Chelluboina Venu
-
జగన్ వస్తే.. కూటమి సర్కార్కు ఎందుకంత కంగారు?: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంతో కూటమి సర్కార్కు కంగారు పుట్టిందని.. ప్రభుత్వం నిద్రావస్థలో ఉంటే ప్రతిపక్షం సమస్యను ప్రజలకు చూపించాలి.. వైఎస్ జగన్ అదే పని చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీలను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తుందన్నారు. గుంటూరు మిర్చి రైతుల విషయంలో సీఎం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.‘‘మిర్చి రైతుకు సరైన ధర లభించలేదని.. ఒప్పుకుంటూ గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రికి అవసరమైన భద్రతను ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోయింది?. ప్రభుత్వం ఇప్పటి వరకు గిట్టుబాటు ధర నిర్ణయించలేదని మంత్రులు చెప్పడం విడ్డూరం. రైతు నష్టపోతున్నా గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం దారుణం. క్వింటాల్ తర్వాత 11 వేల 600 చొప్పున కొనుగోలు చేయాలని ఉద్యానవన శాఖ రిపోర్ట్ ఇచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా రిపోర్టును పక్కన పడేశారు. తీవ్రమైన అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు’’ అని వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఓ చిన్నారి వైఎస్ జగన్తో సెల్ఫీ తీయించుకోవటానికి ప్రయత్నిస్తే ఐటీడీపీ దారుణంగా ట్రోల్ చేసింది. విమర్శలు, ప్రతిపక్షాల నోరు నొక్కడం ద్వారా పాలన కొనసాగించాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి పక్ష నేత సమస్యలను పరిశీలించడానికి వెళ్ళినా కేసు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం దారుణం’’ అని వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలే: చెల్లుబోయిన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం అంతా కుట్రలు, కుతంత్రాలతో నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రతిపక్ష నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి చెల్లుబోయిన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉంది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఉమ్మడి రాజధానికి పదేళ్ల కాలం ఉన్నా రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చేశారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు విలువ లక్షా పదివేల కోట్లు చంద్రబాబు వల్లే రాలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని అనేక ఆరోపణ చేశారు. కేవలం అధికారం కోసం విష ప్రచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు అబద్ధాలు మోయడమే జాకీ మీడియా పని.. చెల్లుబోయిన సీరియస్ కామెంట్స్
-
టీడీపీ బీసీ వ్యతిరేక పార్టీ: వేణు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20 శాతం కేటాయించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాజాగా కల్లుగీత కార్మికులకు కేవలం 10 శాతం మేరకే మద్యం దుకాణాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని అన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలిపారు.చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంకా ఏం మాట్లాడారంటే..:గీత కార్మికులకు చంద్రబాబు మోసం:మద్యం పాలసీలో భాగంగా ఎన్నికలకు ముందు కల్లుగీత సొసైటీలకు 20 «శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిందాన్ని విస్మరించి కేవలం 10 శాతం దుకాణాలను మాత్రమే గీత కార్మికులకు కేటాయిస్తూ తాజాగా జీఓ జారీ చేశారు. ఇది బీసీలను అన్యాయం చేయడం, మోసం చేయడం కాదా? ఆ 10 శాతం దుకాణాలు కూడా సక్రమంగా మద్యం విక్రయాలు లేని చోట్ల, దుకాణాలకు నష్టాలు వస్తున్న చోట్లను ఎంపిక చేసీ గీత కులాలకు అంటగడుతున్నారు. మద్యం విక్రయాల్లో మార్కెట్ బాగున్న చోట్ల దుకాణాలను కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ౖMðవసం చేసుకున్నారు.బీసీల పట్ల టీడీపీ చిన్నచూపు:కల్లుగీత సొసైటీల్లో పని చేస్తున్న గీత కార్మికులకు కల్లు విక్రయాలు తగ్గిపోయి, ఉపాధి కొరవడుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయం చూపించేందుకే మద్యం దుకాణాలను కేటాయిస్తున్నామని చెబుతున్నారు. అటువంటప్పుడు మద్యం పాలసీని ప్రకటించి, దుకాణాలకు టెండర్లు పిలిచిన సందర్భంలోనే గీత కార్మికులకు ఎందుకు దుకాణాలను కేటాయించలేదు? దీనికి ఆరు నెలల సమయం కావాల్సి వచ్చిందా? మాచర్లలో లైసెన్స్ కోసం ఒక కల్లుగీత కార్మికుడు వెడుతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు గురి చేసిన సంగతి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించారు.దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది. మద్యం దుకాణాల నుంచి పైవాళ్లకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. మద్యం దుకాణాలకు వేలం కోసం దరఖాస్తు చేసే సమయం నుంచి వారికి కేటాయింపులు జరిగితే స్థానిక ఎమ్మెల్యేలకు లాభాల్లో వాటాలు ఇవ్వాలి. బెల్ట్ షాప్లు నిర్వహించుకునేందుకు దగ్గర ఉండి వేలం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఇప్పుడు లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారిపైన కూడా దౌర్జన్యాలకు పాల్పడటం బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిన్నచూపుకు నిదర్శనం.బీసీ రిజర్వేషన్లపైనా పచ్చి అబద్దాలు:స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ, ఆ సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. 2019లో సీఎం అయిన శ్రీ వైయస్ జగన్, బీసీలకు అదే 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చంద్రబాబు తన అనుయాయుడు సుధాకర్ రెడ్డి చేత పిల్ వేయించి రిజర్వేషన్లు దక్కుండా కుట్రలు చేయడం వల్ల 24 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు అదే చంద్రబాబు బీసీలకు మేలు చేసే నేతగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉంది. చంద్రబాబు బీసీల విషయంలో చెబుతున్న ప్రతిమాటా ఒక అబద్దమే.జాకీ మీడియా తప్పుడు కథనం:చంద్రబాబు అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే ప్రతికలో బీసీలపై వైసీపీ కత్తి’ అనే శీర్షికన ఒక వార్తను ప్రచురించారు. తెలుగుదేశం పాలనలో బీసీలపై ఎంత నీచంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. తమ సమస్యలను ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు వివరించేందుకు ఆనాడు సచివాలయంకు వెళ్ళిన నాయీబ్రాహ్మణులను మీ తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను అని, మత్స్యకారులు వెడితే వారిని తోలు తీస్తాను అని చంద్రబాబు హెచ్చరించిన సంగతి రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు. -
రాష్ట్ర విభజనకు చంద్రబాబు ముఖ్య కారకుడు అయ్యాడు: వేణుగోపాలకృష్ణ
-
‘బాబు మోసాలను పవన్ ప్రశ్నించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు.. ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై.. బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.‘‘తల్లికి వందనం, ఫీజు రియింబర్స్మెంట్, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పినా ఇప్పటిదాకా అది జరగలేదు. ఎందుకు?. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఎందుకు ఈ విషయాల్లో మౌనంగా ఉన్నారు?. పవన్ కళ్యాణ్ స్పందించాలి... లేదంటే చంద్రబాబు మాయలో పడి మీరు మోసపోయినట్టే.. అలాగే ప్రజల వద్ద నమ్మకమూ కోల్పోతారు.ఖజానా 100 కోట్లు ఉన్న సమయంలోనే నవరత్న పథకాలను వైయస్ జగన్ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్ర ఆదాయం కూడా ఆయన హయాంలోనే పెరిగింది. 7,000 కోట్లు రూపాయలతో ఖజానా మీ చేతిలో పెడితే ఏం చేశారు?. పదిహేను శాతం వృద్ధిరేటు దాటిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టమవుతోంది. పోలవరం ,అమరావతి చంద్రబాబు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి.... చంద్రబాబు ఆస్తులు విలువ పెరుగుతుంది మినహా ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు.ప్రజలు మీరు చెప్పిన హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు ... వాటిపై దృష్టి పెట్టండి అని హితవు పలికారాయన.చంద్రబాబు పేదల ద్వేషి. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పింది ఎవరు?. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు. మీ వాళ్ళు భూములు కొనుగోలు చేసినందుకు మీ స్వార్థం కోసం అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోవడం దారుణం అని వేణుగోపాల్ అన్నారు. -
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: చెల్లుబోయిన వేణు ఫైర్
-
అప్పుల్లో ఏపీని అగ్రగామి చేయడం బాబు టార్గెట్: చెల్లుబోయిన
సాక్షి, రాజమహేంద్రవరం: దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించరు అని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారీ ప్రజలను నట్టేట ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన కేబినెట్ లో అయినా సూపర్ సిక్స్ అమలుపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించినా, మళ్లీ ప్రజలకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... మళ్ళీ, మళ్ళీ మోసం చేయడానికే..కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు చర్యలు తీసుకుంటాని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 12 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో సూపర్ సిక్స్ కు సంబంధించినవి లేవు. తాజాగా గురువారం కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అయినా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలపై ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఎదురుచూశారు. మళ్ళీ, మళ్ళీ మోసం చేయడమే అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రజలను నిరాశలోనే ముంచేశాడు.హామీలు అమలు చేయలేక భయం అంటున్నారుసూపర్ సిక్స్ తో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. మీ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, అధికారంలోకి వచ్చిన మీరు వారిని దారుణంగా మోసగించారు. చంద్రబాబు అనుభవం ప్రజలను మోసం చేయడానికే పనికి వస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలుపై అసెంబ్లీ సాక్షిగా వాటిని అమలు చేయాలంటే నాకు భయం వేస్తోందంటూ చంద్రబాబు చెప్పాడు. ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఇచ్చే హామీలు సాధ్యమవుతాయా లేదా అనే విషయం ఇంత అనుభవం ఉన్నా చంద్రబాబుకు తెలియదా?నవరత్నాలను ప్రకటించి చిత్తశుద్దితో అమలు చేశాంఆనాడు జగన్ గారు ప్రజల కోసం నవరత్నాలను ప్రకటించారు. దాని అమలుకు ఒక క్యాలెండర్ ను ప్రకటించి మరీ ప్రజలకు అందించారు. ప్రజలకు సాయం అందించడంలో ఆయన చిత్తశుద్దితో కృషి చేశారు. దానిపైన కూటమి పార్టీలు అసత్య ప్రచారాలు చేశాయి. జగన్ గారి సంక్షేమం వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిందంటూ విమర్శించారు. జగన్ ప్రజల కోసం అప్పులు చేస్తే తప్పు అని అన్న చంద్రబాబు ఈ ఆరు నెలల్లోనే 1.19 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ప్రజలకు ఒక్క రూపాయి కూడా తన హామీల మేరకు ఖర్చు చేయలేదు. ఇది ఒప్పు అని ఎలా సమర్థించుకుంటారో చంద్రబాబు చెప్పాలి. జగన్ గారి ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్ నెలలో విద్యార్ధులకు వసతిదీవెన, పొదుపుసంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకారభరోసా, జూన్ నెలలో అమ్మ ఒడి, జులై నెలలో విద్యా దీవెన, నేతన్న నేస్తం, సెప్టెంబర్ నెలలో చేయూత, అక్టోబర్ నెలలో రైతు భరోసా, నవంబర్ లో విద్యాదీవెన, రైతులకు సున్నావడ్డీ రుణాలు, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా అమలు చేశారు.హామీల ఎగవేతకే జగన్ పాలనపై విమర్శలుప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగవేయాలనే ధోరణితో జగన్ గారి పాలనపై విమర్శలు చేస్తూ, పాలనను గాలికి వదిలేశారు. నా అనుభవంతో సందపను సృష్టిస్తాను, సంక్షేమాన్ని సృష్టిస్తాను అని హామీలు గుప్పించాడు. నాడు జగన్ గారు అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించి, విజయవంతంగా అమలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దానిని కాపీ కొడుతూ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల కాలంలో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు ఎందుకు కలగలేదు? పైగా ఈ ఏడాది తల్లికి వందనంకు మంగళం పాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తాంటూ తాజా కేబినెట్ సమావేశంలో తీర్మానించడం ఖచ్చితంగా ప్రజలను మోసగించడమే.వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపైనా అబద్దాలుచంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 7.40 లక్షల కోట్లు అన్ని చెప్పారు. దీనిలో 2014-19 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులే రూ.4.50 లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కలన్నీ మీ మంత్రులే చెప్పారు. మోసమే మీ ఎజెండాగా పనిచేస్తున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఘనుడు చంద్రబాబుప్రశ్నించాల్సిన సామాజిక మాధ్యమాలను సైతం ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. వ్యవస్థలన మేనేజ్ చేయడం అలావాటుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఒక్కో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై వేర్వేరు పోలీస్ స్టేషన్ లలో పదుల సంఖ్యలో అబద్దపు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు.కేబినెట్ లో హామీల అమలుపై చర్చ ఏదీ?సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కార్ ఎగనామం పెడుతోంది. నిన్న కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇదే నిజం అని అర్థమవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ఏడాది అమలు చేయడం లేదనే అంశాన్ని మీ కేబినెట్ సమావేశం వల్ల తెట్టతెల్లమయ్యింది. సీఎం చంద్రబాబు ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదికే రూ. 13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. గత ఏడాది కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 సాయంను కూడా రైతులకు అందించలేదు. ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కోసం కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. వెయ్యి కోట్లు మాత్రమే. కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తామని అన్నారు. 1.80 కోట్ల మంది ఆడబిడ్డలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. ఇవ్వన్నీ మోసం కాదా?అమ్మ ఒడి ఆగిపోయింది... తల్లికి వందనం మాయమయ్యిందిపేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలు మార్చేశక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రతి తల్లి ఖాతాలో దాదాపుగా రూ. 26,000 కోట్లు జమ చేశారు. 73 వేల కోట్లతో నాడు-నేడు ద్వారా విద్యాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. తతల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తీరు గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది. ఎంతమంది స్కూలుకు వెళ్ళే పిల్లలు ఉంటే, ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమయ్యింది. రైతులు అప్పుల పాలు కాకూడదని పెట్టుబడి సాయంను అందించి జగన్ గారు దేశానికే ఆదర్శమయ్యారు. రైతుభరోసాను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రకటించింది. కానీ అమలు మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా జగన్ గారి ప్రభుత్వం అండగా నిలిచింది.మహిళలను నిలువునా దగా చేశారురాష్ట్రంలో 19-59 సంవత్సరాల లోపు మహిళలకు ఏడాదికి రూ.18వేలు ఇస్తామనని హామీ ఇచ్చి, దారుణంగా మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 కోట్ల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం ఈ కేబినెట్ లో అయినా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. ఉచిత గ్యాస్ కింద ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని చెప్పి కేవలం ఒక సిలెండర్ తోనే మాయ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు అవసరం. కానీ ఈఏడాది బడ్జెట్ లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటదాయించింది.మత్స్యకార భరోసా మాయంగత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థికసాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతున్నారు. అయితే పథకం అమలు పై ఖచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలను ఖరారు చేయలేదు.బాబుగారి మాటలకు భావాలు వేరుఅన్ని వర్గాలను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసగించింది. చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. బాబుగారి మాటలకు భావాలే వేరు. ఆయన ఏదైనా చెప్పారంటే, ఖచ్చితంగా అది చేయరు అని అర్థం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా మరిచిపోయి మాట తప్పుతోంది. దీనిని వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రజలపై దారుణంగా పెంచిన విద్యుత్ చార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమించాం. రేపు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరాడతాం. ప్రజల గొంతుకగా వైయస్ఆర్ సీపీ నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పాలకుల మీద ఉన్న నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి -
చంద్రబాబు భస్మాసురుడు.. నెత్తిపై చెయ్యి పెడితే అంతే
-
‘‘వాటిని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు’
విశాఖ : రాజకీయ కక్షలో భాగంగానే వైఎస్సార్సీపీ నేత విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. కోనసీమలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే విశ్వరూప్ కుమారుడిని అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ వచ్చిన ప్రతీ సందర్బంలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతోందని ధ్వజమెత్తారు చెల్లుబోయిన. తిరుపతి లడ్డూ వివాదం మొదలుకొని కృష్ణా నదిలో బోట్లు వరకు ఇలా ప్రతీది డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, ప్రతీ రోజూ ఏదో ఘటన జరుగుతూనే ఉందన్నారు. వాటిని డైవర్ట్ చేయడానికే ఈ తరహాడ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్మంచి వ్యక్తి అని, అతనికి కుట్రలు, కుతంత్రాలు తెలియవని చెల్లుబోయిన స్పష్టం చేశారు. -
సిండికేట్లను ప్రోత్సహించింది చంద్రబాబే
-
అబద్దపు మోసాలతో కూటమి పాలన
-
పవన్.. బాబు అపరాధాన్ని క్షమించమని దీక్ష చేపట్టు: మాజీ మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.మాజీ మంత్రి చెల్లుబోయిన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగులను భయభాంత్రులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లను అన్యాయంగా సస్పెండ్ చేశారు. తాజాగా కాకినాడలో జనసేన ఎమ్మెల్యే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దాడి చేసి రాజీ చేసుకుంటే చట్టాల పట్ల ప్రజలకు నమ్మకం పోతుంది. చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్టు ప్రకటించి పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలి. టీటీడీ రిపోర్టు టీడీపీ ఆఫీసుకు ఎలా వచ్చింది. సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ప్రతిపక్షాలపై బురదజల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం -
ఏపీకి పోలవరం జీవనాడి
-
అధికారం శాశ్వతం కాదు.. చేసిన మంచి పనులే శాశ్వతం.. గుర్తుపెట్టుకో చంద్రబాబు..
-
జోగి రాజీవ్ అరెస్ట్ పై.. చెల్లుబోయిన వార్నింగ్
-
కక్ష సాధింపే కూటమి సర్కార్ లక్ష్యం: మాజీ మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఎందుకు హామీలు నెరవేర్చలేకపోతున్నారని ప్రశ్నించారు. కాగా, మాజీ మంత్రి చెల్లుబోయిన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కక్ష సాధించే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కక్ష తీర్చుకోవడానికి ఆయన కుమారుడిని టార్గెట్ చేయడం దారుణం. 2019లో కేవలం రూ.100 కోట్లతో ఖజానాను అప్పగించారు. రాష్ట్రం విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేశారు.అయితే, రాష్ట్రం అప్పుల్లో ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఎలా ఇచ్చారు?. హామీలు ఎలా నెరువేస్తారని అనుకున్నారు?. ప్రజలు ఎదురు చూస్తుంటే హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మీకున్న మీడియా బలంతో బీసీలపై దాడులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జేబు సంస్థలైన ఏసీబీని ఉపయోగించి జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా తగ్గలేదు.రెండు లక్షల 40 వేల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. బలహీన వర్గాల్లో ఎదిగిన నాయకులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాలకు అనేక పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. వారిని లక్ష్యంగా చేసుకుని వేధించడం ద్వారా కార్యక్రమాలు అమలు చేయవలసిన అవసరం లేదనుకుంటున్నారా?. బలహీన వర్గాలను అణచివేయం ద్వారా ఎటువంటి లబ్ది పొందాలనుకుంటున్నారు. ఉచిత ఇసుక సరే సరి.. నిల్వ ఉంచిన ఇసుకను దారుణంగా దోచుకున్నారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు’ అని ప్రశ్నించారు. -
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్ యాక్ట్పై ఇంకా రూల్స్ తయారు కాలేదన్నారు.‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు. -
కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బాబు
-
ఆ మాటలు గుర్తున్నాయా చంద్రబాబూ.. మంత్రి వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ‘‘నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తన అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. ‘‘తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా?. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా.? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు.. ఇదో పెద్ద అబద్ధం.. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా.. సీఎం జగన్ పింఛన్లు పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా.. మీ పార్టీ ఏనాడైన బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా?. ఇవాళ సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు శెట్టిబలిజలకు కేటాయించలేకపోయాడు. రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావ్. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన. ఫీజు రీయింబర్స్మెంట్ సగానికి సగం తగ్గించి బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు’’ అంటూ మంత్రి వేణు దుయ్యబట్టారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి ఫైర్..!
-
చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా ?
-
‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? అంటూ దుయ్యబట్టారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో ఏం మాట్లాడారంటే: చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఒక కాపీ, పేస్ట్. ప్రతి ఐదేళ్లకు ఒకసారి బీసీలను మోసం చేయటం చాలా సులభం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కలసి బీసీ డిక్లరేషన్ అని మరోసారి మోసపూరిత వాగ్దానాలు ప్రకటించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆశయాలు, లక్ష్యాలు అన్నీ ఆయనతోనే వెళ్లిపోయాయి. 1995 తరువాత ఎన్టీఆర్ ఆశయాలను ఒక అత్యాశపరుడు తుంగలోకి తొక్కాడు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలను విస్మరించి.. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ, పేస్ట్ ప్రోగ్రాంను చంద్రబాబు ప్రదర్శించాడు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదు. బీసీలను అతిఘోరంగా టీడీపీ మోసగించింది. 1995 నుంచి 2004లో వరకు బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులపై చంద్రబాబు ఏమైనా చేశారా అంటే ఏమీ లేదు. బీసీలు పేదరికం నుంచి ఎదగాలంటే.. విద్యమాత్రమే మార్గమని రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ బీసీలను దగా చేసిన వారిలో ప్రప్రథముడు చంద్రబాబే. 2014లో బీసీల కోసం 142 హామీలు చంద్రబాబు ఇచ్చారు. జనం మర్చిపోయారని అనుకుంటున్నారేమో. ఒకవేళ చంద్రబాబు మర్చిపోయారేమో ఆ మేనిఫెస్టో తెప్పించుకుని చూడండి. 2014లో 142 హామీలు ఇస్తే.. ఒక్కటీ అమలు చేయలేదు. ప్రతి ఐదేళ్లకో ఒక వేషం వేసి బీసీలను చంద్రబాబు మోసం చేస్తాడు ప్రతి ఐదేళ్లకు ప్రజలను మోసం చేయటానికి చంద్రబాబు ఒక వేషం వేస్తుంటాడు. రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. ఉచిత విద్యుత్ అంటే కాల్పులు జరిపించి.. మళ్లీ ఉచిత విద్యుత్ ఇస్తానని చంద్రబాబు నోట వైఎస్ఆర్ అనిపించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు చంద్రబాబు ఏమి విమర్శలు చేశారో గుర్తు చేసుకో. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. బీసీల వెనుకబాటుతనానికి కారకుడు, బీసీల ద్రోహి చంద్రబాబే. 1992లో ఆర్థిక సంస్కరణలు వస్తే.. 1997లో ఐటీ బూం వస్తే.. బీసీ విద్యార్థి, యువకుడు ఐటీలోకి రాలేకపోయారు. 2007లో వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిన తరువాతే బీసీ బిడ్డ ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత విద్యలు చదివారు. చంద్రబాబుది మనువాదం అయితే జగన్ది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దారి బీసీలను బానిసలుగా చూడటానికి కులవృత్తులను చంద్రబాబు ప్రోత్సహించాడు. రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్ను జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం మను సిద్దాంతాన్ని అనుసరిస్తున్నారు. కల్లుగీత గీసుకునేవారు.. అదే వృత్తి చేయాలి. నేత నేసుకునేవారు దానికే పరిమితం కావాలి. అలా బీసీలు కులవృత్తులకే పరిమితం అవ్వాలి తప్ప సమాజంలో ఎదగకూడదనేది చంద్రబాబు నిజస్వరూపం. బీసీల తోకలు కత్తిరిస్తా... జడ్జిలుగా బీసీలు పనికిరారు అన్నావ్ బీసీ కులాల్లో ఉపకులాలు చంద్రబాబు నోట వచ్చింది. మరి, గతంలో నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలు తీస్తాను, జడ్జీలుగా బీసీలు పనికిరారని చంద్రబాబు అన్నారు. ఇవేమీ ప్రజలు మరిచిపోలేదు. సీఎం జగన్ హయాంలో బీసీలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు బీసీలు సమాజానికి వెన్నెముక అని వారి వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. బీసీ డిక్లరేషన్ ఇచ్చి ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు జగన్. బీసీల ఆత్మగౌరవం ఎక్కడా తాకట్టు పెట్టకుండా.. కుదవ పెట్టకుండా.. రక్షించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. సీఎం జగన్ హయాంలో లక్షా 73 వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో నేరుగా.. డీబీటీ ద్వారా రూ.4.38లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. బీసీల కోసమే రూ.1.73 లక్షల కోట్లు లబ్ది బీసీల ఖాతాల్లో నేరుగా చేర్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డి. అది బీసీలకు తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు సబ్ ప్లాన్ పేరిన ఒక డ్రామా ఆడాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల ముందు కూడా ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు ఇచ్చి అంటగట్టాలని అనుకున్నావు. రోజూ లోకేశ్, చంద్రబాబు 34% రిజర్వేషన్లు ఉన్నాయి అని చెబుతారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణను పి.వి.నరసింహారావు 33.3% అమలు చేశారు. దానికి మరో 0.7% కలిపి 34% అని చంద్రబాబు చెబుతారు. 2014-19 మధ్యన స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల నిర్వహించని కారణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూదని తీర్పు ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పాలకుడు అఫిడవిట్ ఇచ్చారు. అతనికి చంద్రబాబు మద్దతు ఇచ్చారు. 34% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రతాపరెడ్డి అనే అతన్ని సుప్రీంకోర్టుకు పంపి రిజర్వేషన్లు అడ్డుకుంది బాబు కాదా? స్థానిక సంస్థల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి.. 50% రిజర్వేషన్లు.. నామినేటెడ్ పోస్టులు, దేవాలయ ఛైర్మన్లలోనూ సీఎం జగన్ ప్రకటించి అమలు చేశారు. సీఎం జగన్ కులగణన చేయించారు.. త్వరలోనే ప్రకటన చేస్తారు ఒక అబద్ధం చెప్పేసి వెళ్లిపోతే ప్రజలు మర్చిపోతారు అని చంద్రబాబు అనుకుంటారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి అనుకుంటారు. ప్రజలు మర్చిపోరు. చంద్రబాబును మర్చిపోయేలా బీసీలే చేస్తారు. కులగణన ఎందుకు చేస్తున్నారని పవన్ కల్యాణ్ చేత చంద్రబాబు ప్రకటన చేయించిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. త్వరలో కులగణన మీద సీఎం జగన్ ప్రకటన చేస్తారు. బీసీ బిడ్డలు ఇంగ్లీష్ చదవకూడదా... ఎందుకు అడ్డుపడ్డావ్ బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు. చంద్రబాబు చేసిన ప్రతి పనిలో బలైంది బీసీలే. ఈ విషయంలో అచ్చెన్నాయుడు వాపోతున్నారు. తప్పులు చేయించింది చంద్రబాబు న్యాయస్థానం ముందు దోషిగా అచ్చెన్నాయుడును నిలబెట్టాడు. ఈరోజు తప్పులు చేసిన చంద్రబాబును కూడా సీఎం జగన్ దోషిగా నిలబెట్టారు. అడ్డదారిలో వచ్చిన లోకేశ్ కూడా వేల సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిందని హాస్యాస్పదం. అసలు బీసీల జీవితాలు మారింది.. ఆనాడు వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్ వచ్చిన తరువాతే. బీసీల జీవితాలు మారాలంటే విద్య అందాలి. ఇంగ్లీషు మీడియం అందాలి. ఇంగ్లీషు మీడియం పెడితే గగ్గోలు ఎందుకు పెట్టారు. నీ మనవడు ఇంగ్లీషులో చదవాలి. బీసీ బిడ్డ ఇంగ్లీషులో చదివితే ఎదిగిపోతాడని నీ భయమమా? ఒక్కసారి ఈ విషయం బీసీలు ఆలోచించాలి. సీఎం జగన్ కేబినెట్లో పదిమంది బిసీ మంత్రులున్నారు ఇవాళ కేబినెట్లో 10 మంది బీసీ మంత్రులు ఉన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలు ఉన్నారు. యాదవ, కురుబ సామాజిక వర్గాలు లోక్సభ, పార్లమెంట్లో ఉన్నారు. ఆ సీట్లను చంద్రబాబు తన సామాజిక వర్గానికి అమ్ముకున్నారు. బీసీ అయిన తమ్మినేని సీతారామ్ను స్పీకర్ చేశారు. డిప్యూటీ సీఎంగా ముత్యాల నాయుడును చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? రాష్ట్రంలో 58 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఎమ్మెల్సీలుగా 69% బీసీలకు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 37% మాత్రమే ఇచ్చాడు. ఎమ్మెల్సీలకు బీసీలకు 69% శాతం ఇచ్చిన వైఎస్ఆర్సీపీని చంద్రబాబు విమర్శించటం ఏమిటి? అంతెందుకు 6 జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లుగా బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. మున్సిపాల్టీలలో 44 మంది బీసీలకు (53%) ఛైర్పర్సన్ పదవులు, 9 మంది బీసీలకు (64%) కార్పొరేషన్లు మేయర్లుగా బీసీలకు అవకాశం వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దే రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. ఆ బీసీ కులాల ఆత్మగౌరవాన్ని రక్షించటం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. అలాంటి జగన్ గారిపై చంద్రబాబుకు విమర్శలు చేయటం ఏమిటి? చంద్రబాబుకు సిగ్గులేదు. కుల కార్పొరేషన్లు గురించి చంద్రబాబు మాట్లాడటం ఏమిటి? ఎప్పుడూ ఒక్కటే అబద్ధాన్ని చంద్రబాబు వల్లె వేస్తున్నారు. 56 కార్పొరేషన్లకు కుర్చీలు లేవంట. సీట్లు లేవంట. మీడియా మిత్రులు లారా రండి. వారు ఎంతో హుందాగా ఉన్నారో.. బీసీ భవన్ ఎలా ఉందో చూపిస్తాం. చులకన చేసిన వాడు గొప్పవాడు.. గొప్పగా చూసేవాడు.. చులకన చేసినట్లు అని.. కొత్త భాష్యం.. కొత్త భాషతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ నభూతో నభవిష్యత్ అని దేశమంతా చెప్పుకుంటోంది. కులగణన, సోషల్ ఇంజనీరింగ్లో జగన్ గారికి ఎవ్వరూ సాటి లేరు. 4% సామాజిక వర్గానికి 21 సీట్లు 45% బీసీలకు 18 సీట్లా బాబూ! అంతెందుకు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే చూస్తే.. 4% ఉన్న చంద్రబాబు సామాజిక వర్గానికి 21 సీట్లు.. 45% ఉన్న బీసీలకు 18 సీట్లు కేటాయించారు. చంద్రబాబు దృష్టిలో కులం అంటే తన సామాజిక వర్గమే. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ను కలిపేసుకుని బీసీలను అణగదొక్కేయవచ్చనేది చంద్రబాబు ఆలోచన. కానీ, కాపులు విజ్ఞులు. ఈ జిల్లాలో 2008, 2024లోనూ బీసీలు, శెట్టి బలిజలు, గౌడలు, యాదవులు, దేవాంగులు, కుమ్మరి, కమ్మరి, ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు చంద్రబాబుకు కళ్లు తెరిపించటానికి సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్, రామచంద్రపురం, పాలకొల్లు, నర్సాపురం పార్లమెంట్ బీసీలకు జగన్ కేటాయించారు. కాపులను బీసీల్లో చేరుస్తానని వికృత క్రీడతో చంద్రబాబు మోసగించారు. అంతేకాదు.. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు హింసించాడు. డబ్బుందని, ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని బాబు చేసిన ప్రయత్నాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఒక కాపీ, పేస్ట్. మళ్లీ బీసీలను దగా చేయటానికి వంచించటానికి బాబు ప్రకటించిన డిక్లరేషన్. అసలు ఏ హామీ అమలు చేయని పార్టీకి డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత టీడీపీకి లేదు. దానికి వత్తాసు పలికే జనసేనకు అసలు లేదు. టీడీపీ వల్ల బాధించబడింది బీసీలే. రాజకీయ నాయకుడు అంటే అబద్ధం అని ఏమీ నెరవేర్చరని నాడు అనుకున్నారు. కానీ, నేడు చెప్పినవన్నీ జగన్ నిజం చేస్తు్న్నారని ప్రజలు అనుకుంటున్నారు. బీసీలకు విద్యను అందకుండా చేసిన బీసీ ద్రోహి చంద్రబాబు విద్యా విధానం విషయంలో బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబే. నేడు నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చటం నుంచి గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, విదేశీ విద్య ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే.. ఆకాశాన ఉమ్మేసినట్లే. చంద్రబాబు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను బీసీలే తిప్పికొడతారు. గతంలో మేనిఫెస్టోను దాచేసిన చంద్రబాబు మళ్లీ బీసీలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమాన్ని రక్షించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఈ విషయాన్ని బీసీలు గుర్తించాలి. ఇచ్చినమాట నెరవేర్చని వ్యక్తి.. ఎన్నికకో అబద్ధం చెప్పేవాడి పట్ల తస్మాత్ జాగ్రత్త. బీసీ బిడ్డగా బీసీలు మరోసారి మోసపోవద్దని కోరుతున్నా. మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈరోజు రాష్ట్రంలో బీసీలు తలెత్తుకుని తిరుగుతున్నారు. బీసీలు మోసపోవటానికి సిద్ధంగా లేరు. అందువల్లే బీసీల వాణిని వినిపించటానికి నాలాంటి వారు ముందుకు వచ్చారు. చంద్రబాబు వేల మంది చనిపోయారని,బీసీలను అణగదొక్కారని అంటున్నారు. అచ్చెన్నాయుడు చేత తప్పులు చేయించింది చంద్రబాబు. ప్రజాధనం దుర్వినియోగం చేసి చంద్రబాబుకు అచ్చెన్నాయుడు అందజేస్తే ఆయనకు శిక్షపడింది. ఇదీ చదవండి: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్ -
బీసీల గురించి మాట్లాడే అర్హత అల్జీమర్స్ బాబుకు లేదు..
-
ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు
తూర్పుగోదావరి: సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం పోలీస్స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి వేణు మాట్లాడుతూ జక్కంపూడి ఈ నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఒక ఓటుతో ఏడుగురు పని చేస్తామని తనతో పాటు తన ఇద్దరు కుమారులు, జక్కంపూడి కుటుంబంలోని నలుగురు కలిపి మొత్తం ఏడుగురు ఈ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత అబివృద్ధి కోసం జక్కంపూడి రామ్మోహనరావు ఏ విధంగా పనిచేశారో అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా పనిచేస్తారని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ గూ డూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి జక్కంపూడి రామ్మోహనరావు విశేష కృషి చేశారన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ విధేయత, విశ్వసనీయతకు మారుపేరు జక్కంపూడి కుటుంబం అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నక్కా రాజబాబు, కడియం మండల జేసీఎస్ అధ్యక్షుడు తడాల చక్రవర్తి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యా ల పోసికుమార్, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షట్టర్ బాషా, వైఎస్సార్ సీపీ నాయకులు దేశెట్టి హరిప్రసాద్, డాక్టర్ తోరాటి ప్రభాకరరావు, సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవి చదవండి: వలంటీర్లకు గుడ్ న్యూస్.. నేడు నగదు పురస్కారాలు -
బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే
-
కాంగ్రెస్ అత్యాశకు పోయి కుప్పకూలిపోయింది: మంత్రి చెల్లుబోయిన
-
‘అల్జీమర్స్ చంద్రబాబు..ఆల్ జీరో టీడీపీ’
సాక్షి,అమరావతి: ‘అల్జీమర్స్ చంద్రబాబు.. ఆల్ జీరో టీడీపీ’ అని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. మంచిని వినలేని విఫల ప్రతిపక్షమని రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి, మేలు జరగడానికి ఏమాత్రం ఇష్టపడని తెలుగుదేశం పార్టీ.. చివరికి విఫల ప్రతిపక్షంగా మిగిలిందన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన మాట్లాడారు. ‘ఇది చాలా దురదృష్టకరం. ఆ పార్టీ సభ్యులు శాసనసభకు వస్తూనే.. ఎప్పుడెప్పుడు సభ నుంచి బయటకు వెళ్దామా.. అనే లక్ష్యంతో వస్తున్నారేమో.. ప్రజలకు జరుగుతున్న మంచిని.. జరగబోయే మంచిని వారు వినలేకపోవడం కూడా చాలా బాధాకరం. ఈ పరిస్థితిని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని’ చెల్లుబోయిన తెలిపారు. అసెంబ్లీలో సీఎం జగన్.. చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పకనే చెప్పారని.. ఒక అబద్దాన్ని నిజం చేయాలనే చంద్రబాబు ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైందని స్పష్టం చేశారు. సీఎం జగన్దే ఆ ఘనత ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న సీఎం జగన్ దేశంలోనే ముందు వరుసలో నిలిచారని కొనియాడారు. చేయనిది చెప్పలేను.. చేయగలిగిందే చెబుతాను. చెప్పిన మాట చేసి చూపించేందుకు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించనంటూ.. ఎన్నికల మ్యానిఫెస్టోను తూ.చా తప్పకుండా నూటికి నూరుశాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షం చంద్రబాబు పరిపాలన కాలంలో లెక్కలేనన్ని చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల్ని కనీసం పట్టించుకోని పరిస్థితి, రైతులకెక్కడా ఇన్పుట్ సబ్సిడీ గానీ ఇన్య్సూరెన్స్ గానీ అందించిన దాఖలాలే కనిపించవు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు. పేదరికాన్ని రూపుమాపాలనే ఆలోచన కూడా చేయలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇష్టానుసారంగా అనుమతులిచ్చి.. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలన్నింటీనీ నిర్వీర్యం చేశారు. ఇన్ని తప్పుడు పనులు చేసిన టీడీపీ.. ఇవాళ మేం శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. ప్రజలకు జరిగన మేలు గురించి చెబుతుంటే వినలేని పరిస్థితిలో ఉండటం బాధాకరం. సభలోకి ఫ్ల కార్డులు పట్టుకురావడం.. నిండు సభలో స్పీకర్ను అగౌరపరిచేలా కాగితాలు చించి వారిపై విసరడం, విజిల్స్ వేయడం ఎంతవరకు సబబని మంత్రి చెల్లుబోయిన చంద్రబాబును ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉండగా ప్రజలకు ఏమీ చేయకున్నా.. మా ప్రభుత్వం వచ్చాక మేం చేసిన ప్రజామేలును వివరిస్తుంటే.. ప్రతిపక్ష సభ్యులు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాని ఈ సందర్భంగా కోరారు. పవన్కళ్యాణ్ మాటలు ప్రజాస్వామ్యంలోనే ఒక వింత పేదవాడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం. అలాంటి మహోన్నతుల ఆశయాలకనుగుణంగా సీఎం జగన్ తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. డీబీటీ ద్వారా అర్హులైన పేదల ఖాతాల్లో రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిని జమచేసి మేలు చేశారు. ఇది పవన్కళ్యాణ్కు నచ్చడం లేదంట. ఇతను రాజకీయాల్లోకొచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదా..? నిత్యం మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టే చంద్రబాబు పక్కన చేరి పవన్ సాధించేదేముంది..? ఒకపక్కన ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున మంచి చేస్తుంటే.. అన్నిరంగాల ప్రజలు ప్రభుత్వ మంచిని హర్షిస్తోంటే.. ఈ పవన్కళ్యాణ్ మాత్రం ఎందుకు విమర్శిస్తున్నట్టు..? మంచిని ప్రోత్సహించాల్సిన సంస్కారం ఆయనకు లేదా..? కేవలం ఒక కులానికే ప్రతినిధిగా ఆయన మాటలతీరును ప్రజాస్వామ్యవాదులంతా తప్పుబడుతున్నారు. మంచి చేస్తోన్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతానంటూ.. ప్రజల ముందుకొస్తున్న పవన్కళ్యాణ్ మాటలు ఈ ప్రజాస్వామ్యంలోనే వింతగా చెప్పుకోవాలి. -
ఎన్నికల తర్వాత బాబు కనుమరుగే: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తాడేపల్లి: మేనిఫెస్టోలో చెప్పిందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవాడికి మంచి చేసిన సీఎం జగన్ను ఓడిస్తానంటున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత కనుమరుగవుతాడని హెచ్చరించారు. చంద్రబాబును నమ్మితే మోసపోయినట్లేనన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందన్నారు. పేదవాడు భద్రతతో బతుకుతున్నాడని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు ఇదే కోరుకున్నారన్నారు. అయినా దుష్టచతుష్టయం ధనదాహంతో సీఎం జగన్ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు చెల్లుబోయిన. ఇదీచదవండి.. నారా లోకేష్ను దాచేసినట్లున్నారు -
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
-
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తాడెపల్లి: సీఎం జగన్ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా జరుగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనేక మంది సంఘ సంస్కర్తల ఆలోచనల సమ్మిళతమే జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా చెప్పింది చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన నాల్గవ విడత చేయూత పంపిణీ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడించారు. 26,98,931 మందికి 5వేల 60 కోట్ల 4 లక్షలు చేయూత పంపిణీకి ఆమోదం లభించినట్లు చెప్పారు. చేయూత పథకంపై ప్రతిపక్షాలు చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని తెలిపారు. రూ.19,188 కోట్లను నాలుగు విడతల్లో చేయూత కింద అందించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. డీఎస్సీ నిర్వహణకు 6,100 పోస్టులతో కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. 2019 నుంచి విద్యారంగంలో 14,219 పోస్టుల భర్తీ చేశామని చెప్పారు. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2019 నుంచి 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని వెల్లడించారు. ఎస్సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం ఎస్సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదివే ఐబీని ఏపీ విద్యావ్యవస్థలోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ ఐబీ విద్యతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటారని తెలిపారు. ఈ విధానంతో విద్యార్థుల కమ్యునికేషన్ స్కిల్స్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతాయని అన్నారు. ఉపాధ్యాయ, విద్యాశాఖ అధికారులకు కూడా ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఐబీ విద్యతో విప్లవాత్మక మార్పులు ఉంటాయని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇదీ చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి గ్రీన్సిగ్నల్ -
‘‘సంక్షేమం అంటే బాబుకు ‘సన్’క్షేమం’’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సామాజిక న్యాయం అనే పదానికి అర్థం తెలియదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవుతున్నారని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం(రాజమండ్రి) రూరల్లో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు చేసిన ప్రసంగంపై చెల్లుబోయిన స్పందించారు. సంక్షేమం అంటే చంద్రబాబు తన ‘సన్’ క్షేమం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం కోల్పోయాక మానసికంగా దిగజారిపోయారు. ఆయన అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు. అసలు సంక్షేమం అంటే ఏంటో చంద్రబాబుకు తెలియదు. ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. ఇదీచదవండి.. కిందపడబోయిన చంద్రబాబు -
ఈనాడు రోత రాతలపై మంత్రి చెల్లుబోయిన ఫైర్
-
‘అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 19న విజయవాడలో జరిగే125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం రాజన్న దొర, బీసీ సంక్షేమం, సమాచార శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. 139 కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర కార్పొరేషన్లలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఛైర్మన్లు, డైరక్టర్ల సమావేశం తాడేపల్లిలోలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి శాసనమండలి విప్, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం అని అన్నారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్ననిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంబేద్కర్ సిధ్దాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను నమ్మి సీఎం జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం.. ఎంతో ఆనందం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మి దాన్ని ఆకళింపు చేసుకున్నారన్నారు. అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా స్వేచ్చా, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ మెచ్చే నిర్ణయమని కొనియాడారు. సాధారణంగా దళితవాడలలో, పల్లెల్లో అంటే ప్రతి ఊరి చివరన కాలనీలలో కనబడే అంబేద్కర్ విగ్రహాలను సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ నెల 19 న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను పండుగలా నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం కింద ఏర్పాటుచేస్తున్న వేదికతో కూడితే దాదాపు 195 అఢుగుల ఎత్తులో కారణజన్ముడైన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందన్నారు. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సగర్వంగా చూడవచ్చన్నారు. వివిధ దేశాలలో అధ్యయనం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంత పెద్ద భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ పరిఢవిల్లేలా చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఘనత సీఎందే.. గ్రామసచివాలయాల పరిధిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి ప్రచారం చేయాలని కోరారు. ఆ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు పాలకులు కాదు సేవకుడు అని అంబేద్కర్ చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్ననాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది జగన్ మాత్రమేనని చెప్పారు. జనరల్ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా కూడా బడుగు,బలహీనవర్గాలను నియమించిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. -
‘సీఎం జగన్ వ్యూహానికి పచ్చ మంద బెంబేలు’
సాక్షి, కృష్ణా జిల్లా: సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీ బెంబేలెత్తిపోతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన కుల పత్రిక ఈనాడులో పిచ్చిరాతలు రాయిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఇంత కాలం బీసీలను బానిసలుగా చూసిన పెత్తందారులు టీడీపీ నాయకులేనంటూ మంత్రి దుయ్యబట్టారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. జగన్ నిర్ణయాలతో టీడీపీ వెన్నులో వణుకు: జగన్ గారి నిర్ణయాల వల్ల ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది..ఆ పార్టీ నాయకులు కంపిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు ఈనాడులో ‘పెత్తందారి పోకడ’ అనే శీర్షికతో వచ్చిన వార్తే. బీసీ వర్గాలను బానిస వర్గాలు చూసిన పెత్తందార్లు టీడీపీ, చంద్రబాబు అండ్ కో..నే. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొంత మంది బీసీలు ఆయన పట్ల ఆకర్షితులైన మాట వాస్తవం. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిగా చేసిన సందర్భంలో చంద్రబాబుకు మద్దతు పలికిన ప్రతి ఒక్క నాయకుడూ చంద్రబాబు వెన్నుపోటులో వాటాదారేలే. యనమల, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ వంటి నేతలంతా ఆ మోసంలో వాటాదారులు. ఇంత కాలం బలహీనవర్గాలను పలువిధాలుగా మోసం చేసి, మీరు చేసిన మోసాన్ని ప్రత్యర్థులపై నెట్టి, ప్రజల దృష్టిని మరల్చి అధికారం పొందిన సందర్భాలున్నాయి. కానీ ఈ రోజు అది సాధ్యం కాదని చంద్రబాబుకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే బీసీలు అంత బలంగా ఉన్నారు. చంద్రబాబు మోసాన్ని బీసీలు గ్రహించారు. రాజకీయ వ్యూహంలో భాగంగా, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీలో భయం పుట్టిందనేది వాస్తవం. అందుకే వారు ప్రజాస్వామ్య వాదులు బాధపడేలా తమ భాషను వాడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తిపై బండారు సత్యనారాయణ, అచ్చెన్నాయుడులు వాడిన భాషను ఎవరూ హర్షించరు. సామాజిక న్యాయానికి అర్ధం, పరమార్ధం చెప్పింది సీఎం జగన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక న్యాయం పదాలకు అర్ధం, పరమార్ధం చెప్పింది వైఎస్ జగన్ మాత్రమే. గతంలో ఈ వర్గాల వారిని టీడీపీ వారు బానిసలుగా చూశారు. సమాజంలో బీసీలను బాధిత వర్గాలుగా మార్చారు. బలహీన వర్గాలు బాధలో ఉంటేనే పెత్తందార్ల ముందు సాగిలపడి, వారు చెప్పినట్లు వింటారు అన్నది వారి నమ్మకం. జగన్ ఒక్క స్ట్రోక్తో పేద వాడు పెత్తందారుల వద్దకు వెళ్లకుండా, ఎవరి సిఫార్సులు లేకుండా, ఎవరి చుట్టూ తిరిగే పనిలేకుండా, ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను బాధ్యతగా డీబీటీ ద్వారా అందిస్తున్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్కీములన్నీ గతంలో టీడీపీ స్కామిస్టులు దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించాడా?. పేదవాడు చదువు గురించి ఆలోచించాడా?. పేదవాడికి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం చెప్పించాలని ఆలోచించాడా..?. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని చంద్రబాబును ప్రశ్నించండి. ఆరోగ్యశ్రీని ఆనాడు వైఎస్సార్ ప్రవేశపెడితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కార్పొరేట్ ఆస్పత్రుల బాగు కోసం పనిచేశాడు. ఆరోగ్యశ్రీలో 2300 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 1000 ప్రొసీజర్స్కి తగ్గించాడు. చంద్రబాబుకు ఒకటే ధైర్యం.. తనకు ఈనాడు ఉంది.. తనకు ఏబీఎన్ ఉంది, టీవీ5 టీవీ చానల్ ఉందన్నదే. తనకు అవసరం వస్తే ఎవడి కాళ్లైనా పట్టుకోగలననే ధైర్యం ఆయనది. ఈ ధైర్యంతో ప్రజలను ఏమార్చారు. దాన్ని ప్రజలు తెలుసుకోవడానికి కొంత ఆలస్యం అయ్యింది. ప్రత్యేకంగా బీసీ వర్గాలు చంద్రబాబు చేసిన మోసాన్ని తెలుసుకోడానికి కొంత ఆలస్యమైంది. ఆదరణ అన్నాడు..ఇంకా ఆ పదాన్ని ఉచ్ఛరిస్తున్నారు..బీసీ నేతలారా ఆలోచించండి. కులవృత్తి చేసుకునే వారిని విద్యావంతులుగా చేస్తేనే సామాజికంగా ఎదుగుదల ఉంటుందని మేధావులు చెప్పారు. ఎప్పుడైనా చంద్రబాబు ఇలా ఆలోచించాడా? పది శాతం కడితే 90 శాతం లోన్ అంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తాడు. ఎన్నికలయ్యాక నా దగ్గరకు వస్తే.. తోకలు కత్తిరిస్తానని బెదిరిస్తాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా బీసీ బిడ్డలను ఇంజినీరింగ్, డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదివించిన వైఎస్సార్లా చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించాడా? బాబుకు ఎందుకు బాధ..?: బదిలీలు అంటూ మాట్లాడుతున్నాడు. రాజకీయ వ్యూహంలో భాగంగా, కొంతమంది అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేస్తే చంద్రబాబుకు ఎందుకు బాధ?. మార్పులు, చేర్పులకు ఎమ్మెల్యేలు, మంత్రులు అనే బేధం లేదు. దానికి నేనూ అతీతుడిని కాదు. జగన్ నిర్ణయాన్ని స్వాగతించాను. దానికి మాకు బాధ లేదుగానీ.. మీరు బాధపడటమేంటి..? కారణం మీరనుకున్న స్ట్రాటజీ పారడం లేదు. కారణం, స్థానిక నాయకులపై నిందలేశాం.. ప్రజలందరూ నమ్మేశారు.. ఇక వాళ్లకు ఓట్లు వేయకుండా మీకు వేస్తారని మీరు భావించారు. మార్పులు, చేర్పులతో మీ పాచిక పారటం లేదు. ఇన్నాళ్ళూ బీసీలను మోసం చేసిన మీరు.. జయహో బీసీ అనటానికి సిగ్గు ఎక్కడ లేదు..? బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకెక్కడుంది?. అచ్చెన్నాయుడిని అడుగుతున్నా.. రాజమండ్రిలో పవన్ కల్యాణ్ వస్తే నిన్ను పక్కకి గెంటేశారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో నీకు ఇంకా అర్థం కాలేదా.. చంద్రబాబు తన చుట్టూ నలుగురు బీసీ నాయకులను, యనమల, అచ్చెన్నాయుడు, బండారు, అయ్యన్న లాంటివారిని పెట్టుకుని, మీ చేతే బీసీల కళ్ళు పొడిపిస్తున్నాడు. చంద్రబాబు ఉసిగొల్పాడని, మీరు స్థాయిని మర్చిపోయి ఒక ముఖ్యమంత్రిని, పేదవాడి ఆకలి తీరుస్తున్న జగన్ను ఇష్టారీతిన మాట్లాడటం మంచిది కాదు. బీసీలు మేధావులు.. చైతన్యవంతులయ్యారు. 2024 ఎన్నికల్లో బీసీలే టీడీపీకి గుణపాఠం చెప్పబోతున్నారు. బీసీల్లో వచ్చిన చైతన్యమే 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ను 175కు 175 స్థానాల్లో గెలిపిస్తారు. అంబేద్కర్, పూలే వంటి మహనీయులు ఆశించే సంస్కరణలు అమలు చేస్తున్న జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. మీరెన్ని కుట్రలు చేసినా... మీరు ఎంతగా రోత రాతలు రాసినా.. బీసీలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
గతంలో అనర్హులకే నందులు.. ఇప్పుడు న్యాయం చేస్తాం: పోసాని
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకే అవార్డులు దక్కాయని ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. ‘‘వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక నన్ను ఛైర్మన్ చేశారు. అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నాం. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. నాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. వర్క్షాపులు నిర్వహించి కళాకారులకు ప్రోత్సహిస్తాం’’ అని పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం: మంత్రి వేణు మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నామని, 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ‘‘నాటక కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాం. నిరుత్సాహంతో ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశం. రాష్ట్రంలో అంతరించుపోతున్న కళలను సజీవంగా ఉండాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వీధి నాటకాలను సైతం పోత్సహిస్తున్నాం. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది నాటక రంగానికి వస్తున్నారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం వల్ల కళాకారులకు మరింత గౌరవం దక్కుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వనున్న అవార్డులు ప్రతిబింబాలు. నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. ఇదీ చదవండి: నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్ -
నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్
సాక్షి, గుంటూరు: నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. నంది నాటకోత్సవాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ 100 అడుగుల భారీ కటౌట్ ఆకట్టుకుంటోంది. ప్రాథమిక దశలో మెప్పించి తుది పోటీలకు అర్హత పొందిన కళాకారులు ఈ ఉత్సవాల్లో సత్తా చాటి బహుమతులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మొత్తం ఐదు విభాగాలుగా పోటీలు జరగనున్నాయి. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, కళాశాల, యూనివర్సిటీ స్థాయి నాటికలు, బాలల నాటికల ప్రదర్శనలు ఆహూతులను అలరించనున్నాయి. ఈ పోటీల్లో 73 అవార్డులు గెలుచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటక సమాజాల నుంచి 1,200 మంది కళాకారులు పాల్గొంటున్నారు. కళాకారులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేశారు. నాటక ప్రదర్శనలను కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. ఈ వేడుకలు 29 వరకు జరగనున్నాయి. నేటి నాటక ప్రదర్శనలివే ● శనివారం ప్రారంభ సభానంతరం ఉదయం 11 గంటలకు రాజాంకు చెందిన కళా సాగర నాటక సంక్షేమ సంఘం వారి ’శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ పద్య నాటక ప్రదర్శనతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. కళారత్న డాక్టర్ మీగడ రామలింగ స్వామి రచనలో రూపుదిద్దుకున్న ఈ నాటకానికి మీగడ మల్లికార్జున స్వామి దర్శకత్వం వహిస్తారు. ● మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి ’ఎర్ర కలువ’ సాంఘిక నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: ఆకురాతి భాస్కర్ చంద్ర. దర్శకత్వం : డాక్టర్ వెంకట్ గోవాడ ● సాయంత్రం 5 గంటలకు గుంటూరు అమృతలహరి థియేటర్ ట్రస్ట్ వారి ‘నాన్నా.. నేనొచ్చేస్తా’ సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన: తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం: అమృత లహరి. ● సాయంత్రం 6.30 గంటలకు తెనాలి శ్రీదుర్గా భవాని నాట్యమండలి వారి ‘శ్రీరామభక్త తులసీదాసు’ పద్య నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: డాక్టర్ ఐ.మల్లేశ్వరరావు. దర్శకత్వం : ఆదినారాయణ వైఎస్సార్, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ రంగస్థల అవార్డును కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్కు ఇస్తున్నట్టు పోసాని కృష్ణమురళి తెలిపారు. రూ.5,00,000 నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్ మీగడ రామలింగస్వామి ఎంపికై నట్లు చెప్పారు. ఈయనకు రూ.1,50,000 నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. -
చంద్రబాబుపై మంత్రి సెటైర్లు
-
మంత్రి వేణుకు అస్వస్థత
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందారు. కోలుకున్న ఆయన అనంతరం మరిన్ని వైద్య పరీక్షల కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ సలహా మేరకు ఆస్పత్రి నుంచి మంత్రి వేణు డిశ్చార్జ్ కానున్నారు. మంత్రి ఆరోగ్యంపై సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి ఆరా తీశారు. చదవండి: Fact Check: గంతలు కట్టుకొని ‘గుంతల కథ’ -
కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయి: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను అక్కున చేర్చుకున్నారని కామెంట్స్ చేశారు. సామాజిక సాధికారతకు సీఎం జగన్ చిరునామా అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి చెల్లుబోయిన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్ సమావేశాలు పెడుతున్నాం. ఈనెల 27 నుంచి కుల గణన చేయాలనుకున్నాం. కానీ, మరొకొద్ది రోజులు వాయిదా వేశాం. డిసెంబర్ పది నుంచి కుల గణన చేస్తాం. క్రింది స్థాయి నుండి వచ్చే అందరి సూచనలు తెలుసుకుంటున్నందున పది రోజులు ఆలస్యం అవుతోంది. బీహార్లో చేసిన కులగణనను పరిశీలించాం. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం. కులాలవారీగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు?. వారి జీవన స్థితి ఎలా ఉందని తేల్చాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. సామాజిక సాధికారతకు చిరునామా సీఎం జగన్. అసెంబ్లీ, మండలి, పార్లమెంట్లో సీఎం జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారు. మహిళలకు సగం రిజర్వేషన్ కల్పించారు. సోషల్ జస్టిస్ ఆచరించటంలో సీఎం జగన్ విజయం సాధించారు. మా కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయి. వాలంటీర్లు ఈ కులగణనలో పాల్గొనకూడదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు వాలంటీర్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. మేము చేసే కులగణన చరిత్రలో నిలిచిపోతుంది. ఐదు రీజనల్ మీటింగులు, జిల్లాల మీటింగులు నిర్వహించి సూచనలు తీసుకున్నాం. ఇంకా మండల స్థాయిలో కూడా చేయాలనుకుంటున్నాం. కానీ, టీడీపీ వారికి కూసాలు కదిలి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. చంద్రబాబు అబద్ధం అనే ఆస్తిని అందరికీ పంచాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఈరోజు మళ్ళీ దండాలు పెడుతున్నారు. అబద్దాలు ఆరు రూపాలుగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ నిలిచారు. ఎల్లోమీడియాలో వచ్చేవన్నీ అబద్దాలే తప్ప వార్తలు కాదు. కులగణన దేశంలో చరిత్త సృష్టిస్తుంది’ అని అన్నారు. -
సీఎం జగన్ బ్రాహ్మణ పక్షపాతి అందుకే బ్రాహ్మణుల కోసం..
-
సామాజిక న్యాయం పరిఢవిల్లుతోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం పరిఢవిల్లుతోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక సాధికారత కలను సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ న్యాయం చేశారని మంత్రి అన్నారు. సీఎం జగన్ ఈ వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలబడటంతోపాటు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని తెలిపారు. చెబితే తప్పకుండా చేసే నేత సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైనా చెబితే దానిని తప్పకుండా చేసే నాయకుడని మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. అధికారంలోకి వస్తే పింఛన్ను అంచెలంచెలుగా రూ.3 వేలు చేస్తానని చెప్పారని ఆ విధంగానే పెంచి ఈ జనవరి నుంచి రూ.3 వేలు ఇవ్వనున్నారని వివరించారు. 2014లో జగన్ రూ.750 పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టోలో ముందుగానే ప్రకటించడంతో చంద్రబాబు రూ.1,000 ఇస్తానని ప్రకటించాడే తప్ప ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. 2019లో కూడా జగన్ పెన్షన్ను రూ.2 వేలు చేస్తానని ప్రకటించగానే ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు చంద్రబాబు రూ.2 వేలు చేసి ప్రజలను మోసం చేయాలని చూశాడని తెలిపారు. సీఎం జగన్ 4.40 లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన మనసున్న నేత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, వారి ఉన్నతికి పాటుపడుతున్న సీఎం జగన్కు అందరం మరోసారి మద్దతివ్వాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి జరగాలంటే 2024లో కూడా సీఎం జగన్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పాలకొల్లులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం సంక్షేమం అందిస్తున్న సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్రాజు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏ విధంగా సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని అంబేడ్కర్ భావించారో, అలాగే సీఎం జగన్ ఈ వర్గాలను అభివృద్ధిలోకి తెస్తున్నారని తెలిపారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మఒడి వంటి పథకాలతో పేదలను విద్యాధికులను చేస్తున్నారని తెలిపారు. బడుగుల నాయకుడు సీఎం జగన్ : ఎంపీ నందిగం సురేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడుగుల నాయకుడని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో విధాలుగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ వేలు తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డిని చూపిస్తూ ఆయన ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నట్లు ఎప్పుడూ చెబుతుందని అన్నారు. చంద్రబాబు తమను జైల్లో పెట్టాలని చూస్తే వైఎస్ జగన్ వాళ్లు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంటులో అంటూ తనను లోక్సభలో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతి పేద పిల్లవాడు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేలా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలు సహా అన్ని వర్గాలు బాగుపడాలంటే 2014లోనూ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక ప్రభంజనం
సీఎం వైఎస్ జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో 19 నియోజకవర్గాల్లో విజయవంతంగా సాగాయి. వీటికి వస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్కు జేజేలు పలుకుతున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు, జగనే కావాలి – జగనే రావాలి’ అంటూ నినదిస్తున్నారు. యాత్రలో భాగంగా పలు చోట్ల బైక్, కారు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తోన్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదలివస్తుండటంతో సభా ప్రాంగణాలు జనసంద్రాలుగా మారుతున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవానికి తెరతీశారని రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున చెప్పారు. దేశంలో గరీబీ హటావో వంటి నినాదాలు ఎన్ని వచ్చినా పేదవాడి తలరాతని మార్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. దళితులు, బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పాలనకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలనకు తేడా గమనించాలని కోరారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మాయాబజారు సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కుల, మత, ప్రాంత, పార్టీల వివక్ష చూపకుండా సామాజిక న్యాయం పాటించి ప్రతి ఒక్కరికీ మేలు చేశారని మంత్రి సురేష్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే కలగలిపితే అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. డాక్టర్ వైఎస్సార్ మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్ల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ప్రతి అంశంలోనూ వారికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కనీసం మైనార్టీలను పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేవన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2019లో 22వ స్థానంలో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి వైఎస్ జగన్ పాలనలో మొదటి స్థానానికి రావడం అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భావజాలమే ప్రజలను మోసం చేయడమన్నారు. చంద్రబాబు ఆఖరికి న్యాయమూర్తికి కూడా అబద్ధాలు చెప్పి ఒక్క రోజు ఆసుపత్రిలో ఉండి, రెండో రోజే ఇంటికి వచ్చి కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సభకు హాజరైన అశేష జన సందోహంలో ఓ భాగం చంద్రబాబు అంటే అబద్ధం.. వైఎస్ జగన్ అంటే నిజం రాష్ట్రంలో అధిక భాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులానే చూశాయని, సీఎం వైఎస్ జగన్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి, బలహీన వర్గాల పక్షమని చాటి చెప్పారని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు అంటేనే అబద్ధమని, సీఎం జగన్ అంటే నిజమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ పునాది వేశారన్నారు. సమ సమాజ స్థాపన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అణగారిన వర్గాలను అవమానించి, అణచివేశారని, సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రూ. 2.35 లక్షల కోట్లు నేరుగా అందజేసిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో పేదరిక నిర్మూలనకు, పేదలకు ఆస్తుల కల్పనకు కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. సీఎం జగన్ పాలన దేశంలోనే ఓ చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏసీల్లో కూర్చొని మాట్లాడుకునే చంద్రబాబు, పవన్, లోకేశ్లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అన్నారు. వైఎస్ జగన్ చేసిన మేలును చూశారు కాబట్టే ఆయన కటౌట్ చూసి ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన వైద్యం, విద్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరిఫాతిమా చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా తదితరులు పాల్గొన్నారు. -
ఎటు చూసినా జనమే..సామాజిక సాధికార బస్సు యాత్ర
-
ఏపీ కేబినెట్ 2023: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..
-
ఏపీ కేబినెట్ 2023: కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం
-
భూమిలేని పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం
-
పెద్ది రెడ్డి దెబ్బ..చంద్రబాబు అబ్బా...
-
అన్ని రంగాల్లో సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్
-
పేదల జీవితానికి జగన్ ప్రభుత్వం సంజీవనిలా మారింది
-
రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తూర్పు గోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు శకం ముగిసింది వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై పవన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కాగా, మంత్రి చెల్లుబోయిన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం. పవన్ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోంది. కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడను చంద్రబాబు తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది. చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నాడు. దేశంలో చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో ఉన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు నేడు బెయిల్ రావడం లేదు. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. టీడీపీ, జనసేన ఇద్దరే కాదు ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్న ఏమీ చేయలేరు. జనం మనసులో జగనన్న ఉన్నాడు.. సీఎం జగన్ మనసులో జనం ఉన్నారు. జగన్, జనం బంధాన్ని ఎవరూ విడదయలేరు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘మాధవీరెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. విమర్శిస్తే సహించం’ -
24/7 ప్రజలకోసం ఆలోచించే వ్యక్తి సీఎం వైఎస్ జగన్
-
15 నుంచి కులగణన
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతున్నట్టు బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలియజేశారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన ద్వారా ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ వర్గాలను సైతం గుర్తిస్తామన్నారు. అనంతరం వారి అభ్యున్నతి కోసం వివిధ కులాలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా తగిన పథకాలు రూపొందించి అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి పదేళ్లకు ఒక సారి జరిగే జనగణనతో పాటు సమగ్ర కులగణన జరిపించాలని గత బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినా ఇప్పటి వరకు సమాధానం రాలేదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు అనుగుణంగా ఏపీలో కులగణన చేయించాలని ఇటీవల శాసన సభ సమావేశాల్లో తీర్మానించినట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గ్రామ, వార్డు సచివాలయ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ నేతృత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారంతో ప్రత్యేక యాప్ ద్వారా కులగణన ప్రారంభిస్తున్నట్టు వివరించారు. బీసీ నాయకుల సూచనలు, సలహాల కోసం ప్రాంతాల వారీగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వ్యక్తిగతంగా సలహాలు, సూచనల ఇచ్చేవారి కోసం ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ అందుబాటులో పెడతామన్నారు. 1931లో జరిగిన కుల గణనే చివరిది.. దేశంలో బ్రిటిష్ కాలంలో 1872లో కులగణన ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. ఇది 1941 వరకు ప్రతి పదేళ్లకోసారి జరిగిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1941 కులగణను పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్ల 1931 కులగణనే చివరిదని మంత్రి చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 నుంచి జనగణన మాత్రమే చేస్తున్నారన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలను మినహా మిగిలిన అన్ని కులాలను గంపగుత్తగా లెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కులగణన డమాండ్ వినిపిస్తోందన్నారు. బీసీ వర్గాల కులగణన వినతులను గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 139 బీసీ కులాలను గుర్తించి వాటికి ప్రత్యేకకార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మంత్రివర్గంలో ఏకంగా 10 మంది బీసీలకు స్థానం కల్పించారన్నారు. -
సీఎం జగన్ అంటే ఒక సంకల్పం
-
పారదర్శకతకు పెద్దపీట వేసి నిర్ణయాలు తీసుకుంటున్నాం: వేణుగోపాల్
-
బాలకృష్ణ విజిల్స్, అచ్చెన్నాయుడు వీడియోలకు స్ట్రాంగ్ కాంటర్ ఇచ్చిన మంత్రి చెల్లుబోయిన
-
టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్ సిగ్గుచేటు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో చంద్రబాబుకు కేటాయించిన కుర్చీపైకి ఎక్కి బాలకృష్ణ విజిల్స్ వేయడం సిగ్గుచేటని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, అసెంబ్లీలో ఈలలు వేసి సభ సాంప్రదాయాలను బాలకృష్ణ పాడు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ కేసులో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో సీఐడీ అధికారులుకోర్టుకు వివరించారని తెలిపారు. ఢిల్లీ నుండి పెద్ద న్యాయవాదులు వచ్చినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. పీఎస్ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ఎలా డబ్బు దండుకున్నదీ సీఐడీ గుర్తించిందని అన్నారు. సమస్యలపై ఎందుకు చర్చించలేదు సభలో రచ్చ చేయటానికి టీడీపీ సభ్యులు వచ్చారని విమర్శించారు. గొడవలు చేసిన ఆరుగురిని సస్పెండ్ చేస్తే టీడీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారని మంత్రి తెలిపారు. మిగతా వారు సభలో కూర్చుని సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వారెవరికీ ప్రజా సమస్యలు పట్టలేదని అర్ధం అవుతుందని, అసెంబ్లీలో మాట్లాడటానికి చేతగాక టీడీపీ సభ్యులు పారిపోయారని దుయ్యబట్టారు. నేరం చేసిన గజదొంగ చంద్రబాబు అని.. అందుకే కోర్టు కూడా క్వాష్ పిటిషన్ను తోసిపుచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు. టీడీపీ వాళ్ల దగ్గర విషయం లేదు ‘వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. సభాపతి, మండలి ఛైర్మన్ అంటే టీడీపీ నేతలకు మర్యాద లేదు. సభకు రానంటున్నారంటే నేరం అంగీకరించినట్లే. టీడీపీ నేతల దగ్గర విషయం లేదు కాబట్టే సభ నుంచి పారిపోయారు. ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్దినం. వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, నాశనం చేయడం చంద్రబాబు, టీడీపీ నేతల నైజం. సస్పెండ్ కాకుండా మిగిలిన సభ్యులు సభలో ఉండి ఉంటే చంద్రబాబు అవినీతి వివరాలను తెలుసుకునేరు. ఆ అవసరం లోకేష్, కుటుంబానికే ఉంది చంద్రబాబు యువతకు ద్రోహం చేశాడు. 5 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి యువతను మోసం చేశాడు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో ప్రధాన ముద్ధాయి అని అప్పటి అధికారులే చెప్పారు. చంద్రబాబుకు హాని తలపెట్టాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్కు, ఆయన కుటుంబానికే ఉందిఏ తప్పు చేసినా తెలివిగా తప్పించుకోగలననే చంద్రబాబు స్కిల్.. స్కిల్ స్కామ్లో పారలేదు’ అని మంత్రి చెల్లుబోయిన అన్నారు. చర్చకు రమ్మంటే రావడం లేదు: మంత్రి బొత్స చంద్రబాబు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయినా కూడా ఏకపక్షంగా కేసులు ఎత్తి వేయాలని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు మీద చర్చకు రమ్మని తాము కోరితే రావడం లేదని అన్నారు. సభ నుంచి వారు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కావాలనే సభలో గొడవ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దోపిడీ గురించి తెలుసని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసని.. కానీ కావాలనే సభలో గొడవ చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము పూర్తి వివరాలతో వివరించామని చెప్పారు. చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్క దారి పడతాయని ప్రశ్నించారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బు కొల్లగొట్టారో సీఐడీ నిగ్గు తేల్చిందని తెలిపారు. దొరికిపోతామని టీడీపీ భయపడుతోంది ‘ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృధా చేస్తుంది. అవినీతికి పాల్పడ్డ బాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుంది. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలి. స్కామ్లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు. స్కిల్ స్కామ్లో ఎంత అవినీతి జరిగిందో.. ఎలా జరిగిందో మేం సభలో చెప్పాం. టీడీపీ ఏం చెప్తుందో సభలో చెప్పొచ్చుగా. చర్చల్లో పాల్గొంటే దొరికిపోతాం అని టీడీపీ భయపడుతుంది. తప్పు చేశారు కాబట్టే హై కోర్ట్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. సీమెన్స్ ఒప్పందం ప్రకారం నిధులు ఏమయ్యాయో టీడీపీ సమాధానం చెప్పాలి’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
‘బాలకృష్ణా.. అప్పుడేమైంది నీ పౌరుషం?’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు అరెస్ట్పై అసెంబ్లీలో ఇవాళ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నాడంటూ ఏపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు స్కిల్ స్కామ్ అవినీతిలో కూరుకుపోయారు. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో యువతను చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చేయలేదని సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు అని అన్నారామె. ఇక ఇవాళ్టి సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా?. కక్ష సాధింపుగానే చేయాలంటే.. ఈ నాలుగేళ్లలో ఎప్పుడో చంద్రబాబును అరెస్ట్ అయ్యేవాళ్లు కదా. మీ నాన్నను(దివంగత ఎన్టీఆర్) చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు నీ పౌరుషం ఏమైంది?.. మీ నాన్న పై చెప్పులు వేయించినపుడు ఎక్కడికి పోయింది పౌరుషం అంటూ బాలకృష్ణకు చురకలంటించారామె. టీడీపీ నేతలకు దమ్ముంటే.. టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారు. టీడీపీ నేతలు చర్చకు మాత్రమే సభకు రావాలి కానీ..రచ్చ కోసం మాత్రం వద్దు. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నాం. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చ ఉంది. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలి. సభలో ఈరోజు బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు :::ప్రభుత్వ విప్,కాపు రామచంద్రారెడ్డి కోటంరెడ్డి ఓవరాక్షన్ సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడు. చంద్రబాబు ప్రజాధనం ఏవిధంగా లూటీ చేశారో కోర్టుకు అందించాం. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బాలకృష్ణ తొడలు కొడుతూ,మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ను తెచ్చుకున్నారు. సభలో ప్రజల హక్కులను కాలరాసేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా ..తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదు. చర్చించేందుకు టీడీపీ నేతల దగ్గర విషయం లేదు. అందుకే సభలో అల్లరి చేస్ బయటికి పోవాలనే గందరగోళం సృష్టించారు. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరం. :::మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ -
‘రాజధానిగా తక్కువ ఖర్చుతో వైజాగ్ పూర్తవుతుంది’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ చారిత్రక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ఆయన సచివాలయం నుంచి మీడియాకు తెలియజేశారు. మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఐబీ సిలబస్ దిశగా అడుగులు వేస్తున్నాం. అమెరికాలో ఇలాంటి సిలబస్ ఉంది. ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయటం బాల్యం నుండే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు.. ►కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ చేసేందుకు నిర్ణయించింది. తద్వారా.. 10,115 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 11,630 మంది ఏపీవీపీలో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూరుతుంది. ►ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేనాటికి ఇంటిస్థలం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటాం. అలాగే.. రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేయాలని నిర్ణయించాం ►క్యాన్సర్ రోగులకు మరింత వైద్య సేవలకోసం గుంటూరు, వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పోస్టుల భర్తీకి నిర్ణయం. 53 వేల ఉద్యోగాలను వైద్య అరోగ్య శాఖలో ఇప్పటి వరకు ఇచ్చాం. ఒక్క ఖాళీ కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఒంగోలు,ఏలూరు, విజయవాడ లోని నర్సింగ్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఆరోగ్య సురక్ష ద్వారా మరింత మేలైన వైద్యం అందించాలని నిర్ణయం. సురక్ష క్యాంపులలో మంత్రులు,ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. సెప్టెంబరు 30న ప్రారంభమై 45 రోజులపాటు క్యాంపులు జరుగుతాయి. కురుపాం మెడికల్ కాలేజీలో 50 % గిరిజనులకు సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ►UPSC ఎగ్జామ్స్ కు వెళ్లేవారికి ‘‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’’ పేరుతో ఆర్థిక సాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకుగానూ రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు సాయం అందించనుంది ప్రభుత్వం. ►ఇక.. తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం ►కాకినాడ బల్క్ డ్రగ్ ప్రాజెక్టును నక్కపల్లికి తరలిస్తూ నిర్ణయం ►ప్రభుత్వ భూమిలోనే ఈ ప్రాజెక్టును పెట్టాలని కేంద్రం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ►హైకోర్టు లో 28 మంది డ్రైవర్ల నియామకానికి నిర్ణయం ►భూదాన్ చట్టంలో సవరణలకు ఆమోదం ►విశాఖపట్నంలో ఐదు ఎకరాల్లో ఓ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్. వైజాగ్ పరిపాలనా రాజధాని అనేది ఆల్రెడీ నిర్ణయం జరిగింది. పరిపాలనా సౌలభ్యం ప్రకారం జరుగుతుంది. రాజధానిగా తక్కువ ఖర్చుతో వైజాగ్ పూర్తవుతుంది. చంద్రబాబు కోసం యాక్టర్ను తెచ్చారు చంద్రబాబు అరెస్టు వెనుక వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసు. ఆయన్ని అరెస్టు చేయటం వలన ఎలాంటి స్పందన లేదని సినిమా యాక్టర్ని తెచ్చారు. వెంటనే ఆయన ములాఖత్ పేరుతో మిలాఖత్ అయ్యారు. దాంతో టీడీపీ క్యాడర్లో కూడా నీరసం వచ్చింది. చంద్రబాబు తప్పేమీ చేయలేదని టీడీపీ నేతలు తీర్పులు ఇస్తున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వక్రభాష్యం చెప్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలే స్కిల్ స్కాం జరిగినట్టు నిర్ధారించాయి. ఓటుకు నోటు కేసులో భయపడి రాత్రికి రాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు స్కిల్ ఉన్న వ్యక్తి.. చాలా స్కాంలు చేశారు. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ప్రధానే చెప్పారు. కేసుల్లో నిందితుడు కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు. ఐటీ తెచ్చిందే తానని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు విధానాల వలన బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. వైఎస్సార్ వచ్చాకే ఫీజు రియంబర్స్ మెంట్ తెచ్చారు. దానిద్వారా బీసీలతోపాటు అందరికీ మేలు చేకూరింది. అలాంటప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అని మంత్రి వేణు విమర్శలు గుప్పించారు. -
ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ చారిత్రక నిర్ణయం
-
జీపీఎస్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
-
పవన్ కళ్యాణ్ ని నేను ఒక్కటే అడుగుతున్నా..
-
చంద్రబాబు ఒక పెద్ద కాపీ క్యాట్: ఎంపీ మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ఒక పెద్ద కాపీ క్యాట్.. వైఎస్సార్సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాపీ చేయడమే బాబు పని అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదన్నారు. ‘‘పబ్లిసిటీ కోసమే చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం. రైతులను ఏరోజైనా చంద్రబాబు పట్టించుకున్నారా?’’ అని మార్గాని భరత్ దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది పబ్లిసిటీ స్టంట్: మంత్రి వేణు చంద్రబాబు చేసేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని మంత్రి మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రైతులను మభ్య పెట్టేందుకే చంద్రబాబు రచ్చబండ. రైతులకు చేసిన మేలు ఏమైనా ఉందా?’’ అంటూ మంత్రి వేణు మండిపడ్డారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ -
హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్కు లేదు: మంత్రి కొట్టు
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: హిందూ సంస్కృతి గురించి పవన్కు ఏం తెలుసని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్కు లేదని విమర్శించారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని.. దళారీ వ్యవస్థకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పవన్ కల్యాణ్.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నాడని మండిపడ్డారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్థోమత ఉన్న వారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరంలో సరాసరి ఏడాదికి ఏడు లక్షల వ్రతాలు, 4 వేల వివాహాలు జరుగుతాయని తెలిపారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని పేర్కొన్నారు. అన్నవరంలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని, వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఈ చర్యతో బ్రోకర్ల పనులకి అడ్డుకట్ట పడటంతో.. వీళ్లంతా పవన్ కళ్యాణ్ సంప్రదించారని అన్నారు. చదవండి: పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి ‘రోజురోజుకి పవన్ కళ్యాణ్ దిగజారి పోతున్నాడు. చంద్రబాబులాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును వదులుకుంటేనే నీకు రాజకీయ భవిష్యత్తు. సమాజంలో సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉంటే దానిని కూడా చూడలేకపోతున్నావు. ప్రజా నాయకుడైన వైఎస్ జగన్ను విమర్శిస్తే ప్రజలే నీకు మరోసారి బుద్ధి చెప్తారు. చంద్రబాబు ఐడియాలజీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. రాష్ట్రంలో దేవాలయాలు కూల్చేసింది నీ దత్తతండ్రి చంద్రబాబే. గతంలో దేవాలయాలు కూల్చి వేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా? అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేకపోయావని నిలదీశారు. వేషాలు వేసి మోసాలు చేసి, హిందూ ధర్మం కూడా పాటించలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని బీసీ సంక్షేమశాఖా మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను తీర్చే సెఈం జగన్ పట్ల అనుచితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. హిందూ ధర్మం గురించిపవన్ మాట్లాడితే ఎవరు వినరని అన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో కులాలు, ప్రాంతాలు, వాలంటీర్ల గురించి మాట్లాడటం పవన్ నైజమని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రెమ్యునరేషన్ మీద ఆధారపడిన పవన్.. గత ఎన్నికల్లో ఓచోట గెలిచిన వ్యక్తిని కూడా తన దగ్గర కూర్చోబెట్టుకోలేకపోయాడని దుయ్యబట్టారు. -
54 వేల ఎకరాల 'భూ పంపిణీ'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలు, అసైన్డ్, సర్వీస్ ఇనామ్, లంక భూముల రైతులకు భారీ మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తద్వారా భూములకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలు రైతులకు చేకూరనుంది. ఈ నిర్ణయాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం తాత్కాలిక సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దివంగత సీఎం వైఎస్సార్ తర్వాత మళ్లీ భూ పంపిణీకి సీఎం జగన్ సర్కార్ సిద్ధమైంది. 54,129.45 ఎకరాలను భూమిలేని దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన 46,935 మంది నిరుపేదలకు పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆమోదం తెలిపింది. భూమిని ప్రభుత్వం కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయిన అనంతరం ఆ భూమిపై సంబంధిత రైతులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టా భూముల రైతుల మాదిరిగానే అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం వాస్తవంగా ఎవరికైతే భూమిని కేటాయించిందో వారికి యాజమాన్య హక్కు దక్కుతుంది. వారు లేని పక్షంలో వారి వారసులకు హక్కులు రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం చేకూరనుంది. ఇంకా మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల గురించి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఆ కుల వృత్తుల వారికి శుభవార్త మూడు కేటగిరీల్లోని 9,062 ఎకరాల లంక భూముల రైతులకు డీ పట్టాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొన్ని భూములను ఐదేళ్లు లీజు ఇవ్వడానికి అనుమతించారు. ఈ నిర్ణయంతో 19,176 మంది రైతులకు మేలు చేకూరునుంది. పేదలకు భూ పంపిణీ, లంక భూములకు డీ పట్టాలు ఇవ్వడం ద్వారా మొత్తంగా 63,191 ఎకరాలకు సంబంధించి 66,111 మందికి లబ్ధి చేకూరనుంది. గ్రామాల్లో కుల వృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన సర్వీస్ ఈనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కుమ్మరి, చాకలి, కమ్మరి, నాయీబ్రాహ్మణ (బార్బర్) తదితర కుల వృత్తులు చేసుకునే వారికి గతంలో ఈనామ్గా ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగింపు ద్వారా వారికి సర్వ హక్కులు కల్పించనున్నారు. 1,68,603.71 ఎకరాల భూములు నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించడం ద్వారా 1,13,610 మందికి ప్రయోజనం కలుగనుంది. 2013కు ముందే వీరందరూ రైత్వారీ పట్టాలు పొందారు. ఆ తర్వాత ఈ భూములపై ఆంక్షలను విధించారు. ఇప్పుడీ ఆంక్షలన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద గతంలో 16,213 ఎకరాలు పొందిన దళితులకు సానుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 14,223 మందికి సంబంధించి కట్టాల్సిన రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కూడా మాఫీ చేయడం ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములపై వారికి పూర్తి హక్కులు లభించనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో దళితులకు హక్కు పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. అంతిమ సంస్కారానికి దిగులుండదు గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం భూములు కేటాయిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వే ద్వారా గుర్తించిన ప్రభుత్వం.. ఇందులో 1,700 రెవిన్యూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న 1,050.08 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎకరం వరకు భూ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. మరో 266 రెవిన్యూ గ్రామాలకు భూ సేకరణ చేసి ఇవ్వనున్నారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెలలో అమలు చేసే కార్యక్రమాలకు ఆమోదం ► ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 5.1 లక్షల మందికి రూ.510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ, వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లు చెల్లించనున్నారు. ► ఈ నెల 21న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. ► ఈ నెల 24న సీఆర్డీయే ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 50,793 మందికి ప్రభుత్వం 1,366.48 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కాగా, 47,017 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పేదల ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.384.52 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ► ఈ నెల 26న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు డబ్బు జమ చేయనుంది. వరుసగా నాలుగో ఏడాది పంపిణీ చేపట్టనున్నారు. 9.48 లక్షల గ్రూపుల్లోని మహిళలకు ఈ పథకం కింద రూ.1353.76 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చినట్లు అవుతుంది. ► ఈ నెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర జమ చేయనున్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. వైద్య రంగంలో పోస్టుల భర్తీ 2024–25 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. పులివెందుల, పాడేరు, ఆదోని మెడికల్ కాలేజీలకు గత మంత్రివర్గ సమావేశంలో పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన రెండు చోట్ల.. మదనపల్లి, మార్కాపురం వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 1,412 పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటికే 5 వైద్య కళాశాలలను ఈ విద్యా సంవత్సరం(2023–24) నుంచి ప్రారంభించనున్నారు. క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కర్నూలులో కేన్సర్ ఇన్స్టిట్యూట్కు 247 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వ విభాగంలో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో విమ్స్.. మెడికల్ కాలేజీగా మార్పు, ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో కార్డియాలజీ, కేథ్లా్బŠ, సీటీవీసీ విభాగాల్లో 94 పోస్టుల మంజూరు, పుంగనూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏరియా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అనుమతించింది. పునరావాసానికి ప్రత్యేక చర్యలు వైఎస్సార్ జిల్లాలో 10,231 గండికోట ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ కింద రూ.454.6 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 2, 3లోని ముంపు బాధితుల తరహాలోనే ఫేజ్1 బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సహాయ పునరావాస పనుల కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బంది పని చేస్తున్నారు. ఇందుకు గాను 73 పోస్టులను కేబినెట్ ఆమోదించింది. వీటికి అదనంగా 6 ఔట్ సోర్సింగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. పరిశ్రమల స్థాపన.. ఉద్యోగాల కల్పన ► వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ రూ.8,104 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. దీని ద్వారా 1500 ఉద్యోగాల కల్పన జరగనుంది. ► హీరో ప్యూచర్స్కు చెందిన క్లీన్ ఎనర్జీ ప్రైయివేటు లిమిటెడ్ సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఆమోదం. ఈ సంస్థ 375 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో రూ.2,450 కోట్ల పెట్టుబడితో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 375 మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కుతాయి. ► రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఐసీ పరిధిలోని వివిధ పరిశ్రమలకు 352.79 ఎకరాల భూముల కేటాయింపులకు సంబంధించి 44 ప్రతిపాదనలకు ఆమోదం. ఇందులో రూ.4,204.07 కోట్ల పెట్టుబడుతో 4,705 మందికి ఉపాధి దక్కనుంది. వీటితో పాటు ఎస్ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం లభించింది. ► శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణానికి అవరసరమైన వనరుల సమీకరణకు ఏపీ మారిటైం బోర్డు రూ.3,884.70 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం. ► ఏపీ మారిటైం బోర్డులో రెండు ఇంజినీరింగ్ పోస్టులు, ఎస్ఐపీబీలో ఆమోదించిన టూరిజం ప్రాజెక్టులకు, చెన్నై– కడప, విజయవాడ–కడప, బెంగళూరు–కడప, విశాఖపట్నం– కడప మధ్య విమానాలు నడుపుతున్న ఇండిగో సంస్థకు మరో ఏడాది పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొనసాగింపునకు కేబినెట్ అంగీకారం. మరిన్ని అంశాలకు ఆమోదం ► నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలల్లో 128 టీచింగ్ పోస్టులు, 68 నాన్ టీచింగ్ పోస్ట్ల మంజూరుకు ఆమోదం. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26, ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటన్నింటికీ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ► జేఎన్టీయూ కాకినాడలో 27 నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి ఆమోదం. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు. రిటైర్ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవాలని నిర్ణయం. కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో భారీ జాప్యం ఉంటోంది. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 62 ఏళ్లకు రిటైర్ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను 65 ఏళ్ల వరకు కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవడానికి కేబినెట్ ఆమోదం. ► టోఫెల్ పరీక్షల కోసం ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం విఖ్యాత విద్యా సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఈటీఎస్. సన్నాహక పరీక్షలతోపాటు టోఫెల్ ప్రైమరీ, జూనియర్ స్థాయి పరీక్షలను ఈటీఎస్ నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా ప్రాథమిక స్థాయి నుంచే మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. ఈ శిక్షణను ప్లస్, ప్లస్ వన్ స్థాయికి విస్తరించనున్నారు. ఈ నెల 23 నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో టోఫెల్పై శిక్షణ ప్రారంభం కానుంది. ► స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టి)ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్ట్ పద్ధతిలో తొమ్మిది అకడమిక్ ఎక్స్పర్ట్ పోస్టుల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కొత్తగా ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్లో 19 పోస్టుల మంజూరు, కొత్తగా ఏర్పాటైన ఒంగోలు, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం సౌత్ మండలాల్లో 70 పోస్టులు, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 13 స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ► మచిలీపట్నం, గుడివాడల్లో ఆరు కాలనీల్లో 1970–80 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మార్కెట్/నామినల్ విలువపై భూములు కేటాయిస్తూ అప్పుడు పేర్కొన్న నిబంధనలను సవరించేందుకు ఆమోదం. ► రాష్ట్ర మానవ హక్కుల సంఘంలోని దర్యాప్తు విభాగానికి కేటాయించిన 9 పోస్టుల మంజూరుతో పాటు, మరో 21 పోస్టులకు కేబినెట్ ఆమోదం. ► విశాఖ భూముల అక్రమాలకు సంబంధించి ముగ్గురు సభ్యుల సిట్ కమిటీ ఇచ్చిన తొలి నివేదికలోని 69 సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఇందులో మరో 18 సిఫార్సులపై మరింత శోధన అవసరమన్న సిట్ నివేదికకు సమ్మతి వ్యక్తం చేసింది. -
‘పవన్.. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్ నీకు లభించింది’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్పై మంత్రి వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పూటకో వేషం వేస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్ ఒక్కసారైనా దాని గురించి మాట్లాడావా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాగా, మంత్రి వేణుగోపాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్థిరత్వం లేని వ్యక్తి. ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదంటాడు.. ఇస్తే తీసుకుంటానంటాడు. నువ్వు చేసిన తప్పదాల గురించి నీ మనస్సాక్షిని అడుగు. తప్పులు ఉంటే చెప్పాలి కానీ చెప్పులు చూపిండం కాదు. నీ కార్యకర్తల మనోభావాలపై బండరాయి వేస్తున్నావు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ మాట్లాడలేని వ్యక్తి పవన్. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్ నీకు లభించింది. పవన్.. పిఠాపురంలో నీవు మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా?. పవన్.. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావ్. పవన్.. నువ్వు సినిమాల్లో హీరో కావచ్చు. రాజకీయాల్లో జీరో అని ప్రజలకు అర్థమైంది. గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావ్. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు, అనేక పథకాలు ప్రభుత్వం అందిస్తోంది. ఇవేవీ నీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నారాహి యాత్రను ప్రజలు పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘పవన్కు కావాల్సింది చంద్రబాబే.. జనసేన కార్యకర్తలు కాదు’ -
పవన్ కళ్యాణ్ పూటకో వేషం వేస్తున్నారు: మంత్రి చెల్లుబోయిన
-
బడి పిల్లలకు ‘టోఫెల్’ ట్రైనింగ్
సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తూ ‘టోఫెల్’ పరీక్షలకు సిద్ధం చేయనుంది. ఈమేరకు పరీక్షల నిర్వహణకు ఈటీఎస్తో ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి మండలానికి రెండు జూనియర్ కళాశాలలను నెలకొల్పనుంది. ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసమే కాగా మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో ఏర్పాటు కానుంది. ఈనెల 12న జగనన్న విద్యాకానుక (జేవీకే)తోపాటు 28వతేదీ నుంచి వారం రోజుల పాటు ‘అమ్మఒడి’ కార్యక్రమాల ద్వారా చదువుల ఆవశ్యకతను చాటి చెప్పాలని నిర్ణయించింది. పాఠశాలల్లో అమలయ్యే కార్యకలాపాల సమగ్ర పర్యవేక్షణకు ప్రతి రెవెన్యూ డివిజనల్లో ఒక డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారిని నియమించనుంది. ఈమేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది టెన్త్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాల’ పేరుతో జూన్ 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా, 20న రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. 3 కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 పోస్టులు వచ్చే ఏడాది మరో మూడు కొత్త మెడికల్ కాలేజీలు (పులివెందుల, పాడేరు, ఆదోని) ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో కాలేజీకి 706 పోస్టుల చొప్పున 2,118 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో ఈ ఏడాదే తరగతులు ప్రారంభమవుతున్నాయి. 6 నుంచి 9 నెలల వ్యవధిలో అత్యంత వేగంగా పనులు చేపట్టి ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. 2019తో పోలిస్తే పీజీ సీట్ల సంఖ్య కూడా రెట్టింపైంది. ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిల్లో 41 మంది స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్యులను రెగ్యులర్ పద్ధతిలో నియమించేందుకు కేబినెట్ ఆమోదించింది. ఉద్దానం ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దనున్నాం. పాఠశాల స్థాయి నుంచే ‘టోఫెల్’ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా టోఫెల్ పరీక్ష కోసం సన్నద్ధం చేయనుంది. ఈ పరీక్షల నిర్వహణకు ఈటీఎస్తో ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. టోఫెల్ ప్రైమరీ (3–5 తరగతులు), టోఫెల్ జూనియర్ (6–10 తరగతులు) పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందచేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ టీచర్ను ప్రభుత్వం 3 రోజుల శిక్షణ కోసం అమెరికాకు పంపిస్తుంది. డెయిరీలను నాశనం చేసిన చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు స్వప్రయోజనాల కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారని మంత్రి వేణు మండిపడ్డారు. హెరిటేజ్ కోసం చిత్తూరు డె యిరీ మూసి వేశారన్నారు. సీఎం జగన్ పాడి రైతు ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమూల్ ద్వారా మే లైన సేకరణ ధర లభించేలా చర్యలు చేపట్టారన్నా రు. ఏపీలో పాలఉత్పత్తి పెరిగిందన్నారు. పాడిరైతును ఆర్థికంగా బలోపేతం చేయ డమే లక్ష్యంగా 28.35 ఎకరాల చిత్తూరు డైరీ భూ ములను అమూల్కు 99 ఏళ్లు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలన్న పాడిరైతుల కల నెరవేరుతుందన్నారు. ఆమోదించిన ఇతర ప్రతిపాదనలు.. ► రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ అర్చకులు, ధర్మకర్తలకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. దేవదాయ శాఖ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆక్రమణలు తొలగించేందుకు వీలుగా చట్ట సవరణ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం. ► చిత్తూరు జిల్లా సొదుంలో బీసీ బాలికల గురుకుల కళాశాలలో రెండు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ► నాడు–నేడు పనులు పూర్తైన 476 జూనియర్ కాలేజీల్లో వాచ్మెన్ల నియామకం. ► ఆధార్ గుర్తింపు కార్డు చట్టబద్ధత ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. ► 2017 బధిరులు ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్ డ్ డ బుల్స్లో కాంస్య పతక విజేత, ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టెన్ షేక్ జాఫ్రిన్ (కర్నూలు జిల్లా)ను సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్గా గ్రూప్–1 సర్వీసులో నియమిస్తూ జోన్ –4లో సూపర్ న్యూమరరీ పోస్టు మంజూరుకు ఆమోదం. ► నరసాపురం ఫిషరీస్ యూనివర్సిటీలో 65 పోస్టులు, ఫిషరీస్ సైన్స్ కాలేజీలో 75 పోస్టులు మంజూరు. విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో నూతనంగా అడోల్సెంట్ అండ్ చైల్డ్ సైకియాట్రి డిపార్ట్మెంట్ ఏర్పాటుతో పాటు చైల్డ్ సైకియాట్రి సూపర్ స్పెషాలిటీ యూనిట్లో 11 పోస్టులు, కడప మానసిక వైద్యశాలలో కొత్తగా 116 పోస్టులు మంజూరు. ► రాజానగరం అసెంబ్లీ పరిధిలో సీతానగరం పీహెచ్సీ ఇక సీహెచ్సీగా మార్పు. ► శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్ఎం పురం, చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి, రాజమ హేంద్రవరంలో ఏర్పాటు కానున్న నాలుగు ఐఆర్ బెటాలియన్లలో ఒక్కో చోట 980 చొప్పున మొత్తం 3,920 పోస్టుల మంజూరు. ► గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీకి కేబినెట్ ఆమోదం. ఏడాదికి 0.5 మిలియన్ టన్నుల హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల అమ్మోనియాను వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి చేయడం లక్ష్యం.ఈ పరిశ్రమల స్థాపనతో దాదాపు 12 వేల ఉద్యోగాల కల్పన ► అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రూ.1800 కోట్లతో 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న రెన్యూ వోయేమాన్ పవర్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సెక్షన్ 5 (రోడ్ ట్రాన్స్ఫోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి విలీనం చేస్తూ ) సవరణ ప్రతిపాదనకు ఆమోదం. ► గుంటూరు జిల్లా తాడేపల్లిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. ► వైఎస్సార్ జిల్లా సీ.కె.దిన్నె మండలం మామిళ్లపల్లెలో 3.70 ఎకరాలు, కడప మండలం చిన్నచౌక్లో 3.70 ఎకరాల ప్రభుత్వ భూమి కడప జిల్లా బెస్త సంఘానికి కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం. అనంతపురం జిల్లా పాలసముద్రంలో గతంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కొటిక్స్ సంస్థకు కేటాయించిన 10 ఎకరాల భూమి అదే ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయకు కేటాయింపు. ► నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో 40 సెంట్లు, రావూరులోని 9.46 ఎకరాల ప్రభు త్వ స్థలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయింపు. ► ఏర్పేడు మండలం వికృతిమాలలో 15.15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు కేటాయింపు. ► డిజిటల్ లైబ్రరీలు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు, పీహెచ్సీలకు హైబ్యాండ్ విడ్త్తో 5జీ సేవలు అందించేందుకు వీలుగా ఏపీఎస్ఎఫ్ఎల్ రూ.445.7 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం. ► ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రభుత్వం చూపిన చొరవను అభినందించిన కేంద్ర ఆరోగ్య శాఖ, ఒడిశా ప్రభుత్వం. సీఎం జగన్ సూచనలతో 50 అంబులెన్సుల తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలను హర్షిస్తూ ఆమోదించిన మంత్రివర్గం. a -
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, సచివాలయం: ఏపీలో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే, నర్సాపురం ఫిషరీస్ కాలేజ్ అండ్ యూనివర్సిటీకి 140 పోస్టులకు, 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇక, సీపీఎస్ విధానం రద్దు చేసి జీపీఎస్కు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కాగా, మంత్రి చెల్లుబోయిన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఉభయ ప్రయోజనకరం. హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16శాతానికి పెంచాం. కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో పోస్టులు, సీతానగరం పీహెచ్సీ అప్గ్రేడ్కు 23 పోస్టులకు కేబినెట్ ఆమోదం. ప్రతీ మండలంలో 2 జూనియర్ కాలేజీలకు ఆమోదం. ► కడప మానసిక వైద్యశాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం. 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం. చిత్తూరు డెయిరీకి 28.35 ఎకరాల భూమికి 99 ఏళ్లకు లీజుకు నిర్ణయం. విశాఖ మానసిక వైద్యశాలలో 11 పోస్టుల మంజూరు. ► ఇక, ఒడిశా మృతులకు కేబినెట్ సంతాపం తెలిపినట్టు వెల్లడించారు. బాధితుల కోసం 50 అంబులెన్స్లు పంపించినట్టు తెలిపారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియాకు ఆమోదం తెలిపిందన్నారు. ► అనంతపురం, సత్యసాయి జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ► ఈనెల 12 నుంచి విద్యాకానుక పంపిణీకి నిర్ణయం. ఈనెల 28 నుంచి అమ్మఒడి పథకం అమలుకు నిర్ణయం. నాడు-నేడు కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు ఆమోదం. జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ► రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను కమిటీలకు అప్పగింత. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యత అర్చకులదే. ఐదేళ్ల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. ► పాడి రైతులకు సరైన ధర కల్పించాం. ఇవాళ పాల సేకరణ పెరిగింది. పాల ధర పెరిగింది. అమూల్ రావడం వల్ల పాడి రైతులకు మేలు జరిగింది. ► ఉద్యోగులందరికీ ఏరియర్స్తో 2.73శాతం డీఏకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. -
మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ తో స్ట్రెయిట్ టాక్
-
పేలాలు వేరుకోడానికి వచ్చావా చంద్రబాబూ..?: మంత్రి వేణు
సాక్షి,రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): ప్రతిపక్షనేతగా ఓదార్పునిస్తున్నావా..పేలాలు ఏరుకుంటున్నావా చంద్రబాబూ.. అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఇళ్లు కాలితే దానిపై పేలాలు వేరుకున్నట్లు చంద్రబాబు రైతులకు ఇబ్బంది వస్తే ఒక షో నిర్వహించాలని బయలుదేరాడు. రైతులకు కొంచెం ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. దీనికి ఒక షో నిర్వహించాలని చంద్రబాబు బయలుదేరడం విడ్డూరం’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. ‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా వంచించిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు. ప్రజలు కష్టం వచ్చినప్పుడు కన్పించని వ్యక్తి.. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. తనకు అనుకూలంగా ఉన్న చానళ్లలో ప్రచారం కోసం చంద్రబాబు ఒక డ్రామా చేస్తున్నాడు. తీరా అదంతా పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యింది. నిన్న ఉదయం నుంచి ఆయన ఈ డ్రామాను రక్తికట్టించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రామచంద్రాపురం వస్తే నీ వెనుక వచ్చిన వాళ్లు ఎంత మంది అనేది ఆత్మపరిశీలన చేసుకో.. రెండు జిల్లాల నుంచి నాయకులను రప్పించాడు. ఆయన సెక్యూరిటీ, మీడియా కలిపితే 200 మంది కూడా కన్పించలేదు’’ అని మంత్రి వేణు అన్నారు. నష్టపోయిన రైతుకు అండగా ఉంటున్నాం: ఏడయ్యా నీ శాసనసభ్యుడు అంటున్నావు..1వ తేదీన వర్షం వస్తే నీ నాయకుడు, కార్యకర్త ఎక్కడా కన్పించలేదు. నేను మంత్రిని...ధాన్యపు రాశుల వద్దకు వెళ్లి వెంటనే అధికారులను అప్రమత్తపరిచి ఏ రైతు ఆందోళన చెందవద్దని చెప్పాను. ముఖ్యమంత్రి గారు సమీక్షించారు..రాష్ట్రంలో పండిన ప్రతి ఒక్క గింజనూ కొనుగోలు చేస్తారు అని బరోసా ఇచ్చాను. తడిసినా, రంగు మారినా కొనే బాద్యత మాది అని స్పష్టంగా చెప్పాను. ఎడయ్యా మంత్రి.. ఎక్కడున్నాడు అంటున్నావు.. నేను తిరిగిన విషయం నా రైతులకు తెలుసు. ఇక్కడే నీ ప్లాప్ షో ప్రారంభం అయ్యింది. నేను కాళ్ళు పట్టుకుంటాడు అన్నావు..నేను నీలా కృతజ్ఞత హీనుడిని కాదు. చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నా కులంలో గొప్పవ్యక్తి చనిపోతే, నా కుటుంబంలో నష్టాన్ని భర్తీ చేసిన నా నాయకుడి వద్ద నేను వంగాను.. నీలాగా పిల్లనిచ్చి, రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తిని రాత్రికి రాత్రి పొడిచేసిన కృతజ్ఞతాహీనుడిని కాదు. రైతుల వద్దకు వెళ్లి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఓదార్పు ఇవ్వాలి. రైతుల వద్దకు వెళ్లి ఆత్మహత్యలు అంటూ ఏకరువు పెడుతున్నావు. రైతులు సుఖంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వ్యవసాయం దండగ అన్న ఒక చరిత్ర హీనుడు చంద్రబాబు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు. చంద్రబాబు నోటి నుంచే ఉచిత విద్యుత్ గొప్పది అని చెప్పించిన వ్యక్తి వైఎస్సార్. జగన్ సమర్ధుడు కాబట్టే నిన్ను అందరి కాళ్లూ పట్టిస్తున్నాడు.. జగన్ అసమర్ధుడు అంటున్నాడు. సమర్ధుడు కనుకే నిన్ను నీ కొడుకును అందరి కాళ్లూ పట్టిస్తున్నాడు. జగన్ సమర్ధుడు కనుకనే నువ్వు పవన్ కళ్యాణ్, రజనీకాంత్ కాళ్లు పట్టుకుంటున్నావు. జగన్ అహంకారి అంటున్నావు. ప్రజలకు సేవ చేయడానికి అతను అహంకారంతోనే పనిచేస్తారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చంద్రబాబు ఎప్పుడూ శాశ్విత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో రైతుల కోసం ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశారు. కావాలంటే నువ్వు వెళ్లి చూడు. పండిన పంటను ఏం చేస్తావో సాయంత్రంలోగా చెప్పు అంటూ ఘీంకరిస్తున్నాడు. ముఖ్యమంత్రి సమీక్ష చేసి ప్రతి గింజెను కొనాలనిచెప్పిన మాట వినలేదా..? ఎకరాకు 50 బస్తాల ధాన్యం పండటానికి కారణం ముఖ్యమంత్రి గారు కాదా..?. జూన్ 1న సాగునీరు విడుదల చేసింది ముఖ్యమంత్రి గారు కాదా..?. సకాలంలో సేంద్రియ ఎరువులు అందించారు.. వర్షాలను నువ్వేమన్నా ఆపేయగలవా.? వర్షం వెలిసిన తర్వాత పంట నష్టం అంచనాలు వేస్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నీకు కనీస జ్ఞానం కూడా లేదా..? గత ఏడాది వరదొస్తే ఒక్కో రైతుకు రూ.10 లక్షలకు పైగా పరిహారం వచ్చిన రైతులున్నారు. కౌలు రైతులపై నీకు ఇప్పుడు ప్రేమ పుట్టిందా..? చదవండి: చంద్రబాబువన్నీ డ్రామాలే.. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే చంద్రబాబు.. దరిద్రుడు అంటావా..ఏం పదం అది..ఆయన 5 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని మరిచావా.? నువ్వు పాలనలో ఉంటేనే దరిద్రం వస్తుంది..కరువు నీకు కేరాఫ్ అడ్రస్ నువ్వు..దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే నీ వయసు, చూపు తగ్గిపోయింది.. ట్రాక్టర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే కనిపించడం లేదు. కొనుగోలు చేస్తున్న ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కోసం వెళ్లి ధాన్యాన్ని తొక్కి పడేశారు. ఈ ప్రభుత్వం రైతును అన్ని విధాల ఆదుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోంది. మిల్లర్లు ఐపీ పెడితే మాట్లాడలేని నువ్వు ఈ రోజు దళారీలు లేకుండా కొనుగోలు చేస్తుంటే కన్పించడం లేదా..?. ఈ జిల్లాలో మునిగిన పంట 475 ఎకరాలు..34456 మెట్రిక్ టన్నుల ధాన్యం మునిగింది. దాన్ని ప్రతి గింజా మేం కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ములాఖత్కు వచ్చి మొసలి కన్నీరు ఎందుకు..?: రాజమండ్రిలో టీడీపీ నాయకుడు జైలుకు వెళ్తే చంద్రబాబు ములాఖత్ కోసం వచ్చాడు. పనిలో పనిగా రైతులను మళ్లీ మోసం చేద్దాం..మొసలి కన్నీరు కార్చి కొంగ జపం చేద్దామని ఈ తతంగం చేస్తున్నాడు. చక్కగా ఎండి ఉన్న ధాన్యం, తడవని ధాన్యం, జగననన్న కాలనీలో ఎండబెట్టుకున్న ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటుంటే అక్కడకు వెళ్లి కొనుగోలు చేయడం లేదని చెప్పడానికంటే గుడ్డితనం ఉంటుందా..? నీ నాటకాలు ఎవరికి తెలియదు చంద్రబాబూ..? నువ్వు మాట్లాడితే వక్తిత్వ హననం చేయాలని బాబాయ్ చంపావ్ అంటున్నాడు. ముఖ్యమంత్రి రావాలా నీకు..? మేం నీకులాగా షో చేయలేదు. మాట్లాడితే తిత్లీ తుఫాను వచ్చింది.. నేను రాజమండ్రిలో పడుకున్నాను అంటున్నాడు. ఈ రోజు నువ్వు చేస్తున్న తంతు వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండటం లేదు. ఏ రైతు పండించిన పంటకూ ఇబ్బంది కలుగకుండా మేం అండగా నిలుస్తున్నాం. ఏ ధాన్యాన్నైనా కొనుగోలు చేయమని మిల్లర్లకు కూడా చెప్పాం. నీ హయాంలో ఏనాడైన సంచులు పంచావా..?: ఎవడో ఒక పాత సంచి తీసుకొచ్చి ఇస్తే దాన్ని చూపించి సంచులు లేవు అంటున్నాడు. ఆయన హయాంలో ఏనాడైనా సంచులు పంపిణీ చేయలేదు. మేం చేస్తున్నట్లు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు వేశావా..? 1.52 లక్షల మందికి బీమా అందించాం. ఈ జిల్లాలోని అందరు రైతులకు బీమా పే చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ఇన్సూరెన్స్ కట్టలేదని ఆరోపిస్తాడు. కనీస వాస్తవాలు కూడా తెలుసుకోవడం లేదు. రైతులు చనిపోతే వారి శవాల వద్దకు వచ్చి రాజకీయాలు చేద్దామనుకుంటున్నాడు. శవ రాజకీయాలు మానేయ్ చంద్రబాబూ..నిన్ననే మండపేటలో ఒకరికి కాలు పోయింది. నువ్వు దరిద్రుడివై ఉండి మా ముఖ్యమంత్రిని అంటున్నావు. ఇప్పటికైనా చంద్రబాబూ ప్రజల్ని హింసించకు. నీ కొడుకును అధికారంలోకి తేవాలనే నీ కాంక్ష నెరవేరదు. ఏ పంట సీజన్లో పంటకు నష్టం వాటిల్లితే అదే సీజన్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చావా చంద్రబాబూ.. అలా చేయకుండా ఇప్పుడొచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. -
చంద్రబాబు, లోకేష్లపై మంత్రి వేణుగోపాల కృష్ణ ఫైర్
-
దేశానికి ఆదర్శం సీఎం వైఎస్ జగన్
-
వివక్ష లేదు.. ‘నవరత్నాల పథకాలు’ యాడ్స్పై మంత్రి వేణు క్లారిటీ
సాక్షి, అమరావతి: నవరత్నాల పథకాల యాడ్స్పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడా వివక్ష లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.128 కోట్ల ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. ‘‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారు. సర్కులేషన్ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారు’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారు. గత ప్రభుత్వం యాడ్స్ ఇవ్వటంలో పూర్తిగా పక్షపాత ధోరణి అవలంబించింది. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారు. ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశాం’’ అని మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్ -
సామాజిక న్యాయం నాడు ఎండమావి అయితే నేడు నిండుకుండ: మంత్రి చెల్లుబోయిన
-
చంద్రబాబే ఓ పెద్ద సైకో: మంత్రి చెల్లుబోయిన
-
చంద్రబాబు విజనరీ కాదు.. విజన్ లేని వ్యక్తి: మంత్రి వేణు
సాక్షి, రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు సైకోలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు విజనరీ కాదు.. విజన్ లేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు. ‘‘చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిందే. పోలీసుల పట్ల చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’’ అని మంత్రి వేణు అన్నారు. చదవండి: Fact Check: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు
-
సీఎం జగన్ నేతృత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు: మంత్రి వేణు
సాక్షి, అమరావతి: సంక్షేమం ,అభివృద్దిని రెండు కళ్లలా ప్రభుత్వం పరిపాలన చేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు. సీఎం నేతృత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోందని.. దేశంలో అధిక పెట్టుబడులను సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రోత్సాహం ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు. పరిపాలన సంస్కరణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదరికాన్ని రూపుమాపడమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. డీబీటీ ద్వారా రూ.1.98 లక్షల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వంపై టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ‘ఏపీ జీఎస్.డిపి 11.43 శాతంగా ఉంటే.. దేశ జీఎస్.డిపీ 8.7 % శాతం ఉంది. దేశ జీఎస్.డీపీ కంటే ఏపీ జీఎస్.డీపీ 2.73% శాతం ఎక్కువ. కోవిడ్ సమయంలో దేశం వృద్ది రేటు మైనస్ 6.60% ఉంది. మన రాష్ట్రం 0.08% శాతం వృద్దిరేటు ఉంది. దేశంలోనే తలసరి ఆదాయంలో ఏపీ 6వ స్థానంలో ఉంది. చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36 శాతమే. వైఎస్ జగన్ సీఎం సీఎం అయ్యాక వృద్ధి రేటు 11.43 శాతానికి చేరింది. వృద్ధి రేటు పెరిగితే అది అభివృద్ధి కాదా? పరిశ్రమల స్థాపనలో ఏపీ మూడో స్థానం డీపీఐఐపీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2022 జూలై చివరి నాటికి లక్షా 71వేల 285 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అందులో 40,361 కోట్ల పెట్టుబడులు ఏపీ సాధించింది. 2022 డిసెంబర్లో జగన్ పాలనలో 23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐ.పీబీ ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులు సాధించడంలో ఏపీది 5 వ స్థానం. పరిశ్రమల స్థాపనలో ఏపీది 3వ స్థానం. దక్షిణాదిరాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయాడు. చదవండి: ‘సీబీఎన్’ అంటే కొత్త అర్థం చెప్పిన వైఎస్సార్సీపీ నేత కొండా రాజీవ్ ఏపీ అగ్రస్థానం పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీనే నెంబర్ 1. 2022 జూన్లో బీఆర్ఏపీ ఇచ్చిన రేటింగ్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్ కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ పోటీ పడితే వెయ్యికోట్ల గ్రాంట్ ఏపీకి దక్కింది. ఎంఎస్ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యతను కల్పించాం. కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీని పొడిగించాం రైతులను ఆదుకోవడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. రైతులు మోసపోకుండా చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ. అమూల్ సహకారంతో పాడి రైతులు నష్టపోకుండా చూశాం. తన పరిపాలన కాలంలో అవాస్తవాలతో చంద్రబాబు పబ్బం గడుపుకున్నాడు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఏపీకి ఏం కావాలో చంద్రబాబు చెప్పాడా. కనీసం చర్చల్లో పాల్గొన్నాడా? అనువైన ప్రాంతాన్ని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేయలేదు.’ అని మంత్రి విమర్శించారు. -
పరిపాలన సంస్కరణల్లో దేశానికే ఏపీ ఆదర్శం: మంత్రి చెల్లుబోయిన