-
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు. -
పాత బైకుకి రెట్టింపు ధర ఆఫర్ చేసిన డీలర్షిప్ - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు యమహా ఆర్ఎక్స్100, బజాజ్ చేతక్, టీవీఎస్ సుజుకి సమురాయ్ వంటివి అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్స్గా ప్రసిద్ధి చెందాయి. అయితే కాలక్రమంలో కొత్త బైకులు పూత్తుకు రావడంతో.. పాత బైకులకు ఆదరణ తగ్గిపోయింది. ఇప్పటికి కూడా చాలామంది ఈ బైకులను వినియోగిస్తున్నారు. కాగా ఇటీవల టీవీఎస్ డీలర్షిప్ రెట్టింపు ధరతో ఒక పాత బైకుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేరళలోని టీవీఎస్ డీలర్షిప్ ప్రతినిధి మిస్టర్ మోటార్ వాల్ట్ వారి యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. కస్టమర్ 27 సంవత్సరాల క్రితం టీవీఎస్ సుజుకి సమురాయ్ బైక్ కొనుగోలు చేసాడు, దానిని ఇప్పటి వరకు కూడా వినియోగిస్తున్నారు. ఈ 27 సంవత్సరాల్లో ఇతర బ్రాండ్ బైకుని కొనుగోలు చేయలేదు. కస్టమర్ బ్రాండ్ మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ దాని అసలు ధరకంటే రెట్టింపు ధరకు సొంతం చేసుకున్నాడు. ఈ బైకుని అతడు కొనుగోలు చేసిన సమయంలో ధర రూ. 21,000. కానీ డీలర్షిప్ వారు దీన్ని రూ. 41,000లకు కొన్నారు. అంటే ఆ కస్టమర్ కొన్న కొత్త బైకు ధరలో రూ. 41 వేలు తగ్గింపు కల్పించారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12మందిపై కేసు నమోదు.. కారణం ఇదే! కస్టమర్ ఏ బైక్ కొనుగోలు చేసిందనే విషయం వెల్లడి కాలేదు. కానీ కొన్న ధరకు రెట్టింపు ధర లభించడంతో కస్టమర్ చాలా ఆనందించాడు. ఈ రోజు కొని నెల రోజుల తరువాత విక్రయిస్తేనే అసలు ధర రాని ఈ రోజుల్లో రెట్టింపు ధర రావడం అనేది గొప్పవిషయమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'రైడర్ సింగిల్-పీస్ సీట్' బైక్ లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో లభిస్తుంది రైడర్ స్ప్లిట్ సీట్, స్మార్ట్-ఎక్స్నెక్ట్ (SmartXonnect) వేరియంట్కి దిగువన ఉంటుంది. ఇది కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ అవుతుంది. ఈ బైక్ ధర, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్ సింగిల్ పీస్ సీట్ మోడల్ ధర రూ. 94,719 కాగా, స్మార్ట్-ఎక్స్నెక్ట్ వేరియంట్ ధర లక్ష వరకు ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో, రైడర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ నిలిపివేసింది. డిజైన్ & ఫీచర్స్: టీవీఎస్ కొత్త రైడర్ బైక్ ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో మంచి డిజైన్ పొందుతుంది. కాగా ఇందులోని LCD డిస్ప్లే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో USB ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద చిన్న స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!) ఇంజిన్ & పర్ఫామెన్స్: టీవీఎస్ రైడర్ ఇంజిన్ ముందుపతి మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో 124.8 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి 11.4 హెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడుతుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టీవీఎస్ రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ కలిగి ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒకే ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ సెటప్ పొందుతుంది. ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్ల వరకు ఉంటుంది. -
టీవీఎస్ ఐక్యూబ్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా?
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ఎట్టకేలకు ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది. 2022 జనవరిలో కేవలం 1,529 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఐక్యూబ్ 2023 మార్చి నెలలో ఏకంగా 15,364 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏవిధంగా సాగాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్, ఎస్, ఎస్టి అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఐక్యూబ్ స్టాండర్డ్ ధర రూ. 98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 (ఆన్-రోడ్ ఢిల్లీ). అయితే కంపెనీ టాప్ వేరియంట్ ధరలను వెల్లడించలేదు, అయితే ఇది ఒక ఛార్జ్తో 140 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) టీవీఎస్ ఐక్యూబ్ ఎల్ఈడీ లైట్స్, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచెస్ వీల్స్ వంటివి పొందుతుంది. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ నగర ప్రయాణాలను చాల అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం రిటైల్ నెట్వర్క్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద నగరాల్లో 200 టచ్పాయింట్లను ప్రారభించింది. ఇటీవల ఈ స్కూటర్ 2023 గ్రీన్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. -
ఎంఎస్ ధోని మనసు దోచిన టీవీఎస్ బైక్ ఇదే!.. ధర ఎంతో తెలుసా!
భారతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న MS ధోని ఇటీవల 'టీవీఎస్ రోనిన్' బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే అనేక వాహనాలు కలిగిన ధోని గ్యారేజిలో ఇప్పుడు మరో అతిధి చేరింది. దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ గతేడాది రోనిన్ బైక్ విడుదల చేసింది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధర రూ. 1,49,000 కాగా, టాప్ వేరియంట్ రూ. 1,68,750 వద్ద అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్స్ని డ్యూయెల్ టోన్ కలర్స్లో అందిస్తోంది. ఇందులో ధోని రోనిన్ టాప్ వేరియంట్ కొనుగోలు చేశారు. ధోని డెలివరీ చేసుకున్న బైక్ విషయానికి వస్తే, ఇది 225 సీసీ ఇంజిన్ కలిగి 20 బిహెచ్పి పవర్ 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్తో గరిష్టంగా గంటకు 120 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ సైలెంట్ స్టార్ట్లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ను కలిగి ఉంది. టీవీఎస్ రోనిన్ రౌండ్ హెడ్ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది SmartXonnect కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్ణింగ్, క్రాష్ అలర్ట్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్త రోనిన్ బైక్ డబుల్ క్రెడిల్ స్ప్లిట్ చాసిస్తో 41 మి.మీ అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు, వెనుక భాగంలో స్పోర్ట్స్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇప్పటికే కవాసకి నింజా హెచ్2, ఎక్స్132 హెల్క్యాట్, యమహా RD350, రాజ్దూత్, సుజుకి షోగన్, యమహా RX100, టీవీఎస్ అపాచీ 310, హార్లే డేవిడ్సన్, డుకాటీ వంటి 100 కంటే ఎక్కువ బైకులు కలిగి ఉన్నారు. తాజాగా ఇప్పుడు టీవీఎస్ రోనిన్ తన గ్యారేజిని అలంకరించింది. -
టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్: న్యూ లుక్ చూస్తే ఫిదానే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ప్రవేశపెట్టింది. కొత్త కలర్, కొత్త అప్డేట్స్తో స్పెషల్గా దీన్ని ఆవిష్కరించింది. కొత్త పెరల్ వైట్ కలర్లో వస్తున్న స్పెషల్ ఎడిషన్ 2023 వెర్షన్ ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇంజీన్, ఫీచర్లు 5 స్పీడ్ గేర్బాక్స్తో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ పొందుపరిచారు. ఇది 250 ఆర్పీఎం వద్ద 17.39 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్తో కొత్త పెర్ల్ వైట్ కలర్ కొత్త సీటు నమూనాతో డ్యూయల్-టోన్ సీటు ఎడ్జస్టబుల్ క్లచ్ అండ్, బ్రేక్ లివర్లు అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్మోడ్స్లో లభ్యం. TVS SmartXonnect కనెక్టివిటీ రేర్ రేడియల్ టైర్ గేర్ షిఫ్ట్ సూచిక సిగ్నేచర్ ఆల్-LED హెడ్ల్యాంప్ డేటైమ్ రన్నింగ్ లైట్ TVS Apache RTR సిరీస్ బైక్స్ అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ సెంట్రిసిటీలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నాయనీ, కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రేసింగ్ వారసత్వం, అనుభవంతో స్పెషల్ ఎడిషన్ని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా!
యువతను తన వైపుకు తిప్పుకొని రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టిన టీవీఎస్ అపాచీ (Tvs Apache) మోడల్ బైకులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ కొత్తగా రెండు అపాచీ మోడళ్లను లాంచ్ చేసింది. ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160( 2022 TVS Apache RTR 160), రెండోది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోడల్. RTR 160 ధర రూ 1.18 లక్షలు కాగా RTR 180 ధర 1.31 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తగా రాబోతున్న ఈ రెండు మోటార్సైకిళ్లలో రిఫ్రెష్డ్ డిజైన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect) చేయబడిన టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక రెయిన్, అర్బన్, స్పోర్ట్ పేరుతో మూడు విభిన్న డైవింగ్ మోడ్లు ప్రత్యేక ఫీచర్గా చెప్పాలి. ఫీచర్లు ఇవే: 2022 TVS Apache RTR 160.. 5-స్పీడ్ గేర్బాక్స్తో 159.7 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, 16.04 PS పవర్, 13.85 Nm టార్క్ డెలివర్ చేస్తుంది. 2022 TVS Apache RTR 180.. 5-స్పీడ్ గేర్బాక్స్, 17PS పవర్, 15 Nm టార్క్తో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజన్తో వస్తుంది. వీటిలో..ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్లతో పాటు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ (LED) హెడ్ల్యాంప్ కూడా ఉంది. అధునాతన బ్లూటూత్తో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తున్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 సిరీస్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుండగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్లో గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, టీ-గ్రే వంటి ఐదు వేరియంట్ కలర్స్లో లభ్యమవుతుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
హైదరాబాద్లో టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్.. ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆన్రోడ్ ధర ఢిల్లీలో రూ.98 వేల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్నుబట్టి 100–140 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్లో మూడు చార్జింగ్ ఆప్షన్స్, 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్, క్లీన్యూఐ, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్సెట్, ఇన్ట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, ఓటీఏ అప్డేట్స్, ఫాస్ట్ చార్జింగ్, మల్టిపుల్ బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ, 32 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం వంటి హంగులు ఉన్నాయి. రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 33 నగరాల్లో ఐక్యూబ్ లభిస్తుంది. త్వరలో మరో 52 నగరాలను జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. చదవండి: ‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్వ్యాగన్లు -
పేరు గంటా రాముడు.. ఎక్స్ఎల్ బైక్ కనపడితే ఖతం
కర్నూలు (బొమ్మలసత్రం) : కేవలం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎక్స్ఎల్ బైక్లను మాత్రమే కాజేసే ఓ దొంగను వన్టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మరే ఇతర బైకు కనిపించినా ఈ దొంగ వాటి వైపు కన్నెత్తి చూడడు. ఎందుకంటే ఆ దొంగకు కేవలం టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని మాత్రమే నడుపుతాడు. సరే దొంగిలించిన వాహనాన్ని ఎవరికైనా తక్కువ ధర విక్రయిస్తాడా అంటే అదీ లేదు. తాను దొంగిలించిన 14 బైకులను ఒక ఇంట్లో ఉంచి వాటిని చూస్తూ ఆనందించేవాడు. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన 54 ఏళ్ల గంటా రాముడు చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. రాముడు టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్ మాత్రమే నడిపేవాడు. ఎక్కడ టీవీఎస్ ఎక్స్ఎల్ బైకు కనిపించినా తన దృష్టి బైక్మీదే ఉంచేవాడు. తన ఇంటి నిండా టీవీఎస్ బైకులతో నింపాలన్న చిలిపి కోరిక రాముడు దొంగతనాలకు బానిసయ్యేలా చేసింది. ఈ క్రమంలో నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, నందికొట్కూరు ప్రాంతాల్లో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని తనకు నచ్చిన బైకు వద్ద వెళ్లి, ఎవరూ లేని సమయంలో దాన్ని దొంగిలించి వాహనంపై పరారయ్యేవాడు. ఇదే క్రమంలో నంద్యాల గాంధీచౌక్ సెంటర్లో ఒక దుకాణం ముందు నిలిపిన బైకును రాముడు గత నెలలో చోరీ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో రాముడు బైక్ ఎత్తుకెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. రాముడు సొంత గ్రామమైన కొణిదెల గ్రామానికి వెళ్లి విచారించారు. తాను ఏకంగా 14 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకుని వాటిని ఓ పాడుబడిన మిద్దెలో దాచినట్లు చెప్పాడు. పోలీసులు బైక్లను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి దొంగను పట్టుకున్న ఏఎస్సై క్రిష్ణారెడ్డి, హుస్సేన్ సిబ్బంది మద్దిలేటి, మస్తాన్, సుధాకర్లను డీఎస్పీ రామాంజినాయక్, సీఐ ఓబులేసులు అభినందించారు. -
టీవీఎస్తో జట్టు కట్టిన జియో
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా జియోబీపీ సంస్థ ప్రముఖ టూవీలర్ మేకర్ టీవీఎస్తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న త్వరలో రాబోతున జియో బీపీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లలో టీవీఎస్ వాహనాలకు యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా టీవీఎస్ ఈవీలలో ప్రయాణం చేయడం మరింత సౌకర్యవంతం కానుంది. రిలయన్స్ సబ్సిడరీ సంస్థ అయిన జియో బీపీ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జియోబీపీ ప్లస్ పేరుతో ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు ఐక్యూబ్ పేరుతో ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో అడుగు పెట్టిన టీవీఎస్ సంస్థ.. రాబోయే రోజుల్లో రూ.1000 కోట్లను ఈవీ రంగంపై ఖర్చు చేయనుంది. దీంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా జియోబీపీ, టీవీఎస్లు జట్టు కట్టాయి. -
ఆటోమొబైల్ కంపెనీలకు భారీగా ‘పీఎల్ఐ’ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా.. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగం కోసం ప్రకటించిన ఉత్పాదకత ఆధార ప్రోత్సాహకా(పీఎల్ఐ) పథకం కింద 75 సంస్థలకు ప్రయోజనాలు లభించనున్నాయి. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, లూకాస్-టీవీఎస్, టాటా కమిన్స్, టయోటా కిర్లోస్కర్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశీ కంపెనీలతో పాటు జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల సంస్థలు కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. పీఎల్ఐ స్కీములో అంతర్భాగమైన రెండు పథకాల ద్వారా అయిదేళ్లలో రూ. 74,850 కోట్ల మేర పెట్టుబడులు రానున్నట్లు పేర్కొంది. కాంపోనెంట్ చాంపియన్ ఇన్వెస్టివ్ స్కీము కింద దాదాపు రూ. 29,834 కోట్లు, చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీము కింద రూ. 45,016 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.42,500 కోట్ల లక్ష్యం కన్నా ఇది అధికమని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఓఈఎం స్కీము కింద ఇప్పటికే 20 సంస్థలు ఎంపికయ్యాయి. ‘ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా భారత్ సాధిస్తున్న పురోగతిపై పరిశ్రమ గట్టి నమ్మకంతో ఉందని ఈ పథకాలకు లభించిన స్పందన తెలియజేస్తోంది. (చదవండి: ఐఫోన్ 13పై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..!) -
టీవీఎస్ నుండి మరో కొత్త వెహికల్, ధర ఎంతంటే?
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్ను ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.73,400. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ 124.8 సీసీ ఇంజన్తో తయారైంది. అధిక మైలేజీ కోసం ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వాడారు. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్ వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభిస్తుంది. టీవీఎస్ ఇంటెల్లిగో, సీట్ కింద 33 లీటర్ల స్టోరేజ్, మెటల్ మ్యాక్స్ బాడీ, ఎల్ఈడీ హెడ్ల్యాంప్, మోనోట్యూబ్ షాక్స్, ఆల్ ఇన్ వన్ లాక్ వంటి హంగులు ఉన్నాయి. ఇప్పటికే టీవీఎస్ మోటార్ జూపిటర్ 110 వర్షన్ను విక్రయిస్తోంది. -
ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ, టాటా పవర్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎమ్ఒయులో భాగంగా భారతదేశం అంతటా టీవీఎస్ మోటార్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(ఈవీసీఐ) నిర్మించడం కోసం రెండు కంపెనీలు అంగీకరించాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడం కోసం పెద్ద డెడికేటెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. టీవిఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్, టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్ ద్వారా దేశంలో విస్తృతంగా ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ నెట్ వర్క్ స్టేషన్లు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రెగ్యులర్ ఎసీ ఛార్జింగ్ నెట్ వర్క్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని చూసేవారికి ఈ భాగస్వామ్యం మరింత సహాయపడుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య నేపథ్యంలో సౌర శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే రెండు కంపెనీలు తమ ప్రయాణంలో ఎంపిక చేసిన ఛార్జింగ్ స్టేషన్ల వద్ద సౌర శక్తి ద్వారా పవర్ ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాయి. (చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!) -
మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2021 అపాచీ ఆర్ఆర్ 310ని భారతదేశంలో రూ.2.60 లక్షల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఆర్ఆర్ 310లో కొత్త ఫీచర్స్, కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. టీవీఎస్ మోటార్ ఇప్పటికే కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బుకింగ్స్ ప్రారంభించింది. ఆర్ఆర్ 310లో ముందు, వెనుక సస్పెన్షన్లను ట్వీక్ చేసింది. ఈ కొత్త బైక్ మునుపటి బైక్ కంటే అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్లో ఆర్టీ-స్లిప్పర్ క్లచ్, బై-ఎల్ఈడీ ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, ఆర్టీ-ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నాయి. అపాచీ ఆర్ఆర్ 310నిలోని డిజిటల్ క్లస్టర్ యూనిట్ లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డే ట్రిప్ మీటర్, డైనమిక్ రెవ్ లిమిట్ ఇండికేటర్, ఓవర్ స్పీడ్ ఇండికేటర్ లను చూపిస్తుంది. బీఎమ్డబ్ల్యూ జీ 310 ఆర్ ఇంజిన్ ఆధారంగా 310 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో కొత్త అపాచీ ఆర్ఆర్ 310 వస్తుంది. 34 బిహెచ్పి శక్తి, 27.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో 2021 అపాచీ ఆర్ఆర్ 310 ప్రారంభించాలని టీవీఎస్ కంపెనీ ఇంతకు ముందు యోచించింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా లాంచ్ ఆలస్యమైంది. 2021 అపాచీ ఆర్ఆర్ 310 కెటిఎమ్ ఆర్ సీ 390, కావాసాకీ నింజా 300, బెనెల్లీ 302ఆర్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది.(చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!) -
ప్రపంచ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన టీవీఎస్ స్కూటర్
టీవీఎస్ మోటార్స్ ఎన్టీఓఆర్క్యూ(NTORQ) 125 స్కూటర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. ఎన్టీఓఆర్క్యూ దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఆసియాన్, లాటిన్ అమెరికాలోని 19 దేశాలలో తమకు కొనుగోలుదారులు ఉన్నట్లు పేర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. మా స్మార్ట్ స్కూటర్ టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ 125 అంతర్జాతీయ మార్కెట్లలో 1 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ కస్టమర్లను భాగ ఆకర్షిస్తుంది. దీనికి ప్రధాన కారణం స్కూటర్ అద్భుతమైన ప్రదర్శన, అందులో ఉన్న సాంకేతికత, ఉన్నతమైన పనితీరు వంటి అంశాలు అందరికి చేరుకోవడానికి దోహదపడ్డాయి అని చెప్పారు. ఆవిష్కరణలో బెంచ్మార్క్లను అందుకోవడం, కస్టమర్ల ఆకాంక్షను నెరవర్చడం ద్వారా టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ బ్రాండ్ను పెంచుకోవాలనే మా నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ అని కూడా అన్నారు. దీనిలో మంచి పనితీరు కోసం టీవీఎస్ రేసింగ్ పెడిగ్రీ సపోర్ట్, రేస్-ట్యూన్డ్ ఇంధన ఇంజెక్షన్ (RT-Fi) కలిగి ఉంది. టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఈ కారణం వల్ల స్కూటర్ను స్మార్ట్ఫోన్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చెయ్యవచ్చు. అలాగే, నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇంటర్నల్ ల్యాప్-టైమర్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, రెడ్ కలర్ హాజార్డ్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్, లెడ్ లైటింగ్, స్ట్రీట్ - స్పోర్ట్ వంటి మల్టీ-రైడ్ స్టాటిస్టిక్స్ మోడ్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. బీఎస్-VI స్కూటర్ డిస్క్, డ్రమ్ రేస్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాట్టే రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. రేస్ ఎడిషన్ రెడ్-బ్లాక్, ఎల్లో-బ్లాక్లలో లభిస్తుంది. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
సరికొత్తగా టీవీఎస్ అపాచీ బైక్ : ధర?
సాక్షి, ముంబై: టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్సైకిల్ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320,డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270 (ఎక్స్షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా కంపెనీ నిర్ణయించింది. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ అధునాతన ఇంజీన్ అమర్చినట్టు తెలిపింది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 17.38 హెచ్పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్ఈడీ హెడ్ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్లు ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్తో ఆకట్టుకోనుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతినిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది. -
స్మార్ట్ టెక్నాలజీ, న్యూలుక్ : టీవీఎస్ కొత్త అపాచీ
సాక్షి, ముంబై: పముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్స్ బీఎస్-6 ప్రమాణాలకు తోడుగా, కొత్త ఫీచర్లు, అధునిక టెక్నాలజీతో రూపొందించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ను లాంచ్ చేసింది. ప్రత్యేక ఎడిషన్ బైక్లో తొలిసారి రైడ్ మోడ్ను పరిచయం చేసింది. స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్లతో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరను మాత్రం పాత దానితో పోలిస్తే.. కాస్త ఎక్కువగానే ఉంది. ధర రూ .1.31 లక్షలుగా నిర్ణయించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బుకింగ్, డెలివరీ ఈ రోజు నుండే ప్రారంభం. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ కొత్త బైక్ను కొత్త అవతారంలో తీసుకొచ్చింది. ఎల్ఈడీ టెక్ హెడ్ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ సింగిల్ ఛానల్ ఏబీఎస్, హై పెర్ఫార్మెన్స్ రియర్ రేడియల్ టైర్లు, రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రేస్ ట్యూన్డ్ స్లీపర్ క్లచ్, స్లైడ్ త్రూ టెక్నాలజీ ఉన్నాయి. దీనితో పాటు, ఎడ్జస్టబుల ఫ్రంట్ సస్పెన్షన్ లివర్నుజోడించింది. అంతేకాదు బ్లూటూత్తో కూడిన స్మార్ట్ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీని అపాచీ ఆర్టీఆర్ 200 4వీలో జోడించింది. దీని ద్వారా యాప్ను మొబైల్కు కనెక్ట్ చేయవచ్చు.తద్వారా బైక్కు సంబంధించిన చాలా సమాచారం తీసుకోవచ్చు. రైడర్ను ఎల్లప్పుడూ బైక్తో ఎటాచ్ అవ్వవచ్చు. ఇంకా ఈ బైక్లో ప్రామాణిక బ్లూటూత్ కనెక్టివిటీతో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను అందిచింది. 197.75 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 20.2 బీహెచ్పీ పవర్ను, 16.8 న్యూటన్ మీటర్ టార్క్ను అందిస్తుంది. -
సెప్టెంబర్లో ఆటోరంగం అమ్మకాల స్పీడ్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్డవున్ల ఎత్తివేత నేపథ్యంలో వాహన పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ బాటలో ఇప్పటికే ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోగా.. గత నెల(సెప్టెంబర్)లో ద్విచక్ర వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా కార్ల విక్రయాలు సైతం వేగమందుకున్నాయి. ఇకపై ఆటో రంగం మరింత బలపడనున్న అంచనాలు వాహన తయారీ కంపెనీలకు డిమాండ్ను పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ ఆటో జూమ్ గత నెలలో బజాజ్ ఆటో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 5.3 శాతం జంప్చేసి రూ. 3,033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లింది. రూ. 3,114 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ సైతం మెరుగైన అమ్మకాలను సాధించగలదన్న అంచనాలు ఈ కౌంటర్కు సైతం డిమాండ్ను పెంచాయి. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత టీవీఎస్ మోటార్ షేరు 5 శాతం జంప్చేసి రూ. 490ను తాకింది. ప్రస్తుతం 3.6 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాలు భళా సెప్టెంబర్లో బజాజ్ ఆటో మొత్తం 4.41 లక్షల వాహనాలను విక్రయించింది. ఇది 10 శాతం వృద్ధికాగా.. ద్విచక్ర వాహన అమ్మకాలు 20 శాతం పెరిగి దాదాపు 4.09 లక్షలకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం ఎగసి 1.85 లక్షల యూనిట్లను దాటాయి. కాగా.. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు గత నెలలో 31 శాతం జంప్చేసి 1.6 లక్షల యూనిట్లను అధిగమించగా.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల విక్రయాలు 9 శాతం బలపడి 11,851 యూనిట్లను తాకాయి. ఇదే ఇధంగా ఎంఅండ్ఎం సైతం 17 శాతం అధికంగా 43,386 ట్రాక్టర్ల అమ్మకాలను సాధించింది. -
టీవీఎస్ మరోసారి మధ్యంతర డివిడెండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీసీఎస్ మోటార్ తన వాటాదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీవీఎస్ బోర్డు రెండవ తాత్కాలిక డివిడెండ్ రూపంలో షేరుకు 1.40 చొప్పున చెల్లించడానికి ఆమోదించినట్లు తెలిపింది. మార్చి 18 న పని గంటలు ముగిసే సమయానికి ఈ షేర్లను వాటాలను కలిగి ఉన్న వాటాదారులకు మార్చి 20 న లేదా ఆ తరువాత ప్రకటించిన తాత్కాలిక డివిడెండ్ చెల్లించబడుతుందని చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఈ రోజు (మంగళవారం) జరిగిన సంస్థ డైరెక్టర్ల సమావేశంలో బోర్డు మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రెండవ మధ్యంతర డివిడెండ్ను షేరుకు రూ. 1.40 (140 శాతం) చొప్పున ప్రకటించింది. గత నెలలో ఇది ఒక్కో షేరుకు రూ. 2.1 డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మోడ్రన్ ఫీచర్స్తో టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ తన పాపులర్ మోడల్ స్కూటీపెప్ లో కొత్త ఎడిషన్ను లాంచ్ చేసింది. తన స్కూటీ బ్రాండ్కు 25 సంవత్సరాల పూర్తైన సందర్భంగా కొత్త అపడేట్స్తో సరికొత్తగా టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 44,764 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) గా నిర్ణయించింది. మాటే ఎడిషన్ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 3డీ ఎంబ్లం, ప్రెష్ గ్రాఫిక్స్, సీట్ల మార్పు తదితర రిఫ్రెష్ లుక్లో స్వల్ప మార్పులు తప్ప టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్లో యాంత్రికంగా పెద్ద మార్పులేవీ లేవు. 87.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఎకో థ్రస్ట్ ఇంజిన్, 4.8 బిహెచ్పి, 5.8 ఎన్ఎమ్ పీక్ టార్క్ కీలక ఫీచర్లుగా ఉన్నాయి. ఎగుడుదిగుడు రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించేందుకు టెలిస్కోపిక్ సస్పెన్షన్తోపాటు వెనుక భాగంలో సింగిల్ షాక్తో వస్తుంది. సీబీఎస్, డ్రమ్ బ్రేక్లను ఇరువైపులా అమర్చింది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్లో మొబైల్ ఛార్జర్ సాకెట్, సైడ్ స్టాండ్ అలారం, అండర్-సీట్ స్టోరేజ్ హుక్స్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, బ్రాండ్ పేటెంట్ పొందిన 'ఈజీ' స్టాండ్ టెక్నాలజీ లాంటి అధునాతన ఫీచర్లు జోడించింది. అలాగే 30 శాతం స్కూటీ బరువు కూడా తగ్గించింది. కాగా పాతికేళ్ల క్రితం మహిళా రైడర్ల కోసం టీవీఎస్ స్కూటీ ఎంట్రీ లెవల్ స్కూటర్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. భారతదేశంలో ఎక్కువ జనాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా స్కూటీ పెప్ కొనసాగుతోంది. -
టీవీఎస్ మోటార్ లాభం 6 శాతం డౌన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–.జూన్ క్వార్టర్(2019–20, క్యూ1)లో 6 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.160 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ. 151కోట్లకు చేరిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,626 కోట్ల నుంచి రూ.5,026 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.4,386 కోట్ల నుంచి రూ.4,793 కోట్లకు చేరాయని తెలిపింది. గత క్యూ1లో 8.93 లక్షలుగా ఉన్న మొత్తం టూ, త్రీ వీలర్ల అమ్మకాలు (ఎగుమతులతో కలుపుకొని) ఈ క్యూ1లో 8.84 లక్షలకు తగ్గాయని తెలిపింది. బైక్ల అమ్మకాలు 8 శాతం పెరిగి 4.17 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 2.95 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 11 శాతం వృద్ధితో 40,000కు పెరిగాయని పేర్కొంది. ఎగుమతులు మాత్రం భారీగా తగ్గాయని, అందుకనే మొత్తం అమ్మకాలు క్షీణించాయని వివరించింది. నికర లాభం 6 శాతం తగ్గడంతో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ షేర్ 4% నష్టంతో రూ.380 వద్ద ముగిసింది. -
మార్కెట్లోకి ‘ఇథనాల్’ టీవీఎస్ అపాచీ
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’.. తాజాగా తన పాపులర్ మోడల్ అపాచీలో ‘ఇథనాల్’ వెర్షన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అపాచీ ఆర్టీఆర్ 200 ఫై ఈ100’ పేరిట శుక్రవారం విడుదలైన ఈ అధునాతన బైక్... ఇథనాల్ ఇంధనం ఆధారంగా నడుస్తుంది. ప్రారంభ ధర రూ.1.2 లక్షలు. దేశవ్యాప్తంగా ఇథనాల్ అందుబాటులో లేనందున ప్రస్తుతానికి చెరుకు పంటకు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో ఈ బైక్ను విడుదల చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘ద్విచక్ర వాహన పరిశ్రమ పెట్రోల్, డీజిల్ బైక్ల నుంచి నెమ్మదిగా పర్యావరణ అనుకూల ఇంధనాలవైపునకు అడుగులు వేస్తోంది. కంపెనీలు విద్యుత్, హైబ్రిడ్తో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల దిశగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇథనాల్ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నాం. ఈ కారణంగానే.. ఈ బైక్ను ప్రవేశపెట్టాం’ అని అన్నారు. త్వరలోనే ఇథనాల్ పంప్స్.. పెట్రోల్ బంకుల మాదిరిగా త్వరలోనే దేశవ్యాప్తంగా ఇథనాల్ పంప్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇథనాల్ బైక్ విడుదల కార్యక్రమానికి హజరైన ఆయన.. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖను ఇథనాల్ పంప్స్ ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. -
టీవీఎస్ మోటార్ లాభం 19 శాతం డౌన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 19 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు తగ్గిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,007 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లకు పెరిగింది. మొత్తం టూ వీలర్, త్రీ వీలర్ అమ్మకాలు 8.89 లక్షల నుంచి 9.07 లక్షలకు పెరిగాయి. ఎబిటా రూ.295 కోట్ల నుంచి 4.4 శాతం వృద్ధితో రూ.308 కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్ 7 శాతంగా నమోదైంది. ఏడాది అమ్మకాలు 37.57 లక్షలు ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.663 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 1 శాతం పెరిగి రూ.670 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.ఆదాయం రూ.15,519 కోట్ల నుంచి రూ.18,210 కోట్లకు ఎగసిందని వివరించింది. మొత్తం టూ వీలర్ అమ్మకాలు 33.67 లక్షల నుంచి 37.57 లక్షలకు చేరాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 4 శాతం నష్టంతో రూ.486 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్ మెరుగైన ఫలితాలు
2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేస్తూ నికర లాభాలను నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో టీవీఎస్ మోటార్ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 178 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం పుంజుకుని రూ. 4664 కోట్లకు చేరింది. ఇబిటా 25 శాతం జంప్చేసి రూ. 376 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు 3 శాతం పెరిగి రూ. 555 వద్ద ముగిసింది. తమ లేటెస్ట్ వాహనాలను మంచి ఆదరణ లభించిందని కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ఫలితంగా క్యూ3 పోలిస్తే క్యూ4లో మంచి లాభాలనార్జించినట్టు పేర్కొంది. -
మార్కెట్లోకి టీవీఎస్ సరికొత్త ‘వీగో’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్స్ అధునాతన ‘వీగో’ స్కూటర్ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్, స్పోర్టి వీల్–రిమ్ స్టిక్కర్స్, పాస్–బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు. 110 సీసీ, పూర్తి మెటల్ బాడీ, అధునాతన డిజిటల్ స్పీడోమీటర్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ.53,027 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు. ప్రత్యేకించి మారుతున్న యువత అభిరుచులకు తగినట్లుగా స్కూటర్ డిజైన్ అయిందని వ్యాఖ్యానించారు.