differences
-
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక.. కూటమి నేతల్లో విభేదాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. పార్టీలకు సంబంధంలేకుండా జరిగే ఈ ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ నేతలు చెరో అభ్యర్థికి మద్దతు ప్రకటించడం కూటమి శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఏపీటీఎఫ్కు చెందిన పాకలపాటి రఘువర్మ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు.కూటమి పార్టీలన్నీ రఘువర్మకు మద్దతుగా నిలుస్తున్నట్లు మీడియా ముందు ఎమ్మెల్సీ చిరంజీవి ప్రకటించారు. ఆయనను గెలిపించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కానీ, శుక్రవారం పీఆర్టీయూకు చెందిన గాదె శ్రీనివాసులనాయుడు నామినేషన్ వేశారు. ఈయనకు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మద్దతు తెలిపారు.శ్రీనివాసులనాయుడికే బీజేపీ మద్దతు..మరోవైపు.. శ్రీనివాసులనాయుడు నామినేషన్ సమర్పించిన అనంతరం మాధవ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. తమ మద్దతు శ్రీనివాసులనాయుడికే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈయన విజయానికి ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే, మరో అభ్యర్థికి కూటమి మద్దతు ఉందని ఒకరు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని ఆయన స్పష్టంచేశారు. -
మళ్లీ అలిగిన షిండే..కారణం అదే..!
ముంబయి:అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెలలు గడిచిన తర్వాత కూడా మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఏక్నాథ్షిండే గైర్హాజరయ్యారు. గత వారం కూడా క్యాబినెట్ భేటీకి షిండే హాజరు కాలేదు. సీఎం పదవి దక్కకపోవడం,ఇంఛార్జ్ మంత్రుల నియామకాలపై అసంతృప్తితో ఉండడం వల్లే షిండే వరుసగా సీఎం సమావేశాలకు రావడంలేదన్న ప్రచారం జరుగుతోంది. సీఎం ఫడ్నవీస్తో విభేదాల వల్లే షిండే సమావేశాలకు రావడం లేదన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే షిండే సీఎం ఫడ్నవీస్తో సమావేశాలకు గైర్హాజరవడంపై శివసేన ఎంపీ నరేష్ మస్కే క్లారిటీ ఇచ్చారు. షిండే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేదు. ఇందుకే సీఎంతో సమావేశాలకు రాలేదు.ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వారే దీనిపై లేనిపోనివి కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు’అని మస్కే తెలిపారు.గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ(అజిత్పవార్) పార్టీల మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తర్వాత శివసేన అధినేత అప్పటి సీఎం షిండే కూడా మళ్లీ తనకు ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే సీఎం పదవి బీజేపీకి వెళ్లడంతో డిప్యూటీ సీఎం పదవితో సర్దుకున్నారు. -
మస్క్తో విభేదాలు..? వివేక్ రామస్వామి క్లారిటీ
వాషింగ్టన్:టెస్లా అధినేత ఇలాన్ మస్క్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త వివేక్రామస్వామి క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ ప్రమాణస్వీకారం రోజే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీఓజీఈ) బాధ్యతల నుంచి తప్పుకోవడంపై రామస్వామి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తాజాగా స్పందించారు. మస్క్కు సాంకేతికతను ఎక్కువగా నమ్ముతాడని తాను రాజ్యాంగం మీద ఆధారపడి నడిచే శాసనవ్యవస్థను ఎక్కువగా నమ్ముతానని చెప్పారు. ఇంతేతప్ప ఇద్దరి మధ్య విభేదాలు ఏమీ లేవన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకే డీఓజీఈ బాధ్యత నుంచి తప్పుకున్నారా అన్న ప్రశ్నకు లేదని వివేక్ సమాధానమిచ్చారు. అయితే 2026లో జరగనున్న ఒహియో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని వివేక్ చెప్పారు. డీఓజీఈ బాధ్యతలను రామస్వామి,మస్క్లకు సంయుక్తంగా ట్రంప్ ఇటీవలే అప్పగించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను రామస్వామి ప్రశంసించారు.కాగా, వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవడం కోసం రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్తో తలపడ్డ విషయం తెలిసిందే.ఆ తర్వాత రామస్వామి ప్రైమరీల నుంచి తప్పుకుని ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చారు. -
ప్రమాణస్వీకారానికి... మిషెల్ దూరం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రథమ మహిళా మిషెల్ ఒబామా దూరంగా ఉండనున్నారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నా 150 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ మిషెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరు కాని విషయం తెలిసిందే. దాంతో ఒబామా దంపతులకు విభేదాలొచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వారి సన్నిహిత వర్గాలు ఈ వార్తలను ఖండించాయి. ఫేక్ నవ్వులు నవ్వలేకే ప్రమాణ స్వీకారానికి మిషెల్ దూరంగా ఉంటున్నారని తెలిపాయి. ఆమెతో పాటు డెమొక్రాట్లు నాన్సీ పెలోసీ, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్ తదితరులు కూడా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరవడం లేదు. నాలుగేళ్ల కిందట జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కూడా గైర్హాజరవడం తెలిసిందే. తద్వారా వైట్హౌస్ సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. -
ఒబామా దంపతులు విడిపోనున్నారా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్, ఆయన భార్య మిచెల్ ఒబామా(60) తమ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారా? సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బరాక్ ఒబామా ఒక్కరే హాజరురవుతారంటూ ఈ దంపతుల కార్యాలయం చేసిన ప్రకటనలే ఇందుకు బలం చేకూరుస్తోంది. అధికార కార్యక్రమానికి భర్త బరాక్ ఒబామాతో కలిసి మాజీ ప్రథమ మహిళ మిచెల్ గైర్హాజరవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నివాళి కార్యక్రమంలో సైతం మిచెల్ పాల్గొనలేదు. అమెరికా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు సతీసమేతంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, లారా బుష్ దంపతులు హాజరుకానున్నారు. కాగా, ఒబామా దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. జిమ్మీ కార్టర్ నివాళి, ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అందుకు ఆజ్యం పోశాయి. సామాజిక మాధ్యమ వేదికల్లోనూ వీరు విడిపోయారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. 1989లో డేటింగ్ ప్రారంభించిన బరాక్, మిచెల్లు 1992లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
కాంగ్రెస్పై కత్తులు!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేతలు గొంతు విప్పుతున్నారు. సమాజ్వాదీ పార్టీ ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఎస్) నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది! అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు ఇండియా పక్షాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనడం లేదు. ఇతర అంశాల్లోనూ భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు. పార్లమెంట్ లోపల, బయట కలిసి ఒక్కతాటిపై పని చేస్తున్న దాఖలాలు లేవు. ప్రధానంగా హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిమానం కోల్పోయి బలహీనపడుతున్న కాంగ్రెస్ విపక్ష కూటమిని ముందుకు నడిపించలేదని కుండబద్ధలు కొడుతున్నారు. సారథ్యం నుంచి కాంగ్రెస్ తప్పుకుని సమర్థులకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమన్న పశి్చమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. ఇండియా కూటమికి ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చైర్పర్సన్గా ఉన్నారు. ఇదేనా పొత్తు ధర్మం? బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో లోక్సభ ఎన్నికలకు ముందు 2023 జూన్లో 17 పార్టీలతో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఫ్రంట్ ఏర్పాటైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఒకే వేదికపైకి చేరాయి. కాంగ్రెస్తో పాటు భావసారూప్యం కలిగిన పార్టీలు చేతులు కలిపాయి. అయితే, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిపోయారు! ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఇండియా పక్షాలు కొన్నిచోట్ల కలివిడిగా, మరికొన్ని రాష్ట్రాల్లో విడివిడిగా పోటీచేశాయి. అంతిమంగా పరాజయమే మిగిలింది. లోక్సభలో స్వీయ బలం పెరగడం ఒక్కటే కాంగ్రెస్కు కొంత ఊరట కలిగించింది. లోక్సభ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, హరియాణాలో మిత్రపక్షాలను పక్కనపెట్టి దాదాపుగా ఒంటరిగా పోటీచేయడం వికటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్వి ఒంటెత్తు పోకడలంటూ భాగస్వామ్య పార్టీలు మండిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని, పొత్తుధర్మం పాటించడంలేదని ఆక్షేపిస్తున్నాయి. అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి సమాజ్వాదీ ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉందని ఆ పార్టీ ఎంపీ జావెద్ అలీఖాన్ చెప్పారు. అయితే కూటమిలో అభిప్రాయభేదాలు నిజమేనని అంగీకరించారు. లుకలుకలపై కాంగ్రెసే స్పందించి భాగస్వాములను సమాధానపరచాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. మిత్రపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక కూటమి ఎందుకని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్ల సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు, అందుకే అవమానాలు ఎదురయ్యాయి’’ అని ఆరోపించారు. కూటమి ఒక్కటిగా కలిసి ఉంటుందన్న నమ్మకం తమకు లేదని, ఏ క్షణమైనా అది ముక్కలయ్యే అవకాశం ఉందని జేడీ(యూ) సీనియర్ నేత రాజీవ్ రంజన్ వ్యాఖ్యానించారు. కూటమికి ఎవరు సారథ్యం వహించాలో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. సారథ్యానికి సిద్ధమన్న మమత ప్రతిపాదనపై దృష్టి పెట్టాలని సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉదయ్వీర్ సింగ్ కోరారు. ఆమెకు తమ మద్దతు, సహకారం ఉంటాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మాత్రం మమత వ్యాఖ్యలపై గుర్రుగా ఉంది. తమ కూటమి పెద్దగా మరొకరు అవసరమని భావించడం లేదని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ తేల్చిచెప్పారు. మమత వ్యాఖ్యలను పెద్ద జోక్గా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ కొట్టిపారేశారు.ఎంవీఏకు సమాజ్వాదీ గుడ్బైముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ఎంవీఏతో తెగదెంపులు చేసుకుంటున్నామని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తెలిపింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను కీర్తిస్తూ శివసేన(యూబీటీ) ఇటీవల ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. అదేవిధంగా ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ మసీదు విధ్వంసాన్ని పొగుడుతూ ‘ఎక్స్’లో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’అని మహారాష్ట్ర ఎస్పీ చీఫ్ అబూ అజ్మీ చెప్పారు. ఈ పరిణామంపై శివసేన(యూబీటీ) స్పందించింది. బాబ్రీ మసీదుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. ఈ విషయం తెలుసుకునేందుకు ఎస్పీకి దశాబ్దాలు పట్టిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎస్పీ),ఎస్పీ ఉన్నాయి.‘‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. నాకు చాన్సిస్తే కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన’’ – శుక్రవారం మీడియాతో మమత -
టీడీపీ Vs జనసేన.. తారాస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్కల్యాణ్ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు. -
టీడీపీ–జనసేనలో దీపావళి ‘చిచ్చు’
కాకినాడ: కాకినాడలో కూటమి పార్టీలైన టీడీపీ–జనసేన మధ్య ‘దీపావళి’ చిచ్చు రేపింది. బాణసంచా దుకాణాల కేటాయింపులో అధికారుల తీరును తప్పుపడుతూ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) వర్గీయులు రోడ్డుపై పడుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ నాన్స్టాప్ బస్సును అడ్డగించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.ఓ వైపు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్పై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతూ పనిలో పనిగా ఇక్కడి అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఇప్పటికే పర్లోపేట వద్ద వైన్షాపు కేటాయింపు విషయంలో ఇరుపార్టీల మధ్య వివాదం నెలకొంది. ఇప్పుడు బాణసంచా దుకాణాల కేటాయింపులో కూడా రోడ్డెక్కడంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. వివరాలివీ.. టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు మద్దతుతో కాకినాడ మెయిన్రోడ్డు అపోలో ఆస్పత్రి పక్క ఓ బాణసంచా దుకాణం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, వస్త్ర దుకాణాలు, ఆస్పత్రులున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. బాణసంచా దుకాణం కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక అధికారులు అభ్యంతరం చెప్పడాన్ని టీడీపీ నగరాధ్యక్షుడు వీరు జీర్ణించుకోలేకపోయారు.వాస్తవానికి.. జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటుపై వివాదం రేగడంతో కలెక్టర్ షణ్మోహన్ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్ అధికారులతో వేసిన కమిటీ కూడా అక్కడ దుకాణం ఏర్పాటుచేయడంపై అభ్యంతరం తెలిపింది. భానుగుడి జంక్షన్ సమీపంలో జనసేన మద్దతుతో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణానికి లేని అభ్యంతరం తమ విషయంలోనే ఎందుకంటూ అధికారులపై మండిపడ్డారు. ఎంపీ ఉదయ్శ్రీనివాస్ ఒత్తిడితోనే టీడీపీ వారి దుకాణానికి చెక్ పెట్టారని వీరు బలంగా అనుమానిస్తున్నారు. దీంతో ఎంపీపై అక్కసు వెళ్లగక్కేందుకు వీరుతోపాటు టీడీపీ శ్రేణులంతా ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుకాణాల కేటాయింపు తీరుపై విమర్శలు..మరోవైపు.. గతంలో ఎన్నడూలేని విధంగా కాకినాడలో బాణసంచా దుకాణాల కేటాయింపు ప్రక్రియను టీడీపీ ఓ ప్రైవేటు లాడ్జిలో నిర్వహించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే కేటాయింపు ప్రక్రియను హైజాక్ చేసి కొత్త సంస్కృతికి తెరలేపడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే..ఇక ప్రభుత్వం మారినా అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట విని, పనిచేస్తున్నారంటూ కొండబాబు వర్గీయులు ఆరోపణలకు దిగారు. దీంతో.. బాణాసంచా దుకాణాల కేటాయింపులో వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ద్వారంపూడిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జేసీఎస్ (జగనన్న కన్వీనర్లు, సారథుల) కన్వీనర్ సుంకర విద్యాసాగర్ మండిపడ్డారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసన చేసిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా తరచూ ద్వారంపూడిని వివాదంలోకి లాగడం సర్వసాధారణమైందని విమర్శించారు. దుకాణాల కేటాయింపు అంశంపై ద్వారంపూడి కానీ, వైఎస్సార్సీపీ కానీ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టంచేశారు. -
యాపిల్స్లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!
యాపిల్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి తెలిసిన సాధారణ యాపిల్స్ గాక అందులో చాలా వెరైటీలు ఉంటాయననే విషయం తెలుసా. వీటిని ఎప్పుడైన తిని చూశారా..!. తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా త్వరగా తెలుసుకుని ట్రై చేసి చూడండి. యాపిల్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ఒక యాపిల్ ఎన్నో రోగాలు బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి యాపిల్స్లో మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి. అవేంటంటే..అంబ్రి యాపిల్జమ్మూ కాశ్మీర్కు చెందిన అంబ్రి రకం యాపిల్. ఒకప్పుడూ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాపిల్ రకంలో ఇది ఒకటి. దీనిని కాశ్మీర్ రాజు అనిపిలుస్తారు. ఇది చక్కటి ఆకృతి, తీపి వాసనతో మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇవి సుదీర్ఘకాలం పాడవ్వకుండా ఉండటంలో ప్రసిద్ధి చెందినవి. వీటటిని డెజర్ట్లోల ఉపయోగిస్తారు. చౌబత్తియా అనుపమ్ ఇది ఎరుపురంగులో పండిన యాపిల్లా ఉంటుంది. మద్యస్థ పరిమాణంఓ ఉంటుంది. ఇది హైబ్రిడ్ యాపిల్ రం. వీటిని ఎర్లీషాన్బరీ, రెడ్ డెలిషియన్ మధ్య క్రాస్ చేసి పడించిన యాపిల్స్. దీన్ని ఉత్తరాఖండ్లో విస్తారంగా సాగు చేస్తారు. గోల్డెన్ ఆపిల్దీన్ని గోల్డెన్ డెలిషియస్ అని కూడా పిలుస్తారు. పసుపు పచ్చని రంగుతో మృదువైన ఆకృతిలో ఉంటాయి. ఇవి అమెరికాకు చెందినవి. ఇప్పుడు వీటిని హిమచల్ ప్రదేశ్లో కూడా పండిస్తున్నారు. తేలికపాటి రుచితో మంచి సువాసనతో ఉంటాయి. వీటిని ఎక్కువగా యాపిల్ సాస్, యాపిల్ బటర్, జామ్ల తయారీకి అనువైనది. గ్రానీ స్మిత్యాపిల్కి పర్యాయపదంలా ఉంటాయి ఈ గ్రానీ స్మిత్ యాపిల్స్. వీటిని హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే భారతదేశంలో పెరిగే ఈ రకం యాపిల్స్ మమ్రాతం ఇక్కడ ప్రత్యేక వాతావరణానికి కాస్త తీపిని కలిగి ఉండటం విశేషం. వీటిని ఎక్కువగా సలాడ్లు, జ్యూస్లు, బేకింగ్ పదార్థాల్లో ఉపయోగిస్తారు. సునేహరి యాపిల్ఇది కూడా హైబ్రిడ్ యాపిల్కి సంబంధించిన మరో రకం. అంబ్రి యాపిల్స్ క్రాసింగ్ నుంచి వస్తుంది. యాపిల్ క్రిమ్సన్ స్ట్రీక్స్లా పసుపు తొక్కను కలిగి ఉంటుంది. ఆకృతి క్రంచీగా ఉంటుంది. తీపితో కూడిన టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. పార్లిన్ బ్యూటీ ఈ యాపిల్స్ భారతదేశంలోని తమిళనాడుకి చెందింది. ఈ రకానికి చెందిన యాపిల్స్ కొడైకెనాల్ కొండల్లో ఉండే వెచ్చని శీతాకాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్లో ఈ రకం యాపిల్స్ వస్తుంటాయి. ఇవి మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణం వరకు వివిధ ఆకృతుల్లో లభిస్తాయి.ఐరిష్ పీచ్అత్యంత చిన్న యాపిల్స్. ఇవి లేత పసుపు గోధుమ ఎరుపు రంగులతో ఉంటుంది. పరిమాణంలో చిన్నది. విలక్షణమైన తీపి టార్ట్ రుచిని కలిగి ఉంటుంది. వీటిని పచ్చిగానే తీసుకుంటారు. అధిక పీచుతో కూడిన యాపిల్స్ ఇవి. స్టార్కింగ్ ఈ యాపిల్స్ తేనె లాంటి సువాసనతో అత్యంత తియ్యగా ఉటాయి. వీటని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లో పండిస్తారు. వీటిని తాజాగా తింటారు. అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. ఎక్కువగా జ్యూస్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఎనిమిది రకకాల యాపిల్స్ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి రకం యాపిల్ రుచి, ఆకృతి పరంగా మంచి పోషకవిలువలు కలిగినవి. ఏ యాపిల్స్లో ఏదో ఒకటి తీసుకునేందుకు ప్రయత్నించినా.. మంచి ప్రయోజనాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు. -
సీట్ల పంపకాల్లో ‘మహా’ ప్రతిష్టంభన!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావికాస్ అఘాడీలో టికెట్ల పంపిణీపై విభేదాలు మొదలయ్యాయి. 288 స్థానాల్లో 260 స్థానాలపై మధ్య ఏకాభిప్రాయం కుదరగా, 28 సీట్లపై పీటముడి పడినట్లు సమాచారం. అఘాడీ భాగస్వాములు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎప్పి) శుక్రవారం 9 గంటల పాటు జరిగిన మారథాన్ సమావేశం జరిపాయి. . విదర్భలో ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్ను ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.ఆ సీట్లనే కోరుతున్న శివసేనవిదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఉమ్మడి శివసేన, బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 15, శివసేన 12 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒంటరిగా 29, ఎన్సీపీ ఐదు సీట్లు గెలిచాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత కూడా విదర్భ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంటే ఉన్నారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఏకనాథ్ షిండే వైపు, 8 మంది ఉద్ధవ్ వైపు నిలిచారు. ఇప్పుడు పాత ఫలితాలపైనే సమస్య నెలకొంది. సీట్ల పంపిణీ ఫార్ములా ప్రకారం 2019లో గెలిచిన 12 సీట్లు తమకే దక్కాలని ఉద్ధవ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని సమాచారం. ముంబైలోని 20–25 స్థానాల్లో స్థానాల పంపకాలు కూడా సమస్యగా మారింది. ముంబై శివసేన కంచుకోట గనుక అక్కడ ఎక్కువ సీట్లు రావాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను బీజేపీ–సేన కూటమి కైవసం చేసుకుంది. శివసేన 22, బీజేపీ 9 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. -
టీడీపీలో విభేదాలు.. దర్జాగా దోపిడీ
రాజంపేట: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జినైన తనకు మంత్రి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాలసుబ్రమణ్యం సోమవారం విరుచుకుపడ్డారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి తన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.ఇసుక, మట్టి దోపిడీలో.. ఎర్రచందనం అక్రమ రవాణాలో, బదిలీలకు సిఫారసు లేఖలను అమ్ముకుంటూ మంత్రి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం గుండ్లపల్లెలో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం ఏమన్నారంటే..ఇసుక అక్రమ రవాణాలో మంత్రికి వాటాలు..కేవీ పల్లెలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుంటే సుండుపల్లెలో పోలీసులకు అడ్డుకునే హక్కులేనప్పుడు, రాయచోటి మండలంలో అనుంపల్లె మట్టి ఎత్తితే, దానిని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా? రాజంపేట మండలంలోని ఆర్.బుడుగుంటపల్లె ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి రాజంపేట ఇన్చార్జిగా ఉన్న నన్ను పిలవలేదు. మంత్రికి ఇసుకలో వాటా ఉందని కలెక్టరేట్లో చర్చించుకుంటున్నారు. అలాగే, అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రి తన సిఫార్సు లేఖలను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. మంచి పోస్టుకు రూ.5 లక్షలు, గ్రామస్థాయి పోస్టుకైతే రూ.30వేలు వసూలుచేస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై కలెక్టర్ ప్రేక్షకపాత్ర..అలాగే, సుండుపల్లె మండలం తిమ్మసముద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తుంటే నేను, మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఆయన తెలియనట్లు వ్యవహరించారు. తహసీల్దారును కలెక్టరు మొక్కుబడిగా మందలించారుగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనుంపల్లె నుంచి మట్టి తోలుతుంటే తనకు సంబంధంలేదని తహసీల్దారు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న వారిని అడ్డుకుంటాం.నా సభలకు అధికారులను అడ్డుకుంటున్నారు..మరోవైపు.. నేను పాల్గొంటున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ సభలకు అధికారులను రానివ్వకుండా సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లె గ్రామ పెద్దలకు ఫోన్చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరగకూడదని చెప్పాడు. కానీ, గ్రామస్తులు జిల్లా అధ్యక్షుడి మాట లెక్కచేయకుండా ఈ సభ నిర్వహించారు. వాస్తవానికి.. రాంగోపాల్రెడ్డి సీఎం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నియమించిన వ్యక్తి కాదు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా.సభ్యత సంస్కారం లేనివారిని పదవుల్లో పెట్టుకోవడంవల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇక మంత్రి రాంప్రసాద్రెడ్డి వైఎస్సార్సీపీలోని తన బంధువులకు వత్తాసు పలుకుతూ వారికి పనులు చేసిపెడుతున్నాడు. రాయచోటిలో టీడీపీ సీనియర్లందరూ కలిసి పనిచేస్తేనే రాంప్రసాద్రెడ్డి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఆశయాలకు మంత్రి తూట్లు పొడుస్తున్నారు. రవాణాశాఖలో ఆయన లీలలు, బాగోతాలు పత్రికల్లో వస్తున్నాయి. -
కావలి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, నెల్లూరు: కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు.జనసేనలో లుకలుకలు మరోవైపు, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో లుకలుకలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్పై వెంకటగిరి జనసేన నేత వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ పాయింట్ ఆప్ కాంటాక్ట్గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ పెత్తనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఇంచార్జ్లకు గౌరవం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో జెండా మోసిన తనను పార్టీకి దూరం చేయాలని అజయ్ కుమార్ చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: కాదంబరి కోరాలే గానీ.. -
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ కూటమి పార్టీల్లో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన ఆ జెండా దిమ్మను ప్రారంభించడానికి వీల్లేదని, దానిని తొలగించాలని టీడీపీ నేత దారం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం అర్ధరాత్రి నరసింహారావుకు జన సైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరసింహారావు పలుగుతో జెండా దిమ్మను ధ్వంసం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ జనసేన కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నరసింహారావు వెళ్లిపోయారు. వెంటనే జనసేన కార్యకర్తలు ఎంఎన్కె రహదారిపై బైఠాయించారు. నరసింహారావును అప్పగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనసైనికులు ఆందోళన విరమించి బైక్ ర్యాలీగా వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నరసింహారావుపై ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన దారం నరసింహారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆధిపత్యం కోసం దారం నరసింహారావు పట్టణంలో వర్గ విభేదాలు సృష్టించి సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
538 నియోజకవర్గాల ఓట్లలో తేడా: ఏడీఆర్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని ఆసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 5,54,596 తక్కువగా ఉన్నాయని వివరించింది. అలాగే 176 నియోజకవర్గాల్లో పొలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 35,093 అదనంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. -
Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
శ్రీనగర్: ఎన్నికల వ్యయ నివేదికలో చూపిన ఖర్చులో తేడాలున్నాయని బారాముల్లా ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్)కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీచేసింది. తీవ్రవాదులకు నిధులు అందజేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్ను 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి విజయం సాధించారు. కోర్టు రెండు గంటలు పెరోల్ ఇవ్వడంతో ఈనెల 5న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రషీద్ తనకు రూ.2.10 లక్షలు ఖర్చయిందని ఎన్నికల రిజిస్టర్లో చూపారని, అయితే ఎన్నికల పరిశీలకులు నిర్వహించిన సమాంతర రిజిస్టర్లో ఖర్చును రూ.13.78 లక్షలుగా చూపారని ఈసీ తెలిపింది. ఈ వ్యత్యాసంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జిల్లా వ్యయ పర్యవేక్షక కమిటీ ముందు రషీద్ లేదా ఆయన ప్రతినిధి హాజరై వివరణ ఇవ్వాలని, ఈసీకి సకాలంలో ఎన్నికల వ్యయ నివేదికను సమరి్పంచాలని కోరింది. -
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్మాల్కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పెనుగంచిప్రోలులో ఆ నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా క్యాడర్ విడిపోయింది. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం సమావేశమైంది. పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదంటూ బొల్లా రామకృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు. శ్రీరామ్ రాజగోపాల్కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంత వరకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా. నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. టీడీపీ పార్టీ అందరిదీ...తాతయ్య సొత్తు కాదు. శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నా పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా’’ అని బొల్లా రామకృష్ణ హెచ్చరించారు. ఇదీ చదవండి: మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్ -
ఇచ్చాపురం: మరోసారి బయటపడ్డ టీడీపీ, జనసేన విభేదాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురంలో జనసేన, టీడీపీ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. లోకేష్ శంఖారావం సభకు రావొద్దంటూ జనసేన నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. సభకు వస్తున్న జనసేన నేతలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల తీరుపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో అవమానంతో జనసేన నేతలు తిరిగి వెళ్లిపోయారు. లోకేష్ సభలో జనసేన జెండాలు కనబడకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో సభలో జనసేన నేతలు, జెండాలు కనిపించలేదు. కాగా, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. -
2 నిమిషాల్లోనే ప్రసంగం ముగిసింది
తిరువనంతపురం: కేరళలోని వామపక్ష ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గురువారం కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ విధివిధానాలను వివరించాల్సిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగ పాఠంలోని చివరి పేరాను మాత్రమే చదివి కేవలం రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ 9.02 గంటలకల్లా ప్రసంగం ముగించారు. 9.04 గంటలకు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని బిల్లుల పెండింగ్, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
‘కడప’టికి సైకిల్కు శూన్యమే!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. సీనియారిటీకి విలువ ఇవ్వకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటివి టీడీపీకి మైనస్ అవుతున్నాయని పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్, మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇన్చార్జుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వైఖరి ఇలాగే ఉంటే జిల్లాలో గత ఎన్నికల్లోలాగానే తెలుగుదేశానికి మిగిలేది శూన్యమేననే వాదన ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. రీతి లేని రితీష్ బద్వేల్లో ఎప్పటి నుంచో టీడీపీకి విధేయతగా ఉన్న దివంగత కర్నాటి శివారెడ్డి (కర్నాటి వెంకటరెడ్డి), బద్వేల్ మాజీ జెడ్పీటీసీ శిరీష కుటుంబాలతోపాటు, కలశపాడు బాలిరెడ్డి వంటి వారు ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి కొనిరెడ్డి రితీష్కుమార్రెడ్డి తీరు తమకు అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత మంత్రి వీరారెడ్డి హయాం నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను చవిచూస్తున్నారు. పుట్టెడుజిత్తుల.. ‘పుట్టా’ మైదుకూరు నియోజకవర్గం ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఏకపక్ష వైఖరి వల్ల టీడీపీలో తొలి నుంచి ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దువ్వూరు మండల నేత వెంకట కొండారెడ్డిదీ అదే దుస్థితి. డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కూడా రెడ్యం సోదరులు టీడీపీ జెండా కోసం పనిచేశారు. అలాంటి వారినీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారని శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెల్ఫ్ ఫోకస్లో ప్రవీణ్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి కూడా ఒంటెత్తు పోకడలు పోతున్నారు. సీనియర్ నేతలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డిలను విస్మరిస్తూ తను మాత్రమే ఫోకస్ కావాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిల వైఖరికి విస్తుపోతున్న సీనియర్ నేతలు పార్టీలో కొనసాగాలా లేదా? ప్రత్యామ్నాయమార్గం ఏమిటీ? అనే సందిగ్ధంలో ఉన్నారు. మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో విస్తు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్చార్జి మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో తెలుగుతమ్ముళ్లు విస్తుపోతున్నారు. ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉన్న జిల్లా కేంద్రంలో రెచ్చగొట్టే చర్యలకు ఆమె పాల్పడుతున్నారనే ఆవేదన ఆ పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. నాయకురాలిగా ఫోకస్ కావాలనే తపన ఉండొచ్చు కానీ, బహిరంగంగా అధికార పార్టీ క్యాడర్తో వాదనకు దిగడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషాలాంటి స్థాయి ఉన్న వారినీ ఆమె ఏకవచనంతో సంబోధిస్తున్నారని పలువురు ఎత్తిచూపుతున్నారు. సొంత క్యాడర్తో కూడా ఆమె దురుసుగా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. పార్టీ ఇన్చార్జిగా ఇప్పుడే ఇలా ఉంటే, అధికారిక హోదా దక్కితే ఆమెను నియంత్రించడం సాధ్యం కాదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
తూర్పుగోదావరి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముద్దిపాటి వర్సెస్ మళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య ముసలం పుట్టింది. నియోజకవర్గం ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్ ర్యాలీ చేపట్టారు. 500 కార్లతో గోపాలపురం నుంచి అమరావతికి టీడీపీ నాయకులు బయలుదేరారు. చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని మూడు ముక్కలు చేశారంటున్న నేతలు.. ఒంటెద్దు పోకడలతో మద్దిపాటి వ్యవహరిస్తున్నారంటూ మండి పడుతున్నారు. మద్దిపాటిని అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపుతామని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
‘ఇండియా’లో లోక్సభ ఎన్నికల నాటికి ఐక్యత అవసరం
ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపడలంలో సభ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)చీఫ్ శరద్ పవార్ చెప్పారు. అయితే, 2024లో లోక్సభ ఎన్నికల వేళకు ఇవన్నీ సర్దుకుని, ఉమ్మడిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ప్రతిపక్షపార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధమైన మార్పు వస్తుందని చెప్పేందుకు తన వద్ద కచ్చితమైన సమాచారం లేదన్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్ ఉండగా, మరికొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో తలెత్తే విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. -
కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్ప్రీత్సింగ్ నిజ్జర్ హత్య విషయమై భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా 41 మంది దౌత్యవేత్తలను దేశం వీడాల్సిందిగా కేంద్రం ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయాలని కెనడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం ప్రకటించారు. 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలవాల్సి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడ్డ కారణంగా ఈ చర్యకు దిగాల్సి వచి్చందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు మాత్రమే భారత్లో ఉన్నట్టు వివరించారు. భారత్లో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా కొనసాగుతున్న 10 వీసా దరఖాస్తు కేంద్రాలపై తమ నిర్ణయం ప్రభావం పడబోదని తెలిపారు. ఇంతేకాకుండా, చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయడమే గాక, ఆ నగరాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కెనడా తాజాగా తమ పౌరులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. -
జనాదరణ పథకాలకు ఆర్బీఐ డబ్బు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ వి. ఆచార్య తన పుస్తకం కొత్త ఎడిషన్ ‘ముందు మాట’గా రాసిన కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. ‘‘ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి జనాదరణ పథకాల వ్యయాలకు రూ. 2 నుంచి 3 లక్షల కోట్లను పొందాలని కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు చేసిన ప్లాన్ (రైడ్)ను సెంట్రల్ బ్యాంక్ ప్రతిఘటించింది. ఇది స్పష్టంగా ప్రభుత్వం– ఆర్బీఐ మధ్య విభేదాలకు దారితీసింది. సెంట్రల్ బ్యాంక్కు సంబంధిత ఆదేశాలు జారీ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ఎన్నడూ ఉపయోగించని సెక్షన్ 7ను అమలు చేయాలని ఆలోచించే స్థాయికి పరిస్థితి వెళ్లింది’’ అని రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.‘క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా’ శీర్షికతో ప్రజల ముందు ఉంచిన తన పుస్తకం తాజా ఎడిషన్ ముందు మాటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ఆర్థిక లోటు భర్తీకి బ్యాక్డోర్ మానిటైజేషన్’’ అని ఆయన ఈ వ్యవహారాన్ని అభివరి్ణంచడం గమనార్హం. 2017 జనవరి 20వ తేదీ నుంచి 2019 జూన్ వరకూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విరాల్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన డిప్యూటీ గవర్నర్గా మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఫైనాన్షియల్ స్థిరత్వం–రిసెర్చ్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆరు నెలల ముందుగానే ఆయన అప్పట్లో రాజీనామా చేశారు. విరాల్ రాసిన అంశాల్లో కొన్ని... ► ఆర్బీఐ ప్రతి సంవత్సరం తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. 2016 డిమోనిటైజేషన్కు ముందు మూడేళ్లలో ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసింది. ► నోట్ల రద్దు సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చును కేంద్రానికి చేసిన బదిలీల నుంచి మినహాయించింది. ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ నిధుల అవసరాలు మరింత పెరిగాయి. ఈ మొత్తాలను ఆర్బీఐ నుంచి పొందాలని బ్యూరోక్రాట్లు కొందరు ప్రయతి్నంచారు. ► స్వల్పకాలిక ప్రజాకర్షక వ్యయాల కోసం సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్పై దాడి చేసే ప్రణాళికలను పదేపదే ప్రతిపాదించినప్పుడు.. సహేతుకమైన సంస్థలతో కూడిన ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ను కలిగి ఉన్న దేశంలోని ఏ ప్రభుత్వమైనా బలీయమైన ప్రతిఘటనను ఎదుర్కొనకుండా ముందుకు సాగలేదు. ఇలాంటి సందర్భాలే ఒక సహేతుక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ల నుండి ప్రభుత్వానికి భవిష్యత్తులో బదిలీల కోసం సహేతుకమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కావడం ఇలాంటిదే. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి భారీ నిధులు పొందాలని భావించిన వ్యక్తుల్లో పలువురిని ప్రభుత్వం పక్కన బెట్టడం కూడా జరిగింది. 2018లోనే ‘విరాల్’ వెల్లడి.. నిజానికి 2018 అక్టోబర్ 26న ఏడీ ష్రాఫ్ స్మారక ఉపన్యాసం సందర్భంగానే విరాల్ ‘కేంద్రం– ఆర్బీఐ మధ్య విభేదాల విభేదాల అంశాన్ని మొదటిసారి సూచనప్రాయంగా ప్రస్తావించారు. తాజాగా అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ‘‘కేంద్ర బ్యాంకు స్వాతం్రత్యాన్ని గౌరవించని ప్రభుత్వాలు తక్షణం లేదా అటు తరువాత ఆర్థిక మార్కెట్ల ఆగ్రహానికి గురవడం ఖాయం. ఆయా పరిణామాలు ఆర్థిక అనిశి్చతికి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ దెబ్బతినే ప్రమాదానికి దారితీస్తాయి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకేనా..? తాజా అంశాలను విశ్లేíÙస్తే...సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా 2018 డిసెంబర్లో ఉర్జిత్ పటేల్ రాజీనామాకు.. తాజాగా విరాల్ లేవనెత్తిన అంశానికీ ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఉర్జిత్ పటేల్ ‘‘వ్యక్తిగత కారణాలతో’’ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నప్పటికీ దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మూడేళ్ల పదవీ కాలం ముగిసేలోగా తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసిన గవర్నర్గా పనిచేసిన అరుదైన సందర్భం ఆయనది. -
ఎన్నికల్లో కలసికట్టుగా పోరాటం : సచిన్ పైలెట్
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, అసంతృప్త నేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు రూపుమాప డానికి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసికట్టుగా పోరాటం చేస్తామని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్లో ఎన్నికల సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్గాంధీ, ఖర్గే, సచిన్ పైలెట్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాలికి ఫ్రాక్చర్ కావడంతో సీఎం అశోక్ గెహ్లోత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
కమలం పార్టీ శ్రేణుల్లో గుబులు.. నిధుల వాడకం వ్యాఖ్యలతో మైనస్ కానుందా?
ఒక సీటు కోసం ఒకే పార్టీలోని ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటే కొట్లాట తప్పదు. ఇప్పుడు ఆదివాసీల జిల్లాలోని కమలం పార్టీలో ఇదే జరుగుతోంది. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం బీజేపీలో కుస్తీపట్లు మొదలయ్యాయి. ఆదివాసీ ఎంపీ, గిరిజన నేతల మధ్య ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కమలం పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగ వివాదం అటు జిల్లాలో, ఇటు పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఎంపీకి కేటాయించిన నిధుల వినియోగంపై బీజేపీ ప్రజా ప్రతినిధులతో సోయం బాపురావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిదులు ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం వాడుకున్నట్లు చెప్పారు. ఆ వీడియో బయటకి వచ్చి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిధుల వాడకంపై ఎంపీ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసాయి. నిధుల దుర్వినియోగం పై ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తాను ల్యాడ్స్ నిధులు వాడుకోలేదన్నారు.. ఇల్లు నిర్మాణం, కొడుకు పెళ్లి కోసం అణా పైసా వాడుకోలేదని స్పష్టం చేశారు. తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. పార్టీలోనే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ చెప్పారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తనమీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే వారిద్దరికీ గిట్టడంలేదని విమర్శించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తాను ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నానని, అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తనను బీజేపీ నుంచి సాగనంపడానికి ఇదంతా చేస్తున్నారని ఎంపీ సోయం అన్నారు. అదే విధంగా తన ఎంపీ సీటుకు కూడా ఎసరు పెట్టేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మధ్య విభేదాలకు చాలా కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి రమేష్ రాథోడ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేసుకున్నారు. కాని అక్కడి నుంచి రమేష్ రాథోడ్ కాకుండా జడ్పీటీసీ జానుబాయి, హరి నాయక్లకు ఎంపీ సోయం మద్దతిస్తున్నారని సమాచారం. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు చివరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయట. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ సీటు కోసం జిల్లా పరిషత్ చైర్మన్ సుహసిని రెడ్డి కూడా పోటీపడుతున్నారు. ఇక్కడ కూడా ఎంపీ బాపురావు జిల్లా అధ్యక్షుడికి మద్దతివ్వడంలేదట. వీరిద్దరి మధ్యా గతంలో ఒక భూ వివాదం కూడా చోటు చేసుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయంటున్నారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్పందించారు. తనపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఎంపీకి తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎంపీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దమన్నారు రమేష్ రాథోడ్. జిల్లాలో పార్టీ ఎంపీ, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగితే ఫైనల్గా నష్టపోయేది పార్టీయేనని అక్కడి కాషాయ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల మధ్య విభేదాలు తొలగించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. -
పర్చూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. కారంచేడు మండల టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గురువారం నిర్వహించిన భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమం దీనికి వేదికైంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఓ వర్గానికి కొమ్ముకాయడంతో రెండో వర్గం నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో గురువారం రోడ్డెక్కారు. ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకున్నారు. స్థానిక నేత అక్క య్య చౌదరికి మద్దతుగా నిలిచిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేశా రు. గంటకు పైగా కారంచేడులో టీడీపీ నేతల వీరంగం కొనసాగింది. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అనూరాధతోపాటు పలువురు టీడీపీ ముఖ్యనేతల సమక్షంలోనే విభేదాలు రచ్చకెక్కడం గమనార్హం. నేపథ్యమిదీ భవిష్యత్కు గ్యారెంటీ పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమం గురువారం కారంచేడు చేరింది. తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ అక్కయ్యచౌదరి టీడీపీ కార్యాలయంలోకి వచ్చి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కోరారు. ఎమ్మెల్యే అందుకు అంగీకరించకపోవడంతో రావాల్సిందేనని అక్కయ్యచౌదరి పట్టుబట్టాడు. బస్సులోంచి దిగిన ఎమ్మెల్యే కార్యాలయం బయటే నిలబడి కార్యకర్త ఇచ్చిన జెండా నిలబెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అక్కయ్యచౌదరి వర్గం ఎమ్మెల్యే ఎగురవేసిన టీడీపీ జెండాను అక్కడికక్కడే పీకేశారు. పార్టీ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే డౌన్డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘పార్టీ వద్దు.. బొక్కా వద్దు’ అంటూ చిందులు తొక్కారు. పార్టీ పదవికి రాజీనామా ఈ ఉదంతంతో పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కయ్యచౌదరి ప్రకటించారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీని అనునిత్యం కాపాడుకుంటూ ఆర్థికంగా ఎంతో నష్టపోయానన్నారు. ఇంత కష్టపడినా ఎమ్మెల్యే వద్ద తనకు కనీస గౌరవం దక్కడం లేదన్నారు. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తూ పార్టీని పాడు చేస్తున్నాడని వాపోయారు. ఈ విషయంపై అధిష్టానంతోనే తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. కారంచేడుకు చెందిన సీనియర్ నేత అక్కయ్యచౌదరి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలంలో బలమైన నాయకుడైన ఆయన గతంలో కారంచేడు ఎంపీపీ, పర్చూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పదవులు చేపట్టారు. ప్రస్తుతం కారంచేడు–2 ఎంపీటీసీగా ఉన్నారు. కాగా, అక్కయ్యచౌదరికి వ్యతిరేకంగా ఇదే మండలానికి చెందిన పార్టీ మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి ప్రహ్లాదరావు ప్రత్యేకంగా గ్రూపు కట్టా రు. అక్కయ్య చౌదరి వ్యతిరేక వర్గీయులను చేరదీశారు. దీంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదా లు తారస్థాయికి చేరగా.. తాజాగా రోడ్డునపడ్డాయి. -
గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్ జంక్షన్లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడ నుంచి జారుకున్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి.. అసలు ఎందుకీ వివాదం?
బనశంకరి/ శివాజీనగర(కర్ణాటక): కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్ మధ్య సోషల్ మీడియా యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా మౌద్గిల్ ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో ఆదివారం పలు పోస్ట్లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్గా ఉన్నారు. నాకు ఏజీ ఎందుకు వాదించలేదు? గతేడాది మైసూరు కలెక్టర్గా పనిచేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్లో కేసు వేయగా, ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్ చేశారు. తాను 3 సంవత్సరాల కిందట యాదగిరిలో పనిచేసి, బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు అన్నారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్లకు పంపించారని, ఇది సర్వీస్ రూల్స్ను అతిక్రమించడమేనని, ఇంకా అనేక ఆరోపణలను రూపా సంధించారు. మానసిక వైద్యం చేయించుకో: రోహిణి ఆగ్రహం ఐపీఎస్ రూప నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై న్యాయపోరాటం చేస్తానని ఐఏఎస్ రోహిణి సింధూరి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు. రూపా మౌద్గిల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నేను వ్యక్తిగత ఫొటోలను ఎవరికి పంపించాను అనేది ఆమె బహిరంగపరచాలని, బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇష్టానుసారం నా ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారం రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చదవండి: ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి -
కొంప ముంచిన ‘చంద్రబాబు’ టూర్.. ‘సీట్లు’ సితారయ్యేలా సిగపట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీని బలోపేతం చేస్తామంటూ వచ్చిన చంద్రబాబు తమను గోదాట్లో ముంచి పోతున్నట్టుగా ఉందని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సీట్లకు సెగ పెట్టేందుకే ఆయన వచ్చినట్టుగా ఉందని నియోజకవర్గ ఇన్చార్జిలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన వల్ల ప్రయోజనం మాట దేవుడెరుగు.. కొత్త సమస్యలతో తల బొప్పి కట్టిందంటున్నారు. చంద్రబాబు పర్యటనలో టీడీపీ విభేదాలు రచ్చకెక్కి సిట్టింగ్ల సీట్లకు సెగ తగిలింది. తొలి రోజు బుధవారం రాజానగరంలో మొదలైన విభేదాలు చివరి రోజైన శుక్రవారం పెద్దాపురంలో కూడా కొనసాగాయి. అధినేత పర్యటనతో సీన్ రివర్స్ అయ్యిందని ఇన్చార్జిలు తల పట్టుకుంటున్నారు. వర్గ విభేదాలపై నియోజకవర్గ కార్యకర్తల సమీక్షల్లో చంద్రబాబు దాటవేశారని క్యాడర్ పెదవి విరుస్తున్నారు. రాజానగరంలో కేరాఫ్ లేదు చంద్రబాబు తీరుతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ రాజానగరం ఇన్చార్జి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తప్పుకున్న తరువాత ఆ పార్టీకి అక్కడ దిక్కు లేకుండా పోయింది. మరొకరిని ప్రకటిస్తారని ఎదురు చూశారు. పుట్టి మునిగిపోతున్న పార్టీ బరువు మోయడానికి నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ తరుణంలో తమ సామాజికవర్గానికే సీటు ఇవ్వాలంటూ బీసీకి చెందిన బార్ల బాబూరావు అసమ్మతి గళం వినిపించారు. పెందుర్తి అనుయాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు తనకాల నాగేశ్వరరావు, వ్యతిరేక వర్గం నుంచి బర్ల బాబూరావు మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఎవరూ దిక్కులేక ఇన్చార్జిగా తమ నేతనే కొనసాగిస్తున్నారని పెందుర్తి వర్గం బాహాటంగా చెప్పడమే వివాదానికి కారణమైంది. అందుకే కోరుకొండలో చైతన్య రథం పైకి చంద్రబాబు పిలిచినా పెందుర్తి వెళ్లలేదని తెలిసింది. వర్మా.. ఇదేం ఖర్మ! పిఠాపురం టీడీపీలో తిరుగులేని నాయకుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు తొలిసారి పెద్ద షాక్ తగిలింది. ఆయన వ్యవహార శైలితో విసుగెత్తిపోయిన వారందరూ ఒక్కటై జగ్గంపేటలో చంద్రబాబును కలిసి అసంతృప్తి గళం వినిపించారు. ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు వర్మతో విభేదిస్తున్నారు. ఈ వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. వర్మ అసంతృప్తి వాదులు బాబును కలవడానికి నవీన్ ఆశీస్సులు లేకపోలేదని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరొచ్చినా నవీన్ కలుపుతారని ఆ వర్గం సమర్థించుకుంటోంది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురం నుంచి ఆ సామాజికవర్గ నేతలు నవీన్ను ప్రతిపాదిస్తున్నారు. అందుకే 40 కార్లలో వెళ్లి, వర్మకు సీటిస్తే పని చేసేది లేదని ఆయన వ్యతిరేకులు తమ అధినేతకు తెగేసి చెప్పారు. వర్మ సీటుకు ఎసరు పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయని వినికిడి. మాజీ ఎమ్మెల్యే వర్మకు వ్యతిరేకంగా గళం విప్పిన తమ్ముళ్లు ప్రత్తిపాడులో రోడ్డెక్కిన నిరసన టీడీపీ ప్రత్తిపాడు ఇన్చార్జి వరుపుల రాజాకూ నిరసన సెగ తాకింది. రాజాను తప్పించాలంటూ ఆ పార్టీ నేతలు ఏలేశ్వరం మెయిన్ రోడ్డులో ఎనీ్టఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించే వరకూ వెళ్లారు. బీసీ నేత పైల సుభాష్ చంద్రబోస్కు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఏపూరి శ్రీను, రొంగల సూర్యారావు తదితరులు రచ్చ చేశారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అంతా సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూయేనని రాజా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతుల మద్దతు లేకుండా బోస్ అంతటి సాహసం చేయలేరని అంటున్నారు. గత ఎన్నికల్లో నెహ్రూ తనయుడు, పార్టీ ప్రస్తుత కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్కు ఎంపీ సీటు రాకుండా రాజా అడ్డు పడ్డారనే చర్చ పార్టీలో ఉంది. పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ద్వారా మంత్రాంగం నడిపినందువల్లనే ఇప్పుడు బోస్ ద్వారా రాజాపై తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారని తెలుస్తోంది. బోస్కు ప్రమాదం జరిగితే జ్యోతుల పరామర్శకు రావడం, జగ్గంపేటలో నవీన్ పాదయాత్రకు బోస్ తరచూ వెళ్లి మద్దతు తెలపడం వీరి అవగాహనను చాటుతున్నాయి. రాజప్పా.. మాకొద్దప్పా.. కాకినాడ జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు పక్కన ఉండగానే ఈయనకు పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తాకింది. రోడ్షో వేట్లపాలెం వెళ్లేసరికి మాజీ ఎమ్మె ల్యే దివంగత బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు ‘టీడీపీ ముద్దు – చినరాజప్ప వద్దు’ అంటూ నిరసనకు దిగారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన భాస్కర రామారావు స్థానే చినరాజప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి చినరాజప్పను ఎమ్మెల్యేను చేయాలని గురువారం రాత్రి పెద్దాపురంలో బాబు ప్రకటించారు. చదవండి: టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే.. దీంతో ఆశవహుల్లో అసంతృప్తి రాజుకుంది. పెద్దాపురం టిక్కెట్టు రేసులో చినరాజప్ప కాకుండా బొడ్డు సామాజికవర్గం నుంచి వెంకట రమణ, గుణ్ణం చంద్రమౌళి ఉన్నారు.æ చంద్రబాబు ప్రకటన ఆ వర్గీయుల్లో అసంతృప్తి రాజేసింది. వేట్లపాలెంలో తన కళ్లెదుటే చోటు చేసుకున్న ఈ పరిణామంతో అవాక్కైన చంద్రబాబు.. ఇది పద్ధతి కాదు అంటూనే దివంగత భాస్కర రామారావు సేవలను కొనియాడుతూ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా ‘రాజప్పా గోబ్యాక్’ అంటూ వ్యతిరేకులు నినాదాలు చేశారు. మొత్తంమీద చంద్రబాబు మూడు రోజుల పర్యటనతో నియోజకవర్గ ఇన్చార్జిలు కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారయ్యారు. -
స్టార్ హీరో విజయ్తో నాకు విభేదాలు ఉన్న విషయం నిజమే : తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్కు తండ్రి చంద్రశేఖర్తో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య విజయ్ తన సొంత తండ్రిపైనే ఫిర్యాదు చేయడం, అప్పట్లో కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ వారిమధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. తాజాగా విషయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. ఓ తమిళ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడుకుతో సరిగ్గా మాటలు లేవని చెప్పారు. తండ్రీ-కొడుకుల మధ్య సాధారణంగా ఉన్నట్లే మా మధ్య కూడా చిన్నచిన్న అభిప్రాయ బేధాలు ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా సరిగ్గా మాటల్లేవు. కానీ విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి. ఆమధ్య విజయ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని మీడియా రచ్చ చేసింది. కానీ నిజానికి విజయ్తో నాకు అంత తగాదాలు లేవు. దీని గురించి చర్చించాల్సిన పెద్ద విషయం కాదు. విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు మొన్నీమధ్య విజయ్తో కలిసే వారీసు సినిమా చూశాను. ఇది చాలు కదా.. మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పడానికి అంటూ విజయ్ తండ్రి చెప్పుకొచ్చారు. కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపైనే తండ్రీ-కొడుకులను విభేదాలు వచ్చాయి. దీంతో తండ్రి నిర్వహించే పొలిటికల్ ఈవెంట్స్కి తనకు సంబంధం లేదని స్వయంగా విజయ్ పేర్కొన్నారు. -
జమునని బాయ్కాట్ చేసిన ఎన్టీఆర్-ఏఎన్నార్.. అయినా లెక్కచేయని నటి
గడుసుతనం కలబోసిన సౌందర్యానికి పెట్టింది పేరు జమున. వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన జమున సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. పొగరు, భక్తి, విలనిజం ఇలా నవరసాలు పలకించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె కోసమే కొన్ని పాత్రలు పుట్టాయేమో అనేంతలా నటించి మెప్పించారు. ఆనాటి స్టార్ హీరోలందరితో జతకట్టిన జమున కెరీర్ సాఫీగా సాగుతున్న దశలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్తో విభేదాలు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై జమునతో నటించమని ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాయ్కాట్ కూడా విధించారు. దీంతో ఇక జమున కెరీర్ ముగిసిపోతుందేమో అనుకున్నారంతా. అయినా సరే చేయని తప్పుకు సారీ చెప్పేది లేదంటూ భీష్మించుకున్న తీరు ఆమె ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది. అగ్రస్థాయి హీరోలు పక్కన పెట్టినా లెక్కచేయకుండా హరనాథ్, జగ్గయ్య వంటి హీరోలతో నటించి వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత గుండమ్మ కథ సినిమా కోసం అప్పటి నిర్మాత చక్రపాణి జోక్యం చేసుకొని స్టార్ హీరో,హీరోయిన్ల మధ్య విభేదాలు సరైనవి కావని కాంప్రమైజ్ చేయడంతో జమున గుండమ్మ కథలో నటించారు. ఎన్టీఆర్కు జోడీగా సావిత్రి, ఏఎన్నార్ సరసన జమున అలరించారు. సావిత్రి సౌమ్యంగా నటించిన తీరు, జమున కొంటెతనంతో పలికించిన సంభాషణలు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ చిరస్మరణీయమే. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ -
పార్టీలో విభేదాలపై బీఆర్ఎస్ దృష్టి
-
మంకీపాక్స్-చికెన్పాక్స్ తేడాలు తెలుసా?
కరోనా కథ తగ్గుముఖం పడుతుందనుకున్న టైంలో.. మంకీపాక్స్ వైరస్ కలకలం మొదలైంది. కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితం అయ్యిందనుకున్న ఈ వైరస్.. యూరప్, అమెరికా ఖండాల్లో కేసులతో కలకలం రేపుతోంది. ఇప్పుడు భారత్లోనూ కేసులు వెలుగు చూస్తుండడం, తాజాగా కేరళలో ఒక మరణం నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో కలకలం.. అంటూ నిత్యం ఏదో మూల దేశంలో ఇప్పుడు ఇది వినిపిస్తోంది. దీనికి తోడు వ్యాధి లక్షణాలు కనిపించిన వాళ్లకు.. మంకీపాక్స్ సోకిందేమో అని అధికారులు హడలిపోతుండడం, వైరస్ నిర్ధారణకు శాంపిల్స్ను పంపిస్తుండడం.. చూస్తున్నాం. అయితే నెగెటివ్గా తేలిన కేసులన్నీ చాలావరకు చికెన్పాక్స్ కావడం ఇక్కడ అసలు విషయం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, యూపీ.. ఇలా చాలా చోట్ల వైరస్ భయంతో పరీక్షించగా.. నెగెటివ్గా తేలడం, అవన్నీ చికెన్పాక్స్ కేసులు కావడం గమనార్హం. అయితే.. మంకీపాక్స్ లక్షణాలు చాలా వరకు చికెన్ పాక్స్ తరహాలోనే ఉండటంతో గందరగోళం నెలకొంటోంది. వర్షాల నేపథ్యంలో చికెన్ పాక్స్ విస్తరిస్తుండడంతోనే ఇదంతా. పైగా లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. చికెన్ పాక్స్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుండడమే అందుకు కారణం. రెండింటి తేడా తెలుసుకుంటే.. కొంతవరకు ఆందోళన తగ్గవచ్చు. చికెన్ పాక్స్ లక్షణాలు ► ముందుగా చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► ఆ తర్వాత జ్వరం లక్షణం కనిపిస్తుంది. ► చికెన్ పాక్స్ లో దద్దుర్లు కాస్త చిన్నగా ఉంటాయి. విపరీతంగా దురద ఉంటుంది. ► అరచేతులు, పాదాల దిగువన దద్దుర్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ. ► చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు..పొక్కులు ఏడెనిమిది రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. మంకీపాక్స్ లో .. ► మంకీపాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి, కొందరిలో దగ్గు, గొంతు నొప్పి, లింఫ్ నాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ► సుమారు నాలుగు రోజుల తేడాలో చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► మంకీపాక్స్లో దద్దుర్లు పెద్దగా ఉంటాయి. దురద ఎక్కువగా ఉండదు. ► పొక్కులు ముందుగా చేతులు, కళ్ల వద్ద ఏర్పడి.. తర్వాత శరీరమంతా విస్తరిస్తాయి. ► మంకీ పాక్స్ లో అర చేతులు, పాదాలపైనా దద్దర్లు వస్తాయి. ► చాలా మందిలో 21 రోజుల వరకు కూడా అవి ఏర్పడుతూనే ఉంటాయి. ► జ్వరం కూడా ఎక్కువ రోజుల పాటు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇక.. ఆందోళన వద్దు, కానీ.. మంకీ పాక్స్, చికెన్ పాక్స్ రెండూ కూడా ప్రమాదకరం కాదని, మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండింటిలో దేని లక్షణాలు గుర్తించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఒక్కోసారి వ్యక్తుల రోగ నిరోధక శక్తిని(ఇమ్యూనిటీ) బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఏ అనారోగ్యమైనా సరే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
టీఎంసీ కార్యవర్గం రద్దు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్లో నానాటికీ పెరిగిపోతున్న అసమ్మతిని, యువ–సీనియర్ విభేదాలను కట్టడి చేయడంపై పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో 20 మందితో నూతన జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు యువ, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. కొత్త కార్యవర్గాన్ని మమత త్వరలో ప్రకటిస్తారని సీనియర్ నాయకుడు పార్థ బెనర్జీ మీడియాకు తెలిపారు. భేటీలో అభిషేక్ కూడా పాల్గొన్నారు. తృణమూల్లో వృద్ధ, యువతరం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అభిషేక్ నాయకత్వంలో యువ నేతలు ‘ఒక వ్యక్తికి ఒకే పోస్టు’ నినాదాన్ని తెరపైకి తేవడం తెలిసిందే. జోడు పదవుల్లో ఉన్న పలువురు సీనియర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
వర్క్ఫ్రమ్హోంకి ఇక వేరే జీతం!!
న్యూఢిల్లీ: కొవిడ్-19 ప్రభావం నుంచి కుదేలుకాకుండా ఐటీ రంగం కాస్తో కుస్తో జాగ్రత్త పడగలిగింది. భద్రత దృష్ట్యా ఉద్యోగులకు వర్క్ఫ్రమ్హోం వెసులుబాటు కల్పిస్తూనే.. ఇంకా ఎక్కువే అవుట్పుట్ రాబట్టుకుంటున్నాయి ఐటీ కంపెనీలు. అయితే ఆఫీస్ వర్క్కి-రిమోట్ వర్క్కి ఇక మీదట ఒకే రకమైన పే స్కేల్ ఉండకూడదని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గూగుల్ మొదటి అడుగు వేసింది. జీతభత్యాల విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల జీతభత్యాల విషయంలో గూగుల్ కొత్తగా ఒక టూల్ను ప్రవేశపెట్టింది. వర్క్ లొకేషన్ టూల్గా పిలుచుకుంటున్న ఈ టూల్.. సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో కాస్ట్ ఆఫ్ లివింగ్(జీవన వ్యయం), లోకల్ జాబ్ మార్కెట్ తదితర అంశాలను ఆ టూల్ పరిగణనలోకి తీసుకుంటుంది. అలా ఆ ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలన్నది అడ్జస్ట్చేసి ఆ టూల్ లెక్కగట్టి చెప్తుంది. దీనితో పాటు వాళ్లకు అదనంగా ఇంకేం అందించాలనేది కూడా ఈ టూలే నిర్ణయిస్తుంది. దీనిప్రకారం ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేసుకోవాలి? అనేది వాళ్ల స్వేచ్ఛకే వదిలేస్తున్నామని, అవసరమైతే బదిలీకి వెసులుబాటు కూడా కల్పిస్తామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా లక్షన్నరకి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్లలో 60 శాతం మంది ఆఫీసులకే వచ్చే సూచనలు ఉన్నాయని గూగుల్ అంచనా వేస్తోంది. మరో 20 శాతం కొత్త ఆఫీస్ లొకేషన్స్లో పనికి సిద్ధం కావొచ్చని, మరో 20 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం మీదే పని చేయొచ్చని అంచనా వేస్తోంది. చదవండి: కరోనా టైంలో గూగుల్ భారీ సాయం -
మళ్లీ తెరపైకి అయ్యన్న సోదరుల విభేదాలు
నర్సీపట్నం : మాజీ మంత్రి అయ్యన్న సోదరుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్సార్సీపీలో చేరిన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు) తన ఇంటిపై పార్టీ జెండా కడుతుండగా అడ్డుతగలడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న కుటుంబంలో విభేదాలు నెలకొనడంతో ఇటీవల సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన అనుచరగణంతో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి మాదిరిగానే ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గురువారం ముహూర్తం చూసుకుని తాను నివాసముంటున్న ఇంటిపై సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ జెండా కడుతుండగా వరుసకు చిన నాన్నమ్మ అయిన పెదపాత్రుని లక్ష్మి, మరో బంధువు హర్ష వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న లక్ష్మి స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. తన ఇంటిపై జెండా కడుతుండగా అడ్డుకుంటున్నారని, అదేవిధంగా మాజీ మంత్రి తనయుడు విజయ్, మరో బంధువు హర్ష వల్ల తనకు ప్రాణహాని ఉందని వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా అస్వస్థతకు గురైన లక్ష్మి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు సన్యాసిపాత్రుడు, అయ్యన్న నివాసం వద్ద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులపై అయ్యన్న దురుసుతనం కాగా ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్న విరుచుకుపడ్డారు. ‘తమాషాగా ఉందా.. మేం కోడితే ఏమిచేస్తావు నీవు.. మర్యాదగా వెళ్లిపొండి..పద్ధతి గల మనుషులము మేము..మా ఇంటికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా రాకూడదు..ఎవరిచ్చారు నీకు అనుమతి?’ అంటూ పోలీసులపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడుతూ దబాయించారు. -
దీపావళి : ఉత్తర, దక్షిణ భారతాల్లో తేడాలు
సాక్షి : దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి గెలిచిన దానికి ప్రతికగా ఈ దీపావళిని జరుపుకుంటారు. దీపావళి పండుగ పేరు వినగానే టక్కున గుర్తోచ్చేవి టపాసులు, స్వీట్స్, దీపాలు, కొత్త బట్టలు. కానీ అవే కాకుండా వ్రతాలు, పూజలు అని ఇంకా చాలా ఉన్నాయ్. దీపావళి అంటే చిన్న, పెద్ద, పేద, ధనిక, అనే వర్గం లేకుండా భారత ప్రజలంతా ఉత్సహంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో నాలుగు నుంచి ఐదు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా మన దక్షిణా భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో దీపావళిని జరుపుకోవడంలో కొన్ని తేడాలున్నాయి. తేడాలు - పోలికలు ఉత్తర భారతంలో ఈ పండగను ఐదు రోజులు జరుపుకుంటే దక్షిణంలో నాలుగు రోజులు జరుపుకుంటారు. పేరు కూడా ఉత్తరంలో దీవాళి అంటే దక్షిణంలో దీపావళి అని అంటారు. రెండూ ఒకటే పండుగను సూచిస్తాయి. ఉత్తరంలో ధన్తెరాస్ పండుగకు బంగారం కొనడం సెంటిమెంట్. ధన్ అంటే ధనము. తేరాస్ అంటే పదమూడో రోజు అని అర్థం. పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చే క్రమంలో పదమూడో రోజు దీపావళి పండుగ ప్రారంభమవుతుందని దాని అర్ధం. దక్షిణంలో ఆ సంస్కృతి మొదట్లో లేదు. కానీ ఇప్పుడిప్పుడే సౌత్లో కూడా బంగారం కొంటున్నారు. దీనికి ఉత్తరాది ప్రజలు దక్షిణాదికి వలస రావడం కారణం కావచ్చు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆత్మీయులను, బంధువులను పిలిపించి ఆతిథ్యమివ్వడం, స్వీట్లు, తినుబండారాలు, పిండివంటలు, ఇంట్లో దీపాలు వెలిగించడం వరకు అంత ఒకేలా ఉంటాయి. దాంతో పాటు టపాసులు, చిచ్చుబుడ్లు పేల్చడం నేడు దేశమంతా సాధారణమైపోయింది. అసలు దీపావళి పండుగను మొదటినుంచీ ఉత్తర భారతంలోనే చాలా ప్రత్యేకంగా జరపుకుంటారు. లక్ష్మీదేవీకి నిష్టగా పూజలు, వ్రతాలు చేసుకుని ఆ తర్వాత వారి బంధుమిత్రులను పూజలకు, వ్రతాలకు ఆహ్వానించడం, ఆ తర్వాత అంతా కలిసి ఒక చోట చేరి సాయంకాలం టసాసులు పేల్చి ఆనందోత్సహాలతో దీపావళి వేడుకను జరుపుకుంటారు. అలాగే మన దక్షిణ భారతంలో కూడా మొదటినుంచి పూజలు, వ్రతాల సంస్కృతి ఉన్నప్పటికీ బంధుమిత్ర సమేతంగా ఉత్తర భారతీయులు జరుపుకనేంత ప్రత్యేకంగా జరుపుకునే వారు కాదు. బంధుమిత్రులతో కలిసి కాకుండా వారి కుటుంబాలతో మాత్రమే జరుపుకునే వారు. మన దక్షిణాదిన దీపావళి పండుగకు చేసుకునే నోములు, వ్రతాలు వంటి వాటికి వారి కుటుంబీకులు తప్ప వేరే వారు ఉండకూడదన్న నమ్మకంతో ఉంటారు. కానీ ఇప్పుడు కాలానుగుణంగా ఉత్తర భారతీయులను చూసి వారి సంస్కృతిని మన దక్షిణాది ప్రజలు కూడ అవలంబిస్తున్నారు. అయితే మార్వాడి వంటి కొన్ని తెగల్లో దీపావళికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఉత్తర భారతదేశంలో వీరి లాంటి జాతులు, తెగల వారికి దీపావళి రోజునే కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. దక్షిణ భారతదేశం, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో దసరాకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఉత్తరాది వారికి దీపావళి అలాంటిది. ఆహారం విషయానికొస్తే సాధారణంగా ఏ పండుగకైనా ఇంట్లో మాంసాహారంతో విందు చేసుకుంటారు. కానీ, దీపావళి పండుగకు మాత్రం ఉత్తర భారతంలో పూర్తి శాఖాహారానికే పరిమితమవుతారు. దక్షిణాదిలో కూడా శాఖాహారానికే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే దీపావళి పండుగ రోజు ప్రతీ ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తారు. దీపాలు వెలిగించి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇదీగాక, దీపావళి ముగిసిన తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దక్షిణాదిలో ఈ మాసం ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది. -
‘ఇండిగో’లో ఇంటిపోరు!!
న్యూఢిల్లీ: ఒకదాని వెంట ఒకటిగా దేశీ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రుణ సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిల్చిపోగా.. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పనితీరు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై వ్యవస్థాపకులు రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా మధ్య భేదాభిప్రాయాలు పొడచూపినట్లు సమాచారం. అయితే, గత కొద్ది వారాల్లో తీవ్రత మరింత పెరిగినప్పటికీ, పరిస్థితి లీగల్ కేసుల స్థాయిలో మాత్రం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. విభేదాల పరిష్కారం కోసం ఇరు వర్గాలు న్యాయ సలహా సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు వివరించాయి. లీగల్ సేవలందించే సంస్థలు ఖైతాన్ అండ్ కో, జే సాగర్ అండ్ అసోసియేట్స్ ఇందులో తోడ్పడుతున్నాయి. ఇద్దరూ కూడా ఈ సంస్థలకు పాత క్లయింట్లే కావడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు రెండు సంస్థలూ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇండిగో కార్యకలాపాల విస్తరణ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ నిల్చిపోవడంతో చార్జీల ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ఇండిగో వివాదం ముదిరితే దేశీ విమానయాన రంగంపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దూకుడుగా గంగ్వాల్... ఆచితూచి భాటియా 2006లో భాటియా, గంగ్వాల్ కలిసి ఇండిగోను ఏర్పాటు చేశారు. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ పేరుతో దీని మాతృసంస్థ 2013లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. దేశీ ఏవియేషన్ మార్కెట్లో దీనికి 44 శాతం వాటా ఉంది. వ్యవస్థాపకుల్లో ఒకరైన గంగ్వాల్ విషయానికొస్తే.. యునైటెడ్ ఎయిర్లైన్స్, యూఎస్ ఎయిర్వేస్లో ఆయనకు సుదీర్ఘానుభవం ఉంది. దూకుడు వ్యూహాలతో ఇండిగోను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా నిలపడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మేనేజ్మెంట్లోనూ మార్పులు, చేర్పులతో కంపెనీని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్తరణ ప్రణాళికల విషయంలో వేగంగా దూసుకుపోవాలన్నది గంగ్వాల్ అభిప్రాయం కాగా.. ఆచి తూచి అడుగేయాలని భాటియా భావిస్తారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా పలు సందర్భాల్లో ఇరువురి మధ్య విభేదాలు బైటపడ్డాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో భాటియాకు 38, గంగ్వాల్కు 37 శాతం వాటాలున్నాయి. షేరు పతనం.. ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్లు గురువారం ఏకంగా 9 శాతం దాకా పతనమయ్యాయి. బీఎస్ఈలో 8.82 శాతం నష్టంతో రూ.1,466.60 వద్ద క్లోజయ్యాయి. ఒక దశలో 9.82 శాతం నష్టంతో రూ. 1,450.50కి కూడా షేరు తగ్గింది. అటు ఎన్ఎస్ఈలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేరు 8.40 శాతం తగ్గి రూ. 1,475 వద్ద ముగిసింది. షేరు ధర గణనీయంగా క్షీణించడంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ ఏకంగా రూ.5,456 కోట్లు తగ్గి రూ. 56,377 కోట్లకు పరిమితమైంది. బీఎస్ఈలో 3.70 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 70 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తలపై వివరణనివ్వాలంటూ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు బీఎస్ఈ సూచించింది. ప్రణాళికలు యథాతథం: సీఈవో ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఉద్యోగులకు భరోసానిచ్చే క్రమంలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ సీఈవో రొణొజొయ్ దత్తా తమ సిబ్బందికి ఈమెయిల్ పంపారు. కంపెనీ వృద్ధి వ్యూహాలు యథాతథంగానే ఉన్నాయని, వీటి అమలుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి మేనేజ్మెంట్కు పూర్తి మద్దతుందని ఆయన పేర్కొన్నారు. ‘మన ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఆరోపణల వార్తల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే, సంస్థ వృద్ధి వ్యూహాల్లో ఎటువంటి మార్పు లేదని మీకు భరోసా ఇవ్వదల్చుకున్నాను. ప్రణాళికలను అమలు చేయడానికి మేనేజ్మెంట్కు బోర్డు నుంచి పూర్తి మద్దతు కూడా ఉంది‘ అని ఈమెయిల్లో దత్తా పేర్కొన్నారు. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులతో పాటు సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ ప్రయోజనం చేకూర్చడంపైనే ఇకపైనా దృష్టి పెడతామని ఆయన తెలిపారు. -
రెండు మూడు అంశాల్లో ఆర్బీఐతో విభేదాలు
ముంబై: రెండు మూడు విషయాల్లో ఆర్బీఐతో ప్రభుత్వానికి అంతరాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. ఆర్బీఐ పనితీరుపై చర్చను దెబ్బతీయడంగా ఎలా అభివర్ణిస్తారని జైట్లీ ప్రశ్నించారు. రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో... గతంలోనూ ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ఆర్బీఐ గవర్నర్లను రాజీనామా చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ముంబైలో టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన భారత ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా జైట్లీ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో రుణాల లభ్యత, ద్రవ్యపరమైన మద్దతు విషయాల్లో ఆర్బీఐతో విభేదాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వం తన ఆందోళనలను తెలియజేసేందుకు చర్చలను ప్రారంభించినట్టు తెలిపారు. ఓ కీలకమైన సంస్థగా ఆర్బీఐతో చర్చలు జరపడం దెబ్బతీయడం అవుతుందా? అని ప్రశ్నించారు. ‘‘మాది సౌర్వభౌమ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో చాలా ముఖ్యమైన భాగస్వాములం’’ అని జైట్లీ అభివర్ణించారు. రుణాలు, లిక్విడిటీ విషయంలో ఆర్బీఐపై బాధ్యత ఉందన్నారు. -
‘అలా పిలిస్తే ఇబ్బందిగా ఉంటోంది’
చేసే పని ఒక్కటే అయినప్పుడు వేతనం కూడా ఒకే రకంగా ఇవ్వాలి. కానీ అలా ఉండటం లేదు. ఈ వివక్షతకు వ్యతిరేకంగా ఈ మధ్యే ఉద్యమాలు కూడా వస్తోన్నాయి. ఈ పరిస్థితి అంతటా ఉంది. అయితే మిగితా చోట్ల కన్నా సినీ పరిశ్రమలో ఈ వ్యత్యాసం ఇంకాస్తా ఎక్కువే. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పిడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నహీరోయిన్గా దీపికా పదుకొనే రికార్డు సృష్టించారు. ‘పద్మావత్’ సినిమాకు గాను దీపికా, రణ్వీర్ సింగ్, షాహీద్ కపూర్ల కన్నా ఎక్కువ పారతోషికం తీసుకున్నారు. ఈ విషయం గురించి బాలీవుడ్ ‘కింగ్ ఖాన్’ షారుక్ ఖాన్ తొలి ప్రాధన్యత మహిళలకే ఇవ్వాలి.. వారికే ముందు గుర్తింపు దక్కాలి.. వారి తర్వాతే మేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇది పురుషాధిక్య సమాజం. ఉన్నపళంగా దీన్ని మార్చడం కుదరదు. అలా అని పట్టించుకోకుండా ఉండలేం. కష్టపడే విషయంలో హీరో - హీరోయిన్ అంటూ తేడా లేనప్పుడు పారితోషికం విషయంలో వ్యత్యాసం ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు. షారుక్ మాట్లాడుతూ.. ‘ప్రతిభ ఆధారంగా వేతనం ఉండాలి.. కానీ స్త్రీనా, పురుషుడా అనే దాన్ని బట్టి తేడాలు చూపకూడదు’ అన్నారు. అంతేకాక ‘బాలీవుడ్లో నా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఇక్కడ మాధురి దీక్షిత్, జూహీ చావ్లా, శ్రీదేవి లాంటి ఎందరో గొప్ప హీరోయిన్లు ఉన్నారు. వారందరిని వదిలిపెట్టి నన్ను స్టార్ అనడం సమంజసం కాదు. ఎవరైనా నన్ను స్టార్ అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఏ విషయంలోనైనా లేడీస్ ఫస్ట్ అంటాం. అలాంటిది సినిమా ప్రారంభంలో పేర్లు వచ్చే సమయంలో మాత్రం హీరోయిన్ల పేరు హీరోల పేరు తర్వాతే వస్తోంది. మరి ఇదేం న్యాయం. అందుకే నా సినిమాల్లో ముందు హీరోయిన్ పేరు వేసి.. ఆ తర్వాత నా పేరు వేయడం ప్రారంభించాను’ అని తెలిపారు. -
హెచ్సీఏలో గొడవ ముదిరింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కార్యదర్శి శేష్ నారాయణ్, జి.వివేకానంద్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు అవినీతి, నిధుల గోల్మాల్వంటి అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించిన ఇరు వర్గాలు ఇప్పుడు జట్టు ఎంపిక విషయంలో కూడా తమ అహాన్ని బయట పెట్టాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) ఒక టోర్నీ నిర్వహిస్తోంది. 2018–19 రంజీ సీజన్ సన్నాçహాల్లో భాగంగా జరిగే ఈ టోర్నీలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్లపై సందిగ్ధత నెలకొంది. అటు కార్యదర్శి, ఇటు అపెక్స్ కౌన్సిల్ రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. మాదంటే మాదే అధికారిక జట్టని ఇరు వర్గాలు చెబుతున్నాయి. శివాజీ యాదవ్, రమేశ్, నిరంజన్, ఎంపీ అర్జున్, సయ్యద్ మిరాజ్లతో కూడా సెలక్షన్ కమిటీ ఆదివారం అపెక్స్ కౌన్సిల్ జట్టును ప్రకటించింది. ఈ కమిటీని కూడా శనివారమే ఏర్పాటు చేశారు. త్వరలో జరుగబోయే ఏజీఎంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుంది కాబట్టి పాత సెలక్షన్ కమిటీతోనే జట్టును ఎంపిక చేసినట్లు శేష్ నారాయణ్ చెబుతున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో అరవింద్ శెట్టి, నిరంజన్, విష్ణువర్ధన్ సభ్యులుగా ఉన్నారు. ఈ తరహాలో జట్ల ఎంపిక క్రికెటర్లను ఆందోళనలో పడేసింది. తాము జట్టులోకి ఎంపికైనట్లా, కానట్లా... అసలు టోర్నీకి వెళ్లాల్సి ఉందా లేదా అని వారంతా సంకోచంలో ఉన్నారు. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం. హైదరాబాద్ జట్లు కార్యదర్శి ప్రకటించిన హైదరాబాద్ జట్టు: సీవీ మిలింద్ (కెప్టెన్), రోహిత్ రాయుడు, అభిరత్ రెడ్డి, ఠాకూర్ తిలక్ వర్మ, హిమాలయ్ అగర్వాల్ (వికెట్ కీపర్), చందన్ సహాని, యతిన్ రెడ్డి, టి. రవితేజ, సాకేత్ సాయిరామ్, టీపీ అనిరుధ్, తనయ్ త్యాగరాజన్, ముదస్సిర్ హుస్సేన్, కె. సుమంత్ (వికెట్ కీపర్), సమిత్ రెడ్డి, మల్లికార్జున్, అలంకృత్ అగర్వాల్, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), నోయెల్ డేవిడ్ (ఫీల్డింగ్ కోచ్), మహబూబ్ అహ్మద్ (మేనేజర్), భీషం ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). అపెక్స్ కౌన్సిల్ ప్రకటించిన హైదరాబాద్ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కొల్లా సుమంత్ (వికెట్ కీపర్), టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీహసన్, ప్రజ్ఞాన్ ఓజా, ఎం. రవికిరణ్, ముదస్సర్ హుస్సేన్, సీవీ మిలింద్, ఎ. వరుణ్ గౌడ్, చందన్ సహాని, ఠాకూర్ తిలక్ వర్మ, ఎన్పీ సింగ్ (కోచ్), ఇంద్ర శేఖర్ రెడ్డి (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). -
శ్రీరంగంలో శ్రీమద్రామానుజులు
రోజూలానే ఆరోజు కూడా రామానుజుడు మహాపూర్ణుల ఇంటికి వెళ్లారు. కాని ఇంట్లో ఎవరూ లేరు. ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల వారిని అడిగితే గురువు గారు హఠాత్తుగా ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. ఎందుకు? ఇంటికి చేరుకున్న రామానుజుడికి.. జరిగిన గొడవ గురించి, గురువుగారు హఠాత్తుగా ఎందుకు కంచి వదిలి వెళ్లిపోయారో తెలిసిపోయింది. గురువుగారి భార్యను అన్నమాటలు కూడా తెలుసుకున్న తరువాత చాలా బాధపడ్డారు. హృదయం భారమైంది. కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె కనిపించింది. సాధ్యమైనంత వరకు కోపం, బాధ ఆపుకుంటూ ‘‘మూడు తప్పులు చేశావు రక్షమాంబ, క్షమించరాని తప్పులు. రెండు సార్లు నీకు హెచ్చరిక చేశాను. నాకు ఉపదేశం చేసిన గురువుగారిని కూడా నీవు గౌరవించకపోతే మనం ఏం చేస్తున్నట్టు? మొదటి సారి కాంచీపూర్ణుని సాపాటుకు పిలిచి కులభేదాలు లేవంటూ గౌరవించాలన్న నా ప్రయత్నాన్ని ఫలించనీయలేదు. అది మొదటి తప్పు. మరోసారి ఆకలితో ఉన్న వైష్ణవుడికి భోజనం పెట్టమని కోరితే నిరాకరించావు. ఇంట్లో భోజన పదార్థాలు ఉన్నా లేవన్నావు. ఇక ఇప్పుడు నా ఆచార్యుడిని వెడలగొట్టిన పాపాన్ని నాకు కట్టబెట్టావు. నాకు దివ్యోపదేశం చేసిన గురువే నా జీవితంకన్నా, నీకన్నా చాలా ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువ. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా. నీకు ఇదివరకు ఎన్నో సార్లు చెప్పాను కూడా! హెచ్చరించినా వినడం లేదు. నా స్థాయికి మించిన సతీమణివి నువ్వు. నీవల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడం నా వల్ల కావడం లేదు. ఇక ప్రయోజనం లేదు. నీవు నీ పుట్టింటికి వెళ్లవచ్చు. నీతో వచ్చినవి, నీవు తెచ్చినవి, నీ పుట్టింటివారు నీకు ఇచ్చినవి తీసుకుని వెళ్లవచ్చు.’’ అని తీక్షణంగా మాట్లాడి, రామానుజుడు వెళ్లిపోయాడు. తంజ వణికిపోయింది. ఏనాడూ కోపంగా లేని రామానుజుడు అంతగా ఆగ్రహించడం తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రుల దగ్గరికి ఆమెను పంపించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు రామానుజులు. అంతలో ఒకరోజు ఆమె పుట్టింటినుంచి ఎవరో వచ్చి తమ్ముడి పెళ్లికి అక్కా బావలను నాన్న రమ్మంటున్నారని చెప్పారు. తండ్రి పంపిన కొన్ని కానుకలు ఇచ్చాడు. ఉత్తరం కూడా రాసి పంపాడు. తను వెళ్తానంది. రామనుజుడు సరేనన్నాడు. తాను రాలేనని చెప్పాడు. కొన్ని వస్తువులు తీసుకువెళ్తానంది. నీకు ఇష్టం వచ్చినవన్నీ తీసుకుపోవచ్చని చెప్పాడు. ఎప్పుడు వస్తానో తాను చెప్పలేదు. రామానుజుడూ అడగలేదు. పుట్టింటి ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, ఇంకా తాను వాడుకుంటున్న వస్తువులు కూడా సర్దుకుంది. ఆమె ముఖంలో పుట్టింటికి వెళ్లే సంతోషం కనిపించింది. ఏ తప్పు చేయని వారిని వైవాహిక బంధంనుంచి తెంచడం ధర్మం కాదు. మూడుతప్పులు చేసిన భార్యను వదిలివేయడం అధర్మం కాదు. స్వచ్ఛందంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంటే... ఇదీ ఒకందుకు మంచిదే అన్నట్టు రామానుజుడు మౌనం వహించాడు. వెళ్లిపోయింది. తనకు సహధర్మచరిగా ఉండవలసిన భార్య దొరకలేదు. ఇక సంసారమూ ఆ సంసార భారాలూ తనకు సాధ్యం కాదని తన దారి వేరని అర్థమైపోయింది. మళ్లీ ఇక ఆమె గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఆయన జీవితంలోకి ఆమె వచ్చిన దాఖలా లేదు. సన్యాసాశ్రమం రామానుజుడు ఇక సన్యాసాశ్రమం తీసుకోవడం ఒక్కటే సరైన మార్గమనే నిశ్చయానికి వచ్చాడు. భిక్షువైన సన్యాసి ద్వారాగానీ లేదా భగవంతుడి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలి. రామానుజుడు వరదరాజ స్వామి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలని సంకల్పించాడు. అనంత సరస్సులో స్నానం చేసి పునీతుడైనాడు. ‘ఈ సంసార బంధంనుంచి నన్ను విముక్తుడిని చేయి వరదరాజా.. నీ దివ్య ఆదేశాలను స్వీకరించడానికి నేను సిద్ధం. నన్ను నీ చరణాలను ఆశ్రయించనీయి, త్రిదండం ఇప్పించు. కాషాయ వస్త్రాలు దాల్చనీ, స్వామీ’ అని ప్రార్థించాడు. కాంచీపూర్ణుడి ద్వారా అతనికి అనుజ్ఞ లభించింది. త్రిదండము, కాషాయ వస్త్రాలు, ఉపవీతము, కౌపీనము, వేష్టి, శిక్యము మొదలైనవి ఇచ్చి ఇకనుంచి అతను రామానుజ ముని అని పిలువబడతాడన్నారు. రామానుజ మునికి సన్యాసాశ్రమ ధర్మపద్ధతి ప్రకారం మఠం ఏర్పాటుచేసి పీఠాన్ని అందులో ఆయన్ను ప్రతిష్ట చేయండి అని ఆదేశించారు వరదరాజస్వామి. కొన్నాళ్లు కంచి రామానుజ మఠంలో ఆయన సన్యాసిగా జీవనం సాగించారు. సన్యాసాశ్రమంలో కఠిన నియమాలు సవివరంగా పాటించారు. యామునాచార్యులను తలచుకున్నారు. ఇదంతా నాయందు వారి అపారమైన దయ, లీల. తన మార్గంలో కంటకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు. చివరకు ఈ దారికి మళ్లించారు. ఇక వారి ఆశయాలను నెరవేర్చే బృహత్ కార్యాన్ని చేపట్టాలి. కాని నేను ఒక్కడినే ఉన్నాను. నాకొక తోడు ఉండాలి. గోవిందుడు గుర్తుకు వచ్చాడు. ఆ«ధ్మాత్మిక వాజ్ఞ్మయం తెలిసిన వాడు, శాస్త్రాలు చదువుకున్నవాడు. భౌతిక లంపటాలమీద ఆసక్తి లేని వాడు. సమ్యక్ దృష్టి కలిగిన వాడు. నేనంటే అభిమానం ఉన్నవాడు. మనసు తెలిసిన ఆత్మబంధువు. గోవిందుడికన్నానాకెవరు దొరకుతారు? కాని అతను కాళహస్తిలో ఉంటూ శైవమతాన్ని అనుసరిస్తున్నాడు. ఎవరు అతన్ని మనదారికి మళ్లించగలరు? కంచి వరదుడికి కాంచీపూర్ణుడి వలె, తిరుమల వేంకటేశ్వరస్వామికి శ్రీశైలపూర్ణుడు అంతటి సన్నిహితుడు. శ్రీశైలపూర్ణుడి సాయం దొరికితే చాలు అనుకున్నాడు. అతనికి వెలుగు దారి చూపమని కాంచీ వరదుడినే మళ్లీ వేడుకున్నాడు. దాశరథి కురేశులు రామానుజుడికి ఇద్దరు చెల్లెళ్లు. భూమి, కమల. పురుష మంగళలోని అనంత దీక్షితతో భూమి వివాహం అయింది. వారికి దాశరథి జన్మించాడు. దాశరథిని ముదలి ఆండన్ అని కూడా పిలుస్తారు. కమలకు పుట్టిన వాడు వరద విష్ణు ఆచార్య. ఆండన్ 105 సంవత్సరాలు జీవించారు. రహస్యత్రయమనే గ్రం«థాన్ని రచించారు. రామానుజుని ప్రధాన శిష్యుల్లో ఒకరు. దాశరథి తనను శిష్యుడిగా స్వీకరించాలని అర్థిస్తాడు. దాశరథితోపాటు శ్రీవత్సాంక కూడా శిష్యుడైనాడు. శ్రీ వత్సాంకుడు కుర్ అనే అగ్రహారానికి అధిపతి, ధనవంతుడు. కనుక ఆయనను కురేశుడు అని ఆళ్వన్ అని కూడా అంటారు. కురేశుడు తన భార్య ఆండాళ్తో కలిసి వచ్చి శిష్యులై ఉండేందుకు అనుమతించాలని కోరారు. రామానుజుడికి సన్నిహిత శిష్యులుగా దాశరథి, కురేశుడు రాణించారు. (వీరి పుత్రులే పరాశర, వేదవ్యాసభట్టర్) పంచసంస్కారాలు గావించారు. అంతకు ముందు గురువైన యాదవప్రకాశుడు కూడా శైవం నుంచి విశిష్టాద్వైతం స్వీకరించి రామానుజుడి శిష్యుడైనాడు. శ్రీరంగం వైపు పయనం శ్రీరంగం వైష్ణవ పీఠంలో రామానుజుని ఆచార్యుడుగా ప్రతిష్టించాలని యామునాచార్యుల శిష్యగణం మాట్లాడుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్న కంచి వరదుడి అనుగ్రహంతోనే రామానుజుడు కంచినుంచి కదలడం సాధ్యమవుతుందని వారు గమనించారు. శ్రీరంగనాథుని స్తుతించి ఒక కోరిక కోరారు. ‘‘మీరు ఏ విధంగానైనా వరదరాజస్వామిని ఒప్పించి రామానుజుని శ్రీరంగానికి రప్పించాలి’’ అని విన్నవించారు. శ్రీరంగనాథుడు కంచిలో వరద రాజుకు సందేశం పంపుతూ రామానుజుడిని పంపాలని కోరతాడట. ఆ సందేశానికి వరదరాజు ‘‘మమ్మల్ని మేము కోల్పోవడానికి సిద్ధపడినప్పుడే మా రామానుజుని వదులుకునేది’’ అని తిరుగు సందేశం పంపారట. అధికారికంగా వరదుడిని ఒప్పించడం కష్టమని తేలిపోయింది. ఆయనను మెప్పించడానికి మార్గాలు వెదకాలనుకున్నారు. వరదుడు సంగీతప్రియుడు, మధురగానానికి లొంగుతాడని తెలిసి సంగీత విశారదుడు భక్త అగ్రగణ్యుడైన వర రంగముని (మరోపేరు తిరువరంగ పెరుమాళ్ అఱైయార్)ను వరదరాజపెరుమాళ్ సన్నిధికి వెళ్లమని వేడుకుంటారు. ఆయన కాంచీపురం చేరుకుని, దివ్యప్రబంధంలోని పాశురాలను మధురంగా గానం చేశారు. వరదరాజస్వామి ఆయన గానానికి ముగ్ధుడై ఆలయమర్యాదలతో సత్కరించాలని ఆదేశిస్తాడు. ‘‘ఈ సత్కారాలు నాకెందుకు స్వామీ. ఇవన్నీ నాకు అక్కర లేదు. మీరు కాదనకుండా నాకు ఒక వరం ఇవ్వండి స్వామీ’’ అని వర రంగడు కోరుతాడు. ‘‘సరే నన్ను నా భార్యలను కాకుండా మరేదయినా కోరుకోవా’’ అంటాడు వరదరాజపెరుమాళ్. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వరరంగడు రామానుజుడిని అడుగుతాడు. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. వెంటనే రామానుజుని చేయిపట్టుకుని శ్రీరంగానికి బయలుదేరతాడాయన. యమునాచార్యుల కల ఫలించబోతున్నదని శిష్యులు రామానుజుడికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కావేరీ తీరానికి రాగానే రామానుజుడిని వేదమంత్రోచ్చారణలతో పూర్ణకుంభంతో ఎదురేగి, దివ్యప్రబంధ పాశుర గానంతో సకల వైదిక లాంఛనాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఊరేగింపుగా రామానుజుడు తూర్పుద్వారంనుంచి శ్రీరంగాలయ ప్రవేశం చేసారు. తరువాత దక్షిణానికి తిరిగి అక్కడనుంచి పడమరవైపు ప్రదక్షిణగా మళ్లి అక్కడినుంచే శ్రీరంగనాథునికి సాష్టాంగ నమస్కారము సమర్పించి, అమ్మవారు శ్రీరంగనాయకి సన్నిధికి వెళ్లి ప్రణామం చేసి, చంద్ర పుష్కరిణిని దర్శించి ప్రణమిల్లి, పుష్కరిణీజలాన్ని తీసుకుని త్రాగి, జయవిజయుల రక్షణలో ఉన్న ద్వారంలో ప్రవేశించి, దివ్యశూరులైన అక్కడి ఆళ్వారులను దర్శించి చుట్టూ ఉన్న ఉపాలయాలను సందర్శించి ప్రణవ విమానానికి ప్రణమిల్లి, విష్ణు సేనాని విష్వక్సేనుల వారి సన్నిధికి చేరి సాష్టాంగ నమస్కారం చేసి, రంగమంటపంలో ప్రవేశించినారు. సరిగ్గా అదే సమయానికి రామానుజునికి స్వాగతం చెప్పినట్టు ఉత్సవరులు నంబెరుమాళ్ రామానుజుని చూడాలని స్వయంగా బయటకు వచ్చారు. నంబెరుమాళ్ కనిపించగానే రామానుజులు పలుమార్లు సాష్టాంగపడిపోయారు. మహానంద పరవశులైనారు. ఇక మూలవిరాట్టు, అనంత శయనుడు, శేషశాయి, ప్రణవవిమానాంతర్గత శయనమూర్తి, శ్రీరంగనాథుని దర్శించారు. ఆ దివ్యమంగళ విగ్రహుని పరాత్పరునిచూడగానే కళ్లు వర్షించాయి. మనసు పులకించింది తనువు వణికింది. ఉచ్ఛస్వరం ఉబికి వచ్చింది. సంస్కృత శ్లోకాలు ఆశువుగా వెలువడ్డాయి. నమో నమో వాజ్ఞ్మనసాతి భూమయే నమో నమో వాజ్ఞ్మనసైక భూమయే నమో నమో అనంతమహావిభూతయే నమో నమో అనంతదయైక సింధవే అని స్తుతించారు. వాక్కుకు మనసుకు అందని వాడా వందనం వందనం, వాక్కు మనస్సుకు మాత్రమే అందే వాడా వందనం వందనం, అనంతమహా వైభవుడా వందనం వందనం, అనంత దయా సముద్రుడా వందనం వందనం అని స్వామిని చూస్తూ ఉండిపోయాడు.మరో శ్లోకం కూడా రామానుజుని మనో వాక్కులనుంచి ప్రవహించింది. నధర్మనిష్ఠోస్మిన చాత్మవేది నభక్తిమాన్ త్వచ్ఛరణారవిన్దే అకించనోన్యగతిఃశరణ్యః త్వత్పాదమూలం శరణం ప్రపద్యే (నాకు ధర్మమంటే ఏమిటో తెలియదు. నిçష్ఠ అర్థం కాదు. ఆత్మతత్వం బోధపడదు. నీ పాదపద్మాల మీదైనా భక్తి ఉందా అంటే అదీ లేదు. అకించనుడను. గమ్యమేమిటో తెలియదు (అగమ్యగోచరుడిని), ఇంకో గతి లేదు. నీ పాదములనే శరణు వేడుతున్నాను). కరుణాసముద్రుడైన భగవంతునికి తానేమీ కానని తెలుపుకుని నిరహంకారుడై పూర్తిగా శరణువేడే నిజవైష్ణవ నిరాడంబర, నిజభక్తి సూత్రాలుగా ఈ శ్లోకాలు ప్రతి వైష్ణవ తిరువారాధనలో పలికే మంత్రాలై ఈనాటికీ వెలుగుతున్నాయి. శ్రీవారి పాదాలను (శఠగోపము) రామానుజుని పాదాలపై ఉంచారు. బద్ధులైన ఆత్మలను విముక్తులను చేయడానికి నిత్యవిభూతిని, లీలా విభూతిని వినియోగించమని ఆదేశిస్తూ ఆ రెండింటినీ రామానుజులకు అప్పగించారు శ్రీరంగనాథుడు. పెరియనంబి ద్వారా శెంగోలు కిరీటాన్ని ఇచ్చి రామానుజుడికి ఉడయవరు అనే నామాన్ని ఇచ్చారు. పెరియనంబి వైపు తిరిగి, రామానుజుడు, ఆచార్యవర్యా మిమ్మల్ని ఆశ్రయించడం వల్ల మీ దయతో నాకు ఈ శ్రీరంగనాథుని అనుగ్రహం కలిగిందని నమస్కరించారు. పెరియనంబి ‘‘నాయనా...అదిగో అటు చూడు అని నమ్మాళ్వార్లను చూపి, ఆయనే భవిష్యత్తులో ఒక ఆచార్యులు వచ్చునని చెప్పినారు. అది నీవేనని యామునులు చెప్పినారు. కలి ధర్మాలను నశింపచేసి భగవత్తత్త్వాన్ని జనులకు విశదం చేసే మహత్తర కార్యక్రమ బాధ్యతను స్వీకరించు’’ అని దీవించారు. ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను, వ్యవహారాలను, జరగవలసిన కార్యక్రమాలను నిర్ధారించి, నిర్దేశించి, దగ్గరుండి నిర్వహింపజేసి, ఆచరణ ద్వారా అందరికీ నేర్పి, ఈనాటికీ ఏనాటికీ మరిచిపోకుండా నిలబెట్టిన ఘనుడు ఆచార్య రామానుజుడు. ఆ కార్యక్రమం కలియుగ వైకుంఠ ధామమైన శ్రీరంగంలో శ్రీమద్రామానుజులు ఆరంభించారు. పెరియ తిరుమండపం (పెద్ద శ్రీ మండపం)లో ప్రవేశించారు, అన్నీ పరిశీలించారు. శ్రీ భాండాగారంలోకి వెళ్లారు. అక్కడి తూకాలు చూశారు, కొలతల ప్రమాణాలను సరిచూచారు. తిరువారై అంటే పూలమాలల సేవ, సాట్టువడి అంటే శ్రీ గంధపు సేవ, అముడుపడి అంటే అన్న ప్రసాద సేవ, తిరువిళక్కు అంటే జ్యోతి సేవ తదితర సేవలు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించారు. సేవల అంతరార్థాలను వివరించారు. పద్ధతులను నిర్దేశించారు. ప్రక్రియలు ప్రబోధించారు. దేవాలయానికి ఉన్న ఆస్తులు, భూములు, పూలవనాలు, పనిచేసేవారు, వారి బాగోగుల గురించి అడిగారు. పలకరించారు. లోపతాపాలను విచారించి సరిదిద్ది నిర్దిష్ట కార్యప్రణాళికను రూపొందించారు. శ్రీ రంగనికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల విధి విధానాలను సంకలనం చేసి క్రమబద్ధీకరించారు. సరైన వ్యక్తులను సరైన స్థానాలలో నియమించారు శ్రీరంగ రామానుజులు. ∙ఆచార్య మాడభూషి శ్రీధర్ -
కృష్ణ జిల్లా టీడీపీలో విభేదాలు
-
ఇంతకీ మన పల్లెలెన్ని?
♦ దేశంలో గ్రామాల లెక్కపై గందరగోళం ♦ ఒక్కో సంఖ్య చెబుతున్న ఒక్కో శాఖ మనదేశంలో మొత్తం గ్రామాలెన్ని..?మనకు చాలాసార్లు ఇలాంటి సందేహం వస్తూంటుంది. దీనికి సమాధానం కోసం ప్రభుత్వ విభాగాలను అడిగితే స్పష్టమైన జవాబు మాత్రం రాదు. ఎందుకంటే దేశంలో ఎన్ని గ్రామాలున్నాయనే దానిపై ప్రభుత్వ శాఖలకే స్పష్టత లేదు. అందువల్లే ఒక శాఖ 6 లక్షల గ్రామాలు ఉన్నాయని చెపితే.. మరో విభాగం 10 లక్షల గ్రామాలు ఉన్నాయని చెపుతుంది. విభాగాలవారీగా గ్రామం అనే పదానికి నిర్వచనాలు భిన్నంగా ఉన్నాయి. దీనికి అనుగుణంగా గ్రామాల సంఖ్య మారిపోతోంది. మొత్తం గ్రామాల సంఖ్య ఎంత అనే దానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పనలో గందరగోళం తలెత్తుతోంది. ఒక్కో శాఖదీ ఒక్కో లెక్క.. దేశంలో పరిపాలనా సరిహద్దుల గురించిన సమాచారానికి అధీకృత మూలం జనాభాలెక్కలే. 2011 జనాభాలెక్కల ప్రకారం దేశంలో ఉన్న మొత్తం గ్రామాల సంఖ్య 6,49,481. ఇందులో 5,93,615 గ్రామాల్లో ప్రజలు నివసిస్తుండగా.. మరో 50 వేల గ్రామాల్లో జనావాసాలే లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వంద రోజుల పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సేకరించిన గ్రామాలు, కుగ్రామాల సంఖ్య 10 లక్షలకుపైగానే ఉంది. ఇక తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ అధీనంలో ఉండే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎంఐఎస్) డాటాబేస్లో ఈ సంఖ్య 6,08,662గా ఉంది. ఇదే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామీణ)లో గ్రామాల సంఖ్యను 6,05,805గా పేర్కొనడం గమనార్హం. ఎందుకీ తేడాలు.. వాస్తవంగా చెప్పాలంటే.. ప్రస్తుతం దేశంలో మొత్తం గ్రామాలు ఎన్ననే దానిపై అధీకృత అంచనా లేదు. ప్రణాళికాపరంగా, నిధులు అందజేసే విషయంలో కచ్చితమైన గ్రామాల సంఖ్య తెలుసుకోవడం చాలా కీలకం. ఆర్థిక, పరిపాలనకు సంబంధించి ప్రాథమిక విభాగంగా గ్రామం ఉంటుంది. ప్రభుత్వ రెవెన్యూ విభాగం.. గ్రామాలను నిర్వచించి.. గుర్తిస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కొత్త గ్రామాలను గుర్తిస్తుంది. అయితే ఈ గ్రామాల పేర్లు రెవెన్యూ శాఖ జాబితాలో ఆటోమాటిక్గా చేరవు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభాలెక్కల గణన ప్రారంభమైన తర్వాత మాత్రమే అన్ని శాఖల వినియోగానికి అనుగుణంగా రెవెన్యూ గ్రామాన్ని చేర్చుతారు. అందువల్ల ఎప్పటికప్పుడు పెరుగుతున్న గ్రామాలు ఒకే డేటాబేస్లో నమోదుకావు. లెక్కల్లో లేని గ్రామాలూ ఉన్నాయ్.. జనాభాలెక్కల్లో రెవెన్యూ గ్రామాలుగానే కాక.. జనావాసాలు ఉన్న.. జనావాసాలు లేని గ్రామాలుగా విభజిస్తుంది. సెన్సెస్ ప్రకారం సుమారు 50 వేల గ్రామాల్లో జనావాసమే లేదు. అలాగే మారుమూల ప్రాంతాల్లో అటవీ గ్రామాలు–కుగ్రామాలు కూడా ఉంటాయి. రాష్ట్ర అటవీ శాఖ అటవీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం వీటిని గుర్తిస్తుంది. జనాభాలెక్కల పరిధిలోకి రాని ఇలాంటి గ్రామాలను సర్వే చేయని గ్రామాలు అంటారు. ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వ విభాగాలు జనాభా లెక్కల్లోని గ్రామాలను సాధారణంగా పరిగణనలోకి తీసుకోవు. జిల్లా అధికారులు, స్థానిక యంత్రాంగం అందించిన సమాచారాన్నే ఎక్కువగా అనుసరిస్తాయి. జనావాసమే లేని గ్రామాలు 50,000. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
టాటా , ఫోక్స్వ్యాగన్ మధ్య విభేదాలు
న్యూఢిల్లీ: కొత్త వాహనాన్ని అభివృద్ధి చేసే విషయంలో జట్టు కట్టిన టాటా మోటార్స్, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ప్లాట్ఫాం వినియోగం, వ్యాపారపరమైన లాభదాయకత వంటి అంశాలపై సందేహాలు తలెత్తడమే ఇందుకు కారణం. సంయుక్తంగా వాహనాలను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు ఈ ఏడాది మార్చిలో ప్రకటించాయి. ఇందులో భాగంగా తొలి వాహనం 2019లో మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఎకానమీ సెగ్మెంట్కి చెందిన ఈ కారుపై ఫోక్స్వ్యాగన్ గ్రూప్ తరఫున స్కోడా ఆటో పనిచేయనుంది. టాటా మోటార్స్కి చెందిన అడ్వాన్స్డ్ మాడ్యులర్ ప్లాట్ఫాంపై ఫోక్స్వ్యాగన్ టెక్నాలజీ ఉపయోగించి వర్ధమాన మార్కెట్ల కోసం కార్లను తయారు చేయాలని భావించారు. అయితే, వ్యాపారపరంగా ముందు అనుకున్నంతగా ఇది అంత ఆకర్షణీయ ఒప్పందం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. -
ఇన్ఫోసిస్ లో ముదురుతున్న విభేదాలు?
ముంబై:డీమానిటైజేషన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడ్డ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా ఇంటిపోరును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇన్ఫీ వ్యవస్థాపకులకు, సీఈవో విశాల్ సిక్కాకు తీవ్ర విభేదాలు పొడసూపినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల భారీగా పెరిగిన సీఈవో వేతనంపై (సం.రానికి రూ.49కోట్లు) వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. గత రెండేళ్లుగా సంస్థలో పారదర్శకత లోపించిందని, సంస్థను వీడిన ఉద్యోగులకు చెల్లించిన భారీ ప్యాకేజీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే సంస్థలో అంతర్గతంగా ఉడుకుతున్న విభేదాలు మరింత ముదిరి పాకాన పడినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు టాటా- మిస్త్రీ బోర్డు వివాదం ఇంకా సద్దుమణగముందే ఇన్ఫోసిస్ లో మరో సంక్షోభం తలెత్తనుందా అనే సందేహాలు మార్కెట్ వర్గాల్లో కలవరం పుట్టిస్తున్నాయి. దేశంలోనే రెండవ అతి పెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు సంస్థలో పారదర్శకత మరియు కార్పొరేట్ పాలనపై ఆందోళనలు వ్యక్తం చేశారు. మాజీ కంప్లయిన్స్ చీఫ్ ఆఫీసర్ డేవిడ్ కెన్నెడీ రాజీనామా ప్యాకేజీ, విశాల్ ప్యాకేజీలపై కూడా వారు అనేక ప్రశ్నలనులేవనెత్తుతున్నారు. సంస్థ కార్పొరేట్ గవర్ననెన్స్ ఉన్నత ప్రమాణాలు క్రమంగా క్షీణిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి జయంత్ సిన్హా భార్య పునీత సిన్హను ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియామకం, మాజీ సీఎఫ్వో సీఈవో రాజీవ్ బన్సల్ అందించిన ప్యాకేజీపై (రూ.17.4కోట్లు)తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) అంశాన్ని పరిశీలించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీవద్ద రూ. 38,000 కోట్ల విలువైన నగదు నిల్వలున్నాయి. వీటి నుంచి బైబ్యాక్కు రూ. 12,000 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఊహాగానాలపై స్పందించడానికి ఇన్ఫోసిస్ నిరాకరించింది. -
రేపే రెండు రాష్ట్రాల పంచాయితీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలపై బుధవారం ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో పంచాయితీ జరుగనుంది. ఇందులో ప్రధానంగా సచివాలయం, నివాస భవనాల అప్పగింతపై చర్చించనున్నారు. వీటితోపాటు షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, కోర్టు తీర్పుల అమలుపైనా మాట్లాడాలని ఏపీ పట్టుబట్టనుంది. ఏపీ తరఫున యనమల రామకృష్ణుడు, అచ్చెం నాయుడు, కాలువ శ్రీనివాస్ తోపాటు ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు పెండింగ్ సమస్యలపై నోట్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
సంపన్నులు చంకన.. పేదలు వీధిన
సమకాలీనం కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలేవీ ధనక–పేద వ్యత్యాసాల్ని తగ్గించే విగా లేవు. భూసేకరణల నిర్వాసితుల నుంచి రైతులు, వ్యవసాయ కూలీల వరకు అంద రిదీ దయనీయ స్థితి! చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, అసంఘటిత కార్మి కులు, దినసరి కూలీల వరకు పేదరికంలోకి నెట్టేస్తున్న పరిస్థితి! ‘ప్రపంచీకరణ రెండు వైపులా పదునున్న కత్తి’. దాన్ని ఒడుపుగా వాడుకొని ఆర్థిక అంతరాల్ని తగ్గించాలి. విప్లవం నేరుగా ఉత్పత్తి కాదు, అది విప్లవ పరిస్థితుల నుంచి పుట్టే ఉప ఉత్పత్తి మాత్రమే! ప్రపంచమంతా, ముఖ్యంగా మన దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరా లను చూస్తుంటే భవిష్యత్తు భయానకంగా కన్పిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వాల విధానాలు, నిర్వాకాలు ఈ అంతరాల్ని మరింత పెంచి పోషించేవిగానే తప్ప, తగ్గించేవిగా లేవు. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణల అమలు తర్వాత ఈ అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్థూలంగా మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సంపద ఒకవైపు పోగవుతుంటే, దారిద్య్రం స్థిరపడుతోంది. సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదలు కటిక దారిద్య్రంలోకి జారుతున్నారు. వేగంగా ఎదుగుతున్న ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్లో 30% తిండి కోసం అలమటిస్తున్నారు. మరో వంక 1% అంటే కోటీ ముఫ్పై లక్షల మంది వద్ద ఉన్న ఆస్తి 99% అంటే 128 కోట్ల 70 లక్షల మంది మొత్తం సంపద కన్నా 16% ఎక్కువ! పరిస్థితులు ఇలాగే కొనసాగితే... వచ్చే 20 ఏళ్లలో, దేశంలోని 500 మంది అగ్ర సంపన్నుల ఆస్తి మిగతా భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని మించి పోతుం దనే అంచనా మరింత గగుర్పాటు కలిగిస్తోంది. పేదరిక నిర్మూలనను కోరు తున్న ఓ అంతర్జాతీయ సంస్థ ‘ఆక్స్ఫామ్’ అధ్యయన నివేదిక వెల్లడించిన గణాంకాల సారాంశమిది. స్విట్జర్లాండ్లోని ఆల్ఫ్స్ పర్వతశ్రేణి ఒడిలో ఒది గిన దావోస్ నగరంలో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆక్స్ ఫామ్... సమాజిక అశాంతికి ఆజ్యం పోస్తున్న ఆర్థిక అంతరాల నివేది కను వెల్లడించింది. సంపద సృష్టికన్నా పంపిణీ ముఖ్యం ప్రపంచదేశాల నేతలు, సంపన్నులు, బ్యాంకింగ్, కార్పొ రేట్ ప్రతిని ధులు, వాణిజ్య, వ్యాపార ముఖ్యుల నాలుగు రోజుల భేటీ నేటితో ముగు స్తోంది. ప్రపంచదేశాల విధాన నిర్ణాయక స్థానాల్లోని నేతలు, ఆర్థిక స్థితి గతుల్ని మలుపుతిప్పే ముఖ్యుల సమాలోచనల్లో ఈ అంతరాలే కీలకాంశమై కూర్చుంది. దీంతో ఇన్నాళ్లు బెట్టు చేసినా వారు ఇక ‘సమ్మిళిత ప్రగతే’ పరిష్కార మార్గమని అంగీకరించాల్సి వస్తోంది. ఆర్థిక అంతరాల్ని నియం త్రించకపోతే ప్రపంచీకరణకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు గండం తప్ప దనే భయం, వారిని పట్టుకుంది. సుస్థిరాభివృద్ధిని సాధించలేమనే సందే హాలు బలపడుతున్నాయి. ప్రతి సమాజంలోపల, సమాజాల మధ్య ఆర్థిక అంతరాల తగ్గింపు ముఖ్య ఎజెండాగా మారుతోంది. ఒక దశకు చేరాక సంపద సృష్టి కన్నా పంపిణీ ముఖ్యమని సత్యాన్ని గుర్తించక ఇంకా ‘పంపిణీ సవ్యంగా జరగాలన్నా ముందు ‘సంపద’ సృష్టి జరగాలి, అదే ముఖ్యమ’నే పాత పాటే పాడుతున్నారు ముఖేష్ అంబానీ! ఇటువంటి కార్పొరేట్లతో అంట కాగుతున్న ప్రభుత్వాల ఆలోచనా ధోరణీ అంతే. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న విధానాలేవీ ధనక–పేద వ్యత్యాసాల్ని తగ్గించేవిగా లేవు. అభివృద్ధి పేరిట జరిగే భూసేకరణల నిర్వాసితుల నుంచి రైతులు, వ్యవసాయ కూలీల వరకు అందరిదీ దయనీయ స్థితి! చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, అసంఘటిత కార్మికులు, దినసరి కూలీల వరకు అందర్నీ పేదరికంలోకి నెట్టేస్తున్న పరిస్థితి! కార్పొరేట్ శక్తులు మాత్రం ఇంకా బలపడుతున్నాయి, ప్రపంచ స్థాయికి విస్తరిస్తున్నాయి. వారి ఏ ఆర్థిక నివేదిక చూసినా ఇది సుస్పష్టం. బాబెందుకు వెళతాడో........?! ‘నోట్లో రాయి తీసుకోలేని వాడు ఏట్లో రాళ్లు ఏరేయడానికి వెళ్లాడ’ని వెనకటి సామెత! దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా ఎందుకు వెళతారు? ఇది, మేధావులైనా సమాధానం చెప్పలేని ప్రశ్న. పిలిచారనుకుందామా అంటే ఆయన్నెందుకు, ఏ హోదాలో పిలుస్తారు? తనంత తానుగా వెళితే ఏమి సాధించడానికి? ఇప్పటివరకేమైనా సాధించారా? ఇవి సమాధానం లేని ప్రశ్నలు. ఇంత ప్రజాధనం వెచ్చించి ఆయన రాష్ట్రం కోసం సాధించిందేమైనా ఉందా? వివిధ రాజకీయ పక్షాలు, పౌర సంస్థలు లేవనెత్తుతున్న ఈ సందే హాలను నివృత్తి చేస్తూ ఆయన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా? తనకు, తన పరివార గణానికి ఈసారి అయిన దారి భత్యం ఖర్చు దాదాపు కోటి రూపాయలు. రాష్ట్రానికి ప్రచారం కల్పించడానికి ఒక స్టాల్ లాంటి దానిని ఏర్పాటు చేయడానికి, ఇతర ప్రచార వ్యవహారాలకు రూ. 7.57 కోట్ల ప్రజాధనం వెచ్చించారని సమాచారం. పనుల మీద కన్నా ప్రచారం మీద వందలు, వేల కోట్లు వెచ్చించి పబ్బం గడిపే చంద్రబాబు నాయుడి ఇదివర కటి పాలనా లక్షణాలన్నీ ఇప్పుడు మళ్లీ తెర మీదికొస్తున్నాయి. అంతరాలను పెంచుతున్న భూసేకరణలు ప్రపంచ ఆర్థిక వేదిక చర్చలకు, తాజా ఆలోచనా ధోరణులకు ఫక్తు విరుద్ధ విధానాల్ని ఆయన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. రాజధాని భూసేక రణనే తీసుకుంటే అది సమాజంలో తీవ్ర ఆర్థికాంతరాలకు దారితీస్తున్నట్టు కనిపిస్తోంది. రెండువేల ఎకరాల రాజధాని నిర్మాణాల కోసం దాదాపు 34 వేల ఎకరాల సామాన్యుల, రైతుల భూమిని ప్రభుత్వం కబ్జాపెట్టింది. భూస మీకరణ పేరిట ఇప్పటికే దాదాపు 28 వేల ఎకరాల వరకు స్వాధీనపరచుకొని, మరో నాలుగయిదు వేల ఎకరాలు లాక్కోవడానికి బెదిరింపులకు, అధికార దుర్వి నియోగానికి పాల్పడుతోంది. తమ భూములిచ్చేది లేదనే స్థిరాభిప్రా యంతో ఉన్నవారిని ‘భూసేకరణ’ పేరిట కొత్తగా బెదిరిస్తోంది. దాదాపు రెండున్నర వేల ఎకరాల భూముల్ని లాక్కోవడం సర్కారు లక్ష్యం. రికార్డుల్లో తక్కువ చూపిన వ్యక్తిగత భూములు, గ్రామకంఠాలు, అసైన్డ్ భూములు, సరైన రికార్డులు నిర్వహించని చుక్క బెట్టిన భూములు... ఇలా రకరకాల భూముల్ని తమ వందిమాగధులకు కట్టబెడుతూ ఆర్థిక అంతరాలకు తానే కారణమౌతోంది. ఇది కాకుండా లంక భూములు, పోరంబోకు, గైరానీ, అటవీ శాఖతో పాటు వివిధ విభాగాల అధీనంలో ఉన్న దాదాపు 17 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా తీసుకొని ప్రపంచంలో మరెక్కడా లేనంత పెద్ద ‘భూదందా’ను స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఉమ్మడి అభివృద్ధి ముసుగులో ఉచితంగా, నామమాత్రపు ధరకు భూములు పొందే విదేశీ కంపెనీలు, కార్పొరేట్లు, ప్రైవేటు కంపెనీలు, సంస్థలు, వాటి ప్రతి నిధులు... ఇలా ప్రభుత్వంతో అంటకాగిన వారంతా కోట్లకు పడగలెత్తుతారు. సర్కారు చలువతో ఓ నయా సంపన్న వర్గం స్వల్ప కాలంలోనే పైకి లేస్తుంది. ఏ భూమీ లేకున్నా పంట భూములపై ఆధారపడి ఉపాధి పొందినవాళ్లు, ఎకరం, అర ఎకరంతోనే ఏటా మూడుకు తగ్గని పంటలతో దర్జాగా బతికిన వాళ్లు ఇప్పుడు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారుతున్నారు. రాబడి పెంచుకుంటూ, బరువు దించుకుంటూ... సమసమాజ స్థాపన లక్ష్యంగా కలిగిన సంక్షేమ రాజ్యం మనది. ఎన్నికల్లో ఓట్లు రాల్చే ప్రజాకర్షక విధానాలే తప్ప, ప్రజలకు హితం చేసే పనుల పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు, పైగా వైదొలగుతున్నాయి. ఎన్నికల హామీల అమలుకూ దిక్కులేని పరిస్థితి. ముక్కుపిండి జనం వద్ద ప్రత్యక్ష, పరోక్ష పన్నులతో ఏటేటా రాబడి పెంచుకుంటున్న ప్రభుత్వాలు కీలకమైన విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ బరువు, బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటూ... ప్రైవేటు రంగానికి ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. అలా ప్రైవేటు రాజ్యాలు నెలకొల్పిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వాల్లో భాగమై శాస నాలు, విధానాలు రూపొందిస్తున్నారు. పైగా నీరుగారిన, నిర్వీర్యమైన నియంత్రణా వ్యవస్థలతో పనిచేస్తూ కార్పొరేట్లకు, ఇతర ప్రైవేట్లకు మన సర్కార్లు అనుచిత ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఒకరికొకరు అంటకాగుతూ అవినీతికి హారతి పడుతున్నారు, అంతరాలకు ఆజ్యం పోస్తున్నారు. దీంతో ఆర్థిక అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. పదేళ్ల కిందటి బడ్జెట్తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఆరింతలు పెరిగింది. 2005–06లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ. 55,330 కోట్లు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలసి రూ. 3 లక్షల కోట్లు దాటనుంది. రూ. 1.60 లక్షల కోట్ల బడ్జెట్కు తెలం గాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపు అంతే పరిమాణంతో ఏపీ బడ్జెట్ రూపొందనుంది. కీలక రంగాల్లో బరువు దించుకుంటున్న ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఎక్కడ వ్యయం చేస్తోంది? సాగునీటి ప్రాజెక్టుల వ్యయ అంచనాలు పెరిగే తీరు, ప్రజాకర్షక పథకాలకు వెచ్చించే పద్ధతి విస్మయం కలిగిస్తోంది. వాస్తు భ్రమల్లో తరచూ మారే పాలకుల నివాసాలు, కార్యాలయాలు, విడిది కేంద్రాల నిర్మాణా లకయ్యే దుబారా, గాల్లో జరిపే ‘ప్రత్యేక’ ప్రయాణాల కయ్యే ఖర్చులు, అతి ఉదారంగా ఇచ్చే విరాళాలు... ఇలా ఎన్నిటికో ప్రజాధనం వ్యయమౌతోంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోంది. రైతుల్ని ఆదుకునే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరగట్లేదనే విమర్శ ఉంది. మార్కెట్ జోక్యాలకు గాను నిర్ధిష్టంగా కొంత మొత్తం వెచ్చించి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్న సూచన అమల్లోకి రావట్లేదు. ఇప్పటికే అనేక సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగం తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించని స్థితిలో అల్లాడుతున్నారు. ఇది వీడని ఆర్థిక అంతరాలకే దారి తీస్తోంది. అవకాశాల కల్పనతోనే అంతరాలు తీరేది పేదరికం ఏ రూపంలో ఉన్నా దాన్ని తొలగించాలన్నది ఐక్యరాజ్యసమితి ప్రతి పాదించి, ప్రపంచదేశాలు అంగీకరించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీ) మొదటిది. రాగల పదిహేనేళ్లు అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తే తప్ప 2030 నాటికైనా ఈ లక్ష్యసాధన జరగదు. పెద్దనోట్ల రద్దు చర్యతో సాధించిన ఫలితాలేమిటో కేంద్రం ఇప్పటివరకు వెల్ల్లడించలేదు. ఆ పరంపరలో తదుపరి ఆర్థిక, పాలనా సంస్కరణలు, ఇతర చర్యల్ని జాగ్రత్తగా చేపడితే తప్ప నల్ల సంపదను వ్యతిరేకించిన సామాన్యుల త్యాగాలకు అర్థం ఉండదని ప్రపంచ ఆర్థికవేత్తలు సైతం భావిస్తున్నారు. ఆర్థిక అంతరాలు తగ్గించే క్రమంలో ఒక వంక సంపద వృద్ధి చట్టపరిధికి లోబడి జరిగేలా చూస్తూనే, సామాన్యుల ఎదుగుదల అవకాశాల్ని వృద్ధి చేయాలి. ఈ ఉదాహర ణను చూస్తే ప్రభుత్వాల వైఫల్యాలు కళ్లకు కడతాయి. నిర్మాణరంగ కూలీల కోసం ఆ రంగం నుంచి వసూలు చేసిన 2% సెస్ మొత్తాల్ని పదేళ్లలో ప్రభు త్వాలు వ్యయం చేసిన తీరే ఇందుకు నిదర్శనం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దావోస్లో మాట్లాడుతూ అన్నట్టు ‘ప్రపంచీకరణ రెండువైపులా పదునున్న కత్తి’ అని పాలకులు గ్రహించాలి. దాన్ని ఒడుపుగా వాడుకొని ఆర్థిక అంత రాల్ని తగ్గించి, సమాజంలోని అశాంతిని తొలగించాలి. ‘‘విప్లవం నేరుగా ఉత్పత్తి కాదు, అది విప్లవ పరిస్థితుల నుంచి పుట్టే ఉప ఉత్పత్తి మాత్రమే’’ అన్న ఇంగితం అత్యవసరం. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
టీడీపీలో నాలుగు స్తంభాలాట!
నేతల మధ్య ముదిరిన విబేధాలు నామినేటెడ్ పదవుల కోసం పోటాపోటీ మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే చందంగా తయారైంది టీడీపీలో పరిస్థితి. పదవుల సంఖ్య పరిమితంగా ఉండటం వాటిని ఆశించే నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వర్గవిబేధాలు ముదిరిపాకాన పడుతున్నాయి. నామినేటెడ్ పదవుల నేతల మధ్య పోటీ తీవ్రమైంది. నాలుగు వర్గాలుగా విడిపోయి పదవులు, పనుల కోసం లోలోన పోట్లాడుకుంటున్నారు. సూళ్లూరుపేట: మొదటి నుంచి వేనాటి రామచంద్రారెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఇసనాక హర్షవర్ధన్రెడ్డి మరో గ్రూపుగా మారారు. వీరితో పాటు మొదటి నుంచి పరసా వెంకటరత్నయ్య వర్గం ఎలాగూ ఉంది. రెండో విడత నీరు–చెట్టు పనుల పంపకాల్లో తలెత్తిన వివాదం ప్రస్తుతం ఆలయ పాలక మండళ్ల నియామకంలో ఎక్కువైంది. కొండేపాటి తన వర్గీయులకు పనులు కేటాయించాలని ప్రతిపాదించారు. అయితే వేనాటి వర్గీయులు 40 శాతం, వాకాటి వర్గీయులు 40 శాతం, పరసా వర్గీయులు 20 శాతం పనులను పంచుకున్నారు. ఈ విషయంలో కొండేపాటి అసంతృప్తికి గురయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో వివాదం: నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయి. మొదటి నుంచి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవిని వేనాటి పరంధామిరెడ్డి ఆశిస్తున్నారు. తాజాగా కొండేపాటి వర్గీయులు తిరుమూరు సుధాకర్రెడ్డి పేరును వ్యవసాయ మార్కెటింగ్ కమిటీకి, ఆకుతోట రమేష్ పేరును నాగేశ్వరస్వామి దేవస్థానానికి చైర్మన్లుగా సీఎం నుంచి ఆర్డర్ వేయించుకున్నారని తెలిసింది. దీంతో వేనాటి, వాకాటి, ఇసనాక, పరసా కలిసి ముఖ్యమంత్రి వద్దనే పంచాయతీ పెట్టినట్టుగా సమాచారం. వేనాటి వర్గీయులకు ఆ పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొండేపాటి తన బావమరిదికి పెంచలకోన నరసింహస్వామి ఆలయం, వియ్యంకుడికి శ్రీ కాళహస్తి శివాలయం ౖచైర్మన్, నాయుడుపేట మార్కెట్ కమిటీకి శిరసనంబేటి విజయభాస్కర్రెడ్డికి తెచ్చుకున్నారు కదా! మళ్లీ వీటిల్లో కూడా ఆయన పెత్తనమేనా! అని వేనాటి, వాకాటి వర్గీయుల ప్రశ్నిస్తున్నారు. వర్గ విభేదాలు బహిర్గతం: గురువారం నెల్లూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పరసా పనితీరుపై నాయుడుపేట, సూళ్లూరుపేట నాయకులు ధ్వజమెత్తారు. గురువారం జరిగిన మున్సిపల్ సమావేశంలో విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ప్రస్తుతం చైర్పర్సన్ వేనాటి వర్గాన్ని విస్మరించి కొండేపాటి వర్గంగా మారిపోవడంతో ఈ విభేదాల సెగ మున్సిపాలిటీకి తాకింది. దీంతో గురువారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో వేనాటి కుమారుడు సుమంత్రెడ్డి చైర్పర్సన్పై పరోక్షంగా విమర్శించి సమావేశాన్ని బాయ్కాట్ చేయడంతో పాలకపక్షంలోని వేనాటి వర్గానికి చెందిన కౌన్సిలర్లు అందరూ బయటకు వచ్చేశారు. కొండేపాటి వర్గీయులు మాత్రమే సమావేశంలో ఉన్నారు. టీడీపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి మధ్య అధిపత్య పోరు జరుగుతుండడం కొసమెరుపు. -
అజిత్తో నాకెలాంటి విభేదాల్లేవు
నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చడంలో భాగంగా సంఘ నిర్వాహకులు ఇటీవల స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే ఆ కార్యక్రమంపై పలు రకాల విమర్శలు, ఆరోపణలు రావడం గమనార్హం.ప్రముఖ నటుడు అజిత్ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను బహిష్కరించారని, సంఘం భవన నిర్మాణ నిధికి ఇలాంటి కార్యక్రమాలు అనవసరం అన్న భావనను వ్యక్తం చేశారనే ప్రచారం కలకలం సృష్టిస్తోంది. అంతే కాదు ఈ విషయంలో సంఘం కార్యదర్శి విశాల్కు, అజిత్కు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరందుకుంది.కాగా స్టార్స్ క్రికెట్ క్రీడాపోటీలు విజయవంతంగా జరిగిన నేపధ్యంలో నడిగర్ సంఘం కార్యవర్గం బుధవారం సక్సెస్ మీట్ను నిర్వహించింది.ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం కోశాధికారి నటుడు కార్తీ మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరికి చెందిన కార్యక్రమం కాదనీ సంఘం భవన నిర్మాణం,అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం అనీ అన్నారు. దీని కోసం సంఘం లోని ప్రతి సభ్యుడు శ్రమించాడని వారందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, ఆర్కెటిక్ను నియమించామని,ప్లాన్ కూడా సిద్ధమైందని, ఇక అప్రూవల్ అవడమే ఆలస్యం అని తెలిపారు. శంకుస్థాపన ఎప్పుడన్న ప్రశ్నకు భవన నిర్మాణానికి మొత్తం రూ.28 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికి సేకరించిన నిధితో ఆరు నెలలు మాత్రమే నిర్మాణ పనులు సాగుతాయని అందువల్ల మధ్యలో పని ఆగిపోకుండా పూర్తిగా నిధి సేకరించిన తరువాతనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు,కాగా నటుడు అజిత్ వ్యాఖ్యలపై స్పందిచాల్సిందిగా సంఘం కార్యదర్శి విశాల్ను అడగ్గా అజిత్కు తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు.నిజానికి అజిత్ విమర్శించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనీ,కొందరు కావాలనే వదంతులు సృష్టించి సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.అజిత్ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీల్లో పాల్గొనక పోవడం అన్నది ఆయన వ్యక్తిగత విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దాన్ని తాను స్వాగతిస్తున్నానని విశాల్ అన్నారు. నటుడు శింబు వ్యవహారం గురించి స్పందిస్తూ ఆయన తమ సభ్యుల్లో ఒకరని,శింబు సంఘం నుంచి వైదొలగాలని తాము కోరుకోవడం లేదని అన్నారు.తమ ఏకైక లక్ష్యం సంఘం అభివృద్ధేనన్నారు. మీడియాలో కొన్ని అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పాత్రికేయ మిత్రులు అలాంటి వాటిని అడ్డుకోవాలని విశాల్ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉపాధ్యక్షుడు పోన్వన్నన్ పాల్గొన్నారు. -
బాబు వద్ద మంత్రికే పట్టు?
బీజేపీ, టీడీపీ మధ్య తారస్థాయికి చేరిన వర్గపోరు విభేదాలతో బజారున పడుతున్న మంత్రి, జెడ్పీ చైర్మన్ పట్టించుకోని అధిష్టానాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లాలో బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధుల వర్గపోరు పరాకాష్టకు చేరి పరువు బజారున పడుతోంది. బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పట్టణ ప్రజలకే కాదు ఇరు పార్టీల శ్రేణులకు ఏవగింపు కలిగించేలా నేతలు బహిరంగంగా రగడకు దిగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ నిట్ ఏ ముహూర్తాన ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం తరలిందో అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా మంత్రి మాణిక్యాలరావుపై టీడీపీ నాయకులు ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. మంత్రికి ప్రాధాన్యత తగ్గించే క్రమంలో టీడీపీ నేతలు చివరకు పార్టీ శ్రేణులను కూడా వినియోగిస్తున్నారన్న విషయాన్ని వరుస ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల పెంటపాడు మండలం ప్రత్తిపాడులో రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు సమక్షంలోనే బాపిరాజు, బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రి మాణిక్యాలరావుపై తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. తాజాగా శనివారం తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత సమక్షంలో మళ్లీ అదే వాగ్వాదం పునరావృతమైంది. తాడేపల్లిగూడెం పట్టణాభివృద్ధికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో తాను నిధులు మంజూరు చేయించినా.. టీడీపీ నేతలకు రుచించడం లేదంటూ మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. అదే అదనుగా మంత్రిపై బొలిశెట్టి, ముళ్లపూడి విమర్శలకు దిగారు. మరో మంత్రి సుజాత వారిస్తున్నా లెక్కచేయకుండా ఇరువర్గాలూ వాదులాడుకుని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మంత్రి కార్యక్రమాలకు టీడీపీ సర్పంచ్లూ దూరం తాడేపల్లిగూడెం మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి మాణిక్యాలరావు వెళితే టీడీపీ సర్పంచ్లు వాటికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగ్గన్నపేటలో రోడ్డు పనులకు మంత్రి పైడికొండల శంకుస్థాపన చేయగా, టీడీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాలేదు. దీంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గూడెం మండలంలో ప్రైవేటు సామ్రాజ్యం నడుస్తోందని, మంత్రి హాజరైనా.. సర్పంచ్ కూడా రాని పరిస్థితి ఉందని ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా మరోమారు మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు నేరుగా విమర్శల దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. మంత్రికే పట్టు? వాస్తవానికి చంద్రబాబునాయుడు వద్ద మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాటే ఒకింత చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. నిట్ విషయం మొదలుకుని జిల్లా పర్యటనల్లో పైడికొండలకు చంద్రబాబు తగిన ప్రాధాన్యతే ఇస్తారు. ఇటీవల ఏలూరులో జరిగిన కాపు రుణ మేళాలో టీడీపీకి చెందిన మంత్రి పీతల సుజాతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా పైడికొండలకు అవకాశం కల్పించారు. సామాజిక వర్గ కోణంలో పైడికొండలకు మాట్లాడే అవకాశం ఇచ్చారని అనుకున్నా.. అదే సామాజిక వర్గానికి చెందిన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి ఛాన్స్ దక్కలేదు. ఈ నేపథ్యంలో బాబు వద్ద టీడీపీ నేతలు పైడికొండలపై పంచాయితీ పెట్టినా పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇరుపార్టీల అధిష్టానాలు పట్టించుకోకుండా అలా వదిలేస్తే మాత్రం ఇప్పటికే బజారున పడిన విభేదాలతో అంటకాగుతున్న నేతలు రేపోమాపో భౌతిక దాడులకు దిగినా ఆశ్చర్యం లేదన్న వ్యాఖ్యలు ఇప్పుడు గూడెంలో వినవస్తున్నాయి. -
'కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవు'
హైదరాబాద్: కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని సినిమా రంగంలో గల సమస్యలపై శనివారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సినిమా ప్రముఖులు సురేష్బాబు, సి. కళ్యాణ్, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలను చలన చిత్రాల షూటింగ్ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు.అలాగే నంది అవార్డుల పేరు మర్పు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మాతలు కోరారు. అలాగే సినిమా షూటింగ్లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. -
భార్యాభర్తల మధ్య ‘స్పేస్’ అవసరమా?
‘ఎడం’ ఉంటే బంధం బలపడుతుందా? భార్యాభర్తల మధ్య ‘స్పేస్’ అవసరమా? పెళ్లిపుస్తకం తెరవనంతసేపూ అంతా గుట్టే. దాచిపెడితే డిఫరెన్సెస్ మాయం అయిపోతాయా? ఓపెన్ చేస్తే టైమ్బాంబులా తయారవుతాయా? ఇద్దరి భావాల భాషలు వేరైనా, ఈ పుస్తకం తెరిచి ఉంటే... సంభాషణ మొదలవుతుంది. సంభాషణ ఉంటే, మాటలు ఉంటాయి. మాటలుంటే, అపార్థాల చీకట్లు తొలగుతాయి. పరిష్కారాలు దొరుకుతాయి. కొత్త దాంపత్యాలలో కొత్తగా డిస్కస్ చేస్తున్న విషయం... ‘స్పేస్’. భార్యకీ భర్తకీ మధ్య ‘ఎడం’ ఉంటే బంధం బలంగా ఉంటుందట! ‘ఎడం’ లేకుంటే బాగుంటుందనుకునే వారికిది ‘కల్చరల్ షాక్’. ఏం చేస్తాం..? ఈ కొత్త ట్రెండ్ సూపర్ఫాస్ట్ ట్రెయిన్లాంటిది. టైమ్కి క్యాచ్ చేయకపోతే, జీవితకాలం లేటైపోతాం. అందుకే, అందరికీ పనికొచ్చేలా కొందరి భావాలూ... ఇంకొందరి సూచనలూ జతకూర్చాం. మీకు పనికొచ్చేవి ఏరుకుని, మీ పెళ్లిపుస్తకాన్ని ఇంకా అందమైన... ఆల్బమ్గా మార్చుకుంటారని ఆశిస్తున్నాం. ఆధునిక కాలంలో ఆలుమగల బంధాలు మరీ సంక్లిష్టమైపోతున్నాయి. చాలా జంటల మధ్య చేరువలోనే దూరాలు పెరిగిపోతున్నాయి. ఒకే పైకప్పు కింద నివసిస్తున్నా, ఎవరి ‘స్పేస్’ వారికి కావాలని ఆరాటపడే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎవరి ‘స్పేస్’ వారిదైనప్పుడు ఇక పెళ్లెందుకని ప్రశ్నించే వారూ లేకపోలేదు. పరస్పర గౌరవం, నమ్మకం, అనురాగం ఉన్నప్పుడు అసలు ‘స్పేస్’ వంటి విషయాలేవీ భార్యాభర్తల మధ్య సమస్యలు సృష్టించేంత అంశాలు కావని సంసార సాగరంలో తలపండిన అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఆధునిక జీవనంలోని సంక్లిష్టతలను ఆకళింపు చేసుకున్న మానసిక నిపుణులు మాత్రం ‘స్పేస్’కు అర్థం తెలుసుకోవాలని, జీవిత భాగస్వామి చెప్పేదానికి విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాంపత్య బంధంలో ఉన్న కొంతమంది మహిళలను పలకరిస్తే, వారి మనోగతాలను వెల్లడించారు. అవి వారి మాటల్లోనే... భరించలేకపోతున్నాను మా పెళ్లై ఏడాది పూర్తికావొస్తోంది. సాయంకాలమైందంటే నేరుగా ఇంటికే వచ్చే మా వారు ఈ మధ్య ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం ఉంటున్నారు. ఈవెనింగ్ ఈ మధ్య తను ఒక్కడే బయటకువెళుతున్నాడు. అదేమని అడిగితే, ఫ్రెండ్స్ అనీ, పనులనీ చెబుతున్నాడు. మా మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. ఎక్కడా లోపం, అనుమానం లేదు. కానీ, ఇంట్లో ఒక్కదాన్నే ఉండిపోవాల్సి వస్తోంది. పెళ్లంటే నా దృష్టిలో ఉన్న భావన ఈ మధ్య చెదిరిపోతున్నట్టుగా ఉంది. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్లు అని మా వారు చెబుతున్నారు. మా ఫ్రెండ్స్ కూడా ‘ఎంత భార్యాభర్తలు అయినా ఎవరి స్పేస్ వారికుండాల’ని చెబుతున్నారు. నమ్మకం లేక కాదు.. కానీ, అలా ఎవరి లోకం వారిదే అన్నట్టుగా ఉండటం అంటే ఇక పెళ్లి ఎందుకు? ఒకే ఇంటికప్పున ఉండటమెందుకు చెప్పండి. - వసు, గృహిణి పరిధులు దాటితే అంతే! ఎవరి స్పేస్ వారికి ఉండాలనే ఉద్దేశ్యంతో పరిమితిని మించి స్పేస్ తీసుకున్నాను. అదే నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. మా వారు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. మాకు పెళ్లై ఎనిమిదేళ్లు. పిల్లలను చూసుకోవడం కుదరడంలేదని జాబ్ మానేశాను. పార్ట్టైమ్గా ఇంటి నుండే జాబ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఇంట్లో ఒకదాని తర్వాత ఒక పని.. ఊపిరి తీసుకోవడమే మర్చిపోతున్నాను అనిపించేది. ‘నా కోసం కాస్తంత టైం మిగుల్చుకోవాలి. నాదైన ప్రపంచంలో గడపాలి’ అనుకునేదాన్ని. పగలంతా పనులు ఎలాగూ ఉంటాయి.. అందుకే రాత్రిళ్లు స్నేహితులతో చాటింగ్లు, కబుర్లు ఎంచుకునేదాన్ని. నా భర్త ఒకట్రెండు సార్లు వారించాడు. చదువుకున్నవాడివి, నా స్పేస్ నాకు ఇవ్వాలని తెలియదా! ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నానో.. ఎందుకు చేస్తున్నానో.. అన్నీ చెప్పి తీరాలా? అని నిలదీశాను. చాలా ఆలస్యంగా నేను తెలుసుకుందేమిటంటే.. నా స్పేస్ నాకు కావాలని ఆయన ఆప్యాయతకు దూరమయ్యానని. మా మధ్య స్పేస్ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఆరు నెలలు ఎడం అయ్యింది. ఏ స్పేస్ కావాలనుకున్నానో ఆ స్పేస్ వల్లే మా వైవాహిక బంధం అభద్రతలో పడిపోయింది. ఓ రోజు నా హృదయం ముక్కలయ్యే పదాలు ఆయన నోటి నుంచి విన్నాను. ‘నాకూ ఏకాంతం చాలా అవసరం.. నీ నుంచి ఆ ఏకాంతం పూర్తిగా కావాలి. ఆర్నెల్లుగా నీ లోకంగా నువ్వు, నా లోకంగా నేను... మన మధ్య మిగిలింది శూన్యం. అందుకే నాదో సలహా! మనం విడాకులు తీసుకుందాం’ అన్నాడు. సమాధానం చెప్పలేకపోయాను. ఈ శూన్యాన్ని ఎలా పూడ్చాలో తెలియడం లేదు. - కల్యాణి, ఉద్యోగిని అస్సలు ఒప్పుకోను మా వారు రోజూ ఉదయం రెండు గంటలు జిమ్లో గడుపుతారు. ఆ తర్వాత ఆఫీస్కెళ్లే తొందర.. ఇంటి పనులు, పిల్లల పనులు పూర్తి అయ్యేసరికి నాకు రాత్రి 10 దాటుతుంది. ఆఫీసు నుంచి వచ్చిన ఈయన భోజనం చేసి ల్యాప్ట్యాప్ ముందేసుకుంటారు. లేదంటే టీవీ చూస్తూ కూర్చుంటారు. అప్పటికే నేను నిద్రలోకి జారుకుంటాను. ఈయనకు ఇంకెంత స్పేస్ కావాలి?! పిల్లల పనులు, ఇంటి పనులు, వంట పనులు, క్లీనింగ్తో రోజంతా అలసిపోయి ఉంటాను. నాతో కాసేపు కబుర్లు చెప్పడానికేమైంది? చాటింగ్లో ఫ్రెండ్స్తో కబుర్లు, టీవీలో ఆ రొద చూడటానికి నాతో మాట్లాడటానికి తేడా ఉండదా? - శేషసాయి, గృహిణి స్పేస్ అవసరం మాకు పెళ్లై రెండేళ్లయ్యింది. మా మధ్య ఎలాంటి రహస్యాలు లేవు. ఏ చిన్న విషయమైనా ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్లా ఉంటాం. ఆయనకు మ్యూజిక్ అంటే ఇష్టం. మ్యూజిక్కి సంబంధించిన సీడీలు, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఒక సెటప్ చేసుకున్నారు. నేను వాటి జోలికి వెళ్లను. ఆ సంగీత ప్రపంచంలోకి నన్ను రమ్మని ఆయనా బలవంతం చేయరు. నాకు పెయింటింగ్స్ ఇష్టం. నేనూ పెయింటింగ్ గొప్పతనం గురించి, నేర్చుకుంటే కలిగే లాభాల గురించి చెప్పను. ఎంత ఆలూమగలైనా ఎవరి ఇష్టాయిష్టాలు వారికుంటాయి. వాటిని డిస్టర్బ్ చేయడం ఇద్దరికీ మంచిది కాదు. నమ్మకం ఉండాలి. ఇద్దరికీ విడి విడిగా కొంత స్పేస్ తప్పక ఉండాలి. - వినీల, చిత్రకారిణి నమ్మకం ముఖ్యం మా పెళ్లై 47 ఏళ్లు దాటింది. మాది వ్యవసాయ కుటుంబం. నా కింత సమయం కావాలి అని ఏనాడూ అనిపించలేదు. నాకు తెలిసిందల్లా పెందరలాడే లేచి పనులు చేసుకోవడం. పొలం నుంచి వచ్చిన మా ఆయనకి వేళకు భోజనం పెట్టడం. మా పిల్లలు ముగ్గురు, తోడికోడళ్ల పిల్లలు ఐదుగురు... ఎప్పుడూ సందడిగా ఉండేది ఇల్లంతా. పొద్దున్న వంట పనులు మొదలుపెడితే ముగించే మధ్యాహ్నం. కాస్త తినగానే, మళ్లీ రాత్రి భోజనాలకు పనులు మొదలయ్యేవి. ఇలా ఆలూమగల మధ్య కొంత ఖాళీ ఉండాలి అనే ఆలోచన మా అప్పుడు లేదు. - కమలమ్మ, గృహిణి ఎంతటివారికైనా వ్యక్తిగత స్పేస్ అవసరమే. అయితే, స్నేహపూర్వకమైన సంభాషణలతో సుదీర్ఘ స్పేస్కి చెల్లుచీటి రాయండి. పెళ్లిపుస్తకంలోని ప్రతిపేజీని అందంగా రాసుకోండి. ఇవి తెలుసుకోండి... 1. హెచ్చరికలు గుర్తించండి నాకు మాత్రమే సొంతం అనే భావన, అస్తమానూ అంటిపెట్టుకొని ఉండటం, ఈర్ష్య.. ఇవి బంధంలో ఉంటే భాగస్వామిని ఊపిరి తీసుకొనివ్వవు. చేసే పనిలోనూ వృద్ధి ఉండదు. ఎప్పుడెప్పుడు ఆ బంధం నుంచి బయటపడదామా! అనిపించే ప్రమాదమూ ఉంది. 2. పరస్పరం ఆధారపడటం సరదాగా గడపాలే కానీ, బంధాలను సరదాగా తీసుకోకూడదు. ముఖ్యంగా వివాహబంధం పరిపూర్ణత సాధించాలంటే తగినంత నిబద్ధత అవసరం. ఎదుటివారిని అర్థం చేసుకుంటూ దానికనుగుణంగా తమ నడవడికలో మార్పులు చేసుకోవాలి. 3. సంభాషణ ఉండాలి రోజులో ఒక్కసారైనా కాఫీ/టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే చాలు, స్నేహపూర్వకమైన ఆ వాతావరణంలో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఒకరి ఇష్టాలు మరొకరికి తెలిసిపోతాయి. స్నేహితుల మధ్య ఉండే బంధం దంపతుల మధ్య ఉంటే స్పేస్ కావాలనే గొడవే ఉండదు. 4. స్పేస్కి అర్థం తెలియాలి... భాగస్వామి అంటే భయం, బరువు, ఇంకా అర్థం చేసుకోలేకపోవడం.. వంటివి ఉంటే తప్పకుండా కొంత స్పేస్ తీసుకోవాలి. అయితే, అది ఎలాంటి స్పేసో కచ్చితంగా తెలుసుండాలి. లీజర్ టైమ్ కావాలా? పని నుంచి కొంత స్పేస్ కావాలా? భావోద్వేగాలను అదుపు చేసుకునేందుకు స్పేస్ కావాలా? ఆర్థికపరమైన స్పేస్ కావాలా? ఏ తరహాకు చెందిన స్పేస్ కావాలో నిర్ధారించుకొని అది భాగస్వామికి చెప్పగలగాలి. 5. వివరణ అవసరం... చాలామంది దంపతులు తమ భాగస్వామి అవసరాలేంటో గుర్తించకపోవడం వల్లే అపార్థాల బాటను ఎంచుకుంటారు. భాగస్వామికి మీ ఆడ-మగ స్నేహితుల గురించి కూడా తెలిసుండాలి. మీరు కోరుకునే స్పేస్ మీ భాగస్వామికి అనుమానాలను రేకెత్తించకూడదు. నిజాయితీతో కూడిన వివరణ ఇద్దరికీ అవసరం. అర్థం చేసుకోవాలి భార్యాభర్తల మధ్యనే కాదు, ప్రతి రిలేషన్లోనూ వ్యక్తిగత స్పేస్ తప్పక ఉండాలి. లేదంటే కిటికీ లేని జైలులా ఉంటుంది. అదీకాదంటే, ఇది మా జీవితం కాదు అనిపిస్తుంది. దీని వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఒంటరిగా ఆలోచించుకోవడానికి, తమ హాబీస్ను పెంపొందించుకోవడానికి స్పేస్ ఎవరికైనా తప్పనిసరి. అలాగని ఆ స్పేస్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. పెరిగిన పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం, పనులను బట్టి ఎవరికి ఎంత స్పేస్ కావాలో వారే నిర్ణయించుకుంటారు. దానిని భాగస్వామి అర్థం చేసుకుంటే స్పేస్ ఓ సమస్య కాదు. - డా.శేఖర్రెడ్డి, సైకియాట్రిస్ట్ బలపరుచుకోవాలి ఇటుకకు ఇటుకకు మధ్య కొంత స్పేస్ ఉంటుంది. సిమెంట్ అనే బంధంతో ఆ స్పేస్ను పూడుస్తాం. భార్యాభర్తల బంధం కూడా అంతే. నమ్మకం, గౌరవం, సాయపడటం, ప్రేమ, ఆప్యాయత.. అన్నీ ఇద్దరమధ్యా సిమెంట్లా ఉంటే ఆ బంధం పదికాలాలు ఆనందంగా ఉంటుంది. - సి. వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్ -
కలహాల కాపురం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షాలైన శివసేన, బీజేపీలు అధికారంలో ఉన్నా పలు అంశాల్లో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయి. గల్లి నుంచి ఢిల్లీ దాకా అనేక అంశాలు వీరి మధ్యదూరాన్ని పెంచుతున్నాయి. 15 ఏళ్ల పొత్తుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో మంగళం పాడాయి. విడిపోయి పోటీ చేసినా... తరువాత కలసి అధికారాన్ని చేపట్టాయి. అయితే శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. చాలా విషయాలపై అసంతృప్తి వ్యక్త చేస్తోంది. ముంబై కార్పొరేషన్లో కూడా వీరి కూటమి కొనసాగుతోంది. అక్కడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజా బడ్జెట్, పార్లమెంట్ సమావేశాల్లోనూ బీజేపీ వ్యతిరేకంగా పలు అంశాలను శివసేన లేవనెత్తుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను ఒప్పుకునేది లేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతామని కుండ బద్ధలు కొట్టారు. ముంబైలో చేపట్టాలనుకుంటున్న మెట్రో-3 ప్రాజెక్టు, పార్లమెంటులో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో మరిన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సేనను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం.... శివసేన వైఖరిపై బీజేపీలో నిరసన వెల్లువెత్తుతున్నా ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ముఖ్యంగా భూ సేకరణ బిల్లు అంశంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడినిట్లు సమాచారం. అధికారికంగా వివరాలు తెలియరానప్పటికీ బిల్లుకు మద్దతు పలకాలని ఉద్ధవ్ను వెంకయ్య కోరినట్టు తెలిసింది. ఈ విషయంపై ఢిల్లీలో కూడా శివసేన ఎంపీలందరూ మంగళవారం సమావేశం నిర్వహించారు. భూ సేకరణ అంశంపై ఎలా వ్యవహరించాలనే విషయంపై చర్చలు జరిపారు. సరైన సమయంలో భూ సేకరణ బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. -
వారంలోనే విభేదాలు...
జమ్మూ: జమ్మూకశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటై వారం రోజులు గడచాయో లేదో అప్పుడే భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే.. రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా జరగటానికి కారణం పాకిస్తాన్, హురియత్ కాన్ఫరెన్స్, ఉగ్రవాద సంస్థల ఘనతేనన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తొలి వివాదానికి తెరతీయడం తెలిసిందే. అది చల్లారిందనుకునే లోగానే.. అతివాద వేర్పాటువాద నేత మస్రత్ ఆలంను.. సయీద్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయటం.. సంకీర్ణ భాగస్వాముల మధ్య తాజాగా చిచ్చు రాజేసింది. ఈ చర్యను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించింది. అయితే.. ఆలం విడుదల నిర్ణయం సంకీర్ణ పక్షాల సీఎంపీకి అనుగుణంగా తీసుకున్నదేనని పీడీపీ సమర్థించుకుంది. 2010లో రాష్ట్రంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలంను రాష్ట్ర ప్రభుత్వం శనివారం జైలు నుంచి విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర బీజేపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదివారం జమ్మూలో సమావేశమై చర్చించారు. ‘సయీద్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. మా పార్టీకి చాలా బాధ కలిగింది. దీనిపై ముందుగా సమాచారం లేదు. సంకీర్ణ భాగస్వామి అయిన బీజేపీని విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇది మా నిర్ణయం కాదు. దీనికి మేం మా అంగీకారం తెలిపేది లేదు. మేం అంగీకరించిన కనీస ఉమ్మడి కార్యాచరణ(సీఎంపీ)కి అనుగుణంగా లేని ఎలాంటి ప్రకటననూ, ఎలాంటి చర్యనూ సహించేది లేదు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరాావృతం కాకుండా ఉండేలా మా అసంతృప్తిని భాగస్వామ్యపక్షానికి తెలియజేయాలని నిర్ణయించాం’ అని బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ జుగల్కిశోర్శర్మ మీడియాతో పేర్కొన్నారు. ‘ఇటువంటి వారిని వదిలిపెట్టి ఉండాల్సింది కాదు. వారు భారత్కు వ్యతిరేకంగా విషం చిమ్ముతారు. వేర్పాటు నినాదాలకే దిగుతారు’ అని అన్నారు. ప్రభుత్వం చేసిన మేలేమీ లేదు: ఆలం ఇదిలావుంటే.. నాలుగున్నరేళ్ల జైలు నిర్బంధం నుంచి తాను విడుదల కావటం న్యాయ ప్రక్రియలో భాగంగానే జరిగిందని.. ఈ విషయంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం తనకు ఒనగూర్చిన మేలు ఏదీ లేదని.. ముస్లిం లీగ్ నేత మస్రత్ ఆలం పీటీఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. తాను గత 20 ఏళ్లుగా జైలుకు వెళ్లి వస్తూ ఉన్నానని.. ఇప్పుడు అందులో కొత్త విషయమేముందని ప్రశ్నించారు. ఆయనను విడుదల చేయటం వేర్పాటువాద నేతలకు ప్రభుత్వానికి మధ్య చర్చలను పునఃప్రారంభించటానికి సంకేతమా? అని ప్రశ్నించగా.. ‘‘మేం (ముస్లిం లీగ్) హురియత్ కాన్ఫరెన్స్ వేదికలో భాగంగా ఉన్నాం. ఆ వేదిక తీసుకునే నిర్ణయాన్ని నేను అనుసరిస్తాను’ అని బదులిచ్చారు. మరోవైపు.. ఆలం విడుదలకు నిరసనగా జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ఆది, సోమవారాలు రెండు రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చింది. సీఎంపీకి అనుగుణంగానే నిర్ణయం: పీడీపీ ఆలంను విడుదల చేయాలన్న నిర్ణయం పీడీపీ-బీజేపీల కనీస ఉమ్మడి కార్యాచరణకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమేనని పీడీపీ సమర్థించుకుంది. కశ్మీర్లో శాంతి స్థాపన కోసం రాష్ట్రంలోని భాగస్వాములందరితోను, నియంత్రణ రేఖకు ఆవల ఉన్నవారితోనూ చర్చలు జరపాలన్న అంశం సీఎంపీలో ఒక కీలక అంశమని పీడీపీ ప్రతినిధి, రాష్ట్ర మంత్రి నయీమ్ అక్తర్ పేర్కొన్నారు. ‘భాగస్వాములలో ఈ నేతలు(ఆలం తదితరులు) కూడా ఉన్నారు. ఎటువంటి బలమైన కారణాలూ లేకుండా వీరిని జైలులో ఉంచి చర్చలు జరపలేం’ అని అన్నారు. ఆలం సహా కొందరు నేతల విషయంలో కోర్టులు జోక్యం చేసుకుని వారిని విడుదల చేశాయని.. ఆ ఉత్తర్వులను తాము అమలు చేశామని చెప్పారు. బీజేపీ వ్యతిరేకతపై ప్రశ్నించగా బహిరంగ చర్చకు వెళ్లడం తమకు ఇష్టం లేదని, వారి అభిప్రాయాలు వారికి ఉంటాయనిన్నారు. 'ఆలం విడుదల'పై నివేదిక కోరిన కేంద్రం న్యూఢిల్లీ: ఆలం విడుదలకు దారితీసిన పరిణామాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం సెలవు రోజైనప్పటికీ.. కేంద్ర హోంశాఖలోని జమ్మూకశ్మీర్ విభాగానికి చెందిన అధికారులు విధులకు హాజరై.. మస్రత్ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. మస్రత్పై రణ్బీర్ పీనల్ కోడ్ (జమ్మూకశ్మీర్ రాష్ట్ర చట్టం) లోని సెక్షన్ 120, సెక్షన్ 121ల కింద (దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటం), చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధం) చట్టం కింద కేసులతో సహా దాదాపు 15 కేసులు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మస్రత్ విడుదల ఉదంతంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉండటంతో.. దీనిపై ప్రభుత్వ వైఖరిని సిద్ధం చేసేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ రంగంలోకి దిగినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్ కూడా జమ్మూకశ్మీర్ డీజీపీ కె.రాజేంద్రతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. -
‘మొక్కజొన్న’ భారం రాష్ట్రానికే
సెంట్రల్పూల్ నుంచి తొలగింపు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జరిగే మొక్కజొన్న క్రయవిక్రయాల నుంచి కేంద్రం పూర్తిగా తప్పుకుంది. నిర్ణీత సమయంలోగా మొక్కజొన్న కొనుగోలు ప్రణాళిక అందివ్వకపోవడం, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల్లో జాప్యం కారణంగా.. ఇప్పటి వరకు కొనుగోలు, అమ్మకం ధరకు మధ్య ఉన్న నష్టాన్ని భరించిన కేంద్రం, ఇకపై రాష్ట్రమే ఆ భారాన్ని భరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ, భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం కొనుగోలు చేసే మొక్కజొన్న సెంట్రల్పూల్ కిందకు రాదని, లాభనష్టాలను రాష్ట్రమే భరించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనల మేరకు ఆర్థిక సంవత్సరంలో జరిపే మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్రం ముందుగానే కేంద్రానికి తన కార్యాచరణ ప్రణాళికను అందిం చి, దానికి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదం లభించిన పక్షంలో కొనుగోలు జరిపే ధరకు, అమ్మకం చేసే ధరకు మధ్య వ్యత్యాసాలు ఉంటే ఆ భారాన్ని రాష్ట్రంపై మోపకుండా కేంద్రమే భరిస్తుంది. ఎఫ్సీఐ విధించే నిర్ణీత సమయంలోగా ఆ విక్రయాలను రాష్ట్ర మార్క్ఫెడ్ పూర్తి చేయాలి. లేని పక్షంలో నష్టాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. 2013-14లో క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.1,300 వరకు చెల్లించి 2.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరిపారు. అయితే గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ నేపథ్యంలో నిల్వలు పేరుకుపోవడంతో లక్ష మెట్రిక్ టన్నులను క్వింటాలుకు రూ.1,050 వరకు ధర తగ్గించి విక్రయించింది. మిగిలిన 1.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలో లక్ష మెట్రిక్ టన్నులను టన్నుకు రూ.10,850మేర కొనుగోలు చేసినా రూ.10వేలకే టన్ను చొప్పున విక్రయించింది. ఈ వ్యత్యాస భారం రూ. 10కోట్ల నుంచి రూ.12కోట్ల మేర కేంద్రమే భరించాల్సి వచ్చింది. ఇక ప్రస్తుత ఏడాదిలో సైతం సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న మార్క్ఫెడ్ ఇప్పటివరకు 2.8 లక్షల టన్నుల మొక్కజొన్నను రూ.1,310 మద్దతు ధరకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత ఏడాది కొనుగోలు ప్రణాళికను కేంద్రానికి సమర్పించకపోవడంతో సెంట్రల్ పూల్ నుంచి మొక్కజొన్నను తొలగించారు. -
ఒకే రోజు రెండుసార్లు జన్మభూమి!
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా హీరా మండలం జగ్గుపురంలో సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య విభేధాల కారణంగా ఒకే రోజు రెండుసార్లు జన్మభూమి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించాల్సి వచ్చింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ల మధ్య అవగాహన కొరవడటంతో అధికారులు తలలు పట్టకున్నారు. సర్పంచ్ అధ్యక్షతన ఒకసారి, ఉపసర్పంచ్ అధ్యక్షతన మరోసారి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. -
రేవంత్ రెడ్డితో విభేదాలు వాస్తవమే: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో గత అర్ధరాత్రి రహస్యంగా సమావేశమయ్యారనే వార్తల్ని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రహస్య భేటి అంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. ఎవరినో చూసి తనను అనుకుని ఆ పత్రిక వార్తా కథనాన్ని వెల్లడించి ఉండవచ్చని దయాకర్ రావు అన్నారు. వాహనం కూడా తనది కాదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీని వీడే ఉద్దేశ్యం లేదని, చివరి శ్వాస వరకు టీడీపీలోనే ఉంటానని ఆయన అన్నారు. టీడీపీని వీడాలనుకునే వారంత ఎన్నికలకు ముందే ఇతర పార్టీలో చేరిపోయారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మెట్రో అంశంపై రేవంత్ రెడ్డికి, తనకు మధ్య విభేదాలు ఉన్నమాట నిజమేనని ఆయన అన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. -
నేను, షోయబ్ విడిపోలేదు: సానియా
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాల వివాహ బంధం ఒడిదుడుకుల్లో ఉందంటూ వచ్చిన వార్తలపై సానియా తొలిసారి పెదవి విప్పింది. తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, షోయ్బ్కు తాను దూరంగా ఉంటున్నానని వచ్చిన మీడియా కథనాలు అవాస్తవమని సానియా స్పష్టం చేసింది. తామిద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని చెప్పింది. షోయబ్ సొంతూరు సియల్కోట్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదీ వెళ్లింది. ఈ సందర్భంగా సానియా తమ వివాహ బంధం గురించి మాట్లాడింది. 'మేమిద్దరం వేర్వేరు దేశాలకు చెందినవాళ్లం. ఇద్దరూ క్రీడాకారులతో కావడంతో మాపై ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమిస్తున్నాం. షోయబ్కు, నాకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవు. నా భర్తతో కలసి విశ్రాంతి తీసుకునేందుకు సియల్కోట్ వచ్చాను' అని సానియా చెప్పింది. సానియా కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటుండంతో షోయబ్తో విడిపోయిందంటూ ఆ మధ్య పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. -
వృద్ధిపై ఆర్థికశాఖతో విభేదాలు లేవు: రాజన్
ముంబై: వృద్ధికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖతో తనకు ఎటువంటి విభేదాలు లేవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం పేర్కొన్నారు. వృద్ధిని పట్టించుకోకుండా, ద్రవ్యోల్బణం కట్టడి చర్యలకే రాజన్ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజన్ ఈ వ్యాఖ్య చేశారు. సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాజన్, తరువాత ఇప్పటివరకూ 3 సార్లు కీలక పాలసీ రేట్లను పెంచారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఐఎంఎండీఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వృద్ధికి ఆర్బీఐ తగిన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడి ద్వారానే వృద్ధి వేగం పుంజుకుంటుందని వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్లే బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీరేట్లు కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. అమెరికా ఫెడ్ ట్యాపరింగ్ ప్రతికూలతను తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ప్రస్తుతం భారత్ ఉందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. కార్యక్రమంలో రాజన్ ప్రసంగప్రతిని మాత్రం విడుదల చేశారు. -
స్పీకర్, సీఎంల మధ్య విభేదాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ మలివిడత సమావేశాలకు సంబంధించి గురువారం సీఎం పేరిట బులెటిన్ విడుదలకాగా, దానితో తనకేం సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పడంతో వారిద్దరి మధ్య పొసగటం లేదని స్పష్టమైంది. విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైనట్టా... కానట్టా... అన్న వివాదం తలెత్తినప్పుడు వీరిద్దరూ ఒకే మాటగా దానికి ఫుల్స్టాప్ పెట్టారు. ఈ నెల 17న బీఏసీ సమావేశంలో చర్చ మొదలైనట్టేనని, దాన్ని వివాదం చేయడం సరికాదని సీఎంతో పాటు స్పీకర్ కూడా అంగీకరించారు. అయితే గురువారం మండలిలో, ఆ తర్వాత విలేకరులతో కిరణ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విభజన బిల్లుపై అసలు చర్చే మొదలుకాలేదని మాట మార్చారు. స్పీకర్ను ఇరకాటంలో నెట్టడానికే సీఎం అలా మాట్లాడారని చర్చ జరిగింది. అలాగే బీఏసీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రతి సభ్యుడు తన అభిప్రాయాన్ని చెప్పాలని భావిస్తున్నందున, రాష్ట్రపతి గడువిచ్చిన జనవరి 23 వరకు సమావేశాలు జరగాలని కోరారు. ఆ మేరకు స్పీకర్ 23 వరకు సమావేశాలను నిర్వహించడానికి నిర్ణయించి వివరాలను సీఎం పేరుతో బులెటిన్ జారీ చేశారు. ఆ బులెటిన్ను గురువారం శాసనసభ వాయిదా పడే సమయానికి ఎమ్మెల్యేలందరికీ పంపిణీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో బులెటిన్ విషయం ప్రస్తావించగా... ఆ విషయం తనకు తెలియదని, దాంతో తనకసలు సంబంధమే లేదని చెప్పారు. జనవరి 23 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో చెప్పిన మాట నుంచి తప్పించుకోవడానికే సీఎం ఈ రకంగా మాటమార్చుతున్నారని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. బీఏసీలో ఖరారైన ఎజెండా శాసనసభ కార్యదర్శి పేరుతోనే బులెటిన్ జారీ అవుతుందని, ముఖ్యమంత్రి పేరుతో విడుదల కావడమేమిటన్న చర్చ జరిగింది. అయితే ఎజెండా ఖరారు చేసేది సభా నాయకుడే అయినందున ఆయన పేరుతో బులెటిన్ జారీ అయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమావేశాలకు ముందు కూడా అసెంబ్లీని ప్రొరోగ్ చేసే అంశంలోనూ స్పీకర్, సీఎంల మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. సభాపతులే స్పష్టత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సభల్లో ఏ విధంగా చర్చించాలనే అంశంపై శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మండలిలో మాట్లాడారు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశం మన సభల్లో ఇప్పటిదాకా చర్చకు రాలేదు. ఈ బిల్లుపై చర్చించేప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇరు ప్రాంతాల వారిని నొప్పించని రీతిలో భాష విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు రావు. ఉద్రేకాలకు లోనవకుండా మాట్లాడాలి. సంప్రదాయాల ప్రకారం చర్చ ఎలా జరగాలో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ప్రధానంగా రెండు అంశాలపై చైర్మన్, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగానికి, చట్టానికి, సంప్రదాయాలకు లోబడి చర్చలు కొనసాగించాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆయా రాష్ట్రాల చట్ట సభల్లో చర్చలకు ఎలాంటి విధానం అనుసరించారో, అక్కడేం జరిగిందో తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2000, బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మన ముందున్నాయి. ఈ రెండు పెద్ద రాష్ట్రాల విభజనకు ఆయా రాష్ట్రాల చట్టసభల్లో ఏం చేశారనే అంశాలను తర్జుమా చేసి కాపీలు మీకు పంపుతున్నాను (ఉత్తరాంచల్ ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ సభలో అసెంబ్లీలో అనుసరించిన విధానంలో ఒక అంశాన్ని ఈ సందర్భంగా కోట్ చేశారు). వీటిని అధ్యయనం చేసి, మరోసారి మండలి సలహా కమిటీలో చర్చించి బిల్లుపై చర్చకు సంబంధించి స్పష్టత ఇవ్వండి. అందుకోసమే మీకు (చైర్మన్కు) ఈ కాపీలు పంపుతున్నాను’’ అని పేర్కొన్నారు. చర్చకు స్పష్టత ఇవ్వాలి: యనమల కిరణ్ ప్రసంగిస్తుండగా, సభను ఎలా జరపాలనే అంశంపై చైర్మన్కు సీఎం అప్పీల్ చేయరాదంటూ విపక్ష నేత యనమల రామకృష్ణుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. చర్చ చాలా సున్నితమైనదేనని, కాబట్టి దానిపై ఎలా వ్యవహరించాలో సీఎం స్పష్టత ఇస్తే బాగుండేదన్నారు. -
జిఓఎం సభ్యుల మధ్య విభేదాలు
రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. కేంద్రానికి నివేదిక సమర్పించే విషయంలో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. రాష్ట్రాన్ని విభజించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. హైదరాబాద్, భద్రాచలం, నదీజలాలు, శాంతిభద్రతలు, విద్య, వైద్యం, సీమాంధ్రుల భద్రత.... ఇలా అనేక కీలక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి తగిన పరిష్కారాలను కనుగొనడాని జిఓఎం తీవ్ర కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ శాంతిభద్రతలపై టాస్క్ఫోర్స్ చీఫ్ నుంచి జిఓఎం సమాచారం తెలుసుకుంటోంది. జిఓఎం సభ్యుల మధ్య సమన్వయం లోపించిన పరిస్థితులలో మరో పక్క రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యంగంలోని 371(డి)ని తొలగించాల్సిందేనని అటార్నీ జనరల్ వాహనవతి స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిల్లుకు ముందు రాజ్యాంగ సవరణ చేయాలని, 371(డి) ఉండగా విభజన చేయడం కుదరదని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చారు. విభజన జరిగితే రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక ప్రతిపత్తి ఉండదని వాహనవతి కేంద్రానికితెలిపారు. ఈ నేపధ్యంలో ఈరోజు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ కేంద్ర హొం శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సిఫార్సులపై కసరత్తు చేశారు. సభ్యుల మధ్య వివిధ అంశాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడమేకాక సమావేశాల విషయంలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. రేపటి జిఓఎం సమావేశం చివరిది కాదని షిండే విలేకరులకు చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. జైరాం రమేష్ అందుకు భిన్నంగా చెప్పారు. రేపటి జిఓఎం సమావేశానికి ఏడుగురు సభ్యులూ హాజరవుతారని, ఇదే తుది సమావేశమని చెప్పారు. కీలకంగా విభజన అంశాలు - అనివార్యంగా రాజ్యాంగ సవరణ - జిఓఎం సభ్యుల భిన్నాభిప్రాయాలు - రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జాతీయ స్థాయిలో చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు - విభజనను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలు.... ఈ పరిస్థితులలో రాష్ట్ర విభజన సమస్య ఓ పట్టాన తేలేట్టుగా కనిపించడంలేదు. -
టీడీపీలో సరికొత్త ముసలం పుట్టింది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :అసలే వర్గ విభేదాలతో సతమతమవుతున్న జిల్లా టీడీపీలో సరికొత్త ముసలం పుట్టింది. సొంత నియోజకవర్గాల్లో గెలుపు గ్యారంటీలేని కీలక నేతలు పక్క స్థానాల్లో కర్చీఫ్ వేస్తుండటంతో సరికొత్త విభేదాలు రాజుకుంటున్నాయి. ఇందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కేంద్ర బిందువు కావడం గమనార్హం. ఒంగోలులో గెలుపు దుర్లభమని తేలడంతో ఆయన కందుకూరు నియోజకవర్గంపై కన్నేశారు. ఇందుకోసం హైదరాబాద్ స్థాయిలో చాప కింద నీరులా పావులు కదిపారు. దామచర్ల వ్యూహంపై ఉప్పందిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం శివాలెత్తిపోయారు. ఆయన సంగతి తేలుస్తానంటూ హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చిందులు తొక్కారు. జిల్లా టీడీపీలో భగ్గుమన్న తాజా వర్గవిభేదాల కథా కమామిషు ఇదీ.. ఒంగోలులో గెలుపు అసాధ్యమని.. అసెంబ్లీలో అడుగుపెట్టాలని తపిస్తున్న దామచర్ల జనార్దన్ వ్యూహం మార్చారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని మరోసారి ఢీకొనేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. 1999 నుంచి అప్రతిహతంగా గెలుస్తున్న బాలినేనిని ఒంగోలులో అడ్డుకోవడం అసాధ్యమని ఆయన నిర్ధారణకు వచ్చేశారు. తనకున్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటని యోచిస్తున్న దామచర్ల కన్ను కందుకూరు నియోజకవర్గంపై పడింది. గుడ్డికంటే మెల్లనయమన్నట్టుగా ఒంగోలు కంటే కందుకూరు కొంత పరవాలేదని ఆయన భావించారు. అలా అయితే తాను గెలుస్తానని కార్యకర్తలను ఎన్నికల వరకైనా కొంతవరకు నమ్మించవచ్చన్నది ఆయన ఉద్దేశం. అదే ఒంగోలులో అయితే ముందే కాడి దించేయాల్సిందేనని ఆయనకు స్పష్టమైంది. కందుకూరుకు మారిపోతే తన సొంతింటి ప్రత్యర్థి కరణం బలరాంతో కూడా సమస్య ఉండదన్నది ఆయన భావన. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తన మాటే చెల్లుబాటవుతుండటంతో ఆయనలో ధీమా మరింత పెరిగింది. అందుకే దామచర్ల కందుకూరు టికెట్టు కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపారు. చంద్రబాబుకు కూడా ఈ విషయాన్ని తెలపగా ఆయన సూత్రప్రాయంగా ఆమోదించినట్టు సమాచారం. దాంతో రెట్టించిన విశ్వాసంతో దామచర్ల కందుకూరు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోసాగారు. ఆ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలతో మంతనాలు జరిపారు. వారిని ఒక్కొక్కరుగా తనవైపు తిప్పుకునేందుకు యత్నించారు. దివి శివరాం కంటే తానే మెరుగైన అభ్యర్థినని ఆయన చెప్పుకోసాగారు. తనకు చంద్రబాబు అండదండలున్నాయని కూడా జనార్దన్ చెబుతుండటం గమనార్హం. తాను కందుకూరు వస్తున్నట్టు అనధికారికంగా ప్రకటించసాగారు కూడా. త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. శివాలెత్తిపోయిన శివరాం కాగా దామచర్ల ఎంత గుట్టుచప్పుడు కాకుండా పని ముగించేద్దామనుకున్నా కుదర్లేదు. కందుకూరులో ఆయన కదలికలపై మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఉప్పందింది. అంతే...! ఆయన ఒంటికాలిపై అంతెత్తున లేచారు. తాను జనార్దన్తో మాట్లాడేదేమిటని భావించిన శివరాం హైదరాబాద్లోనే తేల్చుకోవాలని భావించారు. అందుకే కొన్ని రోజుల క్రితం ఇదే విషయం మీద ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడున్న పార్టీ సీనియర్ నేతలను కందుకూరు టికెట్టు విషయంపై వాకబు చేశారు. దామచర్ల జనార్దన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు వారు శివరాంకు చెప్పారు. దాంతో ఆయన ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘అసలు నా నియోజకవర్గంపై కన్నేయడానికి జనార్దన్ ఎవరు?... ఆయనకున్న అర్హత ఏమిటి?... ఆయన తాత మంత్రిగా ఉన్నప్పుడే నేను ఖాతరు చేయలేదు. నా నియోజకవర్గంలో వేలు పెట్టనివ్వలేదు. ఇక ఈయన ఎంత?... కందుకూరు నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే నా తడాఖా చూపుతా. ఏమనుకుంటున్నారో ఏమిటో?’అని తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. అదే ఊపులో శివరాం పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా నిప్పులు చెరిగారు. ‘మూడుసార్లు ఓడిపోయినప్పటికీ ఇంకా అవే కుళ్లు రాజకీయాలు చేస్తుంటే ఎలా?... ఇప్పటికైనా మాట మీద నిలబడే రాజకీయాలు చేయాలి... లేకపోతే ఇక పార్టీని దేవుడు కూడా రక్షించలేడు’ అని దివి శివరాం కుండబద్దలు కొట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ దామచర్ల తన నియోజకవర్గ వ్యవహారాల్లో కలుగజేసుకుంటే సహించేది లేదని శివరాం తేల్చిపారేశారు. ‘చెప్పాల్సిందంతా చెప్పాను... అయినా మారకపోతే నియోజకవర్గంలోనే బాహాబాహీ తేల్చుకుంటాను’అని ఆయన హెచ్చరిక స్వరంతో స్పష్టం చేసి వెనక్కి వచ్చేసినట్టు సమాచారం. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉన్న విభేదాలతోనే సతమతమవుతుంటే దామచర్ల కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే!