Waltair Veerayya
-
చిరంజీవి సినిమా.. రవితేజ చేయనన్నాడు: దర్శకుడు బాబీ
గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రెండు వందల కోట్లకుపైగా రాబట్టింది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. నిజానికి మొదట్లో రవితేజను ఈ సినిమా కోసం అనుకోలేదట. తీరా అనుకున్నాక మాస్ మహారాజ సినిమా చేయనన్నాడట. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. నాకు బ్రేక్ ఇచ్చింది రవితేజ 'నేను ఈ సినిమా కథ చెప్పగానే చిరంజీవి ఓకే అన్నారు. అప్పటికింకా రవితేజ పాత్ర రాసుకోలేదు. కానీ నాకే ఎక్కడో తెలియని అసంతృప్తి. రవితేజ లాంటి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందనిపించింది. రచయితగా ఎన్నో కష్టాలు పడుతూ, అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో రవితేజ నన్ను గుర్తించి దర్శకుడిగా నాకో అవకాశం ఇచ్చారు. అలా ఆయనతో పవర్ సినిమా తీశాను. అప్పటినుంచి పెన్ను పట్టుకుంటే చాలు రవితేజయే గుర్తొస్తుంటాడు. అలా ఓరోజు వాల్తేరు వీరయ్య కథ సెకండాఫ్లో రవితేజను తీసుకొద్దాం అని నా టీమ్కు చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. కానీ అప్పటికే చిరంజీవితో 80 శాతం సినిమా పూర్తయింది. రవితేజ పాత్రపై ఆరు నెలలు కష్టపడ్డా అలాంటి సమయంలో తమ్ముడి పాత్రను హైలైట్ చేసి మళ్లీ షూటింగ్ చేద్దామంటే ఏమంటారోనని భయపడ్డాను. రవితేజ పేరు చెప్పకుండా సెకండాఫ్లో తమ్ముడి పాత్ర ఇలా ఉంటుందని చిరుకు చూచాయగా చెప్పాను. ఆయన వెంటనే ఆ తమ్ముడి పాత్ర చేసేది రవితేజ కదా.. అదిరిపోయిందన్నారు. నిర్మాతకు చెప్తే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బడ్జెట్ పెరిగినా ఓకే, మేము చూసుకుంటాం.. కానీ మిస్ఫైర్ కాకుండా చూసుకో అని సుతిమెత్తగా హెచ్చరించారు. అప్పటివరకు షూట్ చేసిన సెకండాఫ్ పక్కనపడేశాం. అయితే రవితేజ ఎప్పుడూ సపోర్టింగ్ రోల్ చేయలేదు. ఆయన్ను ఎలా అడగాలా? అని నాలో నేనే మథనపడ్డాను. ఆరు నెలలపాటు ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుని ఆ తర్వాత రవితేజ దగ్గరకు వెళ్లాను. రవితేజ ఒప్పుకోలేదు సర్, నాకు రేపు ఒక గంటపాటు సమయం కేటాయిస్తే కథ చెప్తాను అన్నాను. చిరంజీవి సినిమా అయిపోయాక మాట్లాడుకుందాం అన్నారు. నేను ఓ క్షణం ఆగి చిరంజీవి సినిమా కథే వినమంటున్నానని చెప్పాను. ఆయన సినిమాలో నాకోసం ఓ పాత్ర అనుకుంటున్నావా? అని నేరుగా అడిగేశారు. అందుకు నేను అవును సర్, ముందు కథ చెప్తాను.. నచ్చితేనే చేయండి అన్నాను. ఆయన మాత్రం వద్దులే అబ్బాయ్.. ఇప్పటికే నాకు వరుసగా సినిమాలున్నాయ్.. మళ్లీ నువ్వు కథ చెప్పాక నచ్చలేదంటే బాగోదు. చిరు అన్నయ్య సినిమాను రవి రిజెక్ట్ చేశాడన్న పేరు వద్దన్నారు. మొత్తానికి సరేనన్నారు సర్, మీరు కథ వినండి.. నచ్చకపోతే చేయొద్దు. అసలు నేను మిమ్మల్ని సంప్రదించిన విషయం కూడా ఎవరికీ చెప్పనన్నాను. అప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. కట్ చేస్తే తెల్లారి కలుద్దామన్నారు. వెళ్లి కథ చెప్పగా.. అన్నయ్యతో ఎప్పటినుంచో చేయాలనుంది, చేసేద్దాం అన్నారు. అలా వారిద్దరి కాంబినేషన్ కుదిరింది' అని చెప్పుకొచ్చాడు బాబీ. కాగా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. -
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'కు 365 రోజులు.. ఎక్కడో తెలుసా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. గతేడాది బాక్సాఫీస్ హిట్గా భారీ విజయాన్ని అందుకుంది. శుత్రిహాసన్, రవితేజ నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది అత్యధిక కలెక్షన్స్ (రూ. 236 కోట్లు) రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఒకప్పుడు సినిమాలు 100 రోజుల పాటు థియేటర్లలో కనిపిస్తేనే అదొక రికార్డు.. ఇప్పటి రోజుల్లో ఏ సినిమా అయినా కానివ్వండి బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రూ. 100 కోట్లు వచ్చాయా..? అని చూస్తున్నారు. అలా అయితేనే నేటి రోజుల్లో సినిమా హిట్ అనేస్తున్నారు. అలాంటిది చిరంజీవి వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుకకు రెడీగా ఉంది. ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో విడుదల రోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా సినిమా కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేయనుంది. నేడు సాయింత్రం (జనవరి 9) అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో మెగా ఫ్యాన్స్ 365 రోజుల వేడుక చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతేడాదిలో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకను చిత్ర యూనిట్ హైదరాబాద్లో జరిపింది. ఆ సమయంలో చిరంజీవి ఇలా మాట్లాడారు. 'అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్టు అనిపిస్తోంది' అని సంతోషం వ్యక్తం చేశారు. అలా పాతరోజులను ఆయన మళ్లీ గుర్తుచేసుకున్నారు. వాల్తేరు వీరయ్య నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. -
అప్పుడు వాల్తేరు వీరయ్య. ఇప్పుడు దేవర..?
-
2023 టాలీవుడ్లో టాప్-10 కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు
కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టేస్తాము. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలో మనమేం సాధించాం..? ఏం నష్టపోయాం..? అనే లెక్కలు వేసుకోవడం సహజం. సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా కేవలం బాలీవుడ్కు మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అక్కడి చిత్రాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాలీవుడ్కు పోటీగా టాలీవుడ్ చిత్రపరిశ్రమ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్-10లో ఉన్న చిత్రాల గురించి ఒకసారి చూద్దాం. కేవలం ఈ కలెక్షన్స్ వివరాలు టాలీవుడ్ పరిధి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించగలరు. 1. 'వాల్తేరు వీరయ్య' మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్తో దుమ్మురేపింది. ఇందులో రవితేజ కీ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్లో రూ. 160 కోట్ల రాబట్టి 2023లో విడుదలైన చిత్రాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ పరంగా టాప్-1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 2. ఆదిపురుష్- ప్రభాస్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 'ఆదిపురుష్'. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 393 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్లో 'వాల్తేరు వీరయ్య' కంటే కలెక్షన్స్ పరంగా 'ఆదిపురుష్' వెనకపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఉన్నా కూడా టాలీవుడ్లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 3. వీరసింహా రెడ్డి - బాలకృష్ణ 2023 సంక్రాంతి బరిలో 'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ రేసులో మెగాస్టారే పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 134 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 97 కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 4. భగవంత్ కేసరి- బాలకృష్ణ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 5. 'బ్రో'- సాయిధరమ్ తేజ్,పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్ ప్రధాన కథానాయకుడిగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దీనిని డైరెక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 114 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 6. దసరా- నాని నాని పాన్ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేశ్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రంకావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 118 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 76 కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 7. జైలర్- రజనీకాంత్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 604 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 68 కోట్లు రాబట్టి ఏడో స్థానం దక్కించుకుంది. రజనీకాంత్ కెరియర్లో ఆల్టైమ్ హిట్గా జైలర్ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 8.'బేబీ'- ఆనంద్ దేవరకొండ 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రేమ కథా చిత్రం 'బేబీ' . సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 81 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 64 కోట్లు రాబట్టి ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 9. విరూపాక్ష- సాయిధరమ్ తేజ్ సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్కు బిగ్గెస్ట్ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 10. సలార్- ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సలార్ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతానికి (డిసెంబర్ 23) టాలీవుడ్లో రూ. 101కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ టెన్ లస్ట్లో మూడో స్థానానికి సలార్ చేరుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్స్ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్ కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యే సరికి టాప్-1 లోకి కూడా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ డిజిటల్ రైట్స్ను సుమారు రూ.160 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. -
మెగాస్టార్ వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వామ్మో 276 కోట్ల..ఒక్క సారిగా షాక్ ఇచ్చిన ఊర్వశి
-
వాల్తేరు వీరయ్య...ఇప్పుడు DJ వీరయ్య
-
అలా డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డిలో నటించిన సంగతి తెలిసింగదే. తాజాగా కోలీవుడ్ భామ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సాంగ్పై కామెంట్స్ చేశారు. శృతిహాసన్ మాట్లాడుతూ..'మంచులో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం. హీరోలు మాత్రం చలిని తట్టుకునేలా జాకెట్స్ వేసుకుంటారు. కానీ మాకు అలాంటివేమీ ఇవ్వరు. కనీసం కోట్, శాలువా కూడా ఇవ్వరు. మేము కేవలం శారీ, జాకెట్ ధరించి ఆ గడ్డ కట్టిన మంచులో డ్యాన్స్ చేయాలి. దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇటీవలే ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో ఓ సాంగ్ను పూర్తిగా మంచుకొండల్లో చిత్రీకరించారు. -
మొదటి రోజే అదరగొట్టిన దసరా.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం 'దసరా'. ఈ సినిమా శ్రీరామనవమి సందర్భంగా థియటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ రెండు చిత్రాలను దాటేసి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దసరా'కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దసరా విడుదలైన మొదటి రోజే సంక్రాంతి హిట్ సినిమాలను అధిగమించేసింది. ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా.. బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'కి రూ. 6.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలను దాటేసిన నాని 'దసరా' నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు సుమారు రూ.25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 14.22 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా 'దసరా' రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు రూ.38 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
అలా చూపిస్తే వాల్తేరు వీరయ్య హిట్ అయ్యేది కాదు: పరుచూరి
ప్రముఖ lతెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూను వెల్లడించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'వాల్తేరు వీరయ్య చాలా సింపుల్ స్టోరీ. కానీ రవితేజ బదులు రామ్ చరణ్ చేసి ఉంటే చిరంజీవికి మైనస్ మార్కులు పడేవి. ఎందుకంటే తమ్ముడి పాత్రలో రవితేజ పాత్ర చూశాక.. చరణ్ చేస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చా. అందుకే రవితేజను పెట్టారు. ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకం. పైగా ఒక ఫిషర్ మ్యాన్కు జోడిగా శృతిహాసన్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ చిరంజీవి సినిమా మెగా ఆడియన్స్ను దృష్టిలో ఉంచుకుని తీశారు. చిరంజీవి, రవితేజ.. హీరోయిన్స్తో ప్రేమాయణం లాంటివి కథలో చూపిస్తే సినిమా హిట్ అయ్యేది కాదు.' అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా?) చిరంజీవి నటనపై పరుచూరి మాట్లాడూతూ..' తనకు వర్టిగో వ్యాధి ఉందని చెప్పే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. మనకు తెలియకుండా ఆ వ్యాధితో ఏమైపోతాడోననే భయాన్ని ఆసాంతం ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. సంభాషణలు, పొడి పొడి మాటలు బాగున్నాయి. ఊహకందని ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. మలేషియాకు వెళ్లినప్పుడు బంపర్ ట్విస్ట్ ఇచ్చారు. మలేషియా నుంచి ఓ కాంట్రాక్ట్ తీసుకుని వచ్చిందే కథ. ఇందుకు కథ రచయిత బాబీని మెచ్చుకోవాలి. అప్పట్లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే కనిపించారు. ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, కేథరిన్ బాగా నటించారు. వారి పాత్రలూ సినిమా విజయంలో స్థానం దక్కించుకున్నాయని' అని అన్నారు. మెగా ఫ్యాన్స్కు అద్భుతమైన అనుభూతిని అందించిన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూనకాలు లోడింగ్' అనే పదం కేవలం అభిమానుల కోసమే పెట్టారని వెల్లడించారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. -
ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్ర ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. చదవండి: నటుడిపై వేధింపులు.. మహిళా డైరెక్టర్ అరెస్ట్ వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తికావడంతో ఇవాళ (ఫిబ్రవరి 27) అర్దరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాందో చూడాలి. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ నిర్మించిన ఈచిత్రంలో ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ థ్రెసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
మాస్ హీరోల దాడి.. అందాల భామలకు మళ్లీ కష్టాలే!
ఇటీవలకాలంలో హీరోయిన్స్ ...హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతే కాదు హీరోలతో పాటు సమానంగా స్క్రీన్ స్పెస్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ట్రెండ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. దీంతో హీరో సెంట్రిక్ సినిమాల హవా మొదలయింది. మాస్ హీరోల సినిమాల దాటికి వుమెన్ సెంట్రిక్ సినిమాలకి అనుకున్న రేంజ్ లో హైప్ రావటం లేదు.. దీంతో స్టార్ హీరోయిన్స్ సైతం ఇప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ కోసం నానా తంటాలు పడుతున్నారు. హీరోల ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ తో స్క్రీన్ నిండిపోవటంతో.. హీరోయిన్స్ పాటలకి..రెండు సీన్స్ కి పరిమితం అయిపోతున్నారు. గతంలో కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్మూలా ఉండేది..ఆరు పాటలు...ఆరు ఫైట్స్...మధ్య లో హీరోయిన్ తో రెండు మూడు సీన్స్ ... ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కి ఆదరణ పెరగటంతో...హీరోయిన్స్ స్క్రీన్ స్పెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. సంక్రాంతి కి రిలీజైన కమర్షియల్ మూవీస్ చూస్తే...ఈ విషయం క్లారిటీగా అర్ధమైపోతుంది. వాల్తేరు వీరయ్య...వీర సింహారెడ్డి..వారసుడు సినిమాల్లో హీరోయిన్స్ నామా మాత్రంగానే కనిపించారు. వాళ్ల పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య లో శృతిహాసన్ రా ఏజెంట్ క్యారెక్టర్ చేసినా..పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కించుకోలేకపోయింది. ఇక వీర సింహారెడ్డిలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ పాటలకే పరిమితం అని చెప్పాలి. వారసుడులో నటించిన రష్మిక మందన్న పరిస్థితి కూడా అలానే అయింది. పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ములేపిన సినిమాలు కెజిఎఫ్ చాపర్ట్ వన్..కెజిఎఫ్ ఛాప్టర్ 2.. ఈరెండు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. కానీ స్క్రీన్ స్పెస్ తక్కువనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలతో బజ్ క్రియేట్ చేయలేకపోతున్న హీరోయిన్స్ కి... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కలిసి రావటం లేదు. ఈ మధ్య యశోద మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సమంత..అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు సమంత పేరు ఇండస్ట్రీలో బాగానే వినిపించినా..ఆ తర్వాత ఎక్కడా సమంత పేరు వినబడలేదు. ఇక కమర్షియల్ సినిమాలనే నమ్ముకున్న కీర్తి సురేష్, రష్మిక మందన్న, పూజా హెగ్డే... లాంటి హీరోయిన్ల పేర్లు సినిమా ఎనౌన్స్మెంట్ ...మూవీ ఓపెనింగ్స్ లో తప్ప ఎక్కడ వినిపించటం లేదు. ఇక సినిమాలు సక్సెస్ అయితే హీరో దర్శకులు గురించి మాట్లాడుతున్నారు తప్ప... హీరోయిన్స్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు. హీరో సెంట్రిక్ సినిమాలకు క్రేజ్ రావటంతో...ఈ అందాల భామలను ప్రేక్షకులు కూడా పట్టించుకోవటం లేదు. సో..మొత్తానికి కమర్షియల్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై నల్లపూసల్లా మారిపోయిన హీరోయిన్స్ క్రేజ్ తగ్గిందనే మాట ..ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది. -
ఈ వారం థియేటర్స్లో చిన్న చిత్రాలు..ఓటీటీలో బ్లాక్ బస్టర్స్
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సంక్రాంతి పండగా కారణంగా జనవరిలో అన్ని పెద్ద చిత్రాలే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఫిబ్రవరి నెలలో వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో రైటర్ పద్మభూషన్.. సార్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకోగా.. పెద్ద చిత్రాలుగా వచ్చిన అమిగోస్, మైఖేల్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ నెల చివరి వారంలో థియేటర్స్ సందడి చేసేందుకు చిన్న చిత్రాలు రెడీ అయితే.. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్స్లో సందడి చేసే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. మిస్టర్ కింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు టాలీవుడ్కి పరిచయం కాబోతున్నాడు. దివంగత దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా శశిధ్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. యశ్విక నిష్కల, ఊర్వి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోససీమ థగ్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగులో ‘కోనసీమ థగ్స్’పేరుతో ఈ చిత్రం రిలీజ్ రాబోతుంది. డెడ్లైన్ అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డెడ్ లైన్. బొమ్మారెడ్డి.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్లో విడుదల కాబోతుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న పెద్ద చిత్రాలు వారసుడు తమిళస్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 23నుంచి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ కానుంది. మైఖేల్ సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సంక్రాతి బరిలో నిలిచి సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాలు ఓటీటీలోనూ అలరించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. మిగతా సినిమాలు వచ్చే వారం స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్లలో చూడలేక మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఓటీటీలో వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కళ్యాణం కమనీయం యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. తాజాగా ఈ ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తునివు తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. వచ్చేస్తున్న వారసుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు(వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. -
Maha Shivaratri 2023: థియేటర్స్లో మళ్లీ ఆ సూపర్ హిట్ మూవీస్..ఎక్కడ?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్ డే వస్తే చాలు ఓల్డ్ సూపర్ హిట్ మూవీస్.. రీరిలీజ్కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్కు రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. పుష్ప ది రైజ్ ఐకాన్స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18న హైదరాబాద్లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అఖండ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 18న హైదరాబాద్లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్స్లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయనున్నారు. కాంతార చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్లోని సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. టెంపర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ని కొత్త లుక్లో చూపించడమే కాదు.. యాక్టింగ్లోనూ మరో యాంగిల్ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని దేవి థియేటర్స్లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మహేశ్బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు, దూకుడు చిత్రం సుదర్శన్లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. -
అఫీషియల్: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అసలు కథేంటంటే.. వైజాగ్లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB — Netflix India South (@Netflix_INSouth) February 7, 2023 -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మెగాస్టార్.. ఒక్కో సినిమాకి ఎంతంటే..
చాలా కాలం తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు నటించిన చిత్రాలలో ఆచార్య బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడగా.. గాడ్ఫాదర్ మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేదు. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య మాత్రం భారీ విజయాన్ని సాధించింది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుంది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.250 కోట్లపై పైగా వసూళ్లను సాధించి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో చిరంజీవి తన రెమ్యునరేషన్ అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. పలు వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. వాల్తేరు వీరయ్య సినిమా కోసం రూ.50 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకున్నాడట చిరంజీవి. అలాగే ప్రస్తుతం నటిస్తున్న బోళా శంకర్ చిత్రానికి కూడా అంతే పారితోషికం అందుకున్నాడట. కానీ ఈ చిత్రం తర్వాత నటించబోయే సినిమాలకు మాత్రం రూ.100 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. తన మార్కెట్కు తగ్గట్టుగా పారితోషికం తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడట. బోళా శంకర్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
అంజనమ్మకు నేను నాలుగో కొడుకుని, ఆస్తి అడగట్లేదు..: రచ్చ రవి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ సాధించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించాడు. శనివారం ఈ సినిమా విజయోత్సవ సభ హన్మకొండలో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మెగాస్టార్పై తనకున్న అభిమానం, ఆరాధనను మాటల్లో చూపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు రవి. ఈ క్రమంలో తన స్పీచ్కు అడ్డొస్తున్న యాంకర్ సుమపై విసుక్కున్నాడు. 'ఓ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతా. జీవితంలో ఇంకెక్కడా మాట్లాడను. నీ కాల్మొక్తా బాంచన్.. నన్ను ఆపకు(సుమ వైపు చూస్తూ). ఓరుగల్లు నీళ్లు తాగి హైదరాబాద్కు వచ్చిన. కృష్ణానగర్లో నా కన్నీళ్లు నేను తాగి బతికిన.. కానీ ఒకటే చిరంజీవి అభిమానిగానే బతుకుతున్నా.. అన్నను థియేటర్లో చూసిన నేను ఒక్కసారి అన్నను నేరుగా చూస్తే చాలనుకున్నా. అలాంటిది అడగ్గానే బాబీ అన్న నాకు చిరంజీవి అన్న సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిండు. అంజనమ్మకు ముగ్గురు కొడుకులైతే నేను నాలుగో కొడుకుగా ప్రకటించుకుంటున్నా. ఆస్తి అడగట్లేదు, ఎప్పుడూ వారి వెనకే ఉంటాను. మెగాస్టార్ను చూస్తే చాలనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. జీవితానికి ఇది చాలు అని ఎమోషనలయ్యాడు రచ్చ రవి. చదవండి: త్వరగా వచ్చేయ్, నిన్ను చాలా మిస్ అవుతున్నా స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనం -
స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనం: చిరంజీవి
సాక్షి, హన్మకొండ చౌరస్తా: ‘ఓరుగల్లు ప్రజల ప్రేమ, వాత్సాల్యం స్వచ్ఛమైనది. ఈ గడ్డపై ఎన్నో సంవత్సరాల తర్వాత అడుగుపెట్టా. అప్పుడు ప్రజా అంకిత యాత్రకు వచ్చిన జనవాహిని, అభిమానం నేడు మళ్లీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది’ అని మెగాస్టార్ చిరంజీవి ఆనాటి రాజకీయ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ విజయ విహార విజయోత్సవ సభ శనివారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగింది. వేలాదిగా తరలివచ్చిని అభిమానుల నడుమ విజయోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ప్రత్యేక అతిథిగా మెగా పవర్స్టార్ రాంచరణ్ హాజరు కాగా సినీ దర్శకుడు బాబీ, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్తో పాటు చిత్ర బృందం, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నగర మేయర్ గుండు సుధారాణి, చిత్ర బృందం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్లు షీల్డ్లు అందజేసి సత్కరించారు. అనంతరం రాంచరణ్కు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య షీల్డ్ను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అశేష అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా విజయోత్సవ సభను ఎక్కడా జరుపుకుందామని తాము చర్చించుకుంటున్న సమయంలో స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనమని అందుకే ఇక్కడ సభ నిర్వహించేందుకు సిద్ధపడినట్లు తెలిపారు. ఒక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. గ్యాంగ్లీడర్, ఘరానామొగుడు లాంటి సినిమాల్లో మాదిరిగా మళ్లీ నన్ను అభిమానులకు అలా చూపించిన దర్శకుడు బాబీ, మంచి హిట్ను అందించిన నిర్మాతలు నవీన్, రవిశంకర్, ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. మేము క్వైట్గా ఉన్నంత వరకే.. మెగా పవర్స్టార్, చిరంజీవి తనయుడు రాంచరణ్ మాట్లాడుతూ ‘ఇటీవల కాలిఫోరి్నయాకు వెళ్తే.. ఓ మ్యాగజైన్ ఎడిటర్ మీ దగ్గర అభిమానం ఎలా చూపెడుతారు అని అడిగారు.. ఇప్పుడు చెబుతున్న అభిమానమంటే ఇలా ఉంటుంది’ అని చూపెట్టారు. తనకు హిట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ నాన్నకు హిట్ ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సినిమా అంటే ప్యాషన్, ప్రేమ ఉన్నవారే ఇలాంటి చిత్రాలు ఇవ్వగలరన్నారు. సినిమాలో పూనకాలు సాంగ్ నన్ను రవితేజ దమాకా సినిమా చూసేలా చేసిందని పేర్కొన్నారు. చిరు సినిమాలకు ఎవరు ముఖ్య అతిథులు ఉండరని, ఆయనే అతిథి అని అన్నారు. ‘మా నాన్న చిరంజీవి చాలా సౌమ్యుడు. అందుకే నిశ్శబ్దంగా ఉంటున్నాడు. అతను క్వైట్గా ఉన్నంత వరకే ఏం చేసినా. లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయి’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. బ్లాక్లో కొని చూశా: దర్శకుడు బాబీ తాను ఇంటర్ చదువుతున్న సమయంలో హాస్టల్ గోడ దూకి రూ.200 వెచ్చించి బ్లాక్లో క్యాసెట్ కొని అన్నయ్య సినిమా చూశానని సినిమా దర్శకుడు బాబీ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కావడానికి సహకరించిన దర్శకులు వీవీ వినాయక్, మెహర్రమేష్లకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాను ప్రేమ, మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితో చేశానని అన్నారు. వరంగల్లో స్టూడియో పెట్టండి: మంత్రి ఎర్రబెల్లి వరంగల్లో సినీ స్టూడియో పెట్టండి.. అందుకోసం స్టేజీపైన ఉన్న ఎమ్మెల్యేలు, నేను సీఎం కేసీఆర్, కేటీఆర్లతో మాట్లాడాతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నిర్మాత నవీన్తో తనకు 20 సంవత్సరాలకు పైగా సన్నిహితం ఉందని, మంచి మిత్రుడని తెలిపారు. -
నాన్న జోలికొస్తే ఊరుకోము.. రామ్చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య విజయ విహారం వరంగల్లోని హన్మకొండలో నిర్వహించారు. ఈ సక్సెస్మీట్లో పాల్గొన్న రామ్చరణ్ వేదికపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవిగారిని ఏమైనా అనగలిగితే కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే అనగలరు. నాన్న సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు. ఆయన సైలెంట్గా ఉంటారేమోకాని మేం ఉండం.మేం క్వైట్గా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి' అంటూ రామ్చరణ్ హెచ్చరించాడు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మరింది. ఈ సందర్భంగా కొందరు నిర్మాతలకు సైతం చరణ్ చురకలించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో పనిచేసిన హీరోలందరికి హిట్లు ఇచ్చారని, కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి, ఎలా చూసుకోవాలనేది అంటూ చరణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
Waltair Veerayya Team Photos: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో తొక్కిసలాట
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండలో జరుగుతున్న సక్సెస్ మీట్లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. అందరూ ఒక్కసారిగా గేటు తోసుకుని రావడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగినట్లు సమాచారం. వీరయ్య విజయ విహారం పేరిట వాల్తేరు వీరయ్య చిత్రబృందం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే!) కాగా.. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్తో దూసుకెళ్తోంది వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హిట్ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ తెచ్చుకుంది. -
హీరోయిన్కు మెగాస్టార్ బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్
వాల్తేరు వీరయ్య హీరోయిన్కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ శృతిహాసన్ పుట్టిన రోజు సందర్భంగా చిరు విష్ చేశారు. ఈ మేరకు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమాలో 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ సాగే' పాటలోని ఫోటోను జత చేశారు. దీంతో మెగా అభిమానులు సైతం శృతిహాసన్కు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ ట్విటర్లోరాస్తూ..' ప్రియమైన శ్రుతిహాసన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీ కెరీర్ అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. వృత్తి పట్ల మీ అంకితభావం, మీకున్న బహుముఖ ప్రజ్ఞతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా.' అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Happy Birthday Dear @shrutihaasan Have a Wonderful year ahead and May you scale greater heights with your passion & multi talents!!! 💐💐 pic.twitter.com/YV0sCb8Yzf — Chiranjeevi Konidela (@KChiruTweets) January 28, 2023 -
వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే!
సాక్షి, మోపిదేవి (అవనిగడ్డ): వాల్తేరు వీరయ్య సినిమా ఫస్టాఫ్లో విలన్ క్యారెక్టర్ చేసిన బాబీసింహాని అందరూ తమిళ నటుడు అనుకుంటున్నారు కాని ఆయన మనోడే... కృష్ణాజిల్లా దివిసీమలో మోపిదేవి మండలం కోసూరివారిపాలెం వాసి. ఈ సినిమాలో చిరంజీవితో పోటీపడి విలన్గా మెప్పించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. విక్రమ్ సామి తమిళ అనే చిత్రంలో అద్భుతమైన విలనిజం ప్రదర్శించాడు. హీరో విక్రమ్తో పోటీపడి నటించి తమిళ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో సాల్మన్సీజర్గా చిరంజీవితో పోటీపడి చేసిన నటన బాబీసింహాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కోసూరువారిపాలెం నుంచి కోయంబత్తూర్కు... మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెంకు చెందిన లింగం రామకృష్ణ – కృష్ణకుమారి దంపతుల చిన్న కుమారుడే బాబీసింహా. ఆయన తల్లి కృష్ణకుమారి స్వగ్రామం గూడూరు మండల పరిధిలోని తరకటూరు. బాబీసింహా మోపిదేవి ప్రియదర్శిని స్కూల్లో 4 నుంచి 8వ తరగతి వరకూ చదివాడు. బాబీసింహా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేందుకు 1996లో తమిళనాడులోని కోయంబత్తూరుకు వలస వెళ్లారు. బాబీసింహా అక్కడే బీసీఏ చదివాడు. అనంతరం సినీరంగంపై ఉన్న మోజుతో కూర్తుపాత్తరాయ్ యాక్టింగ్ స్కూల్లో మూడు నెలలు నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. షార్ట్ఫిలింతో గుర్తింపు 2010లో తొలిసారిగా ది ఏంజల్ అనే షార్ట్ఫిలింని బాబీసింహా రూపొందించాడు. ఆయన మొత్తం 9 షార్ట్ ఫిల్మ్ లు తీయగా ‘విచిత్తిరిమ్’ అనే షార్ట్ఫిలింకు 2012లో బెస్ట్ యాక్టర్ ఇన్ లిటిల్షోస్ అవార్డు లభించింది. ఈ బుల్లి చిత్రమే ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. బాబీసింహా జిగర్తంద చిత్రంలో సహాయనటుడిగా చేసిన నటనకు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో ఇప్పటివరకూ 40 సినిమాల్లో నటించాడు. లవ్ ఫెయిల్యూర్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి... 2012లో తమిళ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీరంగ ప్రవేశం చేసిన బాబీసింహా అదే సంవత్సరం తెలుగులో లవ్ఫెయిల్యూర్ చిత్రంలో నటించాడు. తరువాత సైజ్జీరో, రన్ చిత్రాల్లో నటించాడు. తెలుగు వాడైనా తమిళంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తమిళంలో 28 చిత్రాల్లో నటించగా కో–2, ఉరుమీన్, తిరుత్తి పైయిలే సినిమాల్లో హీరోగా నటించాడు. ఇరైవి, మెట్రో, మురిప్పిరి మనమ్, పాంబుసలై చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. తమిళంలో ఆయన్ను అభిమానులు సింహా అని ముద్దుగా పిలుచుకుంటారు. మలయాళంలో ఐదు చిత్రాల్లో నటించగా ‘కుమ్మర సంబరియం’ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. హీరోగా నటిస్తూనే ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకున్నారు. 2016లో తోటి నటి రేష్మి మీనన్ని వివాహం చేసుకున్నాడు. జన్మభూమిపై ఉన్న మమకారంతో 2017లో ఆయన కుటుంబ సమేతంగా వచ్చి మోపిదేవిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో పాపకు పుట్టు వెంట్రుకలు మొక్కు తీర్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కుమారుడికి మోపిదేవిలోనే పుట్టు వెంట్రుకలు తీయించారు. ఈ సందర్భంగా స్వగ్రామమైన కోసూరువారిపాలెంలో శుక్రవారం స్థానికులు ఎడ్లబండిపై ఆయన్ను ఊరేగించి అభిమానం చాటుకున్నారు. సుబ్బారాయుడి సేవలో సినీ నటుడు బాబీసింహా మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని బాబీసింహా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్కుమార్ శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఏసీ ఎన్ఎస్ చక్రధరరావు స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదాలు అందజేశారు. చిరంజీవితో నటించడం మర్చిపోలేని అనుభూతి చదువుకునే రోజుల్లో చిరంజీవిని దగ్గరగా చూడాలని ఆశ ఉండేది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయనతో కలిసి నటించడం మరుపురాని అనుభూతినిచ్చింది. మోపిదేవిలో చదువుకున్న రోజులు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. తమిళ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ మర్చిపోలేను. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేస్తాను. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేయాలని ఉంది. –బాబీసింహా, సినీహీరో చదవండి: రెండు రోజుల్లోనే రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పఠాన్ కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
మూడు నిమిషాలు.. రెండు కోట్లు.. ఊర్వశి రౌతేలా షాకింగ్ రెమ్యూనరేషన్..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ చిరు అభిమానులను ఊర్రూతలూగించింది. బాస్ పార్టీ సాంగ్ ఈ మూవీలో హైలెట్గా నిలిచింది. ఎందుకంటే ఆ సాంగ్లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. మెగాస్టార్తో కలిసి తన డ్యాన్స్తో అందరకొట్టింది బాలీవుడ్ భామ. అయితే ఈ సాంగ్కు ఆమె తీసుకున్న పారితోషికంపై నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. నటి ఊర్వశి రౌతేలా 'బాస్ పార్టీ' పాట కోసం భారీ మొత్తంలో వసూలు చేసిందని సమాచారం. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మూడు నిమిషాల పాట కోసం ఆమె దాదాపు రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విలన్గా నటించిన ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు తీసుకోగా.. ఊర్వశి పారితోషికంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. 2023లోనే అత్యంత ఖరీదైన పాట? వాల్తేరు వీరయ్య చిత్రంలోని ఊర్వశి, చిరంజీవీల 'బాస్ పార్టీ' పాట చిత్రీకరణకు రూ.30 కోట్లు ఖర్చయిందని వార్తలొచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను నకాష్, అజీజ్, డీఎస్పీ, హరిప్రియ ఆలపించారు. కాగా.. తదుపరి ఊర్వశి రౌతేలా రామ్ పోతినేనితో కలిసి కనిపించనుంది. ఆమె 'ఇన్స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సహనటిగా కూడా నటించనుంది. ఆ తర్వాత మిచెల్ మోరోన్తో కలిసి హాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. గ్లోబల్ మ్యూజిక్ సింగిల్లో ఆమె జాసన్ డెరులోతో కలిసి కనిపించనుంది. -
యూఎస్ ఫ్యాన్స్ ప్రేమ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన చిరు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. వాల్తేరు వీరయ్యగా అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. మూవీ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 200కోట్లకు పైగా కలెక్షన్లకు రాబట్టింది. చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇంకా బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తోంది. చిరు స్టామినా ఏమాత్ర తగ్గలేదంటూ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక అమెరికాలో సైతం మెగా ఫ్యాన్స్ ఈ సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో చిరు లైవ్లో ఉన్నప్పుడే కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, డెన్వర్, షికాగో, డాలస్, హ్యూస్టన్ సహా 27 అమెరికన్ సిటీస్ ప్రాంతాలకు చెందిన అభిమానులతో చిరు లైవ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానుల కేకలు, సంతోషం చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న బాస్.. 10 రోజుల్లోనే రూ.200 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య' ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో చిత్రబృందం ఫుల్ జోష్లో ఉంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్పై చిరంజీవి సెటైర్లు) వాల్తేరు వీరయ్య విడుదలైన పది రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది. కేవలం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రావడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. బాస్ పార్టీ సాంగ్, మెగాస్టార్ యాక్టింగ్, డ్యాన్స్, గ్రేస్కు ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్. మాస్ మహారాజ రవితేజ కూడా సినిమాలో ఉండగా వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. Megastar's ACTION PACKED BONANZA CONTINUES at Box Office with 200 CR+ Gross 💥🔥❤️🔥 Watch the MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥 - https://t.co/KjX8J7HFFi@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/4Ma7Fg21r3 — Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023 -
వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్పై చిరంజీవి సెటైర్లు
'వాల్తేరు వీరయ్య' సినిమాతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 13న సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా రూ.182 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది! బాస్ యాక్టింగ్, డ్యాన్స్, గ్రేస్కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. దీనికితోడు మాస్ మహారాజ రవితేజ కూడా సినిమాలో ఉండగా వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లు సినీలవర్స్తో ఈలలు కొట్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిన ఈ సినిమా రిలీజైన రోజు కొన్ని వెబ్సైట్లు వాల్తేరు వీరయ్యకు రెండు, రెండున్నర రేటింగ్ మాత్రమే ఇచ్చాయి. తాజాగా ఈ రేటింగ్పై సెటైర్లు వేశాడు బాస్. 'ఒక చిన్న జోక్ చెప్తాను.. ఎవరినీ విమర్శించడానికి కాదు, సరదాగా తీసుకోండి. కొన్ని వెబ్సైట్లు వాల్తేరు వీరయ్యకు 2, 2.5 రేటింగ్ ఇచ్చాయి. అయినా సరే నేను సినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. సినిమాలో మంచి మాస్ మసాలా కంటెంట్ ఉంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య.. ఇలాంటి సినిమాల్లో ఎంత ఫన్ ఉందో అంతే ఫన్ ఈ సినిమాలో ఇచ్చాం. సినిమా చూస్తే ప్రేక్షకుడి కడుపు నిండిపోతుంది. వారిచ్చే రేటింగ్ పట్టించుకోకూడదనుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది. 2.25 రేటింగ్ అంటే 2.25 మిలియన్స్ అని తర్వాత తెలిసొచ్చింది. మేము అర్థం చేసుకోవడంలో పొరపడ్డామని గ్రహించాం' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చదవండి: అర్ధరాత్రి ఇంటికి వెళ్తే గెంటేశారు: నటుడి భార్య టాలీవుడ్ నటుడు ఆత్మహత్య -
‘పాన్ కథ’లకే టాలీవుడ్ ఇండస్ట్రీ మొగ్గు.. ఈ ఏడాది దాదాపు డజనుకి పైగా
‘బాహుబలి’తో తెలుగు సినిమాలో మార్పు వచ్చింది. అప్పటివరకూ మన తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చితే చాలన్నట్లు ఉండేది. అయితే ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్కి ఎదిగింది. అందుకే ప్రస్తుతం ‘పాన్ కథ’లకే ఇండస్ట్రీ మొగ్గు చూపుతోంది. ఈ ఏడాది తెలుగు నుంచి దాదాపు డజనుకి పైగా ‘పాన్ ఇండియా’ చిత్రాలు రానున్నాయి. ఇక ఈ ‘పాన్ కథా చిత్రమ్’ వివరాలు తెలుసుకుందాం. ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ (రవితేజ కీ రోల్ చేశారు) చిత్రాల సక్సెస్ జోష్లో ఉన్న రవితేజ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. స్టూవర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ. 1970 బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రావణాసుర’ కూడా పాన్ ఇండియా రిలీజ్ అని తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. మరోవైపు ‘బాహుబలి’ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిం§ó.. ఈ ఏడాది మూడు పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ రానున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’, దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జూన్ 16న ‘ఆదిపురుష్’, సెప్టెంబరు 28న ‘సలార్’ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలే కాకుండా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే పాన్ ఇండియా రిలీజ్గా థియేటర్స్లోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక హీరో మహేశ్బాబు తాజా చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాబాద్లో జరుగుతోంది. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ నుంచి కూడా ఓ పాన్ ఇండియా చిత్రం రానుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో హీరో రామ్చరణ్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. రాజకీయాలు, ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంతో కూడిన ఈ యాక్షన్ ఫిల్మ్ ఈ ఏడాదే థియేటర్స్లోకి రానుంది. ఇంకోవైపు ఆల్రెడీ ‘పుష్ప: ది రైజ్’తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ ఇదే సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన విలేజ్ బ్యాక్డ్రాప్ మాస్ ఫిల్మ్ ‘దసరా’ కూడా పాన్ లిస్ట్లో ఉంది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. ‘శాకుంతలం’తో సమంత కూడా పాన్ ఇండియా జాబితాలో చేరారు. దేవ్ మోహన్ ఓ లీడ్ రోల్ చేసిన ఈ మైథలాజికల్ లవ్స్టోరీకి గుణశేఖర్ దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇంకోవైపు హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతోంది. అలాగే అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి తెరకెక్కిస్తున్న స్టైలిష్ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ వేసవి రిలీజ్కి రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్దేవర కొండ–సమంతల పాన్ ఇండియా ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ ఈ ఏడాది వెండితెరపై ప్రేమ కురిపించనుంది. అలాగే రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా చేసిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ‘మైఖేల్’ వచ్చే నెల 3న రిలీజ్ కానుంది. సాయిధరమ్తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న విడుదల కానుంది. వరుణ్ తేజ్ కూడా పాన్ క్లబ్లో చేరారు. తెలుగు, హిందీ భాషల్లో శక్తీకాంత్ దర్శకత్వంలో వరుణ్ ఓ పాన్ మూవీ కమిట్ అయ్యారు. ఇక ‘గూఢచారి’కి సీక్వెల్గా అడివి శేష్ చేస్తున్న ‘గూఢచారి 2’ కూడా పాన్ ఇండియా రిలీజే. ఇంకా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ చేసిన స్పై థ్రిల్లర్ ‘స్పై’, తేజా సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన అడ్వెంచరస్ మైథలాజికల్ ఫిల్మ్ ‘హను మాన్’ (మే 12న రిలీజ్) తదితర చిత్రాలు పాన్ ఇండియా రిలీజ్లుగా ఈ ఏడాదే రానున్నాయి. -
బాక్సాఫీస్పై ‘వీరయ్య’ వీరంగం.. 9 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
జనవరి 15న సంక్రాంతి పండగ అయిపోయింది. కాని మెగాస్టార్ చిరంజీవి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. పూనకాలు కూడా కొనసాగుతున్నాయి. జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చాడు వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కలెక్షన్స్ని రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి పండక్కి బాస్ వస్తే బాక్సాఫీస్ పీస్ పీస్ అవుతుందని ఈ చిత్రం ద్వారా మరో సారి ప్రూవ్ అయింది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన వీరయ్య... తొమ్మిది రోజుల్లో రూ.182 కోట్ల గ్రాస్(106 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా పరిశీలిస్తే.. నైజాంలో రూ.28.87కోట్లు, సీడెడ్లో రూ.15.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13.24 కోట్లు, గుంటూరు రూ.6.72 కోట్లు, కృష్ణ రూ.6.47 కోట్లు, నెల్లూరులో రూ.3.38 కోట్లతో షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో సైతం వాల్తేరు వీరయ్య మేనియా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏలో చిరు జోరు కొనసాగుతోంది. అక్కడ కూడా వాల్తేరు వీరయ్య 2 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ పడితే అనకాపల్లి టు అమెరికా పూనకాలు కామన్ అనే విషయాన్ని మరోసారి నిజం చేసింది. -
డైరెక్టర్కు మెగాస్టార్ ఖరీదైన గిఫ్ట్, ధర ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవిని ఒకసారి నేరుగా చూడాలి, ఒక్కసారైనా కలిసి సెల్ఫీ తీసుకోవాలి.. ఇలా కలలు కనేవాళ్లు చాలామంది. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు బాబీ. చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాడు. మెగాస్టార్ మూవీ రిలీజైందంటే చాలు తండ్రితో కలిసి థియేటర్కు పరుగెత్తుకుంటూ వెళ్లేవాడు. అలాంటిది ఇప్పుడేకంగా ఆయనతో కలిసి సినిమానే తీశాడు. వాల్తేరు వీరయ్యతో చిరుకు బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. కానీ ఈ సినిమాను తన తండ్రికి చూపించలేకపోయాడు. సినిమా మధ్యలోనే బాబీ తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణించి గుప్పెడంత శోకంలో ఉన్నా సరే షూటింగ్కు వెళ్లాడంటే బాబీ అంకితభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సినిమా కోసం ప్రాణం పెట్టిన బాబీకి మెగాస్టార్ మర్చిపోలేని కానుక ఇచ్చాడట. వాల్తేరు వీరయ్య హిట్ అయిన నేపథ్యంలో బాబీని ఇంటికి విందుకు పిలిచాడట. భోజనం ముగిశాక అతడికి లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు టాక్. దీని విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్గా మారింది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే చిరంజీవి, బాబీలలో ఎవరో ఒకరు స్పందించేవరకు ఆగాల్సిందే! చదవండి: హీరోయిన్తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్ -
ఖాకీ డ్రెస్ వేస్తే చాలు.. రవితేజ ఫ్యాన్స్కు పూనకాలే!
మాస్ రాజా ఎన్ని క్యారెక్టర్స్ లో కనిపించినా రాని కిక్, ఒక్క పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తే ఇట్టే వచ్చేస్తుంది.రవితేజ ఎప్పుడు ఖాకీలో కనిపించినా సరే.. టాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ను అందుకుంటోంది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలో అదే క్యారెక్టర్ రిపీటైనా రిజల్ట్ మాత్రం మారలేదు. వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్ను టెర్రిఫిక్గా చేశాడు మాస్ రాజా. అలా పోలీస్ క్యారెక్టర్ పవర్ చూపించాడు. బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య పేరు మాత్రమే వినిపించడం లేదు, ఇదే సినిమాలో విక్రమ్ సాగర్ పాత్ర చేసిన వీరయ్య తమ్ముడి పేరు కూడా బాగా వినిపిస్తోంది. సెకండాఫ్లో వచ్చే ఈ క్యారెక్టర్ను చిరు ఎంత ప్రేమించాడో థియేటర్స్లో ఆడియెన్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా అంతా ఒక ఎత్తు.. చిరు, రవితేజ బాండింగ్ మరో ఎత్తు. అందుకే ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. మెగాస్టార్, మాస్ రాజా బాండింగ్తో పాటు, రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. విక్రమార్కుడులో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ మాస్ రాజా ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నాటి నుంచి నేటి వరకు రవితేజ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ రోల్ చేసినా అదే యాంగర్ మెయింటైన్ చేస్తున్నాడు. పోలీస్ క్యారెక్టర్లో తనదైన పవర్ చూపిస్తున్నాడు.రెండేళ్ల క్రితం ఇదే సంక్రాంతి సీజన్లో క్రాక్లో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ కరోనా టైమ్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. రవితేజను పోలీస్ లుక్లో చూస్తే అభిమానులు కూడా అస్సలు ఆగలేరు. చదవండి: ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది: దిల్ రాజు -
కాకినాడలో వాల్తేరు వీరయ్య టీం సందడి!
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. వింటేజ్ లుక్లో చిరు స్టైల్కి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో వాల్తేరు వీరయ్య టీం ఫుల్ జోష్లో ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ సందర్బంగా డైరెక్టర్ బాబీ కాకినాడలో పర్యటించాడు. కాకినాడలోని పద్మప్రియ థియేటర్కు సందర్శించిన బాబీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. ‘నేను 20 ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమాని. ఆయనతో హిట్ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రాణం పెట్టి తీశాం. మూవీ ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అవకాశం వస్తే చిరంజీవితో భవిష్యతుల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాను’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఆయనతో పాటు సినీ దర్శకుడు కల్యాణ్ కృష్ణ, వింటేజ్ సంస్థ అధినేత శివరామ్, చిన్ని, బెనర్జీలు కూడా పాల్గొన్నారు. -
Waltair Veeraya: మూడు రోజుల్లో వందకోట్లు, రికార్డులు లోడింగ్..
బాస్ వచ్చాడు.. బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నాడు. పూనకాలు లోడింగ్ కాదు.. రికార్డులు హంటిగ్ అన్నట్లుగా కలెక్షన్ల వేట మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేశాడు మెగాస్టార్ చిరంజీవి. రికార్డుల్లో నా పేరుండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయన్న మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడు. చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టైటిల్కు తగ్గట్టుగా మాస్ కంటెంట్తో అభిమానులను తెగ అలరిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించడంతో సినిమా మరింత సూపర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన వాల్తేరు వీరయ్య ఇతర స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లు రాబట్టిందీ చిత్రం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. #WaltairVeerayya takes over the Box Office like BOSS 😎🔥 108 Crores Gross in 3 days for MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥💥 - https://t.co/KjX8J7HFFi MEGA⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/n8PszOFt5u — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023 చదవండి: వారం కాకముందే సెంచరీ కొట్టిన వారిసు మరో అవార్డు దక్కించుకున్న నాటు నాటు, ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ -
చిరంజీవి మెసేజ్లను అవాయిడ్ చేసిన సుమ! అసలేం జరిగిందంటే..
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. సామాన్య ప్రజలే కాదు సినీ సెలబ్రెటీల్లో సైతం ఆయనను అభిమానించే వారు ఎందరో ఉన్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండ ఇండస్ట్రీ స్వయంగా కృషితో ఎదిగి ఆశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన పలకరిస్తే చాలు, ఆయనతో ఒక్క మాట మాట్లాడితే చాలు అని అభిమానుల ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. ఇక చిరంజీవితో సినిమా చేయడమంటే దర్శక-నిర్మాతలు, నటీనటులు అదృష్టంగా భావిస్తారు. అలాంటి మెగాస్టారే స్వయంగా మెసేజ్ చేస్తే ఓ స్టార్ యాంకర్ అవాయిడ్ చేసిందట. ఆమె మరెవరో కాదు యాంకర్ సుమ కనకాల. చదవండి: చిరంజీవి మెసేజ్లను అవైయిడ్ చేసిన సుమ! అసలేం జరిగిందంటే.. మూడు, నాలుగేళ్లు వరుసగా సుమకు మెసేజ్ చేస్తే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని చిరు తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సక్సెస్ జోష్లో ఉన్న చిరంజీవి సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షోలో పాల్గొన్నారు. చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, నటుడు వెన్నెల కిషోర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమ చిరు లీక్స్లో ఏమైనా లీక్స్ ఉన్నాయా! అని అడగ్గా.. ఏకంగా సుమకే ఎసరు పెట్టారు చిరంజీవి. సుమ గురించి ఓ విషయం లీక్ చేస్తున్నానంటూ అసలు విషయం చెప్పారు. చదవండి: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా! ‘‘మూడు, నాలుగేళ్లుగా సుమకు హ్యాపీ బర్త్డే, గార్డ్ బ్లెస్ యూ, స్టే బ్లెస్డ్’ అంటూ సుమకు మెసేజ్లు పెడుతూనే ఉన్నాను. కానీ కనీసం ఆమె రిప్లై కూడా ఇవ్వలేదు. చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఎకైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది సుమనే’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సుమ స్పందిస్తూ.. ఏకంగా చిరంజీవి గారు మెసేజ్ చేస్తారని తాను అసలు ఊహించలేదని, కనీసం నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకోలేదని వివరణ ఇచ్చింది. అనంతరం చిరు మాట్లాడుతూ.. 2022లో ఓ ఈవెంట్లో సుమ కలిసినప్పుడు ఇలా మెసేజ్ చేశానని చెప్పగానే తాను చాలా సంతోషించిందన్నారు. అంతేకాదు సారీ కూడా చెప్పి నెంబర్ తీసుకుందని ఆయన చెప్పారు. -
పూనకంతో ఊగిపోయిన చిట్టి తల్లి.. మెగాస్టార్ ఫిదా
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమాలోని సాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఓ రేంజ్లో ఊపేస్తున్నాయి. ఈ సినిమా చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటరల్లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఓ చిన్నారి సైతం మెగాస్టార్ పాటకు ఫిదా అయిపోయింది. థియేటర్లో సినిమా చూస్తూ కూర్చీపైనే స్టెప్పులతో అదరగొట్టింది. పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చినప్పుడు ఆ చిన్నారి డ్యాన్స్ చేసిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాస్టార్ సైతం ఆ చిన్నారి డ్యాన్స్ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ వీడియో క్లిప్ను తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చిన్నారి డ్యాన్స్ చూసిన మెగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ..'ఎంత ఆనందం. ఇలాంటి చిట్టి చిట్టి ఫ్యాన్స్ రాకింగ్. 'పూనకాలు లోడింగ్' పాట నెక్ట్స్ జనరేషన్కి కూడా సెట్ అయ్యేలా కనిపిస్తోంది.' అంటూ పోస్ట్ చేశారు. What a bundle of Joy 🤩 With Rocking Tiny Fans like these ‘Poonakalu Loading’ looks set for Next generation too 😊@RaviTeja_offl @dirbobby @MythriOfficial @ThisIsDSP pic.twitter.com/mMIRDOYmtH — Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2023 -
మేమంతా సినీ కార్మికులం..సినిమానే మా కులం: చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
సీనీ కార్మికులు ఎన్నో కష్టాలను ఇష్టంగా ఎదుర్కొంటారని, ఎన్నో నెలల భార్య పిల్లలకు దూరంగా ఉండి ప్రేక్షకులను అలరించడానికి శ్రమిస్తారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ కార్మికులు తలచుకుంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజాగా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం(జనవరి 13) విడుదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. దీంతో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. వాల్తేరు వీరయ్య సినిమా మేకింగ్ వీడియో అది. అందులో సినిమా షూటింగ్ కోసం కార్మికులు పడుతున్న కష్టాలను చూపించారు. చిరంజీవి వాయిస్ ఓవర్తో మొదలయ్యే ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. చిరంజీవి స్వయంగా షూట్ చేసిన ఈ వీడియోని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. ‘మేమంతా సినీ కార్మికులం. నిరంతర శ్రామికులం. కళామతల్లి సైనికులం. సినిమా ప్రేమికులం .సినిమానే మా కులం .మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం’అని రాసుకొచ్చాడు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషించారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. మేమంతా సినీ కార్మికులం నిరంతర శ్రామికులం కళామతల్లి సైనికులం సినిమా ప్రేమికులం సినిమానే మా కులం మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం! THANK YOU One & All🙏https://t.co/AdQg2v12xv pic.twitter.com/m9n2plOOAA — Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2023 -
మీ బోడి పెర్ఫార్మెన్స్ నా దగ్గరొద్దంటూ చిరు చైర్ విసిరేశారు..!
మెగాస్టార్ చిరంజీవి బయట ఎంత ప్రశాంతంగా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రెస్ మీట్లో కూడా తనదైన శైలీలో జోకులు వేస్తూ.. సరదాగా ఉంటారు. షూటింగ్ సమయంలో కూడా అలానే ఉంటారట. కానీ నిర్మాతలకు నష్టం కలిగించే పని చేస్తే మాత్రం ఘోరంగా ఫైర్ అవుతారట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ చెప్పారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. దీంతో శనివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తిక విషయాలు వెల్లడించారు. ‘సెట్లో చిరంజీవి పొగడ్తల్ని పట్టించుకోరు. కానీ.. నిర్మాతకి రూపాయి నష్టం వచ్చే పని చేస్తే మాత్రం ఆయనికి కోపం వచ్చేస్తుంది. వేరే సినిమా షూటింగ్లో ఆయనలోని శివుడిని నేను చూశా. షాట్కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతుంటే.. ఫస్ట్ టైమ్ చిరంజీవికి కోపం రావడాన్ని చూసి నేను షాక్ అయిపోయా. చైర్ విసిరేసి.. మీబోడి ఫెర్ఫార్మెన్స్ నా దగ్గరొద్దు. నేను ఇక్కడ తినే ఇడ్లీ కన్నా.. అక్కడ షాట్ ఇంపార్టెంట్’ అంటూ సిబ్బందిపై ఫైర్ అయిన మెగాస్టార్ని నేను దూరం నుంచి చూశాను. సినిమాకు ఇబ్బంది కలిగితే అన్నయ్యకు కోపం వస్తుందని నాకు అర్థమైంది. వాల్తేరు వీరయ్య షూటింగ్ టైమ్లో అలా ఇబ్బంది తేకూడదని ప్రయత్నించా. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ చేసి.. అన్నయ్యా... పీటర్ మాస్టర్ ఊరెళ్తానని అంటున్నారు. ఒక ఫైట్ సీన్.. మీరు సాంగ్ గ్యాప్లో ఓ మూడు గంటలు వస్తే? అంటూ మొహమాటంగా చెప్పాను. దానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావ్.. కరెక్ట్గా చెప్పు నాకు అర్థం అవ్వడం లేదు అని చిరంజీవి గారు అన్నారు. ఏం లేదు అన్నయ్య మీరు రేపు ఓ మూడు గంటలు వస్తే.. మీ పోర్షన్ కంప్లీట్ చేస్తాను. మళ్లీ రేప్పొద్దున ‘నాకు చెప్పాలి కదా సెట్ ఎందుకు హోల్డయ్యిందని’ అంటారని చెప్పేస్తున్నా అని చెప్పాను. దానికి ఇంతగా చెప్పాలా బాబీ.. రేపు మీరు రా అన్నయ్యా అంటే రానా? అంటూ చాలా సింపుల్గా చెప్పారు’అని బాబీ గుర్తు చేసుకున్నారు. -
వరల్డ్ లో ఒక్కే ఒక్క రొమాంటిక్ హీరో చిరంజీవి గారు: దేవిశ్రీ ప్రసాద్
-
మనసులో మాట చెప్పిన రవితేజ.. చిరు గ్రీన్ సిగ్నల్
-
సినిమా అంటే ఇలా తీయాలి : మెగాస్టార్ చిరంజీవి
-
బాస్ ఈజ్ బ్యాక్.. ‘వాల్తేరు వీరయ్య’ తొలిరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే!
ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్తో దుమ్ములేపుతున్నాడు వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హిట్ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ తెచ్చుకుంది. చదవండి: నేను ఆ డిజార్డర్తో బాధపడుతున్నా! షాకిచ్చిన అనసూయ.. ఇందులో మెగాస్టార్ మాస్, యాక్షన్, కమెడీకి ప్రేక్షకులంత ఈళలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీనికి తోడు రవితేజ మాస్ యాక్షన్ జత కావడంతో ఇక ఫ్యాన్స్ జోరు ఆకాశాన్ని తాకింది. అలా తొలి రోజు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో సత్తా చాటింది వాల్తేరు వీరయ్య. తొలిరోజు వరల్డ్ వైడ్ రూ. 29 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 23 పైగా కోట్లు షేర్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి: నైజాం- రూ.6.10 కోట్లు సీడెడ్- రూ.4.20 కోట్లు ఉత్తరాంధ్ర- రూ.2.60 కోట్లు ఈస్ట్- రూ.2.68 కోట్లు వెస్ట్- రూ.2.06 కోట్లు కృష్ణా- రూ.1.49 కోట్లు గుంటూరు- రూ.2.76 కోట్లుఔ నెల్లూరు- 1.05 కోట్లు ఇలా వాల్తేరు వీరయ్య తోలి రోజు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపించింది. ఇక రెండో రోజు ఈ మూవీ అదే జోరును కొసాగిసోందట. శనివారం వాల్తేరు వీరయ్య అన్ని షోలు హౌజ్ ఫుల్ బకింగ్ ఉన్నట్లు సమాచారం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. -
ఈ కష్టం నాది కాదు.. వారిదే: మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా ప్రత్యేక పాత్రలో నటించారు. మెగాస్టార్కు జోడీగా శృతిహాసన్ నటించింది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ను హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. వాల్తేరు వీరయ్య విజయంతో నాకు మాటలు రావడం లేదన్నారు. ఈ సినిమా కోసం వారు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని మెగాస్టార్ అన్నారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన కార్మికుల కోసం ప్రత్యేక వీడియోను ఆయన విడుదల చేశారు. విజయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ సినీ కార్మికుల కష్టం మనకు తెలియాలన్నారు. చిరంజీవి మాట్లాడుతూ..'వాల్తేరు వీరయ్య విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.ప్రేక్షకుల ఉత్సాహమే మనకు ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను ఈ సినిమా కోసం కష్టపడలేదు. నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిందరిదీ. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది. మన మీదతో జాలితో కాదు... సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి.' అంటూ ఎమోషనలయ్యారు మెగాస్టార్ -
ఆయన సరస్వతి పుత్రుడు.. తెలుగువారికి ఇది గర్వకారణం: చిరంజీవి
టాలీవుడ్ సినీ గేయ రచయిత చంద్రబోస్ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఆయన రచించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చినందుకు మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు. చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చంద్రబోస్ను చిరంజీవి, రవితేజ ఘనంగా సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ.. 'చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణంగా ఉంది. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణితోపాటు ఈ పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. తెలుగు వాళ్లందరి తరఫున చంద్రబోస్కు నా ప్రత్యేక అభినందనలు. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు.' అంటూ కొనియాడారు. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. మొదటిసారి తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్.. సెలబ్రెటీల సందడి
-
ఫ్యాన్ మూమెంట్.. వాల్తేరు వీరయ్య సినిమా చూసిన అల్లు అర్జున్
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. వింటేజ్ లుక్లో చిరు స్టైల్కి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అటు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా పోటాపోటీగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు చూసేందుకు సినీ అభిమానులే కాకుండా, సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమాను చూశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్లో అభిమానులతో కలిసి ఆయన సినిమాను చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాను మెగాస్టార్కి వీరాభిమాని అని అల్లు అర్జున్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ ఫ్యాన్ మూమెంట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Icon StAAr @alluarjun watching his hardcore Mega Star @KChiruTweets fan movie #WaltairVeerayya 😍🔥#AlluArjun #Chiranjeevi #MegaStarChiranjeevi #Chiranjeevi pic.twitter.com/Mg0FPCtdTr — Nithin (@NithinPSPKCult) January 13, 2023 -
మాకు ఇది స్పెషల్ సంక్రాంతి!
‘‘బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడే వీరయ్య (చిరంజీవి పాత్ర పేరు) క్యారెక్టర్కి ఇలాంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకున్నాను. నా ఆలోచన, బాబీగారి ఐడియాలు చాలావరకూ మ్యాచ్ అయ్యాయి. నాన్నగారూ సలహాలు చెప్పారు’’ అన్నారు సుష్మిత కొణిదెల. చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్ర చేశారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇందులో చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసిన ఆయన కుమార్తె సుష్మిత చెప్పిన విశేషాలు. ► బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడు వింటేజ్ చిరంజీవిగారిని చూపించాలన్నారు. అంటే.. అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ టైమ్ అన్నమాట. ఈ సినిమాలో ఆయనది ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్. సో.. కథ విన్నప్పుడే కాస్ట్యూమ్స్ని ఊహించేశా. నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి వింటేజ్ లుక్లో చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ యూత్కి కూడా నచ్చాలి కాబట్టి ఇప్పటి ట్రెండ్ని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాను. ► ‘రంగస్థలం’లో నా తమ్ముడు రామ్చరణ్కి నేనే డిజైన్ చేశాను. ఇప్పుడు నాన్నగారివి కూడా అలాంటి డ్రెస్సులే. కానీ చరణ్కంటే నాన్నగారే ఈ మాస్ కాస్ట్యూమ్స్లో సూపర్. అయితే చరణ్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను సిటీలో పెరిగాడు. అయినప్పటికీ ‘రంగస్థలం’లో ఆ కాస్ట్యూమ్స్లో బాగా ఒదిగిపోయాడు. నాన్నగారి అభిమానులుగా మేం మిగతా అభిమానులతో పాటు ఈలలు వేస్తూ, గోల చేస్తూ శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు థియేటర్లో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్తో కలిసి సినిమా చూశాం. ► ప్రస్తుతం నాన్న ‘బోళా శంకర్’కి డిజైన్ చేస్తున్నాను. ఇంకా రెండు వెబ్ సిరీస్లపై వర్క్ చేస్తున్నాం. మేం నిర్మించిన ‘శ్రీదేవి శోభన్బాబు’ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్పై నాన్నగారితో సినిమా నిర్మించాలని ఉంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే ఆయన ‘మంచి కథతో రా’ అన్నారు. మేం కూడా ఆ వేటలోనే ఉన్నాం. ► ఈ సంక్రాంతి స్పెషల్ అంటే.. మా తమ్ముడు తండ్రి కానుండటం. ఈ సమయం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాం. సో.. మాకిది స్పెషల్ సంక్రాంతి. ఉపాసనది డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏం ఆహారం తీసుకోవాలి? అనేది తనకు బాగా తెలుసు. మావైపు నుంచి మేం ఆమెను వీలైనంత హ్యాపీగా ఉంచుతున్నాం. పాప అయినా, బాబు అయినా మాకు ఓకే. కానీ నాకు, శ్రీజకు ఆడపిల్లలే. ఇంట్లో గర్ల్ పవర్ ఎక్కువైంది (నవ్వుతూ). అందుకే బాబు అయితే బాగుంటుందనుకుంటున్నాను. -
Waltair Veerayya : ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్నర్ ఏదో తెలుసా? స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈ సంక్రాంతికి థియేటర్లో మెగాస్టార్ సందడి మొదలైంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వగా చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్యా. ఈ మూవీ నేడు శుక్రవారం(జనవరి 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచి ఈ చిత్రం పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. మాస్, యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ మూవీ మెగా ఫ్యాన్స్లో థియేటర్లో పూనకాలు తెప్పిస్తుంది. చిరు మాస్లుక్కు మాస్ మాహారాజా రవితేజ యాక్షన్ జోడి అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. చదవండి: కర్ణాటకలో మెగాస్టార్ క్రేజ్ చూశారా? బ్యాండ్ బాజాలతో ఫ్యాన్స్ రచ్చ, వీడియో వైరల్ వారిద్దరి సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెండితెరపై మాస్ క్రేజ్తో దూసుకుపోతున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం థియేటర్లో సందడి చేసిన చిత్రాలు ఓటీటీలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఏ మూవీ అయిన థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాల్సిందే. ఇక వాల్తేరు వీరయ్య మూవీ కూడా ఇప్పటికే ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం వాల్తేరు వీరయ్య డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఇండియా సొంతం చేసుకున్నట్లు సమాచారం. చదవండి: Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ భారీ ధరకు ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లాక్ చేసుకుందని తెలుస్తోంది. అయితే మూవీ స్ట్రీమింగ్ డేట్ మత్రాం ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక సినిమా బాక్సాఫీసు రిజల్ట్ను బట్టి మూవీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందనేది డిసైడ్ అవుతుంది. ఇక మెగా చిత్రమైన వాల్తేరు వీరయ్య మాత్రం థియేట్రికల్ రిలీజ్కు 6 నుంచి 8 వారాల అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీకి రానుందని తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి రెండో వారం లేదా చివరి వారంలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ఉండోచ్చని అంటున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి దేవివ్రీ ప్రసాద్ సంగీత అందించాడు. -
కర్ణాటకలో మెగాస్టార్ క్రేజ్ చూశారా? బ్యాండ్ బాజాలతో ఫ్యాన్స్ రచ్చ, వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో అయితే ఆయన పేరు ఓ బ్రాండ్గా నిలిచిపోయింది. అనీర్వచమైన తన నటనతో ఎన్నో రికార్డులు కొల్లగోట్టారు చిరు. ఇక ఆయన సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరం తలపిస్తుంది. ఇక పండక్కి ఆయన సినిమా అంటే ఇక ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలా థియేటర్లో సందడి చేసేందుకు ఈ సంక్రాంతికి(జనవరి 13న) వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. చదవండి: Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ ఆయన 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద మాస్ టాక్తో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే చిరుకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నేడు వాల్తేరు వీరయ్య రిలీజ్ సందర్భంగా కార్ణాటకలోని ఆయన అభిమానులు చేసిన హంగామా మామూలుగా లేదు. ఈ చిత్రంలోని చిరు 154 పోస్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. చదవండి: శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఆయన 154 పోస్టర్లను 154 ఆటోలపై పెట్టి కర్ణాటక రోడ్లపై బ్యాండ్లు మోగిస్తూ.. డాన్స్ చేస్తూ జాతరగా భారీ ర్యాలీ నిర్వహించి చిరుపై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతూ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా.. మాస్ మహారాజా రవితేజ కీ రోల్ పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. Karnataka Mega Fans Huge Rally with 154 Autos. #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th #Bangalore #karnatka #MegaStarChiranjeevi pic.twitter.com/d89mn7x7Pq — Pavanheartkiller (@Pavanheartkill1) January 12, 2023 -
Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ
టైటిల్:వాల్తేరు వీరయ్య నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని,రవిశంకర్ దర్శకత్వం: కేఎస్ రవీంద్ర(బాబీ) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: ఆర్థన్ ఎ.విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమనే విడుదల తేది: జనవరి 13,2023 గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్తో కలిసి రవితేజ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై స్టార్టింగ్ నుంచే హైప్ క్రియేట్ అయింది.దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాస్ సాంగ్, పూనకాలు లోడింగ్ పాటలు జనాల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 13)విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైజాగ్లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. చిరంజీవి సినిమా అనగానే అభిమానులు కొన్ని లెక్కలేసుకుంటారు. మంచి ఫైట్ సీన్స్, డ్యాన్స్, కామెడీ.. ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. అందుకే కథ ఎలా ఉన్నా.. ఈ హంగులన్నీ పెట్టడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. వాల్తేరు వీరయ్యలో కూడా అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు బాబీ. అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్, తన మార్క్ కామెడీ, భారీ యాక్షన్ సీన్లతో కథను తీర్చిదిద్దాడు. అలా అని ఇది కొత్తగా ఉంటుందని చెప్పలేం. ఈ తరహా కథలు టాలీవుడ్లో చాలానే వచ్చాయి. కాకపోతే చిరంజీవి ఇమేజ్పై దృష్టి పెట్టి.. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంతో ఎక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ రాదు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఉండడం సినిమాకు మరింత ప్లస్ అయింది. పోలీస్ స్టేషన్లోనే పోలీసులను సాల్మన్ అతికిరాతంగా చంపడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఫస్ట్ సీన్లోనే విలన్ పాత్ర ఎంత కిరాతకంగా ఉండబోతుందో చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత నేవీ దళాన్ని కాపాడడానికి సముద్రంలో వీరయ్య చేసే ఓ భారీ ఫైట్తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. వీరయ్య మలేషియాకు షిఫ్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సాల్మన్ని కిడ్నాప్ చేయడానికి వీరయ్య టీమ్ వేసే ప్లాన్ నవ్వులు పూయిస్తుంది. అలాగే శ్రుతీహాసన్తో చిరు చేసే రొమాన్స్ అభిమానులను అలరిస్తుంది. కానీ కథనం నెమ్మదిగా సాగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది. ఇక అసలు కథ సెకండాఫ్లో మొదలవుతుంది. ఏసీపీ విక్రమ్గా రవితేజ ఎంట్రీ, అన్నదమ్ముల మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో చిరంజీవి సినిమా డైలాగ్ రవితేజ చెప్పడం.. రవితేజ సినిమా డైలాగ్ చిరంజీవి చెప్పడం నవ్వులు పూయిస్తుంది. అయితే ఇవన్ని ఇలా వచ్చి అలా పోతుంటాయి కానీ.. ఎక్కడా వావ్ మూమెంట్స్ని ఇవ్వలేకపోతాయి. అలాగే అన్నదమ్ముల మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనేది బలంగా చూపించలేకపోయాడు. డ్రగ్స్ పట్టుకునే సీన్స్ కూడా పేలవంగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ కారులో చిరంజీవి, రవితేజ మాట్లాడుకోవడం.. చిరు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను ఎమోషనల్కు గురిచేస్తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్గా సాగుతుంది. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. అభిమానులు కోరుకునే అంశాలతో ఓ రొటీన్ కథను అంతే రొటీన్గా చెప్పాడు డైరెక్టర్. అయితే చిరంజీవి ఇమేజ్కు తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంలో మాత్రం బాబీ సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. వీరయ్య పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ని మాస్ లుక్లో చూస్తారు. ఒకప్పుడు చిరు చేసే కామెడీ, ఫైట్ సీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. తెరపై చాలా యంగ్గా కనిపిస్తాడు. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టేశాడు. ఇక ఏసీపీ విక్రమ్గా రవితేజ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అదితిగా శ్రుతిహాసన్ ఉన్నంతలో చక్కగా నటించింది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఫైట్ సీన్లో మాత్రం అదరగొట్టేసింది. డ్రగ్స్ మాఫియా లీడర్ సాల్మన్ సీజర్గా బాబీ సింహా, అతని సోదరుడు మైఖేల్గా ప్రకాశ్ రాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. కానీ వాళ్లది రొటీన్ విలనిజమే. వెన్నెల కిశోర్ కామెడీ పంచ్లు బాగున్నాయి. పోలీసు అధికారి సీతాపతిగా రాజేంద్రప్రసాద్తో పాటు షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. 'బాస్ పార్టీ' నుంచి 'పూనకాలు లోడింగ్' సాంగ్ వరకు డీఎస్పీ కొట్టిన సాంగ్స్ ఓ ఊపు ఊపేశాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆర్థన్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్ డెస్క్ -
సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన చిరంజీవి కూతుళ్లు
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
'వాల్తేరు వీరయ్య'తో నా కల నెరవేరింది : దేవీ శ్రీ ప్రసాద్
‘‘వాల్తేరు వీరయ్య’లో ‘పూనకాలు లోడింగ్..’ పాటలో బూరలాంటి వాయిద్యం ఉపయోగించి ఆ ట్యూన్ని కంపోజ్ చేశాను. అది చిరంజీవిగారికి నచ్చడంతో ‘అదరగొట్టావ్ అబ్బాయ్’ అన్నారు. నేను కంపోజ్ చేసిన ట్యూన్ ఒక ఎత్తు అయితే ఆయన డ్యాన్స్తో పాటని మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా హీరో రవితేజ కీలక పాత్రలో బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ∙చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించింది మా మైత్రీ మూవీస్ నిర్మాతలే (నవీన్ యెర్నేని, వై. రవిశంకర్). రెండు సినిమాలూ మావే కావడం, సంక్రాంతికి విడుదలవడం చాలా గర్వంగా ఉంది. సంగీతం విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. ఏ సినిమాకైనా కథ ప్రకారమే మ్యూజిక్ చేస్తాం.. రెండు సినిమాలూ అద్భుతంగా ఆడాలి. బాబీతో నాకు చాలా అనుబంధం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలూ హిట్ కావడానికి కారణం బాబీ కథ, ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం. అన్నిటికీ మించి చిరంజీవిగారు మా ఇద్దరిపై పెట్టుకున్న నమ్మకం. ►చిరంజీవిగారితో సినిమా చేయాలనే బాబీ కల ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి చిరంజీవిగారితో ‘నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు’ అని అన్నాను. ఆయన ‘ఎంత బాగా చెప్పావ్ మై బాయ్’ అన్నారు. ∙ఈ సినిమాలో రవితేజ, చిరంజీవిగారి సీన్స్కి క్లాప్స్ మామూలుగా ఉండవు. కంటతడితో, నవ్వుతూ క్లాప్స్ కొట్టే సీన్స్ చాలా ఉంటాయి. బాస్ని (చిరంజీవి) మనం ఎలా అయితే చూస్తూ పెరిగామో.. ఆ ఎలిమెంట్స్తో పాటు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ► కామెడీ, డ్యాన్స్ ఫైట్స్.. అన్నీ కుమ్మేశారు. బాస్ని చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్లో చూస్తున్నాం.. ఎక్కడా తగ్గకూడదని ప్రతి పాట విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. ప్రతి సినిమా సవాల్గానే ఉంటుంది. కానీ, ఒత్తిడిగా భావించకుండా సరదాగా చేస్తాను. నేను బాస్ని చూస్తూ పెరిగాను.. ఆయన్ని చూడగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఇందులో ‘నువ్వు శ్రీదేవి..’ పాటకి ఆయన స్క్రీన్పై ఎలా చేస్తారో ముందే ఊహించి, కంపోజ్ చేసి బాబీకి చూపించా.. అలాగే ‘పూనకాలు లోడింగ్..’ పాటలో చిరంజీవి, రవితేజగార్లు కనిపిస్తే ఎంత సందడిగా ఉంటుందో ఆ ఎనర్జీ అంతా పాటలో ఇచ్చేశాం. అదరగొట్టావ్ అబ్బాయ్ అన్నారు – దేవిశ్రీ ప్రసాద్ -
‘వాల్తేరు వీరయ్య’మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాడ్ఫాదర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటించిన చిత్రంకావడం.. అందులో రవితేజ కీలక పాత్ర పోషించడంతో ‘వాల్తేరు వీరయ్య’పై తొలి నుంచే హైప్ క్రియేట్ అయింది. ఇక పాటలు, టీజర్ కూడా అదిరిపోయాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగాస్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల వాల్తేరు వీరయ్య ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు. 1st half k ramppp!! Racy & no dull moments. Intro, boss party song, comedy & interval bang rough aadinchaadu BOSS!! Thank you @dirbobby . 2nd half deenlo sagam unna enough. #WaltairVeerayya — Aditya (@Ad1tyaTwitz) January 13, 2023 2nd half is abv avg, Chiru & RT scenes super! Rest feels okayish. Songs, bgm, dance, entertainment & Boss’s best after re-entry!! Pakka commercial entertainer & will turn out to be a hit! #WaltairVeerayya — Aditya (@Ad1tyaTwitz) January 13, 2023 సినిమా అదిరిపోయిందని, చిరంజీవి డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ ర్యాంప్, ఇంట్రో, బాస్ పార్టీ సాంగ్, కామెడీ, ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ యావరేజ్ అని, రవితేజ, చిరు మధ్య సీన్స్ బాగున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Chiru in his element 😍😍😍 Boss mass entoo malli gurthu chese samayam ochesindhi. #WaltairVeerayya kummsss! pic.twitter.com/jFqNYd6sXd — Teja Sundar (@tejachoujarla) January 13, 2023 వాల్తేరు వీరయ్య యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమాను చిరంజీవి తన భూజాన వేసుకొని నడిపించారని చెబుతున్నారు. రవితేజతో వచ్చే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కామెడీ బాగుంది కానీ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదని కామెంట్ చేస్తున్నారు. #WaltairVeerayya Overall an Average Commercial Entertainer! Film is carried by Chiru along with a few good commercial sequences with RT and dance numbers. However, some of the comedy goes over the top and emotion does not work as expected. BGM is alright. Rating: 2.5-2.75/5 — Venky Reviews (@venkyreviews) January 12, 2023 Annayya Arachakam Aarambham 🔥😎#WaltairVeerayya IN CINEMAS NOW WORLDWIDE🔥 Book your tickets now! - https://t.co/qhW8HtSDfg MEGASTAR @KChiruTweets MASS MAHARAJA @RaviTeja_offl pic.twitter.com/3WU5ckIgWg — Pratheek Pr (@propratheereddy) January 13, 2023 @dirbobby great first half. Nice intro and great interval bang by @ThisIsDSP #WaltairVeerayya — Apen (@abk_inshort) January 13, 2023 Completed my show 1st half : enty is not up to Mark and forced scenes unwanted cringe scenes flat narrations.. 2nd half : nothing impressive Raviteja is good but chiru un nature acting made cringe and forceble.. Rating 1.5/5 strictly for none#WaltairVeerayya — viraj gowda (@thesnowdragonn) January 13, 2023 1st Half BlockBuster Dear Belli fans meru entha try chesina avvadhu paaripondi 🤣🤣🤣#WaltairVeerayya — ur's kishor (@Saikish89075170) January 13, 2023 #WaltairVeerayya Other than title card nothing seems to be interesting .. Lite #chiru, nee craze e movie hit avvadam valla emi peragadhu and flop avvadam valla thaggadu 👍. YouTube lo small channels ki interviews stop chesi range maintain cheye chaalu 🙏. — Kumar_Nfan (@Kumar_ind90) January 13, 2023 Excellent frist half 🔥 Boss vintage comedy💥 Inka second half #RaviTeja entry tarawatha peaks kii vellipodi 🔥 Sankranti winner manama🤙 Congrats annd @dirbobby @RaviTeja_offl @KChiruTweets @MythriOfficial #WaltairVeerayya https://t.co/RezdXhZSZf — Nandu😈 (@MASS_99_99) January 13, 2023 #WaltairVeerayya 1st Half Done✅ . Chiru Intro Raw and Massiest💥 . Comedy works😊 . Chiru Mannerisms 😍 . Finally "POONAKALU INTERVAL BANG"💥⚡💥⚡💥⚡💥⚡💥⚡ OVERALL A FIRST GOOD HALF✅⚡ — Cheemthil🗯️ (@Thulasinath1212) January 13, 2023 -
వాల్తేరు వీరయ్య తో సాక్షి చిట్ చాట్
-
సాక్షి యాంకర్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
-
తండ్రి చనిపోయిన రెండురోజులకే సెట్కు వచ్చేశాడు: చిరంజీవి
సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు దర్శకనిర్మాతలు. సినిమా ఆడిందంటే సంతృప్తి చెందుతారు, ఆడలేదంటే తర్వాతి మూవీని మరింత కసిగా తెరకెక్కిస్తారు. సినిమా రిలీజ్ కోసం అభిమానులెంతగా పడిగాపులు కాస్తారో అంతకంటే వేయిరెట్లు ఎక్కువ ఆతృతతో ఎదురుచూస్తుంటారు డైరెక్టర్స్. తమ వ్యక్తిగత కష్టనష్టాలను పక్కనపెట్టి పూర్తిగా సినిమా కోసమే పరితపిస్తుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బాబీ. తండ్రి చనిపోయి కొండంత శోకంలో ఉన్నా కూడా రెండు రోజుల్లో తిరిగి వాల్తేరు వీరయ్య సెట్కు వెళ్లి షూటింగ్ మొదలుపెట్టాడు ఆయన. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చాడు. 'బాబీ తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం అంతలా పరితపించే మనిషి నాన్న చనిపోయిన రెండు రోజులకే షూటింగ్కు వచ్చాడు. ఆయన పెద్ద కర్మ అయిపోయేవరకు రాకపోవడమే న్యాయమని మేము భావించాం. కానీ అతడు మాత్రం చిన్నకర్మ పూర్తికాగానే నెక్స్ట్ డే షూటింగ్కు వచ్చాడు. మేమంతా ఆశ్చర్యపోయాం. మీతో పని చేయడం వల్ల నాన్నగారి నిష్క్రమణను కూడా మర్చిపోయాను. మీ సాంగత్యంలో ఆ బాధ తెలియలేదు అని అతడు నాతో ఎన్నోసార్లు చెప్పాడు. సినిమా కోసం చివరి నిమిషం వరకు కష్టపడ్డాడు. అతడి శ్రద్ధాసక్తులు చూస్తే ముచ్చటేసింది. అందుకే స్టేజీపై అతడిని ముద్దుపెట్టుకున్నా' అన్నాడు చిరంజీవి. చదవండి: నాపై విషప్రయోగం జరిగింది, చేసింది అతడే: మెగాస్టార్ థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
రామ్చరణ్ వీరసింహారెడ్డి చూస్తాడేమో!: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. చాలాకాలం తర్వాత బాస్ ఊరమాస్ పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఒకరోజు ముందే(జనవరి 12న) నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మొదలయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా హిట్టవ్వాలని కోరుకోవడం మంచిదే కానీ అవతలి హీరో సినిమా పోవాలని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ధోరణిపై మెగాస్టార్ అసహనం వ్యక్తం చేశాడు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. 'ఒకరి సినిమా పోవాలి, మరొకరి సినిమా ఆడాలనే ధోరణి చూస్తే బాధేస్తోంది. అలాంటి ధోరణి మా రక్తంలోనే లేదు. నా తనయుడు రామ్చరణ్ మొదట వీరసింహారెడ్డి చూస్తాడేమో! అమెరికాలో ఈ రెండు సినిమాల విషయంలో జరుగుతుంది చూస్తే బాధేస్తోంది. నేను రాజకీయాల్లో ఎవరినీ ఏ మాటా అనకపోవడం నాకు ప్లస్ అయింది. అప్పుడు నన్ను విమర్శించినవాళ్లు ఇప్పుడు రియలైజ్ అయ్యి నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇదివరకే చెప్పినట్లు నా రెండో ఇల్లు వైజాగ్. చాలా మందికి గోవానో మరేదో విడిదిగా ఉంటుంది. కానీ నాకు మాత్రం విడిది చేసే ఇల్లు వైజాగే. ఆంధ్రప్రదేశ్లో రూ. 25 రూపాయలు పెంచి స్పెషల్ షోలకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ షోలు వేసుకొనేందుకు అనుమతినిచ్చినందుకు థ్యాంక్స్' అని పేర్కొన్నాడు మెగాస్టార్. చదవండి: రిపోర్టర్ బర్త్డే.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తారక్ -
'వాల్తేరు వీరయ్య' నుంచి నీకేమో అందమెక్కువ లిరికల్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. డైరెక్టర్ బాబి తెరెకెక్కించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ హైప్ను క్రియేట్ చేస్తోంది. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.మికా సింగ్, గీతామాధురి, డీ వెల్మురుగన్ ఈ పాటను పాడారు. -
అందుకే ‘వాల్తేరు వీరయ్య’ చేశాను: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. వాల్తేరు వీరయ్యలో వింటేజ్ వైబ్ కనిపిస్తోంది. షూటింగ్ చేస్తున్నపుడు ఆ క్యారెక్టర్ వలన మళ్ళీ యంగేజ్ వైబ్ వచ్చిందా ? ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటాడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నాకు మాత్రం అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంది. శుభలేఖ, స్వయంకృషి, మంత్రి గారి వియ్యంకుడు లాంటి చిత్రాలు వివిధ్యమైన పాత్రలు చేయాలనే తాపత్రయం నుండి వచ్చినవే. అయితే రానురాను..ఆర్ధికంగా కమర్షియల్ గా ముడిపడిన ఈ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని.. మనకి ఏం కావాలనేదాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో.. అది ఇవ్వడానికే మొదటి ప్రాధన్యత ఇచ్చాను. కమ్ బ్యాక్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ సైరా, పాటలు, హీరోయిన్ లేకుండా పవర్ ఫుల్ పాత్రగా గాడ్ ఫాదర్ చేశాను. ఇవన్నీ కూడా గౌరవప్రదమైన హిట్లు అందుకున్నాయి. అయితే ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో వాల్తేరు వీరయ్య చేశాను. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవి ని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త దర్శకులతో పని చేస్తున్నపుడు వారికీ కావాల్సిన ఫ్రీడమ్ ని ఎలా క్రియేట్ చేస్తారు ? నేను ఎప్పుడు మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అన్నంతవరకూ అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడి ‘ఓకే’ కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్ ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను. మొన్న రిటైర్ మెంట్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయంశమయ్యాయి ? కష్టపడే తత్త్వం లేనప్పుడు రిటైర్ మెంట్ తీసుకోవడమే మంచిదని అన్నాను. కెరీర్ మొదట్లో ఒక ఆకలి ఉంటుంది. ఒక పేరు తెచ్చుకోవాలి, మనల్ని మనం తెరపై చూసుకోవాలనే స్పిరిట్ .. కొంతకాలం తర్వాత ఎందుకు ఉండకూడదు? కష్టపడాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడూ అర్ద ఆకలితో ఉండాలి. కడుపు నిండిన వ్యవహారం లా ఉంటే మాత్రం అనుకున్నది డెలివర్ చేయలేవని చెప్పడమే నా ఉద్దేశం. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఏ ఎలిమెంట్ మిమ్మల్ని ఆ ఆకలి, కసితో డెలివర్ చేస్తోంది ? కేవలం ప్రేక్షకుల యొక్క ఆదరణ నా డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టే చేయగలుగుతున్నా. బావగారు బాగున్నారా లో బంగీ జంప్ చేస్తున్నపుడు.. ఇది ప్రేక్షకులు చూస్తే ఎంత ఎక్సయిట్ గా ఫీలౌతారు..వాట్ ఏ ఫీట్ అని క్లాప్స్ కొడతారని ఊహించుకున్న తర్వాత ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. చాలా రిలాక్స్ గా దూకాను. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ నన్ను ముందుకు నడుపుతుంది. రవితేజలో అప్పటికి ఇప్పటికి ఏం తేడాలు గమనించారు ? రవితేజ అప్పటికి ఇప్పటికి ఒకే మనిషి. ఇమేజ్ వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. అదే ఎనర్జీ తో ఉన్నాడు. తన ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. అప్పటికి ఇప్పటికి అదే ప్రేమ, ఉత్సాహం ఉన్నాయి. వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ ఉంటుంది. ఆ పాత్రకు చక్కని న్యాయం చేశాడు. ఒక పాట కోసం భారీ సెట్ వేశారు కదా... మైత్రీ మూవీ మేకర్స్ మేకింగ్ గురించి ? మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఒక ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారు. ‘ఖర్చు విషయంలో జాగ్రత్త. మీ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి’అని చెబుతుంటాను. బాబీ కి కూడా అదే విషయం చెప్పాను. ఎక్కడ వృధా కాకుండా బాబీ చక్కని పనితనం చూపించాడు. దాని వలన నిర్మాతలకు కూడా చాల కలిసొచ్చింది. నిర్మాతల బాగోగులు చూడాల్సిన బాధ్యత దర్శకులపై కూడా ఉంది. షూటింగ్ లో ఒక రోజుకి నలభై లక్షల రూపాయిలు కూడా ఖర్చు అయ్యేది. మారేడిమిల్లి లో షూట్ చేస్తున్నపుడు అక్కడ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో కూర్చుని ప్లాన్ చేసి ఎక్కడా వృధా కాకుండా చేయగలిగాం. మలేసియాలో కూడా షూట్ చేశాం. సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందు వస్తుంది. ఈసారి లాస్ట్ వస్తున్నారు. ఆ నిర్ణయం కూడా మీదే అని తెలిసింది ? మా సంస్థ(మైత్రీ మూవీ మేకర్స్) నుంచి రెండు సినిమాలు అనేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలైన తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే గనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి ఉంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను. మరి అప్పటికే విడుదలైన సినిమాల వలన థియేటర్లు టైట్ అవుతాయి కదా .. ? ఫస్ట్ డే రికార్డ్ కోసం తాపత్రయపడే వారైతే గనుక మా రెవెన్యు తగ్గిపోతుందనే ఫీలింగ్ ఉంటుంది. రావాల్సిన షేర్ వస్తుందనే నమ్మకం ఉంటే గనుక ఎప్పుడు ఎలా విడుదల చేసినా ఇది నిలబడి తీరుతుంది. బాబీ ఒక అభిమానిగా మిమ్మల్ని ఎలా చూపించబోతున్నాడు ? నేను కంటెంట్ ని బలంగా నమ్ముతాను. బాబీ కూడా కంటెంట్ ని నమ్ముతాడు. అందుకే మా ఇద్దరికి చక్కగా కుదిరింది. దీని అవసరం మేరకు టెక్నాలజీ ని వాడుకోవడం జరిగింది. బాబీ ఫ్యాన్ గా కంటే డైరెక్టర్ గా ఎక్కువ మార్కులు సంపాయించాడు. వాల్తేరు వీరయ్యలో రవితేజ, మీరు డైలాగులు మార్చుకోవడం ఎలా అనిపించిది ? ఒక ఫ్యాన్ బాయ్ గా దర్శకుడికి వచ్చిన ఆలోచన ఇది. దీనికి ఇద్దరం ఆమోదించాం. నన్ను ఇష్టపడే రవితేజ కి నా డైలాగ్ చెప్పడం తనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్. అలాగే నా తమ్ముడి లాంటి రవితేజ డైలాగ్ ని నేను చెప్పడం సరదాగా అనిపించింది. వాల్తేరు వీరయ్యలో ఎంటర్ టైన్ మెంట్ కి ఎంత అవకాశం ఉంది ? ఒక ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, అన్నయ్యలో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ రైజేషన్ తో పోల్చుకోవచ్చు. ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. బాబీ ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకర్షించిన ప్రధాన అంశం ? ఏదైనా కథ విన్నప్పుడు అందులో ముఖ్యంగా ఎమోషన్ చూస్తాను. పాటలు, ఫైట్లు అదనపు అలంకరణలు. ఎమోషన్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకులని హత్తుకుంటుంది. వాల్తేరు వీరయ్య కథ లో అంత గొప్ప ఎమోషన్ ఉంది. అందుకే బాబీ చెప్పిన కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను. శ్రుతి హాసన్ తో ఇందులో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ? తను కమల్ హాసన్ గారి కూతురు. తన డీఎన్ ఏ లోనే డ్యాన్స్ ఉంది. అవలీలగా డ్యాన్స్ చేస్తుంది. అయితే చాలా చలి లో డ్యాన్స్ చేయడం ఒక సవాలే. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి పని పట్ల అంకితభావం ఎక్కువ. తనతో మళ్ళీ వర్క్ చేయాలని ఉంది. ఇప్పుడు కథల విషయంలో కొరత ఉందా ? లేదండీ. చాలా కొత్త దర్శకులు మంచి మంచి కథలతో వస్తున్నారు. అర్జున్ రెడ్డి, ఉప్పెన, జాతిరత్నాలు, పెళ్లి చూపులు ఇవన్నీ మంచి కంటెంట్ ఉన్న కథలే కదా.. చాలా మంచి ప్రతిభ వున్న దర్శక, రచయితలు వస్తున్నారు. కథల విషయంలో కొరత లేదు. రిమేక్ సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్నదా ? ఒక రిమేక్ కథ చేస్తున్నపుడు మన హీరో ఇందులో ఎలా ఉంటాడనే క్యురియాసిటీ ఉంటుంది. గాడ్ ఫాదర్ విజయానికి కారణం కూడా ఇదే. కొన్ని మంచి మార్పులు చేసి ఇది చేశాం. అప్పటికే ఆ సినిమా మాతృక చూసినప్పటికీ గాడ్ ఫాదర్ ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు వేదాలం రీమేక్ చేస్తున్నాను. దీనిని కూడా చాలా డిఫరెంట్ గా ప్రజంట్ చేస్తున్నాం. దేవిశ్రీ మ్యూజిక్ గురించి ? దేవిశ్రీ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ చాలా మనసు పెట్టి చేశాడు. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాట చాలా చిలిపితనంతో రాసి చేశాడు. అలాగే బాస్ పార్టీ కూడా. ఇందులో ఉండే పాటలన్నీ నాకు ఇష్టం. నీకేమో అందం ఎక్కువ పాట కూడా నాకు చాలా ఇష్టం. నా ఫేవరేట్ సాంగ్ ఇది. బాబీ సింహా గురించి చెప్పండి ? బాబీ సింహా జాతీయ అవార్డ్ పొందిన నటుడు. నా సినిమాల్లో డైలాగులు పాటలు అవలీలగా చెప్పాడు. తనది తమిళనాడు అనుకున్నాను. తెలుగే అని తెలిసి సర్ప్రైజ్ అయ్యాను. తను కూడా ఫ్యాన్స్ బాయ్. ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు. దర్శకుడు బాబీతో పని చేయడం గురించి ? బాబీకి నేను ఫ్యాన్ అయ్యాను అని ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. అతని హార్డ్ వర్క్ చూసి ఫ్యాన్ అయ్యాను. వాళ్ళ నాన్న గారు చనిపోయిన తర్వాత చిన్న దినం అయిన వెంటనే అంత బాధని దిగమింగుకొని ఇక్కడ వచ్చి పని చేశాడు. అతని కమిట్ మెంట్ కి హ్యాట్సప్. అతని కమిట్ మెంట్ కి ఫ్యాన్ అయ్యాను. దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా ? జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే ఉంది. ఏదొక ఒక సమయంలో ఆలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక దర్శకత్వం చేస్తాను. టికెట్ రేటు ని 25 రూ. పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఆరు షోలు వేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది కదా? ప్రభుత్వ నిర్ణయాలని మనం గౌరవించాలి. ఈ వెసులు బాటు కల్పించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘వాల్తేరు వీరయ్య ’ మూవీ ప్రెస్మీట్లో చిరంజీవి (ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపునకు అనుమతి
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ మొదలుకానుంది. టాలీవుడ్ బడా హీరోలు పోటీకి దిగుతుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈనెల 12న విడుదల అవుతుండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 13న సంక్రాంతి బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్కు తీపికబురు అందించింది. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. టికెట్పై వీరసింహారెడ్డి చిత్రానికి 20 రూపాయలు, వాల్తేరు వీరయ్య చిత్రానికి 25 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనిపై జీఎస్టీ పెంపు అదనంగా ఉండనుంది.పెంచిన ధరలు రిలీజ్ డేట్ నుంచి పదిరోజుల పాటు ఉండనున్నాయి. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేకర్స్తో పాటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సంక్రాంతి బరిలో పోటీ పడిన చిరంజీవి- బాలయ్య సినిమాలు (ఫొటోలు)
-
మా ఇల్లే పాన్ ఇండియా
శ్రుతీహాసన్ ఏదీ ప్లాన్ చేయరు. సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఇన్నేళ్లు ఉండాలని ΄్లాన్ చేయలేదు. సినిమాకి దూరం కాకూడదనుకుంటారు. అంతే.. ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’, గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణతో చేసిన ‘వీరసింహారెడ్డి’తో ఈ సంక్రాంతికి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారామె. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ ఈ 12న, 13న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా శ్రుతి చెప్పిన విశేషాలు.. రెండు చిత్రాలతో మీతో మీరే పోటీ పడటం ఎలా ఉంది? నిజానికి ఇది ఊహించలేదు. తొమ్మిదేళ్ల క్రితం నా రెండు సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. అయితే పండగప్పుడు కాదు. ఫెస్టివల్ టైమ్లో రెండు పెద్ద చిత్రా లతో.. ఇద్దరు లెజెండరీ (చిరంజీవి, బాలకృష్ణ) హీరోల సినిమాలతో రావడం ఆశీర్వాదం అనుకుంటున్నా. రెండు సినిమాలూ హిట్టవ్వాలనే ఓ టెన్షన్ ఉంటుంది కదా... టెన్షన్ అనేది సెట్లో పని చేస్తున్నప్పుడు మాత్రమే. ఎక్స్ప్రెషన్ సరిగ్గా వచ్చిందా? లేదా డైలాగ్ బాగా చెప్పానా? లేదా అనే టెన్షన్ ఉంటుంది. సెట్ నుంచి బయటికొచ్చేస్తే టెన్షన్ ఉండదు. ఎందుకంటే మిగతాదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ‘వాల్తేరు..’, ‘వీరసింహా...’లలో ఏ సినిమాలో మీ పాత్ర బాగుంటుందనే పోలిక రావడం సహజం.. నిజమే. అయితే రెండు సినిమాల కథలు, ΄ాత్రలు, ట్రీట్మెంట్ భిన్నంగా ఉంటాయి. నా ΄ాత్రలు డిఫరెంట్గా, సవాల్గా ఉంటాయి. ‘వీరసింహా..’లో నా ΄ాత్ర కామెడీగా ఉంటుంది. కామెడీ చేయడం కష్టం. ‘వాల్తేరు...’లో నా ΄ాత్రని బాగా రాశారు. చిరంజీవి, బాలకృష్ణలతో డ్యాన్స్ చేయడం... నైస్ ఎక్స్పీరియన్స్. ‘వీరసింహారెడ్డి’లోని ‘సుగుణసుందరి...’ స్టెప్ బాగా రీచ్ అయ్యింది. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లోని ‘శ్రీదేవి... చిరంజీవి’ పాట కూడా అద్భుతంగా వచ్చింది. ఒక పాట మంచి ఎండ (సుగుణ సుందరి)లో.. మరో పాట (నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరు) విపరీతమైన చలిలో చేసిన అనుభవం గురించి? ఇండియన్స్కి ఎండ సమస్య కాదు. కానీ చలి తట్టుకోవడం కష్టం. పైగా పల్చటి చీరలో మైనస్ 11 డిగ్రీల చలిలో చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో హీరోయి న్లకే సమస్య. హీరోలు ఫుల్గా కవర్ చేసుకునే వీలు ఉంటుంది... యూనిట్ అంతా నాలుగైదు లేయర్ల కోట్స్ వేసుకుంటే మేం చలిలో డ్యాన్స్ చేశాం (నవ్వుతూ). సార్ (చిరంజీవి) కూడా పెద్దగా కవర్ చేసుకోలేదు. ఒక కోట్.. అంతే. ‘వీరసింహారెడ్డి’ వేడుకలో ΄పాల్గొన్న మీరు ‘వాల్తేరు వీర య్య’ వేడుకలో ΄పాల్గొనలేదు.. కారణం? ఆరోగ్యం బాగాలేదు. పూర్తిగా రికవర్ కాకపోవడంతో వేడుకకు వెళ్లలేకపోయా. ఐయామ్ సో సారీ. ఆ మధ్య మీకు తెలుగులో గ్యాప్ వచ్చింది... ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలతో, యంగ్ హీరో ప్రభాస్తో ‘సలార్’.. వరుసగా సినిమాలు చేయడం ఎలా ఉంది? మా ఇంట్లో మా అమ్మానాన్నని చూసి సినిమా అనేది ఫ్యామిలీ అనిపించింది. ఇక ఇండస్ట్రీ, ఆడియన్స్ పరంగా తెలుగు నాకు రియల్ ఫ్యామిలీ అంటాను. ఎందుకంటే సౌత్లో నేను పరిచయం అయింది తెలుగు సినిమాల ద్వారానే. ఒక కొత్త ప్రాంతంలో నాకు మంచి ఆహ్వానం దక్కింది. ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. హిట్ ఇచ్చారు. ‘క్రాక్’ తర్వాత మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ? ‘సంక్రాంతి’ అనే పదం నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతే నా లైఫ్లోకి వచ్చింది. మాకు తమిళ్లో ‘పొంగల్’ అంటాం. పండగ రోజు ΄పొంగలి వండుతాను. పూజ చేస్తాను. ఫ్యామిలీతో గడుపుతాను. గోపీచంద్ మలినేని మిమ్మల్ని లక్కీ హీరోయిన్ అంటారు. లక్ని మీరు నమ్ముతారా? లేదు.. హార్డ్ వర్క్ని, దేవుడిని నమ్ముతాను. ఒకవేళ ఎవరైనా నన్ను లక్కీ అంటే వాళ్లకు థ్యాంక్స్ చెబుతాను. అయితే నేను లక్, అన్లక్ని నమ్మను. ఎందుకంటే ఒకప్పుడు నన్ను ‘అన్లక్కీ’ అన్నారు. ఆ తర్వాత ‘లక్కీ’ అన్నారు. వేరేవాళ్లు నన్ను అలా అనడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను. -
వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ హైలైట్స్
-
రూటు మార్చిన మెగాస్టార్ చిరంజీవి
-
Waltair Veerayya Pre Release Event : మెగా మాస్ మూమెంట్..(ఫొటోలు)
-
'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఊర్వశి రౌతేలా (ఫొటోలు)
-
వైజాగ్లో సెటిల్ అవుదామనుకుంటున్నా: చిరంజీవి
(విశాఖ తూర్పు): ప్రశాంత జీవితం గడపాలనుకునే వారికి విశాఖ అద్భుతమైన ప్రాంతమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను ఆదివారం రాత్రి విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఎప్పటి నుంచో వైజాగ్లో నివాసం ఉందామని అనుకుంటున్నానని.. ఆ కల త్వరలో నెరవేరనుందని చెప్పారు. భీమిలి బీచ్ రోడ్డు వైపు స్థలం కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. త్వరలోనే ఇల్లు నిర్మించుకుని విశాఖ వాసి అవుతానని చెప్పారు. విశాఖ వచ్చిన ప్రతిసారి ఒక ఉద్వేగానికి గురవుతానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. డైరెక్టర్ చిత్రం పేరు వాల్తేరు వీరయ్య చెప్పగానే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని, అందుకు కారణంగా వైజాగ్పై తనకున్న ప్రేమ అన్నారు. కార్యక్రమంలో మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ బాబ్జి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ, ఇతర నటీనటులు పాల్గొని తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే ఈ సినిమాతో అభిమానులకు మరింత పూనకాలు రావటం ఖాయమన్నారు. -
విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విశాఖ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి
-
వాల్తేరు వీరయ్య ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా, కారణమేంటంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు విశాఖపట్నంలో గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిరంజీవి దంపతులు, రవితేజ, దేవిశ్రీప్రసాద్తోపాటు దర్శకనిర్మాతలు ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు చేరుకున్నారు. కానీ హీరోయిన్ శ్రుతిహాసన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అసలు సిసలైన మాస్ ఈవెంట్కు డుమ్మా కొట్టేసింది. ఇందుకు గల కారణాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చిందీ బ్యూటీ. తనకసలు ఆరోగ్యం బాగోలేదని, ఇది కరోనా కాకకపోతే బాగుండంటూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. మరో స్టోరీలో.. 'అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొనలేకపోతున్నాను. ఇందుకు చాలా బాధగా ఉంది. నేను మీ అందరినీ మిస్సవుతున్నాను. ఈ సినిమాలో చిరంజీవిగారితో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈరోజు ఈవెంట్ను విజయవంతం చేయండిస అని రాసుకొచ్చింది శ్రుతిహాసన్. చదవండి: అప్పుడు మీ టికెట్ కోసం కొట్టుకునేవాళ్లం: చిరుపై శేష్ ఎమోషనల్ -
Pongal Fight: పదిసార్లు పోటీపడ్డారు.. 11వ సారి విజయమెవరిదో?
చిరంజీవి-బాలయ్యల మధ్య సినిమాల పోరు ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా అది కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి సంక్రాంతి పండగ సందర్భంగా ఇద్దరి సినిమాలూ పోటీ పడటం కూడా ఇపుడే మొదలు కాలేదు. మూడున్నర దశాబ్ధాలుగా ఇద్దరి సినిమాలు కొదమ సింహాల్లా తలపడుతూనే ఉన్నాయి. ఈ ప్రస్థానంలో ఇద్దరికీ బ్లాక్ బస్టర్లున్నాయి. ఇద్దరికీ కొన్ని డిజాస్టర్లూ ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన పోటీ మాత్రం సాగుతూనే ఉంది. యుద్ధం సినిమాల మధ్యనే తప్ప నటుల మధ్య కాదు. అయితే 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి పండగ సమయంలో హోరా హోరీ తలపడే రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మాత్రం ఇదే మొదటి సారి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రెండింటినీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పెద్ద ప్రాధాన్యతే ఉంది. రైతుల పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి రైతుల దగ్గర నాలుగు డబ్బులు ఆడతాయి. సకల వ్యాపారాలూ కళకళలాడుతూ ఉంటాయి. అందులో సినిమా వ్యాపారానికి ఇది అసలు సిసలు సీజన్ అనే చెప్పాలి. అందుకే అగ్రనటులు తమ ప్రతిష్ఠాత్మక సినిమాలను సంక్రాంతి సందర్భంగానే విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నందమూరి బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా ఊర మాస్ హీరోలు. ఈ ఇద్దరి సినిమాలు విడుదలైతే మాస్ జనాల్లో పూనకాలు వచ్చేస్తాయి. థియేటర్లు కళకళలాడిపోతాయి. అందులోనూ సంక్రాంతి సీజన్లో ఈ ఇద్దరి సినిమాలూ విడుదలైతే మాత్రం అటు అభిమానులకూ ఇటు ఫ్యాన్స్కూ సంక్రాంతిని మించిన పెద్ద పండగే అవుతుంది. ► 1987 సంక్రాంతిలో బాలయ్య- చిరంజీవిల సినిమాలు మొదటిసారి తలపడ్డాయి. జనవరి 9న చిరంజీవి- కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో రూపొందిన 'దొంగ మొగుడు' విడుదలైంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయిదు రోజుల తర్వాత జనవరి 14న బాలయ్య కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో రూపొందిన 'భార్గవ రాముడు' సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకున్నా దొంగమొగుడు సినిమాకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందని సినీ రంగ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ► ఆ మరుసటి ఏడాది అంటే 1988లో జనవరి 14న చిరంజీవి కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన 'మంచి దొంగ' విడుదలైంది. ఆ మర్నాడే జనవరి 15న బాలయ్య ముత్యాల సుబ్బయ్యల సినిమా 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' విడుదల అయ్యింది. వీటిలో మంచి దొంగ ఏవరేజ్ హిట్ కాగా ఇన్ స్పెక్టర్ ప్రతాప్ హిట్ టాక్ తెచ్చుకుంది. ► 1989 సంక్రాంతి బరిలో జనవరి 14న చిరంజీవి నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' సినిమా విడుదలైంది. రిలీజ్ రోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మరుసటి రోజున జనవరి 15న బాలయ్య నటించిన భలేదొంగ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల వర్షం కురిసింది. ► ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరి సినిమాలూ సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి. ముందుగా 1997 జనవరి 4న 'హిట్లర్' సినిమా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆరు రోజుల తర్వాత 1997 జనవరి 10న బాలయ్య సినిమా 'పెద్దన్నయ్య' విడులైంది.ఈ సినిమా కూడా హిట్ టాక్తో దూసుకుపోయింది. ► మరో రెండేళ్ల తర్వాత 1999లో జనవరి 13న బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ గా మెరిసింది. దీనికి ఇంచుమించు రెండు వారాలకు ముందే జనవరి 1న చిరంజీవి నటించిన 'స్నేహం కోసం' రిలీజ్ అయ్య ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ► రెండు వేల సంవత్సరంలో జనవరి 7న చిరంజీవి సినిమా 'అన్నయ్య' విడుదలైంది. జస్ట్ ఓకే టాక్ తెచ్చుకుంది. వారం తర్వాత జనవరి 14న బాలయ్య నటించిన 'వంశోద్ధారకుడు' రిలీజ్ అయ్యింది. ఇది ఫ్లాప్ అయ్యింది. ► 2001 జనవరి 11న బాలయ్య సినిమా 'నరసింహనాయుడు' విడుదలై భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే రోజున చిరంజీవి నటించిన 'మృగరాజు' విడుదలైంది. ఇది చిరంజీవి కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచింది. ► మళ్లీ మూడేళ్ల తర్వాత బాలయ్య, చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. 2004 జనవరి 14న బాలయ్య నటించిన 'లక్ష్మీ నరసింహ' విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ మర్నాడు జనవరి 15న చిరంజీవి నటించిన 'అంజి' సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ► 2004 తర్వాత మళ్లీ ఇద్దరూ 2017 సంక్రాంతిలో తలపడ్డారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడంతో ఇంచుమించు తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ► 2017లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ను సంక్రాంతి సీజన్లోనే ప్రారంభించారు. 2017 జనవరి 11న చిరంజీవి వినాయక్ల కాంబినేషన్లో చిరంజీవి 150వ సినిమాగా విడుదలైన 'ఖైదీ నంబర్ 150' సూపర్ హిట్ అయ్యింది. జనవరి 12న బాలయ్య నటించిన చారిత్రక సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' విడుదలై పెద్ద హిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ సంక్రాంతి సీజన్లో కలబడలేదు. ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెండితెరను అలరించనున్నారు. ఇక బాలయ్య మాంచి మాస్ క్యారెక్టర్ తో వీర సింహారెడ్డిగా కనపడనున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోరులో ఎవరు పెద్ద వీరుడిగా అవతరిస్తారన్నది తేలాల్సి ఉంది. చదవండి: బాక్సులు బద్ధలైపోతాయని రవితేజ వార్నింగ్.. వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూశారా? -
చిరు Vs బాలయ్య.. ఇద్దరూ ఇరగదీస్తారా? బాక్సాఫీస్ కింగ్ ఎవరు?
సంక్రాంతి వస్తోందంటే సంగ్రామం వస్తోందనే అర్ధం. అది అలాంటిలాంటి సంగ్రామం కాదు. మహా సంగ్రామం.. దశాబ్ధాలుగా తెలుగునాట సంక్రాంతి పండగ వేదికగా అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య పెద్ద యుద్ధం జరుగుతూ వస్తోంది. ఈ సంక్రాంతికీ ఈ ఇద్దరూ తమ సత్తా చాటుకోడానికి సిద్ధంగా ఉన్నారు. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, వీర సింహారెడ్డిగా బాలయ్యలు తొడలు గొట్టి మరీ యుద్ధానికి సై అంటున్నారు. ఆ నటులే కాదు వారి అభిమానుల మధ్య కూడా అలాంటి యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇది ప్రొఫెషనల్ ఫైట్. ఈ ఫైట్లో సత్తా చాటిన వారే వీరుడు. ఈ సంక్రాంతి వీరుడెవ్వరనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.88 కోట్లు కాగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.73 కోట్లు. ఈ విషయంలో మెగాస్టారే కాస్త ముందున్నాడు. ఈ ఇద్దరు అగ్ర హీరోల ప్రీవియస్ సినిమాల ప్రభావం కూడా ఈ రెండు చిత్రాలపై ఉంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. చిరు నటించిన ఆచార్య ఫ్లాప్గా మిగిలింది. తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం నిరాశపరిచాయి. బాలయ్య విషయానికి వస్తే.. అఖండ విజయంతో మాంచి ఊపు మీదున్నాడు. మరోవైపు అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ సక్సెస్ వైబ్స్ కూడా బాలయ్యకు కలసి వచ్చే అంశాలే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు ప్రమోషన్ విషయంలో తెగ్గేదే లే.. అంటూ దూసుకెళుతున్నారు. దాంతో రెండు సినిమాలపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. రెండు సినిమాల ట్రైలర్లు, టీజర్లు, పాటలు.. సినీ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలో ఇటు యూట్యూబ్లో సంచలనంగా మారాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఈ రెండు చిత్రాలనూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించింది. సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేసి ఈ రెండు సినిమాలనూ రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాల్లోనూ హీరోయిన్ శ్రుతీహాసనే. ఇప్పటికే ఈ భారీ చిత్రాల బుకింగ్ మేళా మొదలైంది. అమెరికా, యూకేతో పాటు ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయ్యాయి. ముందుగా జనవరి 12న వీరసింహారెడ్డి వస్తున్నాడు. వీరసింహా రెడ్డి గర్జనలతో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి ఈనెల 13న బాస్ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. వాల్తేరు వీరయ్యలో ఎక్స్ ట్రా మాస్ ఎలిమెంట్ ఉంది. అదే మాస్ మహారాజ్ రవితేజ. మెగాస్టార్కు తోడు ఓ ఇంపార్టెంట్ రోల్లో మాస్ రాజా కనిపించబోతున్నాడు. మొత్తానికి పొంగల్ పోటీకి రంగం సిద్ధమైంది. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య చిరు, బాలయ్య సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ ఇద్దరు అగ్ర హీరోల్లో ఎవరు విజయపతాకం ఎగురవేస్తారు.. ? ఒక్కరే విన్నర్ గా నిలుస్తారా.. ? లేక ఇద్దరూ ఇరగదీస్తారా.. ? ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ వసూళ్లలో ఎవరు ముందుంటారు.. ? ఓవరాల్ రన్ లో బాక్సాఫీస్ కింగ్ ఎవరు.. ? అతి త్వరలోనే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరకబోతున్నాయి. చదవండి: మాస్ డైలాగులతో దద్దరిల్లిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ -
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే: సీపీ శ్రీకాంత్
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్ర యూనివర్శిటీ గ్రౌండ్లో అనుమతి ఇచ్చినట్లు విశాఖపట్నం సీపీ శ్రీకాంత్ తెలిపారు. నిర్వాహకులు అక్కడే ప్రీ రిలీజ్కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్లో ఈవెంట్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని సీపీ శ్రీకాంత్ అన్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటించగా.. రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. చదవండి: (వాల్తేరు వీరయ్య ట్రైలర్.. బాస్ నోట మాస్ డైలాగ్స్, చిరుకు రవితేజ వార్నింగ్) -
వాల్తేరు వీరయ్య ట్రైలర్.. బాస్ నోట మాస్ డైలాగ్స్, చిరుకు రవితేజ వార్నింగ్
వాల్తేరు వీరయ్య.. టైటిల్కు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కూడా ఊరమాస్ లెవల్లో ఉన్నాయి. బాస్ మాస్ లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ శనివారం సాయంత్రం రిలీజైంది. 'మీ కథలోకి నేను రాలా.. నా కథలోకి మీరందరూ వచ్చారు', 'వీడు నా ఎర.. నువ్వే నా సొర' అంటూ మాస్ డైలాగులు పలికాడు చిరంజీవి. చివర్లో రికార్డుల్లో నా పేరుండటం కాదు నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయని అదిరిపోయే డైలాగ్ వేశాడు చిరు. తర్వాత వైజాగ్లో గట్టి వేటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట అంటూ రవితేజ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డ్రగ్ స్మగ్లర్గా నటించిన చిరును ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని చెప్తూ.. ఒక్కొక్కడికి బాక్సులు బద్ధలైపోతాయని వార్నింగ్ ఇచ్చాడు మాస్ మహారాజ. మొత్తానికి ట్రైలర్ మాత్రం అన్ని ఎలిమెంట్స్తో అదిరిపోయింది. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. చదవండి: అలర్జీ.. అందుకే దుస్తుల్లేకుండా కనిపిస్తా -
‘వాల్తేరు వీరయ్య ’టైటిల్ వెనక ఇంత స్టోరీ ఉందా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ అందరిని ఆకర్షించింది. అయితే ఈ టైటిల్ వెనుక పెద్ద చరిత్రే ఉందట. ఈ కథకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో తాజాగా దర్శకుడు బాబీ వివరించారు. 'వెంకీ మామ' షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో ఉన్నప్పుడు.. చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం’ అని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. -
ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా.. నా జీవితంలో మర్చిపోలేను: బాబీ
చిరంజవి, రవితేజలు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా అలాగే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడు వాళ్లిద్దరితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చేయడం నా అదృష్టం. ఒక ఫ్యాన్ బాయ్ గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది’అని యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) అన్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► చిరంజీవికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. చిరంజీవి గారి సినిమాలో పని చేయాలనే ఒక కల ఉండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదవుతోంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది. మాస్ ఆడియన్స్ ఏం కావాలో అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్టోరీ డిజైన్ చేయడం జరిగింది. ► మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విజయాలు బ్లాక్ బస్టర్లు అలాగే కొన్ని అపజయాలు కూడా చూసుంటారు. ఆయనకి ఉన్నంత బ్యాలెన్స్ ఎవరికీ ఉండదని కూడా చెప్పొచ్చు. అలాగే రవితేజ గారు కూడా అంతే. ఒక సినిమాకి చేయాల్సిన న్యాయం కష్టం సర్వస్వం పెడతారు. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని బలంగా నమ్ముతారు. ► లాక్ డౌన్ కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చిరంజీవికి ఈ కథ చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక దృష్టి పెట్టాం. దాంట్లో నుంచి వచ్చిన క్యారెక్టరే రవితేజ గారిది. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీసి సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని గుణాలు లక్షణాలు వాల్తేరు వీరయ్యలో కనిపిస్తాయి. ► చిరంజీవి గారు, రవితేజ గారి కాంబినేషన్లో వచ్చే ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్ ఉంటాయి. పండక్కి రాబోతున్న కలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉన్న చిత్రం వాల్తేరు వీరయ్య. ► రవితేజ గారి చాయిస్ నాదే. రవితేజ గారిని తీసుకోవాలనే ఆలోచన రావడం, చిరంజీవి గారికి చెప్పడం, ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అనడం, చిరంజీవి గారిపై ఉన్న ప్రేమ అభిమానం, నాపై ఉన్న నమ్మకంతో రవితేజ గారు ఒప్పుకోవడం జరిగింది. ► ఈ చిత్రంలో ముఠామేస్త్రీ, గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ లుక్ కనిపిస్తోందని అంతా అంటున్నారు. వాల్తేరు వీరయ్య పాత్రకు అలాంటి లిబర్టీ ఉంది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు, బీడీ తాగొచ్చు.. గ్యాంగ్ లీడర్ లా గన్ పట్టుకొని వార్ కి రావచ్చు. ఆ ఫ్రీడమ్ అంతా వీరయ్య క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది తప్పితే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు. ► చిరంజీవి గారి డ్యాన్స్ తో పాటు ఫన్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఫన్ టైమింగ్ లో ఆయన మాస్టర్ . మనం ఫన్ ఇవ్వగలిగితే దాన్ని స్కై లెవల్ కి తీసుకెళ్ళిపోతారాయన. ఆ మ్యాజిక్ అంతా చూస్తూ పెరిగాను. ఈ ఎనర్జీ అంతా ఆయన నుంచి తీసుకోవడం జరిగింది. ► వాల్తేరు వీరయ్య ఫస్ట్ కాపీని చిరంజీవి చూసి ‘బస్టర్ కొడుతున్నాం బాబీ’ అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం మర్చిపోలేని మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా. ► చిరంజీవి గారిది దేవిశ్రీ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్ కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగా. అలా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్ గారి కి మా టీం అందరి తరపున కృతజ్ఞతలు. ► మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి పని చేయాలని ఎప్పటినుండో ఉండేది. ఇలాంటి సమయంలో నవీన్ గారు సినిమా చేద్దామని అడిగారు. తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో ఎక్కడ రాజీ పడకుండా సమకూరుస్తారు. -
మెగా ఫ్యాన్స్కి అలర్ట్.. వాల్తేరు వీరయ్య ట్రైలర్ టైమ్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి మాస్ లుక్లో కనిపించనుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను వదిలారు. ట్రైలర్ను నేడు(శనివారం)సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మాస్ మూలవిరాట్ వేట మొదలూ.. అంటూ సముద్ర అలల బ్యాక్ డ్రాప్లో చిరంజీవి బల్లెం పట్టుకొని ఉన్న మాస్ పోస్టర్తో ట్రైలర్ అప్డేట్ ఇచ్చేశారు. కాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
వీరయ్య vs వీరసింహా.. ఒకేసారి తలపడుతున్న చిరు, బాలయ్య