Virginia
-
అమెరికాలో దారుణం.. కాల్పుల్లో భారత్కు చెందిన తండ్రీకూతురు మృతి
వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వర్జీనియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్కు చెందిన తండ్రీ, కూతురు చనిపోయారు. వీరిని గుజరాత్కు చెందిన ప్రదీప్ పటేల్, ఉర్మిగా గుర్తించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను వర్జీనియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ప్రదీప్ పటేల్, ఆయన కూతురు ఉర్మి.. గురువారం రోజున వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్లారు. వారు స్టోర్లో ఉన్న సమయంలో నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ అక్కడికి వెళ్లాడు. తనకు మందు కావాలని అడగడంతో స్టోర్ సిబ్బందికి, అతడికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, స్టోర్లో ఉన్న వర్కర్లపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పలు జరిపాడు. కాల్పుల్లో ప్రదీప్ కుమార్, ఉర్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. ఉర్మి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, కాల్పులు జరిపిన ఫ్రేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. గుజరాత్లోని మెహసనా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువులకు చెందిన డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేస్తున్నారు. మృతుడు ప్రదీప్ కుమార్కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ప్రదీప్, ఉర్మి మృతితో కుటుంట సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.🚨 Gujarati father, daughter shot dead in US store in Virginia.Pradeep Patel, 56, was shot dead on the spot, while his 24-year-old daughter, Urmi, succumbed to her injuries two days later. pic.twitter.com/RtU2VYqAmv— The Tradesman (@The_Tradesman1) March 23, 2025 -
ట్రంప్కు ఎదురుదెబ్బ.. భారతీయుడి అరెస్ట్పై కోర్టు సీరియస్
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్ సూరిని అమెరికా నుంచి బహిష్కరించ వద్దని అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు స్పష్టం చేసింది. ఇక, బాదర్ ఖాన్ సూరికి హమాస్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ట్రంప్.. అతడిని అరెస్టు చేసి, బహిష్కరించడానికి ప్రయత్నం చేసింది.ఇక.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. తాను చేసింది రాజ్యాంగం అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్కు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. అయితే, హమాస్ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్ సూరిని అక్కడి భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో ఆయన్ని భారత్కు తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు.అయితే, ఈ చర్యలను సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు ఎక్కారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేర చరిత లేదని తన పిటిషన్లో సూరి పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బాదర్ ఖాన్ సూరిని అమెరికా నుంచి బహిష్కరించ వద్దని తాజాగా వర్జీనియా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఇమ్మిగ్రేషన్ హోదాను తొలగించడం మరియు రాజకీయ దృక్పథం ఆధారంగా వారిని నిర్బంధించడం సరైంది కాదని పేర్కొంది. అనంతరం, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బహిష్కరణకు వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.1. U.S. judge halted the deportation of Indian scholar Badar Khan Suri.2. He was detained over alleged ties to Hamas.3. Homeland Security claimed he spread Hamas propaganda.4. His lawyers argue the arrest is political suppression.5. Georgetown University supports him,… pic.twitter.com/8QWM3XRQuH— Memes Humor (@memes_humor0123) March 21, 2025బాదర్ నేపథ్యం ఇదే..భారత్కు చెందిన బాదర్ ఖాన్ సూరి.. స్వస్థలం ఎక్కడ అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా భారత్లోనే గడిచినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్డడీస్పైన పీహెచ్డీ చేసిన ఆయన.. ఆపై ఇరాక్, అఫ్గనిస్థాన్లో శాంతిస్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలూ చేశారు. అమెరికాకు వలస వెళ్లిన బాదర్.. మఫెజ్ అహమద్ యూసఫ్ సలేహ్ అనే పాలస్తీనా మూలాల ఉన్న అమెరికన్ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్లో కీలక నేత అయిన అహ్మద్ యూసెఫ్గా డీహెచ్ఎస్ ప్రకటించింది. బాదర్ ఖాన్ సూరి అరెస్ట్ కావడంతో.. జాతీయ భద్రతా, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం.. లాంటి అంశాలు చర్చకు వచ్చాయి.New: 🚨 DHS has confirmed the arrest of Badar Khan Suri, an Indian student at Georgetown.You decide America:🚨 Deport of keep?He has been spreading anti American propaganda and has ties to a known senior adviser to Hamas. DHS will deport him the same way as Mahmoud Khalil. pic.twitter.com/OuarbxbtWR— Tom Homan - Border Czar MAGA News Reports (@TomHoman_) March 20, 2025అమెరికా ఫారిన్ పాలసీ ప్రకారం.. ఆ దేశానికి ముప్పుగా పరిగణించే నాన్ సిటిజన్స్ను అక్కడి నుంచి తరలించే ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సూరిపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి కిందటి ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్కార్డ్ హోల్డర్ అయిన మహమ్మూద్ ఖలీల్ను అక్కడి నుంచి సొంత దేశానికి తరలించారు. -
అమెరికాలో భారీ వర్షాలు.. కార్ల నీట మునిగి పలువురు మృతి
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షంతో పాటుగా భారీ గాలులు వీస్తున్న కారణంగా పలు భవనాలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు.)అమెరికాలో భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. కెంటుకీలో గడిచిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.Floodwaters are creeping toward homes as heavy rain triggers dangerous flash flooding across the south-central U.S., including Kentucky, West Virginia, Virginia, and Tennessee. pic.twitter.com/4PY8tAMLvg— AccuWeather (@accuweather) February 16, 2025అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు. వర్జీనియా(#Virginia), పశ్చిమ వర్జీనియా, టేనస్సీలో కూడా వరదలు సంభవించాయి. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల పాటు వర్షాలు, భారీ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.Parts of West Virginia, Virginia, Kentucky, Arkansas, and Tennessee are experiencing severe flooding. I wonder what they think about Donald Trump wanting to get rid of FEMA right about now? pic.twitter.com/VLts0ltv5s— Art Candee 🍿🥤 (@ArtCandee) February 16, 2025మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. ఇక, వరదల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్స్ కాపాడుతున్నాయి. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. Amerika'yı fırtına vurdu!ABD’nin Tennessee, Kentucky, Virginia ve Georgia eyaletlerinde meydana gelen fırtına ve selde, ilk belirlemelere göre 9 kişi hayatını kaybetti. pic.twitter.com/vSe020el2I— 23 Derece (@yirmiucderece) February 17, 2025 #BREAKING: Powerful overnight storm leaves at least 9 dead in Kentucky & Georgia, officials say#tnwx #Georgia #Floods #Tornado #Tennessee#Kentucky #Virginia pic.twitter.com/by2i750f1o— JUST IN | World (@justinbroadcast) February 16, 2025 -
భార్యను కడతేర్చి ఆపై గూగుల్లో ఏం సెర్చ్ చేశాడంటే..
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత తనకేం తెలియదన్నట్లు పెద్ద నాటకమే ఆడాడు. భార్య కనిపించడం లేదని తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఆమె మరణానంతరం ఏం జరుగుతుందని గూగుల్లో సెర్చ్ కూడా చేశాడు. అయితే తన నాటకం ఎన్నో రోజులు నడవలేదు. చివరికి పోలీసులు భర్తే హంతకుడని తేల్చి కటకటాల వెనక్కి పంపారు.వర్జినియాకు చెందిన నరేష్ భట్(33).. నేపాల్కు చెందిన తన భార్య మమతా కప్లే భట్(28)తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఓకూతురు కూడా ఉంది. మమతా గత జూలై 19 నుంచి కనిపించకుండాపోయింది. ఆసుపత్రిలో నర్స్గా పనిచేస్తున్న మమతా.. ఆ రోజు సాయంత్రం హెల్త్ ప్రిన్స్ విలియం మెడికల్ సెంటర్లో చివరిసారిగా కనిపించింది. తరువాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో పనికి వెళ్లిన తన భార్య కనిపించకుండాపోయిందని భర్త ఆగష్టు 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక మందిని విచారించారు. కానీ ఇప్పటి వరకు ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో మొదట ఆమె న్యూయార్క్, టెక్సాస్లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. కానీ తరువాత, ఆమెకు ఆ రాష్ట్రాల్లో ఎవరూ బంధువులు లేరని, ఆమె ఫోన్ ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్లో ఉందని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో అతడు తడబడ్డాడు.ఆగస్టు 22న నరేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భర్త నరేష్ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో తన భార్యతో విడియేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు చెప్పాడు. అంతేగాక ‘భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. భాగస్వామి చనిపోయాక అప్పులు ఏమవుతాయి.. వర్జినీయాలో జీవిత భాగస్వామి కనిపించకుండా పోతే ఏం జరుగుతుంది’ అంటూ నరేష్ గూగుల్లో సెర్చ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అయితే భర్త మమతాను హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేగాక నరేష్ తన ఇంటి సమీపంలోని వాల్మార్ట్లో మూడు కత్తులను కొనుగోలు చేసినట్లు ఆధారలు వెలువడ్డాయి. వాటిలో రెండిటి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. భార్య అదృశ్యమైన తర్వాత భట రక్తంతో తడిసిన బాత్ మ్యాట్, బ్యాగ్లను చెత్త కాంపాక్టర్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చెత్త సంచులను పారవేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో మమతను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడనే పోలీసుల అనుమానం బలపడింది. దీని ద్వారా తన నేరాన్ని దాచడానికి ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి సెప్టెంబర్లో బెయిల్ నిరాకరించడంతో కస్టడీలోనే ఉన్నాడు. -
సమాధుల వద్ద థమ్సప్లా!
వర్జీనియా: సైనిక అమరులకు నివాళుల సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ సందర్భంగా అబే గేట్ వద్ద మరణించిన 12 మంది సైనికులకు ఆర్లింగ్టన్ నేషనల్ శ్మశానవాటికలో ట్రంప్ నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద హావభావాలు ప్రదర్శించారు. సమాధుల వద్ద ఫొటోలకు పోజులివ్వడమే గాక చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. అంతటితో ఆగకుండా బొటనవేలు పైకెత్తి థమ్సప్ చిహ్నం చూపారు. వీటిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. సైనిక అమరుల పట్ల ఆయన అత్యంత అగౌరవంగా, అవమానకరంగా ప్రవర్తించారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. సమాధుల వద్ద చిరునవ్వులు చిందించడమేంటని మండిపడుతున్నారు. సమాధుల వద్ద నవ్వడం అసాధారణమని రిపబ్లికన్ నేత ఆడమ్ కిన్సింగర్ ఎక్స్లో పేర్కొన్నారు. సైనిక అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపినందుకు ట్రంప్ను కొందరు అభినందించారు. మరికొందరేమో ఇది కూడా ప్రచార వ్యూహంలో భాగమంటూ పెదవి విరిచారు. -
ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం..
వర్జీనియాలో కాంగ్రెస్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు. సహచర భారతీయ-అమెరికన్ క్రిస్టల్ కౌల్తో సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. నవంబర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. అంతేగాదు వర్జీనియ కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆయన 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీ, 2023లో వర్జీనియా స్టేట్ సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్. ఆయన ఈ గెలుపుతో నవంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సాధారణ రిపబ్లికన్ మైక్ క్లాన్సీతో తలపడతారు.సుహాస్ నేపథ్యం..37 ఏళ్ల సుహాస్ సుబ్రమణ్యం బెంగళూరు నుంచి యూఎస్కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యుస్టన్లో జన్మించాడు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్హౌస్లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్గా పనిచేశారు. ఒక యూఎస్ మీడియా ఇంటర్యూలో సుహాస్ మాట్లాడుతూ..అమెరికాకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కాంగ్రెస్కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్తుకి బంగారు బాటవేసే కాంగ్రెస్ ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లకు మాత్రమే కాదు, రాబోయే 20 ఏళ్లకో లేదా 30 ఏళ్లకో చట్టాలు చేయకూడదు. నాకు పిల్లలు కావాలి. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారు ఇద్దరు లేదా ముగ్గురుగా అయ్యేటప్పటికీ మెరుగైన దేశంగా తీర్చిదిద్దిలన్నారు. పైగా వాళ్లు మంచి ప్రపంచంలో జీవించేలా చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ అమెరికాలో జీవించాలనే డ్రీమ్ అందరికీ దక్కాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నైకి చెందినవారు. కొంతకాలం సికింద్రాబాద్లో ఉన్నారు. వారు అమెరికాకు వచ్చి మంచి వైద్యులుగా స్థిరపడాలనుకున్నారు. అయితే వారు ఇక్కడ వచ్చినప్పుడూ.. తన తల్లిందడ్రులు అంతబాగా ఉన్నవాళ్లు కాదని కేవలం కష్టపడి చదివి తమ అమెరికా డ్రీమ్ని నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ కలను అందరూ సాకారం చేసుకోవాని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ తాము కోరుకున్న దాంట్లో లేదా ఏదైన బిజినెస్లో విజయం సాధించి ఆర్థికంగా తమను తాము శక్తిమంతంగా చేసుకోగలిగినట్లయితే గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. అంతేగాదు ప్రతిఒక్కరూ బాగా చదివి, కష్టపడి పనిచేస్తే..ఎలాంటి స్థితి నుంచి అయినా ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దాన్ని నిలబెట్టుకునే యత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాని అన్నారు సుహాస్. వ్యక్తిగత జీవితం..నార్త్వెస్టర్న్ యూనివర్శిటీలో ఆనర్స్తో లా డిగ్రీని సంపాదించిన తర్వాత, సుహాస్ ప్రెసిడెంట్ ఒబామాకు వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. ఇక వైట్ హౌస్ నుంచి నిష్క్రమణ తర్వాత సుహాస్ లౌడౌన్ కౌంటీలో తన స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే తన కమ్యూనిటీకి వాలంటీర్ మెడిక్, అగ్నిమాపక సిబ్బందిగా కూడా సేవలందించారు. అతను మిరాండా పెనా సుబ్రమణ్యంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలోని యాష్బర్న్లో నివసిస్తున్నారు. (చదవండి: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు) -
ఉద్యోగ ప్రకటన దుమారం.. టెక్ కంపెనీకి భారీ జరిమానా
అమెరికాలో ఓ ఉద్యోగ ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. "శ్వేత జాతీయులు మాత్రమే" దరఖాస్తు చేయాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వర్జీనియాకు చెందిన ఒక టెక్ కంపెనీ వేలాది డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఆర్థర్ గ్రాండ్ టెక్నాలజీస్ అనే ఫెడరల్ కాంట్రాక్టర్ సంస్థకు అమెరికా న్యాయ, కార్మిక శాఖలు 7,500 డాలర్ల జరిమానా విధించాయి. దీంతోపాటు ప్రకటన గురించి ఫిర్యాదు చేసిన 31 మందికి 31,000 డాలర్లు చెల్లించాలని ఆయా డిపార్ట్మెంట్లు ఆదేశించాయి.21వ శతాబ్దంలో కూడా 'శ్వేతజాతీయులు మాత్రమే', 'అమెరికాలో జన్మించిన వారు మాత్రమే' అంటూ ఉద్యోగ నియామకాలను ప్రకటించడం సిగ్గుచేటని న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.డల్లాస్, టెక్సాస్ కేంద్రంగా సేల్ఫోర్స్ బిజినెస్ అనలిస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్థానం కోసం కంపెనీ 2023 మార్చిలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. అవేంటంటే డల్లాస్కు 60 మైళ్ల లోపు దూరంలో స్థానికంగా ఉన్న యూఎస్ బోర్న్ సిటిజన్స్ [శ్వేత జాతీయులు] మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది.ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో న్యాయశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్ను కంపెనీ ఖండించింది. ఇది భారతదేశంలోని తమ అనుబంధ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ లిస్టింగ్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిందని, జాతి, జాతీయ మూలం, ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా ఫెడరల్ కాంట్రాక్టర్లు వివక్ష చూపరాదనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను కంపెనీ ఉల్లంఘించిందని కార్మిక శాఖ తెలిపింది. -
వర్జీనియాలో ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం
-
వర్జీనియాలో కొలకలూరి ఇనాక్తో ఆత్మీయ సమ్మేళనం!
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్టోబరు 7న లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధానులు శ్రీ నరాల రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని కథా-నవలా రచయిత, ఫిలిం మేకర్, ఇనాక్ అమెరికా పర్యటన పర్యవేక్షకులు వేణు నక్షత్రం ఆధ్వర్యంలో, సాహిత్యాభిమానులు వాషింగ్టన్ సాహితీ సంస్థ నిర్వాహకులు రవి వేలూరి, సాహిత్యాభిమానులు ప్రసాద్ చెరసాల, కవి చంద్ర కాటుబోయిన, పవన్ గిర్లా, ప్రవీణ్ దొడ్డల సంయుక్త నిర్వాహణలో జరిగింది. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో దేన్ని అయినా, ఎంతటి కఠినాత్ములని అయినా ప్రేమతో మాత్రమే జయించవచ్చని, శత్రువుని ఎదిరించడానికి సాహిత్యాన్నే ఆయుధంగా ఉపయోగించానని తెలిపారు. బలహీనులని పీడిస్తే , ఏదో ఒకరోజు వారు తిరగబడతారని బలవంతులు గ్రహించాలని అన్నారు. తన రచనలన్నీ సమాజంలోజరిగిన సంఘటనలే అని వాటి ద్వారా కొంత నయినా అవగాహన కల్పించడమే తన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. సభాధ్యక్షులు నరాల రామిరెడ్డి మాట్లాడుతూ, ఇనాక్ సభలో అధ్యక్షత వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇనాక్ రచనలు చాలా చదివానని, సాహిత్యంలో కథ, నవల, పద్యం, వ్యాసం ఇలా ప్రతి అంశాన్ని సృజించి ప్రతి ప్రక్రియలో అవార్డులు పొందిన ఘనత ఇనాక్ గారిదే అని అన్నారు. సభా నిర్వాహకులు వేణు నక్షత్రం మాట్లాడుతూ.. ఇనాక్కి ఇప్పటికే వచ్చిన ఎన్నో అవార్డులతో పాటు ఉత్తమ తండ్రి అనే అవార్డు కూడా ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే ఇనాక్ తన ముగ్గురు పిల్లలు ఎలాంటి రిజర్వేషన్లు ఉపయోగించకుండా కేవలం ప్రతిభతో అత్యుత్తమ చదువులు చదివి సమాజంలో అధ్యాపకులుగా, క్లాస్ వన్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ఇనాక్ గారి సాహిత్యం ఎంతో ఉపయోగపడిందని వేణు నక్షత్రం అన్నారు. ఇనాక్ రాసిన మునివాహనుడు కల్పిత నవల అంశం ఇప్పుడు సమాజంలో మునివాహన సేవగా ప్రాచుర్యం పొందడం లాంటి ఘనత ఇనాక్ రచనలకే చెందిందని కొనియాడారు. రవి వేలూరి , రమేష్ రావెళ్ల గారు ఇనాక్ని, నరాల రామిరెడ్డి ని శాలువాతో సత్కరించారు. కాపిటల్ ఏరియా తెలుగు అధ్యక్షులు సతీష్ వడ్డీ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతీ సంవత్సరం ఒకసారి ప్రత్యేక సాహిత్య సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిసానని అన్నారు. అమెరికాలో తెలుగు సంస్థలు ప్రతి రెండేళ్ళకోసారి కోట్ల ఖర్చుతో సదస్సు నిర్వహిస్తారని, అందులో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని, అందుకే ప్రతి సంవత్సరం ఒక సారి ప్రత్యేక సాహితీ సమావేశాలు నిర్వహిస్తే, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన వారవుతారని వేణు నక్షత్రం తెలుగు సంఘాలని కోరారు. వాషింగ్టన్, మేరీలాండ్, వర్జీనియా ప్రాంతంలోని సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
‘వర్జీనియా’కు రికార్డు ధర
జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఐదు వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం దశల వారీగా ముగిసింది. గత ఏడాది కంటే కేజీ సరాసరి ధర రూ.50 పైగానే లభించింది. ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పరిధిలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో 55 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో కేజీ సరాసరి ధర రూ.191.72 లభించగా, ఈ ఏడాది కేజీ సరాసరి ధర రూ.248 లభించింది. అంటే ఈ ఏడాది కేజీకి రూ.56.28 అధికంగా లభించింది. -
అసలు వీడు మనిషేనా?.. విదేశాల్లో భార్యను ఒంటరిగా వదిలేసి..
సాక్షి, హైదరాబాద్: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు. కానీ, ఓ ప్రవాస ప్రబుద్ధుడు భార్య చదువు ఆర్థిక భారంగా భావించాడు. ఉన్నత చదువులు చదివి..మంచి ఉద్యోగం సంపాదించి భర్తకు చేదోడుగా నిలుద్దామనుకున్న ఆమె కలలను కల్లలు చేశాడు. విదేశాల్లో ఒంటరిగా వదిలేసి..తాపీగా చేతులు దులుపేసుకున్నాడు. అల్లుడికి నచ్చచెబుదామని పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో.. దిక్కుతోచని స్థితిలో బాధితురాలి తల్లిదండ్రులు గచ్చి»ౌలిలోని మహిళా పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా.. మాదాపూర్ జోన్కు చెందిన కావ్య (పేరు మార్చాం) స్థానికంగా డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధం వెతికి అమెరికాలో స్థిరపడిన కిషోర్ (పేరు మార్చాం)కు ఇచ్చి పెళ్లి చేశారు. కిషోర్ యూఎస్లోని వర్జీనియాలో ఉద్యోగి కావటంతో.. పెళ్లి తర్వాత ఈ యువ జంట అక్కడికి వెళ్లింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేద్దామని భావించిన కావ్య అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్లో చేరింది. దీంతో భర్త అసలు రంగు బయటపడింది. భార్య చదువు ఆర్థిక భారంగా మారిందని కిషోర్ తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీనిపై ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు వివరించింది కావ్య. దీంతో పలుమార్లు ఫోన్లో అల్లుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. అల్లుడి తల్లిదండ్రులను కలిసి వారి కొడుక్కి సర్దిచెప్పమని చెబుదామని ప్రయత్నిస్తే వారి నుంచి కూడా స్పందన లేదు. దీంతో చేసేదిలేక గచ్చిబౌలిలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్ తల్లిదండ్రులను విచారించగా.. వాళ్లిద్దరి మధ్య అవగాహన సరిగా లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో విదేశంలో కూతురు ఒంటరైపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నారై సంబంధం ఇలా పెటాకులు కావటంతో అమ్మాయి చదువు, వసతి ఇతరత్రా ఖర్చులన్నీ తల్లిదండ్రులే భరిస్తున్నారు. ఎన్నారై బంధానికి ఏడు సూత్రాలు: ► ఎన్నారైల ఎంపిక, పెళ్లి చేసే విషయంలో తొందరపడకూడదు. ► వరుడు/వధువు అతని కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని ధ్రువీకరించుకోవాలి. ► మ్యారేజ్ బ్రోకర్లు, బ్యూరోలపై ఆధారపడి సంబంధాన్ని అంగీకరించకూడదు. ► ప్రవాసుల వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ► విదేశాలలో చట్టపరమైన హక్కులు, అర్హతలు, అత్యవసర సేవల గురించి తెలుసుకోవాలి. ► వధువు వీసా, పాస్పోర్ట్, ఇతరత్రా ముఖ్యమైన కాపీలను వధువు కుటుంబం లేదా దగ్గరి స్నేహితుల వద్ద ఉంచాలి. ► ఎన్నారై వరుడి పాస్పోర్ట్, విదేశీయుల నమోదు కార్డు, సామాజిక భద్రత నంబరు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పన్ను రిటర్న్లు, బ్యాంకు పత్రాలు వంటి కీలకమైన పత్రాలను తనిఖీ చేయాలి. -
అమెరికాలో టీచర్పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు
నోర్ఫోల్క్: అమెరికాలో చిన్నారుల చేతుల్లో కూడా తుపాకీ పేలుతోంది. వర్జీనియాలో రిచ్నెక్ ఎలమెంటరీ స్కూలులో ఆరేళ్ల విద్యార్థి తన క్లాస్రూమ్లో పాఠం చెబుతున్న టీచర్పై హఠాత్తుగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో టీచర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదని పోలీసు చీఫ్ స్టీవ్ డ్రూ చెప్పారు. ఆ విద్యార్థి హ్యాండ్గన్తో క్లాసుకి హాజరైనా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఈ దారుణం జరిగింది. విద్యార్థి మైనర్ కావడంతో పోలీసులు క్లాసు లోపల జరిగిన విషయాలు వెల్లడించలేదు. -
21 ఏళ్లైనా అంతుచిక్కని జర్నలిస్ట్ డెత్ మిస్టరీ.. హత్యే అని తెలిసినా..!
దుష్టులు నిర్మించుకున్న దుర్భేద్యమైన కోటలను కూలగొట్టాలని విఫలయత్నం చేశాడో వీరుడు. కథల్లోనో, సినిమాల్లోనో అయితే.. ఆ వీరుడే గెలిచేవాడు. కానీ ఈ రియల్ స్టోరీ.. అతడి మరణాన్నే మిస్టరీగా మలచింది. 1991 ఆగస్టు 10, మధ్యాహ్నం వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్స్బర్గ్ సమీపంలోని షెరటన్ హోటల్ ముందు ఒక్కసారిగా జనం గుమిగూడారు. హోటల్ కస్టమర్స్, సిబ్బంది, యాజమాన్యం.. అంతా అక్కడున్నారు. వేగంగా వచ్చి ఆగిన పోలీస్ వ్యాన్లోంచి పోలీసులు ఒక్క ఉదుటన దుమికి.. ‘ఏ రూమ్?’ అన్నారు. సిబ్బందిలో ఒకరు 517 అని చెప్పగానే.. పోలీస్ బూట్లు అటుగా పరుగుతీశాయి. రూమ్ నంబర్ 517లోని బాత్టబ్లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ డానీ కాసోలారో(44) నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి రెండు చేతుల మణికట్లు లోతుగా తెగున్నాయి. ఓ పక్కన రేజర్ బ్లేడ్, మరోపక్కన సూసైడ్ నోట్ కనిపించాయి. నోట్ ఓపెన్ చేస్తే.. ‘నన్ను ప్రేమించేవారంతా నన్ను క్షమించండి. ముఖ్యంగా నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నా.. దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు’ అని రాసుంది. డానీ.. 1977లో మాజీ మిస్ వర్జీనియా అయిన టెరిల్ పేస్ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ట్రే అనే కొడుకున్నాడు. పదేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకోవడంతో కొడుకు ట్రే బాధ్యతను డానీకే అప్పగించింది కోర్టు. 1970 నుంచి జర్నలిస్ట్గా ఉన్న డానీ.. కమ్యూనిస్ట్ చైనా నల్లమందును యూఎస్లోకి అక్రమంగా రవాణా చేయడం.. వంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డానీ రూమ్ మొత్తం క్షుణ్ణంగా వెతికిన పోలీసులకు.. క్రెడిట్ కార్డులు, డబ్బులున్న అతని వాలెట్ బెడ్ మీద సురక్షితంగా కనిపించింది. బలవంతంగా ఎవరైనా రూమ్లోకి వచ్చారా? అంటే.. అలాంటి ఆనవాళ్లేమీ లేవు. దాంతో డానీ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న డానీ ఫ్యామిలీ.. అది కచ్చితంగా హత్యేనని మొరపెట్టుకున్నారు. ‘మృతదేహం దొరికిన రోజే ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు’ అని నిలదీశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రిపోర్టర్గా డానీ జరిపిన వందలాది విచార ణ పత్రాలు, ఇతర ముఖ్యమైన ఫైల్స్.. వేటినీ కుటుంబానికి అందించలేదు. ‘అవన్నీ ఎక్కడా?’ అని ఆరా తీసిన డానీ సోదరుడు టోనీకి.. మృతదేహం దొరికిన హోటల్ రూమ్లో అవేం దొరకలేదనే సమాధానం వచ్చింది. రక్తపరీక్షల కోసం సూది గుచ్చితేనే భయపడే డానీ.. చేతులను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేమంటూ.. అతడి కుటుంబం పోరాటం మొదలుపెట్టింది. డానీ మరణానికి కొద్ది రోజుల ముందు.. అతను చాలా మంది స్నేహితులతో.. ‘నేను చాలా పెద్ద కేసుని దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే వెలుగులోకి తెస్తా’ అని చెప్పాడట. నిజానికి ఆగస్ట్ 1990లో ఇన్స్లా అనే కార్పొరేట్ – గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీదారులైన బిల్ హామిల్ట¯న్Œ , నాన్సీలను ఇంటర్వ్యూ చేయడంతోనే ఆ సాఫ్ట్వేర్ మీద డానీ పరిశోధన మొదలైందట. వారు ప్రారంభించిన ‘ప్రామిస్’ అనే శక్తిమంతమైన ప్రాసిక్యూషన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో.. చాలా పెద్ద మోసం ఉందని.. తెరవెనుక పెద్ద స్కామ్ నడుస్తుందని అనుమానించిన డానీ.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టాడు. అప్పటికే ఇన్స్లా కంపెనీ సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేస్తున్నారని.. కొందరు న్యాయశాఖ అధికారులు దీన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వపెద్దల కుట్ర కూడా ఉందని.. ఆ లింకులు ఇతర దేశాలకూ పాకుతున్నాయని వస్తున్న పుకార్లను కూపీలాగడం మొలుపెట్టాడు డానీ. ఎందరో గూఢచారుల్ని కలసి.. ఎన్నో ఆధారాలను సంపాదించాడు. ఆ క్రమంలోనే ఎన్నో బెదిరింపు కాల్స్నూ ఎదుర్కొన్నాడు. ఆ విషయం తన సోదరుడు టోనీకి చెబుతూ.. ‘ఒకవేళ నేను చనిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మవద్ద’ని చెప్పాడట. తను విచారిస్తున్న కుంభకోణానికి ‘ది ఆక్టోపస్’ అని పేరు కూడా పెట్టాడట. పోలీస్ విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు.. హోటల్ సిబ్బందిని ఆరా తీయగా మరో నిజం బయటపడింది. డానీ చనిపోయిన రోజు.. పోలీసులు రాకముందే ఎవరో.. ప్రొఫెషనల్ క్లీనింగ్ వర్కర్స్తో డానీ రూమ్ని శుభ్రం చేయించారని తేలింది. ఆ క్లీనింగ్ వర్కర్లలో ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు రక్తంతో తడిచిన రెండు టవల్స్ని మృతదేహం దగ్గర్లో చూశాం. వాటిని అప్పుడే చెత్తలో వేసేశాం. మాకంటే ముందే ఎవరో ఆ రూమ్లో నేల మీద పడిన రక్తాన్ని ఆ టవల్స్తో తుడిచినట్లు అనిపించింది’ అని చెప్పాడు. అయితే అతడు బహిరంగ సాక్ష్యానికి అంగీకరించలేదు. ఇక ఆగస్టు 9 సాయంత్రం ఐదున్నరకు.. డానీ తన పక్క గదిలో దిగిన లూనీని పలకరించాడట. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కలవబోతున్నానని చెప్పాడట. తొమ్మిదింటికి లూనీని మళ్లీ కలసిన డానీ.. ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లి.. కొన్ని నిమిషాల్లోనే తిరిగివచ్చాడట. ‘బహుశా అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో? తెలియదు. మేం చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం’ అని లూనీ చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాత్రి డానీ.. సమీపంలోని పిజ్జాహట్లో డిన్నర్ చేశాడట. అందులోని వెయిట్రెస్ డానీని గుర్తుపట్టింది. రాత్రి 10 దాటాక కాసోలారో సమీపంలోని కన్వీనియెన్స్ స్టోర్లో కాఫీ కొనుక్కుని తాగాడట. అదే అక్కడివారికి డానీ చివరిసారిగా సజీవంగా కనిపించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. మరి ఆ రాత్రి ఏం జరిగింది? మరునాడు మధ్యాహ్నం వరకూ శవాన్ని ఎందుకు గుర్తించలేదు? ఇలా వేటికీ సమాధానాల్లేవు. మరోవైపు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆర్మీమన్.. డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడట. డానీ శవపేటిక మీద గౌరవప్రదంగా ఒక పతకాన్ని ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అసలు అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? అతడు నిజంగానే సైనికాధికారా? లేక డానీని చంపిన కిల్లరా? అనేది నేటికీ తేలలేదు. 1973లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఇన్స్లా.. 1981లో లాభాపేక్షతో కూడిన అనుబంధసంస్థలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే దాని ఆస్తులన్నీ కొత్త సంస్థలకు బదిలీ అయ్యాయి. డానీ మరణం తర్వాత.. ఇన్స్లా సంస్థ.. తన సాఫ్ట్వేర్ను దొంగిలించడానికి ప్రభుత్వమే కుట్ర పన్నిందని, దొంగిలించిన సాఫ్ట్వేర్ను.. విదేశీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించిందని.. నాసాతో సహా సీ.ఐ.ఏ, డి.ఓ.జీలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని.. హత్యల్లోనూ ప్రమేయం ఉందని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ.. 12 సంవత్సరాల సుదీర్ఘన్యాయ విచారణ తర్వాత ఫెడరల్ క్లెయిమ్స్ కోర్ట్ వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఇక్కడ 1960 నుంచి 66 వరకూ బిల్ హామిల్టన్ ఆరేళ్ల పాటు నాసా ఉద్యోగిగా ఉండడం గమనార్హం. -సంహిత నిమ్మన -
వాల్మార్ట్ స్టోర్లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ మరోసారి గర్జించింది. వర్జీనియాలోని వాల్మార్ట్ స్టోర్లో ఓ సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తుపాకీతో స్టోర్లోకి వెళ్లిన వ్యక్తి కన్పించినవారిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అతను వాల్మార్ట్లో పనిచేసే ఉద్యోగా? కాదా? తెలియాల్సి ఉందన్నారు. నిందితుడు కూడా స్టోర్ లోపలే చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. అయితే పోలీసులే నిందితుడ్ని కాల్పి చంపి ఉంటారని స్థానిక మీడియా చెప్పింది. కానీ తాము కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడే తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం -
ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత...
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తిగా ధ్వసంమై సముద్ర గర్భంలో పడి ఉన్న వందేళ్ల నాటి జలాంతర్గామిని శిథిలాల పరిశోధకుడు డైవర్ ఎరిక్ పెట్కోవిక్ కనుగొన్నాడు. ధ్వంసమై సముద్రంలో పడి ఉన్న బోట్లపై డైవర్ ఎరిక్ పెట్కోవిక్ పరిశోధనలు చేస్తుంటాడు. ఈ జలాంతర్గామిని వర్జీనియా తీరంలోని కేవలం 400 అడుగుల లోతుల్లో గుర్తించాడు. వాస్తవానికి ఈ జలాంతర్గామి మొదటి ప్రపంచ యుద్ధంలో 1922లో అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో సుమారు 1600 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబందించి ఐదు జలాంతర్గాములు, రెండవ ప్రపంచ యద్ధానికి సంబంధించి ఎనిమిది జలంతర్గాములను కనుగొన్నారు. అయితే ఈ యూ-111 జలంతర్గామి కూడా వర్జినియాలోనే మునిగిపోయినట్లు పరిశోదకులు గుర్తించలేకపోవడమే కాకుండా కనుగొన లేకపోయారు కూడా. అదీగాక సముద్రంలో ఉండే ఉప్పు కారణంగా మునిగిపోయిన ఓడలు, జలాంతర్గాములు వేగంగా క్షీణిస్తాయి. సముద్రంలో ఉండే కొన్ని రకాల పురుగులు కలపను తినేస్తాయి. అయినప్పటికీ ఈ జలంతర్గామి శిధిలాలు సజీవంగా కనుగొనడం విశేషమే. 1985లో తొలిసారిగా రాబర్ట్ బల్లార్డ్ అనే పరిశోధకుడు టైటానిక్ ఓడల శిధిలాలను కనుగొన్నాడు. అతని తర్వాత డైవర్ ఎరిక్ పెట్ కోవిక్ ఈ ధ్యంసమైన నౌకలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పరిశోధకుడు తన మిత్రుడు రస్వీ సాయంతో ఎక్స్ప్లోరర్ డైవింగ్ నౌకను ఉపయోగించి ఈ జలాంతర్గామి శిథిలాలను వెలికితీశాడు. (చదవండి: Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక) -
వర్జీనియా, కాలిఫోర్నియాలో వెటా ఆధర్యంలో బతుకమ్మ సంబురం!
తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థ బతుకమ్మ వేడుకలను వర్జీనియా రాష్ట్రంలోని FAIRFAX నగరంలో ఘనంగా నిర్వహించింది. స్థానిక ఎస్బీ లోటస్ టెంపుల్ ఆవరణలో పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని, ఒక్కొక్క పువ్వేసి చందమామా...ఒక్క జాము గడిచె చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో అంటూ అనేక బతుకమ్మ పాటలతో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపు కున్నారు. సంప్రదాయ వస్త్రాదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే. ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈవేడుకల్లో ప్రముఖ యాంకర్ ఉదయ భాను దాదాపు 800 మంది పెద్దలు , పిల్లలను ఎంటర్టైన్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ వెటాప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వర్జీనియా బోర్డ్ అఫ్ డైరెక్టర్ జయశ్రీ తెలుకుంట్ల, మేరీల్యాండ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి, రీజినల్ కల్చరల్ చైర్ చైతన్య పోలోజు,రీజినల్ కోర్ కమిటీ స్మృతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సతీష్ వడ్డే, సుధ పాలడుగు, సతీష్ వేమన, విశ్వేశ్వర్ కలవాల,కాంగ్రెస్ మహిళజెన్నిఫర్ వెక్స్టన్ హాజరయ్యారు. కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు కాలిఫోర్నియా లోని హ్యాంఫోర్డ్ నగరంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్లగారి బంగ్లా ఆవరణలో " బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేసిన Dr కాంతం & సుజాత గాదె గారికి ఝాన్సీ గారు కృతజ్ఞతలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో WETA treasurer విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, RVP పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల తో పాటు దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. -
పైత్యం నశాలానికి.. పసిబిడ్డకు తిండి కరువు.. 18 నెలల వయసులోనే..
వాషింగ్టన్: కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది తల్లి. పిల్లాడు ఎప్పుడైనా ఆకలితో ఏడిస్తే తల్లడిల్లిపోతుంది. కానీ అమెరికాలో ఓ మహిళ చేసిన పని కన్నపేగు బంధానికే కలంకం తెచ్చింది. పసివాడికి సరిగ్గా తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసింది. ఫలితంగా అతని మరణానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు షీలా ఓ లీరి(38)పై హత్య కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు మాత్రం నాలుగుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వర్జీనియా కోర్టు ఆమెకు సోమవారం జీవిత ఖైదు విధించింది. ఈ ఆరోపణలతోనే ఈమె భర్త కూడా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షీలా కుటుంబసభ్యులంతా శాకాహారులు. కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారు. పిల్లలకు తిండి సరిగ్గా పెట్టకపోవడం వల్ల పోషకాహారలోపం బాధితులయ్యారు. ఈ క్రమంలోనే 18 నెలల వీరి కుమారుడు చనిపోయాడు. అతడి బరువు 8 కేజీలు మాత్రమే. అతడికి తల్లిపాలే ఆహారంగా ఇచ్చేదట షీల. చనిపోయిన బాబు 18నెలల వయసులో కూడా 7 నెలల చిన్నారి పరిమాణంలో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. వీరికి ముడేళ్లు, ఐదేళ్ల వయసున్న మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చదవండి: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు కన్నుమూత -
ఇదో ‘అమెజాన్ అడవి’
ప్రపంచంలో అతి పెద్ద అడవులంటే... అమెజాన్ అని మనకు తెలుసు. కానీ వర్జీనియా నగరంలో మరో ‘అమెజాన్ అడవి’ నిర్మితమవుతోంది. నగరంలో అడవి ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అది ఓ అడవిలాంటి భవనం. దానిని నిర్మిస్తున్నది రీటైల్ దిగ్గజం ‘అమెజాన్’. ఆ భవనం వివరాలేంటో తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణలోనే కాదు... తమ కార్యాలయాల నిర్మాణంలోనూ ప్రత్యేకతను చాటు కునే సంస్థ అమెజాన్. హైదరాబాద్లో ఉన్న ఇంద్ర భవనంలాంటి ఆఫీసే అందుకు తార్కాణం. ఇదే ఇలా ఉందంటే.. సియాటిల్లో తన ప్రధాన కార్యా లయం ఎలా ఉండాలి? మూడు గోళాకార భవనా లను పారదర్శకంగా నిర్మించింది. వీటిని పర్యావ రణ హితంగా రూపొందించింది. ఇప్పుడు తన రెండో హెడ్క్వార్టర్స్ నిర్మాణంలోనూ అదే ప్రత్యేక తను చాటబోతోంది. వర్జీనియాలోని అర్లింగ్టన్ కౌంటీని ఇందుకు వేదికగా చేసుకుంది. నగరం నడిబొడ్డున ఎత్తైన పర్వతం, దాని చుట్టూరా పచ్చని చెట్లతో కూడిన అడవిలాంటి భవనాన్ని నిర్మించ నుంది. ఇందుకోసం గతంలో తమ భవనాలను నిర్మించిన ఎన్బీబీజే సంస్థనే ఎనుకున్నది. మన రాష్ట్ర బడ్జెట్కు సమానం... క్రిస్టల్ సిటీగా పేరుగాంచిన వర్జీనియా నగరంలో అమెజాన్... 350 అడుగుల ఎత్తైన భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఇటీవలే అధికారుల నుంచి ప్లానింగ్ అనుమతులు కూడా పొందింది. ఆ భవనం కట్టేందుకు 2.5బిలియన్ డాలర్ల (దాదాపు రెండు లక్షల కోట్లు)వ్యయం ఖర్చు చేయనుంది. అంటే దాదాపు మన రాష్ట్ర వార్షిక బడ్జెట్తో సమాన మన్నమాట. 25వేల మంది ఉద్యోగులు పనిచేసేం దుకు వీలుగా 22 అంతస్తులతో భవనాన్ని నిర్మిస్తు న్నారు. ఇందులో ప్రత్యేకమైన పార్క్, కమ్యూనిటీ హైస్కూల్, అనేక షాప్స్ కూడా ఏర్పాటవుతు న్నాయి. ఇక బయటినుంచి చూడటానికి గోపురం లా కనిపించే ఈ భవనం చుట్టూ ర్యాంప్... దానికి రువైపులా చెట్లతో నిజంగానే అడవిని తలపిం చనుంది. ర్యాంప్ మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ... భవనం పైవరకూ వెళ్లే వీలు కల్పించను న్నారు. ఈ అమెజాన్ అడవి భవనాన్ని ఎక్కాలంటే 2025 దాకా ఆగాల్సిందే. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
తన హత్య కేసును తనే రీ ఓపెన్ చేయించుకున్న ఆత్మ?! ఆ తర్వాత
‘మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?’ సమాధానం దొరకని ప్రశ్న! అయితే ‘ఆత్మ అమరం’ అని నమ్మేవారు అశరీరవాణికి పెద్దపీట వేస్తారు. దెయ్యాలు, పిశాచాలు, సైతాన్లు.. ఇలా కంటికి కనిపించని అతీంద్రియ శక్తులను బలంగా నమ్ముతారు. అలాంటివారి నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ గ్రీన్ బ్రియర్ ఘోస్ట్ మిస్టరీ. ఓ ఆత్మ తన కథను తనే తిరగరాసుకుంది. తన మర్డర్ కేసుని తనే రీ–ఓపెన్ చేయించుకుని.. తనని చంపినవాడికి శిక్షపడేలా చేసింది. నమ్మబుద్ధి కావట్లేదు కదూ! కానీ 18వ శతాబ్దం చివర్లో అమెరికాని వణికించిన ఉదంతం ఇది. 1897.. జనవరి 23.. మిట్ట మధ్యాహ్నం.. వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఓ బాలుడు.. గావుకేకలు పెడుతూ తన తల్లి దగ్గరకు పరుగుతీశాడు. ‘ఎల్వా ఆంటీ.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉందమ్మా’ అని చెప్పాడు రొప్పుతూ. ‘ఏమైందీ’ అంటూ కంగారు పడింది ఆ బాలుడి తల్లి. ‘ఎల్వా ఆంటి భర్త ఎడ్వర్డ్ అంకుల్ లేడూ.. తను మార్కెట్కు పోతూ పోతూ.. ఎల్వా ఆంటీకి ఏమైనా కావాలేమో కనుక్కుని రా అంటూ నన్ను వాళ్ల ఇంటికి పంపించాడు. నేను వెళ్లేసరికి ఆమె మాట లేకుండా పడి ఉందమ్మా..’ అంటూ వణుకుతూ వివరించాడు తనకు తెలిసిందీ.. తను చూసిందీ! అది విన్న వెంటనే కొడుకును తీసుకుని డాక్టర్ నాప్ దగ్గరకు పరుగుపెట్టింది ఆ బాలుడి తల్లి. 1896 అక్టోబర్లో ఎల్వా జోనా హిస్టర్కీ, ఎరాస్మన్ (ఎడ్వర్డ్) షూతో పెళ్లైంది. ఎడ్వర్డ్ స్థానికంగా కమ్మరి పనిచేసేవాడు. ఇంటికి వెళ్లిన పిల్లాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఎడ్వర్డ్.. కంగారుగా ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి చేరేలోపే అక్కడ డాక్టర్తో పాటు చుట్టుపక్కలవాళ్లు గుమిగూడి ఉన్నారు. వారి మధ్యలో అచేతనంగా పడున్న ఎల్వాని చూసి.. నిశ్చేష్టుడైపోయాడు ఎడ్వర్డ్. ఓ పక్క డాక్టర్ ఆమెని చెక్ చేస్తున్నాసరే.. భార్య ముఖాన్ని పట్టుకుని వదిలిపెట్టలేదు ఎడ్వర్డ్. ఏడుస్తూనే ఉన్నాడు. భార్యకు ఎంతో ఇష్టమైన స్కార్ఫ్ అంటూ ఓ స్కార్ఫ్ తెచ్చి ఎల్వా మెడకు చుట్టాడు. నా భార్య విశ్రాంతి తీసుకుంటుందని తల కింద దిళ్లు పెట్టి జోకొట్టాడు. అతని స్థితి చూసిన వాళ్లంతా ‘అయ్యో పాపం’ అంటూ కంటతడిపెట్టారు. ఎల్వా తల దగ్గర భర్త ఎడ్వర్డ్ పడి ఏడుస్తుంటే, డాక్టర్ నాప్.. ఎల్వాను చెక్ చేసి.. ఆమె ప్రాణాలతో లేదని నిర్ధారించాడు. పైగా ఎల్వా గత కొన్ని రోజులుగా తన దగ్గర గైనిక్ సమస్యకు చికిత్స తీసుకుంటుండడంతో .. ఆ సమస్యే తీవ్రమై ఆమె చనిపోయుంటుందని భావించాడతను. అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎల్వా తల్లి మేరీ జేన్ హిస్టర్ కూడా అక్కడికి చేరుకుని, కూతురి శవాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. రావాల్సిన వాళ్లు, చూడాల్సిన వాళ్లు ఎవ్వరూ లేరని తేలిన తర్వాత.. మరునాడు జనవరి 24న ఎల్వా మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. అప్పుడే మొదలైంది అసలు కథ.. నెల రోజులు గడవక ముందే ఎల్వా తల్లి మేరీకి వరుసగా నాలుగు రోజుల పాటు ఎల్వా కలలోకి వచ్చింది. తనది సహజమరణం కాదని.. తన భర్త ఎడ్వర్డే తనని బలవంతంగా చంపేశాడంటూ మొరపెట్టుకుంది. మేరీ ఆశ్చర్యపోయింది. ‘సాక్ష్యం లేనిదే కోర్టులో ఎలా నిరూపించగలను?’ అనుకుంటూనే స్థానిక ప్రాసిక్యూటర్ జాన్ ఆల్ఫ్రెడ్ని కలిసింది. తన కూతురు కలలోకి వచ్చిందని, కేసును రీ–ఓపెన్ చెయ్యాలని ప్రాధేయపడింది. ఆమె వాదనని మొదట్లో కొట్టిపారేసిన జాన్ .. అనుమానం వచ్చి ఎడ్వర్డ్ ఎలాంటివాడని స్థానికంగా ఆరా తీశాడు. ఎల్వాను నిరంతరం ఎడ్వర్డ్ కొట్టేవాడని, అతడే చంపేసుంటాడనే అనుమానాలు వెలువడ్డాయి. వెంటనే డాక్టర్ నాప్ని ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ జాన్ . ‘ఎడ్వర్డ్ ఏడుస్తూ ఉండటంతో.. ఎల్వా డెడ్ బాడీని సరిగా పరీక్షించలేకపోయాను’ అని నాప్ తెలిపాడు. దాంతో.. కేసు రీ–ఓపెన్ అయ్యింది. 1897 ఫిబ్రవరి 22న ఎల్వా బాడీని సమాధి నుంచి బయటికి తీసి.. ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. 1897 మార్చి 9కి రిపోర్టుల్లో ఎల్వాది హత్యేనని తేలింది. మెడ విరిచి చంపినట్లు ఎడ్వర్డ్ వేలిముద్రలు కూడా దొరికాయి. విరిగిన మెడ వాలిపోకుండా ఉండటానికే ఆ రోజు శవం మెడకు స్కార్ఫ్ చుట్టాడని, తల కింద దిండ్లు పెట్టాడని అందరికీ అర్థమైంది. దాంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో ఎడ్వర్డ్ గురించి మరిన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఎడ్వర్డ్కి ఎల్వా మొదటి భార్య కాదని.. మూడో భార్యని తెలిసింది. మొదటి భార్య.. ‘ఇలాంటి క్రూరుడితో బతకడం నా వల్ల కాదు’ అని విడాకులు ఇచ్చి వెళ్లిపోగా.. రెండో భార్య అనుమానాస్పద రీతిలో చనిపోయింది. అంటే ఆమెని కూడా ఎడ్వర్డే చంపి ఉంటాడనే ఆరోపణలు బలపడ్డాయి. పైగా ఎడ్వర్డ్.. ఏడు పెళ్లిళ్లు చేసుకోవాలనేది తన కోరికని, అందుకే ఎల్వాను చంపానని, సరైన ఆధారాలు లేవు కాబట్టి.. త్వరలోనే విడుదల అవుతానని తోటి ఖైదీలతో గర్వంగా చెప్పుకునేవాడట. 1897 జూన్ 22న కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎల్వా ఆత్మకి సంబంధించి చర్చ వచ్చినప్పుడు.. ‘కోర్టు ముందు ఆత్మల ప్రస్తావన వద్దని.. రిపోర్టులు, ఆధారాలతోనే ముందుకు వెళ్దామని’ జడ్జ్ అడ్డుపడటంతో కేసులో ఆత్మ ప్రస్తావన లేకుండాపోయింది. మొత్తానికీ ఎల్వాని ఉద్దేశపూర్వకంగానే ఎడ్వర్డ్ హత్య చేసినట్లు జూలై 11న తీర్పు రావడంతో ఎడ్వర్డ్కి జీవిత ఖైదు పడింది. ఓ అమాయకురాల్ని పొట్టనపెట్టుకున్నాడని, అతడ్ని తామే చంపుతామని చాలామంది ఎల్వా సానుభూతిపరులు.. జైలుపై దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎడ్వర్డ్ తప్పించుకున్నాడు. కానీ తర్వాత మూడేళ్లకే అంటే 1900 మార్చి 13న వెస్ట్ వర్జీనియా, మౌండ్స్ విల్లేలోని స్టేట్ పెనిటెన్షియరీలో ఎడ్వర్డ్ చనిపోయాడు. అయితే అది సహజ మరణం కాదు. తెలియని ఏదో వ్యాధి సోకి, చిత్రవధ అనుభవిస్తూ చనిపోయాడు. ఎల్వా ఆత్మే అతడిని చంపిందని అంతా అనుకున్నారు. ఆ వ్యాధి ఎవరికీ సోకే ప్రమాదం లేకుండా.. స్థానిక శ్మశాన వాటికలో అతనిని ఖననం చేశారు. ఎల్వా సమాధి దగ్గర.. వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఓ చారిత్రక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఇలా ఉంటుంది.. ‘ఎల్వా ఆత్మ.. తన తల్లి కలలోకి వచ్చి.. తనది సహజ మరణం కాదని చెప్పింది. ఆమె భర్తే ఆమెని హత్య చేసినట్లు తేలింది. ఒక ఆత్మ సాయంతో ఓ హత్య కేసు పరిష్కరించడం ఇదే మొదటిసారి’ అని. మొత్తానికీ ఈ కథ చరిత్రలో ఓ ఊహించని మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
బ్లాక్స్బర్గ్: అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్బర్గ్ డౌన్టౌన్లోని మెలోడీ హుక్కా లాంజ్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!
ఈజిప్ట్: ఒక్కసారి లాటరీ గెలిస్తేనే ఎగిరి గత్తేస్తాం. రెండూ సార్లు గెలిస్తే అబ్బో అదృష్టం అంటే మనదే అంటూ తెగ సంబరపడిపోతాం. కానీ ఏకంగా 20 సార్లు గెలిస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడొక వ్యక్తి కొనుగోలు చేసిన 20 టికెట్లకి లాటరీ తగిలింది. ఎవరా లక్కీ ఫెలో అని ఎగ్జాయింటింగ్ ఉన్నారా! (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....అలెగ్జాండ్రియాకు చెందిన విలియం నెవెల్ వర్జినియాలోని ఓ దుకాణం నుంచి ఆన్లైన్లో 20 ఒకేలాంటి టికెట్లు కొనుగోలు చేశాడు. అయితే నాలుగు టికెట్ల చొప్పున వరుసగా 5, 4, 1, 1 సంఖ్యలను ఎంచుకున్నాడు. ఇక అంతే వర్జినియా లాటరీ అధికారులు లాటరీ తీసిన ప్రతిసారి నెవెల్ కొనుగొలు చేసిన 20 టికెట్లకు 20 సార్లు గెలిచాడు. దీంతో నెవెల్ ప్రతి టికెట్కి 5 వేల డాలర్లు చొప్పున మొత్తం1,00,000 డాలర్లు (అంటే రూ.74 లక్షలు) గెలుచుకున్నాడు. ఏది ఏమైనా ఒకటి, రెండు సార్లు కూడా కాదు ఏకంగా 20 సార్లు అతను కొనగోలు చేసిన 20 టికెట్లుకు లాటరీ తగలడం విశేషం. (చదవండి: అది బైక్ ? విమానమా !) -
వర్జీనియాలో డెమెక్రాటిక్ పార్టీనే గెలిపించండి
నవంబరు 2న జరిగే ఎన్నికల్లో వర్జీనియా గవర్నర్గా టెర్రీని గెలిపించాలని వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు కోరారు. అమెరికా అధ్యక్షులు జోసఫ్ బైడన్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేసారు. ఇమిగ్రేషన్, బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలను వక్తలు వివరంగా తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న అనుకూల విధానాలే కొనసాగాలంటే డెమోక్రాట్లు అధికారంలోకి రావాలని తెలిపారు. వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు శ్రీధర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో లౌడెన్ కౌంటీ, వర్జీనియా రాష్ట్రంలోని లౌడెన్ కౌంటీలో ప్రవాస భారతీయ నాయకులు తొలిసారిగా సభ నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాహాఫ్ ముఖ్య అతిథి గా విచ్చేశారు. గత వర్జీనియా గవర్నర్, ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్న టెర్రీ మెకాలిఫ్, అటార్నీ జనరల్ గా పోటీ చేస్తున్న మార్క్ హేరింగ్, అమెరికా రిప్రజెంటేటివ్ జెన్నిఫర్ వెక్సన్, వర్జీనియా సెనేటర్ జెన్నిఫర్ బాయిస్కో, డెలిగేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, డెలిగేట్ వెండీ గూడిటిస్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు కోరారు. ఈ సమావేశంలో ప్రవాస తెలుగు, భారతీయ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు భాగమయ్యారు. ప్రసంగించిన వక్తలు వర్జీనియా రాష్ట్రంలో, డెమోక్రాటిక్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలలో వివిధ రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, హై టెక్నాలజీ, ఎంప్లాయిమెంట్, కోవిడ్ వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు. -
వర్జీనియాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్ట్ 15న అమెరికా వర్జీనియాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ప్రతి నిధులు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా అధ్యక్షురాలు సుధారాణి కొండపు మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టి పెరిగిన మన భావితరాలు ఆనందించేలా మన భారతీయతను ప్రతిబింబించే జెండా రంగులలోని కాషాయరంగు ,తెలుపు, ఆకుపచ్చ వర్ణాల అలంకరణతో పార్క్ ఏరియా కళకళలాడుతుందని అన్నారు. పిల్లలకు చాక్లెట్లను, బహుమతులను పంచుతూ తమ కార్యవర్గసభ్యులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, ట్రస్టీలు, గోపాల్ నున్న , వెంకట్ కొండపోలు కార్యవర్గసభ్యులు సతీష్ వడ్డి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి , పార్ధ బైరెడ్డి ,హరీష్ కొండమడుగు , రామచంద్ర ఏరుబండి , రాజు గొడుగు, సతీష్ సుంకనపల్లి,రమణారెడ్డి, ఉదయ్ , సాయి, రంగా, కౌశిక్ , విష్ణు, వినీత్ , కృష్ణకిశోర్, సంధ్య, రాధిక, అవని, లావణ్య, సుప్రజ ,విజయ,హరిత తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
అమ్మలా చేసింది.. ఎందరినో మెప్పించింది!
వాషింగ్టన్: కరోనా వల్ల చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి, ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. దీంతో పిల్లలైతే.. తల్లిదండ్రుల పనులు చేస్తామంటూ.. ఆ స్థానాల్లో కూర్చుని అల్లరి చేసినవి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని వర్జీనియాకు చెందిన 8 ఏళ్ల అడెల్లె అనే చిన్నారి తల్లిని అనుకరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 1 నిమిషం 23 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఆ అమ్మాయి తన తల్లి డెస్క్ వద్ద కూర్చుని, కంప్యూటర్లో పనిచేస్తున్నప్పుడు తల్లి ఎలా ఉంటుంది. ఆ సమయంలో ఫోన్ కాల్స్కి స్పందించడం. పిల్లలు గదిలోకి ప్రవేశించినపుడు ఆమె తల్లి ఎలా ప్రవర్తిస్తుందని నటిస్తూ చూపించింది. కొలీన్ చులిస్ ఏప్రిల్లో తన కుమార్తె వీడియోను లింక్డ్ఇన్లో షేర్ చేయగా.. 5 మిలియన్లకు పైగా లైక్లు, 15 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ఇక కొలీన్కు ముగ్గురు పిల్లలు లూకా (10), అడెల్లె (8), డెక్లాన్ (6) ఉన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ చాలా బాగా చేశారు. నీ నటనకు ఫిదా చిట్టి తల్లి.’’ అంటూ కామెంట్ చేశాడు. -
వైరల్: మీనా.. గుడ్బై నేస్తమా
చిన్నముక్క బిస్కెట్, ఒక ఆప్యాయ స్పర్శ చాలు.. కుక్కను మనవైపు తిప్పుకోవడానికి. ఆ పనిని మనం వాటిని మరిచిపోయినా.. అవి మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి. మనుషుల పట్ల లెక్కకట్టలేనంత విశ్వాసాన్ని కనబరిచే ఆ మూగజీవాలు.. ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు తమ చేష్టలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. గుజరాత్ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న స్నిఫ్ఫర్ డాగ్ మీనా(7) అనారోగ్యంతో మృతి చెందింది. దాని అంతిమ సంస్కారాలకు ముందు అధికారులు పూలతో నివాళులు అర్పించారు. ఆ టైంలో అక్కడే ఉన్న మరో రెండు స్నిఫ్ఫర్ డాగ్స్.. మీనా భౌతికకాయం ముందు మోకరిల్లి నివాళులర్పించాయి. ఐపీఎస్ అధికారి శంషేర్ సింగ్ ఆ ఫొటోను అప్లోడ్ చేయగా.. వైరల్ అవుతున్న ఆ ఫొటోకి నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. Final salute to their colleague , Meena. pic.twitter.com/bYuceNlsee — Shamsher Singh IPS (@Shamsher_IPS) June 17, 2021 ఇక వర్జీనియాలో జరిగిన ఓ ఘటనలో.. యజమాని నుంచి తప్పిపోయి అడవుల్లోకి వెళ్లిన ఓ కుక్క.. వాగులో కొట్టుకుపోతున్న జింక పిల్లను ఒడ్డుకు చేర్చింది. ‘హీరో డాగ్’గా పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకుంది. హర్లే అనే కుక్క ఆ జింక పిల్లను కాపాడుతున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: బుడగలు ఊదుతూ రిలాక్స్గా.. -
‘‘ఈ బిడ్డలు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్లరు’’
వాషింగ్టన్: ఈ మధ్య కాలంలో మన దేశంలో రెండు మూడు సంఘటనలు జనాలను బాగా కదిలించాయి. అవేంటంటే బెంగళూరుకు చెందిన ఓ కోటీశ్వరుడు చనిపోయిన భార్యను పోలిన విగ్రహం తయారు చేయించి.. దానితో గృహప్రవేశం చేశాడు. తమిళనాడులో కొందరు అక్కాచెళ్లల్లు చనిపోయిన తండ్రి విగ్రహం చేయించి.. దాని సమక్షంలో సోదరి వివాహం జరిపించారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే ఓ తల్లి కూడా ఇలానే తన బిడ్డలను పోలిన బొమ్మలను చేయించి.. వాటితో కాలం గడుపుతుంది. ఎందుకు ఇలా అంటే భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు కూడా తండ్రి వద్దనే ఉంటున్నారు. ఆ బాధ నుంచి బయటపడటం కోసం ఆ తల్లి ఇలా లక్షలు ఖర్చు చేసి బిడ్డల బొమ్మలు తయారు చేయించుకుని వాటితో సంతృప్తి పడుతుంది. ఆ వివరాలు.. వర్జీనియా క్లిఫాన్కు చెందిన లిజ్ వాట్సాన్ 2010లో భర్తనుంచి విడిపోయింది. అప్పటికే వారికి ముగ్గురు పిల్లలు. ఆఖరి సంతానం వయసు 18 నెలలు కాగా మిగతా ఇద్దరు పిల్లు కొంచెం పెద్దవారు. తల్లితో వచ్చిన కొద్ది రోజుల తర్వాత పెద్దపిల్లలు ఇద్దరు తండ్రి దగ్గరకు వెళ్లిపోయారు. ఆ బాధనుంచి కోలుకోవాడినికి ఆమె దాదాపు 5 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఓ సారి ఆమె యూట్యూబ్లో అచ్చు మనిషిని పోలినట్లుండే బొమ్మలను చూసింది. వాటిని చూడగానే వాట్సన్కు ఓ ఆలోచన వచ్చినంది. వెంటనే తన పిల్లల ఫోటోలు ఇచ్చి.. వారిలాంటి బొమ్మలు తయారు చేయించింది. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు పెట్టింది. అలా 2016 నుంచి వాట్సాన్ రీబోర్న్ బేబీ డాల్స్ లోకంలో అడుగుపెట్టింది.ప్రస్తుతం ఆమె దగ్గర మొత్తం తొమ్మిది బొమ్మలున్నాయి. దీనిపై వాట్సాన్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.‘‘నా బిడ్డలు నాన్న కావాలంటూ నా దగ్గర నుంచి వెళ్లిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో మాటల్లో వర్ణించలేను. పిల్లలు వెళ్లిపోయాక నాకు ఎలా అనిపించింది అంటే అన్నాళ్లు వాళ్లని పెంచి ఎవరికో దత్తత ఇచ్చినట్లనిపించింది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఇలా నా బిడ్డలను పోలిన బొమ్మలు తయారు చేయించాను. ఎందుకంటే వీటికి మాటల రావు.. పెరగవు. మరి ముఖ్యంగా ఎన్నటికి నన్ను విడిచిపెట్టి వెళ్లవు’’ అన్నది. చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్తో.. -
పైనుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు!
వాషింగ్టన్ : అమ్మాయిలు బట్టలు మార్చుకునే గదిలోకి తొంగిచూస్తూ అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. సీలింగ్పై నుంచి గదిలోకి పడి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాండ్ఫోర్డ్ కౌంటీ షరీఫ్ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసిన వివరాల మేరకు.. వర్జీనియాకు చెందిన బ్రియాన్ ఆంథోనీ జోయ్ శనివారం అక్కడి ఓ జిమ్కు వెళ్లాడు. వర్కవుట్లు చేయటం అయిపోయిన తర్వాత ఉమెన్స్ లాకర్ రూం( అమ్మాయిలు బట్టలు మార్చుకునే, దాచుకునే గది)లోని సీలింగ్పై నక్కి కూర్చున్నాడు.. అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటే చూద్దామని. కొద్దిసేపటి తర్వాత అతడి బరువు తాళలేకపోయిన సీలింగ్ షీటు ఊడిపోయింది. దీంతో అతడు పది అడుగుల ఎత్తునుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు. అదే సమయంలో గదిలోకి వచ్చిన ఓ అమ్మాయి అతడు పైనుంచి కిందపడటంతో బిత్తరపోయింది. ( పీపాలో నెల రోజులు.. మలం తిని బతికాడు) మొదట అతడ్ని జిమ్ సిబ్బంది అనుకుంది. అయితే అతడి ఒంటిపై యూనీఫాంకు బదులు మామూలు డ్రెస్ ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతడు కిందపడిన వెంటనే పైకి లేచి, దొంగచూపులు చూస్తూ రూములోంచి బయటకు వెళ్లిపోయాడు. బ్రియాన్పై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి అతడ్ని అడ్డగించి ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడినుంచి పారిపోయి జిమ్లోని బాత్రూమ్లో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బ్రియాన్ను అదుపులోకి తీసుకున్నారు. View this post on Instagram A post shared by Jennifer Benitez Health Coach✨ (@fitwjenn) -
ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్తో..
నాలుగేళ్ల పిల్లాడు ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఊహించని ఫ్రెండ్తో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ చిన్నారి కొత్త స్నేహితుడ్ని చూసిన అతడి తల్లి ఒకింత ఆశ్చర్యపోయింది. వెంటనే తన మొబైల్ తీసుకుని స్టైల్గా ఉన్న ఇద్దరి ఫోటోలను తీసింది. అయితే ఆ బుడతడి కొత్త ఫ్రెండ్ మరెవరో కాదు జింక పిల్ల. అమెరికాలోని వర్జీనియాలో ఈ అరుదైన ఘటన జరిగింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. వివరాలు.. విహారయాత్ర కోసం స్టెఫానీ బ్రౌన్ కుటుంబం వర్జీనియాలోని మసానుటెన్కు వచ్చింది. డొమినిక్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఈ నెల 26న ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొంతసేపటికి తర్వాత తిరిగి వచ్చిన కుమారుడ్ని చూసి అతడి తల్లి స్టెఫానీ బ్రౌన్ ఆశ్చర్యపోయింది. ఆ చిన్నారితో కలిసి వచ్చిన జింక ఏ మాత్రం భయపడకుండా తలుపు పక్కన నిలబడింది. అయితే దాని తల్లి తన పిల్ల కోసం చూస్తుందని, ఆ జింక పిల్లను తిరిగి పార్కులో వదిలేయమని చెప్పింది. కాగా, కొత్త ఫ్రెండ్తో తన కుమారుడు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను స్టెఫానీ బ్రౌన్ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వందల సంఖ్యలో సాలీడులు.. వారి పరిస్థితి ఏంటో -
అదృష్టం అంటే ఇదేనేమో
లాటరీ అనే పదం మనకు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా మనకు లాటరీ తాకపోతుందా అని మనం కూడా ఎదురుచూస్తూ ఉంటాం. కానీ కొందరికి అదృష్టం ఉంటే ఒకటి లేదా రెండు సార్లు లాటరీ తాకుతుంది. కానీ, మనం ఇప్పుడు చెప్పబోయే అతనికి మాత్రం ఏకంగా 160 టికెట్లకు లాటరీ తగిలింది. దీనిని నమ్మడానికి కష్టాంగా ఉన్న ఇది నిజం. వర్జీనియా చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి డిసెంబర్ 5న నిర్వహించిన లాటరీ డ్రాలో 160 టికెట్లను కొన్నాడు. 1,3,4,7 అంకెలు కలిగి ఉన్న లాటరీలను కొన్నాడు. డిసెంబర్ 7న విడుదల చేసిన లాటరీ డ్రాలో తను కొన్న ప్రతి టికెట్ కి లాటరీ తగిలింది. (చదవండి: గూగుల్పై 73 లక్షల కోట్ల జరిమానా) 7314 కాంబినేషన్ తో ఉన్న ఎంచుకోవడానికి కారణం చెప్పాడు. అతను ఒక టీవీ షో చూస్తున్నప్పుడు 7314 నెంబర్ కి లాటరీ తాకే అవకాశం ఉందని చెప్పడంతో నేను అలానే చేశాను అని తను చెప్పాడు. తర్వాత తాను కొన్న ప్రతి లాటరీ తగిలిందని చెప్పడంతో చాల ఆశ్చర్యపోయాడు. ఇది కల నిజమా అని ఒకటి పది సార్లు చెక్ చేసుకున్నట్లు తెలిపాడు. అతను కొన్న 160 టికెట్ల బహుమతి విలువ మొత్తం $8,00,000 (రూ.5.89 కోట్లు). తను కొన్న ఒక్క టికెట్ అయిన లాటరీ తగిలితే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెడదామని అనుకున్నాని చెప్పాడు. మరి ఇప్పుడు ఏకంగా రూ.5.89 కోట్లు గెలవడంతో అతను సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఆ డబ్బుతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదని క్రాప్ చెప్పుకొచ్చాడు. కొన్న ప్రతి టికెట్ కి లాటరీ తగలడంతో ఇతనిని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో అని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఇలాగే ఒక సంఘటనలో రేమండ్ హారింగ్టన్ అనే వ్యక్తి 25 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి 25 సార్లు గెలిచి 1,25,000 డాలర్లు లభించాయి. -
ఒక్క స్క్రాచ్ కార్డు జీవితాన్ని మార్చేసింది
వర్జీనియా : తల్లితో కలిసి ఒక కొడుకు సరదాగా సరుకుల షాప్కు వెళ్లాడు. తల్లి సరుకులు కొనే పనిలో బిజీగా ఉండడంతో ఆ కొడుక్కి ఏం చేయాలో తోచలేదు. దీంతో అదే షాపులో ఒక స్క్రాచ్ కార్డును కొన్నాడు. ఈలోపు తల్లి షాపింగ్ ముగించుకొని వచ్చింది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. తర్వాత తన వెంట తెచ్చకున్న స్క్రాచ్ కార్డును గీకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. స్క్రాచ్కార్డును గీకగానే అందులో ఉన్నది చూసి ఎగిరి గెంతేశాడు. దీంతో వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందంటూ కొడుకును అడిగింది.(పావురానికో గూడు.. భళా ప్రిన్స్!) మనకు లాటరీలో 1.4కోట్ల రూపాయలు వచ్చాయని కొడుకు చెప్పాడు. అయితే కొడుకు చెప్పింది ఆ తల్లి నమ్మలేదు.. స్క్రాచ్ కార్డును ఆమె చేతిలోకి తీసుకొని పరీక్షించింది. దాని మీద అక్షరాల 2,00,000 డాలర్లు గెలుచుకున్నట్లు ఉంది. అంతే ఆ తల్లి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. లాటరీ గెలుచుకున్న వ్యక్తి పేరు హెబర్ట్ స్క్రగ్స్. షాపింగ్ చేసినంత టైంలోనే కోట్లు సంపాదించిన కొడుకును చూసి తల్లి మురిసిపోతుంటే... మిగతావారు మాత్రం వారికొచ్చిన బంపర్ లాటరీని చూసి ఈర్ష్య పడుతున్నారు. -
అమెరికాలో మరో జాత్యహంకార ఘటన
-
రోడ్డుపై డబ్బు మూటలు దొరికాయి: కానీ..
న్యూయార్క్ : వర్జీనియాకు చెందిన డేవిడ్ ఫ్యామిలీ సరదాగా బయట తిరిగొద్దామని గత శనివారం పిక్అప్ ట్రక్లో బయలుదేరింది. కరోలైన్ కౌంటీనుంచి కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత గూచ్లాండ్ కౌంటీ వద్ద రోడ్డుపై వారికి ఓ బ్యాగ్ కనిపించింది. ఏదో చెత్త బ్యాగ్ రోడ్డుకు అడ్డంగా ఉందని భావించిన వారు ట్రక్ను ఆపేసి బ్యాగును వాహనం వెనకాల పడేశారు. కొంత దూరం వెళ్లిన తర్వాత మరో బ్యాగు కనిపించింది. దాన్ని కూడా ట్రక్ వెనకాల పడేశారు. కొన్ని గంటలు బయట సరదాగా తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఆ బ్యాగులను తెరిచి చూడగా అందులో డబ్బులు కనిపించాయి. అయితే వారు ఆ డబ్బుపై ఆశపడక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ( సూపర్ పవర్స్ చిన్నారి, వీడియో వైరల్! ) డేవిడ్ ఫ్యామిలీ అక్కడికి చేరుకున్న పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల్లో దాదాపు 1 మిలియన్ డాలర్లు( రూ.75 లక్షలు) ఉన్నట్లు గుర్తించారు. డేవిడ్ కుటుంబసభ్యుల నిజాయితీని మెచ్చుకున్నారు పోలీసులు. డబ్బు సమాచారం అందించిన ఆ కుటుంబానికి నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అంత డబ్బు రోడ్డు మీదకు ఎలా వచ్చిందా అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ( వంటిల్లుగా మారిన పోలీస్ స్టేషన్ ) -
అరుదైన రెండు తలల తాబేలు ఇదే!
వర్జీనియా : అమెరికాలోని వర్జీనియాలో అరుదైన రెండు తలల ఆకుపచ్చ తాబేలు వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దీన్ని గుర్తించాడు. ప్రస్తుతం ఈ రెండు తలల తాబేలు ‘ది వర్జీనియా లివింగ్ మ్యూజియం’లో విశ్రమిస్తోంది. ‘పోలీసెఫాలీ’ అనే కండీషన్ కారణంగా రెండు తలలు ఏర్పడతాయని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కండీషన్ క్షీరదాల్లో అత్యంత అరుదుగా.. తాబేళ్లు, ఇతర సరీసృపాలలో అరుదుగా సంభవిస్తుందని వెల్లడించారు. కొన్నికొన్ని సార్లు తాబేలులో రెండు తలలు పక్కపక్కనే ఉండటం జరుగుతుందని, మరికొన్ని సార్లు తలలు శరీరానికి చివర్ల వ్యతిరేక దిశగా ఉంటాయిని పేర్కొన్నారు. రెండు తలల జీవులు స్వేచ్ఛగా జీవించటం అన్నది కష్టసాధ్యమైన పనని తెలిపారు. అంతేకాకుండా ఈ తాబేలుకు సంబంధించిన ఓ వీడియోను తమ ఫేస్బుక్ ఖాతాలో విడుదల చేశారు. ‘‘ క్వారన్స్ట్రీమ్’’ పేరిట ఈ వీడియో గత శుక్రవారం విడుదలైంది. చదవండి : ఇంట్లో ప్రత్యక్షమైన రెండు తలల పాము -
అప్పుడు నీళ్లు తాగితే బరువు తగ్గడం ఖాయం
వర్జీనియా : బరువు తగ్గడం అంత వీజీ కాదు. లావుగా ఉన్నవాళ్లకు తెలుసు ఆ బాధేంటో. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోలేక, వ్యాయాయం చేసే ఓపిక లేక బరువు ఎలా తగ్గాలా అని ఆలోచిస్తూనే కాలం గడిపేస్తుంటారు. మరికొంతమందైతే య్యూటూబ్ వైద్యాన్ని నమ్మి శరీరంపై రకరకాల ప్రయోగాలు చేసి విసిగిపోయుంటారు. ఇంకొందరు వేలు, లక్షల ఖరీదైన శస్త్రచికిత్సలు, స్టెరాయిడ్ల బాట పడుతుంటారు. అయితే మన దాహాన్ని తీర్చే నీటితోటే బరువు తగ్గొచ్చని మాత్ర అర్థం చేసుకోలేరు. అవును! తాజా సర్వేలో ఈ విషయమే వెల్లడైంది. స్ట్రిక్ట్ డైట్, వ్యాయామాలతో పాటు సరైన మోతాదులో, సమయంలో నీళ్లు తీసుకోవటం కూడా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుందని తేలింది. మనందరికి తెలుసు నీళ్లు మన శరీరానికి ఎంత అవసరమైన ఇంధనమో. నీరు తీసుకోవటం ద్వారా శరీరం పనితీరు చురుగ్గా ఉండటమే కాకుండా.. శరీరంలోని మలినాలు బయటకు పంపించడంలో నీరు కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు బరువు తగ్గడంలోనూ నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని బ్లాక్బర్గ్కు చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ యాట్ వర్జీనియా టెక్లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్,ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజెస్ పరిశోధకులు చెబుతున్నారు. ఆహారం తీసుకోబోయే ముందు రెండు కప్పుల నీరు తాగిన వారు 12 వారాల్లో 2 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. ఈ పరిశోధన కోసం 48 మందిపై ప్రయోగం జరిపారు. వీరంతా 55నుంచి 75 సంవత్సరాలు కలిగిన వారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఓ గ్రూపును మూడు పూటల ఆహారం తీసుకునే ముందు రెండు కప్పుల నీరు తాగేలా చేశారు. మరో గ్రూపుకు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. 12వారాల తర్వాత భోజనాలకు ముందు నీరు తీసుకున్న వారు అదనంగా 2కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. తినే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? మనం ఆహారం తీసుకోవటానికి ముందు 2 కప్పుల నీరు తీసుకున్నట్లయితే తక్కువ ఆహారాన్ని భుజిస్తాము. తద్వారా తక్కువ కాలరీలు మన శరీరానికి అందుతాయి. తక్కువ కాలరీల ద్వారా కొత్తగా కొవ్వు పేరుకుపోవటానికి అవకాశం ఉండదు కాబట్టి బరువు తగ్గటం సాధ్యమవుతుంది. మరింత తొందరగా బరువు తగ్గాలనుకునేవారు చెక్కెర, కాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవటం మానేయాలి. అయితే అధికంగా నీరు తీసుకోవటం కూడా కొన్ని సందర్భాల్లో చెడుగా పరిణమిస్తుందని గుర్తుంచుకోవాలి. -
టీనేజర్ కడుపులో దెయ్యం పిల్ల!
వర్జీనియా దేశంలోని రిచ్మండ్ నగరానికి చెందిన ఐయన్నా కారింగ్టన్ (17) అనే టీనేజర్ తొలిసారి తల్లి కాబోతోంది. కడుపులో ఉన్న 24 వారాల బేబీ ఎలా ఉందో తెలుసుకునేందుకు సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుంది. స్కానింగ్లో కనిపించిన తన బేబీ దశ్యాన్ని చూసి ఆమెకు గుండె ఆగిపోయినంత పనయింది. జుట్టంతా విరబూసుకొని గుడ్లు తెరచి చూస్తున్నట్లు ఉన్న బేబీ స్కానింగ్ చిత్రం అచ్చం దెయ్యం పిల్లలా ఉంది. మిడ్ నర్సు నచ్చచెప్పాక తేరుకున్న ఐయన్నా తన బేబీ స్కానింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా మిత్రులకు షేర్ చేసింది. కొందరు ఐయన్నా లాగా భయాందోళనలు వ్యక్తం చేయగా, మిగతా వారు మార్ఫింగ్ ఫొటో అంటూ కొట్టివేశారు. తనకు పుట్టబోతున్న బిడ్డ ఆడో, మగో కూడా తెలియదని ఐయన్నా చెప్పారు. అయితే స్కానింగ్ అప్పుడు ఆమె పక్కనే ఉన్న మిడ్ నర్సు మాత్రం ఆడ శిశువే అని తెలిపింది. సాధారణంగా కడుపులోని శిశువులు కళ్లు మూసుకొని ఉంటారని, కళ్లు తెరచి చూడరని, ఐయన్నా బిడ్డను స్కానింగ్ చేసినప్పుడు ఆపాప కళ్లు బాగా తెరచి కెమేరా వైపు చూడడం వల్ల స్కానింగ్లో ఆ పాప దెయ్యంలా కనిపిస్తోందని చెప్పారు. కొందరు గర్భస్త్ర శిశువులు స్కానింగ్ అప్పుడు అలా కనిపిస్తారుగానీ, అందరి పిల్లల్లానే ఉంటారని హెడ్ నర్సు చెప్పడంతో ఐయన్నా స్థిమిత పడింది. అయినా ఏదో కోశాన అనుమానం ఉన్నట్లు ఐయన్నా కాస్త భయపడుతోంది. అయినా మొదటిసారి తల్లి అవుతున్న ఆనందం వేరులే! అంటూ సరదాగానే ఉంటోంది. -
‘రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’
మూడు రోజుల క్రితం మైనర్ లీగ్ బేస్ బాల్ ఆటగాడు బ్లేక్ బివెన్స్ కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బివెన్స్ భార్య, కుమారుడితో పాటు అత్తగారు కూడా మరణించారు. తన కుటుంబ సభ్యుల మరణవార్త తెలిసి బివెన్స్ కుప్పకూలిపోయాడు. వారి మరణంతో బివెన్స్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నాకు తెలుస్తోంది నా జీవితం నాశనమైందని, రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’ అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో వారి ఫొటోలు పోస్ట్ చేశాడు బివెన్స్. దాంతో పాటు కుటుంబ సభ్యులతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు. బివెన్స్ తన 25 ఏళ్ల భార్య గురించి చెబుతూ ‘ఎమిలీ నువ్వు ప్రపంచంలోనే ఉత్తమమైన భార్యవి, తల్లివి కూడా. నువ్వు చూపించేంత ప్రేమను ఇంకెవరు చూపలేరు. నీ ప్రేమ, దయ నా జీవితాన్ని మార్చేశాయ’ని పేర్కొన్నాడు. తన 14నెల కుమారుడు కల్లెస్ గురించి...‘నువ్వు పుట్టిన తర్వాతే నాకు ప్రేమ అంటే ఏంటో అర్థయయ్యింది. నువ్వు ఏడిస్తే చుడలేక ఏదో ఒకటి చేసి నిన్ను నవ్వించే వాడిని. నువ్వు లేకుండా నేను ఊపీరి పీల్చుకోలేను’ అంటూ కుమారుడిపై తనకు ఉన్న ప్రేమను తెలిపాడు. అలాగే 65 ఏళ్ల అత్తగారిని ఉద్దేశిస్తూ బివెన్స్ ‘తను కుటుంబం పట్ల చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తల్లి, కుతూళ్లు చనిపోయి కూడా కలిసి ఉన్నందుకు ఆనందంగా ఉందని’ తన భావోద్వేగాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. మంగళవారం వర్జీనియాలోని తన ఇంట్లో ఈ ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నట్లు బివెన్స్కు పోలీసులు సమాచారం అందించాడు. తన భార్యకు సోదరుడి వరుసైన మాథ్యూ థామస్ బెర్నాడ్ ఈ హత్య చేసుంటాడని బివెన్స్ అనుమానం వ్యక్తం చేశాడు. దీని గురించి బివెన్స్ మాట్లాడుతూ.. ‘మేము, బెర్నాడ్లు ఒకే చర్చికి వెళ్తాం. గత కొద్ది రోజులుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ మా కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు’ అని బివెన్స్ పోలీసులకు తెలిపాడు. దీంతో బెర్నాడ్పై కెసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. View this post on Instagram Two days ago my heart was turned to ash. My life as I knew it is destroyed. The pain my family and I feel is unbearable and cannot be put into words. I shake and tremble at the thought of our future without them. Emily, my sweetheart, you are the best wife and mother this world has ever seen. You made me into the man I am today and you loved me with all of my flaws. You brought our precious baby boy into this world and made our family complete. Your love and kindness changed countless lives, including mine. My sweet little boy, dada loves you so much! I can’t breathe without you here. I finally understood what love was when you were born and I would have done anything for you. You have changed my life forever, you are my reason why. I long to hold the both of you again in heaven. I’m so glad you are with all your Great-grandmothers now, I know they are eating you up. This earth did not deserve either of you; you were just too wonderful to comprehend. Joan you were the best mother-in-law anyone could ask for. You loved your family more than anyone I’ve ever seen. You raised the most wonderful girl in the world. I’m so glad y’all are still together. You were the best Nana this world has ever seen and I will never forget you. Skip you are a wonderful father and grandfather. We will get through this together as a family. We will not let the devil win! Thank you God for giving me the most wonderful family in the world! I’ve been blessed beyond belief. Thank you to all my family and friends who have reached out to me during this time of sorrow. Thank you @raysbaseball @biscuitbaseball for your support through everything. I am comforted by all the messages and well wishes. I’m not sure what is next for me, but I do know God has a plan even though I can’t see it. A post shared by Blake Bivens (@blakebbins) on Aug 29, 2019 at 6:55pm PDT -
అమెరికాలో ఉన్మాది కాల్పులు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్ సిటీలో ఓ ఇంజనీర్ శుక్రవారం తుపాకీతో సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని కాల్చిచంపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని డ్వేన్ క్రాడిక్(40)గా గుర్తించారు. ఈ విషయమై వర్జీనియా బీచ్ పోలీస్ చీఫ్ జేమ్స్ సెర్వెరా మాట్లాడుతూ.. నగర మున్సిపల్ శాఖలోని ప్రజాపనుల విభాగంలో గత 15 సంవత్సరాలుగా డ్వేన్ క్రాడిక్ ఇంజనీర్గా సేవలు అందిస్తున్నాడని తెలిపారు. అయితే తన విధుల పట్ల అసంతృప్తిగా ఉన్న డ్వేన్ క్రాడిక్.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు(స్థానిక కాలమానం) సైలెన్సర్ అమర్చిన తుపాకీతో తన కార్యాలయం ఉన్న వర్జీనియా బీచ్ మున్సిపల్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. ఆఫీసులోకి వచ్చేముందు గేటుదగ్గర ఒకరిని తుపాకీతో కాల్చాడు. అనంతరం మున్సిపల్ శాఖ కార్యాలయాలున్న రెండో భవంతిలోకి దూసుకెళ్లాడు. ఆ భవంతిలోని మూడు అంతస్తుల్లోని సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగాడు. గదుల్లో దాక్కున్న ఉద్యోగులు.. ఈ సందర్భంగా కాల్పుల శబ్దం విన్న కొందరు ఉద్యోగులు.. గది తలుపులు మూసేసి 911కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్రాడిక్ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు డ్వేన్ క్రాడిక్ను కాల్చిచంపారు. క్రాడిక్ జరిపిన కాల్పుల్లో ఓ కాంట్రాక్టర్తో పాటు 11 మంది సహోద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. క్రాడిక్ ఈ హత్యలు ఎందుకు చేశాడు? సహోద్యోగులతో ఏమైనా గొడవపడ్డాడా? ఉన్నతాధికారులు మందలించారా? అన్న విషయమై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఇది వర్జీనియాబీచ్ చరిత్రలోనే అత్యంత దుర్దినమని నగర మేయర్ అన్నారు. -
వర్జీనియా బీచ్లో దారుణం
-
అమెరికా: వర్జీనియా బీచ్లో కాల్పుల కలకలం
-
వర్జీనియాలో కాల్పులు..11 మంది మృతి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. వర్జీనియాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన వర్జీనియా బీచ్ ప్రభుత్వ భవనంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. అయితే అతడి గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. గతంలో వర్జీనియా బీచ్లో పనిచేసిన ఉద్యోగే ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి మేగన్ బాంటన్ అనే ఉద్యోగిని మాట్లాడుతూ.. దుండగుడు ఒక్కసారిగా బిల్డింగ్లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. తాము సెకండ్ ఫ్లోర్లో ఉన్నామని... కాల్పుల శబ్దం విని వెంటనే లోపలికి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు. తమ సహచర ఉద్యోగుల్లో కొంతమంది మాత్రం దుండగుడి తూటాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మేయర్ బాబీ డేయర్.. వర్జీనియా బీచ్ చరిత్రలో ఇదొక విధ్వంసకరమైన రోజు అని విచారం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాటా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
వాషింగ్టన్ డిసి : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) ఆధ్వర్యంలో ఆష్బర్న్, వర్జీనియా నగరాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 500 మంది మహిళలకు పైగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. ప్రియ ప్రార్థనా గీతంతో ఈ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం కూచిపూడి డాన్స్ అకాడమీ ట్రినిటీ పంత్ గణేష పంచరత్నాన్ని ప్రదర్శించారు. మాధవీ మైలవరపు బృందం అష్టలక్ష్మి స్తోత్రం ఆలపించారు. సుధ, శ్రీలత, లలిత మహిళా సంబంధిత పాటలు పాడి అలరించారు.శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన ర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది. కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబుకి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లెకి, తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునే రంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లకి, ఐటీ రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలును ఈ సందర్భంగా సన్మానించారు . చైతన్యవంతుల సంబంధించిన ప్రశ్నలు, జయ తెలికుంట్ల, రాధిక జయంతిల వ్యాఖ్యానం, సరదా సరదా ఆటలతో ఈ కార్యక్రమం సాగింది. వసుధారారెడ్డి మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు. చివరగా సంధ్య బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫ్యాషన్ వాక్ ప్రత్యేకత సంతరించుకుంది. నాటా కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, సంధ్య బైరెడ్డిలు, చిత్ర దాసరి, ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా చైతన్య, స్వరూప గిండి, అనిత ,లావణ్య, గౌరి, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్ పాల్గొన్నారు. తానా, అమెరికన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీడీఎప్, జీడబ్యూటీసీఎస్(GWTCS), ఇతర నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు. నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ, ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి, సురేఖ, హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నరాల, మోహన్ కలాడి, బాబూరావు సామల, కిరణ్ గున్నం, నాటా వాషింగ్టన్ డిసి ప్రాంతీయ సభ్యులు మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు, సుజిత్ మారం, రమేష్ వల్లూరి తదితరులు పాల్గొన్నారు. -
తల్లి శవాన్ని 44 రోజులుగా..
వర్జీనియా : తల్లి శవాన్ని 44 రోజులపాటు బ్లాంకెట్స్లో కప్పిపెట్టి దాచిన ఓ అమెరికా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్జీనియాలోని బ్రిస్ట్రోల్లో నివసించే జో-విట్నీ ఔట్లాండ్ (55), తన తల్లి రోజ్మేరి ఔట్లాండ్(78) శవాన్ని 55 బ్లాంకెట్స్లో కప్పిపెట్టి సౌత్వెస్ట్ వర్జీనియాలోని తన ఇంట్లో దాచిపెట్టిందని బ్రిస్టల్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. రోజ్మేరి గత ఏడాది డిసెంబర్ 29నే మృతి చెందిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. తన తల్లి మరణవార్తను విట్నీ ఎవరికి తెలియజేయలేదని, అరెస్ట్ అవుతాననే భయంతోనే ఇలా చేశానని తమ విచారణలో తెలిపిందని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు. తన నివాసంలోని ఓ గదిలో తన తల్లి శవాన్ని దాచిపెట్టిన విట్నీ.. ఆ గదిని లాక్ చేసిందని, బంధువులు తెరవడానికి ప్రయత్నించిన నిరాకరించేదన్నారు. మృతురాలి అల్లుడు విట్నీ మీద అనుమానంతో ఆ గది విండో ఎక్కి చూడటంతో వ్యవహారం వెలుగు చూసిందన్నారు. శవం వాసన రాకుండా 66 ఏయిర్ ఫ్రెషర్స్ను వాడిందని, తల్లి శవం ఉన్న పక్క గదిలోనే నిద్రపోయేదని తెలిపారు. గత మంగళవావరమే విట్నీని అదుపులోకి తీసుకున్నామని, శవాన్ని దాచిన అభియోగాల కింద కేసునమోదు చేశామన్నారు. తన జీవితంలో ఎన్నో ఘోరమైన కేసులు చూసానని, కానీ ఇలాంటి విలక్షణమైన కేసును చూడటం ఇదే తొలిసారి సదరు పోలీస్ అధికారి అభిప్రాయపడ్డాడు. -
కారు.. ఎగిరింది సారు
ఇప్పటివరకూ ఎగిరే కారును డిజైన్లలోనే చూశాం.. ఇదిగో ఇప్పుడు నిజంగా చూసేయండి.. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు నమూనాను బోయింగ్ కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ‘పీఏవీ’ అని పిలుస్తున్నారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టం ఆధారంగా ఇది నడుస్తుంది. ఒకేసారి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. రద్దీగా ఉండే పట్టణాలు, నగరాల్లో దీన్ని ఉపయోగించవచ్చని బోయింగ్ తెలిపింది. దీని పొడవు 30 అడుగులు, వెడల్పు 28 అడుగులు. తొలి టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ అయింది. అంటే.. ఈ కారు ఆకాశంలో జామ్మంటూ దూసుకుపోయే రోజు త్వరలోనే వచ్చేసినట్లే.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అమెరికాలో తెలుగు వ్యక్తి హఠాన్మరణం
వాషింగ్టన్ డీసీ: గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఎన్నారై ప్రవీణ్ తుమ్మపల్లి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. వర్జీనియా రాష్ట్రం వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని అల్దీ నగరంలో నివసిస్తున్న ఆయన ఈ నెల 22న ఛాతినొప్పి వస్తుందంటూ అమాంతం కుప్పకూలారు. ఆస్పత్రికి తీసుకుపోయేలోపే గుండెపోటుతో మరణించారు. నల్గొండ జిల్లా పేర్వాల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ వయస్సు 45 ఏళ్లు. 1990లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఆయన వాషింగ్టన్ డీసీలోని సీజీఐ ఫెడరల్ సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య పావని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ తుమ్మపల్లి మృతిపట్ల అమెరికాలోని తెలుగువారు, ఆయన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు, ఇక్కడి తెలుగువారికి తీరని లోటు అని ప్రవీణ్ ఆప్తమిత్రుడు యుగంధర్రెడ్డి పేర్కొన్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు నల్లగొండలో ఉన్నందున స్వదేశానికి ఆయన భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శనార్థం ప్రవీణ్ భౌతికకాయాన్ని బుధవారం (26న) అలెగ్జాండ్రియాలోని జెఫర్సన్ ఫ్యునరల్ చాపెల్లో ఉంచనున్నామని, ప్రవీణ్ తుమ్మపల్లి భౌతికకాయం అంత్యక్రియల నిమిత్తం గురువారం స్వదేశానికి తరలించే అవకాశం ఉందని ఆయన మిత్రులు తెలిపారు. ప్రవీణ్కు భార్య పావని, 10, 14 ఏళ్ల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
కమెడియన్ రఘుకు తప్పిన ప్రాణాపాయం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ కమెడియన్ కారుమంచి రఘుకు ప్రాణాపాయం తప్పింది. వర్జీనియాలో రఘు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి రఘు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ధ్వంసం అయినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రఘు హాస్యనటుడిగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ షోల్లో కూడా పనిచేశారు. ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్న 'జబర్దస్త్'లో రోలర్ రఘుగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. 2002 లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో కమెడియన్గా పరిచయమైన రఘు అదుర్స్ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. -
యువతుల సమస్యకు పరిష్కారం..
వాషింగ్టన్: ఒంటరిగా నడవటం ఎందుకనుకుందోగానీ భారతీయ సంతతికి చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి చేసిన ప్రయత్నం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సేఫ్ ట్రావెల్ పేరిట ఓ యాప్ను రూపొందించి..యాప్ ఛాలెంజ్కు పంపింది. ‘సమస్య ఉందని నాకు తెలుసు. అందుకే పరిష్కారాన్ని కూడా నేనే కనుగొన్నా’ అని ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను విపరీతంగా ఆకట్టుకుంది. తల్లి సరదాగా అన్నా.. వర్జినియాలోని హెర్న్డోన్కు చెందిన మేధా గుప్తా, థామస్ జెఫ్ఫర్ సన్ హైస్కూల్లో చదువుతోంది. రోజు తన స్కూల్ బస్సు పాయింట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేది. 20 నిమిషాల నడక పెద్ద కష్టంగా అనిపించేది కాదు. అయితే శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుండటంతో ఆమెకు భయంగా అనిపించేది. పైగా ఆ ప్రాంతంలో ఆకతాయిల వేధింపులు చాలా ఎక్కువ. దీంతో ఆమె తల్లి దగ్గర వాపోయింది. వెంటనే ఆ యువతి తల్లి దివ్య గుప్తా ఓ యాప్ తయారు చేయమని చెప్పింది. తల్లి అనుకోకుండా అన్న ఆ మాటలను మేధ సీరియస్గా తీసుకుని, ఒంటరిగా వెళ్లే ప్రయాణికుల కోసం ఓ యాప్ను రూపకల్పన చేసింది. సేఫ్ ట్రావెల్ అని దానికి నామకరణం చేసింది. తొలి ప్రయత్నంలో అది అంతగా విజయం సాధించలేకపోయినా.. తర్వాత మాత్రం అది పని చేయటం ప్రారంభించింది. అది గమనించిన తండ్రి మన్మోహన్ గుప్తా.. ‘కాంగ్రెస్సియోనల్ యాప్ ఛాలెంజ్’కు ఎంట్రీగా ‘సేఫ్ ట్రావెల్’ను పంపాడు. 1300 యాప్లలో విజేతగా.. పోటీలో మొత్తం 4100 స్టూడెంట్లు.. 1300 యాప్లను పంపించారు. ప్రతీ డిస్ట్రిక్ నుంచి ఒక్కో విజేతను నిర్వాహకులు ఎంపిక చేస్తారు. వర్జినీయా నుంచి 200 మందికి పైగానే పోటీ పడ్డారు. చివరకు మేధా గుప్తా యాప్కు అవార్డు దక్కింది. యాప్ రూపకల్పన కోసం మేధా వాడిన సాంకేతికత, ఆమె చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయని న్యాయనిర్ణేత ముర్ఫే ప్రకటించారు. ప్రస్తుతం ఈ యాప్ ఫ్రీ డౌన్లోడ్కు అందుబాటులో లేదు. కానీ, భవిష్యత్తులో ఉంటుందని మేధా చెబుతూ.. ‘మనం ఏదైనా పని చేయాలంటే దానికి అడ్డు మనమే. దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలని మేధా అన్నారు. -
ఒంటరిగా నడవటం ఎందుకని...
వాషింగ్టన్ : ఒంటరిగా నడవటం ఎందుకనుకుందోగానీ 16 ఏళ్ల ఆ అమ్మాయి చేసిన ప్రయత్నం వార్తల్లో నిలిచింది. సేఫ్ ట్రావెల్ పేరిట ఓ యాప్ను రూపకల్పన చేసి యాప్ ఛాలెంజ్కు పంపింది. ‘సమస్య ఉందని నాకు తెలుసు. అందుకే పరిష్కారాన్ని కూడా నేనే కనుగొన్న’ అని ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను విపరీతంగా ఆకట్టుకుంది. వర్జినియాలోని హెర్న్డోన్కు చెందిన మేధా గుప్తా, థామస్ జెఫ్ఫర్ సన్ హైస్కూల్లో చదువుతోంది. రోజు తన స్కూల్ బస్సు పాయింట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేది. 20 నిమిషాల నడక ఆమెకు పెద్ద కష్టంగా అనిపించేది కాదు. అయితే శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుండటంతో ఆమెకు భయంగా అనిపించేది. పైగా ఆ ప్రాంతంలో ఆకతాయిల వేధింపులు చాలా ఎక్కువ. దీంతో ఆమె తల్లి దగ్గర వాపోయింది. వెంటనే ఆ యువతి తల్లి దివ్య గుప్తా ఓ యాప్ తయారు చేయమని చెప్పింది. తల్లి అనుకోకుండా అన్న ఆ మాటలను మేధ సీరియస్గా తీసుకుంది. ఒంటరిగా వెళ్లే ప్రయాణికుల కోసం ఓ యాప్ను రూపకల్పన చేసింది. సేఫ్ ట్రావెల్ అని దానికి నామకరణం చేసింది. తొలి ప్రయత్నంలో అది అంతగా విజయం సాధించలేకపోయినా.. తర్వాత మాత్రం అది పని చేయటం ప్రారంభించింది. అది గమనించిన తండ్రి మన్మోహన్ గుప్తా.. ‘కాంగ్రెస్సియోనల్ యాప్ ఛాలెంజ్’కు ఎంట్రీగా ‘సేఫ్ ట్రావెల్’ను పంపాడు. పోటీలో మొత్తం 4100 స్టూడెంట్లు.. 1300 యాప్లను పంపించారు. ప్రతీ డిస్ట్రిక్ నుంచి ఒక్కో విజేతను నిర్వాహకులు ఎంపిక చేస్తారు. వర్జినీయా నుంచి 200 మందికి పైగానే పోటీ పడ్డారు. చివరకు మేధా గుప్తా యాప్కు అవార్డు దక్కింది. యాప్ రూపకల్పన కోసం మేధా వాడిన సాంకేతికత, ఆమె చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయని న్యాయనిర్ణేత ముర్ఫే ప్రకటించారు. ప్రస్తుతం ఈ యాప్ ఫ్రీ డౌన్లోడ్కు అందుబాటులో లేదు. కానీ, భవిష్యత్తులో మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తానని మేధా చెబుతోంది. ‘మనం ఏదైనా పని చేయాలంటే దానికి అడ్డు మనమే. అందుకే దేన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలి’ అని మేధా చెబుతోంది. -
అమెరికాలో దారుణం.. ఇద్దరు ప్రవాసీల హత్య
-
అమెరికాలో దారుణం.. ఇద్దరు ప్రవాసీల హత్య
వాషింగ్టన్ : అమెరికాలో దారుణం జరిగింది. భారతీయ సంతతి మహిళను, ఆమె కుమారుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. వాషింగ్టన్లోని వర్జీనియా సబర్బ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఆ ఇద్దరు మాలా మన్వానీ (65), రిషి మన్వానీ (32)అనే భారతీయ అమెరికన్లు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని విచారిస్తున్నారు. తల్లి కొడుకులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారని, జాతి విద్వేష హత్య అని తాము అనుకోవడం లేదని పోలీసులు చెప్పారు. 'అధికారులు వారి నివాసాన్ని తనిఖీలు చేశారు. ఇంటి లోపలే మృతదేహాలు పడి ఉన్నాయి. శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. దోషులను కచ్చితంగా పట్టుకొని తీరతాం. ఈ ఘటన ద్వారా పబ్లిక్ అంతగా భయపడాల్సిందేమి లేదు' అని అధికారులు తెలిపారు. -
షాకింగ్ : యజమానిని చంపేసిన పెంపుడు కుక్కలు
గూచ్లాండ్ : విశ్వాసానికి మారు పేరుగా చెప్పుకునే పెంపుడు కుక్కలే ఆ యజమానురాలి పాలిట క్రూరమృగాలయ్యాయి. అత్యంత దారుణంగా ఆమె పీకను కొరికేసి ప్రాణాలు తోడేశాయి. ఎన్నెన్నో కేసులు చేధించిన పోలీసులు సైతం బిత్తరపోయేలా చేసిన ఈ గటన అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని గూచ్లాండ్లో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. కుక్కలతో మార్నింగ్ వాక్కు వెళ్లి.. : బెతాని లిన్ స్టీఫెన్స్ అనే 22 ఏళ్ల యువతి.. గురువారం(డిసెంబర్ 14) ఉదయం పెంపుడు కుక్కలు రెండింటిని వాకింగ్కు తీసుకెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు తలా ఓ దిక్కుకు వెళ్లి గాలించారు. తర్వాతి రోజు (శుక్రవారం) ఉదయం.. ఇంటికీ కిలోమీటర్ దూరంలో కుక్కలను గుర్తించాడు బెతాని తండ్రి. ‘ కుక్కలు నిల్చున్న చోట ఏదో జంతువు పడిపోయి ఉన్నట్లు అనిపించింది. తీరా దగ్గరికి వెళ్లాక ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయా’ అని ఆ తండ్రి చెప్పుకొచ్చాడు. పలు కోణాల్లో దర్యాప్తు : పిట్ బుల్ జాతికి చెందిన ఆ రెండు కుక్కలే బెతాని పీక కొరికి, ముఖాన్ని రక్కేసి చంపేశాయని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. కుక్కల దాడి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో మృతురాలి చేతులకు కూడా తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. నమ్మశక్యంకాని ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు దర్యాప్తు అధికారులు పలు కోణాల్లో పరిశీలన చేశారు. బెతానిని ఎవరైనా హత్యచేసి ఉంటారనిగానీ, లేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని, వైద్యులు నిర్ధారించినట్లు కుక్కలే ఆమెను కొరికి చంపేశాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదని, ఇకపై చూడకూడదని అనుకుంటున్నట్లు దర్యాప్తు బృందంలోపి అధికారి ఒకరు అన్నారు. ఆ కుక్కలను చంపేయండి : తమ గారాలపట్టి బెతాని ప్రాణాలు పోవడానికి కారణమైన పెంపుడు కుక్కలను తక్షణమే అంతం చేయాలని ఆమె కుటుంబీకులు అధికారులను కోరారు. అయితే, బెతాని స్నేహితులు మాత్రం దర్యాప్తు ముగింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు కుక్కలూ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ బెతానికి అలవాటేనని, ఏనాడూ ఆమెకు హానిచెయ్యని జంతువులు.. ఇప్పుడు చంపేశాయంటే నమ్మశక్యంగా లేదని, కేసులో తేలాల్సిన విషయం ఇంకేదో ఉందని అంటున్నారు. బెతాని స్నేహితుల వాదనను దర్యాప్తు అధికారులు తోసిపుచ్చారు. -
అదృష్టం అంటే ఆమెదే!.
జీవితంలో ఒక్కసారైనా లాటరీ తగులుతుందేమోనని ఎదురుచూడని వారు ఉండరు. ఒక్కసారి లాటరీ తగిలితే చాలు జీవితాలు మారిపోతాయని అనుకుంటారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు. నూటికో కోటికో ఒకరి వస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు మాత్రం అదృష్టం ఓరేంజ్లో ఉంది. ఒకసారి లాటరీ తగులుతుందో లేదో అని ఆశగా చూసే వారు అసూయ పడేలా వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వర్జీనియాకు చెందిన బ్రెండా జెంట్రీ అనే మహిళ వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు లాటరీలు గెలుచుకుంది. వర్జీనియా లాటరీ సంస్థ వెబ్సైట్ నిర్వహించిన లాటరీలో ఏకంగా మూడు సార్లు రూ. 3,26,000, రూ.32,600, రూ.32,59,62,500 చొప్పున పెద్ద మొత్తంలో నగదు గెలుచుకుంది. గెలుచుకున్న మొత్తాన్ని 30 ఏళ్లపాటు వాయిదా పద్దతిలో చెల్లించాలా లేదా ఏకకాలంలో తీసుకుంటారా అని నిర్వాహకులు అడుగ్గా.. ఆమె మొత్తం ఒకేసారి కావాలని కోరింది. ఒక్కసారి అంత మొత్తం రావడంతో జెంట్రీ ఒకింత సంభ్రమాశ్చర్యాలకు గురైంది. తన ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేనని తెలిపింది. అంత మొత్తంలో డబ్బు వచ్చినా తన జీవన శైలిలో మార్పు ఉండదని, గతంలో ఎలా ఉన్నానో భవిష్యత్తులో అలాగే ఉంటానని పేర్కొంది. -
హిమాన్వికి అందాల కిరీటం
వర్జీనియా : భారత సంతతికి చెందిన హిమాన్వి పనిదెపు(17)ని మిస్ వర్జీనియా టీన్ యూఎస్ఏ 2018 టైటిల్ వరించింది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి ఇండియన్ అమెరికన్గా ఆమె నిలిచారు. హిమాన్వి క్లిఫ్టన్లోని సెంట్రెవిల్లె హైస్కూల్లో చదువుకుంటున్నారు. 39 మంది యువతులతో పోటీ పడి ఈ అందాల కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. డౌన్ టౌన్ నార్ఫోక్లోని టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలోని రోపర్ థియేటర్లో మిస్ వర్జీనియా టీన్ యూఎస్ఏ 2018 టైటిల్ను హిమాన్వికి బహుకరించారు. మానసిక ఆరోగ్యం, డ్రగ్స్, ఆల్కహాల్లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హిమాన్వి తనవంతుగా వర్జినియాలో కృషి చేస్తున్నారు. 'నా కల నెరవేరింది. ఈ కిరీటం సాధించడంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు' అని హిమాన్వి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. -
అమెరికాలో మళ్లీ భగ్గుమన్న అహంకారం
- వర్జీనియాలో ఘర్షణలు.. ముగ్గురి మృతి - రణరంగంలా చార్లెట్విల్ సిటీ.. ఎమర్జెన్సీ ప్రకటన - అమెరికాను చేజిక్కించుకుందామంటూ అతివాదుల ర్యాలీ - ప్రతిగా ‘అమెరికా ఒక్కటే’నంటూ మితవాదుల భారీ ప్రదర్శన - శాంతి, సహనం పాటించాలని అధ్యక్షుడు ట్రంప్ పిలుపు - ర్యాలీని పర్యవేక్షిస్తూ కూలిన పోలీస్ హెలికాపర్ట్ చార్లెట్విల్: అమెరికాలో మరోసారి అహంకార జ్వాలలు ఎగిసిపడ్డాయి. వర్జీనియా రాష్ట్రంలోని స్వతంత్ర నగరం చార్లెట్విల్లో.. అతివాద శ్వేతజాతీయులకు, మితవాదులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ‘యురోపియన్ వలసవాదుల నుంచి అమెరికాను చేజిక్కించుకుందాం..’ అంటూ అతివాదులు నినాదాలు చేయగా, ‘అమెరికన్లంతా ఒక్కటే’నని మితవాదులు గర్జించారు. శుక్ర, శనివారాల్లో చార్లెంట్విల్ లోని పార్కులు, వీధులు అనుకూల, వ్యతిరేక నినాదాలతో మారుమోగిపోయాయి. అసలేం జరిగింది?: దక్షిణాది జాతీయవాదానికి గుర్తుగా ఉన్న ‘కాన్ఫెడరేట్ పాస్ట్ స్మారకచిహ్నం(రాబర్ట్.ఈ.లీ విగ్రహం)ను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా నుంచి తొలగించాలన్న స్థానిక కౌన్సిల్ నిర్ణయమే తాజా ఘర్షణలకు మూలకారణమని భావిస్తున్నారు. తాము గర్వకారణంగా భావించే స్మారకచిహ్నాన్ని తొలగించవద్దంటూ కరడుగట్టిన శ్వేతజాతీయులు కొందరు ఉద్యమం మొదలుపెట్టారు. ఇది క్రమంగా యూరోపియన్,ఆఫ్రికన్ వలసదారులపై విద్వేషంగా మారింది. ‘మొదటి నుంచి అమెరికాలో ఉంటున్న తమపై యూరప్ నుంచి వచ్చిన వలసదారులు పెత్తనం చెలాయిస్తున్నార’ని ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘అమెరికాను తిరిగి చేజిక్కించుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ను గెలిపించింది శ్వేతజాతీయులే : నిరసనకారులకు నేతృత్వం వహించిన వారిలో ప్రముఖుడైన డేవిడ్ డ్యూక్(వివాదాస్పద ‘కు క్లక్స్ క్లాన్’ మాజీ నాయకుడు) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్.. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నువ్వు గెలిచింది మా(శ్వేతజాతీయుల) ఓట్లతోనేకానీ ఆ ర్యాడికల్ లెఫ్టిస్టుల ఓట్లతో కాదన్న విషయం గుర్తుంచుకో’ అని అన్నారు. మితవాదుల ర్యాలీపై కారు దాడి: శ్వేతజాతి అతివాదులకు వ్యతిరేకంగా శనివారం మితవాదులు భారీ ర్యాలీని చేపట్టారు. వర్జీనియాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చార్లెట్విల్లోని ఒక వీధిలో కిక్కిరిసిఉన్న మితవాదులపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి, విచక్షణారహితంగా తొక్కేసి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన అతివాద బృంద సభ్యుడిని పోలీసులు అరెస్ట్చేశారు. ట్రంప్ విన్నపం: చార్లెట్విల్లో విద్వేషప్రదర్శనలు, హింస చోటుచేసుకోవడంపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అధ్యక్షుడు ట్రంప్ శనివారం వైట్హౌస్లో మాట్లాడుతూ శాంతిని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘విద్వేష దాడులు గర్హనీయం. మనమంతా ఒక్కటే. అమెరికన్లలో బేధాలు లేవు. సహనం పాటించండి. శాంతివహించండి..’ అని వ్యాఖ్యానించారు. కూలిన హెలికాప్టర్.. పోలీసులపై విమర్శలు: చార్లెట్విల్లో ఆందోళనలను జరుగుతున్న ప్రాంతాలలో గగనతలం నుంచి గస్తీ కాస్తోన్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్తోపాటు ఒక అధికారి దుర్మరణం చెందారు. కాగా, ఆందోళనకారులను అదుపుచేయడంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శించారని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. అతివాదులు, మితవాదులు పరస్పరం ఘర్షణపడకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందునే పరిస్థితి విషమించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
రిపబ్లికన్ నేతపై కాల్పుల కలకలం
► అగ్రనేత స్కేలీస్ సహా ఐదుగురికి గాయాలు వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్ సభ్యులు బేస్బాల్ సాధన చేస్తున్న సమయంలో ఓ సాయుధుడు ఈ ఘాతుకానికి పాల్పడటంతో కనీసం ఐదుగురికి గాయాలయ్యాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్బాల్ మైదానంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్తో పాటు మరో ఎంపీ రోజర్ విలియమ్స్ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న ఓ సాయుధుడు మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు మరణించాడు. ఈ సంఘటనలో తుంటికి గాయం కావడంతో జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్కేలీస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రతినిధుల సభలో విప్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్కేలీస్ను రిపబ్లికన్ల నంబర్.3 నాయకుడిగా పరిగణిస్తారు. 2008లో ఆయన తొలిసారి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అక్కడ సాధన చేస్తున్న రాజకీయ నాయకులు రిపబ్లికన్లా? డెమొక్రాట్లా ? అని కాల్పులకు ముందు దుండగుడు విచారించినట్లు తెలుస్తోంది. -
అమెరికాలో కాల్పుల మోత..!
ప్రజాప్రతినిధులపై పేలిన తూటా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్కు సమీపంలోని వర్జినీయా ప్రాంతంలో ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం బేస్బాల్ ఆట ఆడుతుండగా రైఫిల్ తో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ప్రతినిధుల సభ మెజారిటీ విప్, రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ గాయపడ్డాడు. పలువురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. సాయుధుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్వేతజాతీయుడైన ఓ సాయుధుడు రైఫిల్తో ప్రజాప్రతినిధులు బేస్బాల్ ఆడుతున్న మైదానానికి వచ్చి కాల్పులకు దిగాడని, దీంతో అక్కడ ఒక్కసారిగా 50 నుంచి వందరౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షి అయిన అలబామా ప్రజాప్రతినిధి మో బ్రూక్స్ తెలిపారు. ఈ కాల్పులతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని చెప్పాడు. రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ పిరుదు భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, అదేవిధంగా ఈ కాల్పుల్లో చట్టసభ సిబ్బంది, పోలీసులు కూడా గాయపడ్డారని ఆయన సీఎన్ఎన్ చానెల్కు తెలిపారు. -
ఈవారం విశేషాల రౌండప్
గ్రౌండ్ అప్ పనిలేని దొంగ! వర్జీనియాలోని వేనెస్బరో పోలీసులు, ఆ గ్రామ ప్రజలు కొద్ది రోజులుగా ఒక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడు దొరికితే ఒక పట్టుపడదామని చూస్తున్నారు! అయితే ఆ ఆగంతకుడు దొరకడం లేదు సరి కదా, అతడు దొంగిలించి తీసుకెళుతున్న పెంపుడు పిల్లులు మాత్రం సాయంత్రానికో, రెండో రోజు ఉదయానికో క్షేమంగా ఇళ్లకు చేరుతున్నాయి?! మామూలుగా ఇల్లు చేరిన పెంపుడు పిల్లిని ఎవరూ పట్టించుకోరు. మహా అయితే.. ‘ఎక్కడ తిరిగొచ్చావే’ అని ముద్దుగా కోప్పడతారు. అయితే ఈ పిల్లులు.. పొట్ట కింద, కాళ్ల మధ్య భాగంలో వెంట్రుకలు లేకుండా ఇంటికి తిరిగొస్తున్నాయి. అంటే.. ఎవరో వీటికి షేవ్ చేసి పంపిస్తున్నారు. అది కూడా ఆ ఒక్క భాగంలో. ఇలా.. ఏడు సంఘటనలు వరసగా జరగ్గానే.. ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చి, అగంతకుడిపై నిఘా వేశారు. లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ దొంగ దొరకలేదు. వాడి ఉద్దేశం ఏమిటో కూడా అంతచిక్కడం లేదు. పనిలేక పిల్లి తల గొరగడం అనే సామెత ఉంది. ఇక్కడ పనిగట్టుకుని ఆ దొంగ గొరిగి పంపిస్తున్న తీరు వేనెస్బరో పిల్లుల యజమానులకు కోపంతో పాటు నవ్వూ తెప్పిస్తోందట! ఇంకో సంగతి ఏంటంటే... బయటికి వెళ్లి, షేవింగ్ తో వచ్చిన పిల్లులు కాస్త నర్వస్గా బిహేవ్ చేస్తున్నాయట. ఆ దొంగ ఎవరో దొరికితే అంతా కలిసి అతడికి తల గొరిగించేలా ఉన్నారు. అల్లారు ముద్దు పాపాయి అతడి పేరు బిలాల్ వాక్. ఆమె పేరు ఎలిజబెత్ హ్యాండీ. వాళ్లిద్దరికీ ఓ ముద్దుల కూతురు. వయసు 22లలు. ఇంకా పేరు పెట్టలేదు. చీకూచింతా లేని ఈ చిన్న కుటుంబం జార్జియాలో ఉంటోంది. జార్జియా అని ఐరోపాలో ఒక దేశం ఉంది. ఆ జార్జియా కాదు. యు.ఎస్లో జార్జియా అనే రాష్ట్రం ఉంది. ఆ జార్జియాలో ఉంటున్నారు. పాపకు ఏ పేరైతే బాగుంటుందీ అని దంపతులిద్దరూ దీర్ఘంగా ఆలోచించారు. ‘అల్లా’ అని పేరు పెట్టారు. అయితే అధికారులు ఒప్పుకోలేదు.‘‘తల్లి పేరులో గానీ, తండ్రి పేరులో గానీ ‘అల్లా’ అని లేదు. కనుక జార్జియా చట్టాల ప్రకారం అలా కుదరదు’’ అనేశారు! బిలాల్, ఎలిజబెత్ షాక్ తిన్నారు. ‘మా పాప, మా ఇష్టం’ అన్నారు. పౌరహక్కుల వాళ్లను కలిశారు. కోర్టులో కేసు వేశారు. చివరికి ఏమైంది? కేసు గెలిచారు. వాళ్లు కోరుకున్నట్లే ‘అల్లా’ పేరిట బర్త్ సర్టిఫికెట్ వచ్చింది! అయితే ఇలా అల్లా అనే పేరు ఓకే చెయ్యడం అక్కడి ముస్లిం పెద్దలు కొందరికి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ ముస్లింలు కానప్పుడు బిడ్డకు ముస్లిం పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. కోటి... టైటానిక్ కోటు! ఫర్ కోట్.. అంటే.. జంతువుల చర్మంతో చేసిన కోటు. ఆ కోటు ఒకటి ఈవారం యు.కె. వేలంలో 1,50,000 పౌండ్లకు (కోటీ 24 లక్షల 76 వేల రూపాయలు) అమ్ముడుపోయింది. అది వందేళ్ల క్రితం నాటిది. అప్పుడు దాని ధర 80,000 పౌండ్లు. అంటే ఇప్పటి విలువ ప్రకారం 66 లక్షల 54 వేల రూపాయలు. వందేళ్ల క్రితం నాటిది అవడం ఒక్కటే ఈ కోటు ప్రత్యేకత కాదు. మాబెల్ బెనెట్ అనే 33 ఏళ్ల మహిళ కోటు అది. ఆమె ఆ కోటును «ధరించి 1912లో టైటానిక్ నౌక ఎక్కారు. ఆ ప్రయాణంలో నౌక మునిగిపోవడం, సుమారు 1500 మంది మరణించడం తెలిసిందే. ఆ దుర్ఘటనలో బతికి బట్టకట్టినవాళ్లులో మాబెల్ ఒకరు. ఆ తర్వాత ఆమె తన 96 ఏళ్ల వయసులో 1974లో సహజ మరణం పొందారు. అంతకాలం బతికి ఉన్న టైటానిక్ మహిళా సిబ్బంది ఈమె ఒక్కరే. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో ఈ కోటుకు అంత విలువ దక్కింది. సూర్యుడు చంద్రుడౌతాడు! వచ్చే జూన్లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఆ సందర్భంగా యు.ఎస్. తపాలా శాఖ త్వరలో ‘టచ్ స్టాంప్’లను విడుదల చేయబోతోంది. వేలితో ఆ తపాలా బిళ్లను టచ్ చేస్తే చాలు.. ఆ వేలు వేడికి గ్రహణం పట్టిన సూర్యుడు.. నిండు చంద్రుడిగా మారిపోతాడు. స్టాంప్ పై నుంచి వేలు తీయగానే మళ్లీ గ్రహణం పట్టిన సూర్యుడు ప్రత్యక్షమైపోతాడు. ‘టెంపరేచర్ సెన్సిటివ్ ఇంక్’ను ఉపయోగించి ఈ టచ్ స్టాప్ను తయారుచేస్తున్నారు. ఈ 49 సెంట్ల విలువగల స్టాంపు జూన్లో బయటికి వస్తుంది. -
ప్రత్యేక హోదా ఏపీ హక్కు : ప్రవాసాంధ్రులు
వాషింగ్టన్ డీసీ: ప్రత్యేక హోదా-ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ ప్రవాసాంధ్రులు నినదించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో యువత చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీకి ప్రవాసాంధ్రులు మద్దుతుగా నిలిచారు. వర్జీనియాలోని ఫ్రైయింగ్ పాన్ పార్కు దగ్గర కొవ్వొత్తులతో ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని ప్రవాస ఆంధ్రులు నిరసన తెలిపారు. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో ఉన్న తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నది ఏదో ఓ పార్టీకి చెందిన అంశం కాదని, ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి సంబంధించిన విషయం అని ఎన్ఆర్ఐలు తెలిపారు. తిరుమల దేవ దేవుని సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను నిలుపుకొని, మాట తప్పని వాడిగా చరిత్ర పుటల్లో మిగిలి పోవాలని వారు పేర్కొన్నారు. జల్లికట్టు ఆటని సుప్రీం కోర్టు రద్దు చేస్తేనే కేంద్ర ప్రభుత్వాన్ని తమిళ సోదరులు కదిలించగాలేనిది... మనకు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రత్యేక హోదాని తెలుగువారందరం కలిసి సాధించుకోలేమా? అని ఎన్ఆర్ఐలు ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఏపీకి అన్యాయం చేయాలనుకుంటున్న ప్రభుత్వాలను నిలదీద్దాం. నిలదీసేవారికి మద్దతుగా నిలబడదాం. రండి కదిలిరండి ప్రత్యేక హోదా సాధన కోసం అని గళం విప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్య నిర్వాహకులు సురేంద్ర బత్తినపట్ల, వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ మిడ్ అట్లాంటిక్ సలహాదారు, రీజినల్ ఇంచార్జీ రమేష్ రెడ్డి వల్లూరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
తెరపైకి ట్రంప్ కోడలు
ఆష్ బర్న్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గుచూపుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్... ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధాని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొన్నారు. పనిలో పనిగా తన మామగారికి ఓటు వేయాలని ప్రవాస భారతీయులను అభ్యర్థించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. భారతదేశం అన్నా, భారతీయులన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పారు. భారతీయ సంస్కృతిని తాను ఎంతోగానే గౌరవిస్తానని పేర్కొంటూ చెప్పులు బయట విడిచిపెట్టి ఆమె ఆలయంలోకి ప్రవేశించారు. హిందూ సాంప్రదాయాలు అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ భార్య అయిన లారా చెప్పారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇక్కడికి రావాల్సివుంది. అయితే ఆమె వేరే చోటికి వెళ్లాల్సిరావడంతో లారా ఈ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులకు చెందిన కుటుంబంలోని సభ్యురాలు హిందూ ఆలయానికి రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. లారాకు ప్రవాస భారతీయ సంఘం నేత రాజేశ్ గూటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానికులతో మమేకం అయేందుకు పండుగలు దోహం చేస్తాయని పేర్కొన్నారు. -
అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి
వర్జీనియా: అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని షన్నన్ విమానాశ్రయంలో ఓ చిన్న ప్రైవేటు విమానం కూలి ఆరుగురు మృతి చెందారు. విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ టేక్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. రన్ వే దక్షిణ చివరన ఉన్న చెట్లపై విమానం ల్యాండ్ అయిందని, విమానం చెట్లపై పడగానే వెంటనే మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. మృతదేహాలను బయటకు తీశామని, మృతుల వివరాలు తెలియరాలేదన్నారు. కేసును ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తున్నాయి. -
కుప్పకూలిన విమానం.. ఆరుగురి మృతి
అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో ప్రైవేటు విమానం చెట్లలో కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. షానన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ఈ విమానం ప్రయత్నిస్తుండగా కూలిపోయినట్లు వర్జీనియా పోలీసులు తెలిపారు. అయితే విమానం ఎందుకు కూలిపోయిందన్న విషయం ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నం చేసి, ఆ తర్వాత సాంకేతిక లోపాలతో ల్యాండింగ్ వదిలేసి ఉంటారని పోలీసు ప్రతినిధి లెస్ టైలర్ తెలిపారు. తిరిగి ఎగిరేందుకు ప్రయత్నించే క్రమంలో చెట్లను ఢీకొందని, దాంతో మంటలు చెలరేగి అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు మరణించారని చెప్పారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వాళ్లు వర్జీనియా ప్రాంతానికి చెందినవారు మాత్రం కాదని అధికారులు చెప్పారు. -
సచ్చిదానంద ఆశ్రమంలో రజనీకాంత్
ఒకవైపు దేశం ’కబాలి’ మానియాలో మునిగిపోయి.. అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తన సహజ ఆధ్యాత్మిక ధోరణిలో అమెరికాలోని సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన వెంట కూతురు సౌందర్యా ధనుష్ కూడా ఉన్నారు. 1980లో వర్జీనియాలో ఏర్పాటైన సచ్చిదానంద ఆశ్రమాన్ని యోగావిల్లే అని కూడా పిలుస్తారు. యోగిరాజ్ శ్రీ స్వామి సచ్చిదానంద ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 1969లో వూడ్స్టాక్ ఫెస్టివల్ లో ప్రారంభ ఉపన్యాసం చేసిన సచ్చిదానంద పాశ్చాత్యులకు ఆధ్యాత్మికవేత్తగా సుప్రసిద్ధులు. 65 ఏళ్ల రజనీకాంత్ దాదాపు నెలకిందట అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శుక్రవారం కబాలి సినిమా విడుదల అవుతుండటంతో రజనీ తిరిగి ఇండియా వచ్చారు. అమెరికా పర్యటనలో తన ఆధ్యాత్మిక గురువు సచ్చిదానందకు చెందిన ‘లోటస్ ఆల్ ఫెయిత్స్ టెంపుల్’ను రజనీ సందర్శించారని ఆయన కూతురు సౌందర్య ట్విట్టర్లో తెలిపారు. -
అమెరికాలో ఎన్నారైకు జైలు
వాషింగ్టన్: మోసం కేసులో భారత సంతతికి చెందిన తార్సెమ్ సింగ్ అనే వ్యక్తికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. వర్జినియాలోని ఫెయిర్ ఫాక్స్ లో నివాసముంటున్న 61 ఏళ్ల తార్సెమ్ సింగ్ వ్యాపారం పేరుతో 6 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డాడు. 2000-2009 మధ్య కాలంలో తార్సెమ్ సింగ్, అతడి భార్య నిర్మాణ కంపెనీ పెట్టి పలు కాంట్రాక్టులు దక్కించుకుని మోసం చేశారు. ఈ కేసులో గతేడాది డిసెంబర్లో కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. ఇప్పుడు శిక్ష ఖరారు చేసింది. అతడికి 15 నెలల కారాగార శిక్షతో పాటు 25 వేల డాలర్ల జరిమానా విధించింది. 119,165 డాలర్లు తిరిగి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మూడేళ్ల పాటు అతడిని కనిపెట్టి చూస్తుండాలని పోలీసులకు సూచించింది. శిక్ష ముగిసిన తర్వాత సమాజసేవ చేయాలని తార్సెమ్ సింగ్ ను కోర్టు ఆదేశించింది. -
ఫ్లైట్లో జిహాద్ అంటూ కాక్ పీట్ వైపు దూసుకెళ్లి..
అలెగ్జాండ్రియా(వర్జీనియా): విమానం వెళుతుండగా జిహాద్ అంటూ అరుస్తూ కాక్పీట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అమెరికా కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్షను విధించింది. గత ఏడాది మార్చి 2015న 36 ఏళ్ల డేవిడ్ ప్యాట్రిక్ డియాజ్ అనే వ్యక్తి డల్లెస్ నుంచి డెన్వెర్కు బయలుదేరాడు. తొలుత అందరితోపాటు కుదురుగా కూర్చున్న అతడు ఫ్లైట్ బయలుదేరి గగనతలానికి వెళ్లిన కాసేపటికి జిహాద్ అంటూ బిగ్గరగా కేకలు పెడుతూ కాక్ పీట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సిబ్బంది ఉన్నపలంగా అతడిని బంధించి తిరిగి విమానాన్ని వెనక్కితిప్పి వర్జీనియాలోని డల్లెస్ ఎయిర్ పోర్ట్ లో దింపేశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. అయితే, అతడి తరుపు న్యాయవాది అలెగ్జాండ్రియా కోర్టులో వాదిస్తూ అతడు ఆ సమయంలో మద్యం సేవించిన కారణంగా మానసికంగా బలహీనుడయ్యాడని అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. అయితే, ఎయిర్ లైన్స్ తరుపు న్యాయవాది మాత్రం అతడికి కనీసం 21 నెలలు జైలు శిక్ష విధించాలని కోరారు. కాగా, న్యాయమూర్తి మాత్రం తొమ్మిది నెలల శిక్ష విధించడంతోపాటు 22 వేల డాలర్ల ఫైన్ వేశారు. -
కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు
వర్జీనియా: లైవ్ రిపోర్ట్ చేస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులపై కాల్పులు జరిపిన అగంతకుడు అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వర్జీనియాలో బుధవారం చోటుచేసుకుంది. టీవీ జర్నలిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారి చావుకు కారకుడైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన వివరాలు.. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్లు మౌంటేన్లేక్కు సమీపంలోగల బ్రిడ్జ్వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే ఆ బిల్డింగ్ లోకి చొరబడ్డ సాయుధుడు.. రిపోర్టర్, కెమెరామెన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. సాయుధుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్.. కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. అయితే దుండగుడు ప్లాజా బిల్డింగ్ లోనే దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలు సహా వ్యాపార సముదాయాలు తెరవొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా నిందితుడు తనను కాల్చుకుని మృతిచెందాడని పోలీసులు తెలిపారు. -
లైవ్ ప్రోగ్రామ్లో ఇద్దరు జర్నలిస్టుల కాల్చివేత
అమెరికాలో దారుణం జరిగింది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆగంతకుడు కాల్చిచంపాడు. కెమెరా కిందపడిపోవడంతో కాల్పుల దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ఫోర్డ్ కౌంటీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:45 నిమిషాలకు) ఈ సంఘటన జరిగింది. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్లు మౌంటేన్లేక్కు సమీపంలోగల బ్రిడ్జ్వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే ఆ బిల్డింగ్ లోకి చొరబడ్డ సాయుధుడు.. రిపోర్టర్, కెమెరామెన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. సాయుధుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్.. కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. దుండగుడు ఇంకా ప్లాజా బిల్డింగ్ లోనే దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలు సహా వ్యాపార సముదాయాలు తెరవొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
వర్జీనియాలో ఫ్రొ.జయశంకర్ కు ఘన నివాళులు
వర్జినియా: దివంగత ఫ్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకను యూఎస్ లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్), వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఘనంగా నిర్వహించింది. వర్జీనియాలోని స్వదేశ్ బాంకెట్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ దర్శకుడు వడ్డెపల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు అతిధులుగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ అందించిన స్పూర్తిని ఈ కార్యక్రమంలో అతిధులు కొనియాడారు. అభిమానులు, తెలంగాణవాదులు, టీడీఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా ఫ్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించారు. -
ఎన్నారై వైద్యుడుకి ప్రతిష్టాత్మక పురస్కారం
అమెరికాలో ఎన్నారై వైద్యుడు, ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ రాహుల్ జిందాల్ ప్రతిష్టాత్మక 'అవుట్ స్టాండింగ్ అమెరికన్ బై ఛాయస్' పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్లో వైద్య రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ అవార్డుకు ఎంపిక చేసినట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) శనివారం వెల్లడించింది. యూఎస్లోని భారతీయ సమాజాన్నే కాకుండా అమెరికన్ ప్రజలకు కూడా రాహుల్ అందించిన సేవలు నభూతోనభవిష్యత్తు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ నెల 13న వర్జీనియాలోని అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రిలో జరిగే కార్యక్రమంలో ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాహుల్ కు అందజేస్తామని వివరించింది. ఇటీవలే ఇంటర్నేషనల్ లీడర్ షిప్ ఫౌండేషన్ నుంచి రాహుల్ జిందాల్ లీడర్షిప్ అవార్డుకు కూడా అందుకున్నారు. సర్వీస్ అండ్ వాలంటరీజమ్ కమిషనర్గా రాహుల్ జిందాల్ ను ఆ ఫౌండేషన్ నియమించిన సంగతి తెలిసిందే. వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జార్జీయా వాషింగ్టన్ యూనివర్శిటీలో క్లీనికల్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీలో ఎండీ విద్యను రాహుల్ జిందాల్ అభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లారు. ఆ క్రమంలో అమెరికాలో స్థిరపడ్డారు. సమాజసేవలో భాగంగా ఉత్తర అమెరికాలో దాదాపు 600 దేవాలయాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.