Vishnu Manchu
-
ముంబైలో 'కన్నప్ప' టీజర్ లాంచ్ హాజరైన అక్షయ్ కుమార్ (ఫొటోలు)
-
కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్ కుమార్
‘‘కన్నప్ప’(Kannappa) మూవీ అవకాశాన్ని రెండు సార్లు తిరస్కరించాను. కానీ, భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా ఒప్పుకునేలా చేసింది. చాలా శక్తిమంతమైన కథ ఇది. లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా ఉంది’’ అని అక్షయ్ కుమార్ తెలిపారు. విష్ణు మంచు(Vishnu Manchu) హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’.ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. గురువారం ముంబైలో ‘కన్నప్ప’ టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’ కేవలం ఓ సినిమా కాదు.. నా జీవిత ప్రయాణం.కన్నప్ప కథతో నాకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది’’ అని చెప్పారు. ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ–‘‘విష్ణు, అక్షయ్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలను డైరెక్ట్ చేయడం అద్భుతమైన అనుభవం. వారి పాత్రలు తెరపై అద్భుతం చేయబోతున్నాయి’’ అన్నారు. ఈ ఈవెంట్లో చిత్ర ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి పాల్గొన్నారు. -
'శివ శివ శంకరా..' సాంగ్కు 80 మిలియన్ల వ్యూస్
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నప్పపాత్రను విష్ణు మంచుపోషించగా, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. మోహన్బాబు, మోహన్లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్యపాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘శివ శివ శంకరా...’ అనేపాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్గా నిలిచినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘శివ శివ శంకరా’పాటని ఇప్పటికే 80 మిలియన్ల (8 కోట్లు) మంది వీక్షించారు. ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు ప్రజలు ఈపాటని ఆదరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈపాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి సందర్భంగా ఈ సాంగ్ మరింతగా చేరువ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. -
ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.. గొడవలు ఆగిపోతే బాగుండు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie). ఇందులో విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి టీజర్ వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్ అంతా కొట్టుకుపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. ఎన్ని జన్మలెత్తినా..శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్బాబు (Mohan Babu) నాకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. ట్రోలింగ్ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రవర్తించాలి. నాకేం తెలీదుమాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని అవతలివారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకూడదు. హీరోల గురించి ఎందుకు అసభ్యంగా మాట్లాడతారు? సీనియర్ నటులు చనిపోయారని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కోట శ్రీనివాసరావు గురించి ఇలాంటి ప్రచారమే జరిగినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి విపరీతంగా బాధపడ్డారు. ఇకపోతే ప్రభాస్ పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి నాకెలాంటి విషయాలు తెలియవు.గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయికన్నప్ప సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికీ నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్నా. అయినా సక్సెస్- ఫెయిల్యూర్ రెండూ మోసగాళ్లే! ఎవరూ మనతో శాశ్వతంగా ఉండరు అన్నాడు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్బాబు, శరత్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?! -
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.నాన్న మనసు విరిగిందితాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్బాబు (Mohanbabu).. మనోజ్ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.అమ్మ కొడుతుందేమో..కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇంటి నుంచి మనోజ్ను బయటకు పంపాలంటూ మోహన్బాబు ఫిర్యాదు)మనోజ్తో కలిసిపోతా..మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు. కుటుంబంజెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: సైఫ్ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
ఇంటి నుంచి మనోజ్ను బయటకు పంపాలంటూ మోహన్బాబు ఫిర్యాదు
మోహన్బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్బాబు (Mohan Babu) శనివారం ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు.కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు. జల్పల్లిలోని ఇంట్లో భార్య, కూతురితో కలిసి మనోజ్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్బాబు కోరాడు. పోలీసుల దగ్గరి నుంచి మోహన్బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్కు నోటీసులు ఇచ్చారు.మోహన్బాబు ఫిర్యాదుతో మనోజ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లాడు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిశాడు. జల్పల్లిలోని ఇంటికి అక్రమంగా చొరబడలేదని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని, విష్ణు (Manchu Vishnu).. తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.గత నెలలో మొదలైన గొడవమోహన్బాబు కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా మనోజ్ (Manchu Manoj), విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో మనోజ్ తనపై దాడి జరిగింది. మోహన్బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. నడవలేని స్థితిలో మనోజ్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో ఏం జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకున్న మనోజ్కానీ తర్వాత హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్బాబు ఫామ్హౌస్ను మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నాడు. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే మోహన్బాబు.. అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్-మౌనికపై ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్, మౌనికను బయటకు పంపండి అని కోరాడు.చక్కెర గొడవ.. ర్యాలీతో రభసతర్వాత ఓ రోజు మనోజ్ ఇంట్లో పార్టీ చేసుకుంటే విష్ణు జనరేటర్లో చక్కెర పోశాడని గొడవ చేశాడు. అలాంటిదేం లేదని తల్లి స్వయంగా స్పందించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం మోహన్బాబు యూనివర్సిటీకి 200 మందితో ర్యాలీగా వెళ్లాడు మనోజ్. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ కోర్టు ఉత్తర్వులు చూపించినా మనోజ్ వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మనోజ్, మౌనికపై కేసు నమోదు అయింది. అటు మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, మోహన్బాబు బౌన్సర్లపైనా కేసు నమోదైంది.కుక్క తిట్లుఇంతలో శుక్రవారం విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అన్న సినిమా డైలాగ్ను విష్ణు ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని కౌంటరిచ్చాడు.మాట్లాడుకుందాం.. అంతలోనే ట్విస్ట్ఈ రోజు ఉదయం కలిసి మాట్లాడుకుందాం. నాన్నను, ఇంట్లోని ఆడవారిని, సిబ్బందిని అందర్నీ పక్కన పెట్టి రా. నేనూ ఒంటరిగానే వస్తాను. అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇంతలోనే మోహన్బాబు మెజిస్ట్రేట్ను ఆశ్రయించడం.. మనోజ్ కలెక్టరేట్కు వెళ్లి న్యాయం కోసం పోరాడతాననడం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా -
కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్
మంచు మనోజ్ (Manchu Manoj) తాజాగా మరోసారి తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్య క్లియర్ అవుతుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఒక సినిమా ఫోటోతో ఈ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, చర్చలు ఎవరితో అనే విషయం ఆయన క్లారిటీగా చెప్పలేదు. కానీ, మంచు విష్ణు(Vishnu Manchu) కోసమే మనోజ్ ఇలా రియాక్ట్ అయ్యాడు అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మనోజ్ తాజాగా ఇలా పోస్ట్ చేశారు.' మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. కానీ, అందులో నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, పనివాళ్లు ఎవరూ వద్దు. వాళ్లందరినీ పక్కనపెట్టి మనిద్దరం మాత్రమే చర్చించుకుందాం. ఏం అంటావు..? చర్చల కోసం అంగీకరిస్తే.. నేను ఒంటరిగానే వస్తాను. నాతో పాటు ఎవరూ రారు. అయితే, నీకు నచ్చిన వాళ్లను ఎవరినైనా నువ్వు తీసుకురావచ్చు. అందుకు నేను అంగీకరిస్తున్నాను. మనం హుందాగా ఒక డిబేట్ పెట్టుకుందాం.' అంటూ నీ #కరెంట్తీగ అని ఒక క్యాప్షన్ ఇచ్చారు. తాజాగా మనోజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది. తన అన్న విష్ణు కోసమే మనోజ్ ఈ పోస్ట్ పెట్టారని నెట్టింట వైరల్ అవుతుంది.కొద్ది రోజులుగా మంచు మోహన్బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు తార స్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ శ్రీవిద్యానికేతన్లోకి వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో మనోజ్, తన భార్య భూమా మౌనిక రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆపై మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, బౌన్సర్లపై కేసు నమోదైంది.ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్ తన రౌడీ సినిమాలో డైలాగ్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్ను పోస్ట్ చేశారు.అయితే దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటరిచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్' అంటూ కృష్ణం రాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. అయితే ఇన్డైరెక్ట్గా మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.#VisMith u r too cute… let’s sit and talk, Man to Man. keeping women, Dad, staff and sugar out of this. What say ?! Man up #VisMith 🙏🏼🙌🏽❤️ I promise I will come alone, u can get whomever you want or we can have an open and healthy debate 🙌🏽❤️ Yours, #CurrentTheega 😅 pic.twitter.com/9diTq9HYzA— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2025 -
120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) గొప్ప మనసు చాటుకున్నాడు. 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు. ఒక కుటుంబసభ్యుడిలా వారికి అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటానన్నాడు. సంక్రాంతి పండగ సైతం చిన్నారులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. పిల్లలకు నచ్చిన బొమ్మలు కూడా కొనిపెడతానన్నాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ కుటుంబసభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా..సాధారణంగా కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేసిన ఓ చిన్న పని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పక్కన ఉన్నవాళ్లకు సాయం చేస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తిరుపతిలో మోహన్బాబు యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలను నేను చూసుకుంటూ ఉంటాను. ఓ రోజు తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా మాతృశ్య అనాథాశ్రమం నిర్వహిస్తున్న శ్రీదేవి పరిచయమయ్యారు. (చదవండి: డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?)120 మంది చిన్నారుల బాధ్యత నాదేఒకసారి తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. ఏ స్వలాభం లేకుండా సహృదయంతో 120 మందికి పైగా చిన్నారుల బాగోగులు చూసుకుంటోంది. ఏడాదిన్నర క్రితం ఆ అనాథాశ్రమానికి వెళ్లాను, పిల్లలందర్నీ దత్తత తీసుకుంటానని చెప్పాను. చెప్పిన మాట ప్రకారం చిన్నారులను దత్తత తీసుకున్నాను. వారికి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే పిల్లలందరి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. పండగలకు వారితో కలిసుందామని సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను.బర్త్డే రోజు అనవసర ఖర్చులు పక్కన పెట్టండివీళ్లంతా నా కుటుంబసభ్యులే.. ఒక అన్నగా, ఇంటిపెద్దగా పిల్లలతో పండగ జరుపుకున్నాను. ఇది మీకూ నచ్చితే ఎవరినైనా దత్తత తీసుకోండి. పుట్టినరోజు అనవసర ఖర్చులు చాలా ఉంటాయి. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవసరం ఉన్నవారికి సాయపడితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.. కాబట్టి నేను ఇప్పుడు సాయపడగలుగుతున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దవాళ్లయ్యాక.. వారు మిగతావారికి సాయపడాలి. అది ఇప్పటినుంచే నేర్పిస్తున్నాను అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే! -
రచ్చకెక్కిన ‘మంచు’ గొడవ.. అర్ధరాత్రి చొక్కాలు చించుకుని ఫైటింగ్ (ఫొటోలు)
-
మంచు విష్ణు కూతుళ్లు.. అప్పుడే ఇంత పెద్దోళ్లు అయిపోయారే! (ఫొటోలు)
-
అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే!
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. -
మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల భద్రత, రక్షణలను మరింత మెరుగుపరచడం కోసం వారి తరఫున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు ‘మా’ అధ్యక్షుడిగా నాది ఒక విజ్ఞప్తి.తెలుగ చిత్ర పరిశ్రమలోని మహిళల భద్రత, రక్షణ మరింత మెరుగుపడేలా, వారి తరఫున ప్రాతినిధ్యం ఉండేలా ఓ కమిషన్ను ఏర్పాటు చేయండి. కెమెరా ముందు, వెనక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. భద్రత, సాధికారితలకు చలన చిత్ర పరిశ్రమ ప్రతిరూపంగా నిలిపేందుకు తెలుగు ఇండస్ట్రీలో భాగమైన ప్రతి ఒక్కర్నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నాం’’ అంటూ గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే... మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాక ఇతర పరిశ్రమల్లోనూ ఆ తరహా కమిటీ ఏర్పాటు చేయాలని పలువురు స్టార్స్ అంటున్న విషయం తెలిసిందే. తెలుగులో ఉన్న విభాగాల్లో ఓ కీలక విభాగం అయిన ‘మా’ తరఫున మంచు విష్ణు కమిటీ ఏర్పాటుని ప్రతిపాదించారు. -
మా కోసం పది లక్షలు విరాళం
మూవీ ఆర్టిస్ట్స్’ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన మూడో కుమార్తె (విష్ణు–విరానికా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు) ఐరా విద్యా మంచు జన్మదినం (ఆగస్టు 9) సందర్భంగా ‘మా’ అసోసియేషన్లో ఆర్థికంగా వెనకబడిన కళాకారుల సంక్షేమం కోసం ఆయన ఈ విరాళాన్ని అందించారు.కళాకారుల సంరక్షణ, సహాయాల నిమిత్తం ఈ నగదుని వెచ్చించనున్నారు. అలాగే ‘మా’ భవనంపై కూడా విష్ణు మంచు దృష్టి సారించారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే...ప్రస్తుతం విష్ణు మంచు హీరోగా ‘కన్నప్ప’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కానుంది. -
డిసెంబరులో కన్నప్ప
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విష్ణు. అయితే విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. శివ భక్తుడైన కన్నప్ప కథతో ‘కన్నప్ప’ రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్ను కాన్స్లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్లో భారతీయం... కాన్స్లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు. -
కన్నప్పలో కాజల్
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా ‘కన్నప్ప’ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది.ఇంకా ఈ సినిమాలో మోహన్బాబు, శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మోసగాళ్ళు’ (2021) మూవీ కోసం విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’ కోసం కలిశారు. -
కాన్స్లో కన్నప్ప
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీమ్ సందడి చేయనుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా ఈ నెల 14 నుంచి 25 వరకూ జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 20వ తేదీన ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ సినిమా టీజర్ను ఆవిష్కరించనుండటం ఆనందంగా ఉంది. మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ట్వీట్ చేశారు విష్ణు మంచు. -
కన్నప్ప సెట్స్లో...
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న హీరో ప్రభాస్ తాజాగా ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారుపాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్స్లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్. ‘‘విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ రూపొందుతోంది. శివ భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నాం.ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి వారు ‘కన్నప్ప’కి పని చేస్తున్నారు. -
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు. తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్. -
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
మరోసారి 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు.. క్లారిటీ ఇచ్చిన మాదాల రవి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే మరోసారి కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ప్రకటించారు. 2021 లో జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. వాస్తవంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన 'మా అసోసియేషన్ ఎన్నికలు' ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని తాజాగా మాదాల రవి ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలం ఇప్పటికే ముగిసిపోయింది. అయినా కూడా విష్ణునే ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ‘మా’కు ఎప్పుడో ఎన్నికలు జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల జాప్యం ఏర్పడింది. మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కోసం జూలై లో మారిషస్లో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు కూడా గతంలో ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఉపయోగిస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యుక్షుడిగా మంచు విష్ణు ఏమైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
మా కోసం మలేసియాలో ఉత్సవం
‘‘ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో స్వర్ణయుగం నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిగారికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు ప్రభాస్.. నా బ్రదర్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. కీరవాణిగారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. దేశంలోనే అత్యధిక బడ్జెట్తో మహేశ్బాబు–రాజమౌళి సినిమా రాబోతోంది. ఇలా ఎన్నో సాధిస్తున్నాం. తెలుగు సినిమా 90 సంవత్స రాలు పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో ‘మా’ నిధుల సేకరణ కోసం మలే సియాలో ‘నవతిహి ఉత్సవం’కు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషంగా ఉంది’’ అని ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. తెలుగు సినిమా 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు సినిమా చరిత్రను తెలియజేసేలా మలేసియాలో ‘నవతహి ఉత్సవం’ పేరిట ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్ను జూలైలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో విష్ణు మంచు మాట్లాడారు. -
కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది
‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్బాబు పుట్టినరోజు, మోహన్బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు. -
కన్నప్ప గురి
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప‘ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు మంచు లుక్ విడుదలైంది. ‘‘ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు విష్ణు మంచు. ఫస్ట్ లుక్ పోస్టర్ కన్నప్ప క్యారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీ చూపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతుండగా అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం రెండో షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
న్యూజిలాండ్లో భార్య వెరోనికాతో మంచు విష్ణు సందడి (ఫొటోలు)
-
90 రోజుల తర్వాత స్వదేశానికి 'కన్నప్ప'.. 600 మందితో సాహసం
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్బాబు, బ్రహ్మానందం, మోహన్లాల్, శివరాజ్కుమార్, శరత్కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 3 నెలల క్రితం న్యూజిల్యాండ్లో మొదలైంది. ‘‘న్యూజిల్యాండ్లో 600 మంది హాలీవుడ్, భారతదేశంలోని అతిరథ మహారథులైన నటీనటులతో 90 రోజుల మొదటి షెడ్యూల్ చేశాం. అక్కడి అద్భుతమైన లొకేషన్స్లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసి, భారతదేశానికి తిరిగి వస్తున్నాం. ఈ సినిమాకు థాయ్ల్యాండ్, న్యూజిల్యాండ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు మోహన్బాబు. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
కన్నప్పకి శ్రీకారం
విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తిలో ఈ సినిమాని ప్రారంభించారు. స్టార్ ప్లస్లో ‘మహాభారత’ సిరీస్కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కి దర్శకత్వం వహిస్తారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మంచు మోహన్బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్ సనన్ కథానాయిక. విష్ణు మాట్లాడుతూ– ‘‘భక్త కన్నప్ప, ఆయన భక్తి గొప్పతనాన్ని ‘కన్నప్ప’ ద్వారా ఈ తరానికి తెలియజేయాలన్నది మా సంకల్పం. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ నటీనటులు నటిస్తారు. త్వరలో షూటింగ్ ఆరంభించి ఒక్క షెడ్యూల్లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాసి. -
Ayra Vidya Birthday Celebrations: మంచు విష్ణు గారాలపట్టి ఐరా బర్త్డే.. లిటిల్ ఏంజెల్ క్యూట్ ఫోటోలు
-
వారి బంధం భార్యాభర్తల్లాంటిది: మంచు విష్ణు
‘‘ఇండస్ట్రీలో ఓ యాక్టర్కి, మేకప్ మేన్కి ఉన్న బంధం భార్యాభర్తల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి మేకప్మేన్ చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా సినిమా చేయటం అంత సులభం కాదు.. ఆయన మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ‘మాధవే మధుసూదనా’ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. తేజ్ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను విష్ణు మంచు రిలీజ్ చేశారు. బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ–‘‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అన్నపూర్ణ స్టూడియో సంస్థకు, నాగార్జునగారికి రుణపడి ఉంటాను. మోహన్బాబుగారు సింగపూర్లో ఉండటం వల్ల ఆయన స్థానంలో విష్ణుని పంపించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
ఓటీటీలోకి జిన్నా, అప్పటినుంచే స్ట్రీమింగ్!
మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్లో రేపటి(డిసెంబర్ 2) నుంచి ప్రసారం కానుంది. తెలుగు, మలయాళ భాషల్లో జిన్నా అందుబాటులోకి రానుందంటూ అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా కథ విషయానికి వస్తే జిన్నాలో హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. షార్ట్కట్గా జిన్నా అని పిలుచుకుంటారు. హీరో అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అలాంటప్పుడు జిన్నా తన అప్పు ఎలా తీర్చాడనేదే కథ. The endlessly entertaining movie is all set to entertain you on @PrimeVideoIN 🤩 from tomorrow. Just a day to go and full-on entertainment #GINNA!#GinnaOnPrime In Telugu & Malayalam.@iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory @saregamasouth pic.twitter.com/9Jn2rESSH0 — AVA Entertainment (@avaentofficial) December 1, 2022 చదవండి: కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాక్లో హౌస్మేట్స్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్ -
మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమానే నా ఊపిరి
‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్కి థ్యాంక్స్. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్గారికి థ్యాంక్స్. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్కి థ్యాంక్స్. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్ చూస్తారు.. కానీ, ఫ్లాప్ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్ బస్టర్ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు అలీ, చమ్మక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
Viranica Manchu: ఆరాధ్య బచ్చన్ వేసుకున్న డ్రెస్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా?!
Viranica Manchu Maison AVA Creative Revolution In Kids Fashion: ఎంటర్ప్రెన్యూర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విరానిక మంచు. యెడుగూరి సందింటి వారి ఆడపడుచు.. మంచు వారి కోడలు అయిన ఆమెకు ఫ్యాషన్ రంగంలో మంచి ఫాలోయింగ్ ఉంది. భిన్న రకాల డిజైన్లతో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. విరానికను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేడుక ఏదైనా సరే... భర్త విష్ణుతో పాటు పిల్లలు అరియానా, వివియానా, అవ్రమ్ భక్త, ఐరాతో కలిసి అద్భుతమైన అవుట్ఫిట్స్లో తళుక్కుమనాల్సిందే. పిల్లల కోసం పిల్లల పేరు మీదుగా.. విరానిక మంచు గతేడాది ఆగష్టులో మైసన్ అవా పేరు మీదుగా క్లాతింగ్ లేబుల్ను ప్రారంభించారు. తన కూతుళ్లు అరియానా, వివియానా, ఐరా పేర్లు కలిసి వచ్చేలా అవా(AVA) బ్రాండ్తో పిల్లలకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయిస్తున్నారు. చేనేతతో రూపుదిద్దుకుంటున్న ఈ వస్త్రాలు.. సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా విరానికా క్రియేటివ్ హెడ్గా వ్యవహరిస్తున్న అవా బ్రాండ్ సినీ ప్రముఖుల మనసు దోచుకుంటోంది. ఇప్పటికే అనేక మంది ప్రశంసలు అందుకున్న ఈ క్లాతింగ్ లేబుల్.. ఇటీవల ఆరాధ్య ధరించిన డ్రెస్తో మరోసారి చర్చనీయాంశమైంది. అవును.. మేము చెబుతుంది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనుమరాలు, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్- హీరో అభిషేక్ బచ్చన్ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించే! ఆరాధ్య ఇటీవలే పదో వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఐశ్ దంపతులు మైసన్ అవా బ్రాండ్ తయారు చేసిన ‘ఫ్లోరెంటీనా’ డ్రెస్ను ఆరాధ్య కోసం ఎంపిక చేశారు. పుట్టినరోజు వేడుకలో ఈ స్టార్ కిడ్ అద్భుతమైన గౌన్లో మెరిసిపోయింది. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన సిల్క్ ఆర్గంజా పూలు, బీడ్స్ మేళవింపుతో ఈ డ్రెస్ను డిజైన్ చేశారు. అమెరికన్ మీడియా పర్సనాలిటీ పారిస్ హిల్టన్ సైతం తన వివాహనంతరం నిర్వహించిన నియాన్ కార్నివాల్లో మైసన్ అవా బ్రాండ్ రూపొందించిన వీల్(తలపై ధరించే వస్త్రం) ధరించడం విశేషం. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకకు హిల్టన్ అవా నుంచి వీల్ను ఆర్డర్ చేయడం గమనార్హం. నా భర్త, పిల్లల నుంచి స్ఫూర్తి పొంది ఈ విషయాల గురించి విరానిక మంచు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ...‘‘నా నలుగురు పిల్లలను దృష్టిలో పెట్టుకుని అందరిలోనూ చిన్నారులు మరింత ప్రత్యేకంగా కనబడాలనే తపనతో దుస్తులను డిజైన్ చేశాను. ఒక్కో డ్రెస్ తయారు చేయడానికి వందల గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. ప్రతీ డ్రెస్ దేనికదే ప్రత్యేకం’’ అని బ్రాండ్ నెలకొల్పాన్న ఆలోచన రావడానికి గల కారణాలు వెల్లడించారు. అదే విధంగా... తన భర్త, సినీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్త మంచు విష్ణు నుంచి స్ఫూర్తి పొందానన్న విరానిక.. సరికొత్త డిజైన్లు రూపొందిస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. కాగా విరానిక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి(కజిన్) అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ మార్కెటింగ్లో శిక్షణ తీసుకున్నారు. చదవండి: Thangka Print: మగువల మనసు దోచుకుంటున్న ‘తంగ్కా’ డిజైన్ -
సీఎం జగన్తో మంచు విష్ణు లంచ్
సాక్షి, తాడేపల్లి: టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడంతోపాటు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం వారితో కలిసి సెల్ఫీ దిగిన హీరో విష్ణు ఆ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రౌండ్లు కొడుతోంది. (చదవండి: అందుకే మా నాన్నంటే అసూయ: మంచు విష్ణు) కాగా మంచు విష్ణు ప్రస్తుతం 'మోసగాళ్లు' సినిమాతో బిజీగా ఉన్నాడు. తను నటించి, నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు. విష్ణు జోడీగా రుహీ సింగ్, అతడి సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఈ సినిమా కథను ప్రారంభం నుంచి ముగింపు దాకా నరేట్ చేస్తారు వెంకటేశ్. అలాగే తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన 'ఢీ' చిత్రానికి సీక్వెల్ 'డి-డి(డబుల్ డోస్)'లోనూ కనిపించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గోపీమోహన్, కిషోర్ రచయితలు పని చేస్తున్నారు. (చదవండి: పవన్తో పోరాటం.. రంగంలోకి రానా!) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
కొబ్బరిబొండాం చికెన్ రైస్ తింటారా..
-
కొబ్బరిబొండాం చికెన్ రైస్ తింటారా..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమై సెలబ్రిటీల్లో కొందరు వంటలతో బిజీగా ఉంటే, మరికొందరు తమ ఆత్మీయులతో ఆనందంగా గడుపుతున్నారు. తాజాగా మంచు విష్ణు కొబ్బరిబొండాంతో చేసిన వినూత్న ప్రయోగాన్ని తన ట్విటర్ షేర్ చేశాడు. అది వర్కవుట్ అయిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. కొబ్బరిబొండాంలో చికెన్ రైస్ చేయడం తయారు చేయడం కాస్త వింతగా అనిపించింది. కొబ్బరి బొండాంలో చికెన్ రైస్ వండి తను అనుకున్నది సాధించానని విష్ణు తెలిపాడు. అయితే ఇప్పుడు తాను చేసిన ప్రయోగం అంతగా సక్సెస్ కాలేదని, లాక్డౌన్ పూర్తయ్యేలోపు కచ్చితంగా కొబ్బరిబొండాంలో చికెన్ రైస్ వండుతానని తెలిపాడు. అంతేగాక చివర్లో లాక్డౌన్ పుణ్యమా అని మంచి చెఫ్గా తయారు అయ్యానంటూ కామెంట్ షేర్ చేశాడు. మీకు కూడా విష్ణు లాగా చేయాలనుకుంటే వెంటనే కొబ్బరి బొండాం కొని చికెన్ రైస్ వండేయండి. -
బర్త్డే సర్ప్రైజ్
తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు మంచు విష్ణు. టాలీవుడ్–హాలీవుడ్ క్రాస్ఓవర్ (రెండు వేరు వేరు ప్రాంత నటులు కలిసి నటించడాన్ని క్రాస్ఓవర్ అంటారు) ప్రాజెక్ట్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారట చిత్రబృందం. జెఫ్రీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు, కాజల్, రుహానీ శర్మ, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్లో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ను మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమాతో తొలిసారి తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు హిందీ నటుడు సునీల్ శెట్టి. మరో విశేషం ఏంటంటే విష్ణు, కాజల్ అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారట. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ ఆర్, ప్రొడక్షన్ డిజైన్: కిరణ్ కుమార్ ఎమ్. -
అవ్రామ్ భక్త మంచు...గ్రాండ్ సన్నాఫ్ భక్తవత్సలం నాయుడు
భక్తవత్సలం నాయుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘మంచు మోహన్బాబు’. ఈ విలక్షణ నటుణ్ణి ఆయన సన్నిహితులు ‘భక్తా’ అని పిలుస్తుంటారు. స్క్రీన్ నేమ్ ఎంత కలిసొచ్చినా ఒరిజినల్ నేమ్ అంటే ఓ స్పెషల్ మమకారం ఉంటుంది కదా. అందుకే మనవడికి తన పేరు వచ్చేలా పేరు పెట్టారు మోహన్బాబు. విష్ణు భార్య విరానిక ఇటీవల ఒక బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బేబీ బాయ్కి ‘అవ్రామ్ భక్త మంచు’ అని పేరు పెట్టినట్లు గురువారం విష్ణు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. విష్ణుకి ఆల్రెడీ ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే. అప్పుడే తమ్ముణ్ణి ఏమని పిలవాలో ఈ చిన్నారులు డిసైడ్ అయ్యారట. ‘‘అరియానా ‘బేబీ లయన్’ అని పిలుస్తుంది. వివియానా ‘బేబీ టెడ్డీబేర్’ అని పిలుస్తుంది. మేమంతా అవ్రామ్ భక్త మంచు అని పిలుస్తున్నాం. అవ్రామ్ అంటే.. వన్ హూ కెనాట్ స్టాప్ అని అర్థం’’ అని విష్ణు అన్నారు. ‘‘నా బిడ్డలు పుట్టినప్పుడు... త్రీ షిప్ట్స్లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే త్రీ షిప్ట్స్ వాడితోనే గడుపుతున్నాను ’’ అని మోహన్బాబు పేర్కొన్నారు. ఈ కుటుంబానికి సంక్రాంతి ముందే వచ్చేసింది. -
ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం!
సాక్షి, హైదరాబాద్: మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘గాయత్రి’.. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను విష్ణు ట్విట్టర్లో షేర్ చేశాడు. గర్భవతిగా కనిపిస్తున్న శ్రియకు విష్ణు జడ వేస్తూ కనిపిస్తున్న ఈ పోస్టర్లో 'ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం' అనే ట్యాగ్లైన్ను జోడించారు. తన కెరీర్లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత చాలెజింగ్ రోల్ ఇదేనని, తన కెరీర్లో బెస్ట్ సాంగ్ కూడా ఇదేనని.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్కు విష్ణు కామెంట్ చేశారు. నిఖిలా విమల్ టైటిల్ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. . తమన్ సంగీతం అందించాడు. One of the most challenging roles I played so far. And one of my career best song in #Gayatri. Hope you all like the my first look from #Gayatri pic.twitter.com/ChyPhA4uhG — Vishnu Manchu (@iVishnuManchu) 1 January 2018 -
ఆచారి టూరు.. భలే జోరు
హీరో మంచు విష్ణు–దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల తర్వాత విష్ణు–బ్రహ్మానందం ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులకు నవ్వులు పంచనుండటం విశేషం. విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మోహన్ బాబుగారి పుట్టినరోజు మార్చి 19న ‘ఆచారి అమెరికా యాత్ర’ పూజా కార్యక్రమాలు జరిపాం. ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. సినిమా జోరుగా హుషారుగా ఉంటుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి మంచి కథ అందించారు. ఈ నెల 5న హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇక్కడి షెడ్యూల్ పూర్తవగానే అమెరికా షెడ్యూల్ ప్రారంభమవుతుంది. విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హైలైట్గా నిలుస్తుంది‘ అన్నారు. తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, విద్యుల్లేఖా రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని, పృధ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సిద్దార్థ, సమర్పణ: ఎం.ఎల్.కుమార్ చౌదరి. -
దీపా మలిక్ కు అభినందనల వెల్లువ
ముంబై: రియో పారాలింపిక్స్ లో రజత పతకం సాధించిన షాట్పుట్ క్రీడాకారిణి దీపా మలిక్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినిమా ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఆమె అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ లో రజత పతకం గెలిచి భారత దేశానికి దీపా మలిక్ గర్వకారణంగా నిలిచిందని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. రియోలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించిందని వ్యాఖ్యానించారు. పారాలింపిక్స్ లో దీపా మలిక్ చరిత్ర సృష్టించిందని సీనియర్ నటి హేమమాలిని ప్రశంసించారు. ఆమెను చూసి దేశం గర్విస్తోందన్నారు. మహిళల షాట్పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో దీపా మలిక్ మన దేశానికి రజత పతకం సాధించడం సంతోషం కలిగిస్తోందని హీరో ఇమ్రాన్ హష్మీ పేర్కొన్నాడు. దీపా మలిక్ విజయం స్ఫూర్తిదాయకమని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ట్వీట్ చేశాడు. -
డిఫరెంట్ డైనమైట్
విష్ణు సినిమాల్లో యాక్షన్ సీన్స్ సమ్థింగ్ డిఫరెంట్గా ఉంటాయి. హాలీవుడ్ చిత్రాల ప్రభావంతోనో ఏమో చాలా స్టయిలిష్గా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయిస్తుంటారాయన. తాజాగా విష్ణు ‘డైనమైట్’ కోసం నెక్ట్స్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించనున్నారు. లుక్ వైజ్ కూడా చాలా వెరైటీగా కనిపించనున్నారు. చెవి పోగు, చేతి పొడవునా టాటూతో విష్ణు డిఫరెంట్ లుక్తో స్టిల్స్లో కనిపిస్తున్నారు. ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం ఆయన రెండే రెండు టీ షర్ట్స్లో కనబడతారట! ఒకటి బ్లాక్, ఇంకొకటి రెడ్. కథానుగుణంగానే ఈ రెండు కాస్ట్యూమ్స్లో విష్ణు ఉంటారట. ఇందులో విష్ణు సరసన ప్రణీత తొలిసారిగా నటిస్తున్నారు. విష్ణు హై ఎనర్జిటిక్ యాక్టర్ అని ప్రణీత కితాబులిస్తున్నారు. దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అరియానా-వివియానా సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
డిఫరెంట్ డైనమైట్
చెవి పోగు,90 చేతి పొడవునా టాటూ, కొత్త హెయిర్ స్టయిల్.. ఇలా తాజా చిత్రంలో మంచు విష్ణు సరికొత్తగా కనిపించనున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘డైనమైట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్తో కనిపించనున్నానని విష్ణు చెబుతూ - ‘‘నా పాత్ర లుక్, కథానుగుణంగా ‘డైనమైట్’ అయితే బాగుంటుందని దాన్నే ఖరారు చేశాం. ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది. అన్ని వర్గాలవారినీ అలరించే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దేవా కట్టా తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. -
మాటలే.. చేతలు లేవు
మాటలు గుప్పించారు, చేతలు మాత్రం శూన్యం అంటూ నటి శ్వేతాబసు వాపోతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఇప్పుడిప్పుడే కథా నాయకిగా ఎదుగుతున్న ఈమె ఆర్థిక సమస్యలు, లేక ఇతర కారణాలు గాని ఆ మధ్య వ్యభిచారం వ్యవహారంలో పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బాలీవుడ్ దర్శకులతో సహా పలువురు శ్వేతాబసుకు మద్దతు ప్రకటించి, నటిగా అవకాశాలు కల్పిస్తామని బహిరంగంగానే వె ల్లడించారు. అయితే అలాంటి వారిలో ఏ ఒక్కరూ అవకాశం కల్పించలేదని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తెలుగు నటుడు విష్ణు మంచు మినహా ఇతరులెవరూ అవకాశం ఇవ్వలేదన్నారు. విష్ణు చిత్రంలో నటించే విషయం కూడా చర్చల్లో ఉందని తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ ఏ భాషలోనైనా తాను నటించడానికి సిద్ధమని అన్నారు. అలాగే తనకు వ్యక్తిగత కార్యనిర్వాహకుడంటూ ఎవరూ లేరని అవకాశం కల్పించేవారు నేరుగా తనను సంప్రదించవచ్చని శ్వేత పేర్కొంది. -
స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నరేష్,విష్ణు
-
చెవి కుట్టించుకున్న మంచు విష్ణు
హీరో విష్ణు ప్రతిసారీ ఏదో ఒకటి విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా దేవ కట్టాతో విష్ణు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో పాత్ర కోసం తప్పనిసరిగా చెవి కుట్టించుకోవాలని దర్శకుడు దేవ కట్టా విష్ణుకు చెప్పారట. దాంతో వెంటనే సరేనన్న విష్ణు.. బుద్ధిగా తన చెవి కుట్టించుకున్నారు. ప్రతి సినిమాలో విభిన్నంగా కనిపించాలని ప్రయత్నం చేసే విష్ణు.. ఈసారి కొత్త సినిమాలో మరింత కొత్తగా కనిపించాలని చెవి కుట్టించుకున్నారట. తమిళంలో విజయం సాధించిన అరిమ నంబి అనే చిత్రం ఆధారంగా దేవకట్టా ఈ సినిమా తీస్తున్నారు. తమిళ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా మొదటి షెడ్యూలు పూర్తయింది. -
‘ఎర్రబస్సు’మూవీ ప్రెస్ మీట్
-
ఎర్రబస్సు వర్కింగ్ స్టిల్స్
-
ఎర్రబస్సు మూవీ స్టిల్స్
-
తాతా మనవళ్ళ కథ
‘‘పల్లెటూళ్లో పుట్టి పెరిగి నిరక్షరాస్యుడైన ఓ తాత, అమెరికాలో స్థిరపడాలని ఆరాటపడే ఓ మనవడి మధ్య జరిగే కథ ఇది. నాకు, విష్ణుకి ఈ కథ బాగుంటుందనిపించి ఈ చిత్రం చేస్తున్నాం’’ అని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు చెప్పారు. తారక ప్రభు ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో దాసరి రూపొందిస్తున్న చిత్రం ‘ఎర్రబస్సు’. తమిళ చిత్రం ‘మంజ ప్పై’కి ఇది రీమేక్. బుధవారం హైదరాబాద్లో దాసరి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘ఈ సంస్థలో ఇది 33వ సినిమా. ఈ నెల 31న పాటలను, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఇది గొప్ప సినిమా అని విష్ణు అన్నారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు చక్రి, రేలంగి నరసింహారావు, రచయిత రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.వ్యక్తిగతంగా ఎవర్నీ అనలేదు: ఈ మధ్య ఓ సమావేశంలో తాను మాట్లాడిన మాటలను ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు వక్రీకరించారని దాసరి చెబుతూ ‘‘పరిశ్రమ మేలుకోరే వ్యక్తిగా పరిశ్రమ గురించి మాట్లాడతాను తప్ప, ఎవర్నీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. సునీల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశానని చెప్పుకుంటున్నారు. నా మాటల్లోని మంచిని తీసుకోవాలని, వక్రీకరించవద్దని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
సింగంగా సంపూ
మంచు విష్ణు... తన కుటుంబ కథానాయకులతో కాకుండా తొలిసారి బయట హీరోతో సినిమాను నిర్మించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు. ‘హృదయకాలేయం’తో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్బాబు. సినిమా పేరు ‘సింగం 123’. అక్షత్శర్మ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సంపూ అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకులకు నచ్చేలా ‘సింగం 123’ ఉంటుందని, ‘హృదయకాలేయం’ చిత్రాన్ని మించే స్థాయిలో ఇందులో యాక్షన్, కామెడీ అంశాలుంటాయని దర్శకుడు చెప్పారు. ‘సింగం 123’గా సంపూ ఎలా ఉంటారో తెలియజేయడానికి ఫస్ట్లుక్ని విడుదల చేశామని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం తెలిపారు. -
సినిమా రివ్యూ: అనుక్షణం
భారీ విజయాలు చేజిక్కకపోయినా...తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంటున్న రాంగోపాల్ వర్మ తాజాగా మంచు విష్ణుతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై ‘అనుక్షణం’ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 13 తేది శనివారం విడుదలైన 'అనుక్షణం' విజయం, లాభాల్ని దక్కించుకునేలా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. సీతారాం(సూర్య) ఓ సైకో, సీరియల్ కిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో మహిళ లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. పోలీసు విభాగానికి సవాల్గా మారుతాడు. వరుస హత్యల హంతకుడ్ని పట్టుకోవడం పోలీస్ ఆఫీసర్ గౌతమ్కు అగ్నిపరీక్షగా మారుతుంది. సీరియల్ కిల్లర్ను గౌతమ్, పోలీసు విభాగం పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి? వరుస హత్యలకు ఎలా అడ్డుకట్టవేశారనేది క్లుప్తంగా చిత్ర కథ. సీతారాం పాత్రలో సీరియల్ కిల్లర్గా సూర్య నటించడం కంటే .. జీవించాడని చెప్పవచ్చు. సూర్య తన లుక్స్, బిహేవియర్తో గుబులు రేపాడు. కొత్త నటుడైనా... నటుడిగా మంచి పరిణతి ప్రదర్శించాడు. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వరుస హత్యల కేసు దర్యాప్తు, సీరియల్ కిల్లర్ హంతకుడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గౌతమ్గా మంచు విష్ణు నటించాడు. ఓ పోలీస్ ఆఫీసర్ కావాల్సిన ఎక్స్ప్రెషన్స్, లుక్స్, నడక, స్టైల్ను పండించడంలో మంచు విష్ణు తన మార్కును చూపించారు. ఓ డిఫెరెంట్ లుక్తో విష్ణు ఆకట్టుకున్నాడు. అమెరికాలో వరుస హత్యలపై అధ్యయనం చేసిన రీసెర్చర్గా రేవతి కనిపించారు. పోలీసు విభాగానికి సహాయం అందించే పాత్రలో రేవతి తన పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. టీవీ యాంకర్గా మధు శాలిని, గౌతమ్ భార్య తేజస్వినీలు, నవదీప్, సుజిత్లు ఓకే అనిపించారు. సాంకేతిక విభాగాల పనితీరు ఈ చిత్రంలో ఫోటోగ్రఫి, రీరికార్డింగ్లది కీలక పాత్ర. ప్రేక్షకులను ఆక ట్టుకోవడంలో ఈ రెండు విభాగాలు ప్రధాన పాత్ర పోషించాయి. టెంపో, మూడ్, ఆంబియెన్స్ రిఫ్లెక్ట్ చేయడానికి లైటింగ్ను చక్కగా వాడుకున్నారు. సాంకేతిక అంశాలను బాలెన్స్ చేస్తూ వర్మ చిత్రీకరించిన తీరు బాగుంది. ఇలాంటి అంశాలతో తెరకెక్కించి విధానంలో వర్మది అందె వేసిన చెయ్యి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడి పనితీరు: ఆనందం కోసమే వరుస హత్యలకు పాల్పడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సీరియల్ కిల్లర్ జీవితాలతో స్పూర్తి పొంది ‘అనుక్షణం చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్ధమవుతుంది. సీరియల్ కిల్లర్ బిహేవియర్ను చక్కగా చిత్రీకరించారు. హత్యల నేపథ్యంలో మీడియా తీరును తన స్టైల్ తెరపైనా చూపించారు. ఎప్పటిలాగే టెక్నికల్ అంశాలను తన కావాల్సిన స్టైల్లో వినియోగించుకున్నారు. క్లైమాక్స్ను హడావిడిగా ముగించేడం.. కథ, కథనంలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. టెక్నికల్ అంశాలతో కవర్ చేశాడంలో వర్మ సఫలమయారు. అయితే గత కొద్ది కాలంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న వర్మ చిత్రాల కంటే ’అనుక్షణం’ బాగుంటడం ఆయన అభిమానులకు ఊరట. ఇంట్లో టెలివిజన్లో క్రైమ్ ఎపిసోడ్లతో ఆనందించే వీక్షకులకు క్రైమ్, హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్కు గురిచేయడం ఖాయం. -- అనుముల రాజబాబు -
పోలీస్ పవర్!
సినిమాల్లో నాయకా నాయికలు ధరించిన దుస్తులు, వాడిన వస్తువులను వేలం వేయడం అందరికీ తెలుసు. ఆ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. కానీ, ఏకంగా సినిమానే వేలం వేయా లనే కొత్త విధానానికి నాంది పలికారు రామ్గోపాల్ వర్మ, విష్ణు. భారతీయ చలన చరిత్రలో బహుశా ఇలా ఓ సినిమాని వేలం వేయడం ఇదే తొలిసారి కావచ్చు. వర్మ దర్శకత్వంలో విష్ణు కథానాయకునిగా ఏవీ పిక్చర్స్ పతాకంపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సమర్పణలో పార్ధసారథి, గజేంద్రనాయుడు, విజయ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అనుక్షణం’. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అమ్మాయిలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణు పోలీసు అధికారి పాత్ర చేశారు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందనీ, అనుక్షణం థ్రిల్కి గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం వేలం పాటకు అద్భుతమైన ఆదరణ లభించిందని, ఇది ఓ రికార్డ్ అని కూడా అన్నారు. ఈ కథలో ఉన్న సస్పెన్స్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన వైనం ప్రత్యేక ఆకర్షణ అని నిర్మాతలు చెప్పారు. తేజశ్వి, రేవతి, బ్రహ్మానందం, నవదీప్, మధుశాలిని తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. -
యూఎస్ లో 'రౌడీ' గ్రాండ్ ఎంట్రీ!
యూఎస్ లో 'రౌడీ' గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాంగోపాల్ వర్మ, మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ లో గురువారం విడుదల కానుంది. రౌడీ చిత్రం 50కు పైగా మల్టిప్లెక్స్ విడుదలయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టికెట్ విలువ 10 డాలర్లుగా నిర్ణయించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. పది డాలర్లకే టాప్ మల్టిప్లెక్స్ లో ఈ చిత్రాన్ని చూడవచ్చని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, కనువిందు చేసే పాటలున్నాయని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రతినిధులు వెల్లడించారు. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రంలో జయసుధ, వెన్నెల కిషోర్, రవిబాబు, శాన్వీ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషించారు. -
'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు
చెన్నై: 'రౌడీ' చిత్రం పూర్తి స్థాయి నటుడిగా మార్చిందని టాలీవుడ్ నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల కాలంలో ఓ మోస్తారు విజయాలను తన ఖాతాలో వేసుకున్న విష్ణు.. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'రౌడీ' చిత్రంలో తండ్రి మోహన్ బాబుతో కలిసి నటిస్తున్నారు. 'చాలా కాలం తర్వాత కామెడీ లేకుండా ఓ సీరియస్ చిత్రంలో నటించాను. పూర్తి స్థాయి నటుడిననే సంతృప్తి కలిగించింది. కమర్షియల్ హంగులతోపాటు ఈ చిత్రంలో ఉద్వేగానికి గురి చేసే సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో నాలో ఉన్న నటుడిని రాము వెలికి తీశారు' అని విష్ణు తెలిపారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన 'రౌడీ' చిత్రంలో మోహన్ బాబు, జయసుధ, శాన్వీ శ్రీవాస్తవ్, వెన్నెల కిషోర్, రవి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 4 తేదిన విడుదల కానుంది. -
రౌడి-నీ మీద ఒట్టు సాంగ్
-
‘పద్మశ్రీ’ చూసి సినిమాకు జనాలొస్తారని అనుకోను!
‘‘రాష్ట్రంలో కీలకమైన సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి... అందరూ నాన్నగారి ‘పద్మశ్రీ’ ఇష్యూ మీదే ఎందుకు దృష్టి సారిస్తున్నారో అర్థం కావడంలేదు’’ అని మంచు విష్ణు అసహనం వ్యక్తం చేశారు. మోహన్బాబు, విష్ణు, మనోజ్ కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల అవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా... పేరుకు ముందు ‘పద్మశ్రీ’ అనే అక్షరాల్ని చూసి సినిమాకు జనాలు వస్తారని తాను అనుకోనని, దాని వల్ల తమకు రికార్డులేం సొంతం కావని విష్ణు ఘాటుగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు నటించిన సినిమాల్లో కూడా టైటిల్స్లో వారి పేర్ల ముందు ‘పద్మశ్రీ’ ఉంచేవారు. దాంతో అదేం తప్పుకాదు అనుకున్నాం. కానీ కోర్టు తీర్పు తర్వాత ‘పద్మశ్రీ’ బిరుదు విషయంలో మాకొక క్లారిటీ వచ్చింది. అవార్డు పొందిన వారి పేరు ముందు కానీ, పేరు వెనుక గానీ ‘పద్మశ్రీ’ అని వాడకూడదు. పేరు తర్వాత ‘రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన’ అని వేసుకోవచ్చు. ఇక నుంచి అలాగే చేస్తాం’’ అని చెప్పారు విష్ణు. -
రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో..!
మోహన్బాబు-రామ్గోపాల్వర్మలది ఓ టిపికల్ కాంబినేషన్. అసలు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈమధ్య కాలంలో చాలా అరుదుగా సినిమాలు చేస్తున్న మోహన్బాబు, వర్మ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో విష్ణు కూడా నటించబోతున్నారు. ఈ సినిమా పూజాకార్యక్రమాలు గురువారం హైదరాబాద్లోని సాయిబాబా టెంపుల్లో జరిగాయి. విష్ణుతో వర్మ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఈ ప్రాజెక్ట్ మొదలుకావడం విశేషం. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ సంస్థ నిర్మించనుంది. జనవరిలో చిత్రీకరణ మొదలు కానుంది. గతంలో హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతో ‘సర్కార్’ తీసిన వర్మ, మరి ఈ తండ్రీ కొడుకులతో ఏ తరహా సినిమా చేస్తారనేది ఫిలిమ్నగర్లో చర్చనీయాంశమైంది. -
పాండవులు పాండవులు తుమ్మెద...
‘పాండవులు పాండవులు తుమ్మెద... పంచ పాండవులోయమ్మ తుమ్మెద’ అంటూ ‘అక్కా చెల్లెలు’ సినిమాలో ‘షావుకారు జానకి పాట పాడుతుంది. చాలా చక్కటి ఫీల్ ఉన్న పాట అది. ఇప్పుడా పాట పల్లవే సినిమా టైటిల్ అయ్యింది. మంచు మోహన్బాబు ఫ్యామిలీ మొత్తం నటిస్తున్న చిత్రానికి ఈ టైటిల్నే నిర్ణయించారు. టైటిల్లోనే ఏదో ఆసక్తి ధ్వనిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మోహన్బాబు హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్లు కూడా హీరోలుగా నటిస్తున్నారు. రవీనాటాండన్, హన్సిక, ప్రణీత నాయికలు. ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. అరియాన-వివియాన సమర్పణలో మంచు విష్ణువర్థన్బాబు - మంచు మనోజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థలో ఇది 58వ చిత్రం. మోహన్బాబు విభిన్న గెటప్తో ఉన్న ఫస్ట్లుక్ని బుధవారం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి, బప్పీలహరి, మణిశర్మ, బాబా సెహగల్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఫలణి కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్కుమార్.ఆర్. -
కేరళలో 'సర్వ కళా వల్లవన్'గా 'దూసుకెళ్తా'
మలయాళ ప్రేక్షకులకు మరోసారి దగ్గరైనందుకు చాలా సంతోషంగా ఉంది అని మంచు విష్ణు అన్నారు. గత సంవత్సరం విడుదలైన 'ఎదునమ్ రెఢి' చిత్రాన్ని కేరళ సినీ ప్రేక్షకుల చక్కగా ఆదరించారని ఆయన అన్నారు. తాజాగా మంచు విష్ణు నటించిన దూసుకెళ్తా చిత్రం 'సర్వ కళా వల్లవన్' పేరుతో మలయాళంలోకి అనువదించి శుక్రవారం కేరళ రాష్ట్రంలో విడుదల చేశారు. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'దూసుకెళ్తా' చిత్రానికి వీరు పోట్ల దర్శకత్వం వహించారు. 'దూసుకెళ్తా' చిత్రం అక్టోబర్ 17వ తేదిన విడుదలై తొలివారంలోనే 14.83 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. -
నృత్యాలూ పోరాటాల విషయంలో చాలా కష్టపడ్డాను - విష్ణు
‘‘ ‘దూసుకెళ్తా’ విడుదలై 9 రోజులైంది. ఇంకా తరగని వసూళ్లతో దూసుకెళుతోందీ సినిమా. అన్ని ప్రాంతాల నుంచీ మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో డా.మోహన్బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవల విడుద లైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ... శనివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. అయితే... నటన విషయంలో నేను ఎప్పుడూ సంతృప్తి చెందను. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నృత్యాలూ పోరాటాల విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. అయితే... ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసాలు మాత్రం చేయలేదు. వచ్చేవారం భారీగా విజయోత్సవాన్ని జరుపుతాం’’ అని తెలిపారు. ‘‘ఓ వైపు దసరా సెలవులు అయిపోయాయి. మరో వైపు భారీ వర్షాలు. అయినా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం తగ్గలేదు. విష్ణు ఎనర్జిటిక్ యాక్షన్, బ్రహ్మానందం, ‘వెన్నెల’కిషోర్, రఘుబాబుల కామెడీ సన్నివేశాలు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని వీరు పోట్ల చెప్పారు. ‘ఢీ’ లాంటి మంచి కథ కుదిరితే... తన దర్శకత్వంలో విష్ణుతో ఓ సినిమా చేస్తానని రచయిత గోపిమోహన్ చెప్పారు. -
ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి
షిర్డీసాయి, ఇంటింటా అన్నమయ్య చిత్రాల పుణ్యమా అని కొన్నాళ్లుగా ఆధ్యాత్మికానందంలోనే ఉండిపోయిన దర్శకేంద్రుడు... మళ్లీ తన శైలిలోకి వచ్చేశారు. తనలోని మాస్ యాంగిల్ తడాకా ఏంటో చూపించే పనిలో ఉన్నారాయన. ఇంతకీ కె.రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తోంది ఏ సినిమాకు అనుకుంటున్నారా? మంచు విష్ణు కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో ‘దూసుకెళ్తా’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ మిగిలివున్న పాటను మంచు ఫ్యామిలీ రిక్వెస్ట్ మేరకు రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తున్నారు. ‘మాస్’ అనే పదానికి పర్యాయపదమైన దర్శకేంద్రుడు... ఈ పాటను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరో విషయం ఏంటంటే... ఈ ప్రత్యేకగీతంలో నర్తించే అవకాశాన్ని మంచు లక్ష్మి కొట్టేశారు. తమ్ముడి ఇంట్రడక్షన్ సాంగ్లో అక్క అడుగు కదపనున్నారన్నమాట. పాటలను తెరకెక్కించడంలో కె.రాఘవేంద్రరావు స్పెషలిస్ట్. అందుకే ఆయన తీసే పాటలో నర్తించడానికి కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ విధంగా మంచు లక్ష్మికి ఇది నిజంగా గొప్ప అవకాశమే. ‘ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా’ అనే ఈ పాట సినిమాకు హైలైట్గా నిలుస్తుందని మంచు విష్ణు చెబుతున్నారు. శనివారం పాటలను, అక్టోబర్ 11న సినిమాను విడుదల చేస్తామని విష్ణు చెప్పారు. -
పవర్ఫుల్గా దూసుకెళ్తా
మంచు విష్ణు గమ్యం వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తాజాగా చేసిన ‘దూసుకెళ్తా’ చిత్రం సర్వహంగులతో సిద్ధమవుతోంది. ఈ నెల 28న టైమ్స్ మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేయబోతున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిందాస్’, ‘రగడ’ ఫేమ్ వీరు పోట్ల ఈ సినిమాకు దర్శకుడు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి కథానాయిక. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ తరహాలోనే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోందని దర్శకుడు చెబుతున్నారు. ఇందులో విష్ణు పాత్ర చిత్రణ చాలా పవర్ఫుల్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విష్ణు కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మోహన్బాబు సన్నాహాలు చేస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆర్.విజయకుమార్. -
సరికొత్తగా 'దూసుకెళ్తా'
‘దేనికైనా రెడీ’ విజయం తర్వాత మంచు విష్ణు తన కెరీర్ని ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. తన శారీరక భాషకు నప్పే విధంగా యాక్షన్ ఎంటర్టైనర్లు చేయాలని విష్ణు నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ‘దూసుకెళ్తా’ సినిమా చేస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘బిందాస్’, ‘రగడ’ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల ‘దూసుకెళ్తా’లో విష్ణుని సరికొత్త రీతిలో ఆవిష్కరిస్తున్నారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. ఆరియానా-వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. టైమ్స్ మ్యూజిక్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరున పాటలు విడుదల కానున్నాయి. మణిశర్మ స్వరాలందించారు. అక్టోబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. -
దూసుకెళ్తాలో అన్నీ హైలైట్సే!
‘‘మా సినిమా చాలా బాగా వస్తోంది. ఆ సంకేతాలు లొకేషన్లో కనిపిస్తున్నాయి. ఒక విజయవంతమైన సినిమాని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నామనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు విష్ణు. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్బాబు నిర్మిస్తున్న చిత్రం ‘దూసుకెళ్తా’. విష్ణు, లావణ్య జంటగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్యాచ్వర్క్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రకథను వీరు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ లుక్కి మంచి స్పందన లభించింది. కథ, పాటలు, ఫైట్లు, సన్నివేశాలు.. అన్నీ హైలైట్గా ఉంటాయి. ఈ నెలాఖరున టీజర్ను, వచ్చే నెల పాటలను, అక్టోబర్ మొదటి వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇందులో విష్ణు కొత్త లుక్లో కనిపిస్తారు. విష్ణు, లావణ్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ జంట బాగుందని అందరూ అంటున్నారు. అలాగే టైటిల్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. బ్రహ్మానందం, ఆహుతిప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్కుమార్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ.