Venkateswara Swamy
-
కరీంనగర్ : కనుల పండువగా శ్రీవారి శోభాయాత్ర (ఫొటోలు)
-
కరీంనగర్ : రమణీయం..శ్రీనివాస కల్యాణం (ఫొటోలు)
-
గరుడ వాహనంపై గోవిందుడు
తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు గరుడునిపై మంగళవారం అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 6:30 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ లక్షలాది మంది భక్తుల సమక్షంలో అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనంపై దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని మలయప్ప అనుగ్రహించారు. ఈ సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్ పురాతన బ్రాస్లెట్ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను మలయప్పకు అలంకరించారు. భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది.గరుడ వాహనం ముందు భక్త బృందాల భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు విశేషంగా అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజు ఉదయం మంగళవారం శ్రీవారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. తిరుమలలో బుధవారం శ్రీవారి స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణ రథంపై స్వామివారు ఊరేగనున్నారు. కిక్కిరిసిన తిరుమలగిరులు గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ వాహన సేవలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడవాహన సేవ కోసం నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం 1 గంటకే నిండిపోయాయి. -
28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న తిరుమలకు వెళ్లనున్నారు. 27వ తేదీ శుక్రవారం రాత్రికి ఆయన తిరుమల చేరుకుని.. మరుసటి రోజు (శనివారం) ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.మరోవైపు, తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ‘‘రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని.. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్సార్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మహా ప్రసాదం లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చి.. టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలు -
ఘనంగా శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం
తిరుమల: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 5 వరకు ఈ సదస్సు జరుగనుంది. తొలి రోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా..ఈవో ఏవీ ధర్మారెడ్డి కార్యక్రమ సందర్భ పరిచయం చేశారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాలపై ఎస్వీబీసీ రూపొందించిన 40 నిమిషాల ఆడియో విజువల్ను ప్రదర్శించారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, విద్యాశ్రీషతీర్థ (బెంగళూరు), సిద్ధేశ్వరానంద భారతి (కుర్తాళం), మాతృశ్రీ రమ్యానంద (తిరుపతి), సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి (విజయవాడ), రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం), స్వస్వరూపానందగిరి స్వామి (శ్రీనివాసమంగాపురం), పరిపూర్ణానందగిరి స్వామి(ఏర్పేడు), విద్యాప్రసన్న తీర్థ (కర్ణాటక), విరజానంద స్వామి (కడప), విశ్వయోగి విశ్వంజి (గుంటూరు), సచ్చిదానంద సరస్వతి (తుని), హరితీర్థ స్వామీజీ (నెల్లూరు), ప్రకాశానంద సరస్వతి (విజయవాడ), మాతా శివానంద సరస్వతి, మాతా సుశ్రుశానంద (తేనెపల్లి), శివ దర్శనం మాతాజీ (ప్రొద్దుటూరు), స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి (ఉత్తరకాశీ), సత్యానంద భారతి (విజయవాడ), శ్రీ శివ స్వామి (గుంటూరు), దేవనాథ రామానుజ జీయర్ స్వామి (హైదరాబాద్), విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అనుగ్రహణ భాషణం చేశారు. మరింత గొప్పగా ధర్మ ప్రచారం: భూమన మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు భూమన తెలిపారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామన్నారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని చెప్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తోన్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందన్నారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్రావు నామినేషన్కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
చక్రస్నానంతో సేద తీరిన శ్రీనివాసుడు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంతో స్వామివారు వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో ఊరేగి అలసిసొలసిన శ్రీవారు స్నపన తిరుమంజనం సేవలో సేద తీరారు. జీయర్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సాగింది. అనంతరం మంగళవాయిద్యాల నడుమ, వేదపండితుల వేదఘోష, అశేషభక్త జన గోవింద నామస్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశయైన సుదర్శన చక్రత్తాళ్వార్కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. భక్తులు సైతం ఈ పుష్కరిణిలో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. కాగా, తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆగమ శాస్త్రం ప్రకారం గరుడపతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాలు ముగించారు. -
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’(మత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(మూకుళ్లు)–శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు.సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం మూడు వేల మంది, గరుడసేవ కోసం మరో 700 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శనివారం డీఎఫ్వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగ నాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 18వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవుతో తాడు ఉంటుంది. -
కమనీయంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు
-
శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక నిజాలు..!
-
విశాఖ వేదికగా మిలన్–2024
సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖపట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్–2024 నిర్వహించనుంది. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. మిలన్–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకాదళాలు పాల్గొనే అవకాశముందని చెప్పారు. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పెందార్కర్ను సీఎం జగన్ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్ ముఖ్యమంత్రికి ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిశోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో శోభాయమానంగా శ్రీవారి వైభవోత్సవాలు (ఫొటోలు)
-
Hyderabad: ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకగా వెంకన్న వైభవోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్లో శ్రీవారి వైభవోత్సవాలు.. తరలివచ్చిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలివీ.. ఎన్టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. 15న... 15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మలేసియాలో వైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం
సాక్షి హైదరాబాద్: మలేసియా లోని బాగాన్ డత్తోలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 23నుంచి 25వ తేదీ వరకు కన్నుల పండువగా సంప్రోక్షణ, స్వామి వారి కళ్యాణ ఉత్సవం జరిగాయి. మలేసియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 5000 మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే దత్తో ఖైరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలేసియా తెలుగు సంఘం గౌరవ సలహాదారు దత్తో డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు, అధ్యక్షులు డాక్టర్ వెంకట ప్రతాప్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సత్యసుధాకర్, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
వెంకటేశ్వరస్వామి వేష ధారణలో తిరుపతి ఎంపి గురుమూర్తి
-
వెంకన్న వేషధారణలో ఎంపీ గురుమూర్తి
సాక్షి, తిరుపతి (కల్చరల్): తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన గంగమ్మ తల్లి ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రలో తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి గంగమ్మకు సోదరుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి వేషం ధరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ (ఫోటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
సాక్షి, తిరుమల: రామతీర్థంలో ప్రతిష్టించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాన్ని పునఃనిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. మంత్రి దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనతంరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ... నూతన విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ట చేసి, రామ తీర్థం ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. పూర్వవైభవం వచ్చేలా ఆలయ నిర్మాణం సంవత్సరాల కాలంలో పూర్తి చేసి, విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా మంత్రి వెల్లంపిల్లి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బెజవాడ దుర్గమ్మ ప్రతిమ, ప్రసాదాన్ని స్వామివారికి అందజేసి, మంత్రి వెల్లంపల్లి ఆశీర్వాదాలను తీసుకున్నారు. -
శ్రీవారి పున్నమి గరుడ వాహన సేవ
-
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
-
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
వాషింగ్టన్: నగరంలో కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు ‘తారా’ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్) జనరల్ సెక్రటరీ 'సంతోష్ కుమార్ బచ్చు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ... శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల విగ్రహాలకు తిరుపతిలో కళ్యాణం జరిగేంత ఘనంగా వేద పండితులు, అర్చకుల చేత కళ్యాణ వేడుకలు జరిపించినట్లు పేర్కొన్నారు. నాదస్వర వాయిద్యాల మధ్య కోలాటం ఆడుతూ... స్వామి వారిని పల్లకిలో స్వాగతిస్తూ.. సుప్రభాత సేవతో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తి విన్యాసాలతో, గోవింద నామాలతో , విష్ణు సహస్ర , అన్నమాచార్య కీర్తనలతో భక్త బృందం పాల్గొని తన్మయత్వంలో మునిగితేలారు. అలాగే ఉదయం ఏర్పాటు చేసిన ఫలహారాన్ని, కళ్యాణం తర్వాత పంచిన మహాప్రసాదాన్ని భక్తులు ఆస్వాదించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు, వడ ప్రసాదం విరివిరిగా పంచామని, చివరగా పల్లకి సేవతో స్వామివారికి, అమ్మవార్లకి భక్తులంతా వీడ్కోలు పలికినట్లు ఆయన వివరించారు. స్వామివారి కళ్యాణం తర్వాత తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూ ఉచితంగా పంచడంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణానికి హజరై విజయవంతం చేసిన భక్తులందరికి తారా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమలేశుడు గరుడ సేవా
-
పెరుమాళ్లు తిరునాళ్లు
నిత్య కళ్యాణ చక్రవర్తిగా అలరారుతూ... అఖండ భక్తజనానికి ఆయువై నిలిచిన శ్రీవేంకటేశ్వరుడి రూపం చూసిన వారికి తనివి తీరదు. చూడాలనే కోరిక చావదు. నేడు నిత్యం లక్ష మందికిపైగా దర్శన భాగ్యం పొందుతున్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి.. దివ్యమంగళ విగ్రహాన్ని ఆ పాద మస్తకం భక్తులకు తెలియజెప్పే ప్రయత్నమే ఈ కథనం. బంగారుపద్మ పీఠంపై శ్రీవారి కనకపు పాదాలు... గజ్జలు, అందెలు, ఆపై ఘనమైన పట్టుపీతాంబరం... ఆ పీతాంబరం కుచ్చులపై జీరాడుతూ... వేలాడుతున్న సహస్ర నామాల మాలలు. బొడ్డుదగ్గర సూర్య కటాది అనబడే నందక ఖడ్గం, నడుమున బిగించి ఉన్న వడ్డాణం, బంగారు మొలతాడు, వజ్ర ఖచిత వరదహస్తం, తన పాదాలే పరమార్థమని చూపిస్తున్న వైకుంఠహస్తం. ఎడమవైపున ఉన్న కటిహస్తం, కౌస్తుభమణి నవరత్న హారాలు, వక్షస్థలంపై వ్యూహ లక్ష్మి, శ్రీదేవి భూదేవి పతకాల హారాలు, కంఠమాలలు, బంగారు యజ్ఞోపవీతం. చేతులకు నాగాభరణాలు, భుజకీర్తులు. భుజాల నుంచి పాదాల వరకు వ్రేలాడుతున్న సాలగ్రామ మాలలు. భక్తులకు అభయమొసగే శంఖు చక్రాలు. చరగని తరగని చిరుమందహాసంతో నల్లనిమోము కలిగి నిగనిగలాడే చెక్కిళ్లు కలిగి, దొండపండు వంటి పెదవులు... ఆ పెదవుల కింద చుబుకంపైన చక్కనైన తెల్లని కర్పూరపుచుక్క. సొగసైన నాసిక, నొసటన తెల్లని నామం, భక్తులను కరుణిస్తూ ఉన్న అరవిరిసిన చూపులు. శిరసుపై నవరత్నాల మకుటరాజం. ఆపైన బంగారు మకర తోరణం... ఇలా ఆ మూలమూర్తి నిలువెత్తుగా అలంకరింప బడ్డ సుగంధ మనోహర సుమమాలలతో నిగమ.. నిగమాంత వేద్యుడైన ఆ స్వామి వారిని దర్శించిన వారు రెప్పపాటు కాలమైనా...రెప్పవాల్చకుండా శ్రీవారిని తనివితీరా దర్శించి ఆనందపుటంచులను తాకుతున్నారు. తిరుమల కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అన్ని ఉత్సవాల కంటే విలక్షణమైనవి.. విశిష్టమైనవి... వైభవోపేతమైనవి. లోక క్షేమార్థం.. నిత్యపూజాహీన ప్రాయశ్చిత్తార్థం, నిత్యపూజాదోష ప్రాయశ్చిత్తార్థం, సర్వ అశుభ నివారణార్థం శ్రీవారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. భగవంతుని మూలబింబంలో (ధ్రువబేరం) ఉండే శక్తి అభివృద్ధికి కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఈ ఉత్సవాలను మహోత్సవాలని, తిరునాళ్లు అని, కల్యాణోత్సవాలు అని కూడా అంటారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో అశ్వయుజ శుద్ధపాడ్యమి మొదలు అశ్వయుజ శుద్ధదశమి వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా... జగజ్జేయమానంగా ఉత్సవాలు జరుపుతారు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ దగ్గరుండి నిర్వహించటం వల్లే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు. కలౌ వేంకటనాయకః సహజసుందర క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం దివ్యమైనది... సుందరమైంది... భవ్యమైంది... నిత్య నూతనమైంది. బ్రహ్మాండమంతా వెదికినా ఈ పుణ్యక్షేత్రంతో ఏ క్షేత్రమూ సాటి రాదని ప్రతీతి. తిరుమల క్షేత్రం ఎన్నో పేర్లతో... అనేక శిఖరాలు... వివిధ లోయలు.. తీర్థాలతో భూలోక వైకుంఠంగా వన్నెకెక్కింది. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఈ తిరుమల దివ్యక్షేత్రంలో విలసిల్లే దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామి సకల దేవతాస్వరూపం. అందుకే ఈయన ‘కలౌ వేంకటనాయకః’ అని కీర్తింప బడ్డాడు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామిని దర్శించటానికి దేశ నలుమూలల నుండే కాకుండా... ప్రపంచపు నలుమూలల నుండి, విశ్వాంతర్భాగాల నుండి రుషులు, దేవతలు, దిక్పాలురు వేంచేసి కనులపండువగా... తన్మయత్వంతో, అనన్యభక్తితో ప్రతినిత్యం స్వామిని దర్శిస్తుంటారు. బ్రహ్మాదిదేవతలంతా కూడా స్వర్గం నుండి శ్రీవేంకటాద్రికి వచ్చి నిత్యోత్సవాలను, బ్రహ్మోత్సవాలను భక్తి పూర్వకంగా తిలకిస్తారని ప్రతీతి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరుని వైభవం ఇంతా అంత కాదు. అమితవైభవం గా జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని తరిస్తారు. జన్మధన్యమైందని భావిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలకు చేరుకున్నవారు, స్వామి వారిని దర్శించుకున్న వారు∙ధన్యాత్ములు, పుణ్యాత్ములు. రాలేని వారు, చూడలేనివారు కనీసం మనోనేత్రాలతో వీక్షించినా ఫలదాయకమేనని శాస్త్రోక్తి.ఎంతటి అధికారి అయినా... దేశానికి రాజైనా... శ్రీవారి పడికావలి ముందు వరకు మాత్రమే అనుమతి. పడికావలి దాటాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి మూలమూర్తి సువర్ణ పద్మపీఠంపై స్వయంవ్యక్త సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉంటాడు. – తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి – ఫొటోలు: మోహనకృష్ణ కేతారి -
నీదా ఈ కొండ!
తిరుమల మాడవీథుల్లో వెడుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమలనంబి దేవాలయం ఉంటుంది. ఎవరీ తిరుమలనంబి? ఈయనకు దేవాలయం ఏమిటి? పూర్వం శ్రీరంగంలో యమునాచార్యులవారు శిష్యులందర్నీ కూర్చోబెట్టుకుని ‘బ్రాహ్మీ ముహూర్తంలో వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకు రావడానికి వేంకటాచలం మీద ఎవరయినా ఉండగలరా?’ అని అడిగితే తిరుమలనంబి దానికి సిద్ధపడ్డాడు. ఆయనను శ్రీశైలపూర్వులు అని కూడా అంటారు. ఆయన రోజూ పాపనాశనానికి వెళ్ళి నీళ్ళు కుండతో తలమీద పెట్టుకుని మోసుకుంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అభిషేకానికి తీసుకువస్తుండేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వేంకటేశ్వరస్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి ‘తాతా, తాతా! దాహం వేస్తోంది. నీళ్ళు పొయ్యవా? అని అడుగుతాడు. ‘ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెడుతున్నా...తప్పుకో’’ అంటూ ముందుకు సాగిపోతుంటే... బాలకిరాతుడు వెనకనుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్ళు తాగుతాడు. కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండనుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు. ‘‘ఎంత దుర్మార్గపు పని చేసావురా, తాగొద్దంటే అవి తాగావా?...’’అని నిందించబోతుంటే... వెంటనే ఆ బాలుడు ‘‘తాతా! బెంగపడొద్దు. నీళ్ళకు పాపనాశనందాకా వెళ్ళడమెందుకు? ఇక్కడే ఉంది, ధార నీకు చూపిస్తాను, రా...అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు. ఆకాశగంగ అలా వచ్చింది. ఆలయంలో స్వామి అర్చకులమీద ఆవహించి ‘‘అభిషేకానికి ఈవేళ నుంచి పాపనాశనం నీళ్ళు అక్కరలేదు. ఆకాశగంగ నీళ్ళతో చెయ్యండి.’’ అని పురమాయించారు. ఇప్పుడు తిరుమలనంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది. అక్కడ అనుష్ఠానం చేసుకుని స్వామివారి అభిషేకానికి పాపానాశనం నుంచి రోజూ తెల్లవారుఝూమునే చాలా సంవత్సరాలపాటు నీళ్ళు మోసుకొచ్చారు. అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా! అని పిలుస్తూ ఆయన్ని తరింపచేసావా, ఎంత సులభసాధ్యుడవయ్యా తండ్రీ అని చెప్పడానికి....‘‘అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారు వారికి/ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు/మచ్చిక దొలక తిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చమాటలాడి నోచినవాడు/’’ అనీ అన్నమాచార్యులవారు కీర్తన చేసారు. మరి ఈ అనంతాచార్యులవారెవరు? ఈయన కొండమీద స్వామివారికి పూలుగుచ్చి దండలు సిద్ధం చేసేవారు. ఈయన ఒకరోజున తనపనిలో నిమగ్నమై ఉండగా రమ్మనమని స్వామివారు కబురు పంపారట. దానికి ఆచార్యులవారు ‘‘ఆయనకు వేరేపని ఏముంది కనుక, హాయిగా పీఠమెక్కి కూచుంటాడు. కబుర్లకోసం నాకు రావడం కుదరదు’ అని చెప్పిపంపి సాయంత్రం ఆ దండలన్నింటినీ గౌరవంగా ఒక బుట్టలో పెట్టుకుని వెళ్ళాడు. ‘‘నేను రమ్మంటే రానప్పుడు, నీ పూలదండలు నాకెందుకు, అక్కరలేదు ఫో!’’ అని స్వామివారు కసురు కున్నారట. దానికి అనంతాచార్యులవారు ‘నీవెవరు నన్నుపొమ్మనడానికి. నీదా ఈ కొండ? వరాహ స్వామిదగ్గర నీవు ఎలా పుచ్చుకుని వచ్చావో, అలా మా గురువుగారు వెళ్ళమంటే నేను వచ్చా. గురువుగారు దండలిమ్మన్నారు. వచ్చి ఇస్తుంటా. పుచ్చుకుంటే పుచ్చుకో. లేదంటే ఊరుకో. ఇక్కడ ఈ తలుపు కొయ్యకు తగిలించి పోతున్నా. నీ ఇష్టం. నేను మాత్రం నా పని వదిలి కబుర్లకు రాను’’ అని చెప్పి వెళ్ళిపోతుంటే స్వామివారే వెంటపడి ఆయనను బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చారట. అంత పిచ్చి భక్తి చూపిన అనంతాళ్వారు వారికి వెట్టిచేసావా స్వామీ’’ అని అన్నమయ్య అంటున్నారు. -
తిరుమలలో నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
విశేష ఉత్సవాలు
♦ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు నిర్వహించాడట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఒక నూత్న వస్త్రం మీద గరుడుని పటాన్ని చిత్రిస్తారు. దీన్ని ధ్వజస్తంభం మీద కొడితాడుతో కట్టి, పైకి ఎగుర వేస్తారు. ఇలా ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, భూతప్రేత యక్ష గÆ ధర్వ గణాలకు ఆహ్వాన పత్రం. ♦ నిత్యం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు ∙స్వామి వారికి ఒకరోజు జరిగే అన్ని సేవలలో పాల్గొనే అవకాశం ఉదయాస్తమాన సేవకు ఉంది. ఈ సేవకు టికెట్ ధర అక్షరాలా పది లక్షల రూపాయలు. ♦ శ్రీవారికి ఏటా దాదాపు 800 కిలోల బంగారు కానుకల రూపంలో వస్తోంది. ♦ శ్రీవారికిచ్చే హారతి కోసం ఆలయంలో రోజుకు ఆరుకిలోల హారతి కర్పూరం వినియోగిస్తారు. ♦ తిరుమల కొండకు చేరుకునే నడకమార్గంలో మొత్తం 3500 మెట్లు ఉంటాయి. ♦ ప్రతి మంగళవారం శ్రీవారికి జరిపించే అష్టదళ పాద పద్మారాధన సేవలో భాగంగా 108 బంగారు పుష్పాలతో పూజిస్తారు. ఆ బంగారు పూలను చేయించ స్వామి వారికి బహుకరించింది గుంటూరుకు చెందిన షేక్ హుస్సేన్ అనే మహమ్మదీయుడు ♦ తిరుమలకొండపై కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని అఖిలాండం అంటారు. ♦ బ్రహ్మోత్సవాలకు పూర్వం తిరుక్కొడి తిరునాల్ అనే పేరుండేది. ధ్వజారోహణ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఇలా అనేవారు. -
‘మహాసంప్రోక్షణను టీవీల్లో ప్రసారం చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆగస్టు 9 నుంచి 17 వరకూ నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేసి టీవీల్లో ప్రసారం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఓ న్యాయవాది హైకోర్టును కోరారు. గురువారం ఉదయం హైకోర్టు ప్రారంభమైన వెంటనే ఆయన లేచి.. మహా సంప్రోక్షణను వీడియో చిత్రీకరణ చేసేలా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోటులో తవ్వకాలపై పిటిషనర్ ఇప్పటికే వ్యాజ్యం దాఖలు చేశారని, దానికి అనుబంధంగా మహా సంప్రోక్షణ గురించి పిటిషన్ వేస్తామని న్యాయవాది చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్లతో కూడిన ధర్మాసనం అందుకు అనుమతి ఇచ్చింది. ఒక్కో ఆలయంలో ఒక్కో విధానాన్ని అమలు చేస్తారని, వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశాలు ఎలా ఇస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. స్వామి వార్ల విగ్రహాలు కూడా ఉంటాయని, దార్మిక కార్యక్రమాలపై ఏవిధంగా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తామని పిటిషనర్ కోరగా అందుకు ధర్మాసనం అనుమతి ఇస్తూ, దానిపై ఈ నెల 24న విచారణ చేస్తామని తెలిపింది. -
దేవుళ్లకూ కులం ఆపాదనా...!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతల తీరుపై విసిగివేసారిన ప్రజలు తాజాగా ఆపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలతో అవాక్కవుతున్నారు. అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రజలను కులాలు, మతాలుగా చీలుస్తూ చేస్తున్న ప్రసంగాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వీటిపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీమహానాడులో ఆ పార్టీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అంటూ సంబోధించడాన్ని చూసి హవ్వ అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అగ్రనేతలు కులాల వారీగా ప్రస్తావనలు చేస్తూ వివిధ వర్గాల పట్ల తమ మనసులోని వైఖరిని బయట పెట్టుకుంటుండగా చివరకు దేవుళ్లకూ ఈ కులాల గొడవను అంటగట్టడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని మతలబులు చేసిందో అందరికీ తెలిసిందేనని, అయినా ఆపార్టీకి మెజార్టీ రాకుండా ఆగడానికి కారణం... మా ‘వెంకన్న చౌదరియే’నని వ్యాఖ్యానించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలురకాల సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు, చిత్రాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఆపార్టీ అధినేత చంద్రబాబు ఇంతకు ముందు ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఏకంగా మీడియా సమావేశంలోనే మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ద్వారకా తిరుమలలో స్పీకర్ కోడెల చౌదరి కూడా మన కమ్మోళ్లే ఎప్పుడూ అధికారంలో ఉండాలని, అందుకు మనోళ్లంతా కష్టపడాలని చెప్పారంటూ విమర్శలు వచ్చాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటూ చంద్రబాబు, ఇతర నేతల తీరుపై విమర్శలు సామాజిక మాద్యమాలలో వెల్లువెత్తుతున్నాయి. మనసులో మాటలూ వచ్చేస్తుంటాయి... గతకొంతకాలంగా టీడీపీ నేతల ప్రసంగాల్లో వారి మనసులో మాటలు బయటపెడుతున్నారని పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంటున్నారు. ‘అవినీతి, కులప్రీతి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీనే. సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరివేసుకున్నటే’ అంటూ గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొనడాన్ని, భారతదేశాన్ని అవినీతి దేశంగా మార్చేవరకు నిద్రపోనని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను వారు గుర్తుచేస్తున్నారు. -
బీజేపీకి మెజారిటీ రాకుండా ‘వెంకన్న చౌదరి’ అడ్డుకున్నారు
-
బీజేపీని ‘వెంకన్న చౌదరి’ అడ్డుకున్నాడు
సాక్షి, హైదరాబాద్ : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ మురళీ మోహన్ ‘వెంకన్న చౌదరి’ అని సంబోధించారు. కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశం సందర్భంగా మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నా చంద్రుడు మాత్రం ఒక్కడే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మురళీమోహన్ పేర్కొన్నారు. -
ఆభరణాలు బయటపడకపోతే పదవికి రాజీనామా చేస్తా
-
విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ బుధవారం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు. తన కుమారుడు లోకేష్పై అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్న చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణను కోరడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. వేల మంది పోలీసులను పెట్టుకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకోలేరని అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న సీనినటి కీర్తి సురేష్
-
శ్రీవారిని దర్శించుకున్న కీర్తిసురేశ్
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటి కీర్తిసురేశ్ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు కీర్తి సురేశ్ కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శించుకున్నట్టు కీర్తి చెప్పారు. అదే విధంగా స్వామివారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు పెషావర్ పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామిజీ, ఉడిపి పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామిజీలు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పెషావర్ పీఠాధిపతి స్వామికి బంగారు పాదాలు విరాళంగా అందజేశారు. కొనసాగుతున్న రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 20 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది. -
ఆపదలో మొక్కులవాడు!
ఆపద మొక్కులవాడా..అనాథ రక్షకా పాహిమాం..అని మనం మొక్కే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భూములకే ఇప్పుడు రక్షణ కరువైంది. అధికారులు పర్యవేక్షణ లేక, బాధ్యులు పట్టించుకోక కబ్జాకోరులు నేలకొండపల్లిలో ఏకంగా 50ఎకరాలకు గోవిందనామం పాడుతున్నారు. ఇంకా కాజేసేందుకు కాచుక్కూర్చున్నారు. మరి బాధ్యులను ఏం జేస్తారు..? దేవుడి మాణ్యాన్ని ఎలా రక్షిస్తారో..? అని భక్తులు, జనం ఎదురుచూస్తున్నారు. నేలకొండపల్లి: మండలకేంద్రం నేలకొండపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి 358ఎకరాల ఆస్తులు ఉండగా..వీటిపై కొందరు కన్నేశారు. విలువైన భూములను ఎంచక్కా కాజేస్తున్నారు. నేలకొండపల్లి, కమలాపురం, గువ్వలగూడెం, చిరుమర్రి, ముదిగొండ, మంగాపురం తదితర గ్రామాల్లో 358 ఎకరాలు ఈ దేవాలయానికి ఉన్నాయి. అయితే మంగాపురం గ్రామంలోనే 294.22 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ అక్కడ 100 ఎకరాలకే కౌలు వస్తోంది. అది కూడా కేవలం రూ.60 వేలు మాత్రమే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళణ కార్యక్రమంలో అన్యాక్రాంతం వెలుగులోకి వచ్చింది. 294.22 ఎకరాలకుగాను 244 ఎకరాల భూమికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఆలయ కమిటీకి తెలపడంతో..వారు కంగు తిన్నారు. కాల్వ అవసరాల రీత్యా ఎన్నెస్పీ అధికారులు కొంతభూమి తీసుకోగా..దాదాపు 50 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. చెరువుమాధారంలో 38 కుంటల భూమికి గాను 28 కుంటలకు మాత్రమే పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇక్కడ 10 కుంటలు కబ్జా అయింది. దేవాలయం వెనుక కాసాయి గడ్డ కింద 9.23 ఎకరాలు భూములను నిరుపయోగంగా వదిలేయడంతో అవి బీడుబారాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే దేవుడి భూములు కనుమరుగవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లోఆలయ భూముల వివరాలు ఇలా.. మంగాపురంతండా 294.22 ఎకరాలు చెరువుమాధారం 38 కుంటలు గంధసిరి 3.14 ఎకరాలు చిరుమర్రి 8.22 ఎకరాలు కమలాపురం 6.26 ఎకరాలు గువ్వలగూడెం 2.13 ఎకరాలు ముదిగొండ 3.26 ఎకరాలు నేలకొండపల్లి 30 ఎకరాలు భూములు అప్పగించాలి.. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రికార్డుల్లో నమోదై ఉన్న భూములను అప్పగించాలి. ఆ లెక్కల ప్రకారమే పాస్ çపుస్తకాలు అందించాలి. 294.22 ఎకరాలకు గాను 244 ఎకరాలకే ఇస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశా. బోర్లు వేసుకోవడానికి కౌలురైతుల పేరున రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశాను. – చవళం వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్, నేలకొండపల్లి ఇక విచారిస్తాం.. నేలకొండపల్లి దేవాలయం భూములు గెజిట్ ప్రకారం తక్కువగా ఉందని ఫిర్యాదు అందింది. మంగాపురంతండాలో క్షేత్ర స్థాయిలో విచారించి ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం. – దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి చర్యలు తీసుకోవాలి.. దేవాలయం భూములు అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. అన్యాక్రాంతమైన భూములపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి..బాధ్యులను శిక్షించాలి. – వంగవీటి నాగేశ్వరరావు,సర్పంచ్ -
ఆపద'లో' మొక్కులవాడు!
ఆపద మొక్కులవాడా..అనాథ రక్షకా పాహిమాం..అని మనం మొక్కే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భూములకే ఇప్పుడు రక్షణ కరువైంది. అధికారులు పర్యవేక్షణ లేక, బాధ్యులు పట్టించుకోక కబ్జాకోరులు నేలకొండపల్లిలో ఏకంగా 50ఎకరాలకు గోవిందనామం పాడుతున్నారు. ఇంకా కాజేసేందుకు కాచుక్కూర్చున్నారు. మరి బాధ్యులను ఏం జేస్తారు..? దేవుడి మాణ్యాన్ని ఎలా రక్షిస్తారో..? అని భక్తులు, జనం ఎదురుచూస్తున్నారు. నేలకొండపల్లి: మండలకేంద్రం నేలకొండపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి 358ఎకరాల ఆస్తులు ఉండగా..వీటిపై కొందరు కన్నేశారు. విలువైన భూములను ఎంచక్కా కాజేస్తున్నారు. నేలకొండపల్లి, కమలాపురం, గువ్వలగూడెం, చిరుమర్రి, ముదిగొండ, మంగాపురం తదితర గ్రామాల్లో 358 ఎకరాలు ఈ దేవాలయానికి ఉన్నాయి. అయితే మంగాపురం గ్రామంలోనే 294.22 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ అక్కడ 100 ఎకరాలకే కౌలు వస్తోంది. అది కూడా కేవలం రూ.60 వేలు మాత్రమే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళణ కార్యక్రమంలో అన్యాక్రాంతం వెలుగులోకి వచ్చింది. 294.22 ఎకరాలకుగాను 244 ఎకరాల భూమికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఆలయ కమిటీకి తెలపడంతో..వారు కంగు తిన్నారు. కాల్వ అవసరాల రీత్యా ఎన్నెస్పీ అధికారులు కొంతభూమి తీసుకోగా..దాదాపు 50 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. చెరువుమాధారంలో 38 కుంటల భూమికి గాను 28 కుంటలకు మాత్రమే పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇక్కడ 10 కుంటలు కబ్జా అయింది. దేవాలయం వెనుక కాసాయి గడ్డ కింద 9.23 ఎకరాలు భూములను నిరుపయోగంగా వదిలేయడంతో అవి బీడుబారాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే దేవుడి భూములు కనుమరుగవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లో ఆలయ భూముల వివరాలు ఇలా.. మంగాపురంతండా 294.22 ఎకరాలు చెరువుమాధారం 38 కుంటలు గంధసిరి 3.14 ఎకరాలు చిరుమర్రి 8.22 ఎకరాలు కమలాపురం 6.26 ఎకరాలు గువ్వలగూడెం 12.13 ఎకరాలు ముదిగొండ 3.26 ఎకరాలు నేలకొండపల్లి 30 ఎకరాలు భూములు అప్పగించాలి.. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రికార్డుల్లో నమోదై ఉన్న భూములను అప్పగించాలి. ఆ లెక్కల ప్రకారమే పాస్ çపుస్తకాలు అందించాలి. 294.22 ఎకరాలకు గాను 244 ఎకరాలకే ఇస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశా. బోర్లు వేసుకోవడానికి కౌలురైతుల పేరున రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశాను. – చవళం వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్, నేలకొండపల్లి ఇక విచారిస్తాం.. నేలకొండపల్లి దేవాలయం భూములు గెజిట్ ప్రకారం తక్కువగా ఉందని ఫిర్యాదు అందింది. మంగాపురంతండాలో క్షేత్ర స్థాయిలో విచారించి ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం. – దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి చర్యలు తీసుకోవాలి.. దేవాలయం భూములు అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. అన్యాక్రాంతమైన భూములపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి..బాధ్యులను శిక్షించాలి. – వంగవీటి నాగేశ్వరరావు,సర్పంచ్ -
ఆ రూపం... అపురూపం
పుణ్య తీర్థం కోరిన కోరికలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా... ఆపద మొక్కులు తీర్చే ఆపద్బాంధవుడిగా, వీసాలు కోరిన వారికి వీసాలు వచ్చేలా చేసే వీసాల వేంకటేశ్వరుడిగా, పెళ్లి కావడానికి కలుగుతున్న అడ్డంకులను తొలగించి, వెంటనే వివాహ సంబంధాలను కుదిర్చే కల్యాణ వేంకటేశ్వర స్వామిగా, పిల్లల కోసం పరితపిస్తున్న వారికి వెంటనే సంతానాన్ని ప్రసాదించే సంతాన వేంకటేశ్వరుడిగా... జిల్లెలగూడలోని మత్సా్యవతార కళ్యాణ వేంకటేశ్వర స్వామి భక్తకోటి నుంచి నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ స్వామి వారికి నేటి నుంచి తొమ్మిదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు, తిరుకల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ పుణ్యతీర్థంలోని కొన్ని బిందువులు... అలనాటి శిల్ప కళాసౌందర్యం ఉట్టిపడే విధంగా... అడుగడుగునా భక్తి పారవశ్యం తొణికిసలాడే మత్సా్యవతార కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తుల విశ్వాసం. ఉత్తర ముఖద్వారంతో ఉండే ఈ ఆలయంలో అడుగు పెట్టడంతోటే సర్వపాపాలూ పటాపంచలవుతాయనీ, స్వామిని స్మరించుకుని ఆలయం వెలుపల ఉన్న చింతచెట్టుకు ముడుపులు కడితే కోరికలు తీరతాయనే విశ్వాసానికి వేలాదిమంది భక్తుల నిజజీవిత అనుభవాలే ఆధారం. స్థల పురాణం... 15–16 శతాబ్దాల మధ్య గోల్కొండను కుతబ్షాహీ సుల్తానులు పాలిస్తున్న కాలంలో ఈ ఆలయం నిర్మితమైనదని భావిస్తున్నారు. ఆరోజుల్లో ఒక రైతు తన బిడ్డడైన ప్రసాద్ను చక్కగా చదివించి సుల్తానుల కొలువులో ఉద్యోగిగా చేర్చారు. అతన్ని అందరూ కిసాన్ ప్రసాద్ అని పిలిచేవారట. అతను దైవ భక్తి పరాయణుడు. అతనికి పిల్లలు లేరు. ఒకరోజు విధినిర్వహణలో భాగంగా కొంతమంది సహోద్యోగులతో రాజ్యపర్యటనకు బయలులేరి తిరిగి తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికి గుడి ఉన్న ప్రాంతంలో అందరితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కలలో వేంకటేశ్వరస్వామివారు దర్శనమిచ్చి ‘ఈ పక్కన బావిలో ఉన్నాను నన్ను వెలికి తీసి ఆలయం నిర్మించి నన్ను ప్రతిష్టించి నిత్యపూజలకు ఏర్పాట్లు చేయి. నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది’ అని పలికారు. మరునాడు ఉదయమే... కిసాన్ ప్రసాద్ గోల్కొండకు చేరుకుని సుల్తాన్కు స్వççప్న వృత్తాంతం తెలిపాడు. ఆయన అనుమతితో తన సహచరులతో క్రితంరోజు తాను విశ్రాంతి తీసుకున్న ప్రాంతంలో ఉన్న చెరువుకు చేరువలో ఉన్న బావిలో వెతికించగా భూదేవి, శ్రీదేవి విగ్రహాలు లభించాయి. భక్తి శ్రద్ధలతో వాటిని వెలికి తీసి ఆలయ నిర్మాణం జరిపి స్వామివారిని ప్రతిష్టించి నిత్యపూజలు జరిపే ఏర్పాట్లు గావించారు. త్వరిత కాలంలోనే ప్రసాద్కు ఓ శుభ ముహూర్తాన ఒక çసచ్చీలుడైన కుమారుడు కలగడంతో తన జీవితమంతా స్వామి పాదసేవకు అంకితం చేశారట. ఇదీ ప్రత్యేకత... భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాచారాలకు ఆలవాలంగా ఉన్న ఎన్నో సుప్రసిద్ధమైన ఆలయాల కోవలోకే వస్తుంది జిల్లెలగూడలోని మత్సా్యవతార కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయంలోకి అడుగుబెట్టిన తడవే... అపురూపమైన నిర్మాణాలు భక్తులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్లోని కోఠి నుంచి సరిగ్గా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తే... మీర్పేట్కు చేరుకునే మార్గంలోని జిల్లెలగూడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. స్వయంభూగా వెలసిన స్వామివారు... ఇక్కడి ఆలయంలో వెలసిన స్వామివారిపై రెండు కథనాలు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చే స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారని... కూడా చెబుతారు. ఇక్కడి ఆలయంలో కొలువైన స్వామివారిని నిష్టాగరిష్టలతో దర్శనం చేసుకుంటే... భక్తుల మేధకు అంతుపట్టని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్మిక. అపు‘రూపం’... ఇక్కడ కొలువుదీరిన స్వామివారి విగ్రహం నాలుగు పలకల స్థూలరూపంలో ఉండి ముందువైపు పై భాగంలో చేప తలభాగం, కింది భాగంలో తోక, మధ్యలో వేంకటేశ్వరస్వామివారి ఆకృతి భక్తులకు దర్శనమిస్తాయి. ఒకపక్క నక్షత్ర పుంజం, సూర్యచంద్రులు, మరోవైపు నాగబంధం దర్శనమిస్తాయి. ఇలా వేంకటేశ్వరస్వామి మత్సా్యవతార మూర్తిగా దర్శనమివ్వడం వెనక తాను ఆదిపురుషుడినని చాటి చెప్పడమే కాకుండా.. భక్తుల కోరికలు తీర్చడంలో కూడా మొదటి స్థానం తనదేనని చెప్పకనే స్వామి చెబుతారని భక్తుల విశ్వాసం. ఈస్థూపంలో స్వామివారి చుట్టూ మత్య్సాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నాగబంధం ఉన్నందున తను సర్వసృష్టికి మూలకర్తనని, నాగదోష నివారణ మూర్తిగా ఉన్నానని స్వామివారి సూచనగా భక్తుల విశ్వాసం. ఇక ప్రచారంలో ఉన్న మరో కథనం మేరకు... స్వామివారి పై భాగంలో లింగాకారం కనిపిస్తుంది కిందిభాగంలో వేంకటేశ్వరస్వామి వారి ఆకృతి కనిపిస్తుంది. ఇలా కనిపించడంలో శైవం, వైష్ణవం వేరుకాదని, అంతా ఒక్కటేనని లోకానికి చాటి చెప్పడమే. ఆలయ నిర్మాణం... ఈ ఆలయం సుమారు 15–16 శతాబ్దాల మధ్య నిర్మితం అయినట్టుగా భావింపబడుతోంది. ఈ ఆలయ ముఖద్వారానికి ఉత్తర దిశలో నిరంతరం రామనామమే జపిస్తూ తన్మయత్వంలో కాల గమనానికి అతీతంగా స్వామివారిని చూస్తున్న రామబంటు, భక్తాంజనేయ స్వామివారి ఆలయం, ఆ పక్కనే త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరమైన కదంబ వృక్షపు ఛాయలో బంగారు కోనేరు ఉన్నాయి. ఆంజనేయస్వామివారి ఆలయానికి ఉత్తరంగా ఒక భవనం ఉంది. దాన్ని ‘నవరస్కానా’ అంటారు ఆలయగోపురానికి తూర్పు దిశలో సస్యశ్యామలమైన ప్రకృతికి నిదర్శనంగా, చూపరులకు ప్రశాంతతనిస్తూ ఒక చక్కటి ఉద్యాన వనం ఉంది. దాన్ని మంగమ్మతోట అంటారు. ఇక వీటి వైశిష్ట్యాలకు వస్తే కదంబ వృక్షం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ వృక్షం కాశీ క్షేత్రం తరువాత ఇక్కడే ఉంది అంటారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన, ప్రతి శుక్రవారమూ ఇక్కడ ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలూ జరుగుతాయి. ఈ క్షేత్ర సందర్శనం సకల శుభప్రదం. ముడుపు కట్టి మరచిపోవచ్చు! సమస్యలు ఉన్న భక్తులు ఈ ఆలయంలో స్వామివారి ప్రధాన మందిరానికిఆనుకుని ఉన్న చింతచెట్టుకు ముడుపులు కడితే.. ఎంతటి చిక్కు సమస్య అయినా సరే, చిటికెలో తీరిపోతుందని ప్రతీతి. గ్రహపీడలు, దీర్ఘరోగాలు ఉన్నవారు, వైవాహిక జీవితంలో సమస్యలున్నవారు ఇలా ముడుపు కడుతుంటారు. – మిరియాల రవికుమార్, సాక్షి, మీర్పేట -
వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్లో అశేష జనవాహిన మధ్య వెంకటేశ్వరస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, రథాంగ హోమం, రథ బలి, మాలవీధుల మడుగు రథోత్సవం చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. సాయంత్రం శ్రీవారిని పల్లకీలో ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, అనంతరం రథోత్సవంపై ఆసీనులు చేశారు. అనంతరం రథోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు , గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, ప్రజలు, భక్తులు లాగారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై స్వామివారి రథోత్సవం ఊరేగింపుగా సాగింది. గ్రామంలో వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బొమ్మనహాళ్ ఎస్ఐ శ్రీరాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
వేంకటేశ్వరస్వామికి లారీ బహుకరణ
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అశోక్ లేలాండ్ కంపెనీ యాజమాన్యం లారీని బహూకరించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే దాసరి శనివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం ఎదుట లారీకి పూజలు నిర్వహించారు. లారీకి సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు. వాహనం విలువ రూ.18.88 లక్షలుగా వినోద్ కే దాసరి పేర్కొన్నారు. -
వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు
అనంతపురం కల్చరల్ : నగరంలోని హౌసింగ్బోర్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది. జనవరి నెలలో హుండీ ద్వారా రూ.95,950 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు. -
వైభవంగా శ్రీవారి బ్రహోత్సవాలు
కర్నూలు(న్యూసిటీ) సంకల్బాగ్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సా్వమివారి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసస్వామి వార్లకు వేదపండితుల అభిషేకం చేసి పట్టువస్త్రాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. తర్వాత శేషవాహనంపై శ్రీనివాసస్వామి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు జగన్మోహనశర్మ, నగర బ్రాహ్మణ సంఘం అ«ధ్యక్షుడు కె. చంద్రశేఖరశర్మ, ప్రధానకార్యదర్శి సీవీ దుర్గాప్రసాద్, బ్రాహ్మణ వేల్ఫెర్ అసోసియేషన్ జిల్లా కోఆర్టినేటర్ సముద్రాల హానుమంతరావు, గౌరవాధ్యక్షుడు కేవీ సూబ్బారావు పాల్గొన్నారు. -
సుమధురం..గోవిందుడి నామస్మరణం
- శ్రీవారికి దివిటి సేవ గావించిన పీఠాధిపతి - వైకుంఠ ద్వార ప్రవేశంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి - ఆకట్టుకున్న పూలంకరణ, భజన కీర్తనలు మంత్రాలయం : పుష్పతోరణ పరిమళాలు.. మంగళవాయిద్యాల సుస్వరాలు.. దాససాహిత్య మహిళల భజన కీర్తనలు.. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సోమవారం భక్తులు గోవిందుడి నామస్మరణలో తరించారు. మంత్రాలయం నడిబొడ్డున శ్రీరాఘవేంద్రస్వామి చేతుల మీదుగా ప్రతిష్టితమైన శ్రీవేంకటేశ్వరుడి సన్నిధానంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. శ్రీమఠం పంచాంగం రీత్యా సోమవారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో శ్రీవారికి విశేషపూజలు, దివిటీసేవ, ప్రత్యేక మంగళహారతులు గావించారు. అనంతరం వైకుంఠ ద్వారానికి హారతులు పట్టి ఉత్తరదిశ ముఖస్థితులైన వేంకటనాథుడు, నైరుతిభాగంలో కొలువుదీరిన పద్మావతికి పూజలు చేశారు. అనంతరం వైకుంఠ ఏకాదశి విశిష్టతను పీఠాధిపతి భక్తులకు ప్రవచించారు. గురుసార్వభౌమ దాససాహిత్య అకాడమీ మహిళలలు ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఆలయ పూజారి మదుప్రసాద్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠ మార్గ ప్రవేశం చేసి వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే కూతురు ప్రియాంక, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. -
మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యానాం టౌన్ : మీసాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన యానాం భూసమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి చతుర్ధశి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యానాం వేంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎïస్పీ నితిన్ గోహల్ ఆలయ ప్రాంగణంలో స్వామివారి జయపతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు. ప్రముఖ వైఖానస వేదపండితులు వాడపల్లి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఆలయంలో సంకల్పం, దీక్షాధారణ, దిగ్దేవతా ప్రార్థన వంటి పూజలను వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే తిరుమల తరహాలో ఆరాధనోత్సవాలు, ప్రత్యేకఉత్సవాలలో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలను ప్రత్యేకగంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 10 మంది రుత్వికులు, ఆలయఅర్చకులు జరిపించారు. పరిపాలనాధికారి, ఎస్పీతో పాటు దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్, కమిటీ ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వందలాది మంది భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను తిలకించారు. -
స్వామివారి రథోత్సవంలో అపశ్రుతి
అనంతపురం: అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతున్న సమయంలో విద్యుత్ తీగలు అడ్డురావడంతో వాటిని తొలగించేందుకు ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ నేపథ్యంలో స్తంభం పైనుంచి అతడు ప్రమాదవాశాత్తూ జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే బళ్లారి ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. విద్యుత్కు సంబంధించి మరమ్మతులు ప్రైవేట్ వ్యక్తితో చేయిస్తున్న ట్రాన్స్కో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీవారి సేవలో సినీనటుడు సాయికుమార్
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు అఖిల భారత యాంటి టైస్ట్ ఫ్రంట్ చైర్మన్ ఎం.ఎస్ బిట్ట శ్రీవారిని దర్శించుకున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో మంగళ వారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండల వాడి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరుడి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సోమవారం 65,599 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
కల్యాణ వెంకన్నకు వెండి బిందెలు
తిరుపతి: కల్యాణ వెంకన్నకు 1100 గ్రాముల వెండితో తయారు చేసిన రెండు వెండి బిందెలను భక్తులు సమర్పించుకున్నారు. తిరుపతి గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వెంకటేష్, లక్ష్మీ దంపతులు శనివారం కల్యాణ వెంకన్నను దర్శించుకొని రూ. 42 వేల విలువైన రెండు వెండి బిందెలను స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. -
11న శ్రీవారికి దీపావళి ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేస్తారు. -
ముత్యపు పందిరిపై ఊరేగిన శ్రీవారు
-
నీకు రెస్టెప్పుడు గోవిందా..!
ఆలస్యంగా పూజా కైంకర్యాలు..సమయం కుదింపు సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు, సేవలు ఆగమోక్తంగా నిర్ణీత సమయాల్లో నిర్వహించడంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భక్తుల రద్దీ పేరుతో వ్యక్తిగత రికార్డుల కోసం మూలవిరాట్టు పూజా కైంకర్యాల్లో కోత పెడుతున్నారు. దీన్ని ఆగమపండితులు పీఠాధిపతులు నిరసిస్తున్నా పట్టించుకోవడం లేదు. కైంకర్యాల సమయం కనీసం ఆరు గంటలు గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు పూజా కైంకర్యాలన్నీ వైఖానస ఆగమ నిబంధనల మేరకు వేకువజాము మొదలుపెడతారు. తిరిగి అర్ధరాత్రి వరకు ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి కైంకర్యాలు ప్రతిరోజూ రెండుసార్లు, తోమాల ఒకసారి, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు, తగినంత విరామ సమయం కేటాయించాలి. 24 గంటల్లో గర్భాలయ మూలమూర్తికి గరిష్టంగా 10 గంటలు, కనిష్టంగా 6 గంటలకు తక్కువ కాకుండా పూజా కైంకర్యాలు, విరామ సమయం కేటాయించాలి. అయితే, భక్తుల రద్దీ కారణంగా వారందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పూజా నివేదనలతోపాటు విరామ సమయాన్నీ తగ్గిస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించామనే తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆగ మ నిబంధనల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శ లున్నాయి. గత శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిర్వహించాల్సిన ఏకాంత సేవ ఆదివారం వేకువజామున 1.45 గంటలకు ప్రారంభించడం, ఆ వెనువెంటనే విరామం లేకుండా సుప్రభాతం మరుసటి రోజు పూజలు ప్రారంభించడం గమనార్హం. -
శ్రీవారి ఆశీస్సులతోనే ‘మా’టీం గెలిచింది
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో గెలిచామని ఆ సంఘం నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం సహచర నటులు శివాజీరాజా, కాదంబరి కిరణ్, శ్రీరామ్, ఇతర సభ్యులతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో మార్పు కోసం నూతన కార్యవర్గానికి అధికారం కట్టబెట్టారని, కలసికట్టుగా పనిచేస్తూ వారి నమ్మకాన్ని నిలబెడుతామని చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో దర్శకుడు రాఘవేంద్రరావుకు అవకాశం లభించడం సంతోషదాయకమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాజేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. -
బ్రహ్మాండనాయుకుని జలవిహారం
తిరుపతి: శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బ్రహ్మాండనాయకుని జలవిహారం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పపై ఉత్సవమూర్తుల వైభవాన్ని తిలకిస్తూ భక్తులు పులకించిపోయారు. -
వైభవంగా ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
ధ్వజావరోహణంతో వీడ్కోలు, చక్రస్నానంలో సేదతీరిన శ్రీవారు 8 రోజుల్లో 5.4 లక్షల మందికి శ్రీవారి దర్శనం, రూ.17.3 కోట్ల హుండీ కానుకలు తిరుమల: తిరుమలలో తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. వైదిక ఉపచారాలతో ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగి శాయి. గతనెల 26న మీన లగ్నంలో ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తిరిగి శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య వైదిక ఉపచారంతో ధ్వజపటాన్ని అవరోహణం చేసి బ్రహ్మోత్సవాలను ముగిస్తూ దేవతలకు వీడ్కోలు పలికారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆదివారం నుంచి ఆలయంలో ఆర్జిత సేవల్ని పునఃప్రారంభించనున్నారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాతే తిరుమలలో ఇచ్చే రూ.300 టికెట్లను పునరుద్ధరించనున్నారు. 8వ రోజు శుక్రవారం ఉదయం శ్రీమన్నారాయణుడు మహారథం (తేరు)పై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రథోత్సవం 9.30 గంటల వరకు వేడుకగా సాగింది. రథం ముందు జీయర్లు, పండితుల వేదగోష్టితో సప్తగిరులు పులకించాయి. రథయానానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో మహారథం నిరాటంకంగా ముందుకు సాగింది. తిరిగి రాత్రి మలయప్పస్వామి చల్లటి వెన్నెలలో ఒక చేతిలో చెర్నాకోలు, మరో చేత బంగారు పగ్గం పట్టుకుని అశ్వవాహనంపై భక్తులను పరవశింపజేశారు. అఖరి రోజు శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్రం పవిత్రముహూర్తాన చక్రస్నానం శాస్రోక్తంగా నిర్వహించారు. 8 రోజుల పాటు పూటకో వాహనంపై ఊరేగుతూ అలసిన స్వామి సేదతీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. పుష్కరిణి ఒడ్డున ఉన్న వరాహస్వామి ఆలయం ఆవరణలో ఉభయ దేవేరులతో ఆశీనుడైన మలయప్ప స్వామికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం (అభిషేకం) చేశారు. అనంతరం మంగళధ్వనులు, అశేష భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య గర్భాయలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రతాళ్వార్కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయం నుంచి సూర్యాస్తమయం వరకు పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తొలగుతాయని పురాణాల చెబుతున్నాయి. దీంతో శనివారం వేలాది భక్తులు దేవదేవుడి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల మధ్య స్వల్పతోపులాట జరిగింది. 5.4 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం: ఈవో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో వైభవంగా ముగిశాయని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. భవిష్యత్లో బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ముందుగానే రిజర్వేషన్, ఇతర ఏర్పాట్లు చేసుకొనే వెసులుబాటు కలుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో 5,40,278 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. గత ఏడాది హుండీద్వారా రూ.12 కోట్లు రాగా ఈసారి 41.81 శాతం ఎక్కువగా రూ.17.03 కోట్ల మేర కానుకలు అందాయని చెప్పారు. పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 34 గంటలు దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 48,115 మంది స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో నిండి వెలుపల క్యూ కట్టారు. వీరికి 34 గంటల తర్వాత దర్శనం లభిస్తుందని శనివారం రాత్రి టీటీడీ ప్రకటించింది. -
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు ఉపేంద్ర
తిరుమల, న్యూస్లైన్: సినీ నటుడు ఉపేంద్ర శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీమణి ప్రియాంకతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గతంలో తాను హీరోగా నటించిన ‘ఉపేంద్ర’ చిత్రాన్ని ఆంధ్రా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి హిట్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్గా ‘ఉపేంద్ర 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తుందన్నారు. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘స్విస్ బ్యాంక్కు దారేది’ చిత్రం విడుదలైందన్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ఆలయం వెలుపల ఉపేంద్రను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. -
నేత్రపర్వంగా వెంకన్న రథోత్సవం
చంద్రగిరి, న్యూస్లైన్: శ్రీనివాసమంగాపురంలోని కల్యా ణ వెంకటేశ్వరస్వామి రథోత్సవం బుధవారం అశేష భక్తజ న సందోహం మధ్య నేత్రపర్వంగా సాగింది. ప్రత్యేక అ లంకరణలో ఉన్న స్వామిని తిలకించిన భక్తులు పులకిం చి పోయారు. అంతకు ముందు ఆలయంలో తెల్లవారు జామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి ధూపదీప నిత్య కైంకర్య, పూజాకార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని వాహన మండపంలో కొలువుంచి తిరుమంజన సేవ నిర్వహించారు. అభిషేకితులైన స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలంకారమూర్తులైన స్వామి అమ్మవార్లు రథంపై కొలువయ్యారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడు మ స్వామివారి రథోత్సవం కోలాహలంగా జరిగింది. ఆలయ మాడా వీధుల్లో విహరించిన స్వామికి భక్తులు దారిపొడవునా కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ కన్నులపండువగా జరిగింది. రాత్రి స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, సూపరింటెం డెంట్ ధనంజయ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, తిరుమల: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆదివారం కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అనంతరం వేంకటేశ్వరస్వామిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం గుప్తా కుటుంబ సభ్యులతో కలసి తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. మరో ఇద్దరు న్యాయమూర్తులు కూడా: అలాగే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ రవికుమార్ కుటుంబ సభ్యులతో కలసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 44,344 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఓట్లకోసం రాష్ట్ర విభజన తగదు: దేవెగౌడ
సాక్షి, తిరుమల : ఓట్లకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని చూడడం సరికాదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి ఆయన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.