదల కాలేదు. మొదటి నెల వేతనం ఇంకా వారి ఖాతాలో పడలేదు. ఉద్యోగ భద్రత లేక, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా, మానసికంగా ఆవేదన చెందుతున్నారు. జూన్ నెలలో తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఫీజులు, పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలన్న నిబంధన అమలు కావడం లేదు. గతేడాది వరకు నెలకు రూ.18 వేలు వేతనం అమలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు రూ.37 వేలు వేతనం అందిస్తోంది. ఇతర ప్రయోజనాలనూ కల్పిస్తోంది. ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని జూనియర్ లెక్చరర్ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే వేతనం కూడా మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి ఇస్తున్నారు. మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడంతో జీతం లేని సెలవులు పెట్టుకోవాల్సి వస్తోంది. కుంటుపడుతున్న చదువులు ప్రభుత్వ కళాశాలల్లో ప్రధాన బోధకులు కాంట్రాక్ట్ అధ్యాపకులే కావడం, వారికి రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. వీరికి బయోమెట్రిక్ హాజరు విధానం లేదు. వచ్చే నెల నుంచి అధ్యాపకులకు, పిల్లలకు బయోమెట్రిక్ విధానం వస్తుందని అధికారులు చెప్తున్నారు. రెన్యువల్ విషయంపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అధ్యాపకులు ఉంటారా.. ఉండరా అనే అనుమానం విద్యార్థుల్లో కూడా వ్యక్తమవుతోంది. రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో బోధన కుంటుపడుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ జరగని అధ్యాపకులు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు గెస్ట్లుగా తరగతులు బోధించడం, ఇతరత్రా పనుల్లో ఉంటున్నారు. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకపోగా సమస్యలను కూడా తీర్చడం లేదు. -
పట్టణాలకు వెలుగులు
మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.200 కోట్లతో పనులు 33 నగరాలు, పట్టణాల్లో కొత్త సబ్స్టేషన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు కేంద్రం సాయంతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు వరంగల్ : దేశంలోని ప్రతీ ఇంటికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు భారీగా మేలు జరగనుంది. ప్రతీ నగరం, పట్టణంలో అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా కోసం మెరుగైన ఏర్పాట్లను ఈ పథకం ద్వారా చేపడుతారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రతీ కాలనీలో విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలా కేంద్రప్రభుత్వ పథకం ద్వారా డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ ఇంటికి విద్యుత్ దేశంలోని ప్రతీ ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ విద్యుదీకరణ ప్రాజెక్టును అమలు చేస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతీ ఇంటికి కరెంట్ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద చేపట్టే పనులకు 60 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) భరించాల్సి ఉంటుంది. అయితే, విద్యుత్ పంపిణీ సంస్థలు భరించే మొత్తాన్ని రుణాల రూపంలో సమకూర్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ రుణాలను సమకూర్చుకుంటాయి. 17 జిల్లాలు.. 33 పట్టణాలు సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం కింద తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగపరిచేందుకు పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు 17 జిల్లాల్లోని 33 పట్టణాల్లో ఈ పథకం అమలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఈ పథకం పనులు చేపడుతారు. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.200 కోట్లు ఖర్చవుతుందని ఎన్పీడీసీఎల్ ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.120 కోట్లు చెల్లిస్తుంది. ఎన్పీడీసీఎల్ మిగిలిన రూ.80 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. కాగా, కొత్త ప్రాజెక్టు అమలులో భాగంగా వరంగల్ పట్టణంలో రెండు 33/11 కేవీ సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించనున్నారు. ఇంకా మిగిలిన జిల్లాల్లోనూ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లతో పాటు కొత్త లైన్లను ఏర్పాటుచేస్తారు. -
ఏపీజెన్కోలో కాలిన ట్రాన్స్ఫార్మర్లు
ఒకే కన్వేయర్ నుంచి బొగ్గు రవాణా ట్రయల్ రన్ దశలో అవాంతరాలు ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టు నుంచి నేలటూరులోని ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్కు బొగ్గు రవాణా చేసే కన్వేయర్ బెల్టు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దీనితో బొగ్గు రవాణా భారమంతా ఒక్క కన్వేయర్పై పడడంతో దీనికి తరచూ అంతరాయం ఏర్పడుతోంది. పోర్టు నుంచి బొగ్గును ఇటీవల వరకు టిప్పర్ల ద్వారా రవాణా జరిపారు. బొగ్గు తరలింపునకు రెండు కన్వేయర్ల నిర్మాణం పూర్తయితే, ట్రయల్ రన్ ప్రారంభించారు. ఒక్కొక్క కన్వేయర్ నుంచి గంటకు 1,300 టన్నుల బొగ్గు రవాణా జరుగుతుంది. ఈ విధంగా ప్రాజెక్ట్కు ఒక రోజుకు 15,000 టన్నుల బొగ్గు రవాణా జరగాలి. ఒక్కొక్క కన్వేయర్ బెల్టు మోటారు పనిచేసేందుకు రెండు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయాలి. గుజరాత్ నుంచి తెచ్చిన వీటితో కన్వేయర్లను ట్రయల్రన్ జరుపుతున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఒక కన్వేయర్కు సంబంధించి రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. డిజైన్లలో లోపం వల్ల ఇవి కాలిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో రెండో కన్వేయర్పై రవాణా ఒత్తిడి పెరగడంతో తరచూ సాంకేతిక లోపం ఏర్పడి, రవాణా నిలిచిపోతోంది. ఫలితంగా ప్రాజెక్టలో అవసరమైన మేరకు బొగ్గు నిల్వ చేయలేకపోతున్నారు. ఈ నెల 22 నాటికి ట్రాన్స్ఫార్మర్లు రాక: కాలిపోయిన కన్వేయర్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్టు జెన్కో ఎస్ఈ దేవప్రసాద్ తెలిపారు. డిజైన్లలో మార్పు చేసి ఇప్పటికే ఒక ట్రాన్స్ఫార్మర్ రప్పించామన్నారు. రెండవది ఈ నెల 22వ తేదీనాటికి చేరుతుందన్నారు. వీటిని అమర్చడం పూర్తిచేసి, 25 తేదీకల్లా బొగ్గు రవాణా ప్రారంభిస్తామన్నారు. ట్రయల్ రన్ దశలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు బిల్లుల చెల్లింపులు ఉండవన్నారు. -
ఆ నిర్మాతలు రూ.2కోట్లు కట్టాల్సిందే!
బీజింగ్: హాలీవుడ్ మూవీ 'ట్రాన్స్ ఫార్మర్స్' నిర్మాతలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెనా సినీక్ ఏరియాకు చెందిన ఓ పార్కుకు ఆ మూవీ నిర్మాతలు దాదాపు మూడు లక్షల అమెరికా డాలర్లు పరిహారం చెల్లించనుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్ టింక్షన్' మూవీలో కొన్ని సీన్లను చైనా ఉలుంగ్ సినిక్ ఏరియా, ఆ దేశ పర్యాటక ప్రాంతంలో చిత్రీకరించారు. ఇందుకు గానూ మొదట ఆ మూవీ యూనిట్ పర్మిషన్ తీసుకుంది. ఆ టూరిస్ట్ ప్లేస్ లోగో కచ్చితంగా మూవీలో చూపించాలని ఒప్పందం చేసుకున్నారు. విడుదలైన ఈ మూవీలో పర్యాటక ప్రాంతం సీన్లున్నాయి. కానీ ఆ ఫారెస్ట్ లోగో కనిపించలేదు. దీంతో చైనాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీకి సంబంధించిన కొన్ని సీన్లపై చైనా అభ్యంతరం చెప్పింది. మూవీలో లోగో చూపించలేదని ఒప్పందాన్ని ఉల్లంఘించరాని చైనా వారు 2014లో దావా వేశారు. 20 మిలియన్లకు పైగా చెనీస్ యువాన్లను పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఈ కేసు తీర్పు వెలువడిందని, ఆ మూవీ నిర్మాతలు చైనా పార్కుకు, సంబంధిత పర్యాటకశాఖకు 3 లక్షల డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.2కోట్లు) చెల్లించాలని తుదితీర్పు వచ్చింది. మరోవైపు ట్రాన్స్ ఫార్మర్స్ మూవీ ఐదో పార్ట్ వచ్చే విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధంగా ఉంది. -
పచ్చదనం మాటున ప్రమాదం
పచ్చదనం మాటున ప్రమాదం దాగి ఉంది. పై చిత్రాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ఈ దృశ్యాలు చెన్నూర్ మండలంలోని సుద్దాల, బావురావుపేటలో కనిపించినవి. ఇలాంటి పరిస్థితులు మండలంలోని కిష్టంపేట, బావురావుపేట, లింగంపల్లి, దుగ్నెపల్లి, సుద్దాల, కమ్మరిపల్లి తదితర గ్రామాల్లో అనేకం ఉన్నాయి. పంట పొలాల్లో, ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఎటువంటి రక్షణ కంచెలు లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయి. అసలే వర్షాకాలం వాటి చుట్టూ పిచ్చి మొక్కలు మరింత ప్రమాదకరంగా మారాయి. ఎటువంటి ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు పట్టించుకొని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. – చెన్నూర్రూరల్ -
ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్నట్లు..
లండన్: ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందనే సామెత ఈ కుక్కకు అతికినట్లు సరిపోతుంది. బ్రిటన్ కు చెందిన ఫ్రేయా అనే కుక్కకు హాలీవుడ్ లో ‘న్యూ ట్రాన్స్ ఫార్మర్స్’ అనే చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ కుక్క 6 సంవత్సరాల నుంచి ఒక జంతువుల షెడ్డులో ఉంటోంది. ఫ్రేయాను పెంచుకోవడానికి 18,000 మంది నిరాకరించారు. న్యూ ట్రాన్స్ ఫార్మర్స్ చిత్ర దర్శకుడు మైఖేల్ బే మాట్లాడుతూ.. ఫ్రేయా ఈ చిత్ర సంపాదనతో జంతువుల షెడ్డులో జీవితాంతం జీవించగలిగే డబ్బు సంపాదిస్తుంది. ఈ పాత్రలో నటించిన తర్వాత ఆ కుక్క తిరిగి తన ఇంటిని గుర్తించకపోతే, తన దగ్గరే పెంచుకుంటానని ఆయన తెలిపారు. మైఖేల్ బే ద్వారా ఫ్రేయా ఫేస్బుక్లోనూ దర్శనమిచ్చింది. ఫ్రేయా తిరిగి తన నివాసానికి చేరుకుంటుందని ఫ్రెష్ఫీల్డ్స్ యానిమల్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రేయా అందమైన కుక్కే కాక మంచి విశ్వాసం కలదని ఆ కుక్క నివసిస్తున్న షెల్టర్ ఫండ్రైజర్ తెలిపారు. -
కరెంటు తీగలు కరిగిపోతున్నాయ్..
సాక్షి, సిటీబ్యూరో: ఏసీలో కూర్చుంటే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టాలి. కానీ రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ చూస్తే విద్యుత్ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మహానగరం రోజురోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా రెట్టింపైంది. విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలో అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీన 54.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మే 26న రికార్డుస్థాయిలో 53.2 మిలియన్ యూ నిట్ల విద్యుత్ వినియోగం జరుగగా, ఈ ఏడాది నెల రోజుల ముందే రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇది 58 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు ఓ అంచనా. ఉడుకుతున్న కేబుళ్లు.. కరుగుతున్న తీగలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన కరెంట్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరుగుతోంది. సూర్యుని వేడికి డిస్ట్రిబ్యూషన్ వైర్లు కరిగి సాగుతున్నాయి. భూగర్భ కేబుళ్లు వేడికి ఉడికిపోయి జాయింట్స్ వద్ద కాలిపో తున్నాయి. ఇలా ప్రతి రోజూ రెండు మూడు ఫీడర్ల పరిధిలో ఈ సమస్య తలెత్తుతోంది. ఇదిలా ఉంటే ఆయిల్ లీకేజీలకు తోడు ఓవర్ లోడు వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ అమర్చి విద్యుత్ పునరుద్ధరించడం లో తీవ్ర జాప్య ం జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర లోడ్ రిలీఫ్ల పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. -
మాకు ముందే తెలుసు
శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ వేసవి డిమాండ్పై ముందే ఓ అంచనాకు వచ్చాం. ఇప్పటికే లైన్స్ను పునరుద్ధరించాం. పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. రూ.240 కోట్లు ఖర్చు చేసిమెరుగైన సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
కలెక్టర్ గారూ.. ఆలకించరూ..
ఆయన దత్తత గ్రామానికీ తప్పని కరెంటు కష్టాలు దానవారుుపేటలో లోడెక్కువై పాడవుతున్న ట్రాన్స్ఫార్మర్లు తొండంగి : కలెక్టర్ దత్తత తీసుకున్న దానవాయిపేట గ్రామానికి కరెంటు ఇక్కట్లు తప్పలేదు. తీరప్రాంత గ్రామమైన దానవాయిపేట పంచాయతీలో నర్సిపేట, తాటియాకులపాలెం, ఒంటిమామిడి, కొత్తపాకల గ్రామాలున్నాయి. కలిసి ఉండే దానవాయిపేట, నర్సిపేట, తాటియాకులపాలెం గ్రామాల్లో 4 వేల వరకూ జనాభా ఉంది. ఆయా గ్రామాల్లో 800 వరకూ ఇళ్లున్నాయి. ఓవర్లోడ్ విద్యుత్ సమస్య తలెత్తకుండా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. తీరప్రాంతంలో హెచరీలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్కు డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉండటంతో, లోడు ఎక్కువై తరచూ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. మూడేళ్ల క్రితం పలుచోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను ట్రాన్సకో ఉన్నతాధికారులకు నివేదించామని సర్పంచ్ చొక్కా హరిబాబు తెలిపారు. రామాలయం వెళ్లే మార్గంలోనూ, హైస్కూలు వద్ద తదితర ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లు సక్రమంగా పనిచేయడం లేదు. టెన్త్ విద్యార్థులకూ ఇబ్బందులు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టాన్స్ఫార్మర్లు మొరాయిస్తుండడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. రాత్రివేళ కారుచీకట్లో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ అస్తమాను పోతుంది హైస్కూలు వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నిత్యం మరమ్మతులకు గురవుతోంది. దీనిని బాగు చేసేందుకు అన్ని వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో కరెంటు సక్రమంగా ఉండటం లేదు. - సిరిపిన హరిబాబు, గ్రామస్తుడు, దానవాయిపేట కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం రాత్రి, పగలు తేడాలేకుండా ఎక్కువ సార్లు కరెంటు పోతోంది. ఎండవేడి కారణంగా ఇంట్లోనూ కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలి. - సీహెచ్ చిలకమ్మ, గ్రామస్తురాలు, దానవాయిపేట విద్యార్థులకూ ఇబ్బందులు గ్రామంలో విద్యుత్ సమస్యతో పదో తరగతి, ఇతర పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రాత్రి సమయాల్లో చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మరిన్ని ట్రాన్స్ఫార్మర్లు వేసి, సమస్యను పరిష్కరించాలి. - యజ్జల మాంబుల్లోడు, గ్రామపెద్ద, దానవాయిపేట చర్యలు తీసుకుంటున్నాం గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్య మా దృష్టికి వచ్చింది. అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాసమూర్తి, ఎలక్ట్రికల్ ఏఈ, తొండంగి మండలం -
కాంట్రాక్టర్లకు కామధేనువులు!
నగరంలో తరుచుగా కాలిపోతున్నడిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నిర్వహణ లోపమే కారణం కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న వైనం... ఆయిల్ లీకేజీలను అరికట్టడంలో ఘోరంగా విఫలం డిస్కం ఆదాయంలో చాలా వరకు రిపేర్లకే కేటాయింపు సిటీబ్యూరో: ఆయిల్ లీకేజీ.. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పేరుక పోయిన చెత్త...ఓవర్లోడు...లూజ్ కాంటాక్ట్స్...లైన్ల మధ్య నుంచి చెట్ల కొమ్మలు పెరగడం, వంటి అంశాలు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పాలిట శాపంగా మారుతున్నాయి. అమర్చిన కొద్దికాలానికే కాలిపోయి షెడ్డుకు చేరుతున్నాయి. కాంట్రాక్టర్ల పాలిట ఇవి కామధేనువులా మారుతున్నాయి. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణ పేరుతో ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నా..నష్టాలు మాత్రం తగ్గడం లేదు. నిర్వహణ లోపం...విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు తరుచుగా కాలిపోతున్నాయి. తద్వారా ఏటా డిస్కంకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుండగా...కాంట్రాక్టర్లకు మాత్రం కాసులు కురుస్తున్నాయి. రిపేరు చేసిన కొద్దిరోజులకే మళ్లీ అవి పాడైపోతుండటంతో చేసిన దానికే మళ్లీ మళ్లీ రిపేర్లు చేస్తూ భారీగా దండుకుంటున్నారు. ఈ పనులను స్వయంగా పరిశీలించాల్సిన అధికారులు కూడా పరోక్షంగా వీరికి సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2015-16 లో ఒక్క రంగారెడ్డి సౌత్ సర్కిల్లోనే 2112 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, రిపేర్ల కోసం 2.27 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క ఏడాదిలోనే రూ.8 కోట్లకు పైగా కేవలం ట్రాన్స్ఫార్మర్ల రిపేరుకే ఖర్చు చేయడం గమనార్హం. ఐదేళ్లలో కేవలం నాలుగు డివిజన్లలో 22,720 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయంటే..వీటి నిర్వహణ తీరు ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణ కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్ల పనితీరు మెరుగుపడక పోగా తరచూ కాలిపోతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరమ్మతులు చేపట్టినా..తగ్గని నష్టాలు.. ఆయిల్ లీకేజీలను అరికట్టకపోవడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్త పేరుకపోవడంతో షార్ట్సర్క్యూట్ ఏర్పడి అవి కాలిపోతున ా్నయి. కోఠి నుంచి కాచిగూడ మీదుగా చాదర్ఘాట్ వెళ్లే దారిలో ఇటీవలో ఓ ట్రాన్స్ఫార్మర్ ఇదే కారణంతో కాలిపోయింది. ఫలితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని కాలనీలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏదైన ఒక ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం తలెత్తి కాలిపోతే దాని స్థానంలో మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలి. అయితే అధికారులు మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మొబైల్ ట్రాన్స్ఫార్మర్లతో కాలం వెల్లదీస్తున్నారు. రిపేరుకు వచ్చిన వాటిలో చాలా వాటికి కనీసం ఆయిల్ కూడా మార్చకపోవడంతో పాటు లోపభూయిష్టమైన వైండింగ్ వల్లే కేవలం ఆరుమాసాల వ్యవధిలోనే రెండుసార్లు కాలిపోతున్నట్లు వివర్శలు లేకపోలేదు. వీటిని అరికట్టాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. కేటాయింపులోనూ అవినీతి విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులను నివారించేందుకు ఏటా కొత్తగా వేలాది ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫార్మ ర్ల కేటాయింపులోనూ అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు స్వయంగా డిస్కం పెద్దలే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు కేటాయించిన వాటి పని తీరు, కంపెనీ ఇచ్చిన గ్యారంటీ గడువు వంటి అంశాలు పరిశీలించకుండానే కొత్తవి కేటాయిస్తున్నారు.ప్రజావసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ ట్రాన్స్ఫార్మర్లను స్థానిక అధికారులు ప్రైవేటు వాణిజ్య సముదాయాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తవాటి కేటాయింపులోనే కాదు కాలిపోయినని రిపేర్లకు కేటాయించడంలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఐదు రిపేరింగ్ షెడ్డులు ఉన్నా.. వీటిని కాదని మహేశ్వరం సమీపంలో ఉన్న షెడ్డుకే ఎక్కువగా కేటాయిస్తుండటం కొసమెరుపు. -
మరో నాలుగు ట్రాన్స్ఫార్మర్స్
భారీ సైజ్లో ఉండే రోబోలు అంతరిక్షం నుంచి వచ్చి భూమ్మీద పోరాడితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించే ‘ట్రాన్స్ఫార్మర్స్’ హాలీవుడ్ సిరీస్ అంటే ప్రపంచ సినీ అభిమానులకు ఎంతో క్రేజ్. హాలీవుడ్ దర్శకుడు మైఖైల్ బే తెరకెక్కించిన ఈ సిరీస్లోని తొలి చిత్రం 2007లో విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన రెండు సీక్వెల్స్ ఘన విజయం సాధించగా, గత ఏడాది విడుదలైన నాలుగో భాగం మాత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. త్వరలో ఈ సిరీస్కు కొనసాగింపుగా నాలుగు భాగాలు రూపొందనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హాస్బ్రొ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో నాలుగు భాగాల స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, రానున్న పదేళ్లల్లో వీటిని విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధి స్టీఫెన్ డేవిస్ ప్రకటించారు. మొదటి నాలుగు భాగాలను తెరకెక్కించిన మైఖేల్ బే ఐదో భాగాన్ని తెరకెక్కించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ దొంగలకు జైలు
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్జిల్లా): వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లిన దొంగల ముఠాకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జమాల్పల్లి గ్రామ పరిధిలో ఐదు ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాను 2013 అక్టోబర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించగా.. మంగళవారం నాడు నేరం రుజువు కావడంతో వారికి న్యాయమూర్తి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. -
ట్రాన్స్ఫార్మర్ పేరుతో రూ.10 లక్షలు వసూలు చేసి..
సింహాద్రిపురం (వైఎస్సార్ జిల్లా) : టాన్స్ఫార్మర్ ఇప్పిస్తానని రైతుల నుంచి వసూలు చేసిన రూ.10 లక్షలతో ఓ అధికారి కనిపించకుండా పోయారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకోగా విద్యుత్ సబ్ ఇంజినీర్ శివప్రసాద్ వారి నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నాడు. అయితే గత మూడు రోజులుగా ఆయన కనిపించకుండా పోవటంతో దాదాపు 15 మంది రైతులు గురువారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రాగి దొంగల ముఠా అరెస్ట్
ప్రకాశం(ఎర్రగొండపాలెం): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగిని దొంగిలించి సొమ్ము చేసుకునే ముఠాను పుల్లల చెరువు మండల కేంద్రంలో పట్టుకున్నారు. జిల్లాలో ఈ మధ్య కాలంలో ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి దొంగిలిస్తున్నారని చెప్పి 64 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పమత్తమైన పోలీసులు రాగి దొంగతనాలపై నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే పుల్లల చెరువులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి దొంగిలించేది మేమే అని నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠా నాయకుడు షేక్ సుభానీ పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మోత
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అపార్టుమెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే ట్రాన్స్ఫార్మర్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు బిగించుకోవాలని విద్యుత్శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కెపాసిటర్లు ఏర్పాటు చేసుకునేందుకు సామర్థ్యాన్ని బట్టి సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భారం పడనుంది. అయితే, విద్యుత్ వృథాను అరికట్టేందుకే ఈ రకమైన చర్యలను చేపడుతున్నామని విద్యుత్శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం అపార్టుమెంట్ వాసులే కాకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించి.. తద్వారా ట్రాన్స్ఫార్మర్లు పదే పదే ట్రిప్ కాకుండా అరికట్టేందుకు కెపాసిటర్లు ఉపయోగపడతాయనేది విద్యుత్ శాఖ అధికారుల భావన. ఇందులో భాగంగా కేవలం అపార్టుమెంట్లకే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి విద్యుత్శాఖ సూచనలు చేసింది. కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గడంతో పాటు సమర్థవంతంగా విద్యుత్ను ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మునిసిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలోని తాగునీటి పథకాలకూ వీటిని బిగించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా మునిసిపాలిటీలు, పంచాయతీ లుచర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యవసాయ మోటార్లకూ ఏర్పాటు కెపాసిటర్ల వినియోగాన్ని వ్యవసాయ మోటార్లకూ తప్పనిసరి చేయాలని ఇప్పటికే విద్యుత్శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతివ్వాలంటూ ఉన్నతాధికారులకు జిల్లా విద్యుత్శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే, కెపాసిటర్లకు అయ్యే మొత్తాన్ని రైతులు భరించుకోవాల్సి ఉంటుందా? విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లే భరిస్తాయా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు
♦ లో ఓల్టేజీతో మొరాయిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు ♦ సకాలంలో అందక సాగునీటి మళ్లింపునకు కష్టం ♦ కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం 4,500దరఖాస్తులు ♦ మంజూరు వెయ్యి మాత్రమే పాలమూరు : వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. ఖరీఫ్ పంటల సాగుకోసం సిద్ధపడిన రైతన్నలను ఓవైపు అయోమయానికి గురి చేస్తుండగా.. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల రిపేరు బేజార్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా రైతన్నల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, కాలిపోయిన వాటికి మరమ్మతులు చేపట్టడంలో తీవ్రజాప్యం జరుగుతుండటంతో అన్నదాతలకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల రిపేరు కోసం అన్నదాతలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. జిల్లాలో మొత్తం 6.5లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిద్వారా దాదాపు 15లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్ఫార్మర్దే. వీటి ఏర్పాటులో విద్యుత్శాఖ తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి పొలంలో ఏర్పాటు చేసేందుకు సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వంలో కూడా రైతుల ట్రాన్స్ఫార్మర్ కష్టాలు కడతేర డం లేదు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై ఓవర్లోడ్ పడి ట్రిప్ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లతో పాటు లోఓల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతుండటంతో అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతం. కాలిపోయిన వాటికి మరమ్మతు చేసే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ సమస్యను 48గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 4,500ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉండగా.. అందులో వెయ్యి ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. కొత్తవాటిని సకాలంలో ఏర్పాటు చేయాలని, తరుచూ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోవడానికి గల కారణాలను తెలుసుకుని విద్యుత్శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వైర్లు కలిసి కాలిపోయింది కొడంగల్ సబ్స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రం ఉంది. కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు, బొంరాస్పేట మండలాల్లో చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను ఇక్కడ బాగు చేస్తారు. మాకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ వైర్లు కలిసి కాలిపోయింది. మరమ్మతు కోసం కొడంగల్కు తీసుకొచ్చాం. లో ఓల్టేజీ సమస్య, కరెంటు సరఫరాలో హెచ్చు తగ్గుల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. - శ్రీనివాస్రెడ్డి, వడిచర్ల(బొంరాస్పేట) -
షాక్ఫార్మర్
రైతన్నకు ఫికర్ - అధ్వానంగా ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ - కరెంటోళ్ల నిర్వాకం.. అన్నదాతకు సంకటం - కొత్తవి ఇవ్వరు.. మరమ్మతు చేయరు - 3,500 ట్రాన్స్ఫార్మర్ల కోసం అర్జీలు - 600కే మంజారుఅనుమతులు - ఆమ్యామ్యాలు ఇస్తేనే పనులు - ఒక్కో దానికి రూ.10వేల నుంచి 15వేల వరకు వసూళ్లు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం.. అంతకు మించి కాసుల కక్కుర్తి.. ఫలితంగా రైతన్నల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, కాలిపోయిన వాటికి మరమ్మతులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అన్నదాతలకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. రూ. వేలకు వేలు గుమ్మరిస్తేనే టాన్స్ఫార్మర్లు రిపేరు అవుతున్నాయి. లేకుంటే పంటలు ఎండిపోవడం ఖాయం.. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంది. జిల్లాలో మొత్తం 1.75 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా దాదాపు 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్ఫార్మర్దే. వీటి ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి పొలంలో ఏర్పాటు చేసేందుకు నెలలు, సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల ట్రాన్స్ఫార్మర్ కష్టాలు కడతేరడం లేదు. కొత్తవాటిని ఏర్పాటు చేయాలంటే విద్యుత్ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయడమేకాక, వేల రూపాయలు ముట్టజెప్పాల్పి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై ఓవర్లోడ్ పడి ట్రిప్ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లతో పాటు లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోతుండడంతో రైతుల దుస్థితి గోరుచుట్టపై రోకటి పోటు చందంగా తయారయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి అలా ఉంటే కాలిపోయిన వాటికి మరమ్మతు చేసే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ సమస్యను 48 గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ఎస్పీఎం సెంటర్కు తీసుకెళ్లి మరమ్మతు చేయించి మళ్లీ రైతు పొలంలో ఏర్పాటు చేసేందుకు వాహనాలు ప్రభుత్వమే సమకూర్చినా ఆ భారం కూడా రైతుల పైనే అధికారులు వేస్తున్నారు. కాలిపోయిన దానికి తీసుకెళ్లడానికి ఒక రోజు, మరమ్మతు అయిన దానిని తీసుకెళ్లేందుకు మరో రోజు రైతుకు రూ. వేలకు వేలు రవాణా భారం పడుతోంది. చేతులు ‘తడిపితేనే’.... విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది లంచాలుగా తీసుకుంటున్న మొత్తం రూ. కోట్లు దాటుతాయనే ఆరోపణలున్నాయి. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా 3 వేల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా, వాటికి ఆమ్యామ్యాల కింద ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు సగటున రూ. 10 నుంచి 15వేల చొప్పున రూ.3.5 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టిందని అంచనా. దీనికి తోడు కరెంటు పోల్స్, వైర్లు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతులపై ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.2 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఇంత ఖర్చు చేసినా రైతుకు మాత్రం సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులోకి రావడంలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 3,650 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉండగా, అందులో కేవలం 600 ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. వాటిలో కూడా ఆ రెండు నియోజకవర్గాలదే అగ్రస్థానం. కొత్త ట్రాన్స్ఫార్మర్ల మంజూరు నుంచి దాన్ని బిగించే వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టచెప్పాల్సిందే. ఎంతగా అంటే.. జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ భాగం విద్యుత్ శాఖ సిబ్బంది ఉండడం గమనార్హం. -
డి‘స్కాం’!
డిస్కంలో అవినీతి దందా ఆదాయం వచ్చే ప్రాంతాలపై దృష్టి అధికారులకు భారీగా ముడుపులు వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు తాజాగా ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం ఏఈ అశోక్ సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీ ఎస్ఎస్పీడీసీఎల్) అక్రమార్కులకు నిలయంగా మారింది. ఏ పని చేయాలన్నా అధికారులు, సిబ్బందికి చేతులు తడపాల్సిందే. అపార్టమెంట్లకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలన్నా.... ఇంటి ముందు విద్యుత్ లైను వేయాలన్నా... ఇంటికి కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నా... చివరకు కాలిపోయిన మీటర్ మార్చాలన్నా...లైన్మెన్ దగ్గరి నుంచి డీఈ వరకు అందరికీ ఎంతో కొంత చెల్లించుకోవాల్సిందే. వినియోగదారులకు ఎంతో పారదర్శకంగా సేవలు అందించాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదనే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. పని చేసే ప్రాంతాలను ఫోకల్ (ఆదాయం వచ్చేవి), నాన్ ఫోకల్ (ఆదాయం అంతగా లేనివి) పోస్టులుగా విభజించి, వాటిని చేజిక్కించుకునేందుకు సంస్థలోని కొంత మంది‘పెద్ద’లకు భారీగా ముడుపులు ముట్టజెప్పుతున్నారు. ఈ మొత్తాన్ని మళ్లీ కూడబెట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కోర్ సిటీ కంటే... కొత్త కనెక్షన్లు, లైన్లు అధికంగా అవసరం ఉన్న శివారు ప్రాంతాల్లో పని చేయడానికిఎక్కువ మొగ్గు చూపుతుండటానికి ‘అదనపు’ రాబడే కారణం. తీరు మార్చుకోరు... అవినీతి ఆరోపణలతో పాటు వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటూ ఇప్పటికే పలువురు డీఈలు, ఏడీఈలు, ఏఈలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. అయినా మిగిలిన వారిలో మార్పు రావడం లేదు. హుస్సేన్సాగర్ ఎస్ఈగా పని చేసిన ఓ అధికారితో పాటు, మింట్ కంపౌండ్ ఏడీఈగా పని చేసిన మరో అధికారి.. వనస్థలిపురం ట్రాన్స్కో ఏడీ ఈలు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీకి పట్టుబడిన ఉదంతాలను సిటిజన్లు ఇంకా మరిచిపోలేదు. తాజాగా వనస్థలిపురం ప్రశాంత్ నగర్కు చెందిన కాంట్రాక్టర్ కర్రి వెంకటేశ్వరరావు ఇటీవల విద్యుత్ కనెక్షన్ (6 సింగిల్ ప్యానల్ బోర్డు) కోసం దరఖాస్తు చేసుకోగా... అంచనాల కోసం ఏఈ అశోక్ రూ.30 వేలు డిమాండ్ చేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చే సమయంలో చెల్లిస్తానని చెప్పిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం వారు వలపన్ని ఏఈని పట్టుకున్నారు. అక్రమార్కులు గుండెల్లో రైళ్లు ఆదాయానికి మించి ఆస్తులతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగుల్లో విద్యుత్ శాఖ రెండోస్థానంలో ఉండటం విశేషం. విద్యుత్ అధికారుల్లో చాలా మంది ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణ లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి ఇళ్లపై ఏసీబీ ఇటీవల వరుసగా దాడులు చేస్తోంది. ఇవి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ అధికారి ఇంటిపై ఏసీబీ కన్ను పడుతుందోనని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కూడబెట్టిన ఆస్తులను ‘సంరక్షించే’ పనిలో పడుతున్నారు. తమ పేరుపై ఉన్న రూ.కోట్ల విలువైన ఆస్తులను బంధువులకు అప్పగిస్తున్నారు. -
విన్నారు.. వెళ్లారు..
విద్యుత్ చార్జీల పెంపుపై వైఖరి వెల్లడించని ఈఆర్సీ పలు సమస్యలపై గళమెత్తిన వినియోగదారులు, సంఘాల నేతలు హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్, సభ్యులు విద్యుత్ వినియోగదారుల వాదనలు విన్నారు.. వారి వైఖరి, తీసుకోబోయే చర్యల గురించి మాట మాత్రమైన చెప్పకుండానే వెళ్లారు. విద్యుత్ చార్జీల పెంపు, టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ అవసరాలు, ఆదాయం, వ్యయం, వినియోగదారుల సమస్యలపై హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ హాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఇస్తామయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీనివాస్, మనోహర్రెడ్డితో కూడిన బెంచ్ గురువారం బహిరంగ విచారణ జరిపింది. అరుుతే... ఈఆర్సీ చార్జీల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ ప్రతిపాదించిన ట్లు విద్యుత్ వినియోగదారులపై భారం మోప డం ఖాయంగా కనపడుతోంది. ముందుగా ఎన్పీడీసీఎల్ పరిధిలోఎంత విద్యుత్ వినియో గం అవసరం, నిర్వహణ, ఆదాయ, వ్యయా లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ వివరించారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది... విద్యుత్ ఎవరి సొత్తు కాదని, అందరికి సమానంగా అందాలని భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాము అన్నారు. వ్యాపార ప్రకటనలకు పీక్ సమయంలో విద్యుత్ను నిలిపివేయాలన్నారు.. వ్యాపార సంస్థలకు తక్కువ మొత్తలో చార్జీలు పెంచి గృహ వినియోగదారులకు ఎక్కువ శాతం పెంచడం తగదు. వ్యవసాయదారుల నుంచి సర్వీస్ చార్జి వసూలు చేస్తూ ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామంటూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు భారీ గా జీతాలు తీసుకుంటూనే రైతులను పీడిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని మండిప డ్డారు. సర్వీస్ చార్జీలు సంవత్సరానికి రూ. 360వసూలు చేయాలి.. కానీ, రూ.600 వసూ లు చేసి రశీదు ఇచ్చారని చెప్పారు. ఇది అసలుదా.. నకిలీదా అని ప్రశ్నించారు. కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది.. సీజీఎఫ్ చైర్మన్ గా కంపెనీ అధికారిని కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చినా.. విద్యుత్ అధికారులు, ఉద్యోగుల్లో అవినీతి పెచ్చరిల్లిందని భారతీయ కిసాన్ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకుడు ఇంజిరెడ్డి అన్నారు. ఓ రైతు రూ.10 వేలు లంచమిచ్చినా ట్రాన్స్ఫార్మర్ బిగించలేదని వివరించారు. నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే సరిపోతుంది నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే బిల్లులు పెంచే అవసరముండదని వినియోగదారుల మండలి జిల్లా ప్రతినిధి చక్రపాణి సూచించారు. అధికారులు, ఈఆర్సీ ఈ దిశగా ఆలోచించాలన్నా రు. రాత్రి కరెంట్తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా వ్యవసాయానికి పగలు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్యా యం జరిగిందని ఫోరానికి వెళితే 3 నెలలు పడుతోందని, ఫోరం నిర్ణయం వెలువడకముందే కనెక్షన్ తొలగిస్తున్నారని వివరించారు. వర్కర్ను కేటారుుంచాలి వినియోగదారులకు అవగాహన కల్పించేం దుకు కనీసం కరపత్రాలు కూడా ముద్రించడం లేదని విద్యుత్వినియోగదారుల పరిష్కార వేదిక సభ్యుడు సాయిరెడ్డి అన్నారు. రూ. లక్షల్లో బకాయిల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు పైసా అపరాధ రుసుం విధించని ఎన్పీడీసీఎల్ మామూలు వినియోగదారులు ఒక్క రూపాయి బకాయి ఉన్న రూ.75 అపరాధ రుసుం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్కు వర్కర్ను నియమించాలని డిమాండ్ చేశారు. చార్జీల పెంపును విరమించుకోవాలి.. ఖమ్మం జిల్లాలో 500 గ్రానైట్ పరిశ్రమలుం డగా 300 మూతపడ్డారుు... మరో వంద పరిశ్రమలు మూతపడే పరిస్థితులో ఉన్నాయని, ఖ మ్మం గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధు రాజేష్ వివరించారు. పరిశ్రమలపై భారం మోపద్దని కోరారు. చార్జీల భారం మోపద్దు.. హెచ్టీ వినియోగదారులపై అధిక చార్జీల భారం మోపుతున్నారని తెలంగాణ కాటన్ ట్రే డర్స్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. పరిశ్రమలు న ష్టా ల్లో ఉన్నారయని, చార్జీల భారం వేయొద్దని సూచిం చారు. చిరు వ్యాపారులకు గృహ కనెక్షన్లు ఇవ్వాలని కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంజయ్య కోరారు. చివరకు సీఎండీ మాట్లాడుతూ తమదృష్టికి తీసుకొచ్చి న లోపాలు సవరించుకుంటామని, అవినీతికి ఆస్కారం లేకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పి సమావే శాన్ని ముగించారు. విచారణలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఘంటా నరేందర్రెడ్డి, పలు సంఘాల నేతలు, ఎన్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. -
చినుకు పడితే చీకటే!
వర్షంతో 118 చోట్ల విద్యుత్ అంతరాయం ఆదివారం రాత్రంతా జాగారం సోమవారం మధ్యాహ్నానికి పునరుద్ధరణ తరచూ ఇదే సమస్య పునరావృతం సిటీబ్యూరో: ‘విశ్వ’ నగరం వైపు అడుగులేద్దామంటూ ఓ వైపు సీఎం పిలుపునిస్తుంటారు. ఆ దిశగా నడవాలంటూ ఎప్పటికప్పుడు అధికారులకు కర్తవ్య బోధ చేస్తుంటారు. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎంతో ముఖ్యావసరమైన విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో... ఎప్పుడు ఉండదో తెలీదు. చిన్న ఈదురు గాలికే నగరం గజగజ వణికిపోతోంది. ఎండ ముదిరినా... గాలి వీచినా... వర్షం కురిసినా... గ్రేటర్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలుతోంది. ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. మెరుగైన సరఫరా కోసమంటూ అధికారులు చేస్తున్న నెలవారీ సమీక్షలు... ముందస్తు హడావుడి చిన్న ఈదురుగాలిముందు బలాదూర్ అవుతున్నాయి. విద్యుత్ అధికారుల అలసత్వంతో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా నగరంలోని 118 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల అర్థరాత్రి తర్వాత పునరుద్ధరిస్తే... మరికొన్ని చోట్ల సోమవారం మధ్యాహ్నానికి సరఫరా చేశారు. విద్యుత్ లేకపోవడంతో జనం అవస్థలు వర్ణించనలవి కాదు. దోమలతో వేగలేక...విద్యుత్ సరఫరా లేక ఆదివారం రాత్రంతా జనం జాగారం చేయాల్సి వచ్చింది. లోపాన్ని గుర్తించే పరిజ్ఞానమేదీ? ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్స్టేషన్లు పది ఉండగా... 33/11కేవీ సబ్స్టేషన్లు 300పైగా ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు రెండు వేల ఫీడర్లు ఉన్నాయి. సుమారు 90 వేల కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు, 300 కిలోమీటర్ల పరిధిలో యూజీ కేబుళ్లు ఉన్నాయి. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఫీడర్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు... అటు నుంచి గృహాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో తలెత్తుతున్న లోపాలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్-ఏపీ డీఆర్పీ పథకం కింద ‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు రెండేళ్ల క్రితం గ్రీన్ ల్యాండ్ డివిజన్ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే పూర్తి చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు. మూగబోతున్న కాల్సెంటర్లు విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డిస్కం 1219 సర్వీసు నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రతి సర్కిల్కు ప్రత్యేకంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. ఇదిలా ఉంటే... ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ఎస్ఈ నుంచి కింది స్థాయి లైన్మేన్ వరకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. ఒక్కో ఫోన్కు ప్రతి నెలా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు బిల్లు చెల్లిస్తుంది. సంబంధిత అధికారులు, ఉద్యోగులు సొంత అవసరాలకు ఫోన్ను ఉపయోగించుకుంటూ... అత్యవసర పరిస్థితుల్లో స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి గ్రేటర్లోని 118 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివార్లన్నీ అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. ఆ సమయంలో వేలాది మంది 1912 కాల్ సెంటర్కు ఫోన్ చేశారు. అది మూగబోవడంతో స్థానిక లైన్మెన్లకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ సిబ్బందికి ఫోన్ చేస్తే... ఒక్కరూ ఫోన్ ఎత్త లేదు. -
రైతన్నలకు కరెంట్ కష్టాలు
* ఆందోళన చెందుతున్న అన్నదాతలు * పక్షపాతం చూపుతున్న సిబ్బందిపై ఆగ్రహం ధారూరు: ఒక్క సెంట్ భూమిని కూడా ఎండిపోనివ్వబోమని ప్రభుత్వం చెబుతుంటే విద్యుత్ సిబ్బంది మాత్రం సర్వీస్ చార్జీలు చెల్లించడం లేదంటూ నిర్దాక్షిణ్యంగా సరఫరా నిలిపివేస్తున్నారు.దీంతో సాగుచేసిన వరిపంటలు ఎండుముఖం పట్టాయి. నాగారం గ్రామంలో దాదాపు 20 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా కేవలం రెండింటికి మాత్రమే విద్యుత్ కనుక్షన్ తీసివేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నాగారం గ్రామ సమీప బోనమ్మగుడి వద్ద ఉన్న ట్రాన్ఫార్మర్ నుంచి 30 ఎకరాల వరి పొలాలకు 16 కరెంట్ మోటార్ల ద్వారా నీరందుతుంది. మూడు నెలల క్రితం వరిని సాగుచేయగా ప్రస్తుతం ఈత దశలో ఉన్నాయి. గ్రామ స్మశానవాటిక దగ్గరి ట్రాన్స్ఫార్మర్ పరిధిలో కూడా 15 ఎకరాల్లో వరిని సాగుచేశారు. విద్యుత్ సిబ్బంది బుధవారం రెండింటి ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ సరఫరాను తొలగించారు. దీంతో రెండు రోజులుగా సరఫరా లేక వరిపంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఇదేమిటని విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే నాలుగు గ్రామాల్లో రూ. లక్ష వసూలు కావాల్సి ఉందని, లైన్మెన్ కరెంట్ తీసేయమంటే తీసివేశాం.. మేమేం చేస్తాం.. అని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇకనైనా వెంటనే ఆయా ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరారు. వెంటనే కనెక్షన్ ఇప్పిస్తాం: కృష్ణమూర్తి, ఏఈ, విద్యుత్ శాఖ మండలంలోని గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్ల నుంచి దాదాపు రూ.15 లక్షలు వసూలు కావాల్సి ఉంది. అందుకోసం స్పెషల్ డ్రైవ్ చేస్తూ బిల్లులు వసూలు చేస్తున్నాం. ఎవరైనా సర్వీస్ బిల్లు చెల్లించకుంటే వారి పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నాం. బిల్లులు చెల్లిస్తే వెంటనే కనెక్షన్ పునరుద్ధరిస్తాం. వ్యవసాయ మోటార్ల సర్వీస్ బిల్లు బకాయిలుంటే వెంటనే చెల్లించాలి. -
ఎన్నాళ్లీ కారు చీకట్లు?
నరసన్నపేట:పెను తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ అతలాకుతలమై నాలుగు రోజులు గడిచినా జిల్లా ఇంకా అంధకారంలోనే ఉంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పాత రోజులను గుర్తుకుతెచ్చుకుంటూ హాహాకారాలు చేస్తున్నారు. నరసన్నపేట నియోకవర్గంతో పాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొనడంతో విద్యుత్ కసం ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టిసారించారు. ఇన్వర్టర్లు కూడా చార్జింగ్ అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బహుళ అంతస్తుల్లో ఉన్న, అవకాశం ఉన్న వారు జనరేటర్లు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా ఉపసమనం పొందుతున్నారు. అయితే ఎక్కువగా వీటిని నీటిని తోడడానికే వినియోగిస్తున్నారు. ఒక్కసారిగా జనరేటర్లకు గిరాకీ పెరగడంతో రోజు అద్దె రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో నేలకూలిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇంటర్నెట్, ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్యాంకుల్లో పాత పద్ధతిలోనే పనిచేస్తున్నాయి. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు ఆమదాలవలస: నేల కూలిన విద్యుత్ స్తంభాలను సరిచేసే పని కొనసాగుతోంది. నియోజకవర్గం పరిధిలో సుమారు 800 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు అంచనా వేశారు. నిరంతరాయంగా పనులు చేస్తున్నా ఇంకా పూర్తికావడంలేదు. వీలయినంత త్వరలోనే పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ముమ్మరంగా విద్యుత్ పనులు వీరఘట్టం: విద్యుత్ పునరుద్ధరణ పనులు మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో 80 విద్యుత్ స్తంభాలు, 16 ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. వీటిని సరిచేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పాలకొండ-వీరఘట్టం 33/11 కేవీ ప్రధాన లైను బాగు చేయడం పూర్తయింది. రెండు రోజుల్లోగా అన్ని గ్రామాల్లో స్తంభాలు సరిచేస్తామని ఏఈ కృష్ణారావు చెప్పారు. ఏజెన్సీలో పునరుద్ధరణకు అష్టకష్టాలు సీతంపేట: ఏజెన్సీలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం కిరప, సోమగండి, గొయిది పంచాయతీల పరిధిలోని స్తంభాలు సరిచేసే పనిలో సిబ్బంది ఉన్నారు. అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేయడానికి మూడు రోజులు పడుతుందని తెలిపారు. మరో రెండు రోజులు అంధకారమే! పాలకొండ: మరో రెండు రోజులు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 32, గ్రామీణ ప్రాంతాల్లో 23 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 8 ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని ట్రాన్స్కో ఏఈ కె.హరికృష్ణ తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్డీవో సాల్మన్ రాజు చెప్పారు. ఫోన్లు మూగబోవడం, సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో ఎప్పటికప్పుడు నష్టాల సమాచారం అందడం లేదని అన్నారు. భామినిలోనూ విద్యుత్ కష్టాలు భామిని: మండలంలో కరెంట్ కష్టాలు కొనసాగుతున్నాయి. నేల కూలిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టడానికి ట్రాన్స్కో సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. సీతంపేట నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చూసే పనిలో ఏఈఈ ఒ.భీమరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇంకా అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రలో విద్యుత్ పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించడం లేదు. మరికొన్ని గంటలు అంధకారం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పునరుద్ధరణ సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా మొత్తం వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఇందులో రూ.700 కోట్లు డిస్కమ్లు, రూ.300 కోట్లు ట్రాన్స్మిషన్ సంస్థలు నష్టపోయాయని తెలిపారు. తొలుత విశాఖ నగరానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదీ అత్యవసర సర్వీసుల కోసం మాత్రమే. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో సరఫరా పునరద్ధరణకు మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్షణ ఏర్పాట్ల కోసం విద్యుత్ సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నా ఇంతవరకు మెరుగైన పరిస్థితి కనిపించలేదు. హుదూద్ తుపాను మునుపెన్నడూ లేనంతగా ఉత్తరాంధ్రను కుదిపేసింది. ఈ నష్టం విద్యుత్ శాఖపై భారీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రోజూ 135 మిలియన్ యూనిట్లు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. తుపాను కారణంగా ఇది 108 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఉత్తరాంధ్రలో ఒక్క యూనిట్ కూడా సరఫరా చేయలేని పరిస్థితే ఇందుకు ప్రధాన కారణం. ఈ మూడు జిల్లాల్లో విద్యుత డిమాండ్ 24 మిలియన్ యూనిట్లు ఉంటుంది. అంధకారంలో జనం: మూడు జిల్లాలూ ప్రస్తుతం అంధకారంలోనే ఉన్నాయి. ఇక్కడ సాధారణ జనజీవనం కారుచీకట్లో బిక్కుబిక్కుమంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 7,410 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర వైద్యసేవలు ఆగిపోయి రోగులు హైరానా పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఆస్పత్రుల్లో ప్రాణాప్రాయ సేవలకూ ఆటంకం కలుగుతోంది. కొద్దిగంటలు జనరేటర్ల మీద నడిచినా, ఇప్పుడు ఆ వెసులుబాటూ లేదు. రవాణ వ్యవస్థ లేకపోవడం, డీజిల్ బంకులు మూతబడటంతో ఎమర్జెన్సీ సేవలకు ఆటకం ఏర్పడింది. తాగునీరు లేదు. విద్యుత్ లేకపోవడంతో ఓవర్ హెడ్ ట్యాంకులను నింపే మోటార్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సెల్ఫోన్ టవర్లు ఒక్కటీ పనిచేయడం లేదు. చిన్నాచితక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. చీకట్లోనే భయపడుతూ కాలం గడుపుతున్నారు. నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినడంతో, పాలన వ్యవస్థల మధ్య సమన్వయం లేకుండాపోయింది. కూలిన స్తంభాలు.. కొట్టుకుపోయిన ట్రాన్స్ ఫార్మర్లు విద్యుత్ సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ట్రాన్స్ఫార్మర్లు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 75 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినట్టు అంచనా. 1,100 స్తంభాలు పూర్తిగా వంగిపోయాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ విరిగిపడ్డ స్తంభాల సంఖ్య 20 వేలకు పైమాటే. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ప్రత్యామ్నాయ సరఫరాకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. యథాతథ పరిస్థితి నెలకొనడానికి కనీసం వారం రోజులైనా పట్టొచ్చని అధికారులే చెబుతున్నారు. రెండుచోట్ల 400 కె.వి. సబ్స్టేషన్లు కుప్పకూలాయి. 225 కె.వి. సబ్స్టేషన్లు 10 వరకు పనికిరాకుండా పోయాయి. 132 కె.వి. సబ్ స్టేషన్లు 25 వరకు నేలమట్టమయ్యాయి. గాజువాకలోని సింహాద్రి ఎన్టీపీసీ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పోలాకి, సంతబొమ్మాళి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. 100కు పైగా ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడం, నీట మునగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలోని పెందుర్తి ఉప కేంద్రం వద్ద సాంకేతిక లోపం ఏర్పడంతో జిల్లాలో సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ అధికారులు చెప్పారు. దీంతో పెందుర్తి నుంచి గరివిడికి సరఫరా నిలిచిపోయింది. పెందుర్తి సాంకేతిక లోపం సరిదిద్దతేగానీ జిల్లాకు సరఫరా రావడం కష్టం. విశాఖ జిల్లాలో 33 కె.వి. విద్యుత్ స్తంభాలు 22, 11 కె.వి. విద్యుత్ స్తంభాలు 3,339, ఎల్టీ విద్యుత్ స్తంభాలు 533, ట్రాన్స్ఫార్మర్లు 75 కూలిపోయాయని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా పరిస్థితిపై అధికారులకూ స్పష్టమైన అవగాహన లేదు. ఫోన్లు పనిచేయకపోవడంతో ఉన్నతాధికారులకు ఎలాంటి నివేదికలూ రాలేదు. 80 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగినట్లు తెలుస్తోంది. 7,657 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను పునరుద్ధరించాల్సి ఉంది. పునరుద్ధరణకు చర్యలు : తాజా పరిస్థితి నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ నగరానికి విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సిబ్బంది ఉత్తరాంధ్రకు రప్పించారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నుంచి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు, వైర్లు తరలించారు. తాజా పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్, జెన్కో సీఎండీ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. విజయానంద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే మకాం వేశారు. సింహాద్రి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ను దారికి తెచ్చేందుకు కొంత వరకు ప్రయత్నాలు జరిగాయి. ఇది పనిచేయడానికి అవసరమైన విద్యుత్ను వేమగిరి ప్లాంట్ నుంచి పంపాలని నిర్ణయించారు. సింహాద్రి ఉత్పత్తి ప్రారంభిస్తే విశాఖ సిటీకి కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు మరో నాలుగు మార్గాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నారు. తునిలోని 132 కె.వి. సబ్స్టేషన్ ద్వారా కొరుప్రోలు, పరవాడ, గాజువాక ద్వారా విద్యుత్ అందించాలని భావిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలోని 132 కె.వి. సబ్స్టేషన్ ద్వారా గాజువాకకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.గాజువాక నుంచి 80 మెగావాట్లు అందించే వీలుందని తెలుస్తోంది. మొత్తం మీద విశాఖ నగరానికి మంగళవారం సాయంత్రానికి ఒక స్థాయిలో విద్యుత్ అందించే వీలుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీగా సిబ్బంది : ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విద్యుత్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడ నుంచి రెండువేలమంది సిబ్బందిని పంపినట్టు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సెలవుల్లో ఉన్నవాళ్లను కూడా రప్పిస్తున్నారు. తెలంగాణ సాయం : ఉత్తరాంధ్రలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యుత్ సంస్థలు సాయం చేసేందుకు ముదుకొచ్చాయి. తెలంగాణ జెఎండీ కార్తికేయమిశ్ర సోమవారం ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్జైన్తో మాట్లాడారు. రూ.13 కోట్ల విద్యుత్ ఉపకరణాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు ఉత్తరాంధ్రకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాయానికి ముందుకొచ్చాయి. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
ములకలచెరువు: ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 400 కిలోల రాగి తీగలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రామాంజీనాయక్, ఎస్ఐ నరేష్కుమార్ సోమవారం తెలిపారు. వారి కథనం మేరకు..సోమవారం తెల్లవారుజామున తంబళ్లపల్లె ఎస్ఐ నరేష్కుమార్, తన సిబ్బందితో కోసువారిపల్లె క్రాస్వద్ద వాహనాల తనిఖీలు చేశారు. రెండు ఆటోలను తనిఖీ చేయగా వంద కిలోల రాగితీగలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లెకు చెందిన దనియాల పెద్దరమణ (43), సద్దాం(25), రమేష్(26) ఆటో డ్రై వర్లు మల్లేశ్వర్రావు(29), నాగరాజు (26)ను అరెస్ట్ చేశారు. వీరంతా ఆవుల శంకర్(30)నేతత్వంలో ఏడుగురి సభ్యులతో ఒక ముఠాగా ఏర్పడి ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది. అలాగే, కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని కొండలో నిందితులు దాచి ఉంచిన 300 కేజీల రాగితీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆవుల శంకర్(30), మచ్చ రమేష్(25) కోసం గాలిస్తున్నామని, ఆవుల శంకర్, దనియాల పెద్దరమణపై అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఇంతకు ముందు దాదాపు 200 ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఇదలా ఉంచితే, వీరు జిల్లాలో వివిధ మండలాల్లో 82 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగితీగలను చోరీ చేసినట్టు తేలింది. రాగితీగలను కొన్న వారినీ అరెస్ట్ చేస్తాం ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా నుంచి రాగితీగలను కొన్న మదనపల్లెకు చెందిన నలుగురు గుజిరీ వ్యాపారులను కూడా అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. వీరు నిందితుల నుంచి కిలో రాగి తీగలు ’300 చొప్పున కొని బెంగళూరులో 1000 రూపాయల వంతున విక్రయిస్తున్నట్టు తేలిందని వెల్లడించారు. 82 ట్రాన్స్ఫార్మర్ల చోరీకి సంబంధించి ఇంకనూ 946 కేజీల రాగి తీగలను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో ఎస్ఐలు నరేష్కుమార్, శ్రీకాంత్రెడ్డి, ఏఎస్ఐ నారాయణస్వామి, సిబ్బంది, శ్రీకాంత్, కుమార్, శిరాజ్, శంకర్, మారుతిరెడ్డి, -
ట్రాన్స్ఫార్మర్ల దొంగలు దొరికారు
మోమిన్పేట: కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్లు అపహరిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగలు ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. తీగ లాగితే డొంకంతా కదిలింది అన్న చందంగా.. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా నిందితులు ఆరుగురు దొరికా రు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన పంచలింగాల పర్మ య్య నాలుగేళ్ల క్రితం మోమిన్పేట విద్యుత్ సబ్స్టేషన్లో కాంట్రాక్టు బేస్లో పని చేశాడు. అతడి తీరు బాగలేకపోవడంతో రెండేళ్ల క్రితం అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు. జల్సాలకు అలవాటు పడిన అతడు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోంచి కాపర్ తీగలు అపహరించేందుకు పథకం పన్నాడు. తనొక్కడితో చోరీలు చేయడం కాదని భావించిన అతడు అదే గ్రామానికి చెందిన షేక్ ఆజం, అసిఫ్, ఎండీ రహమత్ అలీ, సీహెచ్ సంగయ్య, ద్యాంగ లాయక్ అలీతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. వీరు సయ్యద్అల్లిపూర్ 2, కేసారం గ్రామంలో 2, మొరంగపల్లి 3, వెల్చాల్ గ్రామంలో 2, దుర్గంచెరువు గ్రామంలో 2 మొత్తం 11 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగలు అపహరించారు. కాపర్ తీగలను నగరంలోని బేగంబజార్లో విక్రయించేవారమని నిందితులు పోలీసులకు తెలిపారు. ఇలా దొరికిపోయారు.. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గురువారం ఉదయం కేసారం గ్రామానికి చెందిన అసిఫ్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో అతడు మిగతా వారి పేర్లు చెప్పారు. ఈమేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
ఊరు వెలుగుతోంది!
వికాసం కంప్యూటర్లు, వైఫైలు అంటూ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక అభివృద్ధి పరుగులు తీస్తుంటే... కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ విద్యుత్ వెలుగులు కూడా లేక చీకట్లో అల్లాడుతున్నాయి. బీహార్లోని ధర్నాయ్ గ్రామానిది కూడా మొన్నమొన్నటి వరకూ అదే పరిస్థితి. కానీ ఇప్పుడా ఊరు మారిపోయింది. దీపకాంతితో వెలిగిపోతోంది. ఆ ఆనందం కోసం ముప్ఫయ్యేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది! ఒకప్పుడు ధర్నాయ్ గ్రామంలో సాయంత్రమవుతుంటే చాలు... చీకటితో పాటు నిశ్శబ్దం కూడా కమ్ముకునేది. సూర్యుడు కాస్త చల్లబడగానే పిల్లలు ఆటలాపి ఇళ్లకు పరుగులుదీసేవారు. పురుషులు పనులు ముగించుకుని బయలుదేరేవారు. ఇల్లాళ్లు వంటలు ముగించి దీపపు చిమ్నీలను శుభ్రం చేసుకుంటూ కూర్చునేవారు. ఎందుకంటే... సూర్యుడు ఒక్కసారి ముఖం చాటేశాక ఆ ఊరిలో అంధకారం అలముకునేది. కరెంటు లేదు. దీపపు కాంతితో పనులు చేసుకోవడం అంత తేలికా కాదు. అందుకే సూర్యుడు అస్తమించకముందే అన్ని పనులూ ముగించుకునేవారు. కానీ ఇప్పుడా బాధ తప్పింది. ఆ ఊరు వెలుగుతోంది. నిజానికి ధర్నాయ్లో ఇంతవరకూ కరెంటు లేదని కాదు. ఒకప్పుడు ఉండేది. అయితే నక్సల్ ప్రభావిత గ్రామం కావడంతో, 1981లో మావోయిస్టులు సృష్టించిన హింసాపాతానికి అక్కడి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. కేబుళ్లు కాలిపోయాయి. ఊరంతా చీకటైపోయింది. కానీ ప్రభుత్వం ఆ చీకటిని పారద్రోలే ప్రయత్నం చేయలేదు. దాంతో ముప్ఫయ్యేళ్ల పాటు వాళ్లు అలా అవస్థ పడుతూనే ఉన్నారు. వారి కష్టాలను చూసిన గ్రీన్పీస్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ... ఇటీవలే వంద కిలోవాట్ల సోలార్ పవర్ మైక్రో గ్రిడ్ను వేయడంతో, ఆ గ్రామంలోకీ వారి జీవితాల్లోకీ కూడా వెలుగు వచ్చింది. గ్రీన్పీస్ సంస్థ పుణ్యమా అని 450 ఇళ్లు, 50 దుకాణాలు, రెండు స్కూళ్లు, ఓ ఆసుపత్రి, ఓ రైతుశిక్షణా కేంద్రం, అరవై వీధి దీపాలు నిరాటంకంగా వెలుగుతున్నాయి. దాంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అర్ధరాత్రి వరకూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. గృహిణులు ప్రశాంతంగా ఇంటి పనులు చక్కబెట్టుకుంటున్నారు. పిల్లలు రాత్రికి భయపడటం మానేసి పొద్దుగుంకేవరకూ ఆడుకుంటున్నారు. అందరూ కలిసి గ్రీన్పీస్ సంస్థకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు! నిజానికి సోలార్ విద్యుత్ ద్వారా తమ జీవితాలు బాగుపడినా, తమకు అసలైన విద్యుత్ కావాలంటూ గ్రామస్థులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. భవిష్యత్తు అంతా సోలార్ మీదే ఆధారపడి ఉందని, దేశమంతా సోలార్ పవర్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు, నాయకులు నచ్చజెప్పినా వారు తృప్తి చెందలేదు. దాంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే ధర్నాయ్లో మామూలు విద్యుత్ సరఫరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. -
‘సెస్'లో చేతివాటం!
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) స్టోర్స్లో అవినీతి రాజ్యమేలుతోంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి స్టోర్కు తీసుకొస్తే లంచం ఇస్తేగానీ కొత్తవి ఇవ్వడం లే దు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పొట్టకొచ్చిన పొలా లు తడారిపోతున్నాయి. అసలే ఐదుగంటల కరెంటు... అది కూడా లోవోల్టేజీ.. తరచూ ట్రిప్పింగ్తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. సెస్ పరిధిలో నిత్యం ఏడు ట్రాన్స్ఫార్మర్ల వరకు కాలిపోతుండగా రిపేరు చేసి ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. కాసులిచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తుండడంతో సామాన్య రైతులు అసహనానికి గురవుతున్నారు. సిరిసిల్ల డివిజన్లోని వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఇల్లంతకుంట, సిరిసిల్ల మండలాల్లోని విద్యుత్ వినియోగదారులకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ఉరుపులుమెరుపులతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కాలిన 24 గంటల్లో మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాల్సి ఉండగా రిపేర్లలో జాప్యంతో రోజుల తరబడి ట్రాన్స్ఫార్మర్లు బిగించలేకపోతున్నారు. హెల్పర్లు రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి స్టోర్స్లో సిబ్బందికి రూ.2 వేలు ఇస్తూ వెంటనే ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్తున్నారు. ఈ పైరవీ తెలియడం చేయని సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి ట్రాన్స్ఫార్మర్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఒక్కో ట్రాక్టర్కు రూ.5వేల వరకు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ తరలింపునకు సైతం హెల్పర్ల చేయి తడపాల్సిందే. సెస్లో రెండు వ్యాన్లు ఉండగా, ఇటీవల మరో ట్రాక్టర్ అద్దెకు తీసుకున్నారు. వీటి ద్వారా ఆయా గ్రామాలకు ట్రాన్స్ఫార్మర్లు తరలించాల్సి ఉండగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ అద్దె పేరిట రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటే దాని పరిధిలోని ఒక్కో రైతుకు రూ.500 వరకు భారం పడుతోంది. డబ్బులివ్వకుంటే ట్రాన్స్ఫార్మర్ రావడం ఆలస్యమై పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉండడంతో అసహాయ స్థితిలో అన్నదాతలు డబ్బులిస్తున్నారు. కొత్తవి కొనుగోలు చేస్తున్నా.. సెస్ పరిధిలో 5,800 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా సగటున నిత్యం ఏడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. గత నెలలో 234 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, ఈ నెలలో ఇప్పటివరకే 173 కాలిపోయాయి. రోజుకు ఐదు ట్రాన్స్ఫార్మర్లు, మూడు షెడ్లలో రిపేరు చేస్తున్నారు. రిపేరవుతున్న ట్రాన్స్ఫార్మర్లు సరిపోవడం లేదు. ఇటీవల అధికారులు రూ.రెండు కోట్లతో 200 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ప్రతిపాదించారు. ఈ మధ్యే 20 కొత్త ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయి. వచ్చే నెలలో మరో ఇరవై ట్రాన్స్ఫార్మర్లు రానున్నాయి. కొత్తవి వస్తున్నా కొరత తీరడం లేదు. నిజానికి 60 కేవీ, 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్తో పని చేస్తున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది సామర్థ్యం మేరకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా ఉచిత కరెంటు కావడంతో నియంత్రణ లేకుండా కనెక్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా కొత్తవి కొనుగోలు చేస్తున్నా సరిపోవడం లేదు. -
కమీషన్ ఇస్తేనే కనెక్షన్!
ఒంగోలు క్రైం : వ్యవసాయ విద్యుత్కు సంబంధించి కొత్త కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసేందుకు ఆ శాఖాధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల అధికారులు నిబంధనల ప్రకారం రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయకుండా కమీషన్లు ఇచ్చిన వారికే మంజూరు చేస్తున్నారు. లంచాలు ఇవ్వని రైతులకు ఏడాదికి కూడా మంజూరు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లను దరఖాస్తులు వచ్చిన ఆర్డర్ ప్రకారం మంజూరు చేయాలి. కానీ, పలు మండలాల ఏఈలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కమీషన్లు ఇచ్చిన వారికి వెంటనే మంజూరు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కమీషన్లు ఇవ్వకుంటే నెలల తరబడి మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు మండలాల్లో పరిస్థితి అధ్వానం... జిల్లాలోని సింగరాయకొండ, టంగుటూరు, చీమకుర్తి మండలాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో పది మందికిపైగా రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేసిన అధికారులు.. వారికి మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయా రైతులు పంటలు సాగుచేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా టంగుటూరు మండంలో వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులు 30కిపైగా పెండింగ్లో ఉన్నాయి. చీమకుర్తి సెక్షన్ పరిధిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. అవినీతి ఆరోపణలపై నెలన్నర క్రితం చీమకుర్తి సెక్షన్ ఏఈని బదిలీ చేసినప్పటికీ అతను మాత్రం అక్కడే కొనసాగుతున్నారు. ఈ మండలంలోని ఒక్క చండ్రపాడు గ్రామంలోనే మూడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల కోసం 11 మంది రైతులు డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి కేబుల్ వరకూ విద్యుత్శాఖ ఆధ్వర్యంలోనే సమకూర్చి ఆ ప్రాంతానికి తరలించి బిగించాలి. కానీ, కిలోమీటర్ పొడవున కేబుల్ కొరత ఏర్పడిందని, దాన్ని తెచ్చుకుంటేనే ట్రాన్స్ఫార్మను బిగిస్తామని స్థానిక విద్యుత్ శాఖాధికారి చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే కేబుల్ను మాయంచేస్తూ రైతులతో తెప్పిస్తున్నారని, కమీషన్ ఇచ్చిన వారికే కేబుల్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో మరో 8 ట్రాన్స్ఫార్మర్ల దరఖాస్తులు కూడా కార్యాలయంలో మగ్గిపోతున్నాయి. పల్లామల్లి, మంచికలపాడు గ్రామాలకు చెందిన పలువురు రైతులు చీమకుర్తి ఏఈపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి మోమోలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ మండలంలో పరిస్థితి మారలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాభావానికితోడు విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా సాగుకు నోచుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
యువ సేన @ ట్రాన్స్ఫార్మర్స్
చెత్త తీసుకెళ్లేవాడు వస్తేనే ఆరడుగుల దూరంలో నుంచో పెట్టడం... మాసిపోయిన దుస్తుల్లో ఎవరైనా కనిపిస్తే చాలు వారిని హీనంగా చూడటం... ఇదీ మన సమాజం తీరు. ఈ సంఘం నుంచి ఫుట్పాత్ మీద కునారిల్లుతున్న బతుకులను చూసి అసహ్యించుకోవడమో, ఆమడదూరం నుంచి సాగిపోవడమో తప్ప వారిని ఆప్యాయంగా స్పర్శించే మానవత్వం ఆశించగలమా ? మట్టికొట్టుకుపోతున్న ముఖాలను తుడిచి, కడిగిన ముత్యాల్లా మెరిపించే ప్రేమాభిమానాలను ఊహించగలమా? కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంతం..ఆదివారం.. సాయంత్రం 4 గంటలు.. ఫుట్పాత్ మీద ఓ వ్యక్తి ఉన్నాడు. చింపిరి జుట్టు.. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం.. అక్కడక్కడా గాయాలు.. ముసిరిన ఈగలు.. అటుగా వెళ్తున్న వారు అతడ్ని చూడగానే దూరంగా జరిగి వెళ్తున్నారు. కొందరు ఈసడించుకుంటున్నారు. అదే సమయంలో ఓ ఐదుగురు యువకులు అక్కడికి వచ్చారు. ఫుట్పాత్పై ఏదో ధ్యాసలో ఉన్న ఆ వ్యక్తిని పలకరించారు. ఏదో చెబుతున్నారు.. అతను వద్దంటున్నాడు (సైగలతోనే). వీరు గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు. చుట్టుపక్కల జనాలంతా ఈ తంతును వింతగా చూస్తున్నారు. ఓ అరగంట తర్వాత అతడు సరేననడంతో సీన్ మారిపోయింది. అప్పటికప్పుడు తమ వెంటున్న సరంజామా బయటకు తీశారు. ఒకరు హెయిర్ స్టైలిస్ట్గా మారిపోతే, మరొకరు ఆస్పత్రిలో నర్స్ విధులను మొదలుపెట్టారు. ఒకరు వెంట తెచ్చిన క్యారియర్ నుంచి ఫుడ్ తీసి సిద్ధం చేస్తుంటే.. ఇంకొకరు ఓ వారానికి సరిపడా.. మందులు, సబ్బులు వంటివి కిట్లో సర్దుతున్నారు. ‘మమత కరువై.. మనుషుల మధ్యే మానుల్లా మనుగడ సాగిస్తున్న వారి జీవితాలు శిథిలమైపోతుంటే మౌనంగా ఉండటం సరైనదేనా..?’.. ఈ ప్రశ్నకు సమాధానంగా అవతరించిందే ‘ట్రాన్స్ఫార్మర్స్’. ఫుట్పాత్పై తెల్లారిపోతున్న బతుకులకు కాసింత వెలుగు ప్రసాదించడానికి నగర యువత తీసుకొచ్చిన కాంతిపుంజం. ఆదివారం అంటే ఆనందం అనుకునే ఈ తరం యువతకు కాస్త భిన్నంగా హాలిడేను హార్ట్ టచింగ్ డేగా కూడా మార్చుకుంటున్నారు వారు. మ్యూజిక్ బాండ్ నుంచి యంగిస్థాన్ వరకు.. నగరానికి చెందిన అరుణ్ డేవిడ్ మరికొందరు మిత్రులతో కలసి టేకెన్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నిర్వహించేవారు. ‘అప్పడు మేం చాలా కన్సర్ట్స్లో సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి పాటలు పాడేవాళ్లం. వాటికి ఇన్స్పైర్ అయిన వారు.. ఏం చేయాలని అడిగేవారు. అప్పుడే ఓ వేదిక స్థాపించాలనుకున్నాం. అలా ఓ ఐదుగురం కలసి 2012 మార్చిలో యంగిస్థాన్ స్టార్ట్ చేశాం’ అని తమ తొలి అడుగులను గుర్తు చేసుకున్నారు అరుణ్. ప్రస్తుతం ఇందులో 120 మంది రిజిస్టర్ట్ వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఆదివారం వీరు సమావేశమవుతారు. వారానికో వాలంటరీ ఇంట్లో వంట చేయించి 1,000 మంది నిర్భాగ్యులకు పంపిణీ చేస్తుంటారు. ప్రతి శనివారం కనీసం ఐదు అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడి పిల్లలకు ట్యూషన్ చెబుతారు. ఇదే కోవలో ఈ యువసేన వేసిన మరో ముందడుగే ట్రాన్స్ ఫార్మర్స్. ఆలోచన వెనుక.. ఫుట్పాత్ మీద అపరిశుభ్రంగా ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ ఆలోచన కలిగిందని యంగిస్థాన్ సభ్యుడు రోహిత్ చెబుతాడు. ‘పగబట్టిన విధి వీరిని విగత జీవులుగా మార్చేసింది. నెలలు కాదు ఏళ్లకేళ్లు వీళ్లు స్నానం చేయరు. వీరి జీవితాలను ఎందుకు మార్చకూడదు అనిపించింది అనుకున్న’ ఈ యువత కాచిగూడ స్టేషన్ దగ్గర ఫుట్పాత్ మీదున్న ఓ వృద్ధుడి మేకోవర్తో ‘ట్రాన్స్ఫార్మర్స్’గా తొలి అడుగు వేసింది. ‘అపరిశుభ్రంగా ఉన్న ఆ వృద్ధుడ్ని ఎంతో బతిమాలితే గాని ఒంటి మీద చేయి వేయనీయలేదు. అతనికి ట్రిమ్ చేసి.. స్నానం చేయించి.. ఫొటో తీసి చూపిస్తే.. ఆయన దాన్ని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడ’ని చెప్పుకొచ్చారు ఆ యువకులు. వారానికి ఐదుగురు వీరిలో వారానికి ఐదుగురు బ్యాచ్ చొప్పున ట్రాన్స్ఫార్మర్స్ అవతారమెత్తుతున్నారు. హెయిర్ కటింగ్, ప్రాథమిక చికిత్స మెళకువలు నేర్చుకుంటు న్నారు. ‘మేకోవర్కు గంట పడుతోంది. కొందరి వెంట్రుకల్లో పురుగులుంటాయి. కొందరి జుట్టు కట్ చేయడానికి వీలులేకుండా ఉంటాయ’ని గుర్తు చేసుకుంటూ ఆ అభాగ్యజీవుల బతుకులపై వీరికున్న సానుభూతి వ్యక్తమైంది. అలా వదిలేయకుండా.. ‘ఈ ఫుట్పాత్ జీవులలో వృద్ధులే ఎక్కువ. పిల్లల ఆదరణ లేని వారు, రోడ్డు ప్రమాదాలకు గురై మానసికంగా దెబ్బతిన్నవారు.. ఇలా ఎందరో ఉన్నారు. వీరిని మేకోవర్ పూర్తయ్యాక వదిలేయకుండా ట్రైనింగ్ సెంటర్స్కు పంపాలని ఆలోచనలో ఉన్నాం. రిహాబిలిటేషన్, స్కిల్ ట్రైనింగ్, షెల్టర్ హౌస్కు కూడా ప్లాన్ చేస్తున్నాం. సులభ్ వారితో మాట్లాడి వారికో శాశ్వతమైన ఐడీ తీసుకుందాం అనుకుంటున్నాం’ అంటూ తమ భవిష్యత్ ప్రణాళికలు వివరించారీ మిత్రబృందం. ‘ది సోల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సర్వ్ హ్యుమానిటీ’ అన్న లియో టాల్స్టాయ్ మాటల్నే తమ చేతలకు ప్రాతిపదికగా చెబుతున్న ఈ స్నేహితులు చేస్తున్న సేవ.. యువత నడతకు కొత్త భాష్యం. -
ట్రాన్స్‘ఫార్మర్ల’ కష్టాలు
- కాలిపోతున్నట్రాన్స్ఫార్మర్లు - స్పందించని అధికారులు - తరలించేందుకు కాడెడ్లుగా మారిన కర్షకులు మెదక్: ఓవైపు అనావృష్టి...మరోవైపు కరెంట్ కోతలతో సతమతమవుతున్న రైతన్నలకు కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు కన్నీళ్లు పెట్టిస్త్తున్నాయి. ఈ క్రమంలోనే పురిట్లో ఉన్న వరి పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయించాల్సిన ట్రాన్స్కో అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలే చందాలు వేసుకొని ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయించేందుకు తరలిస్తున్నారు. కరువు కాలంలో కాసులు లేక...కాడెడ్ల బండి ఉన్నా..ఎడ్లులేక గత్యంతరం లేని పరిస్థితుల్లో శనివారం పాపన్నపేట మండలం డాక్యా తండాకు చెందిన గిరిజన రైతులు బండిని లాగుతూ పాపన్నపేట రిపేర్ సెంటర్కు ట్రాన్స్ఫార్మర్ను తరలించిన సంఘటన కర్షకుల కన్నీటి వెతలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. జిల్లాలో సుమారు 18 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ సెంటర్లుండగా, అందులో మండల కేంద్రమైన పాపన్నపేటలోని సెంటర్ కూడా ఒకటి. పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఇక్కడికే తీసుకొస్తుంటారు. అయితే ఏ ట్రాన్స్ఫార్మర్ కాలినా..వెంటనే ట్రాన్స్కో అధికారులకు సమాచారం అందించగానే ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి నిర్ధారణ చేసుకోవాలి. అనంతరం కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఫిర్యాదు నమోదు చేసుకొని సంబంధిత ఏఈ ట్రాన్స్పోర్ట్ నోట్(టీనోట్) ఇస్తారు. ఈ మేర కు డిపార్ట్మెంట్కు చెందిన వాహనంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ సెంటర్కు తీసుకురావాలి. దాన్ని మరమ్మతు చేసిన అనంతరం తిరిగి డిపార్ట్మెంట్ వాహనంలోనే తీసుకొచ్చిన చోటుకు తరలించాలి. రిపేర్ అయినా కాకున్న 24 గంటల్లో రోలింగ్ ట్రాన్స్ఫార్మర్కు వినియోగదారులకు అందించాలి. ఈ మేరకు రైతుల నుంచి ఒక్కో సర్వీస్ కు రూ.30 చొప్పున సర్వీస్ టాక్స్కింద వసూలు చేస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రైవేట్ వాహనాలే దిక్కు ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు తరలించేందుకు ఒక వాహనం ఉంటుంది. కానీ అవి ఎప్పుడు అందుబాటులో ఉండక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ సొంత ఖర్చులతో ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసుకొని రిపేర్ సెంటర్కు ట్రాన్స్ఫార్మర్ను తరలిస్తుంటారు. ఈ క్రమంలో రిపేర్ సెంటర్లో ట్రాన్స్ఫార్మర్ను అన్లోడ్, లోడ్ చేసేందుకు సుమారు రూ.600, ప్రైవేట్ వాహనంలో తరలించేందుకు సుమారు రూ.3 వేలు, పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్ విప్పి, బిగించడానికి సుమారు రూ.500 ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తడిసిమోపెడవుతున్న ఖర్చులు లోవోల్టేజీ..అధిక లోడ్ తదితర కారణాల వల్ల ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయి. దీంతో మరమ్మతుల వ్యయం తడిసిమోపెడవుతుందని అన్నదాతలు వాపోతున్నారు. నెల రోజుల క్రితం ఎల్లాపూర్లో 63కే వీ ట్రాన్స్ఫార్మర్ అధికలోడుతో 15 రోజుల్లో ఆరుసార్లు కాలిపోయినట్లు రైతులు చె ప్పారు. అలాగే 2 నెలల క్రితం నాగ్సాన్పల్లిలో వారం రోజుల్లో ఓ ట్రాన్స్ఫార్మర్ నాలుగుసార్లు కాలిపోయిందని తెలిపారు. దీంతో వేలాది రూపాయలు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాడెడ్లుగా మారిన కర్షకులు పాపన్నపేట మండలం అర్కెల గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్యా తండాలో మూడు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ సెంటర్కు తరలించడానికి డబ్బులు లేకపోవడం, కనీసం కాడెడ్లుగా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో గిరిజన రైతులే ఎడ్లుగా మారి సుమారు 5 కిలో మీటర్ల దూరం ఎడ్లబండిపై కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను లాక్కొచ్చారు. తీరా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయిన తర్వాత ట్రాక్టర్ తీసుకొస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని ట్రాన్స్కో ఉద్యోగి మెలిక పెట్టడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. పనిభారంతోనే... సబ్డివిజన్లో పనిభారం వల్ల డిపార్ట్మెంట్ వాహనాన్ని రైతుల వద్దకు పంపలేక పోతున్నాం. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం -శేఖర్, ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు
- ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లలో రాగివైరు చోరీ - గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 22 దొంగతనాలు - మొత్తం రూ.4.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చిలకలూరిపేట రూరల్ (గుంటూరు) : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లాల దొంగల ముఠాను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు దొంగిలిస్తుంటారు. నిందితుల వద్ద నుంచి రూ.3,55,225 విలువైన రాగివైరు, రూ.75,000 విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు కలిపి మొత్తం రూ.4,30,225 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు రూరల్ ఆపరేషన్స్ ఓఎస్డీ, నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ కె.సి.వెంకటయ్య ఆ వివరాలు వెల్లడించారు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులకొట్టి రాగివైరును దొంగిలించిన ఐదు కేసులపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జాతీయరహదారి సమీపంలోని గొర్రెలమండి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ఎస్సై జగదీష్ విచారించారు. ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరు అపహరించే ముఠాగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు గ్రామానికి చెందిన పొత్తూరు లక్ష్మీనారాయణ అలియాస్ ఎఫ్రా నాయకుడిగా తన సమీప బంధువులైన పొత్తూరు కిషోర్, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన పొత్తూరు వెంకటనారాయణ, గుంటూరు సంగడిగుంటకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ రహీమ్తో కలిసి గతేడాది డిసెంబర్ నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠానాయకుడు చిలకలూరిపేట పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో 2001లో జరిగిన దొంగతనం కేసులో నిందితునిగా ఉన్నాడు. గ్రామాలకు దూరంగా ఎత్తిపోతల పథకాల వద్ద, మూతపడిన పరిశ్రమల్లో ఉండే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో ఉండే రాగివైరును వీరు అపహరిస్తుంటారు. వివిధ కంపెనీల్లో కంప్యూటర్లు కూడా చోరీ చేశారు. నిందితులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 11 పోలీస్స్టేషన్ల పరిధిలోని 33 గ్రామాల్లో 22 దొంగతనాలు చేశారు. వీటికి సంబంధించి చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషన్లో 5, యడ్లపాడు పోలీస్స్టేషన్లో 1, ఫిరంగిపురం 3, దాచేపల్లి 1, గుంటూరు రూరల్ 2, నకరికల్లు 2, బండ్లమోటు 2, పెదనందిపాడు 1, ఈపూరు 2, ప్రకాశం జిల్లా ముండ్లమూరు 2, అద్దంకి పోలీస్స్టేషన్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి అరెస్టు చేసిన నలుగురు నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఓఎస్డీ చెప్పారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ టి.సంజీవ్కుమార్, ఎస్సై ఎస్.జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి ఓఎస్డీ అభినందనలు.. రెండు జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులను విచారించి చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఓఎస్డీ వెంకటయ్య అభినందించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ సంజీవ్కుమార్, ఎస్సై జగదీష్లను అభినందించడంతోపాటు.. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎన్.ఇర్మియ, బాషా, హోంగార్డు మధు, డ్రైవర్ ఎ.రామ్లాల్నాయక్లకు రూ.500 చొప్పున నగదు బహుమతి అందించారు. -
100 రోజుల విద్యుత్ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి
విజయనగరం మున్సిపాలిటీ: ఏపీఈపీడీ సీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో చేపడుతున్న 100 రోజుల ప్రణాళిక పనులపై దృష్టి సారించాలని ఎస్ఈ సి.శ్రీనివాసమూర్తి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. దాసన్నపేట విద్యుత్ భవనంలో జిల్లాలోని అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికల పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి సామగ్రిని ప్రతి వారం తెప్పిం చుకుని పనులను ప్రణాళికా బద్దంగా చేయాలని చెప్పారు. మొత్తం 100 రోజుల వ్యవధిలో ప్రతిపాదించిన పనులన్నింటినీ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, ఏబీ స్విచ్లు ఏర్పాటుతో పాటు లూజ్ స్పాన్స్ సరిచేయటం, ఒరి గిన, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్పు చేయటం వంటి పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలన్నారు. చేసే పనులను పక్కగా నిర్వహించ టం ద్వారా సమస్యలను అధిగమించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వం వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో అందుకు సన్నద్ధం కావాలని సూచించారు. అనంతరం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, బిల్లుల వసూళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. బిల్లుల వసూళ్ల విషయంలో శతశాతం లక్ష్యాలను సాధించి సంస్థను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ టెక్నికల్ డీఈటీ ఎల్.ఆర్.దైవప్రసాద్, ఎస్ఈ వెంకటరాజు, విజయనగరం డీఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు పలు విభాగాల డీఈలు, ఏడీఈలు, ఏఈలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వాల్మార్ట్... ట్రాన్స్ఫార్మర్స్
వాషింగ్టన్: ట్రాన్స్ఫార్మర్స్ సినిమా చూశారా! అందులో అత్యాధునిక కార్లు, ట్రక్కులు సూపర్ఫాస్ట్గా పరుగులు తీస్తూ.. అంతలోనే భారీ రోబోలుగా మారిపోతుంటాయి. ఈ రోబోల భాగాన్ని పక్కన పెడితే అచ్చం ఆ తరహాలో భారీ ట్రక్కులను తయారు చేయించుకుంటోంది అమెరికన్ రిటైలింగ్ దిగ్గజం వాల్మార్ట్. అమెరికాలో 4,700 పైచిలుకు ఉన్న తమ స్టోర్స్కి సరుకులను చేరవేసేందుకు వీటిని వినియోగించనుంది. పూర్తిగా కార్బన్ ఫైబర్తో పీటర్బిల్ట్ అనే సంస్థ వీటిని తయారు చేస్తోంది. ప్రస్తుతం వాల్మార్ట్ ఉపయోగించే ట్రక్లతో పోలిస్తే ఇవి 4,000 పౌండ్ల మేర తేలికగా ఉంటాయి. స్లైడింగ్ డోర్లు, స్పేస్షిప్లో కెప్టెన్ చెయిర్ తరహా డ్రైవరు సీటు, వాహనానికి అన్ని వైపులా ఏం జరుగుతోందన్నది తెలుసుకోవడానికి డాష్బోర్డ్కి రెండు వైపులా మానిటర్లు .. ఒకటేమిటీ అనేక హంగులు ఈ ట్రక్లో ఉంటాయి. ఈ ట్రక్లలో ఏకంగా 18 చక్రాలు ఉంటాయి. ఇలాంటి భారీ ట్రక్కులు ఒకదాని వెనుక మరొకటి నిర్దిష్ట దూరంలో వెడుతుంటే రోడ్డు మీద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఏకకాలంలో ముందుకు దూసుకెడుతూ, ఒకేసారి బ్రేకులు వేస్తూ ప్లాటూనింగ్ విధానంలో ఈ వాహనాలు ప్రయాణించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గడం, రోడ్డుపై రద్దీ తగ్గడం.. భద్రత పెరగడం, సరైన సమయానికి డెలివరీ చేయగలగడంతో వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయంటున్నారు రూపకర్తలు. మనుషుల ప్రమేయం లేకుండా పరస్పరం సమన్వయపర్చుకునేలా వీటిని తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో అసలు డ్రైవర్ల అవసరమే లేకుండా పోతుంది. ఇప్పటికే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్ను ఉపయోగిస్తున్న పీటర్బిల్ట్ సంస్థ.. డ్రైవర్ల పనిని మరింత సులువు చేసే టెక్నాలజీలను రూపొందించే పనిలో ఉంది. ఆన్లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే కస్టమర్లకు ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. -
ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు
పెండింగ్లో 32 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీవ్ర ఇబ్బందుల్లో రైతులు బోర్లలో నీరున్నా ప్రయోజనం సున్నా అనంతపురం టౌన్ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నా.. సకాలంలో విద్యుత్ కనెక్షన్ రాకపోవడంతో పంటలు సాగు చేయలేకపోతున్నారు. అనధికారికంగా కనెక్షన్ తీసుకుందామంటే ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడ్ పడుతుందన్న నెపంతో తోటి రైతులు అంగీకరించకపోతుండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. దీంతో కనెక్షన్ కోసం ట్రాన్స్కో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా అతీగతీలేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు కనెక్షన్లు మంజూరు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో వర్షాధారంగా 8.75 లక్షల హెక్టార్లు, బోరుబావుల కింద 1.57 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 2.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్న చోట బోర్లు వేసుకోగా పుష్కలంగా నీరు పడటంతో 32 వేల మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ బోర్ల కింద కూడా పంటలు సాగైతే మరో లక్ష ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అయితే.. ట్రాన్స్కో అధికారులు మాత్రం కనెక్షన్ల మంజూరుకు కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం రెండేళ్ల కింద దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు ఇస్తున్నారు. వీటన్నింటికీ మెటీరియల్ సరఫరా చేస్తే ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం కూడా అధికారులకు పెద్ద సవాలే. పెండింగ్ కనెక్షన్లు పూర్తయ్యేదెన్నడో? ప్రతి ఐదు వ్యవసాయ కనెక్షన్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన 32 వేల కనెక్షన్లకు ఏడు వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలి. వీటితో పాటు దిమ్మెలు నిర్మించాలి. ప్రస్తుతం ప్రతి నెలా వంద కనెక్షన్లు కూడా మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కనెక్షన్లు మంజూరు కావాలంటే ప్రజాప్రతినిధులు ప్రత్యేక బడ్జెట్ ద్వారా మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లు తీసుకురావాల్సిన అవసరముంది. మెటీరియల్ కంటే దరఖాస్తులే ఎక్కువ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం 32 వేల వరకూ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఎప్పటిలోగా పూర్తి చే యగలమని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్న మెటీరియల్ కంటే రైతుల దరఖాస్తులే అధికంగా ఉంటున్నాయి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ కావాలంటే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. - ప్రసాద్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ -
రాలిపోతున్న రైతన్నలు
విద్యుత్ షాక్లు, ఆత్మహత్యలు ‘సాగు’ కష్టాలకు దర్పణం తల్లడిల్లుతున్న మెతుకుసీమ చోద్యం చూస్తున్న అధికారులు ఒకవైపు విద్యుత్షాక్లు.. మరోవైపు ఆత్మహత్యల కారణంగా రైతన్నలు రాలిపోతుండటంతో మెతుకుసీమ తల్లడిల్లుతోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు పండే అవకాశం లేక.. అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద తలెత్తే చిన్నచిన్న లోపాలను సరిచేయడంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులే సొంతంగా మరమ్మతులు చేయడానికి సిద్ధమవుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సోమవారం కొండపాక మండలం మర్పడగ గ్రామంలో చోటుచేసుకున్న రైతు కనకయ్య దుర్ఘటన విషాదాన్ని నింపింది. జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు వ్యవసాయరంగ దుస్థితిని చాటుతున్నాయి. గజ్వేల్: జిల్లాలోని ఆయా మండలాల్లో ఎంతోకాలంగా విద్యుత్ శాఖ రైతులకు సేవలందించడంలో వైఫల్యాన్ని చాటుకుంటూ వస్తోంది. పొలాల్లో స్తంభాలు వంగి వైర్లు చేతికందే స్థాయిలో వేలాడుతున్నా.. ట్రాన్స్ఫార్మర్లు చిన్నచిన్న లోపాలతో పనిచేయకున్నా, విద్యుత్ లైన్లు రైతులను ఇబ్బందిపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాలుగేళ్ల కాలంలో జిల్లాలో వందలాది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో 60 మందికిపైగా రైతులు విద్యుత్ షాక్లతో మృతిచెందడం కలవరాన్ని సృష్టిస్తోంది. గజ్వేల్ పట్టణానికి చెందిన వెల్దండ నర్సారెడ్డి అనే రైతు క్యాసారం గ్రామ సమీపంలో అయిదెకరాల సొంత పొలం వుంది. ఇందులో వరినాట్లు వేసిన ఆ రైతు.. పొలంలో యూరియా చల్లుతూ చేతికందే స్థాయిలో వున్న వైర్లను తాకి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన.. 2010 ఆగస్టు 16న జరిగింది. అదే ఏడాది జూలై 7న తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్న వడ్డెపల్లి నర్సింలు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ షాక్కు గురై మృతిచెందాడు. 2011 జూలైలో బంగ్లావెంకటాపూర్లో మెతుకు అంజిరెడ్డి(60) విద్యుత్ షాక్కు బలైపోవడం ఆందోళన కలిగించింది. ఇదే క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఏడాదిన్నర క్రితం గణేష్గౌడ్ అనే యువరైతు పొలంలోని వైర్లను తాకి మృత్యువాత పడ్డాడు. 2014 మార్చి 31న గజ్వేల్ మండలం కోమటిబండలో ఉబ్బని రామయ్య అనే రైతు అర్ధరాత్రి కరెంట్కు బలైన సంగతి తెలిసిందే. తడారిన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన రామయ్య పొలంలో తెగిపోయి వేలాడుతున్న వైరును తాకడంతో షాక్కు గురై మృతిచెందాడు. ఈ క్రమంలోనే తాజాగా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ చేస్తూ కనకయ్య దుర్మరణం చెందిన సంఘటన రైతుల దుస్థితిని చాటుతుంది. ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు.. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండే అవకాశంలేదని, ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీర్చలేమని మనోస్థైర్యం కోల్పోతున్న రైతులు జిల్లాలో వరుసగా బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ నెల 13న కొండపాక మండలం మంగోల్ గ్రామంలో చిట్యాల రామలింగారెడ్డి(69), 4న గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో కొడిశెల రవి(35), అదే గ్రామంలో జూన్ 24న ఫిరంగి ఎల్లయ్య(50), గత నెల 14న గజ్వేల్ మండలం ముట్రాజ్పల్లి గ్రామంలో చీర్ల యాదయ్య(50), 17న జగదేవ్పూర్ మండలం రాయవరం గ్రామంలో భిన్నమైన ముత్యాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఉచిత విద్యుత్ ఉత్తుత్తిదే
నెల్లూరు(హరనాథపురం): రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇళ్ల కు 24 గంటల విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పాడైన ట్రాన్స్ఫార్మర్లకు 24 గంటల్లో మరమ్మతులు... ఇవి టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు. జిల్లాలో వాస్తవ పరిస్థితి ఏమిటంటే విద్యుత్ కోసం ఎండల్లో ఎం డుతూ, రాత్రుళ్లు కటిక చీకట్లో చేల ల్లోనే గంటల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో 1.38 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి రైతులకు ఇచ్చిన ఫ్రీ సర్వీసులకు నెలకు రూ.30 వంతున యూజర్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లించే మోతుబరి రైతులకు ఇచ్చిన 2000 వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్కు రూ.4.50 వంతున వసూలు చేస్తున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నెలకు రూ.25 కోట్ల రాయితీని భరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టీడీపీ హామీలు ఇచ్చినట్లు జిల్లాలో తొమ్మిది గంటల విద్యుత్ అమలు కావడం లేదు. ఏడు గంటల విద్యుత్ సరఫరాలో నిరవధికంగా మూడు గంటలు కూడా అమలు కావడం లేదు. జిల్లాలో సబ్స్టేషన్ల వారీగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను నాలుగు గ్రూపులుగా విభజించిన అధికారులు సరఫరా వేళలను మార్చారు. ‘ఎ’ గ్రూపునకు రాత్రి 11.15 నుంచి 4.15 గంటల వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 వర కు, బీ గ్రూపునకు ఉదయం 4.55 నుంచి 9.15 వరకు, రాత్రి 11.15 నుంచి 1.15 వరకు, సీ గ్రూపునకు రాత్రి 9.15 నుంచి 2. 15 వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 3.15 వరకు, డీ గ్రూపునకు మధ్యాహ్నం 2.10 నుంచి 7.10 వరకు, రాత్రి 3.15 నుంచి 5.15 వరకు విద్యుత్ సరఫరా వేళలుగా నిర్ణయించారు. అయితే ఆచరణలో ఎక్కడా అ మలు కావడం లేదు. చంద్రబాబు పాలన వ చ్చి నెల గడుస్తున్నా 9 గంటల విద్యుత్కు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలు, వడగాలుల నేపథ్యంలో ఉ దయం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. తప్పని ఇక్కట్లు: రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉంటుం దని, కోతలు తగ్గుతాయని భావిస్తే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. విద్యుత్ కోతల తో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు భయాందోళనలో ఉన్నారు. ఉదయగిరి, విం జమూరు, కలిగిరి, పొదలకూరు, రాపూరు తదితర మండలాల రైతులు వ్యవసాయ వి ద్యుత్పై ఆధారపడి అరటి, బత్తాయి, పత్తి, కూరగాయలు, తదితర పంటలు సాగు చేస్తు న్నారు. డెల్టాలోనూ కొంత మేర చెరుకు, వరి పంట బోర్ల కిందే సాగుచేస్తున్నారు. ప్రస్తు తం కోతల నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి నా 24 గంటల్లో మార్చేస్తామన్న ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. ఫీజులు దెబ్బతిన్నా, గాలులకు తీగలు తెగిపడినా సిబ్బంది స్పందించడం లేదు. ప్రభుత్వం స్పందించి సమస్యలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
ప్రేయసి తప్పని చెప్పడానికి ఐమాక్స్ థియేటర్ల బుకింగ్
ప్రేయసి మెప్పు పొందడానికి యువకులు కష్టాలు తప్పవనేది కాదనలేని వాస్తవం. చైనాలోని ఓ పేద ప్రేమికుడికి ప్రేయసిని ఒప్పించడానికి చాలానే కష్టపడాల్సి వస్తోంది. ఏడేళ్ల క్రితం తన ప్రేమని రిజెక్ట్ తీరు తప్పు అని నిరసన వ్యక్తం చేస్తూ ఓ చైనా యువకుడు హు జియా యూన్ 40 వేల డాలర్లు పెట్టి 'ట్రాన్స్ ఫార్మర్స్' అనే చిత్రం చూసేందుకు మొత్తం నాలుగు ఐమాక్స్ సినిమాహాళ్లను తొలి రోజు తొలి ఆటకు బుక్ చేశారు. 2007లో కళాశాల విద్యలో నాలుగవ సంవత్సరం చదువుతున్న సమయంలో తాను చాలా పేదవాడిని. ఆసమయంలో రెండు సినిమా టికెట్లు కొనే స్థోమత కూడా లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రేయసి విధించిన శిక్ష తలచుకుంటూ గత ఏడు సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేస్తున్నాను. జూన్ 27 తేదిన బీజింగ్ లోని ఐమాక్స్ సినిమా హాళ్లలో ఓ నెల సంపాదనలోని సగం మొత్తాన్ని ఖర్చు చేశానన్నారు. తన ప్రేయసి తీసుకున్న నిర్ణయం తప్పని చేప్పడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తన ప్రేయసిని చూసేంత వరకు ఈ వార్తను ఇంటర్నెట్ వినియోగదారులు పోస్ట్ చేయాలని.. ప్రతిఫలంగా నగదు బహుమతితోపాటు ఉచితంగా సినిమా టికెట్లను అందిస్తాను అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఒకవేళ తనను విడిచి వెళ్తే.. నేను నీకోసమే ఉంటాననే విషయాన్ని ప్రపంచానికి తెలియచేస్తానని ఆమెను కలుసుకున్న తొలి రోజే చెప్పానని యూన్ తెలిపారు. -
రైతులతో ట్రాన్స్కో‘మిత్రభేదం’
నిజామాబాద్ నాగారం : కరెంటోళ్లు కర్షకులతో కటీఫ్ చేసినట్లున్నారు. ఈ మధ్య రైతులతో మిత్రబేధం పాటిస్తున్నారు. ఒక్క ఫోన్కాల్ చేస్తే చాలు.. 24గంటల్లో ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేసి ఇస్తామంటూ ‘రైతుమిత్ర’ పేరిట ట్రాన్స్కో ప్రారంభించిన పథకం ఆగిపోయింది. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయమిశ్రా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఏడాదిలోపే రెండుసార్లు నిలిచింది. తాజాగా నెలరోజుల నుంచి అమలు కావడం లేదు. ప్రతిష్టాత్మకంగా రైతుమిత్ర రైతుల ఇబ్బందులు, కష్టాలు ప్రత్యక్షంగా చూసిన సీఎండి కార్తికేయమిశ్రా ప్రతిష్టాత్మకంగా రైతుమిత్ర పథకం ప్రారంభించారు. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. రైతుల పంటపొలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు.. తదితర విషయాల్లో సమస్యలు తలెత్తితే ఒక్క ఫోన్కాల్తో 24గంటల్లో సమస్య పరిష్కరించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకాన్ని రైతులు బాగానే సద్వినియోగం చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిన వెంటనే టోల్ఫ్రీ నంబర్- 9440811600కు ఫోన్ చేస్తే సరిపోయేది. జిల్లాలోని మారుమూల గ్రామంలో, అటవీ ప్రాంతంలో సాగుచేస్తున్న పంటపొలాల్లో నుంచి ఫోన్ చేసినా అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోని సమస్యను తెలుసుకునేవారు. 24గంటల్లో రైతుల ట్రాన్స్ఫార్మర్ల సమస్యను పరిష్కరించే వారు. ఈ పథకం పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి సీఏండీ ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకునేవారు. నెలకు 700ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులకు సంబంధించి జిల్లాలో ప్రతి నెలా సుమారు 700వరకు ట్రాన్స్ఫార్మర్ల మర్మతులు అయ్యేవి. వీటిపై సీఎండీ సీరియస్ ఉండడంతో అధికారులు బాగానే పని చేశారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే ఎప్పుడు బాగవుతుందో తెలియని పరిస్థితి. దాన్ని బాగు చేయాలంటే రైతులే స్వంత ఖర్చులతో దగ్గరలోని డివిజన్ కార్యాలయానికి తరలించేవారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ బాగు చేయాలంటే అధికారులు ముడుపులు సైతం తీసుకునేవారు.ఈక్రమంలో రైతుమిత్ర పథకం వారిపాలిట వరంలా మారింది. ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే అధికారులే వచ్చి..బాగుచేయించి మళ్లీ యథావిథిగా పెట్టేవారు. ఇందుకు సంబంధించి రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు. రవాణా సైతం ఉచితంగానే చేసేవారు. నెలకు 700వరకు ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయిన 24గంటల్లో బాగు చేసి రైతులకు కష్టం కలుగకుండా చూసేవారు. రైతులకు మళ్లీ కష్టాలు రైతుమిత్ర పథకం ఆగిపోవడంతో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో మే నుంచి ఈ పథకాన్ని నిలిపివేశారు. గతంలో కూడా రెండు సార్లు నిలిపివేయడంతో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల్లో అధికారులు, సిబ్బంది మళ్లీ మాముళ్లకు అలవాటు పడటంతో అధికారులు పథకాన్ని పునఃప్రారంభించారు. ఇప్పు డు నెల గడుస్తోంది.. పథకం ఎందుకు ఆపివేశారో తెలియదు. దీంతో రైతులకు మళ్లీ పాతకష్టాలు మొదలయ్యాయి. వెంటనే రైతుమిత్ర ను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. తీసుకురావడానికే రెండువేలు ఖర్చు మాది మాక్లూర్ మండలం కల్లెడ. ఐదుగురు రైతులం కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ను పొలంలో ఏర్పాటు చేసుకున్నాం. రెండు నెలల కిందట అది చెడిపోవడంతో రైతుమిత్ర ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మరమ్మతులు చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ చెడిపోయింది. రైతుమిత్ర పథకం లేదని చెప్పడంతో మేమే రూ. రెండువేలు రవాణా ఖర్చులు భరించి తీసువచ్చాం. -గంగారెడ్డి, రైతు -
బతుకు బుగ్గి
నగరంలో శుక్రవారం తెల్లవారుజామున స్వల్పవ్యవధిలో చోటుచేసుకున్న రెండు అగ్నిప్రమాదాలు ప్రజలను భయకంపితులను చేశాయి. ఒక ప్రమాదంలో సుమారు 150 గుడిసెలు కాలిబూడిదయ్యూరుు. దీంతో పేద ప్రజలు సర్వం కోల్పోరుు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మరో సంఘటన ప్రజల కంటిపై కునుకులేకుండా చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: నుంగంబాకం పుష్పానగర్ కరుమారియమ్మన్ కోవిల్ సమీపంలో సుమారు 500కు పైగా గుడిసెలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఒక గుడిసెలో మంటలు చెలరేగారుు. ఆ ఇంటి లో కాపురం ఉంటున్న వారు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వీరి కేకలకు మేల్కొన్న ఇరుగుపొరుగు వారు కూడా మంటలను చూసి భయంతో బయటకు వచ్చారు. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. మంచి నిద్రలో ప్రమాదం సంభవించడంతో ప్రజలు షాక్ నుంచి తేరుకునేలోగా గుడిసెలన్నీ కాలిబూడిదయ్యూరుు. ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, బీరువాలు తదితర సామగ్రి కాలిబూడిదయ్యూరుు. గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అక్కడికి సమీపంలో పార్కు చేసి ఉన్న 10 మోటార్ సైకిళ్లు కూడా కాలిబూడిదయ్యూరుు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 150 గుడిసెలు కాలిపోయూరుు. ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు రూ.10 లక్షల నష్టం సంభవించినట్టు అధికారులు అంచనావేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వలర్మతి, నగర మేయర్ సైదై దురైస్వామి ఉదయాన్నే వచ్చి బాధితులను పరామర్శించారు. ఇంట్లో దాచుకున్న డబ్బు, రేషన్ కార్డులు, గుడ్డలు సహా కాలిపోగా కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీరుమున్నీరయ్యూరు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు వచ్చి బాధితుల వివరాలను సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ పేలుడు చేట్పట్ సమీపంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో పెద్ద టాన్స్ఫార్మర్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ధాటికి శకలాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చేట్పట్, కీల్పాక్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినపడం, పూర్తిగా చీకట్లు కమ్ముకోవడంతో ఏమి జరిగిందోనని ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకున్న సిబ్బంది రెండుగంటపాటు హోరాహోరీగా పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ సరఫరా లేనికారణంగా ఆ పరిసరాల ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. శుక్రవారం సాయంత్రానికి దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
పంచుకుతిన్నది..రూ.15కోట్ల పైనే!
ఎన్పీడీసీఎల్లో భారీ కుంభకోణం 11,223 ట్రాన్స్ఫార్మర్లకు అదనంగా చెల్లించిన అధికారులు ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.13వేల పైచిలుకు చెల్లింపు హన్మకొండ, న్యూస్లైన్ : మనం ఏదైనా కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్తే రూ.100 చెప్పిన వస్తువును రూ.80కు ఇవ్వాలంటూ బేరమాడతాం. రూ.100 వస్తువుకు రూ.150 మాత్రం చెల్లించేందుకు అంగీకరించం. కానీ, ఎన్పీడీసీఎల్ అధికారులు అదే చేశారు. వినియోగదారుల నుంచి రూపాయి రూపాయి ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. ఇప్పటికే కేబుల్ కుంభకోణంతో అభాసుపాలైన అధికారులు... ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులోనూ చేతివాటం ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో ఒకటి కాదు రెండు కాదు.. కాంట్రాక్టర్లతో కలిసి రూ.15 కోట్లు పంచుకున్నారు. కంపెనీ ధరను కాదని అదనంగా చెల్లించిన ఈ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. హెచ్వీడీఎస్ కింద కొనుగోళ్లు ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్ సర్కిల్తో పాటు పలు డివిజన్లలో 2010-2011 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టం(హెచ్వీడీఎస్) కింద 16కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 6114, 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 5109 కొనుగోలు చేశారు. వీటి కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించినప్పుడు కాంట్రాక్టర్లు 16 కేవీ ట్రాన్స్ఫార్మర్కు రూ.47,687, 25 కేవీకేకు రూ.54,553 చొప్పున కోట్ చేశారు. కానీ అంతకుముందు అధికారులు రూ.37,200, రూ.47,724 గానే ధర నిర్ధారించారు. అయితే, ఈ ధరకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మూడుసార్లు పరిశీలించిన అధికారులు చివరకు 16 కేవీఏకు రూ. 46,350, 25 కేవీఏ ట్రాన్మ్ఫార్మర్కు రూ.54,570గా కంపెనీ ధరను నిర్ణయించారు. ఇక్కడే కలిసిపోయారు.. మూడు సార్లు ధరలను పరిశీలన చేసి సవరించిన కాలంలోనే కాంట్రాక్టర్లు, అధికారులు కలిసిపోయారు. తలా కొంత పంచుకునేందుకు ప్లాన్ వేశారు. సవరించిన ధర కంటే అదనంగా చెల్లింపులు చేసేందుకు పకడ్బందీగా పథకం రచించారు. విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తే సరిపోతుంది... ధరలు ఎవరు చూస్తారనే నెపంతో ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్లాన్ చేశారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మరు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదనే సాకుతో ఎన్పీడీసీఎల్ అధికారులు ధరలను సవరించారు. 16కేవీఏ ట్రాన్మ్ఫార్మర్కు రూ.46,350, 25 కేవీకేకు రూ.54,570 చెల్లించేందుకు అంగీకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా 16 కేవీకే ట్రాన్మ్ఫార్మర్కు రూ.59,581 చొప్పున అంటే మార్కెట్ ధర కంటే రూ.13,231 అదనంగా చెల్లించారు. ఇక 25 కేవీకేకు రూ.68,248 చొప్పున అంటే ఒక్కో ట్రాన్మ్ఫార్మర్కు రూ.13,678 అదనంగా చెల్లించినట్టు. 16కేవీకే ట్రాన్మ్ఫార్మర్లు 6114 కొనుగోలు చేయగా అదనంగా రూ.8,08,94,334, 25 కేవీకే ట్రాన్మ్ఫార్మర్లు 5109 కొనుగోలు చేస్తే అదనంగా రూ.6,98,80,902 కాంట్రాక్టర్లకు చెల్లిం చారు. మొత్తంగా రూ.15,07,75,236 కాంట్రాక్టర్లు అదనంగా చెల్లించిన అధికారులు ఇందులో చెరి సగం పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారుల నుంచి రెండు, మూడేళ్ల క్రితం వాడుకున్న విద్యుత్ బిల్లుల్లో రూపాయి సైతం వదలకుండా వసూలు చేసే అధికారులు.. కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
గాలీవాన బీభత్సం
చౌడేపల్లె, న్యూస్లైన్: మండలంలో శనివారం రాత్రి గాలీవాన బీభత్సాన్ని సృష్టించింది. మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. టమాట, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చారాల, దుర్గసముద్రం, ఏ కొత్తకోట గ్రామ పంచాయతీల్లో టమోట, మామిడి కాయలు నేలరాలాయి. దుర్గసముద్రం, దాదేపల్లె, ఓదులపేట, అంకుతోటపల్లె, కుంచినపల్లె, ఏ.కొత్తకోట, బుటకపల్లె తదితర గ్రామాల్లో వడగండ్లుతో పాటు గాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బుటకపల్లె , ఓదులపేట కీలేరుల వద్ద సుమారు 12 స్తంభాలు నేలకొరిగాయి. రెండు ట్రాన్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు భారీ చెట్లు నెలకొరిగాయి. పంటలు చేతికివచ్చే సమయంలో మామిడి కాయలు నేలరాలడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. గాలీవాన బీభత్సంతో 200 ఎకరాల్లో టమాట పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లో మామిడి కాయలు గాలికి నేలరాలాయి లక్షలాది రూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పుంగనూరులో.. పుంగనూరు: గాలీవాన బీభత్సంతో పుంగనూరు మండలంలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. శనివారం సాయంత్రం నుంచి గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని కారణంగా పుంగనూరు మండలంలో సుమారు 96 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా సుమారు రూ.20 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే మామిడి, వేప, తుమ్మ, మునగ, కొబ్బరి, అర్కీలిఫాం చెట్లు సైతం నేలకొరిగాయి. వీటితో పాటు కొత్తిమీర, టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని నల్లగుట్లపల్లెలో జి.చంద్రశేఖర్రెడ్డికి చెందిన పది ఎకరాల మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. అలాగే మర్రిమాకులపల్లెకు చెందిన రత్నమ్మకు చెందిన 15 ఎకరాల్లో , నల్లురుపల్లె రామిరెడ్డికి చెందిన 4 ఎకరాల తోట, జయరామిరెడ్డికి చెందిన 30 ఎకరాల తోట , మర్రిమాకులపల్లె నాగరాజారెడ్డికి చెందిన 7 ఎకరాల తోట, అలాగే కృష్ణప్ప, శ్రీనివాసులు, చంద్రప్పకు చెందిన 20 ఎకరాల తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. పుంగనూరు సమీపంలోని మాదనపల్లెకు చెందిన వి.సుబ్రమణ్యంకు చెందిన 20 ఎకరాల మామిడి తోట,కృష్ణప్పకు చెందిన 5 ఎకరాల తోటలో మామిడి కాయలు రాలిపోయాయి. మామిడి తోటల్లో బెనీషా, బాదం, బెంగళూరు, నీలం కాయలు రాలిపోవడంతో ఒకొక్క రైతుకు సుమారు లక్షకుపైగా నష్టం వాటిల్లింది. ఆకాల వర్షాలతో మామిడి పంట రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు రాని కాయలను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెద్ద పంజాణి మండలంలో.. పెద్దపంజాణి: పెద్దపంజాణి మండలంలో శనివారం రాత్రి పెనుగాలులు బీభత్సంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో పలువురు రైతులు, వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడడంతో చాలా పల్లెలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. సుమారు 200 ఎకరాల్లోని మామిడి కాయలు నేలరాలాయి. మామిడి తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా మంది అప్పులు చేసి మరీ మామిడి తోటలను కొన్నారు. అలాగే గురివిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దొరస్వామి, నరసింహయ్య, వెంకట్రామయ్యలకు చెందిన రేకులు గాలులకు లేచిపోవడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే ముత్తుకూరు రోడ్డులోని గుణ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. రాయలపేట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైవేట్ పాఠశాలకు చెందిన రేకులన్నీ పూర్తిగా లేచిపోయాయి. కూరగాయల కొత్తపల్లెకు చెందిన హరినాథ్ నూతనంగా నిర్మిస్తున్న కోళ్లషెడ్ నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. అలాగే పలు చోట్ల పూరిగుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కెళవాతి, వీరప్పల్లె, మంగప్పల్లె, పాత వీరప్పల్లె, సుద్దగుండ్లపల్లె గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కెళవాతి వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు, సుద్దగుండ్లపల్లె వద్ద నాలుగు, శ్రీరామాపురం వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. కొండేపల్లె క్రాస్ వద్ద 33కేవీ విద్యుత్ లైన్ తెగి పడడంతో కరసనపల్లె, ముత్తుకూరు గ్రామాలకు రాత్రంతా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. -
పెనుగాలుల బీభత్సం
తిరుపతి నగరంలో మంగళవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. నెహ్రూవీధిలో పెనుగాలుల తీవ్రతకు మసీదు మినార్ విరిగిపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. తిరుపతి నుంచి వెళ్లే రేణిగుంట, చంద్రగిరి, కరకంబాడి రహదారుల్లో పెనుగాలికి పెద్దపెద్ద వృక్షాలు వేర్లతో సహా పెకలించుకుని రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. హోర్డింగ్లు గాలికెగిరాయి. పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో అంధకారం అలముకుంది. తిరుపతి, సాక్షి: తిరుపతి నగరంలో మంగళవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. వేసవిలో కురిసిన వర్షం ప్రయోజనం కంటే నష్టాన్నే ఎక్కువగా కలుగజేసింది. నెహ్రూవీధిలో ఈదురుగాలుల తీవ్రతకు మసీదు మినార్ విరిగిపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలడం, విద్యుత్ తీగలు తెగిపడడంతో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో చీకటి అలముకుంది. చెట్లు వేర్లను పెకలించుకుని కూలాయి. హోర్డింగ్లు గాలికెగిరాయి. నగరంలో అన్ని వైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గాలీవాన ప్రభావంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం ఒక దశలో భయపడ్డారు. తిరుపతిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపై డ్రైనేజీ నీళ్లు మడుగులు కట్టాయి. ఈదురుగాలులు రెండు గంటలు వీచాయి. దీంతో రోడ్లపైన నడుస్తున్న జనం, వాహనదారులు చెట్లు విరిగి పైన పడతాయేమోనని భయపడ్డారు. చెట్లు ఉన్న ప్రాంతం నుంచి వేగంగా దాటుకునేందుకు ప్రయత్నించారు. గాలీవాన ప్రభావంతో తిలక్రోడ్డు, గాంధీరోడ్డు, యూనివర్సిటీరోడ్డు, లీలామహల్, ఎయిర్బైపాస్రోడ్డు, బాలాజీకాలనీ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం ఈదురుగాలుల విధ్వంసం మంగళవారం సాయంత్రం నగరంలో గంట పాటు ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపాయి. కొద్దిసేపు వర్షంపడి ఆగినా, గాలుల ప్రభావంతో ఆరుబయట, మిద్దెలపైన, భవంతులపైన ఉన్న ప్రకటన హోర్డింగ్లు విరిగి పడ్డాయి. నెహ్రూవీధిలో ఉన్న మసీదు మినార్ పెనుగాలికి విరిగి ఓ దుకాణంపై పడడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రామానుజ సర్కిల్లో హైమాస్ట్ లైట్ల స్తంభం విరిగి బస్సుపై పడింది. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో బస్సులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. తిరుపతి నుంచి వెళ్లే రేణిగుంట, చంద్రగిరి, కరకంబాడి రహదారుల్లో పెనుగాలికి పెద్దపెద్ద వృక్షాలు వేర్లతో సహా పెకలించుకుని రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుమల బైపాస్రోడ్డులోనూ, ఎయిర్బైపాస్రోడ్డులోనూ పెద్ద పెద్ద భవనాలపై ఏర్పాటు చేసిన కమర్షియల్ హోర్డింగ్లు చిరిగిపోయాయి. కొన్ని చోట్ల దుకాణాల ముందు నీడ కోసం వేసిన రేకులు గాలికి ఎగిరి పక్కన పడ్డాయి. భవనాల కిటీకీలు కొట్టుకుని అద్దాలు పగిలాయి. చీకట్లో తిరుపతి నగరం సాయంత్రం గంటన్నర పాటు ఈదురుగాలుల బీభత్సానికి నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హెచ్టీ, ఎల్టీ లైన్ల తీగలు తెగి రోడ్లపై పడ్డాయి. తిరుమల బైపాస్రోడ్డు, తిలక్రోడ్డు, భవానీనగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు చోట్ల ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్డౌన్ అయ్యాయి. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ముందు జాగ్రత్తగా నిలిపేశారు. తిరుపతి నగరంలో మూడు గంటలకు పైగా పూర్తిగా చీకట్లు అలముకున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు, తెగిన విద్యుత్లైన్లు పునరుద్ధరించేందుకు కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు పట్టింది. విద్యుత్ సరఫరా సాయంత్రం 5.30 గంటల నుంచి 9.30 వరకు లేదు. దీంతో ఆస్పత్రులు, కార్యాలయాలు, వాణిజ్యసంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కార్పొరేషన్ అధికారులు రోడ్లపై విరగిపడిన చెట్లను తొలగించేందుకు యుద్ధ ప్రతిపాదికన రంగంలోకి దిగారు. -
జిల్లాలో గాలి వాన
10వేల ఎకరాల్లో పంటలకు నష్టం నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు 135 గ్రామాల్లో అంధకారం మామిడి,అరటి రైతులు ఆందోళన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం జిల్లా అంతటా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈదురు గాలుల ప్రభావంతో అనేకచోట్ల పంటలు నేలవాలాయి. మొదళ్లతో సహా చెట్లు కూలి పోయాయి. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగి 135 గ్రామాల్లో అంధకారం అలముకుంది. విద్యుత్ అధికారు లు సైతం సహాయక చర్యలు చేపట్టలేని దుస్థితి ఉంది. సాక్షి,విశాఖపట్నం: అల్పపీడనం జాడతో శనివారం రాత్రి నుంచి భారీ గాలులు వీస్తున్నాయి. అనేక మండలాల్లో పంటలు నేలకొరిగాయి. చెరకు, మామిడి,జీడి,అరటి,బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చోడవరం,నక్కపల్లి,నర్సీపట్నం,మాడుగుల, పాయకరావుపేట, యలమంచిలి, పాడేరు, అరకు, బుచ్చయ్యపేట,నక్కపల్లి,కోటవురట్ల తదితర మండలాల్లో మామిడి, అరటి తోటలకు అపార నష్టం వాటిల్లింది. ఏజెన్సీలోని జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, అరకులోయ, అనంతగిరి, ముంచంగిపుట్టు మండలాల్లో రికార్డుస్థాయిలో వర్షంపాతం నమోదైంది. అనకాపలి ,యలమంచిలి,విశాఖసిటీ, నక్కపల్లి, పాడేరు, పరవాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో భారీ గాలులకు వృక్షాలు నేలకొరగడంతో వందలాది గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఎగువనుంచి వర్షపు నీరు శారదా నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. ఖరీఫ్కు ముందే వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్ట భూముల్లో అపరాలు పంటలతో పాటు కూరగాయల పంటలు చేపడుతున్నారు. నర్సీపట్నం ప్రాంతంలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరకు మొక్కతోటలు నేలవాలాయి. అనకాపల్లి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విజయరామరాజు పేట రైల్వే అండర్బ్రిడ్జి వద్ద అధికంగా నీరు చేరింది. ఈ మార్గం గూండా బస్సులు, లారీలు తదితర భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలి వాన బీభత్సానికి పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల రోడ్లుకు అడ్డంగా చెట్లు కూలాయి. చోడవరం మండలం గోవాడలో తాపీ మేస్త్రీల సంఘం భవనంపై చింత చెట్టు కూలి పైకప్పు శిథిలమైంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కోటవురట్ల మండల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. సుమారు గంట పాటు ఉరుములు, మెరుపులతో పడిన వర్షం వణకుపుట్టించింది. ఈదురు గాలుల కారణంగా మండలంలో సుమారు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. పెనుగాలులకు పలుచోట్ల చెరకుతోటలు నేలవాలాయి. పెదబయలు మండ లం కొత్త రూడకోటలో భారీవర్షం, ఈదురుగాలులకు నారా కళ్యాణం ఇంటిపై యూకలిప్టస్ చెట్టు పడింది. పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. నక్కపల్లి గాంధీనగర్కాలనీలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. బోదిగల్లం రోడ్డుపై ఉన్న పెద్ద వేపచెట్టు, విద్యుత్ స్తంభం కూలిపోయాయి. కొన్ని గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటంతో విద్యుత్సరఫరా పునరుద్ధరణకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తున్నారు. స్థానికులు రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. ఆశాజనకంగా ఖరీఫ్ వరిసాగుకు ఖరీఫ్ కాలం అత్యంత కీలకం. ముందుగానే వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. పంటపొలాలు సిద్ధం చేయడంలో రైతులు బిజీ అయ్యారు. ఈఖరీఫ్లో జిల్లాలో సుమారు 89వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. మరోపక్క వర్షాలు ముందుగానే రావడంతో చాలాచోట్ల రైతులు విత్తనాల కోసం ఆరాటం మొదలయింది. కూరగాయలు, అపరాల విత్తనాల సేకరణలో రైతులు బిజీగా ఉన్నారు. -
విద్యుత్ కోతలతో వెతలు
- నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్లోనూ అదే సమస్య - గగ్గోలు పెడుతున్న వినయోగదారులు - పత్యామ్నాయాల్లో డిస్కమ్లు న్యూఢిల్లీ: ఉడికిస్తున్న వేడికి తోడు... పలుచోట్ల విద్యుత్ కోతలతో తూర్పు ఢిల్లీ వాసులు శుక్రవారం తిప్పలుపడ్డారు. కొన్ని అవరోధాల కారణంగా విద్యుత్ సరఫరా ఆగిపోయిందని విద్యుత్ పంపిణీ కంపెనీ బీఎస్ఈఎస్ తెలిపింది. ఇదిలా ఉంటే బీైవె పీఎల్ సంతృప్తికరంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న బదర్పూర్-నోయిడా-ఘాజిపూర్ 220 కిలోవాట్ల ట్రాన్స్మిషన్ లైన్లో ఊహించని అడ్డంకుల వల్ల మే ఒకటి నుంచి 75 నుంచి 100 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని సంస్థ తెలిపింది. ఆ సమస్యను సవరిస్తున్నామని, రెండు మూడు వారాల్లో పూర్తిగా పరిష్కారమవుతుందని సంస్థ అధికారి ప్రతినిధి తెలిపారు. మండోలా-సౌత్ వజీరాబాద్-పత్పర్గంజ్ ట్రాన్స్మిషన్ లైన్లో 220 కిలోవాట్ల ఓవర్లోడ్ వల్ల సమస్య తలెత్తిందన్నారు. అందువల్ల అత్యవసర సమయాల్లోనే 20 నుంచి 25 మెగావాట్ల కొరత ఏర్పడుతోందని చెప్పారు. కంపెనీ హెల్ప్లైన్ నంబర్లను ప్రారంభించిందని, ఏవైనా సమస్యలుంటే వినియోగదారులు ఆయా నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. విద్యుత్ సంబంధిత సమస్య ఏదైనా ఎదురైత్తే... బీఎస్ఈఎస్ 24్ఠ7కాల్ సెంటర్ 399 99 808(బీవైపీఎల్), 399 99 707 (బీఆర్పీఎల్) నంబర్లకు కాల్ చేయొచ్చని తెలిపారు. ఈ సమస్యలను అధిగమించి విద్యుత్ సరఫరా చేయడానికి బీవైపీఎల్ ప్రత్యామ్నాయ వనరుల కోసం చూస్తోందని చెప్పారు. కోండ్లి, డల్లుపురా, ఘాజీపూర్, వివేక్ విహార్, నంద్ నగరి, యమునా విహార్, మయూర్ విహార్ ప్రాంతాల్లో పాక్షికంగా విద్యుత్ సమస్య ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం తూర్పు, మధ్య ఢిల్లీలో 1,150 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, దక్షిణ, పశ్చిమ ఢిల్లీలకు 1800 మెగావాట్లు అవసరమవుతున్నది. భవిష్యత్లో ఈఅవసరం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. నోయిడా: ఢిల్లీలోనే కాదు... నోయిడా, ఘజియాబాద్లలో ప్రతిరోజూ ఆరు నుంచి 18 గంటల విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో తప్పనసరి పరిస్థితుల్లో డీజిల్తో నడిచే పవర్ సిస్టమ్స్పై ఆధారపడుతున్న నెలసరి వేతన కుటుంబాలకు కష్టాల కడలిని ఈదుతున్నాయి. ఇందిరాపురం, వైశాలి, కౌశాంబి ప్రాంతాల్లోని హౌజింగ్ సొసైటీల్లో విద్యుత్ కోతల సమయంలో పవర్ బ్యాకప్ సరఫరాకు యూనిట్కు 17 నుంచి 19 రూపాయలు చెల్లిస్తున్నారు. దీనివల్ల 150 నుంచి 200 ఫ్లాట్లున్న చిన్న సొసైటీలు రోజుకు రూ. 13 వేల నుంచి 17 వేల వరకూ విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాయి. ఇక పెద్ద సొసైటీల్లో రూ. 70 వేల నుంచి లక్ష వరకు చెల్లిస్తున్నట్టు ఘజియాబాద్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. అపార్ట్మెంట్లలో వాళ్లే కాకుండా స్వతంత్ర ఇళ్ల యజమానులుకూడా విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరెంజ్ కౌంటీ హౌసింగ్ సొసైటీలో వ్యాపారి మనోజ్ గుప్తానే ఇందుకు ఉదాహరణ. నలుగురు సభ్యులున్న కుటుంబానికి వేసవిలో సగటున వెయ్యి యూనిట్లకు గాను 11 వేల రూపాయలు బిల్లు చెల్లించాల్సి వ స్తోంది. సాధారణ సమయాలతో పోల్చుకుంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. డీజిల్తో నడిచే జనరేటర్ల విద్యుత్ మినహాయిస్తే... 500 యూనిట్లకు గాను ప్రతి నెలా రూ. 2,350 బిల్లు వచ్చేది. అయితే కోతల వల్ల విద్యుత్ బిల్లులకోసం మిగిలిన ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోందని గుప్తా తెలిపారు. ఎక్కువ గంటలు కోతలు ఉండటంతో ఇన్వర్టర్ల పవర్ సరిపోక... నోయిడాలోని రెసిడెన్షియల్ సెక్టార్లలో నివసించేవారు జెనరేటర్ల మీద ఆధారపడుతున్నారు. విద్యుత్ బిల్లు 3వేలకు అదనంగా... ప్రత్యామ్నాయ విద్యుత్కోసం 2,500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని సుశీల్ జైన్ చెబుతున్నారు. గుర్గావ్: గుర్గావ్ పవర్ డిస్కమ్ డీహెచ్బీవీఎన్ కష్టకాలాన్ని ఎదుర్కొంటుండటంతో విద్యుత్ కొరతతో ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. విద్యుత్ కోతలు లేని జోన్గా గుర్గావ్కు మంచిపేరున్నా... మౌలిక వసతులను పెంచుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించింది డీహెచ్బీవీఎన్. ఓవర్లోడింగ్, స్థానిక పొరపాట్లు, నిర్వహణా లోపాలు, విద్యుత్ చౌర్యంవల్ల కోట్ల రూపాయల నష్టాలతో డిస్కమ్ కష్టాల్లో పడింది. దీంతో కొత్త, పాత గుర్గావ్లోని ప్రజలు ఈ వేసవిలో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఓవర్ లోడింగ్, తరచుగా స్థానికంగా జరుగుతున్న తప్పులవల్ల విద్యుత్ కోతలు తప్పడం లేదని డిస్కమ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి ప్రతినిధులు వెళ్లి డీహెచ్బీవీఎన్ చీఫ్ ఇంజనీర్ను కలిస్తే... స్థానికంగా జరుగుతున్న పొరపాట్లు, నిర్వహణ లోపాలే అందుకు కారణమని చెబుతున్నాడని గుర్గావ్ సిటిజన్ కౌన్సిల్ సభ్యుడు ఆర్ ఎస్ రథీ తెలిపారు. ఒక లైన్ మరమ్మతులో ఉండటం వల్ల సమస్య తలెత్తిందని, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఇంజనీర్ చెప్పాడన్నారు. అయితే డీహెచ్బీవీఎన్ సరఫరాలో కోతలే లేవంటున్నారు డిస్కమ్ మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్కుమార్. గుర్గావ్ ప్రజల అవసరాలకు తగినంత విద్యుత్ను తాము సరఫరా చేస్తున్నామని, అయితే ప్రజలకు చేరేముందు ట్రాన్స్మిషన్ స్థాయిలో ఏవైనా సమస్యల వల్ల కొరత ఉండొచ్చన్నారు. సెక్టార్ 43, 51ల్లోని సబ్ స్టేషన్లలో ఎప్పుడూ ఓవర్లోడ్ అవుతుందని, దీనివల్ల సమస్య వస్తోందని, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతించామని, ఈ నెల ఆఖరుకల్లా అది పూర్తవుతుందని అరుణ్కుమార్ చెప్పారు. విద్యుత్ చౌర్యం కూడా ఇందుకు ఒక కారణమన్నారాయన. స్థానికంగా జరుగుతున్న పొరపాట్లను ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తూ, అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ లోడ్ పడకుండా చూస్తున్నామని, అవసరమున్న చోట్ల కొత్త కేబుళ్లు అమరుస్తున్నామని తెలిపారు. డిస్కమ్ ఇప్పటికే 400 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిందని డీహెచ్బీవీఎన్ జనరల్ మేనేజర్ సంజీవ్ చోప్రా చెప్పారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో కోత తప్పనిసరి అని తెలిపారు. 10 కిలోవాట్ల నుంచి 50 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉన్న చోట మామూలు మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్టు తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లను తాము వైర్లెస్ సాయంతో నియంత్రించే అవకాశం ఉందని, దీనివల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయని చోప్రా చెప్పారు. -
ప్రజల మనసుల్లో విజయుప్రస్థానం
‘మాట తప్పను.. మడమ తిప్పను’... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సిద్ధాంతమిది. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ కూడా అదే ఆచరించి చూపారు. వారంలో సోమ, మంగళ, బుధవారాలు ప్రజలకు అందుబాటులో ఉంటానని పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. మిగిలిన రోజుల్లోనూ ప్రజలతో వుమేకవుయ్యూరు. ప్రజా సంక్షేవూనికి పాటుపడటంలో వైఎస్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, అంకిత భావం.. చిత్తశుద్ధితో పనిచేస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ‘విజయం’... విశాఖ పురోభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. విజయభేరి మోగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. - న్యూస్లైన్, పులివెందుల - విజయమ్మ రాకతో విశాఖ పురోభివృద్ధి తధ్యం - విశాఖ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల విశ్వాసం - విజయ ఢంకా మోగించాలని ఆకాంక్ష ఆకట్టుకునే ప్రసంగం... ఆమె సొంతం వైఎస్ విజయమ్మ ప్రసంగంలో సహజత్వం ఉంటుంది. జనం భాషలో అద్భుతంగా వూట్లాడతారు. 2012 మార్చి 12న పులివెందులలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 2011 డిసెంబర్ 6న శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా, 2011 జూలై 8, 9 తేదీల్లో ఇడుపులపాయలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు హోదాలో విజయమ్మ ప్రసంగం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. సమస్యలపై అధికారులకు 32 వేలకు పైగా ఉత్తరాలు పులివెందులలోని కార్యాలయంలో విజయువ్ము ఈ వుూడేళ్లలో 1.41 లక్షల మంది సవుస్యలను విన్నారు. వాటి పరిష్కారం కోసం 32 వేలకు పైగా ఉత్తరాలను అధికారులకు రాశారు. వురికొన్ని సమస్యలను అప్పటికప్పుడే ఫోన్లో తెలియుజేసి పరిష్కరించారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలప్రజల సవుస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లోనూ పర్యటించారు. కొన్ని గ్రావూలకు రెండు, మూడుసార్లు కూడా వెళ్లారు. మొత్తం 535 కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ఈ వూడేళ్లలో దాదాపు 480 రోజులు పులివెందులలోనే గడిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అదనపు తరగతి గదులు, మినరల్ వాటర్ ప్లాంటు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాలు... ఇలా అనేక ప్రారంభోత్సవాల్లో విజయమ్మ పాల్గొన్నారు. వుహిళలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ చేపట్టారు. వేముల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు మండలాల్లో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ చేశారు. వందలాది పెళ్లిళ్లకు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. గృహ ప్రవేశాలు, ఇతర కార్యాలకు ప్రజలు పిలిచిన వెంటనే వెళ్లారు. ఎక్కడైనా ప్రవూదాలు జరిగితే వెంటనే స్పందిస్తుంటారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం కృషి చేస్తుంటారు. అందువల్లే విజయువ్మును తవు కుటుంబ సభ్యురాలిగా భావిస్తుంటావుని పులివెందుల నియోజకవర్గ ప్రజలు చెబుతారు. విజయమ్మ చొరవతో 755 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు నియోజకవర్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొరత తీవ్రంగా ఉండేది. విజయువ్ము ప్రత్యేక చొరవ చూపి ట్రాన్స్కో సీఎండీ, కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి 755 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేరుుంచారు. దీంతో రైతులు హారుగా పంటలు పండించుకోగలుగుతున్నారు. కష్టాల్లో ఉన్నా.. ప్రజలను మరవలేదు వైఎస్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా విజయువ్ము పులివెందుల ప్రజల సంక్షేవూన్ని విస్మరించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేయుడంతో ఉప ఎన్నికలలో విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా పులివెందుల ప్రజలను వురవలేదు. ఒకవైపు కొడుకు జైల్లో ఉన్న బాధను దిగమింగుకుంటూనే..వురోవైపు పులివెందుల ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకున్నారు. రైతుల సంక్షేవుంపై దృష్టి అన్నదాతల సంక్షేవుంపై విజయువ్ము ప్రత్యేక దృష్టి పెట్టారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు వీలుగా చేపట్టిన ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. చిత్రావతి ప్రాజెక్టుతో పాటు లింగాల కుడికాలువ, గండికోట, పైడిపాలెం, సీబీఆర్ ఎత్తిపోతల పైపులైన్ పనులు తదితర ప్రాజెక్టులను ఆమె పరిశీలించారు. సూక్ష్మనీటి సేద్యం పనుల పురోగతిపైనా దృష్టి పెట్టారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు నీటిని సక్రవుంగా విడుదల చేయుకపోవడంతో 2011 డిసెంబర్ 20న చిత్రావతి ప్రాజెక్టు వద్ద దీక్ష చేపట్టారు. అధికారులు దిగొచ్చి.. సవుస్య పరిష్కరించే దాకా దీక్ష కొనసాగించారు. పులివెందుల మునిసిపాలిటీకి తాగునీటి విషయమై కూడా అధికారులతో పలుమార్లు చర్చించారు. 2012లో తీవ్ర వర్షాభావం వల్ల చీనీచెట్లు ఎండిపోరునప్పుడు, పెనుగాలులతో లింగాల, చక్రాయపేట మండలాల్లో అరటి, మామిడి తోటలు దెబ్బతిన్నప్పుడు విజయువ్ము యుద్ధప్రాతిపదికన స్పందించారు. క్షేత్రస్థారులో పంటల నష్టాన్ని పరిశీలించడమే కాకుండా రైతులకు నష్టపరిహారం కోసం అధికారులకు, ప్రభుత్వానికి పదుల సంఖ్యలో లేఖలు రాశారు. స్వయుంగానూ విన్నవించారు. 2012లో జూన్లో వర్షాలు అధికంగా కురిసి తొండూరు, ఎర్రిపల్లె, పాలూరు తదితర చెరువు కట్టలు తెగిపోయూరుు. వాటికి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. మందుల కొనుగోలుకు వేతనం విరాళం పులివెందుల, వేంపల్లెలోని ఆస్పత్రి అభివద్ధి కమిటీ సమావేశాలకు ప్రతిసారి హాజరవుతున్న ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆ ఆస్పత్రుల్లో మందుల కొరత తీర్చేందుకు తనకు నెలనెలా వచ్చే వేతనాన్ని అందజేస్తున్నారు. గతంలో పులివెందుల ఏరియా ఆస్పత్రిలో డెంగీ కిట్లు లేకపోవడంతో తన వేతనంతో కొనుగోలు చేసి అందించారు. నియోజకవర్గంలోని పీహెచ్సీల్లో మందుల కొనుగోలుకు కూడా సాయుం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విజయమ్మ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అనేక ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. 2012లో చీనీ రైతుల సవుస్యలు, కరెంటు కోతలు, చార్జీలపై ఉద్యమించారు. పులివెందుల నియోజకవర్గంలోని యూసీఐఎల్, ట్రిపుల్ ఐటీ, ఎర్రగుంట్ల సమీపంలోని ఆర్టీపీపీ, ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు. -
చివరికిలా...!
వారి ఆశ,శ్వాస వ్యవసాయం. పచ్చని పైరులే వారి ఇంటి పాపలు. వాటికేమైనా జరిగితే..తట్టుకోలేరు. కాపు దశలో వాడితే ఆ బాధ వర్ణణాతీతం.ఈ దశలో వారిపాలిట శత్రువుగా విద్యుత్తు మారుతోంది. కోతలతో చంపుతోంది. ట్రాన్స్ఫార్మర్లు తరచూ మొరాయించి మరమ్మతులు కోరుతున్నాయి. అధికారుల చుట్టూ తిరగలేక రైతులే తమకు తోచిన చందాన రిపేర్లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తమ పొలాల్లోనే విగతజీవులవుతున్నారు. ఆత్మీయులకు గుండెకోత మిగులుస్తున్నారు. కల్వకుర్తి,న్యూస్లైన్ : ఆరుగాలం శ్రమించే అన్నదాతల పాలిట విలన్గా విద్యుత్తు మారుతోంది. భారీగా పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆశలు పెంచుకొని వేస్తున్న పంటలకోసం ఆఖరికి వారు తమ విలువైన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. విద్యుత్ కోతలు తీవ్రతరమై ఎండిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇది చాలదనక ట్రాన్స్ఫార్మర్లు తరచూ మరమ్మతులకు గురవ్వడంతో అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. వారు రిక్తహస్తం చూపిస్తుండంతో వాటిని తామే బాగుచేసుకునేందుకు ఉపక్రమించి ఆ ప్రయత్నంలో మృత్యువాత పడుతున్నారు. ఎడతెరిపి లేని విద్యుత్ కోతలతో కరెంట్ వస్తూ, పోతుండటంతో ఓవర్ లోడ్కు గురువుతున్న ట్రాన్స్ఫార్మర్లు పదేపదే పాడవుతున్నాయి.విద్యుత్ కార్యాలయానికి తీసుకెళ్లిన రైతుల నుంచి సంబంధిత సిబ్బంది ముక్కుపిండి సొమ్ములు వసూలు చేస్తున్నారు. దీంతో వారికి పుండుమీద కారం చల్లిన చందాన తయారవుతోంది. అడిగితే ఏమవుతుందోనని.. వాస్తవానికి ఈ ఇబ్బందులు ఏ ఒక్క ప్రాంతానికి చెందిందో కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్నదే. అధికారులకూ వాస్తవం తెలుసు. అయినా ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత. రైతులకూ ఒక్కోమారు విద్యుత్తు సిబ్బంది తీరుపై నోరు విప్పలేని స్థితి. చాలీ చాలని సిబ్బందితో తామేం చేస్తామని విద్యుత్తు అధికారుల వాదన. గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉన్న లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు అన్ని ట్రాన్సాఫారంలను తామెలా నిర్వహించగలమని ప్రశ్నిస్తున్నారు. ఉన్నంతలో సర్దుబాటు చేసుకొని పనులు చేస్తున్నా రైతుల అవసరాలకు తగ్గా పనికి రావడం లేదు. దీనితో కొన్ని మార్లు వారు ఎంతో కొంతో ఇచ్చి పనికానిచ్చు కుంటున్నారు. అయితే తరచూ మరమ్మతులకు గురవ్వడంతో తమకు తెల్సిన విధంగా మరమ్మతులు చేయాలనుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదే అంశంపై విద్యుత్తు శాఖ ఉద్యోగుల వాదన మరోలా ఉంది. తాము ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినప్పుడే అది మూడురోజుల పాటు మరమ్మతుకు గురైనా, సరఫరా లేకపోయినా అందుకు సిద్ధంగా ఉంటామని అగ్రిమెంటు రాయించుకుంటామని అలాంటప్పుడు రైతులే మరమ్మతులకు దిగితే తామేంచేస్తామని ప్రశ్నిస్తున్నారు. చంటి పాపల్లా పెంచిన పంటలు కళ్లెదుటే వాడిపోతుంటే తట్టుకోలేక రైతులు మరమ్మతులకు ఉపక్రమించి ఆయువుకు చెల్లుచీటీ పలికేస్తున్నారు. ఒకేరోజు ఇద్దరు రైతన్నల మృత్యువాత.. ఇలాంటి సంఘటనే కల్వకుర్తి నియోజకవర్గంలో ఇరవురి రైతుల ఉసురు తీసింది. ఆమన్గల్ మండల పరిధిలోని ఎలుగురాళ్ల తండాకు చెందిన విజయ్,మాడ్గుల మండలానికి చెందిన నాగిళ్ల గ్రామానికి చెందిన బర్రె లక్ష్మయ్య (32) శనివారం ఉదయం ట్రాన్స్ఫార్మర్లను బాగుచేసేందుకు వెళ్లి ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఇది తాజా సంఘటన మాత్రమే...జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే వారంలో కనీసం రెండు మరణాలు ఇలాంటి స్థితిలోనే సాగుతున్నాయి. పలుకుటుంబాల్లో శోకాన్ని నింపుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతుల కోసం వచ్చే రైతుల నుంచి ‘వసూళ్లు’ చేయడం మాని, వారు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులే పంట పొలాల్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంపై ప్రజలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు. -
గుట్టు రట్టవుతుందా?
నిజామాబాద్ నాగారం, న్యూస్లైన్ : ట్రాన్స్ఫార్మర్లలో వినియోగించాల్సిన, వినియోగించిన పాత కాపర్ తీగను స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు. 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో మాత్రమే కాపర్ ఉంటుంది. 200 కేవీ, 160 కేవీ,100 కేవీ, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో అల్యూమినియం ఉంటుంది. మరమ్మతుల తర్వాత ట్రాన్స్ఫార్మర్ల నుంచి తీసిన కాపర్ను, అల్యూమినియంను అమ్మాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అసలు అమ్మడం సాధ్యం కాని పని. ఇక్కడి అధికారు లు మాత్రం చాలా సులువుగా వాటిని అమ్మేశారు. పాత కాపర్ వైరు 40 ట న్నులు, అల్యుమినియం 70 టన్నులు స్టోర్ రూమ్లో ఉన్నట్లు అధికారులు ఈ నెల 24న ‘న్యూస్లైన్’కు తెలిపారు. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ఎన్పీడీసీ ఎల్ సీఎండీ ఇదే విషయమై ఒక ఏడీఏ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వివరాలు చెప్పరట అసలు లెక్కపత్రం తేల్చడానికి ఎస్ఈ ముగ్గురు అధికారులతో కమిటీ వేశారు. స్టోర్లో ఉన్న కాపర్ను, అల్యూమిని యాన్ని తూకం వేయించారు. వివరాలు చెప్పడానికి మాత్రం జంకుతున్నారు. అదేమంటే ఇంకా లెక్కలు జరుగుతున్నాయంటూ తప్పించుకుంటున్నారు. నిందితులు దాదాపు 20 టన్నుల కాప ర్, 20 నుంచి 30 టన్నుల వరకు అల్యూమినియాన్ని అమ్ముకున్నట్టు సమాచారం. ఒక్క కిలో కాపర్ రూ.300 నుంచి రూ. 400 వరకు ఉంటుంది. అల్యూమినియం రూ. 150 నుంచి రూ. 170 వరకు ఉంటుంది. దీని ప్రకారం మాయమైన తీగ విలువ దాదాపు రూ. 60 లక్షలు ఉంటుంది. ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగుతున్న లెక్కలు? అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో విచారణ జరిపి రెండు రోజులలో నివేదిక ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించినా బేఖాతరు చేశారు. ఇంకా లెక్కలు పూర్తి కాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి ఈ నెల 27 వరకే తీగల తూకాలు పూర్తి అయ్యాయి. వివరాలను మాత్రం బయటకు రానివ్వడం లేదు. కమిటీ సభ్యులను అడిగితే ఎస్ఈని అడగమంటున్నారు. ఆయన నోరు విప్పడం లేదు. భయపడుతూనే ఈ వ్యవహారం మీద సీఎండీ కార్తికేయ మిశ్రా సీరియస్గా ఉన్నారని తెలిసి జిల్లా స్థాయి అధికారులు భయపడుతూనే, చేయాల్సింది చేస్తున్నారు. అక్రమార్కులను కాపాడడానికి స్టోర్ రూమ్ లో మాయమైన కాపర్ను గుట్టుచప్పు డు కాకుండా తిరిగి అక్కడ పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం మహారాష్ట్రలో పాత కాపర్ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న ట్లు సమాచారం. సీఎండీ ప్రత్యేక విచారణ జరిపితేనే ఈ విషయం తేలేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
ఇంటి దొంగలు
నిజామాబాద్ నాగారం, న్యూస్లైన్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్వైర్ను అమ్ముకోగా వచ్చిన డబ్బులను, కాంట్రాక్టులు అధికారులు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో యూనియన్ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ అవీనీతిపై ట్రాన్స్కో సీఎండీ కార్తికేయమిశ్రా సీరియస్గా తీసుకొని ప్రాథమిక విచారణ అనంతరం ఒక ఏడీ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ విషయంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక కావాలని ట్రాన్కో ఎస్ఈ నగేశ్కుమార్కు ఆదేశించారు. ఏం జరిగిందంటే కొద్ది నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కోసం జిల్లా స్టోర్ నుంచి రూ. 20 లక్షల విలువ చే సే కాపర్ వైరును విడుదల చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే రూ. 20 లక్షల విలువ చేసే మెటీరియల్ ఇచ్చిన సదరు అధికారులు.. దానిని కాంట్రాక్టరే కొనుగోలు చేశారని రికార్డుల్లో పేర్కొన్నారు. అందుకుగాను రూ. 20 లక్షల బిల్లును కాంట్రాక్టర్లకు చెల్లించారు. అంటే రూ. 20 లక్షల వైరుతోపాటు, 20 లక్షల రూపాయలనూ కాంట్రాక్టర్కు దోచిపెట్టారన్నమాట. అధికారులు ఇలా ‘అదనపు సంపాదన’ కోసమే చేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు అనంతరం కాలిపోయిన కాపర్వైరును స్టోర్లో జమచేయా ల్సి ఉంటుంది. ఇలా చేస్తే పాతదాని బదులు కొత్త వైరు ఇస్తారు. స్టాక్ లేకపోతే డబ్బులు చెల్లిస్తారు. కానీ ఏడాదిగా పాత వైరును స్టోర్లో జమ చేయడం లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 20 లక్షల విలువ చేసే పాత వైరుకు లెక్కలు చూపలేదని సమాచారం. కాపర్ వైరుకు డిమాండ్ ఉండడంతో మరమ్మతు కేంద్రాల్లోని అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాత వైరును అమ్ముకున్నట్లు తెలుస్తోంది. రికార్డులు మాయం అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు రికార్డులను సరిగా నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. కొందరైతే రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఏడీ నాగరాజు.. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకు సంబంధించిన రికార్డులను ఏడాది కాలంగా నిర్వహించడం లేదు. తన సెక్షన్కు సంబంధించి స్టాక్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేశామన్న వివరాలను ఆయన రికార్డు చేయాల్సి ఉంటుంది. అయితే ఉన్నతాధికారులను బుట్టలో వేసుకొన్న సదరు ఏడీ.. కాంట్రాక్టర్లతో దోస్తీ కట్టి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ఏడీ కార్యాలయానికి వచ్చిన డీఈ.. ట్రాన్స్ఫార్మర్ల సంబంధించిన రికార్డ్స్ చూపించాలని అడగ్గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లను అమ్ముకున్నారని, అందుకే రికార్డులు మెయింటెయిన్ చేయలేదని, ఉన్న రిజిస్టర్లను సైతం మాయం చేశారని తెలుస్తోంది. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి -నగేశ్, ఎస్ఈ, ట్రాన్స్కో, నిజామాబాద్ ట్రాన్స్కోలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులను విచారణ అధికారులుగా నియమించాం. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి, సీఎండీకి నివేదిక పంపిస్తాం. ఏ మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది విచారణ నివేదిక అందిన తర్వాతే తెలుస్తుంది. -
ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు
అనంతపురం టౌన్, న్యూస్లైన్ : సాగునీటి వనరులున్న రైతులు బోరుబావుల కింద పంటలు సాగు చేసుకుందామనుకుంటే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. వ్యవసాయ మోటారుకు విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడానికి రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు. కనెక్షన్ కోసం డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడ్డారు. వర్షాలు ముఖం చాటేస్తుండడంతో భూముల్లో బోర్లు వేసుకుని పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే... ట్రాన్స్కో అధికారులు కరుణించడం లేదు. జిల్లాలో వ్యవసాయ బోర్లకు సంబంధించి మొత్తం 1.96 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గత రెండేళ్లుగా మరో 33 వేల మంది రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. 2012లో దరఖాస్తు చేసుకున్న రైతులకు నేటికీ మంజూరు చేయడం లేదు. దీంతో వారు నిత్యం ట్రాన్స్కో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అడ్డగోలు బదలాయింపు విద్యుత్శాఖ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తొలి నుంచీ వినిపిస్తున్నాయి. రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లను అభివృద్ధి పనుల ముసుగులో నేతలు తన్నుకుపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కలెక్టర్ ఆదేశాలు, అత్యవసరం అంటూ తప్పించుకుంటున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మంజూరవుతున్న విద్యుత్ సామగ్రిని ఇతరత్రా వాటికి మళ్లిస్తుండడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెండేళ్లలో 33 వేలకు పైగా దరఖాస్తులు వస్తే కేవలం ఏడు వేల కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన వాటిని ఎప్పటికి పరిష్కరిస్తారో ట్రాన్స్కో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఈ ఏడాది 17 వేల కనెక్షన్లను మంజూరు చేయాలని ట్రాన్స్కో అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే... ఇప్పటి వరకూ ఏడు వేల కనెక్షన్లను మాత్రమే ఇవ్వగలిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎక్కువశాతం పెండింగ్లో ఉన్నాయని వారు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అవసరమైనంత మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లు సరఫరా కావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా 300 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేస్తున్నారు. ఇందులో ఎక్కువశాతం పరిశ్రమలు, తాగునీటి పథకాలకు మళ్లిస్తున్నారు. నెలకు కనీసం 800 ట్రాన్స్ఫార్మర్లు వస్తేగానీ దరఖాస్తులన్నీ పరిష్కరించలేమని అధికారులు అంటున్నారు. 2013 మార్చిలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుతం మంజూరు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... వాస్తవానికి అంతకంటే ముందు దరఖాస్తు చేసిన వారికి కూడా ఇవ్వడం లేదు. ప్రతి నాలుగైదు వ్యవసాయ మోటార్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్ ఉండడంతో ఐదు వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు అవసరం. ప్రజాప్రతినిధులు చొరవచూపి రైతులకు అవసరమైనంత మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లు సరఫరా అయ్యేలా చూడాల్సిన అవసరముంది. సప్లయ్ తగినంత లేదు జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వాటికి తగ్గట్టు మంజూరు చేయలేకపోతున్నాం. డిమాండ్ తగ్గ స్థాయిలో ప్రభుత్వం నుంచి సప్లయ్ లేకపోవడంతోనే సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం నెలకు 300 ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి. జనవరికి సంబంధించి ఇంతవరకూ రాలేదు. ప్రతినెలా సక్రమంగా ఇవ్వడంతో పాటు కనీసం 800 తగ్గకుండా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. - ప్రసాద్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ -
కాటేసిన కరెంట్
నీరు లేక పొలాలు ఎండిపోతుండడాన్ని చూసి ఆ ఇద్దరు రైతులు తట్టుకోలేకపోయారు. ట్రాన్సఫార్మర్ మరమ్మతులకు స్వయంగా పూనుకున్నారు. ఫ్యూజ్ వేస్తుండగా షాక్కు గురై మృతి చెందారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన గంగాధరనెల్లూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గంగాధరనెల్లూరు, న్యూస్లైన్: మండలంలోని వెజ్జుపల్లెకు చెందిన బొజ్జారెడ్డి కుమారుడు ప్రశాంత్(26), గోవిందరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి(40) వరుసకు అన్నదమ్ములు. వ్యవసాయంతో కుటుంబాలను పోషిస్తున్నారు. పొలాల వద్దనున్న ట్రాన్సఫార్మర్ రెండు రోజులుగా పనిచేయడం లేదు. మరోవైపు నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ప్రశాంత్, నరసింహారెడ్డి గ్రామంలోని ట్రాన్సఫార్మర్ వద్దకు మంగళవారం వెళ్లారు. ఫ్యూజ్ పోయినట్లు గుర్తించారు. ప్రశాంత్ పైకి ఎక్కి ఫీజు వేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురయ్యాడు. రక్షించేందుకు కింద ఉన్న నరసింహారెడ్డి ప్రశాంత్ను పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ షాక్కు గురై మృతి చెందారు. ప్రశాంత్ అవివాహితుడు. నరసింహారెడ్డికి భార్య చిన్ని(35), కుమారులు నవీన్ (10 ) ఉదయ్( 9 ), కుమార్తె పద్మిని (7) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ట్రైనీ ఎస్ఐ ధరణీధర్, ఏఎస్ఐ రాజేంద్రన్ పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేదని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. సాధారణంగా ఉదయం 9 గంటలకు విద్యుత్ సరఫరా పోతే రాత్రి వరకు రాదన్నారు. ఇందుకు భిన్నంగా మంగళవారం ఉదయం తొమ్మిదన్నర గంటలకు విద్యుత్ సరఫరా రావడంతో ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్కు ఆన్ ఆఫ్ లేక పోవడంతోనే విద్యుత్షాక్కు గురయ్యారని పేర్కొన్నారు. ఇంత జరిగినా ఏ ఒక్క అధికారీ ఇక్కడికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్ని ఓదార్చిన నారాయణస్వామి బాధిత కుటుంబాలను వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఓదార్చారు. విషయం తెలిసిన వెంటనే ఆయన వెజ్జుపల్లెకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రెండునెలల వ్యవధిలో గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో విద్యుత్షాక్తో ముగ్గురు మృత్యవాత పడ్డారన్నారు. విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. ఈయన వెంట సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చిన్నమరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నాయనిరెడ్డి, భాస్కరరెడ్డి, చంద్రబాబురెడ్డి పాల్గొన్నారు. సమాచారం ఇవ్వలేదు: గుర్రప్ప, ఏఈత్రీ ఫేస్కు సంబంధించి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాం. అయితే సింగిల్ ఫేస్లో సరఫరా ఇస్తున్నాం. ట్రాన్సఫార్మర్ పాడైన విషయం, మరమ్మతులు చేస్తున్న సమాచారం రైతులు మాకు తెలియజేయలేదు. 10జిడిఎన్సి 01: ప్రశాంత్ (ఫైల్ఫొటో) 02: నరసింహారెడ్డి (ఫైల్ఫొటో) 03: మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు 06: ప్రమాద వివరాలు తెలుసుకుంటున్న నారాయణస్వామి -
జల్సా రాయుళ్లు
తిరుపతి క్రైం, న్యూస్లైన్: తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్లలో రాగివైర్లను అపహరించే ఏడుగురి ముఠా సభ్యులను ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువ చేసే రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను అలిపిరి, తిరుచానూరు సీఐలు రాజశేఖర్, సాయినాథ్ విలేకరులకు వివరిం చారు. కేవీపల్లె మండలం వగళ్ల గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు రెడ్డెప్ప, బసవయ్య కుమారుడు జీవీ.రమణయ్య, వెంకటరమణ కుమారుడు గుణశేఖర్, రాజన్న కుమారుడు నాగరాజు, రెడ్డెప్పకుమారుడు రవితో పాటు రొంపిచెర్ల మండలం చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన మల్లయ్య కుమారుడు దేవయ్య, తిరుపతి జీవకోనకు చెందిన షేక్సికిందర్ కుమారుడు షేక్ మహేష్ ముఠాగా ఏర్పడి, జల్సాలకు అలవాటు పడ్డారు. రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్దనున్న ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరును చోరీ చేసేవారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుచానూరు, రామచంద్రాపు రం, గాజులమండ్యం, వడమాలపేట, ఏర్పేడు, ముత్యాలరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలోని 86 ట్రాన్సఫార్మర్లలో రాగివైరును అపహరించుకెళ్లారు. దీన్ని అమ్మగావచ్చిన డబ్బును అందరూ పంచుకునే వారు. దాదాపు రెండేళ్లుగా 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 36 చోరీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముఠాలోని సభ్యులందరూ ఆదివారం జూపార్కు రోడ్డులో వెళుతుండగా అటుగా వెళుతున్న సీఐలు రాజశేఖర్, సాయినాథ్, ఎస్ఐలు హరి ప్రసాద్, సురేష్కుమార్, ప్రవీణ్కుమా ర్, పీఎస్ఐ ఈశ్వరయ్య, ఈస్ట్ సబ్డివిజ న్ క్రైంపార్టీ పోలీసులు రాజు, రవిప్రకా ష్, వెంకటేశ్నాయుడు, శ్రీనివాసులు, ర విరెడ్డి, పండరీనాథ్, ముజీబ్, షాజహా న్లు వారిని ఆదుపులోకి తీసుకుని విచారించారు. అపహరణకు గురైన రూ.7 లక్షల విలువైన రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐలు వెల్లడించారు. -
కాటేస్తున్న తీగలు
మెదక్, న్యూస్లైన్: కరెంట్ తీగలు అమాయకుల పాలిట మృత్యు పాశాలవుతున్నాయి. కరెంటోళ్ల నిర్లక్ష ్యం కారణంగా రైతులు బలి అవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ సరిగా లేక, శిథిలమైన విద్యుత్ స్తంభాలు, కాలం చెల్లిన కరెంట్ తీగలు, నేలను తాకే వైర్లు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ సేవలందిస్తున్నామంటూ కస్టమర్ సర్వీస్ చార్జి వసూలు చేసే ట్రాన్స్కో యంత్రాంగం అటువైపు తొంగి చూడకపోవడం గమనార్హం. విద్యుత్ సరఫరాలో లోపాలు ఏర్పడినప్పుడు నైపుణ్యం లేకపోయినా రైతులు, వినియోగదారులే సొంతంగా మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ దశలో మృత్యువాత పడుతున్నారు. పలు సంఘటనలు ఇలా.. ఈనెల 12న ఒక్కరోజే మెదక్ మండలంలో ముగ్గురు రైతులు కరెంట్ కాటుకు బలి అయిన విషయం తెల్సిం దే. అయితే కొన్ని సంఘటనల్లో వినియోగదారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమనే చెప్పాలి. మెదక్ మండలం జానకంపల్లిలో వంజరి శకుంతల, నాగాపూర్లో రామకిష్టయ్య పొలం ఒడ్డున గడ్డి కోసే క్రమంలో కేబుల్ వైర్ను కోయడంతో షాక్ గురై మృత్యువాత పడ్డారు. అదే రోజు ఇదే మండలంలోని హవేళిఘణాపూర్ పరిధిలోని చెరువు ముందటి తండా కు చెందిన రైతు బక్షి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసే క్రమంలో విద్యుత్షాక్ గురై మృతి చెందాడు. పాపన్నపేట మండలం శానాయిపల్లిలో ఈనెల 8న ఏసయ్య అనే యువరైతు ఏ-బీ స్విచ్ బంద్ చేసే క్రమంలో విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు. పాపన్నపేట మండలం కొడుపాక గ్రామంలో గత జూలై నెలలో ప్రతాప్ అనే రైతు స్టార్టర్ డబ్బాకు వి ద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. గతంలో గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల విఠల్, చిత్రియాల్కు చెందిన యాదమ్మ అనే మహిళ విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. కొడుపాక గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపడి కర్రె నరేశ్ అనే విద్యార్థి మొకాలి వరకు తెగిపోయింది. రెండేళ్ల క్రితం నార్సింగి గ్రామంలో వీధిలోని అన్ని ఇళ్లకు షాక్ రావడంతో బోన్ల సత్తమ్మ అనే మహిళ ప్రాణాలు విడిచింది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన లింగం అనే రైతు గత ఆగస్టు 30న తన ఇంటి ముందు పనిచేస్తున్న క్రమంలో విద్యుత్ వైర్ తెగిపడడంతో పాడిగేదెతోపాటు కన్నుమూశాడు. అంతకుముందు ఇదే గ్రామంలో లంబాడి దత్తు, మాలే రాములు అనే రైతులు విద్యుత్ షాక్కు గురై మరణించారు. ఇలా ప్రతి మండలంలో విద్యుత్షాక్ గురై మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ప్రమాద బాధితులకు ఆశించిన స్థాయిలో పరిహారాలు అందడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష ్యమే కారణం.. విద్యుత్ ప్రమాదాల్లో కొంతవరకు వినియోగదారుల పాత్ర కనిపిస్తున్నా చాలావరకు ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష ్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విద్యుత్ సేవల్లో ఎలాంటి అంతరాయాలు ఏర్పడినా ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్వీస్ చార్జి పేరిట డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. కానీ గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది పత్తా లేకపోవడంతో రైతులే తెలిసీ తెలియని పరిజ్ఞానంతో పనులు చేసుకుంటూ ప్రమాదాలకు లోనై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కట్టెలే స్తంభాలుగా.. వ్యవసాయ బోరుకు కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే అందుకు అవసరమైన విద్యుత్ స్తంభాలను, సామగ్రిని ట్రాన్స్కో అధికారులే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ స్తంభాలు ఇవ్వకపోవడంతో రైతులు కట్టెల ఆధారంగానే వైర్లు లాగుతున్నారు. గాలి దుమారం, భారీ వర్షాల కారణంగా ఆ కట్టెలు నేలకొరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కనీసం 50 నుంచి 60 మీటర్ల దూరానికో స్తంభం ఉండాలి. కానీ అలా ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కో చోట వైర్లు మనిషిని తాకే ఎత్తులో వేలాడుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ నిర్వహణ కూడా సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లను చెట్ల కొమ్మలు తాకుతుండటం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. -
సకాలంలో సేవలందించకపోతే జరిమానా!
విద్యుత్ సమస్యల పెనాల్టీలు పెంచుతూ ఈఆర్సీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని రుసుములన్నీ చెల్లించి 30 రోజులు దాటినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోయినా, గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పాడైందని ఫిర్యాదు చేసి 48 గంటలు దాటినప్పటికీ మార్చకపోయినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అధికారులు ఇకపై అధికంగా జరిమానాలు చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇప్పటికే ఉన్న పనితీరు ప్రమాణాల (స్టాండర్డ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్-ఎస్వోపీ) విధానంలో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గురువారం ఆదేశాలు జారీచేసింది. సకాలంలో సేవలు అందించకపోతే ఈ విషయాన్ని సంబంధిత పై అధికారులకు తెలిపి నష్టపరిహారాన్ని పొందవచ్చునని ఈఆర్సీ పేర్కొంది. నష్టపరిహారం అందకపోతే వినియోగదారుల పరిష్కారాల ఫోరంను ఆశ్రయించాలని సూచించింది.